ప్రధాన వార్తలు

ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్ను అడ్డుకోవాల్సింది: హైకోర్టు
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్బూత్ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్ చేయించారని వైఎస్సార్సీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. మొత్తం 15 పోలింగ్బూత్ల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి. ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే.. టీడీపీ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో.. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్ సింగ్ కేసులో కోర్టు రీపోలింగ్కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ స్పందిస్తూ.. ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన. ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్రాజ్ ఫిల్మ్స్నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్పై పడుతుంది. భారత్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్కి, కబీర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్పై వచ్చే ఫ్లాష్బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్

వీధి కుక్కల తీర్పు వివాదం.. అత్యవసర స్టేకి నిరాకరణ
న్యూఢిల్లీ: రాజధాని రీజియన్లోని జనావాసాల నుంచి వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరగా.. అందుకు ధర్మాసనం తిరస్కరించింది.👉జంతు పరిపరక్షణ విభాగాల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. ‘‘వీధి కుక్కలను తరలించడానికి సరిపడా షెల్టర్ హోమ్స్ లేవు. అలాంటప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు? ఎక్కడ ఉంచుతారు?. పోనీ ఒకవేళ ఒకే దగ్గర అన్నేసి కుక్కలను ఉంచితే.. అవి తిండి కోసమో లేదంటే మరేయితర సందర్భాల్లో పరస్పరం దాడి చేసుకుంటాయి. అంతేకాదు.. ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్నా.. గతంలో ఇచ్చిన ఆదేశం అమలు చేయలేనిది. కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయండి అని కోరారు. మరో సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. ఆదేశాలు అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. ఇదెలా ఉందంటే.. గుర్రానికి ముందు బండిని కట్టేసినట్లు ఉంది. అలాగని వీధికుక్కల దాడులు.. కుక్క కాటు ఘటనలు తీవ్రమైనవనే పిటిషనర్లు భావిస్తున్నారు. అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదు’’ అని వాదించారు.👉ఢిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘జంతువులను ఎవరూ ద్వేషించడం లేదు. వీధికుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం స్టెరిలైజేషన్ (సంతానరహిత క్రియ) అనేది రేబిస్ను ఆపదు. కిందటి ఏడాది 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడలేని.. అమ్మాయిలు తిరగలేని పరిస్థితి. దీనిపై వివాదం కాదు.. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారే జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని జనావాసాల నుంచి వేరు చేయడమే ఉద్దేశం’’ అని వాదించారు. 👉అయితే.. సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు జనాల్లోకి చేరకముందే.. కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే.. ‘‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, కానీ వాటిని అమలు చేయదు. Animal Birth Control (ABC) నిబంధనలు అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది’’ కోర్టు వ్యాఖ్యానించింది. ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈరెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో గత ఉత్తర్వులపై అత్యవసర స్టే అవసరమా? అనే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం చెబుతూ.. తీర్పును రిజర్వ్ చేసింది. ఆదేశం ఇలా..వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది. అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ పిటిషన్ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.

‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్మెంట్స్.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు.

దర్శన్కు సిగరెట్లు, మందు అందిస్తే ఊరుకునేది లేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ షాక్ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్ను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. తక్షణమే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని హత్య కేసులో అరెస్టైన దర్శన్.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే.‘‘మేము బెయిల్ మంజూరు, రద్దు ఈ రెండు అంశాలను పరిశీలించాం. హైకోర్టు ఉత్తర్వు యాంత్రికంగా అధికారాన్ని వినియోగించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు’’ అని బెయిల్ రద్దు చేస్తూ తీర్పు సందర్భంగా జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా హర్షం వ్యక్తం చేశారు. ‘‘జే మహదేవన్ వర్ణించలేనంత గొప్ప తీర్పును ప్రకటించారు. నిందితులు ఎంతటి వాళ్లైనా.. చట్టానికి అతీతులేం కాదు అనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది’’ అని జస్టిస్ జేబీ పార్దీవాలా అన్నారు. ప్రస్తుతం దర్శన్ తమిళనాడులో ఉన్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని ట్రయల్ కోర్టుకు అందించి.. ఆపై వారెంట్ ద్వారా దర్శన్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్పు సందర్భంగా ద్శిసభ్య ధర్మాసనం.. ‘‘బెయిల్ మంజూరు చేయడానికి చట్టపరమైన కారణం లేదు. దర్శన్కు బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చ.. న్యాయ వ్యవస్థను దెబ్బతీయే ప్రమాదంలోని నెట్టింది’’ అని అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. గతంలో జైలులో దర్శన్కు ప్రత్యేక వసతులు అందిన విషయాన్ని జస్టిస్ పార్దీవాలా ప్రస్తావించారు. ‘‘జైల్లో నిందితుడికి ఫైవ్స్టార్ హోటల్ ట్రీట్మెంట్ అందిన విషయం మా దృష్టికి వచ్చింది. జైలు ప్రాంగణంలోనే నిందితుడు సిగరెట్లు, మందు తాగిన విషయం మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు’’ అని కర్ణాటక పోలీసు, జైళ్ల శాఖను జస్టిస్ పార్దీవాలా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తించాలి అని పునరుద్ఘాటిస్తూ.. దర్శన్పై ఉన్న ఆరోపణలు, అలాగే ఫోరెన్సిక్ ఆధారాలు.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరాన్ని బలపరిచాయని పేర్కొంది. ఈ విషయంలో మేము మా అసాధారణ అధికారాన్ని వినియోగించేందుకు సంతృప్తిగా ఉన్నాం అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.కేసు నేపథ్యం.. పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్ స్టార్ దర్శన్కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్మెంట్పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజాగా సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కావడంతో దర్శన్ మళ్లీ అరెస్ట్ కానున్నాడు. కేసు టైమ్లైన్2024 జూన్ 8: రేణుకాస్వామి హత్య.. బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతంలోని కాలువ ప్రాంతంలో దొరికిన మృతదేహాం2024 జూన్ 11: నటుడు దర్శన్ అరెస్ట్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.2025 జనవరి 24: దర్శన్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్2025 ఆగస్టు 14: దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు

టీమిండియా మాతో ఆడకపోవడమే మంచింది.. ఆ చావుదెబ్బను ఊహించలేము: పాక్ మాజీ
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల The Game Plan అనే యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భారత్ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ తమతో మ్యాచ్లను ఎలాగైతే బాయ్కాట్ చేసిందో ఆసియా కప్లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు.ఒకవేళ భారత్ ఆసియా కప్లో తమతో మ్యాచ్లు ఆడేందుకు ముందుకు వస్తే మాత్రం వారు కొట్టే చావుదెబ్బను ఊహించలేమని తెలిపాడు. ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.బాసిత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బాసిత్ వ్యాఖ్యలపై పాక్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాడంటూ సోషల్మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాక్ విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్తో జరిగిన చివరి వన్డేలో పాక్ 92 పరుగులకే ఆలౌటై, 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్ విండీస్కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను కోల్పోయింది.ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాక్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టుతో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించాలంటూ కామెంట్లు చేశాడు.కాగా, యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్లు జరిగే ఆస్కారం కూడా ఉంది. దీనికి ముందు పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం సమ్మతించాలి. పాక్తో ఆడే విషయమై భారత క్రీడాభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు క్రికెట్ వేరు, దేశ సమస్య వేరని అంటుంటే.. మరికొందరు మాత్రం నీచ బుద్ది ఉన్న పాక్తో క్రికెటే కాకుండా ఏ ఆట ఆడకూడదని భీష్మించుకూర్చున్నారు.

ఈవీఎం గోల్మాల్ రివీల్.. సుప్రీంకోర్టులో రీకౌంటింగ్.. ఓడిన అభ్యర్థి గెలుపు
ఈవీఎంల పనితీరుపై గత లోక్సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలోనూ తీవ్ర చర్చ నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం చూశాం. ఏపీలో ఎన్డీయే కూటమిది ఈవీఎంల గెలుపేనంటూ చెబుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. చాలా దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం చూశాం. ఈ క్రమంలో.. ఈవీఎంల గుట్టురట్టు అయిన ఘటన ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఓట్ చోరీ వ్యవహారం వార్తల్లోకెక్కిన వేళ.. హర్యానాలోని ఓ కుగ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతోంది. కొన్నేళ్ల క్రితం ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చాయి. కానీ.. ఓడిపోయిన వ్యక్తి వేసిన కేసు.. న్యాయస్థానాల్లో నలిగి చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం అసాధారణ రీతిలో సర్పంచ్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తెప్పించుకుంది. ఓట్ల లెక్కింపు మరోసారి జరిపించింది. ఆశ్చర్యకరంగా.. అప్పుడు ఓడిన వ్యక్తి.. ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలిచాడు! ఈ నాటకీయ పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.జరిగింది ఇదీ..హర్యానాలోని బవునా లఖూ.. ఓ చిన్న గ్రామం. 2022 నవంబరులో ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో కులదీప్ సింగ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, మోహిత్ సింగ్ అనే అభ్యర్థి ఈ ఫలితాలను సవాల్ చేశాడు. ఎన్నికల ట్రైబ్యునల్ బూత్ నెంబరు-69లో రీపోలింగ్ నిర్వహించారు. కానీ.. హర్యానా హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేసింది. దీంతో మోహిత్ కుమార్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. కేసు విచారించిన సుప్రీంకోర్టు గత నెల 31న గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ కాకుండా 65 నుంచి 70వ నెంబరు బూత్లన్నింటిలోని ఓట్లను మళ్లీ లెక్కపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.Vote Theft Claims via EVMs in India: Haryana CaseAllegations of #votechori (vote theft) via Electronic Voting Machines (EVMs) resurfaced after a 2022 sarpanch election in Buana village, Panipat, Haryana. Initially, Kuldeep Singh won with 1,000 votes, but Mohit Kumar’s challenge… pic.twitter.com/tp7m65v7Wk— Adv. Avtaar S Turka / अवतार तुरका 🇮🇳 (@AvtaarTurka) August 14, 2025ఈ రీకౌంటింగ్ కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరో తేదీన ఇరుపక్షాల సమక్షంలో జరిగింది. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. రీకౌంటింగ్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. 2022లో గెలిచిన కుల్దీప్ సింగ్కు 1000 ఓట్లు దక్కితే.. ఓడిన మోహిత్ సింగ్కు 1051 ఓట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈ ఫలితాలను ధ్రువీకరించి నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 11న మోహిత్ కుమార్ను విజేతగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లోగా ఈ ఫలితాన్ని నోటిఫై చేయాల్సిందిగా కూడా స్పష్టం చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చునని, రీకౌంటింగ్ ఫలితాలు మాత్రం మారవని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఈవీఎంల విషయంలో దేశంలో పలు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం పలు అనుమానాలకు తావిచ్చింది ఫలితాలు వెలువడినప్పటి నుంచే వైఎస్సార్సీపీ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలకు బదులు బాలెట్ పేపర్లను ఎన్నికల్లో తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈవీఎంలపై అనుమానాలతో ఒంగోలు ఓట్ల గోల్మాల్ వ్యవహారంపై ఆయన కోర్టును సైతం ఆశ్రయించారు. అంతెకాదు.. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ప్రస్తావించిన అంశం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజుకు మధ్య ఓట్ల శాతంలో తేడాను, భారీ ఓట్ల చోరీని(48 లక్షల ఓట్లు) ఆయన ప్రస్తావించారు. ఓట్ల చోరీపై పోరాటం అంటున్న రాహుల్ గాంధీ.. ఏపీ ఫలితాలపై ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు.

ఉచిత బస్సు ప్రయాణానికీ ఎగనామాలే!
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్స్టాప్లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.

అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం: ఇండిగో
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన వెంటనే చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇండిగో సిద్ధమవుతోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కొవిడ్-19 పరిణామాల కారణంగా 2020 ప్రారంభంలో నిలిపివేసిన చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆంక్షలకు ముందు ఈ సంస్థ న్యూఢిల్లీ నుంచి చెంగ్డూ, కోల్కతా-గ్వాంగ్ జౌ మధ్య రోజువారీ సర్వీసులను నడిపేది.ద్వైపాక్షిక ఒప్పందంపై ఆశలు..ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పునరుద్ధరించడానికి భారత్, చైనాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అధికారిక అనుమతులు ఇంకా ఖరారు కాలేదు. ప్రత్యక్ష సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. కొవిడ్-19కు ముందు తాము చైనాకు విమానాలు నడిపేవారమని, ప్రభుత్వం ఒక ఒప్పందానికి వస్తే వాటిని పునప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్బర్స్ చెప్పారు. 2020 ప్రారంభం నుంచి భారతదేశం-చైనా మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేదు. ఆ ఏడాది చివర్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం భారతదేశం-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.ప్రధాన సమస్యప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భారత విమానయాన సంస్థలపై చైనా విధించిన విమాన ఛార్జీల నిబంధనల అంశం ప్రాధానమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తూ, అధిక ధరల స్వేచ్ఛ కోసం భారత్ ఒత్తిడి తెస్తోంది. చైనాలో తమ గత నిర్వహణ అనుభవాలపై భారత ప్రభుత్వం విమానయాన సంస్థల నుంచి ఫీడ్బ్యాక్ కోరిందని సీనియర్ అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వంఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే భారత విమానయాన మార్కెట్లోకి చైనీస్ చౌక ధరల విమానయాన సంస్థల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇది ద్వైపాక్షిక పర్యాటకం, వ్యాపార ప్రయాణాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.

ఆలయ గోపాలుడు : నమ్మితే.. పెళ్లి.. సంతానం!
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమిపై ఉద్భవించిన పర్వదినం కృష్ణాష్టమి. ఈ శనివారం కృష్ణాష్టమి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న కొన్ని వేణుగోపాల స్వామి ఆలయాల గురించి సంక్షిప్తంగా... ముందుగా హైదరాబాద్ పరిసరాలలోని ఆలయాల గురించి... శ్యాం మందిరం – కాచిగూడ, హైదరాబాద్హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్కి సమీపంలో గల శ్రీ కృష్ణమందిరానికే శ్యాం మందిర్ అని పేరు. ఈ మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నిత్యం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.గోవర్ధనగిరి – కేపీహెచ్బీ కాలనీ, హైదరాబాద్హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో మలేసియాన్ టౌన్షిప్కి వ్యతిరేక దిశలో కొలువైన వేణుగో΄ాల స్వామి దేవాలయం ఒక గుట్ట పైన వెలసినది. గుట్టపైన స్వామి వారి విగ్రహం దొరకగా అక్కడే గుడి కట్టించారు. ఈ ప్రదేశాన్ని గోవర్ధనగిరి అని పిలుస్తారు.. ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. పండుగలప్పుడు, కృష్ణాష్టమికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుట్ట పైన వెలసి ఉండడం వలన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది.శ్రీ కృష్ణ దేవాలయం – బహుదూర్ పురా150 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. నెహ్రు జంతు ప్రదర్శన శాలకు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని కిషన్ బాగ్ దేవాలయం అని కూడా అంటారు. నిజాం దగ్గర వకీల్గా పని చేసిన రాజా రాం బహుదూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు, రథ యాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో వెలసిన వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి సంతానం కోసం స్వామిని సేవించుకుంటారు. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం – ఏదులాబాద్సికింద్రాబాద్కి సుమారు 30 కి.మీ. దూరంలో ఘటకేసర్ మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఏదులాబాద్ గ్రామంలో వెలసిన క్షేత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో శక్తిమంతమైన ప్రాచీన క్షేత్రం. అందమైన రాజ గోపురం, ఆ గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు, చక్కని శిల్పకళా సంపదతో ఎంతో రమణీయంగా ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజాకార్యక్రమాలు జరుగుతాయి.శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం – రామడుగుకరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సుమారు 1200 వందల సంవత్సరాల పూర్వమే శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి 8 మంది భార్యలు మనకు దర్శనమిస్తారు. ఈ స్వామికి కూడా కల్యాణ వేణుగోపాలుడనీ, సంతాన వేణుగోపాలుడనీ పేరు. సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, కామారెడ్డి జిల్లాఈ దేవాలయంలో వెలసిన వేణుగోపాలస్వామి సంతాన వేణు గోపాల స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఎవరైతే ఈ క్షేత్రంలో స్వామి వారిని మనసా వాచా నమ్మి పూజిస్తారో వాళ్ళకి ఆ స్వామివారు మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి. ఈ ఆలయంలో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామికి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలగి పోతుందనీ, శత్రునాశనం జరుగుతందనీ నమ్మకం!జగన్నాథ స్వామి దేవాలయం– చెన్నూర్చెన్నూర్లో పూజలందుకుంటున్న అతి పురాతన జగన్నాథ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ప్రవహించే గోదావరిని ఉత్తరవాహిని అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం. ఇది. గోదావరి నది పుట్టిన చోట నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ్ర΄ాంతంలో ఉంటుంది.ఆంధ్రప్రదేశ్లో... మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయంకృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహాత్మ్యమూ సామాన్యమైనది కాదు! వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి పక్కన రుక్మిణీ సత్యభామలు దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా ఇప్పటికీపాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు.ఆలయ ప్రాంణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది. మువ్వ పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు. మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుందని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. విజయవాడ నుంచి మొవ్వ కేవలం 50 కిలోమీటర్లే!హంసల దీవి శ్రీ వేణుగోపాల స్వామి వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కృష్ణా జిల్లాలోని హంసలదీవిలో ఉంది. అద్భుతమైన శిల్పకళ, చక్కటి కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయం సముద్రపు అటుపోటులను తట్టుకునేలా ప్రాకారాన్ని నిర్మించారు. తూర్పు ముఖాన అద్భుతమైన రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై చెక్కిన రామాయణ ఘట్టాలు తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ఆలయం చుట్టూ ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఈశాన్యంలో పురాతన కళ్యాణమండపం కన్పిస్తుంది. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘఛాయ లో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.మార్గం: కృష్ణాజిల్లా కోడూరు నుంచి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోనూ బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.కుంతీ మాధవస్వామి ఆలయం, పిఠాపురంఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యా΄ాతకం నుంచి విముక్తి కోసం ఐదు ్ర΄ాంతాల్లో విష్ణ్వాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం. ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి.మార్గం : పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్లన్నీ పిఠాపురంలో ఆగుతాయి. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.వేణుగోపాల స్వామి దేవాలయం – మెళియాపుట్టిశ్రీకాకుళం జిల్లాలో వెలసిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం మెళియాపుట్టి గ్రామంలో కొలువై ఉంది. టెక్కలికి 24 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో గల ఆలయాన్ని గజపతిమహారాజు 1810 లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయ నిర్మాణం, ఆలయంలో కొలువైన వేణుగో΄ాల స్వామి ఎంతో సుందరంగా దర్శనమిస్తారు. డోల పౌర్ణమి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో అని కూడా పిలిచేవారట.. అక్కడ ఉన్న నిర్మాణ శైలి, గోడల పైన ఉన్న శిల్పాలు అలా ఉంటాయట.శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం నరసపూర్నరసపూర్లో కొలువైన రాజగోపాలస్వామి దేవాలయం 18 వ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది. గోదావరి నదిలో విగ్రహం లభించగా దానిని తీసుకొని వచ్చి ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయంలో కొలువైన కృష్ణుడిని కల్యాణ కృష్ణుడిగా పిలుస్తారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ రాజగోపాల స్వామిగా కొలువైనారు. ఈ దేవాలయంలో స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే పెళ్లిళ్లు త్వరగా అవుతాయని నమ్మకం. స్వామి అనుగ్రహంతో పెళ్లి కుదిరిన వారు దేవాలయ ఆవరణలోనే పెళ్లి చేసుకుంటారు. సమ్మోహన వేణుగోపాల స్వామి దేవాలయ–జూనం చుండూరు, గుంటూరుగుంటూరు జిల్లా జూనంచుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణమైనట్లు కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్ ప్రణవ స్వరూపంలో ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామి దర్శనమిస్తారు. దేశంలో మరెక్కడా ఇటువంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండదంటారు. ఆది ప్రణవ స్వరూపంలో చుట్టూ దశావతారాలు, సప్త్తరుషులు, వేణుగోపాలునికి ఇరుపక్కల రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు.ఈ స్వామిని సేవిస్తే కల్యాణం అవుతుందని, సంతాన, సౌభాగ్య సంపదలకు లోటుండదనీ ప్రతీతి.– డి.వి.ఆర్.భాస్కర్
భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?
ఏ ధర్మం ఎలా చెప్పినా..అందరమూ వెళ్లిపోవాల్సిన వాళ్లమే!
జపాన్లో టీమిండియా కెప్టెన్.. ఆకస్మిక పర్యటనపై అనుమానాలు..?
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
ఉచిత బస్సు ప్రయాణానికీ ఎగనామాలే!
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’
ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన హీరోయిన్
వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ ఇవిగో!
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
చందనా.. డబ్బులిస్తావా.. కోరిక తీరుస్తావా!
అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సింహాచల దర్శనం చేసుకున్న నటి లయ (ఫొటోలు)
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?
ఏ ధర్మం ఎలా చెప్పినా..అందరమూ వెళ్లిపోవాల్సిన వాళ్లమే!
జపాన్లో టీమిండియా కెప్టెన్.. ఆకస్మిక పర్యటనపై అనుమానాలు..?
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
ఉచిత బస్సు ప్రయాణానికీ ఎగనామాలే!
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’
ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన హీరోయిన్
వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ ఇవిగో!
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
చందనా.. డబ్బులిస్తావా.. కోరిక తీరుస్తావా!
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓట్ల చోరీ-విపక్షాల నిరసనలు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
సినిమా

‘వార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించింది. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్లోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్,హృతిక్లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్ & మైనస్ పాయింట్స్ ఏంటి తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో వార్ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్, హృతిక్ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.వార్2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా హై- ఓల్టేజ్లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వార్2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX)లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితీరు మెప్పించలేదంటున్నారు.ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.#War2 An okayish action entertainer. Not great, Not bad either - Strictly MID.Note : #NTR Fans should keep their expectations in check .there are moments where you whistle, but there are moments that will frustrate you , but the ending sort of pulls it back and you will walk…— Thyview (@Thyview) August 14, 2025 I’m just left speechless, what a movie #War2 never a dull moment, full action packed until the end. @iHrithik couldn’t take my eyes off you. #HrithikRoshan #JrNTR enjoyed seeing him in his role.Must watch movie in theatre.Blockbuster loading 💥💥💥💥 pic.twitter.com/rcBRFdCMYS— K k k Kiran (@kkkKiran0) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review: I don't want to spoil but giving too many details but it does distinguish itself from the other Spy Universe films (in a good way!). I liked #War, but #War2 has heart, and it has some enjoyable emotional moments, with good performances from the cast!— ✨️ (@daalchaawal_) August 14, 2025Coolie nakodakallara 😂Coolie demgindi antaga 😂😂😂😂@tarak9999 Hunt begins now all over world 🔥 long run chustaru 💥💥💥💥N T R pure massssss potential 🔥 #War2Review #War2 #War2Celebrations pic.twitter.com/9FFq2Sk2PS— palnadu🐯🔥 (@MpalnaduTiger) August 14, 2025Very below Average First Half disappointed Logic less physics They took Audience as granted there is no High moments in the Action Thriller Movie 😪 No Engaging sequence till now Need a very big jump for second half #War2#War2Review #War2Telugu #War2Disaster pic.twitter.com/hyNwxuDjzF— Don Ak (@Indiamyheart123) August 14, 2025#War2Review : Above average#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over content!the storyline might vary, but same theme makes it feel pretty ordinary and routine.Average VFXBGM could be betterRating: 2.5/5#HrithikRoshan #JrNTR #AyanMukerji https://t.co/DkwnqCnjkW— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252nd half: good back story, but story falls flat & predictable. Lacks emotional connect. Both actors nailed their respective performances. @tarak9999 acting & looks will shut every hater🔥 Result & BO depends on Coolie now. #War2Review #War2 #YRFSpyUniverse pic.twitter.com/FZvCbFiY0X— Alpsreviews (@alpsreviews) August 14, 2025#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…— Venky Reviews (@venkyreviews) August 14, 2025#War2 Prabhas Body - NTR face totally worthy VFX for N fans 🤣You pointed out #HHVM from FDFS… now take it back 😁We’re about to give you exactly what you deserve 🔥#DisasterWar2 #JanaNayagan #War2Review— Don Ak (@Indiamyheart123) August 14, 2025First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025#War2 intervalJust one word Blockbuster 💥 💥 Its an out and out entertainer You won’t want to even blink For a secondLord Ayan has really cooked 😍😍😍#HrithikRoshan as kabir is unmatchable #JrNTR introduction in Spy Universe is really good #KiaraAdvani is awesome too…— Rohit 😇 (@goonerfromind) August 14, 2025#War2: Disappointing and IllogicalThere is no proper justification for any character in the film, including the lead actors. Their mission and methods follow an abnormal flow. Both the emotion and the conflict between Hrithik and NTR fail to work.— TrackTollywood (@TrackTwood) August 14, 2025

ఆర్ట్ మాఫియా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
‘‘నిర్మాత టీజీ విశ్వప్రసాద్గారు ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ‘ఆర్ట్ మాఫియా’ అంటూ ఆర్ట్ డైరెక్టర్ల గురించి మాట్లాడటం బాధాకరం. ఆ వ్యాఖ్యల్ని ఆయన ఉపసంహరించుకోవాలి’’ అని ‘తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు రమణ వంక, ప్రధాన కార్యదర్శి కేఎం రాజీవ్ నాయర్, కోశాధికారి ఎం. తిరుమల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించడంలో కళా దర్శకులు చాలా కీలకం. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపంలో చూపించే మేథా సంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం. అంతటి విలువైన, ప్రాముఖ్యత కలిగిన మా విభాగంపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్గారు ‘ఆర్ట్ మాఫియా’ అంటూ చేసిన వ్యాఖ్యలను మేము(కళా దర్శకత్వ, ఆర్ట్ డైరెక్టర్స్) ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో ఆయన పలు సినిమాలు నిర్మిస్తూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించారు, కల్పిస్తున్నారు.. ఇందుకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. సెట్స్లోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. నిర్మాతల అనుమతితోనే మార్పులు చేస్తాం. అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు తగ్గుతాయి. ఈ విషయంపై ఏ నిర్మాతకైనా అవగాహన, ఆలోచన ఉంటుంది. మీడియాలో మా గురించి తప్పుగా మాట్లాడే ఆ నిర్మాత తన సినిమా విషయంలో జరిగిన అంశాన్ని ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. అలాగే పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్–ఆర్ట్ డైరెక్టర్పై ‘తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ద్వారా వివరణ తీసుకోవచ్చు. ఇలాంటివి చేయకుండా మాపై నిందలు వేయడం సరికాదు’’ అని తెలిపారు.

చేయి లేని సూపర్ హీరో?
వెండితెరపై సూపర్ హీరో చేసే విన్యాసాలు పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతాయి. ఇక ఆమిర్ ఖాన్లాంటి హీరో సూపర్ హీరోగా కనిపిస్తే... ఆ చిత్రానికి ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమిర్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సూపర్ హీరోగా చూపించనున్న సంగతి తెలిసిందే. నిజానికి సూర్య హీరోగా ‘ఇరుంబు కై మాయావి’ (ఇనుప చేయి మాయగాడు) టైటిల్తో చేయాల్సిన కథని ఇప్పుడు ఆమిర్తో తీయనున్నారు లోకేశ్. అయితే నాలుగైదేళ్ల క్రితం లోకేశ్ ఈ కథ రాసుకున్నారు. ఆ తర్వాత తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఈ స్క్రిప్ట్లోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. అలానే వేరే చిత్రాల్లోనూ ఈ కథలోని కొన్ని సన్నివేశాలు పోలినవి ఉన్నాయట. సో... ఈ స్క్రిప్ట్ని రీ వర్క్ చేస్తున్నారట లోకేశ్. ముందు అనుకున్నట్లుగానే సూపర్ హీరో మూవీలానే తెరకెక్కిస్తారు. అయితే ముందు అనుకున్న కథలో హీరోకి ఒక చేయి ఉండదు. దాంతో ఇనప చేయి పెట్టించుకుంటాడు. ఆ మెటల్ హ్యాండ్తో ఈ సూపర్ హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవట. ముందు అనుకున్న కథ ఇది. మరి... ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి... ఈ కథలో సూపర్ హీరో ఆమిర్ ఖాన్కి చేయి ఉంటుందా? లేకపోతే ఇరుంబు కై (ఇనుప చేయి)తో ఈ హీరో ఎలాంటి విన్యాసాలు చేయనున్నారనేది చూడాలి. ఈ కథ మీద వర్క్ చేస్తూనే మరోవైపు కార్తీ హీరోగా ‘ఖైదీ’ సీక్వెల్ని తెరకెక్కిస్తారు లోకేశ్. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మీరు నా మొదటి గురువు
‘‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు’’ అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా(ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె. ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవాన్ దాదా’(1986). రాకేశ్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించారు. ‘భగవాన్ దాదా’ గా రజనీకాంత్ నటించగా, ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమా కూడా నేడు విడుదలవుతోంది. ‘కూలీ, వార్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ‘‘రజనీకాంత్ సార్.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు. నాకెప్పుడూ మీరు ఆదర్శం. యాభై ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు’’ అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు.
క్రీడలు

నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్.. కావ్యా మారన్ జట్టు సంచలన విజయం
పురుషుల హండ్రెడ్ లీగ్లో కావ్యా మారన్ జట్టు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ సంచలన విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (ఆగస్ట్ 13) సథరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో చివరి బంతికి గెలుపొందింది. గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో గ్రహం క్లార్క్ నమ్మశక్యం కాని రీతిలో సిక్సర్ బాది సూపర్ ఛార్జర్స్ను గెలిపించాడు. తైమాల్ మిల్స్ వేసిన స్లో డెలివరీని క్లార్క్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. GRAHAM CLARK, THE FINISHER IN THE HUNDRED 🥶SUPERCHARGES NEED 5 FROM THE FINAL BALL & GRAHAM CLARK SMASHED A SIX...!!!! pic.twitter.com/BcEEs7sT4q— Johns. (@CricCrazyJohns) August 14, 2025ఈ సిక్సర్తో ప్రత్యర్థి హోం గ్రౌండ్ ఒక్కసారిగా మూగబోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఓటమితో సథరన్ బ్రేవ్ వరుసగా విజయాలకు బ్రేక్ పడింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. లారీ ఇవాన్స్ (53), జేమ్స్ కోల్స్ (49 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో జేకబ్ డఫీ 3, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ ఛార్జర్స్.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ గెలుపు కష్టమన్నట్లు సాగింది. అయితే గ్రహం క్లార్క్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కీలక తరుణంలో 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 38 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మిచెల్ సాంట్నర్ (24) సహకరించాడు. అంతకుముందు జాక్ క్రాలే (29), హ్యారీ బ్రూక్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేసి సూపర్ ఛార్జర్స్ను మ్యాచ్లో ఉంచారు. బ్రేవ్ బౌలర్లలో ఓవర్టన్ 3, జోఫ్రా ఆర్చర్, తైమాల్ మిల్స్ తలో 2 వికెట్లు తీశారు.

సిరీస్ డిసైడర్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో, నిర్ణయాత్మక మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కంకషన్ (తలకు బలమైన దెబ్బ) కారణంగా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తదుపరి సిరీస్ మొత్తానికి (ఓ టీ20, మూడు వన్డేలు) దూరమయ్యాడు.రెండో టీ20 సందర్భంగా ఓవెన్కు గాయమైంది. బౌలర్ సంధించిన బంతి అతడి హెల్మెట్ గ్రిల్పై బలంగా తాకింది. వెంటనే జరిపిన కంకషన్ పరీక్షల్లో గాయం తాలుకా లక్షణాలు కనిపించనప్పటికీ.. నెమ్మదిగా దాని ప్రభావం బయటపడింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు ఓవెన్ తీవ్ర అసౌకర్యానికి లోనయ్యాడు. డాక్టర్లను సంప్రదించగా.. మ్యాచ్ సందర్భంగా తగిలిన గాయం ఎఫెక్ట్ అని తేల్చారు. 12 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఈ మధ్యలో ఆసీస్ సౌతాఫ్రికాతో చివరి టీ20, ఆతర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేస్తుంది. వాస్తవానికి ఈ సిరీస్తో ఓవెన్ వన్డే అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ గాయం ఓవెన్ వన్డే ఎంట్రీని పోస్ట్ పోన్ చేసింది.23 ఏళ్ల ఓవెన్ పొట్టి క్రికెట్లో నయా సంచలనంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బిగ్బాష్ లీగ్ ఫైనల్లో విధ్వంసకర శతకం బాది వార్తల్లోకెక్కిన ఓవెన్.. ఆతర్వాత ఐపీఎల్, జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఓవెన్ అందులో విఫలమయ్యాడు.ఓవెన్ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఘనంగా జరిగింది. విండీస్తో మ్యాచ్లో అతను 27 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మీడియం పేస్ బౌలర్ కూడా అయిన ఓవెన్ ఆ మ్యాచ్లో ఓ వికెట్ కూడా తీశాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.కాగా, సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తుంది. ఓవెన్తో పాటు మరో ఇద్దరు కూడా ఈ సిరీస్కు దూరమయ్యారు. టీ20, వన్డే జట్లకు ఎంపికైన మ్యాట్ షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక జట్టు నుంచి వైదొలిగాడు. వన్డే జట్టులో ఉన్న లాన్స్ మోరిస్ వెన్ను సమస్య కారణంగా జట్టుకు దూరమయ్యాడు. షార్ట్, మోరిస్ స్థానాల్లో ఆరోన్ హార్డీ, మాథ్యూ కుహ్నేమన్ వన్డే జట్టులోకి వచ్చారు. వీరిద్దరు ఇదివరకే టీ20 జట్టులో ఉన్నారు. మరోవైపు జ్వరం కారణంగా రెండో టీ20కి దూరమైన వికెట్కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ మూడో టీ20కి సిద్దమయ్యాడు. మూడో టీ20 ఆగస్ట్ 16న జరుగనుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఆసీస్, రెండో మ్యాచ్ సౌతాఫ్రికా గెలిచాయి. టీ20 సిరీస్ తర్వాత ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.

సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తుంది. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్కు (25) ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్తో నిశ్చితార్థం జరిగిందని సమాచారం. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితుల సమక్షంలో గోప్యంగా జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సోషల్మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.Arjun Tendulkar is engaged to Saniya Chandok. 💍 pic.twitter.com/WgztsjyYx3— Vipin Tiwari (@Vipintiwari952) August 13, 2025అర్జున్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడుయేషన్ పూర్తి చేసి ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన Mr. Paws Pet Spa & Store LLPకు డైరెక్టర్గా వ్యవహరిస్తుంది. ఆమె తాత రవి ఘాయ్ హోటల్ మరియు ఫుడ్ బిజినెస్లో ఉన్నారు. ఘాయ్ కుటుంబం InterContinental హోటల్ మరియు Brooklyn Creamery వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది. సానియా చందోక్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. ఆమె పబ్లిక్లో ఎక్కువగా కనిపించదు.అర్జున్ విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్-అంజలి దంపతులకు కలిగిన రెండో సంతానం ఈ అర్జున్. అర్జున్ 1999, సెప్టెంబర్ 24న జన్మించాడు. అతనికి ముందు సారా టెండూల్కర్ జన్మించింది. ఆమె 1997, అక్టోబర్ 12న పుట్టింది.అర్జున్ తండ్రి అడుగుజాడల్లో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్, ఎడమ చేతి మిడిలార్డర్ బ్యాటర్ అయిన అర్జున్.. 2018లో శ్రీలంకపై అండర్-19 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.- 2020/21లో ముంబై తరఫున T20 మ్యాచ్తో (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) సీనియర్ లెవెల్లో దేశవాలీ కెరీర్ను ప్రారంభించాడు.- 2022/23లో ముంబై నుంచి గోవా జట్టుకు (దేశవాలీ) మారాడు.- ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17 మ్యాచ్లు ఆడిన అర్జున్ 532 పరుగులు చేసి, 37 వికెట్లు తీశాడు.- అర్జున్ 2021 ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు.- దేశవాలీ క్రికెట్లో అర్జున్ గోవాకు మారిన తర్వాత తొలి రంజీ మ్యాచ్లోనే రాజస్థాన్పై సెంచరీ చేశాడు.

13వ సారి ప్రపంచ రికార్డు
బుడాపెస్ట్: ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడం అలవాటుగా మార్చుకున్న స్వీడన్ విఖ్యాత పోల్వాల్టర్ మోండో డుప్లాంటిస్ మరోసారి అదరగొట్టాడు. ఇస్తవాన్ గ్యులాయ్ స్మారక అథ్లెటిక్స్ మీట్లో 25 ఏళ్ల డుప్లాంటిస్ 13వసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అయిన డుప్లాంటిస్ రెండో ప్రయత్నంలో 6.29 మీటర్ల ఎత్తుకు ఎగిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో గత జూన్లో 6.28 మీటర్లతో స్టాక్హోమ్ డైమండ్ లీగ్ మీట్ సందర్భంగా నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ఐదేళ్ల క్రితం పోలాండ్లో జరిగిన మీట్లో డుప్లాంటిస్ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి తొలిసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 6.16 మీటర్లతో రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ తిరగరాశాడు. అప్పటి నుంచి డుప్లాంటిస్ వెనుదిరిగి చూడలేదు. 2020లో రెండోసారి... 2022లో మూడుసార్లు... 2023లో రెండుసార్లు... 2024లో మూడుసార్లు... 2025లో మూడుసార్లు అతను ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2020 టోక్యో ఒలింపిక్స్... 2024 పారిస్ ఒలింపిక్స్...2022 ప్రపంచ చాంపియన్షిప్, 2023 ప్రపంచ చాంపియన్షిప్లలో స్వర్ణ పతకాలు నెగ్గిన డుప్లాంటిస్ గత నాలుగేళ్లుగా డైమండ్ లీగ్లో విజేతగా నిలుస్తున్నాడు. 2022, 2024, 2025లలో జరిగిన ప్రపంచ ఇండోర్ చాంపియన్షిప్ పోటీల్లోనూ ఈ స్వీడన్ స్టార్ బంగారు పతకాలు గెలిచాడు. పురుషుల, మహిళల పోల్వాల్ట్ విభాగాల్లో అత్యధికసార్లు ప్రపంచ రికార్డులు సృష్టించిన ఘనత సెర్గీ బుబ్కా (ఉక్రెయిన్), ఎలీనా ఇసిన్బయేవా (రష్యా)ల పేరిట ఉంది. వీరిద్దరూ 17 సార్లు చొప్పున ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇదే జోరు కొనసాగిస్తే డుప్లాంటిస్ ఏడాదిలోపు వీరిద్దరిని అధిగమించే అవకాశాలున్నాయి.
బిజినెస్

వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.అమలు: 2025 సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు.స్వచ్ఛత గ్రేడ్లు: వెండి ఆభరణాల కోసం బీఐఎస్ 900, 800, 835, 925, 970, 990 అనే ఆరు స్వచ్ఛత గ్రేడ్లను పేర్కొంది.హాల్మార్కింగ్ ప్రక్రియ: హాల్మార్కింగ్ ప్రక్రియలో వెండి ఆభరణాలకు ఆరు అంకెల HUID అందించడం జరుగుతుంది. ఈ నెంబర్ దాని ప్రామాణికత, స్వచ్ఛతను సూచిస్తుంది.ఉపయోగం: వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ 'వెరిఫై HUID' ఫీచర్ను ఉపయోగించి.. హాల్మార్క్ చేసిన ఆభరణాల ప్రామాణికతను ధృవీకరించవచ్చు. హాల్మార్కింగ్ వల్ల నకిలీ లేదా కల్తీ వెండి ఉత్పత్తులను కనిపెట్టవచ్చు. తద్వారా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్మార్కింగ్ అంటే.. బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,641కు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 ప్లాయింట్లు పుంజుకుని 80,611 వద్ద ట్రేడవుతోంది.> రేపు ఆగస్టు 15 రోజున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు పని చేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

యూపీఐలోని ఫీచర్ నిలిపివేత?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంబంధిత మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పుల్ ట్రాన్సాక్షన్స్ అని పిలువబడే పర్సన్-టు-పర్సన్ (పీ 2 పీ) డిజిటల్ చెల్లింపులను నిలిపివేయాలని చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ విషయం తెలిసిన వారిని ఉటంకిస్తూ కొన్ని సంస్థలు వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎన్పీసీఐ ఇప్పటికే బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు తెలియజేసినట్లు అందులో తెలిపాయి. యూపీఐ యాక్టివిటీలో పీ2పీ పుల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే ఉన్నాయని, తద్వారా ఎన్పీసీఐ ఈ ఫీచర్ను ఉపసంహరించుకోవడం సులభమవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.యూపీఐ పుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్ అంటే ఏమిటి?యూపీఐ పుల్ లావాదేవీని కలెక్ట్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా షాపుకు వెళ్లి సాధారణంగా క్యూఆర్ స్కాన్ చేసి మనీ పంపాలనుకునేవారు ఎంత మొత్తం చెల్లించాలో ఎంటర్ చేసి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో డబ్బు తీసుకునేవారే ఎంత కావాలో ఓటీపీ, బార్కోడ్, మెసేజ్ లింక్ రూపంలో రెక్వెస్ట్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి డబ్బు పంపాలనుకునేవారు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వెంటనే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గ్రహీతలు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించలేక ఎదుటివారు డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పైగా యూపీఐ మొత్తం లావాదేవీల్లో ఇది 3 శాతం మాత్రమే. ఎన్పీసీఐ దీని నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?ఇదిలాఉండగా, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

స్కోడా ఆటో నుంచి లిమిటెడ్ ఎడిషన్ కార్లు
అంతర్జాతీయంగా 130 ఏళ్లు, భారత్లో పాతికేళ్ల వార్షికోత్సవ వేడుక సందర్భంగా స్కోడా ఆటో తన ప్రముఖ మోడళ్లు కైలాక్, స్లావియా, కుషాక్లకు లిమిటెడ్ ఎడిషన్ కార్లు విడుదల చేసింది. ఈ పరిమిత ఎడిషన్లను ఇప్పటికే ఉన్న హై–స్పెసిఫికేషన్ల ఆధారంగా తీర్చిదిద్దారు. అంటే కుషాక్, స్లావియా కోసం మోంటే కార్లో ట్రిమ్లపై, కైలాక్ కోసం ప్రెస్టీజ్, సిగ్నేచర్ ప్లస్ ట్రిమ్లపై ఆధారపడి రూపుదిద్దుకున్నాయి.ఎడిషన్ వేరియంట్లు ప్రత్యేకంగా 25వ వార్షికోత్సవ బ్యాడ్జ్తో, మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా తయారయ్యాయి. ఉచితంగా ఇచ్చే యాక్సెసరీస్ కిట్లో 360–డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్స్, అండర్ బాడీ లైటింగ్, ప్రత్యేక బాడీ గార్నిష్లు ఉంటాయి. ఈ కిట్ వేరియంట్లకు ప్రీమియం లుక్తో పాటు, మరింత ఫంక్షనల్ అప్గ్రేడ్ను అందిస్తుంది. ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?‘మా సుదీర్ఘ ప్రయాణంలో భాగమైన అభిమానులకు ఇది మేము ఇస్తున్న కానుక. కస్టమర్ల ప్రాధాన్యతలకు పెద్ద పీట వేస్తూ ఉత్పత్తులు అందించే మా బలమైన అంకితభావానికి నిదర్శనం. ఇకపైనా అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నాము’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశిష్ గుప్తా తెలిపారు.
ఫ్యామిలీ

300 ఏళ్ల జిమ్ సభ్యత్వం ఓనర్ జంప్ : కోటి రూపాయలు గోవిందా!
ఫీజు రాయితీ వస్తుందని వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్, టూ ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కామన్. కానీ ఒక వ్యక్తి 300 ఏళ్ల సభ్యత్వం అంటూ కోటి రూపాయలు చెల్లించాడు. ఆనక లబోదిబో మన్నాడు. కమీషన్లకు కక్కుర్తి పడి ఏకంగా 300 ఏళ్లకు సభ్యత్వాన్ని తీసుకోవడం వింతగా నిలిచింది. విషయం ఏమిటంటే..తూర్పు చైనాలోని ఒక వ్యక్తి జిమ్ కోసం 300 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యేలా సభ్యత్వం తీసుకున్నాడు. ఈ కోచింగ్ సెషన్ల కోసం 870,000 యువాన్లు (సుమారు రూ. 1 కోటి) వెచ్చించాడు. వన్ ఫైన్ మార్నింగ్ జిమ్ తెరిచి ఉంది ఓనర్ మాత్రం పరార్. అయితే రిసెప్షనిస్టులు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారని జెజియాంగ్ టీవీ నివేదించింది. దీంతో జిమ్ యజమాని తన డబ్బుతో అదృశ్యమయ్యాడని గ్రహించిన జిన్ పోలీసులను ఆశ్రయించాడు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం హాంగ్జౌలోని బింజియాంగ్ జిల్లాలోని రాంయన్ జిమ్లో మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వెళ్లేవాడు. దీంతో మే నెలలో, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు: 8,888 యువాన్లకు (సుమారు రూ. 1 లక్ష) ఒక సంవత్సరం సభ్యత్వాన్ని కొనుగోలు చేసి, దానిని దాదాపు రెట్టింపు ధరకు కొత్త కస్టమర్లకు తిరిగి అమ్ముకోవాలని డీల్ సెట్ చేశాడు. ఒక వేళ రెండు నెలల్లోపు కార్డులు అమ్మకపోతే మార్కప్లో 90 శాతం వాటా, పూర్తి వాపసు ఇస్తానని జిన్కు హామీ కూడా ఇచ్చాడు.ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?మొదట్లో ఒకటీ రెండు డీల్స్కు బాగానే వర్కౌట్ అయింది. ఈ కమిషన్ ఆశతో మే 10-జూలై 9 మధ్య మొత్తం 300 ఏళ్లకు చెల్లుబాటు అయ్యేలా కోటి రూపాయల విలువ చేసే కాంట్రాక్ట్స్పై సంతకాలు చేశాడు. ఒప్పందం ప్రకారం జూలై 15 నాటికి కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయానికి ఏవేవో కుంటి సాకులు చెప్పడం మొదలు పెట్టారు. అలా జూలై చివరి నాటికి జిమ్ ఓనరే అదృశ్యమయ్యాడు. జిమ్ నిర్వహణ, అమ్మకాల బృందం అదృశ్యం కావడంతో జిన్కు జ్ఞానోదయమైంది. క్షణాల్లో డబ్బు వస్తుందని నమ్మి మోసపోయాను అంటూ స్థానిక మీడియాతో వాపోయాడు జిన్. జిన్ తన నష్టాన్ని భర్తీ చేసుకోవడంతోపాటు, ఇతరులను హెచ్చరించే ఉద్దేశంతో కోర్టులు, మీడియాను ఆశ్రయించాడు. ఈ కేసు చైనా ఫిట్నెస్ పరిశ్రమలో దూకుడు, వినియోగదారుల రక్షణ లేకపోవడంపై బహిరంగ చర్చకు దారితీసింది.చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్

ప్రాణదాతలకు సలాం!
ఒడిశా, హిరమండలం: జిల్లాలో అవయవదానంపై చైతన్యం పెరుగుతోంది. కుటుంబసభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతోమందికి పునర్జన్మనిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. కొంతమంది ప్రమాదాలబారిన పడినప్పుడు బ్రెయిన్ డెడ్కు గురవుతున్నారు. అటువంటి వారి అవయవాలను కుటుంబసభ్యుల సమ్మతితో దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్చు. ఒక మనిషి అవయవదానంతో 8 మంది ప్రాణాలను నిలపవచ్చు. కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, కవటాలు, పేగులు, క్లోమం, కారి్నయా వంటివి సేకరించి మరొకరికి అమర్చవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, ఎముకలోని మూలుగు, కాలేయంలోని కొంతభాగం దానం చేయవచ్చు. బ్రెయిన్ డెడ్ అయితే.. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది తీవ్రగాయాలపాలవుతుంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు మెదడు దెబ్బతిని బ్రెయన్ డెడ్ అవుతుంటుంది. తిరిగి కోలు కోలేని స్థితికి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పనిచేస్తుంటాయి. వీటన్నింటినీ నడిపించే కీలకమైన అవయవం మెదడు మాత్రం పనిచేయదు. దానినే బ్రెయిన్ డెడ్ అంటారు. పక్షవాతం వంటి మెదడు సమస్య తలెత్తినప్పుడు కూడా బ్రెయిన్డెడ్ కావొచ్చు. నిర్థారణ కీలకం.. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యారని నిర్దారించేందుకు కట్టుదిట్టమైన విధానాలు ఉన్నాయి. ఆస్పత్రి వైద్యులు మాత్రమే దీనిని నిర్ధారించరు. ఇతర ఆస్పత్రుల వైద్యులు, జీవన్దాన్ సంస్థ తరఫున వచ్చే నిపుణులు వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడకు 6 గంటల తరువాత మరో బృందం పరిశీలించి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారిస్తారు. శ్వాసతీసుకునే పరిస్థితి ఉండకపోవడం, ఒకవేళ కృత్రిమ శ్వాస తీసిన 5 నిమిషాల్లో చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కనుపాపల్లో వెలుతురు పడినా స్పందించకపోయేవారిని, కాళ్లు, చేతులు, తల ఎంతమాత్రం కదపలేకపోయేవారిని, మెదడుకు ఏమాత్రం రక్తప్రసరణ జరగడం లేదని నిర్ధారించుకున్న తరువాత బ్రెయిన్ డెడ్ అని తేల్చుతారు. ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్కు తీసుకురాగా బ్రెయిన్డెడ్గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్కు చెందిన పినిమింటి శ్రీరామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను తరలించారు. పునర్జన్మ అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్ హూస్సేన్,వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ ఇదీ చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్కఠిన నిబంధనలు.. బాధితుల నుంచి అవయవాలను సేకరించే వైద్యులు తప్పకుండా జీవన్దాన్లో నమోదై ఉండాలి. తమ పేర్లు తప్పకుండా రిజి్రస్టేషన్లు చేయాలి. మన జిల్లాకు సంబంధించి జెమ్స్ ఆస్పత్రి వైద్యులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే చనిపోయిన వారికి, అవయవాలు అవసరమైన వారికి ఈ వైద్యులు బంధువులు కాకూడదు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యుల అంగీకారం కీలకం. ఎవరికైనా అవయవాలు అవసరమైతే జీవన్దాన్లో నమోదుచేసుకోవాలి. అవయవదాత ఉన్నారని సమాచారం అందితే ప్రాధాన్యతాక్రమంలో, ముందు వరుసన బట్టి అవయవాలను తెచ్చి అమర్చుతారు. గుండెను బయటకు తీశాక 4 గంటల్లో అమర్చితే ఫలితాలు 90 శాతం మెరుగ్గా ఉంటాయి. ఆరు గంటలు లోపు అయితే 50 శాతం ఫలితమే ఉంటుంది. 6 గంటలు దాటితే అమర్చినా ఫలితం ఉండదు. ఊపిరితిత్తులు 8 గంటల్లోపు, కాలేయం 18 గంటల్లోపు, కిడ్నీ 24 గంటల్లోపు అమర్చాలి.

ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనాలంటే..!
దేశంలో ఎటు చూసినా.. పంద్రాగస్టు సంబరాల కోలహలమే. చారిత్రక ప్రదేశాల్లో ఈ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులతో సందడిగా ఉంది. ఎందరో అమర వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. ఆ సమరయోధుల అందర్నీ స్మరిస్తూ..సగర్వంగా ఈ వేడుకుని జరుపుకోనుంది భారతదేశం. ఈ వేడుక ఢిల్లీ ఎర్రకోటలో మరింత ప్రత్యేకం. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైభవానికి అర్థంపట్టేలా విభిన్న శకటాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయుధ దళాల సాహస విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలు ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ కట్టిపడేసేలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదీగాక ఈ వేడుకల్లో దేశ విదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొంటారు. వారందరి సమక్షంలో ఈ వేడుకలను తిలకిస్తే కలిగే ఆ అనుభవం వేరెలెవెల్ . పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరువేసిన తదనంతరం ఇచ్చే స్పీచ్ని ప్రత్యక్షంగా చూడాలని చాలామంది కోరుకుంటారు. ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మోదీ స్పీచ్ని వీక్షించాలనుకుంటే జస్ట్ ఇలా చేయండి చాలు..ఎర్రకోట వద్ద జరిగే స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. టిక్కెట్ల అమ్మకాలు ఆగస్టు 13, 2025 నుండి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్లలో ప్రారంభమవుతాయి. అదెలాగంటే..ఆన్లైన్ ప్రక్రియ..అధికారిక వెబ్సైట్ aamantran.mod.gov.in లేదా e-invitations.mod.gov.in. సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవం 2025 టికెట్ బుకింగ్ లింక్పై క్లిక్ చేయాలి. వివరాలను ఇలా పూరించాలి..పేరు, మొబైల్ నంబర్, టిక్కెట్ల సంఖ్య పూర్తి చేయాలివెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో IDని డౌన్లోడ్ చేసుకోండి.టికెట్ కేటగిరీని ఎంచుకోవాలి: రూ. 20 (జనరల్ కేటగిరీ), రూ. 100 (మధ్యతరగతి), రూ. 500 (ప్రీమియం కేటగిరీ)ఆ తర్వాత ఆన్లైన్లో చెల్లింపు చేసి QR కోడ్ సీటింగ్ వివరాలతో ఇ-టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఫోన్లో డిజిటల్ కాపీ లేదా ప్రింటవుట్ కాపీని ఉంచండి — అది గేట్ వద్ద అవసరం.ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడం ఎలాప్రస్తుతం అంతా ఆన్లైన్ సేవలే వినియోగిస్తున్నప్పటికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 10, 12 తేదీల్లో ఎంపిక చేసిన ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. దీన్ని సాధారణంగా ప్రభుత్వ భవనాలు, వార్తాపత్రికలు, అధికారికి వెబ్సైట్లో ప్రకటిస్తుందిఆఫ్లైన్ బుకింగ్ కోసం..చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి (ఆధార్, ఓటరు ఐడి, పాస్పోర్ట్) తీసుకెళ్లాలి.టికెట్ ధరను (రూ. 20, రూ. 100, లేదా రూ. 500) నగదుగా లేదా డిజిటల్ చెల్లింపుల్లో చెల్లించండి.టిక్కెట్ను తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి. ఆఫ్లైన్ టికెట్లు పరిమిత సంఖ్యలో దొరకుతాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.ఏవిధంగా చేరుకోవాలంటే..ఎర్రకోట చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అత్యంత అనుకూలమైన మార్గం. అందుకోసం లాల్ ఖిలా లేదా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్రో సేవలు ఉదయం: 4.00 గంటలకు ప్రారంభమవుతాయి. కార్యక్రమం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 6:30–7:00 గంటల మధ్య చేరుకునేలా ట్రావెల్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రవేశానికి ముందు చాలా కఠినతరమైన భద్రత ఉంటుందనేది గుర్తు ఎరగాలి. చివరగా ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఎర్రకోట నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం త్వరితగతిన టికెట్లు బుక్ చేసుకుని టైమ్కి చేరుకునేలా చక్కగా ట్రావెల్ని ప్లాన్ చేసుకోవాలనేది గ్రహించండి.(చదవండి: Goa Tourism 2025 Rules: గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...)

ఏనుగులను పరిరక్షిద్దాం : సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్
World Elephant Day 2025 ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ పూరీ సాగర తీరంలో సైకత శిల్పం తీర్చి దిద్దాడు. ఈ సందర్భంగా గజరాజుల సంరక్షణ కోసం ఏనుగుల ఆవాస అటవీ ప్రాంతాలను పరిరక్షించడం బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. – భువనేశ్వర్/పూరీ ప్రతీ ఆగస్టు 12న, ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్షణం ఏనుగులు గురించి ఆలోచించే రోజు.. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. అత్యంత అసాధారణ జంతువులలో ఒకదైన గజరాజును రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చే ప్రపంచవ్యాప్త పిలుపు.ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?ఈ రోజు 2012లో ప్రారంభమైంది. కెనడియన్ చిత్రనిర్మాత ప్యాట్రిసియా సిమ్స్, థాయిలాండ్కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్తో కలిసి, విలియం షాట్నర్ కథనం ప్రకారం రిటర్న్ టు ది ఫారెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలైన తర్వాత దీనిని మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand)
ఫొటోలు
అంతర్జాతీయం

పార్క్ చేసిన విమానాన్ని ఢీకొన్న మరో విమానం
కాలిస్పెల్: అమెరికాలోని మోంటానా విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండ్ అవుతున్న ఒక చిన్న విమానం ఆగి ఉన్న మరో విమానంపైకి దూసుకెళ్లింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం నేలపై ప్రయాణికులు లేని ఒక ఖాళీ విమానాన్ని ఢీకొన్నదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆ ప్రాంతం అంతటినీ పొగ కమ్ముకుంది.మోంటానా విమానాశ్రయం 30 వేల జనాభా కలిగిన కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో ఆ విమానం నుంచి పైలట్తో పాటు ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని, విమానాశ్రయంలోనే వారికి చికిత్స అందించారని అధికారులు తెలిపారు. 🚨🇺🇸 BREAKING: MID-AIR DISASTER ON THE GROUND IN MONTANA2 planes collided at Kalispell Airport, erupting into a massive fireball.Details on casualties are still unknown, but rescue crews are flooding the scene in a major emergency response.Source: @nicksortor pic.twitter.com/wf7CH0gslR— Mario Nawfal (@MarioNawfal) August 11, 2025

నా ప్రజలను, నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నా..
గాజా: గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు వారిలో అనాస్ జమాల్ అల్–షరీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిలో మరణించడానికి ముందు అనాస్ రాసిన మెసేజ్ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందేశం ప్రజల హృదయాలను కదలిస్తోంది. అది చదివితే గుండె బరువెక్కడం ఖాయం. అన్సార్ సందేశం ఏమిటంటే... వారిని అల్లా క్షమించడు ‘‘ఇది నా వీలునామా. నా చివరి సందేశం. నా మాటలు మీకు చేరాయంటే దాని అర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయడంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయ, ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండడానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగినదంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్లు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా. నా జీవిత కాలాన్ని అల్లా పొడిగిస్తాడని ఆశపడుతున్నా. దానివల్ల నా స్వస్థలం ఆక్రమిత అస్కెలాన్(అల్–మజ్దాల్)కు చేరుకొని, కుటుంబంతో, ప్రియమైనవారితో గడపగలను. కానీ, అల్లా ఆదేశమే ఫైనల్. దానికి తిరుగులేదు. ఇన్నాళ్లూ ఎన్నో బాధలు అనుభవించా. కష్టాలు నష్టాలు నాకు కొత్త కాదు. ఎంతో కోల్పోయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మా చావులకు కళ్లారా చూస్తున్నవారిని, మా మారణాలను ఆమోదిస్తున్నవారిని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయినవారిని, గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణహోమాన్ని ఆడ్డుకోనివారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవడం లేదు. నా బిడ్డ నా కంటి వెలుగు పాలస్తీనా అంటే మాకెంతో ప్రేమ. ముస్లిం ప్రపంచం అనే కిరీటలో విలువైన రత్నం పాలస్తీనా. ప్రపంచంలో ప్రతి స్వేచ్ఛా జీవి గుండె చప్పుడు పాలస్తీనా. మా ప్రజలను మీకు అప్పగిస్తున్నా. కలలు కనడానికి సమయం లేని, స్వేచ్ఛగా, శాంతితో జీవించే అవకాశం లేని మా అమాయక చిన్నారులను అప్పగిస్తున్నా. మా ప్రజల దేహాలు వేలాది టన్నుల బరువు కింద ఛిద్రమైపోయాయి. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు వారి శరీరాలను ముక్కలు చేశాయి. ఆ ముక్కలన్నీ వెదజల్లినట్లుగా దూరంగా పడిపోయాయి. నిర్బంధాలు, హెచ్చరికలు మిమ్మల్ని ఆపకూడదు. సరిహద్దులు మీకు అడ్డంకి కాకూడదు. మీరంతా గొంతు విప్పండి. మా కోసం మాట్లాడండి. మా భూమి విముక్తికి, మా ప్రజలకు మధ్య వారధిగా మారండి. ఆక్రమణకు గురైన మా భూభాగంపై గౌరవం, స్వేచ్ఛ పరిఢవిల్లేదాకా గొంతు విప్పుతూనే ఉండండి. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మీకు అప్పగిస్తున్నా. నా ముద్దుల కూతురు షామ్ జాగ్రత్త. ఆమె నా కంటి వెలుగు. ఆమె ఎదుగుదలను కళ్లారా చూసే అదృష్టం నాకు దక్కలేదు. అది కలగానే మిగిలిపోయింది. నా కుమారుడు సలాహ్ను కూడా అప్పగిస్తున్నా. నా భారాన్ని మోసే, ఆశయాన్ని నెరవేర్చే బలవంతుడిగా మారేదాకా అతడికి అండగా ఉండాలనుకున్నా. ఇక నా తల్లి బాధ్యత కూడా మీదే. ఆమె ఆశీస్సులు, ప్రార్థనలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. ఆమె ఇచి్చన వెలుగే నాకు దారిగా మారింది. నా తల్లికి బలాన్ని ఇవ్వాలని అల్లాను ప్రారి్థస్తున్నా. అల్లా ఆమెను కరుణించాలి. నా జీవన సహచారి ఉమ్ సలాహ్ బాధ్యతను సైతం మీ చేతుల్లో పెడుతున్నా. ఈ యుద్ధం నన్ను నా భార్య నుంచి దూరం చేసింది. అయినప్పటికీ మా బంధానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమె తన బలం, విశ్వాసంతో నా బాధ్యతలను స్వీకరించి, భుజాన వేసుకొని మోసింది. అల్లా తర్వాత మీరే రక్షణ నా కుటుంబానికి అల్లా తర్వాత మీరే రక్షణగా నిలవాలి. ఒకవేళ నేను మరణిస్తే, నా ఆశయాలకు కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకుంటే.. అల్లా ముందుకు వెళ్లి, మీ ఆదేశాలు శిరసావహించానని చెబుతా. శాశ్వతంగా అల్లా సన్నిధికి చేరడం సంతోషకరమే కదా. అమర వీరుల్లో ఒకడిగా నన్ను చేర్చుకో అని అల్లాను వేడుకుంటున్నా. నా పాపాలన్నింటినీ క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రజలకు, నా కుటుంబానికి కలి్పంచే స్వేచ్ఛా మార్గాన్ని మెరిపించడానికి నా రక్తాన్ని ఒక కాంతిగా మార్చాలని ప్రారి్థస్తున్నా. మీ ప్రార్ధనల్లో గాజాను మర్చిపోవద్దు... నన్నూ మర్చిపోవద్దు.’’ – అనాస్ జమాల్ అల్–షరీఫ్

ఫెడరల్ నియంత్రణలోకి వాషింగ్టన్ డీసీ
వాషింగ్టన్: దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ హింసాత్మక గ్యాంగ్లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకుతోడుగా 800 మంది నేషనల్ గార్డ్స్ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు. అవసరమైతే మరింతమంది నేషనల్ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలమయంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వారంలోనే ఫెడరల్ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. నిరాశ్రయులు నగరం విడిచి వెళ్లిపోవాలి ‘నివాసం లేని వారు వెంటనే నగరం వదిలి వెళ్లిపోవాలి. వారి కోసం నగరానికి దూరంగా స్థలాలిచ్చాం. నేరగాళ్లూ, మీరు మాత్రం ఎక్కడికీ వెళ్లొద్దు, మీరుండాల్సింది జైలులోనే. మేమే మిమ్మల్ని అందులో ఉంచుతాం’అని ట్రంప్ అంతకుముందు సొంత ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఫెడరల్ పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

తక్షణ బహిష్కరణ.. ఆపై విచారణ!
లండన్: అక్రమ వలసదారులకు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గట్టి హెచ్చరికలు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తక్షణమే బహిష్కరించి, ఆ తర్వాతే ఆన్లైన్లో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ‘డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్’స్కీంలో ఉన్న దేశాల సంఖ్య 8 నుంచి భారత్ సహా 23కు పెంచిన నేపథ్యంలో స్టార్మర్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ‘మా దేశంలోకి మీరు అక్రమంగా వచ్చినట్లయితే నేరానికి పాల్పడినట్లే. ఇందుకుగాను డిటెన్షన్ను, బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వేగంగా మిమ్మల్ని వెనక్కి పంపివేస్తాం’అని సోమవారం ఎక్స్లో స్టార్మర్ పేర్కొన్నారు. ‘ఎంతో కాలంగా విదేశీ నేరగాళ్లు మా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. వారి అప్పీల్స్ వాయిదా పడుతుండటంతో యూకేలో నెలలు, సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుంటున్నారు. దీనికి ముగింపు పలుకుతాం’అని ఆయన పేర్కొన్నారు. తాజాగా పెంచిన జాబితాలోని 23 దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తక్షణమే దేశం నుంచి వెనక్కి పంపించివేస్తారు. వారి అప్పీళ్లపై వీడియో లింక్ ద్వారా విచారణ చేపడతారు. విదేశీ నేరగాళ్లను తొలగించడం, డిటెన్షన్ సెంటర్లపై ఒత్తిడి తగ్గించడం, ప్రజా ధనాన్ని ఆదా చేయడమే తమ లక్ష్యమని యూకే ప్రభుత్వం అంటోంది. 2023లో మొదటగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు అందులోని జాబితాలో ఆల్బేనియా, కొసావో, నైజీరియా, ఎస్టోనియా దేశాలే ఉన్నాయి. విస్తరించిన జాబితాలో భారత్తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, మలేసియా, కెన్యా, ఉగాండా తదితర దేశాలను చేర్చారు. దీనిపై ఆయా దేశాలతో యూకే అధికారులు చర్చలు ప్రారంభించారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైతం ఇప్పటికే విదేశీయులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తుండటం తెల్సిందే.భారతీయులు సహా వందలాది మంది అరెస్ట్దేశవ్యాప్తంగా అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు సహా వందలాదిమందిని యూకే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా బైక్లపై డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జూలై 20–27 తేదీల మధ్యన చేపట్టిన తనిఖీల్లో 1,780 అక్రమంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు, 280 మంది అనుమతులు లేకుండా పనులు చేసే వలసదారులు పట్టుబడ్డారని వెల్లడించారు. హిల్లింగ్డన్లో ఏడుగురు భారతీయులు దొరికారని, వీరిలో ఐదుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు.
జాతీయం

నటి శిల్పా శెట్టి దంపతులకు బిగ్ షాక్.. కేసు నమోదు
ఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాక్ తగిలింది. వారిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015-2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ.. ఆ నిధులను శెట్టి వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.ఫిర్యాదులో భాగంగా.. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పరిచయం అయినట్టు కొఠారీ తెలిపారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.#BREAKING | Legal Trouble For Actress #ShilpaShetty- Shilpa Shetty, Raj Kundra booked.- Businessman claims Rs 60 cr fraud; F.I.R filed.- Businessman alleges cheating in deal, claims Rs 60 cr misused for personal expenses. pic.twitter.com/wTgDZtfu2v— TIMES NOW (@TimesNow) August 14, 2025వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది సెప్టెంబర్లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత, 2017లో మరో ఒప్పందంలో విఫలమవడంతో బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తనకు తెలిసిందని కొఠారీ వాపోయారు. ఇక, కొఠారీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం జరిగిన మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, ఈ కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై మానవ మృగాల అకృత్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మరో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో 24 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదన్నారు. ఆ నలుగురు నిందితులు బాధితురాలిని వాష్రూమ్లోనికి లాకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఆరోపించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.తన స్నేహితుడు తనను సివిల్ లైన్స్లోని మరో స్నేహితుని ఇంటికి పార్టీకి ఆహ్వానించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమె తన స్నేహితురాలు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులను కలుసుకుంది. వారంతా మద్యం సేవించి, అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత నలుగురు యువకులు ఆమెను వాష్రూమ్కు తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. అలాగే దీనిని వీడియో తీశారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ యువకులు ఆమెను.. ఆమె ఇంటి బయట దింపి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఒక మహిళా అధికారి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్ కలిగిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఒక ఆరోపణలతో వార్తల్లో టాప్లో నిలవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల ఫాలోవర్స్ కలిగిన సందీపా విర్క్ రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.ఇన్స్టాగ్రామ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన సందీప విర్క్ ఎఫ్డీఏ ఆమోదించిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటారు. అలాగే హైబూకేర్.కామ్ అనే వ్యాపార సంబంధిత వెబ్సైట్ను నడుపుతున్నారు. మరోవైపు ఆమెకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విర్క్ తన బయోలో తాను వ్యాపారవేత్త, నటి అని చెప్పుకున్నారు.తాజాగా విర్క్ను రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం, 420 (మోసం) కింద మొహాలీలోని ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం, బుధవారం ఢిల్లీ, ముంబైలోని పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విర్క్ మోసపూరిత మార్గాల ద్వారా లెక్కకుమించిన స్థిరాస్తులను సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆమె సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి ఉనికిలో లేవని తెలుస్తోంది. ఆమె వెబ్సైట్లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవనే ఆరోపణలున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేతురామన్తో విర్క్కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)నుండి సుమారు రూ. 18 కోట్ల విలువైన నిధులను సేతురామన్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయన తనకు విర్క్తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా విర్క్ను పీఎంఎల్ఏ నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.

ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తున్నారు
పాట్నా: ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ప్రయోగాలు పనిచేయడం లేదని తేలాక బీజేపీ ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టడానికే ఈసీ ఈ ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం ఇలాగే ద్రోహం చేయాలని నిర్ణయించుకుంటే తాము ఎన్నికలను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని మరోమారు స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఈసీ నిస్సంకోచంగా ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థులను బెదిరించడానికి సీబీఐ, ఈడీ, ఆదాయపు ప్ను శాఖ వంటి ఏజెన్సీలన్నింటిని ప్రయోగించిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన ఈసీని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఈ ఆటలో భాగంగా ఈసీ చాలామంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తోంది. గతేడాది నేను విజయ్ కుమార్ సిన్హా కేసును బయటపెట్టాను. ఈ రోజు ముజఫర్పూర్ మేయర్ నిర్మలా దేవీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు’ అని తేజస్వి అన్నారు. ఇంత వివాదం నడస్తున్నా ఈసీ ఎప్పుడూ మీడియా ముందుకు రాకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, బీహార్ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడరు, చివరకు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా వారినే అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందని తేజస్వి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందన్నారు. ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లాలో ప్రారంభమయ్యే ఓటర్ల హక్కు యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిఖూభాయ్ దల్సానియా బీహార్లో ఓటరుగా నమోదు చేసుకోవడంపై తేజస్వి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఐ

నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్లో నిందితుడి అకౌంట్పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
క్రైమ్

నూడుల్స్లో నూనె తక్కువ వేశారని..
వికారాబాద్: నూడుల్స్లో నూనె తక్కువగా వేశారంటూ హోటల్ నిర్వాహకులపై దాడికి పాల్పడిన ఘటన నాగారంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలు నీరటి భారతమ్మ, అంజి స్థానికంగా హోటల్ నడుపుతున్నారు. యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన పది మంది యువకులు బుధవారం సాయంత్రం ఫుల్గా మద్యం తాగి కారులో హోటల్ వద్దకు వచ్చారు. తినేందుకు నూడుల్స్ ఆర్డర్ చేశారు. ఈక్రమంలో నూనె తక్కువగా వేశారంటూ గొడవపడి భార్యాభర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన అమర్నాథ్రెడ్డితో పాటు మరో ఇద్దరిపైనా దాడికి దిగారు. ఈ విషయమై గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఎస్ఐ రాఘవేందర్, సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు తప్పించుకున్నారు. క్షతగాత్రులను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోరిక తీర్చకపోతే నీ భర్తను, పిల్లలను చంపేస్తా..!
హైదరాబాద్: ‘తన కోరిక తీర్చకపోతే, తనతో రాకపోతే, తన ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే నీ భర్తతో పాటు పిల్లలను చంపేస్తా’ అంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లోని బండారు బాల్రెడ్డినగర్ బస్తీలో నివసించే వివాహిత (35) హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఇదే బస్తీలో నివసించే సి.రవికుమార్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే పరిచయాన్ని అడ్డదారుల్లోకి నెట్టాడు. ఆమె పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు బయటకు రావాలంటూ బెదిరించేవాడు. తన కోరిక తీర్చాలంటూ హెచ్చరించేవాడు. దీంతో ఆమె రవికుమార్ చేస్తున్న ఫోన్లకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇటీవల ఆమెను వెంబడించసాగాడు. దీంతో ఆమె పని కూడా మానేసింది. అంతటితో ఊరుకోని నిందితుడు ఆమె భర్తకు కూడా ఫోన్ చేయసాగాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. బుధవారం మళ్లీ ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు రవికుమార్పై బీఎన్ఎస్ సెక్షన్ 75 (2), 78, 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్తో చేజ్ చేసి, ఎత్తుకెళ్లి..
బలరాంపూర్: ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 21 ఏళ్ల దివ్యాంగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు నివాసముండే ప్రాంతంలోని రహదారిపై ఆమెను వెంబడించి.. కిడ్నాప్ చేసి మరీ దురాగతానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడు, నాలుగు బైక్లపై ఆమెను వెంబడిస్తుండటం, యువతి రోడ్డుపై పరుగెత్తుతుండటం ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తన ఇంటినుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తన మామ ఇంటికి వెళ్లిన యువతి.. తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. దారిలో బైక్ ఆపిన వ్యక్తి ఆమెను వెంబడించారు. తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే యువతి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించారు. చివరకు ఒక పోలీసు పోస్టు సమీపంలో పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. స్పృహలోకి వచి్చన యువతి.. బైక్పై వచి్చన వ్యక్తులు అత్యాచారం చేశారని వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను అరెస్టు చేశారు.

సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్కు కొత్తగా మళ్లీ బెయిల్కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది.