లక్ష్యం మేరకు ఉపాధి కల్పనలో విఫలమయ్యారంటూ అనంతపురం జిల్లా తలుపుల మండలంలో 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు.
అనంతపురం: లక్ష్యం మేరకు ఉపాధి కల్పనలో విఫలమయ్యారంటూ అనంతపురం జిల్లా తలుపుల మండలంలో 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ నాగభూషణం బుధవారం సాయంత్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని 75 శాతం మంది కూలీలకు పని కల్పించాల్సి ఉండగా విఫలమయ్యారని, అందుకే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.