గిద్దలూరు (ప్రకాశం) : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారినిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపను పక్కింట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఎస్పీజీ పాలెంలో గురువారం వెలుగుచూసింది.
స్థానిక కాలనీకి చెందిన బాలిక(8)ను వరుసకు బాబాయి అయ్యే రంగస్వామి(25) పక్కింట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి దిగాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
Published Thu, Jan 14 2016 8:25 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement