వాహనం ఢీకొని యువకుడి మృతి | 1 died due to road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని యువకుడి మృతి

Published Thu, Oct 1 2015 9:10 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

1 died due to road accident

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నయువకుడిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిచెందిన యువకుడు రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన శివ(18)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement