గ్రామంలో 50 ఇళ్లకు విద్యుత్ షాక్ | 50 houses in the village of electric shock | Sakshi

గ్రామంలో 50 ఇళ్లకు విద్యుత్ షాక్

Mar 27 2015 1:38 AM | Updated on Sep 5 2018 2:26 PM

హై ఓల్టేజీ కారణంగా గ్రామంలోని సుమారు 50 ఇళ్లకు విద్యుత్ షాక్ వచ్చింది.

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి

జిన్నారం: హై ఓల్టేజీ కారణంగా గ్రామంలోని సుమారు 50 ఇళ్లకు విద్యుత్ షాక్ వచ్చింది. ఈ సమయంలో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుత్‌ఘాతానికి గుైరె  ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం ఊట్లలో చోటు చేసుకుంది. గ్రామంలో బుధవారం రాత్రి  ట్రాన్స్‌ఫార్మర్‌కు సరఫరా అయ్యే న్యూట్రల్ వైర్ తెగి హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయ్యింది. 

దీంతో ఇళ్లలోని ఫ్యాన్లు, బల్బులు పెద్ద శబ్దంతో పగిలిపోయాయి. ఈ సమయంలో గ్రామానికి చెందిన చాకలి రాజు (32) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement