వైసీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మంది నిందితుల అరెస్ట్ | 9 arrested in ysrcp activist murder case | Sakshi
Sakshi News home page

వైసీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మంది నిందితుల అరెస్ట్

Published Sun, Aug 24 2014 1:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వైసీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మంది నిందితుల అరెస్ట్ - Sakshi

వైసీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మంది నిందితుల అరెస్ట్

 తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లికార్జునను దారుణంగా హత్య చేసిన కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ వివరాలను తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వారి కథనం మేరకు.. మల్లికార్జునతోపాటు శేఖర్ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు తరచూ వీరితో ఘర్షణకు దిగేవారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున మురుగు కాలువ విషయమై గొడవకు దిగి మల్లికార్జున, శేఖర్, రామయ్యలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో మల్లికార్జున మృతిచెందాడు. శేఖర్, రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో నిందితులైన టీడీపీ వర్గీయులు వెంగముని, నాగముని, వెంకటేష్, వెంకట్రాముడు, శ్రీనివాసులు, గోపాల్, తిరుపతయ్య, చిన్న యల్లప్ప, చిన్నమునయ్యలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. దాడికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement