Anantapur
-
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన YSRCP
-
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జగన్
-
ఓ వైపు ఎండలు.. మరోపక్క వానలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాల్లో పలుచోట్ల శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసలపల్లెలో ఆదివారం 2.9 సెం.మీ. వర్షం పడింది.శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. విజయవాడలోని గుణదల, ప్రసాదంపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం కురిసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతోనే..ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కలిసినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. -
అరటి రైతుల ఆత్మహత్యాయత్నం
యల్లనూరు/పులివెందుల రూరల్: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నంచిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న వెంగప్ప 9 ఎకరాలు, లక్ష్మీనారాయణ మరో 10.5 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి ఒక్కొక్కరూ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. ఒక్కో రైతుకు కనీసం రూ.20 లక్షల వరకు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంట దెబ్బతింది.వడగళ్లు అరటి గెలలపై పడటంతో కాయలకు మచ్చలు వస్తాయని, దీనివల్ల పంటను ఎవరూ కొనరని బాధిత రైతులు ఆవేదన చెందారు. పంట నష్టాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆదివారం ఉదయం ఉద్యాన శాఖ అధికారులను ఫోన్లో కోరారు. సెలవు రోజు కావడంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రైతులిద్దరూ తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. అప్పులు తీర్చే దారిలేక... చివరకు ఆత్మహత్యలే గతి అని భావించి తోటలోనే పురుగు మందు తాగారు.చిన్నవెంగప్ప భార్య రాజమ్మ ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు చెప్పగా.. ఇద్దరినీ పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. పంట నష్టం జరిగిన తోటలను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉమాదేవి, తహసీల్దార్ రాజా పరిశీలించారు. కాగా.. రైతులు ఫోన్ చేసినా తాము స్పందించలేదనడంలో వాస్తవం లేదని, వెంటనే పొలాల వద్దకు వెళ్లి బాధిత రైతులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఉద్యాన అధికారి ఉమాదేవి చెప్పారు. ఎవరూ పట్టించుకోవడం లేదుమొత్తం పదిన్నర ఎకరాల్లో అరటి పంట వేశాను. 15 వేల మొక్కలు నాటాను. ప్రస్తుతం ఐదు వేల చెట్లలో పంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజుల్లో కోసి విక్రయించేవాళ్లం. మా ఖర్మ ఏమైందో గానీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం దెబ్బతింది. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి?. ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. – లక్ష్మీనారాయణ, ఆత్మహత్యాయత్నం చేసిన రైతుతీవ్రంగా నష్టపోయాంతొమ్మిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.లక్షలు అప్పు చేసి పంట పెట్టా. 11 నెలలు పడ్డ కష్టానికి రెండు రోజుల్లో ఫలితమిచ్చేది. గెలలు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో కాస్తయినా అప్పులు తీర్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆశలపై నీళ్లు పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – చిన్నవెంగప్ప, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు హల్ చల్
-
వీళ్లు మనుషులా, కుక్కలా? అనంతపురంలో వింత ఆచారం
-
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
సాక్షి,అనంతపురం: పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను,వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతపురం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతపురం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి ప్రయాణమైంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుండి అనంతపురంకు వెళ్తున్న కారు.. ఎదురుగా ఉన్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె మూడునెలల కుమార్తె విద్య శ్రీ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి మృతి చెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
భావిపౌరులు.. వ్యసనాలకు బానిసలు
అడ్డాగా మారిన కంపచెట్లు: కూడేరు హైస్కూల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల నిర్మాణానికి రూ.లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పటి ప్రధానోపాధ్యాయుడు పనులు సక్రమంగా చేయించకపోవడంతో బాలుర మరుగుదొడ్ల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. బాలికలకు 5 మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో మగపిల్లలు మలవిర్జనకు పాఠశాలకు దగ్గరలో జాఫర్ పిండి మిషన్ ముందు ఖాళీ స్థలంలో పెరిగిపోయిన కంపచెట్ల మాటుకు వెళ్తున్నారు.ఈ కంప చెట్లే పిల్లలు చెడు మార్గంలో వెళ్లడానికి అడ్డాగా మారాయి. మూత్ర విసర్జనకంటూ అక్కడికి వెళ్లడం.. బీడీలు, సిగరెట్లు తాగడం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అలవాటు చేసుకోవడం అధికమైంది. పిల్లలు బయటకు వెళుతున్నా హెచ్ఎం, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కూడేరు: బాగా చదివి భావి పౌరులుగా ఎదగాల్సిన ఆ విద్యార్థులు బంగారు బాల్యాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతంగా ఎదగాల్సిన వారి జీవితాలు బీడీ, సిగరెట్, గుట్కాలాంటి వ్యసనాలతో ‘పొగ’ చూరుతున్నాయి. పదిహేనేళ్లలోళ్లలోపే ‘మత్తు’కు అలవాటు పడి భవిష్యత్ చిత్తు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల గారాభం.. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడడంతో తోటి విద్యార్థులు తోడై పెడదోవ పడుతున్నారు.చిరుప్రాయం నుంచే క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాల్సిన పిల్లలు.. అవసరానికి మించి డబ్బులిస్తుండడంతో జల్సాలకు అలవాటు పడుతున్నారు. చెడుమార్గంలో వెళ్లి వారి ఆశయాలు, తల్లిదండ్రుల ఆశలను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరానికి పొరుగున ఉండే కూడేరు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 454 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పలువురు బాలురులు బీడీ సిగరెట్, గుట్కా, కల్లుకు బానిసవుతున్నారు. ఆరు నెలల క్రితం వరకు 9,10వ తరగతి పిల్లల్లో కొందరు వ్యసనాలకు అలవాటు పడ్డారు. నెల రోజులు నుంచి వారిని చూసి 6, 7,8వ తరగతి పిల్లలు కూడా అదేబాటలో నడుస్తున్నారు. తొలుత రూపాయి పెట్టి చుట్ట బీడీ తాగడం మొదలెట్టి .. తర్వాత రూ.10ల విల్స్, రూ.12 పెట్టి గోల్డ్ సిగరెట్లకు అలవాటు పడ్డారు. తాజాగా వారి ధ్యాస గుట్కా వైపు మళ్లింది. రూ.10, రూ.20 పెట్టి విమల్, చైనీ ఖైనీ వంటి గుట్కాలను వాడుతున్నారు. వ్యసనాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు.. కొందరు పిల్లలకు చదువుపై ధ్యాస లేదు. టీవీలు, సినిమాలు, సెల్ఫోన్లో యుట్యూబ్లో బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కాలు వేసుకోవడం ఫ్యాషన్గా తీసుకొని వీరు బానిసలవుతున్నారు. ధూమపానం చేయడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, గుట్కా వేసుకోవడంతో నోటి కేన్సర్ వస్తుందన్న విషయం తెలియక డబ్బు పెట్టి జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ నాశనంపెద్దవారే బీడీలు, సిగరెట్లు తాగి, గుట్కా వేసుకోవడంతో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. మరీ చిన్నపిల్లలు వీటికి బానిస కావడం దారుణం. అడ్డుకట్ట వేయకపోతే చదువుపై శ్రద్ధ చూపకపోగా మరింత వ్యసన పరులై చేతులారా భవిష్యత్ నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు డబ్బులివ్వడం మంచిది కాదు. – లక్ష్మీనారాయణ, మండల వైద్యాధికారి, కూడేరు నిఘా ఉంచుతాం..కొందరు పిల్లలు బీడీలు, సిగరెట్లు తాగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరగతి గదుల్లో ఉండకుండా బయట తిరుతున్న పిల్లలపై నిఘా ఉంచాం. అల్లరి, చిల్లరిగా తిరిగే పిల్లల విషయాన్ని వారి తల్లిదండ్రులను పిలిపించి తెలియజేశాం. మగపిల్లలకు మరుగుదొడ్లు లేకపోవడం సమస్యగా మారింది. మలమూత్ర విసర్జనకంటూ పిల్లలు బయటకు వెళుతున్నారు. ధూమపానం, గుట్కాకు అలవాటు పడిన పిల్లలపై తోటి పిల్లలతో నిఘా పెట్టిస్తాం. – శ్రీదేవి, హెచ్ఎం, కూడేరు హైస్కూల్ -
చిట్టిలంటూ జనాలకు టోపీ
-
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు..
అనంతపురం: ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్ తాగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం వన్టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం గెరిశనపల్లికి చెందిన దివాకర్ అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో ముదిగుబ్బకు చెందిన రేష్మ అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలు రేష్మకు వివాహం చేయగా.. పెళ్లయిన నెలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్లీ దివాకర్తో ప్రేమాయణం సాగించింది.ఈ క్రమంలో రూ.2 లక్షలకు పైగా డబ్బు ఇచ్చింది. కాగా, కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన శారద (23) అనే యువతితోనూ దివాకర్ ప్రేమాయణం సాగించాడు. అటు రేష్మ, ఇటు శారద ఇద్దరితోనూ ఏకకాలంలో ప్రేమ బంధం నడిపాడు. ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసేవాడు. ఇటీవల శారదకు దివాకర్ తీరుపై అనుమానం వచ్చి ఇన్స్టాగ్రామ్ను పరిశీలించగా.. రేష్మతో అతడి బాగోతం బయటపడింది. ఇదే క్రమంలో రేష్మ కూడా దివాకర్ను నిలదీసింది. విషయం తెలుసుకున్న రేష్మ కుటుంబ సభ్యులు ఆమెను కదిరిలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపారు.అయితే, శనివారం దివాకర్తో మరోమారు రేష్మ ఫోన్లో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో దివాకర్ కదిరికి వెళ్లి ఆమెను బైక్పై అనంతపురం తీసుకొచ్చాడు. శారద ఉంటున్న హాస్టల్లోనే ఆమెను వదిలాడు. ఆదివారం సాయంత్రం రేష్మ, శారదలు దివాకర్ను తామున్న చోటుకు పిలిచి ఇద్దరినీ పెళ్లిచేసుకోవాలని కోరారు. అయితే, తానెవరినీ పెళ్లి చేసుకునేది లేదంటూ దివాకర్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాస్మాయిల్ తాగారు.విషయాన్ని దివాకర్కు ఫోన్లో తెలియజేయగా.. వెంటనే అతను అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరినీ ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక శారద మృతి చెందింది. రేష్మ పరిస్థితి నిలకడగా ఉంది. శారద వాస్మాయిల్ ఎక్కువ తాగిందని, రేష్మ కొంచెమే సేవించినట్లు గుర్తించిన పోలీసులు ఇందులో రేష్మ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్కు వెళ్తున్నా’ -
భూ వివాదంలో దళితులపై దాడి చేసిన టీడీపీ నేతలు
-
అనంతపురం: యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో అమ్మాయి బాత్రూమ్లోకి కొందరు తొంగిచూశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళన దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూమ్ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. -
అనంతపురంలో అక్రమ సంబంధానికి బలైన ఓ వ్యక్తి
-
టీడీపీ ఆఫీస్ లో రేషన్ షాప్..!
-
కరువు సీమలో విచిత్రం..
-
సూపర్ సిక్స్ హామీలపై నిలదీసిన YSRCP సభ్యులు
-
అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
-
బాహుబలి ఎద్దు..
-
అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
సీరియస్ మీటింగ్.. సైలెంట్గా రమ్మీ!
అనంతపురం అర్బన్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో.. అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్కుమార్, టి.ఎస్.చేతన్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్గా మారింది. వివరణ కోరిన కలెక్టర్ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్ఓ మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ వి.వినోద్కుమార్ తీవ్రంగా పరిగణించారు. డీఆర్ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్ఓ మలోల స్వయంగా కలెక్టర్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
కీలకమైన సమావేశంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన డీఆర్వో మలోలా
-
AP: కలెక్టరేట్లో డీఆర్వో అలసత్వం.. ఫోన్లో గేమ్ ఆడుతూ..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
ప్రభుత్వం మాదే.. స్థలం ఆక్రమిస్తామంటూ టీడీపీ నేతల దౌర్జన్యం
-
జర్నలిస్ట్ పై టీడీపీ నేతల దాడి
-
వెదురు సాగుకు ఎదురు లేదు
చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపే సామర్థ్యమున్న ఆకుపచ్చని బంగారం అది. సారవంతం లేని భూమైనా పర్వాలేదు.. గ్యారంటీగా పంట పండుతుంది. రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పంటగా గుర్తింపు పొందిన ఆ పంటే వెదురు సాగు. గ్రామీణ పేదలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే వనరు కూడా వెదురే కావడం గమనార్హం. వెదురు వినియోగం పెరిగే కొద్ది మార్కెట్లో దాని విలువ బంగారంతో సమానంగా ఎగబాకుతోంది. అందుకే దీనిని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం)గా ముద్దుగా పిలుస్తుంటారు. స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం పొందే ఈ పంటపై ఓ చిరుద్యోగి దృష్టి సారించి సఫలీకృతుడయ్యారు. సాగు ఆరంభంలో అందరూ నవ్వుకున్నా... పట్టువీడని విక్రమార్కుడిలా సత్ఫలితాలు సాధించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రాయదుర్గం: అనంతపురం జిల్లాలో వెదురు సాగు (Bamboo Cultivation) రైతు అంటూనే ఠక్కున గుర్తొచ్చేది గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్ వంశీకృష్ణారెడ్డి. జిల్లాలో తొలిసారి వెదురు సాగుకు శ్రీకారం చుట్టి అటు ఉద్యానశాఖ అధికారుల్లో, ఇటు అన్నదాతల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా స్థిరపడ్డారు. కరోనా (Carona) కారణంగా ఉద్యోగం వీడి వ్యవసాయంపై దృష్టి సారించారు. అందరిలా వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, పత్తి (Cotton) లాంటి పంటలు కాకుండా వినూత్న ఆలోచనతో 10 ఎకరాల్లో వెదురు సాగు చేపట్టారు. ఎకరాకు రూ.50 వేలు చొప్పన రూ.5 లక్షలు పెట్టుబడి అయింది. మూడేళ్ల పాటు పంటను కాపాడుతూ వచ్చారు. ఇది చూసిన చాలా మంది హేళనగా మాట్లాడారు. అయినా ఆయన వెనుదిరిగి చూడలేదు. మూడేళ్ల తర్వాత కోతలు.. వంశీకృష్ణారెడ్డి సాగు చేసిన వెదురు పంట మూడేళ్ల తర్వాత ప్రస్తుతం కోతకు వచ్చింది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో టన్ను వెదురు ధర రూ.6 వేలు పలుకుతోంది. నాణ్యమైన వెదురు కావడంతో వంశీకృష్ణారెడ్డి పొలం వద్దకే కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ధర పెంచేందుకు కూడా వెనుకాడడం లేదు. సరాసరి ఎకరాకు 20 టన్నులతో పదెకరాలకు 200 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. టన్ను రూ.6 వేలతో లెక్కించినా రూ.12 లక్షల ఆదాయం ఇంటి వద్దకే సమకూరింది. వచ్చే ఏడాది 25 నుంచి 30 టన్నులు, ఐదో ఏడాది 45 నుంచి 50 టన్నులకుపైగా దిగుబడి వస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి పంట కోతలు చేపడితే.. ఆ తర్వాత కేవలం నీటి తడులతోనే పంట ఏపుగా పెరుగుతుందని పేర్కొటున్నారు. పైగా కోత దశకు వచ్చిన వెదురు పంటలో వ్యర్థమన్నదే ఉండదంటున్నారు. చిన్న పరిమాణంలో ఉన్న వెదురు కర్రలకు సంబంధించి టన్ను రూ.5వేలకు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వీటిని టమాట, ఇతర పంటల సాగులో ఊతకర్రలుగా వినియోగిస్తుంటారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి.. సాగుకు యోగ్యంగా లేని భూములైన సరే నీటి వసతి ఉంటే వెదురు సాగుకు అనుకూలం. వెదురు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తాం. ఎకరం పది సెంట్లలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటే రూ.10 లక్షలు ఇస్తాం. వెదురు మొక్కలు రాయితీతో అందించడంతో పాటు ప్రధాన పంటగా సాగు చేస్తే హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. – నరసింహరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, అనంతపురం -
MLA Vs Ex MLA: టీడీపీలో ఆధిపత్య పోరు!
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. ఓ స్థలం విషయంలో వీరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. జిల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అయితే, అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంకపోరంబోకు స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులపై దాడి చేసి స్థలం ఖాళీ చేయించారు. అనంతరం, ప్రభుత్వ వంకపోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు పాగా వేశారు. దీంతో, టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారంటూ మరో వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం. -
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ అనంతపురం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్లైయాష్ వివాదమే కారణమా? నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది. -
అనంతపురంలో లాయర్ ఘటనపై అనుమానాలు !
-
బాబు బాదుడుపై అనంతపురం YSRCP నేతలు పోరుబాట
-
వైఎస్సార్సీపీ పోరుబాటపై బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్కు పోలీసులు పిలిపించారు.వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే! -
తాడిపత్రిలో ఆగని జేసీ కుటుంబ అరాచకాలు
-
YS Jagan: నేను జైల్లో ఉన్నప్పుడు నా భార్య నా కోసం.. గూస్ బంప్స్ స్పీచ్
-
ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ముగిసిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు
-
అనంతపురం జిల్లా నార్పలలో ఘనంగా వీర జవాను సుబ్బయ్య అంత్యక్రియలు
-
ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు
సాక్షి,అనంతపురం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య (43) అంత్యక్రియలు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిశాయి. తాను ప్రాణాలు వదులుతూ.. ఇతరులను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న సుబ్బయ్య అంత్యక్రియలు పాల్గొనేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు కుల, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి సుబ్బయ్య భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంచనాలతో సైనిక అధికారులు అందజేశారు.కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్లో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్లోని మినీ కాశ్మీర్గా పేరొందని పూంచ్ జిల్లా, పూంచ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందుపాతరకు మాత్రం తాను బలయ్యారు.ఎల్ఓసీలో అమరుడైన సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా నార్పలకు తీసుకువచ్చారు. సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని చూసి భార్య లీల, తల్లి గాలెమ్మ, పిల్లలు, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్ వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు. ల్యాండ్మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్జమ్మూలో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య ల్యాండ్మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్లు 30 మందిని కాపాడి, తాను మాత్రం దాని బారిన పడి ప్రాణాలుకోల్పోవడం బాధాకరం. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
అనంతపురంలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం
-
తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
-
పులికి చుక్కలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..
-
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించారు. -
అనంతపురం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: అనంతపురం జిల్లాలో శనివారం(నవంబర్ 23) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని,వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
సమాజమా నువ్వెక్కడ?
అందరి గురించి ఆలోచించేవాడునలుగురికీ తల్లోనాలుకలా ఉండేవాడుఎవరికి ఏ జబ్బుచేసినా మందులిచ్చి నయం చేసేవాడుసాయమంటే ముందుండేవాడుఆయనకే కష్టం వస్తే...అయ్యోపాపం అనలేకపోయావాకాస్త ఆదరణచూపలేకపోయావా?జీవితంపై విరక్తి చెందితే ..ఊరడింపుగా నాలుగు మాటలు చెప్పలేకపోయావాకుటుంబంతో ఉరికంభమెక్కితే...అలా చూస్తూ ఊరుకున్నావాపసిగుడ్డు గొంతునులిమేసేంతగా మార్చేశావా..ఆయువు ఆగి ఐదురోజులైనా కన్నెత్తి చూడలేకపోయావాఇప్పుడంతా అయిపోయింది..ఆ మనిషి లేడు..ఆ కుటుంబమూ లేదునువ్వుండు.. నూరేళ్లునిర్దయగా...నిక్షేపంగా..అలా నువ్వున్నా..లేనట్టే!అందుకే అతను.. తన ఐదు నెలల ప్రతిరూపాన్ని వెంటతీసుకెళ్లాడు..నార్పలకు చెందిన కృష్ణకిశోర్, శిరీష దంపతులు ఉరి వేసుకుని చనిపోగా..ఐదురోజుల తర్వాత ఇరుగుపొరుగు గుర్తించారు. లోనికి వెళ్లి చూడగా..వారి ప్రేమకు ప్రతిరూపమైన ఐదు నెలల పసికందు ఊయలలో నిర్జీవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన మనసున్న మనిషెవరైనా ఇలాగే ప్రశ్నిస్తున్నాడు.. సమాజమా...నువ్వెక్కడా అని..అనంతపురం -
సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు.. అనంతపురం మేయర్ సీరియస్ వార్నింగ్
-
అనంతపురం : మెడికో ఫ్రెషర్స్ డే అదరహో (ఫొటోలు)
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
సెల్ఫోన్ రికవరీలో ‘అనంత’ టాప్
అనంతపురం: సెల్ఫోన్ల రికవరీలో 10 వేల మైలురాయిని దాటి అనంతపురం పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం 10,195 ఫోన్ల రికవరీ చేసి, బాధితులకు అందజేశారు. వీటివిలువ సుమారు రూ.18.85 కోట్లుగా నిర్ధారించారు. తాజాగా రికవరీ చేసిన 1,309 మొబైల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ పి.జగదీష్ అందజేశారు. వీటివిలువ రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న తర్వాత ఆచూకీ దొరకదనుకునే ఫోన్లను సైతం రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని బాధితులకు 1,156 ఫోన్లు అందజేశారు. -
ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల రికార్డు.. ఏకంగా 18.85 కోట్ల విలువైన
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీస్ మైదానంలో సెల్ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు క్యూ కట్టడంతో పరేడ్ మైదానం జాతరను తలపించింది. మంగళవారం ఒక్కరోజే 1309 మంది బాధితులకు తమ ఫోన్లను తిరిగి అందజేశారు పోలీసులు. ఫోన్లు రివకరీ చేసిన సిబ్బందిని పోలీసులు ప్రశంసించి రివార్డులు అందించారు.ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఇవాళ అందజేసిన ఫోన్ల విలువ రూ. 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 10,195 ఫోన్లు రికవరీ చేయగా.. వీటిలో 19 జిల్లాలకు 2535 ఫోన్లను, 20 రాష్ట్రాలకు 1056 మొబైళ్లను పంపిణీ చేశామని తెలిపారు. రికవరీ చేసి నేడు అందించిన ఫోన్ల విలువ 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. -
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్కు చెందిన భక్తులుగా గుర్తించారు.మృతుల వివరాలు...శ్రీధర్(28)సంతోష్ (26)వెంకన్న (35)ప్రసన్న (34)వెంకీ (24)షణ్ముఖ (30) -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్లో టాపర్గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
నేను ఎక్కడికి పారిపోను .. ఎప్పుడైనా నన్ను అరెస్ట్ చేసుకోండి ..
-
అనంతపురంలో సినీ తారలు పాయల్ రాజ్పుత్,నభా నటేష్ సందడి (ఫొటోలు)
-
ఎస్పీని కలిసిన కేతిరెడ్డి
-
వివాదాస్పద తీరు.. ఆగడాల్లో సరిలేరు!
ఎక్కడైనా ఒక పోలీసు అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వాలంటే పనితీరు, నిజాయితీ వంటివి చూస్తారు. కానీ ఆ సీఐకి ఈ అర్హతలే లేవు. పైపచ్చు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్య కేసుల్లో నిందితులకు సహకరిస్తారని, బాధితులపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకులఅడుగులకు మడుగులొత్తడంలో ఘనాపాటిగా పేరుంది. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం రెడ్కార్పెట్ పరిచి మరీ అందలం ఎక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరులో 2018 మార్చి 30న వైఎస్సార్ సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఇటుకలపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా దారిలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు వారం రోజుల ముందే రెండు వర్గాల నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివారెడ్డి సోదరుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందించగా, అప్పట్లో సీఐగా ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్ దాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వారం రోజులకే శివారెడ్డి హత్య జరి గింది. వినతిపత్రం ఇచ్చినప్పుడే నిందితులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే అసలు హత్యే జరిగి ఉండేది కాదని కందుకూరు గ్రామస్తులు నేటికీ చెబుతున్నారు. శివారెడ్డి హత్యకు పరోక్షంగా సీఐ కూడా కారణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణ అధికారిగా రాజేంద్రనాథ్ ఉంటే బాధితులకు న్యాయం జరగదని మరో పోలీసు అధికారిని ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం.ప్రసాదరెడ్డి హత్య కేసులోనూ..2015 ఏప్రిల్ 29న ఏకంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే వైఎస్సార్ సీపీ కీలక నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య నేపథ్యంలోనూ రాజేంద్రనాథ్ వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారును అప్పట్లో శివప్రసాద్ రెడ్డి హత్య కేసు నిందితులు వాడినట్టు తేలింది. ఆ సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనాథ్ ఏకంగా కీలకమైన వన్టౌన్కు పోస్టింగ్ తెచ్చుకోగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సెటిల్మెంట్లలో ఘనుడు!రాప్తాడుకు చెందిన ఓ విలేకరికి, ఆయన అన్నదమ్ములకు మధ్య భూ వివాదం నడుస్తోంది. వీరిలో ఒక వర్గానికి పరిటాల కుటుంబం మద్దతు ఉంది. దీంతో అప్పట్లో మంత్రి అయిన పరిటాల సునీత ఒత్తిడితో విలేకరిపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రెచ్చిపోయారు. విలేకరి చొక్కా పట్టుకుని ‘భూమి మీద నీకు హక్కులేదు, మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా లేదా’ అని బెదిరించారు. దీంతో బాధిత విలేకరి అప్పట్లో తన మిత్రులతో కలిసి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగగా సీఐ క్షమాపణలు చెప్పారు. ఇలా ల్యాండ్ సెటిల్మెంట్లలోనూ ఘనాపాటిగా రాజేంద్రనాథ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.తాజాగా స్టూడెంట్ యూనియన్ నేతలపై..నేటికీ రాజేంద్రనాథ్ యాదవ్ తన వివాదాస్పద వైఖరిని వీడలేదు. స్టూడెంట్ యూనియన్ నాయకులపై ఇటీవల తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. స్కాలర్షిప్లు మంజూరు చేయాలంటూ అనంతపురంలోని పెన్నార్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలపై చిందులు తొక్కారు. సీఐ వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, తమను కొట్టడానికి కూడా యత్నించారని, విద్యార్థుల పట్ల కూడా అమాన వీయంగా వ్యవహరించారని విద్యార్థి సంఘం నేతలు వాపోయారు. ఇలా తాను ఎక్కడ పనిచేసినా లెక్కలేనన్ని ‘ఘనతలు’ మూటగట్టుకున్న వ్యక్తికి నగరంలో కీలక స్థానాన్ని కట్టబెట్టడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసే పోలీసు బాస్లు రాజేంద్రనాథ్ యాదవ్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
రామాలయంలో రథానికి నిప్పు
-
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
బుక్కరాయసముద్రం/చిల్లకూరు: రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, తిరుపతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్కు చెందిన బలిజ పవన్(24) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెల కిందటే ఉద్యోగం వచి్చంది. చాకలి పవన్(22), ముస్తాక్(23)లు వడ్రంగి పని చేస్తుంటారు. శ్రీనివాసులు(24) డ్రైవర్. వీరంతా స్నేహితులు. ముస్తాక్ పుట్టిన రోజు కావడంతో శనివారం రాత్రి నగరంలో పార్టీ చేసుకున్నారు.తర్వాత మరో స్నేహితుడి నుంచి ఇన్నోవా కారు తీసుకుని ఎక్కడెక్కడో తిరిగి సుమారు రెండు గంటల ప్రాంతంలో నార్పలలో ఉంటున్న పవన్ నానమ్మను చూడడానికంటూ బయలుదేరారు. అతివేగంగా వెళుతూ బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట దాటగానే నార్పల వైపు నుంచి వేరుశనగ విత్తన బస్తాల లోడుతో అనంతపురం వస్తున్న లారీని ఢీకొట్టారు. లారీ కిందకి కారు దూసుకెళ్లి నుజ్జు నుజ్జయింది. చాకలి పవన్, శ్రీనివాసులు, ముస్తాక్, బలిజ పవన్ అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్ తాతయ్యకు గాయాలయ్యాయి. అదేవిధంగా నెల్లూరు సమీపంలోని కాకుపల్లి, వనంతోపునకు చెందిన రెండు కుటుంబాల వారు అరుణాచలం వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా చిల్లకూరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించేలోగా వెన్నెల మేఘన (8), జగదీష్(50), బాబు(48) మృతి చెందారు. -
ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఆదివారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతులను నెల్లూరు జిల్లా, అనంతపూర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను అతి వేగంలో ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది. కంటైనర్ను వెనుక నుంచి ఢీకొనడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.మరోవైపు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతులను అనంతపురం స్టాలిన్ నగర్కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్. పవన్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి -
ఆవేశ్ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
అనంతపురంలో సూర్యకుమార్ యాదవ్.. 5 పరుగులకే అవుట్ (ఫొటోలు)
-
భారత్-ఎ vs భారత్-సి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
అనంతపురం : ఆకాశంలో అద్భుతం (ఫొటోలు)
-
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్కు చేరువలో కుల్దీప్ -
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు.. ఫోటోలు
-
అభిమన్యు వీరోచిత పోరాటం
సాక్షి, అనంతపురం: భారత్ ‘బి’ జట్టు కెపె్టన్, ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (262 బంతుల్లో 143 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీతో జట్టును నడిపిస్తున్నాడు. దీంతో మూడు రోజులైనా తొలి ఇన్నింగ్స్ ఆటే సాగుతుండటంతో దులీప్ ట్రోఫీలో ‘సి’ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. ఓవర్నైట్ స్కోరు 124/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు ఆట నిలిచే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఫాలోఆన్ను తప్పించుకునేందుకు ఇంకో 16 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట మొదలవగానే ఓపెనర్లలో నారాయణ్ జగదీశన్ (137 బంతుల్లో 70; 8 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 3 పరుగులు జతచేసి అన్షుల్ కాంబోజ్ ఓవర్లో ని్రష్కమించాడు. స్వల్ప వ్యవధిలో అన్షుల్ టాపార్డర్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (1) వికెట్ పడగొట్టాడు. 133 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోగా... ఈ దశలో కెప్టెన్ అభిమన్యు, సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 16; 1 ఫోర్) ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. మూడో వికెట్కు 42 పరుగులు జోడించాక సర్ఫరాజ్ను అన్షుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 23 ఏళ్ల హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్... హిట్టర్లు రింకూ సింగ్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (2)లను అవుట్ చేసి జట్టును కష్టాల్లో పడేశాడు. 194 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన భారత్ ‘బి’ జట్టుకు ఇక ఫాలోఆన్ ఖాయమనిపించింది. కానీ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (13), సాయికిశోర్ (44 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ చహర్ (31 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో అతను ఫస్ట్క్లాస్ క్రికెట్లో 24వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు రాహుల్తో కలిసి 26 పరుగులు జోడించాడు. అన్షుల్ 5 వికెట్లు పడగొట్టగా, విజయ్ కుమార్ వైశాక్, మయాంక్ మార్కండేలకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 525; భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 143; నారాయణ్ జగదీశన్ (సి) అభిõÙక్ (బి) అన్షుల్ 70; ముషీర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 1; సర్ఫరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 16; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) అన్షుల్ 6; నితీశ్ కుమార్ రెడ్డి (బి) అన్షుల్ 2; వాషింగ్టన్ సుందర్ (సి) సుదర్శన్ (బి) విజయ్ 13; సాయికిశోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మార్కండే 21; రాహుల్ చహర్ (బ్యాటింగ్) 18; ఎక్స్ట్రాలు 19; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 309. వికెట్ల పతనం: 1–129, 2–133, 3–175, 4–190, 5–194, 6–237, 7–283. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0–8–0, విజయ్ కుమార్ వైశాక్ 23–5–67–1, అన్షుల్ కాంబోజ్ 23.5–7– 66–5, మయాంక్ మార్కండే 18–0–59–1, మానవ్ సుతార్ 33–4–85–0, ఇషాన్ కిషన్ 1–0–7–0, సాయి సుదర్శన్ 1–0–3–0. -
అనంతపురంలో క్రికెటర్లు తీసుకునే ఆహారం (ఫొటోలు)
-
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్లో ఇలాతాజా ఎడిషన్లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్దీప్ బౌలింగ్లో దేవ్దత్ పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్కు పోయి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్తో నాటౌట్గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
ఆర్డీటీ స్టేడియంలో దులిప్ ట్రోఫీ.. రెండో రోజు ఇలా(ఫొటోలు)
-
అప్పుడు డకౌట్.. ఇప్పుడు వికెట్! శ్రేయస్ సెలబ్రేషన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరేళ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్లో ఇండియా-‘డి’ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్లో ఈ మేర తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్ ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగాడు.తొలి టెస్టులో స్థానం దక్కలేదుఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది ఇండియా-‘డి’.దేవ్దత్ పడిక్కల్ 92కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా.. మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవ్దత్ పడిక్కల్ 92 రన్స్తో అదరగొట్టగా.. రికీ భుయ్ 23, హర్షిత్ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులు చేయగలింది.స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్వయంగా రంగంలోకి దిగాడు.రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల అయ్యర్.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(56)ను అవుట్ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్ క్యాచ్ అందుకుని మయాంక్కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో వికెట్ తీయడం ఇదే తొలిసారి. అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్లో అతడు వికెట్(చేతన్ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్లో 28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్Golden Arm! 💪Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ తనకు వచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దులిప్ ట్రోఫీ జట్టుకు తొలిసారిగా ఎంపికైన అతడు.. ఆరంభ మ్యాచ్లోనే బ్యాటర్గా విఫలమయ్యాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కేరళ కెప్టెన్గా వ్యవహరిస్తున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్.. చాలాకాలం తర్వాత దేశీ రెడ్బాల్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.వారు వెళ్లిపోవడంతోమరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడిన నేపథ్యంలో ఇండియా-‘డి’ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ.. ఈ టీమ్ ఆడిన తొలి మ్యాచ్లో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే, బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు దులిప్ ట్రోఫీ నుంచి వైదొలగడంతో సంజూ ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఈ క్రమంలో ఇండియా-‘ఎ’తో అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో ఇండియా-‘డి’ తరఫున సంజూ బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన ఇండియా-‘డి’ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-‘ఎ’ను 290 పరుగులకు ఆలౌట్ చేసింది.క్యాచ్తో హైలైట్ఇండియా- ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా(4/51) నాలుగు వికెట్లతో చెలరేగగా.. విద్వత్ కవేరప్ప(2/30). అర్ష్దీప్ సింగ్(2/73) రెండేసి వికెట్లు తీశారు. మిగతా వాళ్లలో సారాంశ్ జైన్(1/55), సౌరభ్ కుమార్(1/65) ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక కవేరప్ప బౌలింగ్లో ఇండియా-‘ఎ’ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్ను సంజూ పట్టిన తీరు హైలైట్గా నిలిచింది.ఐదు పరుగులకే అవుట్అనంతరం ఇండియా-‘డి’ బ్యాటింగ్కు దిగగా.. రెండో రోజు ఆటలో భాగంగా సంజూ ఐదో స్థానంలో వచ్చాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు.. కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆకిబ్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘సంజూ రెడ్బాల్ క్రికెట్కు పనికిరాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక దేవ్దత్ పడిక్కల్ 92 పరుగులతో రాణించడంతో.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులు చేయగలిగింది. ఫలితంగా వందకు పైగా పరుగుల ఆధిక్యంతో ఇండియా- ‘ఎ’ రెండో ఇన్నిం గ్స్ మొదలు పెట్టింది.చదవండి: Shreyas Iyer: సన్గ్లాసెస్తో బ్యాటింగ్..! కట్ చేస్తే డకౌటయ్యాడు(వీడియో)Pacers Khaleel Ahmed & Aaqib Khan have impressed so far for India A with 2⃣ wickets each!Watch 📽️ all the 4⃣ India D wickets to fall in the morning session on Day 2 🔽#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0HttaH pic.twitter.com/7GIOzLwpa5— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
DT 2024: అనంతపురంలో దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్ (ఫొటోలు)
-
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్గా ఎంపికయ్యాడు. శుబ్మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
అనంతపురంలో ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్.. ఫోటోలు
-
ఫొటోలు ఇవ్వని స్టూడియో యజమానికి జరిమానా
అనంతపురం: పెళ్లి సమయంలో తీసిన ఫొటోలు, వీడియో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన స్టూడియో యజమానికి రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్పర్సన్ ఎం.శ్రీలత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... అనంతపురానికి చెందిన శ్రీనివాసకుమార్ గత ఏడాది తన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి ఫొటోలు, వీడియో తీసేందుకు ఫొట్రోగాఫర్ జయచంద్రతో రూ.85 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో రూ.75 వేలను చెల్లించాడు. అయితే పెళ్లి ముగిసి నెలలు గడుస్తున్నా ఫొటోలు, వీడియో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శ్రీనివాసకుమార్ నిలదీశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియో ఇవ్వడానికి కుదరదని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని జయచంద్ర తెలిపి, ఆ మొత్తం కూడా ఇవ్వకుండా మొండికేశాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. జయచంద్ర తీసుకున్న రూ.75 వేలను 24 శాతం వడ్డీతో సహా చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేయడంతో పాటు సేవాలోపానికి గాను మరో లక్ష రూపాయల జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించాలని పిటీషన్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించిన నోటీసులు అందుకున్న స్టూడియో యజమాని కమిషన్ ఎదుట హాజరు కాకుండా ముఖం చాటేశాడు. దీనిపై పూర్వపరాలు విచారించిన అనంతరం ఫిర్యాది పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.75వేలను 9శాతం వడ్డీతో సహా చెల్లిచండంతో పాటు మానసిన వేదనకు గురిచేయడం, సేవాలోపానికి గాను రూ.50 వేలు జరిమానా, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు అంతా కలిపి 45 రోజుల్లోపు చెల్లించాలని జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్పర్సన్ ఎం శ్రీలత, సభ్యులు డి. గ్రేస్ మేరి, బి. గోపీనాథ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
అనంతపురంలో దులిప్ ట్రోఫీ: రెండో రోజు హైలైట్ ఫొటోలు
-
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్లో.. రెండో ఇన్నిం గ్స్లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఇండియా-డి జట్టు కెప్టెన్గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో షాట్కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
గ్రౌండ్లోకి దూసుకెళ్లిన ఫ్యాన్! రుతు కాళ్ళు మొక్కి
దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా అనంతపూర్లోని ఆర్డీటీ స్టేడియం వేదికగా భారత్-సి, భారత్-డి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన సదరు అభిమాని.. మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా-సి టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గైక్వాడ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు. అతడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ధోని వారుసుడిగా సీఎస్కే సారథ్య బాధ్యతలు రుతురాజ్ చేపట్టాడు.అప్పటి నుంచి రుతురాజ్కు మరింత ఆదరణ పెరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా సి జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకు ఆలౌటైంది. సి బ్యాటర్లలో బాబా ఇంద్రజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డి జట్టు బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తాచాటగా.. అక్షర్ పటేల్, జైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్-డి జట్టు 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో సి జట్టుకు 4 పరుగుల ఆధిక్యంలో లభిచింది.చదవండి: కుల్దీప్ భాయ్తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో -
అనంతపూర్ లో క్రికెట్ సందడి
-
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
#DuleepTrophy2024 : అనంతపురం చేరుకున్న క్రికెటర్లు (ఫొటోలు)
-
Duleep Trophy 2024: అనంతపూర్కు స్టార్ క్రికెటర్ల కళ..
దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆరంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీకి బెంగళూరుతో పాటు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ దేశీవాళీ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది.అందులో 6 మ్యాచ్ లకు గాను.. అనంతపురంలో 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈసారి టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రికెటర్లు భాగం కానున్నారు. దీంతో ఈ టోర్నీకి స్టార్ కళ వచ్చింది.స్టార్లు వచ్చేశారు..ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో పాల్గోనేందుకు భారత స్టార్ క్రికెటర్లు అనంతపురానికి వచ్చేశారు. పలువురు క్రికెటర్లు సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. వీరిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. క్రికెటర్లు బసచేస్తున్న హాటల్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని సందడి చేశారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, పంత్, సిరాజ్, గిల్ సైతం త్వరలోనే అనంతపుర్కు రానున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు బీసీసీఐ సెలెక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.సరికొత్త మార్పులతో..అయితే ఈసారి టోర్నీ గతం కంటే భిన్నంగా జరగనుంది. గతంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ మొత్తం ఆరు జోన్లు తలపడేది. ఇప్పుడు వాటిని ఎ, బి, సి, డి జట్లుగా మార్చారు. ఇండియా ‘ఎ’ జట్టుకు శుభ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ‘బీ’ జట్టుకు అభిన్యు ఈశ్వరన్, ‘సి’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ లు కెప్టెన్లుగా ఉండనున్నారు.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
‘అనంత’ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా
సాక్షి, అనంతపురం: అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. ఐదుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మునిసిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం కాగా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఐదు స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి, సుజాత, రహంతుల్లా, నాగవినూత, నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
YSRCP నేతల ఇళ్లకు ఇనుప కంచె..
-
గిట్టుబాటు ధర లేక.. టమాటాలను రోడ్లపై పారబోసిన రైతులు! (ఫొటోలు)
-
రేషన్ డీలర్ కు టీడీపీ నేతల బెదిరింపులు
-
అనంతపురం జిల్లాలో టీడీపీ నేత బరితెగింపు
-
అనంతపురం: టీడీపీ నేతల బరితెగింపు.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. కప్పం కట్టాలంటూ కోళ్ల వ్యాపారిని బెదిరిస్తూ.. యథేచ్ఛగా బరితెగించారు. తెలంగాణ కేంద్రంగా కోళ్ల వ్యాపారం చేస్తున్న స్నేహ కంపెనీపై టీడీపీ నేత గణేష్ నాయుడు బెదిరింపులకు దిగారు. బెదిరింపులకు దిగారు. తనతో సెటిల్ చేసుకోకపోతే అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో కోళ్ల క్రయవిక్రయాలు జరగనివ్వనంటూ హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్రతూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు.పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు.టీడీపీ నాయకులు స్టే ఆర్డర్ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్తో ఫోన్లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
రక్తికట్టని జేసీ డ్రామా!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి చేస్తున్న డ్రామాలు రక్తి కట్టడం లేదు. తాను అవినీతి పరుడిని కాను అని నిరూపించుకునేందుకు ఆయన పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి నానా హంగామా చేస్తుండడం చూసి ఈసడించుకుంటున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త రకం డ్రామాలకు తెరతీస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన బీఎస్3 వాహనాల అమ్మకాల కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి కీలక నిందితులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలే ఈ కేసులపై విచారణ చేసి కోర్టుల్లో ఛార్జ్ షీట్లు వేశాయి. దీంతో కొన్ని రోజులుగా న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతోంది. విషయం ఇలా ఉంటే.. రవాణా శాఖ అధికారులేదో తనకు అన్యాయం చేసినట్లు జేసీ ప్రభాకర్రెడ్డి చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ధర్నాలు.. ఫిర్యాదులతో నవ్వుల పాలు జేసీ ప్రభాకర్రెడ్డి బీఎస్3 వాహనాలను తుక్కు కింద కొని, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇక్కడ బీఎస్4 కింద అమ్మారనేది ప్రధాన ఆరోపణ. దీంతో పాటు పర్మిట్లు లేకపోయినా వాహనాలను తిప్పిన కేసులో ఈయన వాహనాలను సీజ్ చేశారు. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేయడమే కాదు, ఈ కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచే జిల్లాలో అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆర్టీఏ అధికారులు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల క్రితం మందీమార్బలంతో అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్ వద్దకు వచ్చారు. అప్పటి మంత్రి, రవాణా అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో రోజూ ఒక వివాదాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నా తాను నిజాయితీ పరుడిని అని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జేసీ ధర్నాలు, ఫిర్యాదులు చూసి కామెడీ చేస్తున్నట్టు జనం భావిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఖండించలేదు.. జేసీ కుటుంబానికి తన సొంత పారీ్టలోనే ఎవరి మద్దతూ లేదు. కేసులు నమోదైనప్పుడు గానీ, విచా రణ జరుగుతున్నప్పుడు గానీ, జైలుకు వెళ్లినప్పుడు గానీ ఎవరూ మాట్లాడలేదు. దర్యాప్తు సంస్థల నివేదిక తప్పు అని ఏ ఒక్కరూ ఖండించలేదు. ఈ పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి తనకు న్యాయం జరగాలంటే విచారణ సంస్థలను ఆశ్రయించాల్సి పోయి పోలీసులను టార్గెట్ చేసి ముందుకెళ్తుండడంపై సొంతపారీ్టలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.. చంద్రబాబునే ఆశ్రయించి కేసులు కొట్టివేయించుకోవచ్చు కదా అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.జోక్యం చేసుకోలేం జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. వాటిపై జోక్యం చేసుకోలేం. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి నివేదిక రవాణా శాఖ కమిషనర్కు అందజేశాం. జేసీ ప్రభాకర్రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో సీజ్చేసిన వాహనాలను విడుదల చేయలేం. కోర్టు నిర్ణయాన్ని బట్టి రవాణా శాఖ అప్పీల్కు వెళ్లాలా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలా అన్నది ఉంటుంది. హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులోనూ కేసులున్నాయి. కోర్టుల తీర్పు తర్వాతే వాహనాల విడుదలకు సంబంధించిన అంశం తేల్చాల్సి ఉంటుంది. –వీర్రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
రేషన్ షాపుల కోసం తన్నుకున్న టీడీపీ నేతలు
-
గుమ్మనూరు జయరాం చెంప చెళ్లుమనిపించిన YSRCP నేతలు
-
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్టాపిక్గా మారింది.తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్ రోడ్డు అని రాయించారు.ఈ విషయమై భవన యజమాని మాస్టర్ ప్లాన్ మ్యాప్ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. -
YSRCP నేత కుటుంబంపై టీడీపీ నేతల దాడి..
-
అరుదైన గౌరవం.. రష్యా లైబ్రరీలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం పుస్తకం
-
జగనన్న వల్లే నాకు ఈ అవకాశం
-
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా..అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్ కోయిల్ మేయర్లు ఉన్నారు. అనంతపురం మేయర్కే ఎందుకంటే.. అనంతపురానికి, రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ఆ∙అంశాలు ఇటీవల కజాన్లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచి్చ.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి. కాగా, అనంతపురం నగరాన్ని సందర్శించిన రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం నగరాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది అని మేయర్ అన్నారు. -
యథేచ్ఛగా టీడీపీ దాడులు
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పలుచోట్ల విధ్వంసానికి దిగారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ హెల్త్క్లినిక్ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకపాటి విక్రమ్రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను పగులగొట్టారు. అలాగే ఏఎస్పేట మండలం చౌటభీమవరంలో జగనన్న లేఔట్ను టీడీపీ నాయకుడు రాంబాబు జేసీబీతో తవ్వేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో సచివాలయాలు, ఆర్బీకే భవనాల శిలాఫలకాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. కీలపల్లిలో గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలకు అమర్చిన శిలాఫలకాలు, బోర్డు దిమ్మెలను గునపాలు, సమ్మెటతో పగులకొట్టారు. అలాగే గండ్రాజుపల్లి పంచాయతీ ఆలకుప్పంలో బీఎంసీ సెంటర్కు అమర్చిన శిలాఫలకాన్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు తొలగించారు. శ్రీరంగరాజపురం మండలం నెలవాయి సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ వద్ద, జీఎంఆర్ పురం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవరత్నాలు, డిజిటల్ లైబ్రరీ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల మెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. -
టీడీపీ దాడులపై వైఎస్ జగన్ రియాక్షన్
-
అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
వజ్రాల వేట.. 9 వజ్రాలు లభ్యం..
-
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.అబ్దుల్ తనయుడు సోహైల్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
TDP: అరాచక శక్తులు.. కేసులు గుట్టలు
👉 భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు ఒకరు భూ కబ్జాకోరు, హత్యా రాజకీయాలకు మారు పేరు.. మరొకరు అవినీతి అక్రమాలకు దేశస్థాయిలో పేరుగాంచిన వారు.. బ్యాంకులకే ఎగనామం పెట్టిన వారు ఇంకొకరైతే, బ్లాక్మెయిలింగ్కు పేరుగాంచిన మహానుభావుడు మరొకరు.. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన చంద్రబాబు.. తనకు తగ్గ టీంనే ఈసారి బరిలోకి దించారు. దౌర్జన్యకారులు, ఖూనీకోరులను ఎంపిక చేసి మరీ టికెట్లు కట్టబెట్టారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారిలో ఎవరి చరిత్ర చూసినా కళ్లు బైర్లు కమ్ముతాయి. వీరిని తలచుకుంటేనే సామాన్యులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. కానీ, వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో సచ్ఛీలురు కావడమే దౌర్భాగ్యం. అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ, ఎదురొచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన చంద్రబాబు టీంలోని వీరు ఒకవేళ కర్మ కొద్దీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.దళితులకు శఠగోపం.. హత్యా రాజకీయం..తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్పై 2015లో ఏకంగా హత్య కేసు నమోదైంది. వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్రెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక.. బండమీద పల్లిలో ఓ దళితుడి భూమిని అక్రమంగా లాక్కున్నాడన్న కారణంగా బాధితుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో అప్పట్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది.డాక్టర్ వద్దంట.. కేసుల వీరుడే ముద్దంటమడకశిర నియోజకవర్గ సీటును 52 కేసులున్న ఎమ్మెస్ రాజుకు చంద్రబాబు కేటాయించారు. ఉన్నత చదువులు చదివిన డాక్టర్ సునీల్కు ముందు టికెట్ ఇచ్చిన బాబు... ఆ తర్వాత ఆయన నుంచి టికెట్ లాక్కుని మరీ నేర చరితుడికి కట్టబెట్టారు. బ్లాక్మెయిలింగ్ చేయడం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయడం ఇలా రకరకాల కేసులు ఎమ్మెస్ రాజుపై నమోదై ఉండడం గమనార్హం. శింగన మల, అనంతపురం ప్రాంతాల్లోని స్టేషన్లలో దాదాపు 52 కేసులు ఇతనిపై ఉన్నాయి.జేసీ చరిత్రంతా నేరాల మయమే..జేసీ.. ఈ పేరు చెబితే చాలు నేరాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుంటుంది. ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించి చలి కాచుకున్న జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. అవినీతి చేయడంలోనూ పేట్రేగిపోయారు. నకిలీ ఇన్వాయిస్లతో వాహనాల అమ్మకం, అనుమతులు లేకుండా బస్సులు తిప్పడం కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. దేశస్థాయిలో వీరి ఘనకార్యంపై చర్చ నడిచింది. ఇప్పుడు అలాంటి నేరచరిత్ర కలిగిన అస్మిత్ రెడ్డికే చంద్రబాబు తాడిపత్రి టికెట్ ఇచ్చారు. ఎప్పుడూ తాడిపత్రిలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసిందే.తిట్టి.. టికెట్ కట్టబెట్టి..గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్లు జయరాంను తిట్టని తిట్టంటూ లేదు.మట్కా ఆడిస్తారని, పేకాట క్లబ్బులు నడిపిస్తారని, బెంజ్కార్లు లంచంగా తీసుకున్నారని ఇలా లెక్కలేనని ఆరోపణలు చేశారు. అయితే, ఎప్పుడైతే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో వెంటనే సచ్ఛీలుడై పోయాడు. ఇష్టమొచ్చినట్లు తిట్టిన బాబే ఆయనకు గుంతకల్లు టికెట్ ఇవ్వడంతో స్థానికులే కాదు.. జిల్లా ప్రజానీకమంతా ముక్కున వేలేసుకుంది.పరిటాలకే ఎందుకో..?టీడీపీ తరఫున రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పరిటాల సునీత కుటుంబం పేరెత్తితేనే గతంలో ఆ కుటుంబం సాగించిన రక్తచరిత్ర గుర్తుకొస్తుంది. సునీత భర్త పరిటాల రవి అప్పట్లో చేసిన హత్యారాజకీయాల గురించి ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆర్వోసీ పేరుతో కొన్ని వందల మందిని ఊచకోత కోసినట్లు చెబుతారు. దీనికితోడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత అవినీతి, అక్రమాలకు లెక్కేలేదు.కబ్జాల కందికుంటకదిరి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కందికుంట వెంకటప్రసాద్పై లెక్కలేనన్ని కేసులున్నాయి. కదిరిలో కంటికి కనిపించిన భూములన్నీ కబ్జా చేసేస్తాడనే ఆరోపణలున్నాయి. ఒక రేప్ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నట్లు గతంలో ఓ సర్వే సంస్థ వెల్లడించింది. హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. చెక్బౌన్స్ కేసులైతే లెక్కలేనన్ని. నకిలీ డీడీల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసును ఇటీవల కొట్టేయడంతో ఇదే అదనుగా చంద్రబాబు ఆయనకు సీటిచ్చేశారు.👉 పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత కూడా తక్కువేమీ కాదు. గ్రానైట్, మట్టి, పెట్రోలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఈమైపె అనేక కేసులున్నాయి.ఒక హత్య.. మరో హత్యాయత్నం!ఎన్నికల నేపథ్యంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరలేపారు. కొన్ని రోజుల క్రితం అనంతపురం అర్బన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు గుజ్జల నగేష్పై పచ్చ పార్టీకి చెందిన జయరాం నాయుడు వర్గీయులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు కదిరి నియోజకవర్గం జౌకుల గ్రామంలో నాగభూషణం అనే యువకుడిని టీడీపీ వర్గీయులు చంపేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నేర చరితులకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడంతోనే ఇలా జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
-
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. -
4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు
-
చంద్రబాబు ఆదేశాలతో బీసీ నేతను ఈడిపడేసి..!
-
బీసీ నేతను అవమానించిన చంద్రబాబు
సాక్షి, అనంతపురం: గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారడం లేదు. బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది. అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్, బోయ - వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజును చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గెంటేశారు. కళ్ల ముందే బీసీ నేతకు అవమానం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారే తప్ప పట్టించుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ గ్రామంలో ఘటన జరిగింది. చంద్రబాబు వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నారు. గతంలో "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని బీసీలు గుర్తుచేసుకుంటున్నారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరింపులకు తెగిన సంగతి తెలిసిందే. "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అంటూ దారుణంగా మాట్లాడారని చంద్రబాబు తీరును బీసీలు గుర్తుచేసుకుంటూ మండిపడుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు...
-
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి
అనంతపురం : వారు పేరుకు అన్నదమ్ములైనా స్నేహితుల్లా ఉండేవారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అందులో ఒకరికి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. పిల్లలు కలసిమెలసి ఉండడం చూసి తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆనందపడేవారు. అయితే, రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు పిల్లలిద్దరినీ మింగి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలి్చంది. మండలంలోని ఎంగిలి బండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనాన్ని ఎదురుగా కారు ఢీకొనడంతో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాచమల్లు రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరమ్మ దంపతులకు రాచమల్లు ద్రశేఖర్రెడ్డి(26),శివానందరెడ్డి(24) సంతానం. చంద్రశేఖర్రెడ్డి తల్లిదండ్రులతో కలసి వ్యవసాయం చేస్తుండగా శివానందరెడ్డి గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగా, త్వరలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే బుధవారం గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో బాట సుంకులమ్మ జాతరకు శివానందరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి వచ్చారు. జాతరలో భోజనం చేసుకొని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎంగిలిబండ శివారులో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఓ కారు అదుపుతప్పి నేరుగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న రంగనాథ, చంద్రశేఖర్, రేణుక, శాంతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. బొలెరో వాహనంలో చంద్రశేఖర్రెడ్డి, శివానందరెడ్డిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలిని సీఐ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఎంత పనిచేశావు దేవుడా.. ప్రమాద విషయం తెలుసుకున్న రామసుబ్బారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలు కలసిమెలసి తిరుగుతుంటే ఎంతో సంతోషం చేవాడిని, అంతలోనే ఇంత పెద్ద శిక్ష వేశావు కదా దేవుడా అంటూ రోదించారు. తల్లి ఉమామహేశ్వరమ్మకు కుమారులు మృతి చెందిన విషయం చెప్పలేదని వారి బంధువులు తెలిపారు. -
బరితెగించిన ‘భాష్యం’!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే బడికి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అనుమతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పిల్లల నిర్బంధం పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు. తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాల ఇన్చార్జ్ అనిల్కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డారు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
-
సీఎం వైఎస్ జగన్ పై అనంతపురం NRIలు గొప్ప మాటలు
-
సీఎం జగన్ సమక్షంలో కీలక నేతలు చేరిక
-
బస్సు యాత్రకు బ్రహ్మరథం.. ఉప్పెనలా కదిలి వచ్చి..(ఫొటోలు)
-
బంగారంకోసం వృద్ధురాలి దారుణ హత్య
-
అనంతపురంలో దుమ్ము రేపుతున్న ఎంపీ,ఎమ్మెల్యే క్యాంపెయిన్
-
అనంతపురంలో చంద్రబాబుకు బిగ్ షాక్
-
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్లర్లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
లోకేష్ కు చేదు అనుభవం..
-
అనంతపురంలో ప్రజా ప్రస్థానం కార్యక్రమం
-
డబ్బు పంపిణి చేస్తూ అడ్డంగా దొరికిన టీడీపీ...సాక్షి చేతిలో సంచలనం వీడియో
-
YS Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
-
బాధితుల వినతులు స్వీకరించిన సీఎం జగన్.. వెంటనే పరిష్కారం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో భాగంగా రాప్తాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఇద్దరు బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. కమలానగర్కు చెందిన పర్లపాటి సుజాత 1. అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్కు చెందిన రాచూరి ఝాన్సీకి లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్న డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి 2. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్కు చెందిన రాచూరి ఝాన్సీ మాట్లాడుతూ తాను వికలాంగురాలినని, తనుకు ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్ను అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు రాచూరి ఝాన్సీకి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'సీమ'లో జనసముద్రం
అనంతపురం: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్ జగన్ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175, 25 లోక్సభ స్థానాల్లో 25 గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లక్షలాది జనం బ్రహ్మరథం పట్టారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల నుంచి వేలాది వాహనాల్లో ప్రజలు తరలివచ్చారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇంకా లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్– బెంగళూరు, అనంతపురం–చెన్నై జాతీయ రహదారులపై ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిలో ఎస్కే యూనివర్సిటీ దాటి సంజీవపురం వరకు 12 కిలోమీటర్ల పొడవునా, ఇటు రాప్తాడు వైపు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరూరు టోల్గేట్, మరో వైపు రాప్తాడు నుంచి అనంతపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణంలో ఎన్ని లక్షల మంది ఉంటారో.. ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వారు అంతకు మించే ఉన్నారని అనంతపురం నగరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ‘సిద్ధం’ అని నినదించిన లక్షలాది గొంతులు దుష్ట చతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్ చేసిన రణ గర్జనకు ..‘సిద్ధం’ అంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్కచేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది. పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? అని అడిగిన ప్రశ్నలకు.. లక్షలాది మంది టార్చ్ ఆన్ చేసిన మొబైల్ ఫోన్లను చేత్తో పట్టుకుని చూపుతూ ప్రతిస్పందించారు. ‘రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే. గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలి’ అన్నప్పుడు లక్షలాది గొంతులు ‘అవును.. అవును..’ అంటూ నినదించాయి. పోటెత్తిన రైతన్నలు రాప్తాడు సిద్ధం సభకు హాజరైన వారిలో అత్యధికులు అన్నదాతలే ఉండడం గమనార్హం. రాయలసీమ వ్యవసాయాధారిత ప్రాంతం. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు, రైతు సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన అన్నదాతలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ సభకు ఇంత భారీ స్థాయిలో తరలి వచ్చారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకుంటేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆకాంక్షిస్తున్నారు. సీఎం జగన్ రైతు బాంధవుడిగా ఉంటారనే నమ్మకంతోనే అన్నదాతలు వైఎస్సార్సీపీ పక్షాన నిలబడుతున్నారు. ఈ సభకు యువతతో పాటు మహిళలు, వృద్ధులు సైతం తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నంత సేపు వాహనాల్లో జనం వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రాంగణానికి చేరుకోలేక పెద్ద సంఖ్యలో మధ్యలో నిలిచి పోయిన వారు తమ సెల్ ఫోన్లలో లైవ్ చూస్తూ ఆనందించారు. జగనన్నను గెలిపించేందుకు సిద్ధం ఎన్నడూ చూడనివిధంగా జగనన్న సైనికులు ‘సిద్ధం’ సభకు తరలివచ్చారు. సీఎం జగన్కు అండగా ఉండేందుకు సిద్ధమని నినదించారు. ఆయన ముఖ్యమంత్రయ్యాక బడుగు, బలహీన వర్గాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అణగారిన వర్గాలకు నేరుగా లబ్ధి కల్పించిన ఏకైక ప్రభుత్వం జగనన్నదే. రూ.2.55 లక్షల కోట్లు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. –అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ప్రభంజనం అంటే ఇదే ప్రభంజనం అంటే ఇలాగే ఉంటుంది. ఎల్లో మీడియా కూటమి విషప్రచారం చేస్తున్నా.. గొప్ప నాయకుడిని మాత్రం చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాలన్నీ జగనన్న దెబ్బకు మంచుకొండల్లా కరిగిపోతాయి. రానున్న ఎన్నికల కోసం కౌరవులందరూ గుంపులుగా వస్తుంటే జగనన్న మాత్రం సింగిల్గా వస్తున్నారు. – ఉషశ్రీ చరణ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి దేశానికి రోల్ మోడల్ జగన్ ప్రజావసరాలను గుర్తించి పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన దేశానికి రోల్ మోడల్. రాబోయే కురుక్షేత్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సిద్ధం సభలతో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఏంటో అందరికీ తెలిసింది. –కొరుముట్ల శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే మీ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం బ్రిటీష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడు సీమబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎట్టా ఉంటాడో తెలుసా.. ఇట్టా ఉంటాడు! (సీఎంను చూపుతూ).. దాతృత్వంలో బుడ్డా వెంగల్రెడ్డి, రాజసంలో రాజశేఖరరెడ్డి, పౌరుషంలో సైరా నరసింహారెడ్డికి ప్రతీక మన జగన్మోహన్రెడ్డి. 21 ఏళ్ల టీడీపీ పాలనలో ఈ ప్రాంతం వందేళ్లకు సరిపడా విషాదం చూసింది. ఫ్యాక్షన్ హత్యలు, రైతుల ఆత్మహత్యలు, కరువు కాటకాలు, వలసలతో గ్రామాలు నిర్మానుష్యమయ్యాయి. జగన్ సీఎంగా వచ్చిన క్షణం నుంచి నేటి వరకు ఫ్యాక్షన్ హత్యలు లేవు. రైతు ఆత్మహత్యలు, కరువు కాటకాలు, వలసలు అసలే లేవు. ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చిన జగన్కు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. ‘పచ్చ’రాజ్యంలో కాళ్లు పట్టుకుంటే తప్ప పథకాలు వచ్చేవి కాదు. ఈ రోజు ఇంటికే పథకాలు వస్తున్నాయి, జగనన్న అండతో రాయలసీమ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. నిన్నే నమ్ముకున్న రాయలసీమ బిడ్డలంతా నీ అడుగులో అడుగు వేసేందుకు సిద్ధం. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఈ ప్రాంతంలో తెగిన స్త్రీల తాళిబొట్లను, రైతులకు జరిగిన అన్యాయం, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకోవాలి. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంటికీ మేలు చేశారు. అందుకే ధైర్యంగా జనాల్లో తిరుగుతున్నాం. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులతో యుద్ధానికి కార్యకర్తలంతా సిద్ధమా? – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే, రాప్తాడు జగన్ సత్తా చాటిన సిద్ధం సభ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత భారీగా సభ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. పేదల జీవితాలను మార్చగలిగే కలియుగ బ్రహ్మ వైఎస్ జగన్. అంబేడ్కర్ కలలను ఆయన నిజం చేశారు. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చారు. ప్రజాభిమానంతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ గెలిచితీరుతుంది. –బీవై రామయ్య, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నిరుపేదలను గుండెల్లో పెట్టుకున్న జగన్ నిరుపేదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం చేశారు. రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. అలాంటి జగనన్నకు రెండు చేతులు పైకెత్తి దండం పెట్టడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.–పైలా నరసింహయ్య, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు 2.30లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖలో కూడా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – అమర్నాథ్ రెడ్డి, తాడిపల్లి గ్రామం, వైఎస్సార్ జిల్లా బాబు మళ్లీ వస్తే అవినీతి తప్పదు ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా మన ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మధ్యవర్తులు లేని ప్రజా పాలన సాగిస్తున్నారు. లంచాలకు, అవినీతికి తావు లేదు. చంద్రబాబు పొరపాటున వస్తే అవినీతికి ద్వారాలు తెరిచినట్టే. – జయమ్మ, ఎర్రవంకపల్లి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా చంద్రబాబు హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గతంలో 600 అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేశాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేస్తోంది. – అమరావతి, అనంతపురం రుణమాఫీతో మహిళలకు చేయూత ఎన్నికల సమయంలో ఇచి్చన హామీ మేరకు విడతల వారీగా స్వయం సహాయక సంఘాల మహిళల రుణాలను సీఎం వైఎస్ జగన్ మాఫీ చేశారు. ఒక్కో మహిళకు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు రుణమాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ఆరి్థకసాయం అందించి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పేరుతో మహిళలను మోసం చేశారు. మళ్లీ ఆయన మాయలో పడేది లేదు. – జయమ్మ, రాంపురం, అనంతపురం జిల్లా జగన్ సీఎం అయితేనే పథకాల అమలు పేదలు ఆరి్థకంగా అభివృద్ధి చెందాలనే గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయన మళ్లీ సీఎం అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. పేదల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడతాయి. సంక్షేమ పథకాలు ఆగకూడదని సీఎం మాటగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఇదే చెబుతాం. – విశ్వనాథ్, వానవోలు, శ్రీసత్యసాయి జిల్లా జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి ఉదయించే సూర్యుడు లాంటివాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జన సంక్షేమం కోసం పాటుపడుతున్న ఆయనపై బురద చల్లాలనుకోవడం అవివేకమే. చంద్రబాబు, పవన్లను ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి తగిన బుద్ధి చెబుతాం. జనరంజక పాలన సాగించే జగన్నే మళ్లీ సీఎంను చేసుకుంటాం. – శ్రీనివాసులు, గాజులపల్లి, నంద్యాల జిల్లా కరువు, చంద్రబాబు కవలలు కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలు. ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటే కరువు విలయతాండవం చేస్తుంది. గ్రామాల్లో తాగేందుకు చుక్కనీరు కూడా దొరకదు. ఆయన కుమారుడు యువగళం పేరుతో పాదయాత్ర చేసినందుకు మా జిల్లాలో వర్షాలు కూడా రాకుండా అటే వెళ్లిపోయాయి. మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవడమంటే కరువు తెచ్చుకున్నట్లే అవుతుంది. – రవీంద్రారెడ్డి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా మా పాలిట దేవుడు జగన్ మా లాంటి నిరుపేదలకు వలంటీర్గా ఉద్యోగం ఇచ్చి జగనన్న దేవుడయ్యాడు. ఉద్యోగాలు లేక ఇంటి పట్టున ఉండేవాళ్లం. వలంటీర్ ఉద్యోగం వచ్చాక సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటి దగ్గరకు తీసుకెళ్లి అందిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని దేవుళ్లలా భావిస్తున్నారు. జగనన్న మేలు మరచిపోలేం. – రామాంజనేయులు, కౌతాళం గ్రామం, కర్నూలు జిల్లా అభివృద్ధి, సంక్షేమం జగన్తోనే సాధ్యం విద్య, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక తదితర రంగాల్లో అభివృద్ధితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడం ఎంతో అవసరం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేను మేలు చేశానని భావిస్తేనే ఓటు వేయండి అని అడుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. – పార్వతి, రుద్రంపేట, అనంతపురం. ఇంతటి అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే రోగులు భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో ఆస్పత్రులు నాడు–నేడు ద్వారా అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఆధునికంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ఈ మార్పు కనిపిస్తోంది. ఖరీదైన ఎంఆర్ఐ, సీటీస్కాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ యూనిట్లను పునరుద్ధరించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్తో సరిపోయింది. మిగిలిన తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. – శివకృష్ణ, వైద్యాధికారి, రాప్తాడు, అనంతపురం జిల్లా పేదలంటే బాబు దృష్టిలో కూలీలు పేదలంటే పెత్తందార్ల ఇళ్లలో పనిచేసే కూలీలుగా చంద్రబాబు భావించేవారు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి.. గెలిచిన తర్వాత పక్కన పెట్టేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతే రాజయ్యాడు. ఏటా పెట్టుబడి రాయితీ, విత్తనాలు, ఎరువులు రైతుల వద్దకే చేరుతున్నాయి. మనసున్న ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు అందుకున్నారు. – మల్లిరెడ్డి, పత్తికోట, అన్నమయ్య జిల్లా బాబు పాలనలో నరకం చూశాం చంద్రబాబు పాలనలో నరకం చూశాం. వర్షాలు కురవక, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. తినేందుకు తిండి లేక వలసలు వెళ్లాల్సి వచ్చేది. మూగ జీవాలకు మేత దొరక్క వాటిని కూడా అమ్ముకున్నాం. జగన్ ముఖ్యమంత్రి కాగానే రాజన్న పాలన మళ్లీ ప్రారంభమైంది. రైతులకు మంచిరోజులు వచ్చాయి. కడుపునకు అన్నం తినే ఎవడూ చంద్రబాబుకు ఓటు వేయరు. – జయరామిరెడ్డి, రైతు, బుక్కచెర్ల, అనంతపురం జిల్లా జిత్తులమారి పొత్తులను తిప్పికొడతాం ప్రతిపక్షాలు నక్క జిత్తుల పొత్తులతో జగన్ను గద్దె దింపాలని చూస్తున్నాయి. సీఎం జగన్ తన ప్రసంగంతో ఇ చ్చిన స్ఫూర్తితో పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో గ్రామాల్లో ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాం. జగనన్నను గెలిపించుకుంటాం. – సుప్రజ, అనంతపురం నా తొలి ఓటు జగనన్నకే నేను అనంతపురంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. తొలిసారి ఓటు హక్కు పొందా. నా తొలి ఓటు జగనన్నకే వేస్తాను. జగన్మోహన్ రెడ్డిని చూడాలనే మా ఊరోళ్లతో కలిసి సభకు వచ్చాను. నాలాంటి వారి చదువులకు సీఎం జగన్ ఎంతో సాయం అందిస్తున్నారు. అందుకే మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. – మేఘనాథ్రెడ్డి, పైలబోయినపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ రాష్ట్రంలో అర్హులైన 33 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు అందించలేదు. – అబ్దుల్లా, బస్తిపాడు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా జగనన్నపై నమ్మకం పెరిగింది సీఎం వైఎస్ జగన్ ప్రసంగం విన్నాక రాష్ట్రంలో 175కు 175 స్థానాలు వైఎస్సార్ సీపీ సాధిస్తుందన్న నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. పార్టీ విజయం కోసం మరింతగా పని చేయాలన్న సంకల్పం మా అందరికీ కలిగింది. మేమంతా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం సిద్ధంగా ఉన్నాం. – చంద్రకళాబాయి, కర్నూలు మహిళలంతా జగనన్న వెంటే సీఎం జగన్ వస్తున్నారంటే మా మహిళలంతా స్వచ్ఛందంగా తరలివచ్చాం. మహిళలను తన అక్క, చెల్లెమ్మల్లా భావించి ఎన్నో పథకాలు అందిస్తున్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి. ఇదే విషయాన్ని ఊరెళ్లాక అందరికీ చెబుతాను. – వై.హేమలత, రామినేపల్లి, అనంతపురం జిల్లా ఈ యుద్ధంలో జగన్దే గెలుపు విపక్షాలు ఎన్ని పన్నాగాలు పన్నినా అర్జునుడిలా పోరాడి రానున్న ఎన్నికల రణరంగంలో విజేతగా నిలుస్తానని వైఎస్ జగన్ చేసిన ప్రకటన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఎన్నికల రణరంగంలో జగన్ విజేతగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. – జగదీశ్వర్ రెడ్డి, చిన్నకులాల గ్రామం, వైఎస్సార్ జిల్లా -
ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్లో ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సోషల్ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ను వైఎస్సార్సీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్బుక్, ట్విట్టర్ నిండిపోయింది. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది. రాప్తాడు సభ సముద్రాన్ని తలపించింది. సభకు లాక్షలాదిగా సీఎం జగన్ సైన్యం తరలివచ్చింది. సీఎం జగన్ ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. ఎంతమంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే తన పొత్తు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్ధిదారులే తనకు ఓటు వేయిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్లు -
నవ చరిత్రకు రాప్తాడు ‘సిద్ధం’
సాక్షి, అమరావతి/రాప్తాడు: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఓ వైపు ప్రజాబలమే గీటు రాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరో వైపు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 65 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలిలో గత నెల 27న, ఉత్తర కోస్తా ప్రాంతానికి సంబంధించి ఈనెల 3న ఏలూరులో ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించారు. భీమిలి సభకు సముద్రపు కెరటాలతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం పోటెత్తితే.. ఏలూరు సభకు ఉత్తర కోస్తా ప్రజలు కడలిలా కదలివచ్చారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా మూడో సభను ఆదివారం అనంతపురానికి సమీపంలో రాప్తాడు వద్ద నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని 50 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. పొత్తులు తేలక ప్రతిపక్ష పార్టీల సభలు వెలవెలబోతున్నాయి. సీఎం సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సభకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి శనివారం పరిశీలించారు. సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుందని, రాయలసీమలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి వేర్వేరుగా ఈ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారే తప్ప తాము రాష్ట్రానికి ఇది చేశామని చెప్పుకోలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమీ ఉండబోదని తేల్చిచెప్పారు. మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ప్రజలందరూ జగనన్నకు తోడుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉరవకొండ, శింగనమల సమన్వయకర్తలు విశ్వేశ్వర రెడ్డి, వీరాంజనేయులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల తదితరులు పాల్గొన్నారు. -
రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై ఎలాంటి హత్య కేసులు లేవని.. రఘువీరారెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. తనపై హత్య కేసులున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ రాప్తాడు సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అన్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాప్తాడు సభలో పాల్గొంటాయి. మధ్యాహ్నం 1 గంటకు రాప్తాడు ‘సిద్ధం’ సభ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని -
Anantapur: పేలిన గ్యాస్ సిలిండర్
-
తిరుపతిలో YSRCP ప్రాంతీయ కేడర్ సన్నాహక సమావేశం
-
అనంతపురంలో గ్యాస్ సిలిండర్ పేలుడు
-
సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్యే అనంత
-
సీనియర్లకు దిక్కేది?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసలే వర్గపోరుతో గందరగోళంగా ఉన్న పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, చివరి నిమిషం వరకూ ‘నీకే టికెట్’ అంటూ పలువురికి అధిష్టానం చెప్పడం నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓటికుండగా మారింది. చంద్రబాబును నమ్ముకున్న సీనియర్ నాయకులు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన జితేందర్గౌడ్కు టికెట్ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు. పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. జేసీ కుటుంబానికి కొమ్ములొచ్చాయా? నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్రెడ్డి వర్గానికి ఏమైనా కొమ్ములొచ్చాయా అంటూ కొంతమంది నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు అస్మిత్రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్రెడ్డి కొడుకు పవన్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పవన్కు టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న బాబు.. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది. బీసీ వర్గాల్లో అసమ్మతి రాగాలు బోయ, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం జిల్లాలో ఎక్కువ. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో హిందూపురం ఎంపీగా గెలిచిన నిమ్మల కిష్టప్ప తనను పక్కన పెట్టారని టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అవసరమైనప్పుడు వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా అంటున్నట్టు సమాచారం. నిమ్మల, బీకే పార్థసారథి, జితేందర్గౌడ్ వంటి బీసీ నేతలతోపాటు శింగనమల, మడకశిర నియోజకవర్గాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేతలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు అధికార పక్షం దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దూసుకెళుతుండగా.. ఇప్పటివరకు చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు శనివారం ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాం: సీఎం జగన్
అనంతపురం, సాక్షి: మహిళా సాధికారత సాధన.. సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారాయన. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం. నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం. దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. .. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 56 నెల్లలో ప్రతి అడుగూ మీ బిడ్డ ప్రభుత్వం వేసింది. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. అర్హత కేవలం అదే.. ఈరోజు రూ.6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ ఒక్క పథకానికి(వైఎస్సార్ ఆసరా) సంబంధించి 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పోతోంది. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద 4968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. వాళ్ల కాళ్ల మీద నిలబెట్టడం కోసం వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే 31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ. 6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు. ఎక్కడా ఎవరూ ఎవరికి ఇస్తున్నాం అనేది వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు. ఈరోజు 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి పోతోంది. ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికిచ్చిన సొమ్ము రూ.26.67 వేల కోట్లు. వైయస్సార్ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు. 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5-20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2-3 లక్షల కోట్లు. అవ్వా.. బాగున్నావా? అంటూ.. అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇచ్చినది రూ.4,968 కోట్లు. 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275 కోట్లు ఇచ్చాం. కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2.28 వేల కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. పేదల పెన్షన్ అందుకుంటున్న వారు 66.34 లక్షల మంది. ఇందులో 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా అని అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారంటే ఇది జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశాం. జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, పట్టించుకున్నదిగానీ ఎప్పుడైనా చూశామా?. గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే.అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నా. కారణం ఒక్కటే.గతంలో దోచుకో, పంచుకో, తినుకో. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. దేశం మొత్తం వినిపించాలి.. వచ్చే 14 రోజులపాటు ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6,400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. చంద్రబాబు చేసిన మోసం గుర్తుంది కదా? 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపెడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25500 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో 19 శాతానికి పడిపోయాయి. కానీ, ఇవాళ.. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్లో సంఘాలు ఉన్నాయి.ఔట్ స్టాండింగ్ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలు ఎన్పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే. సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. నామినేషన్ పనుల్లో ఇచ్చే కాంట్రాక్ట్ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. భద్రత విషయంలోనూ.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ నియమితులయ్యారు. దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఎస్వోఎస్ బటన్ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే అని సీఎం జగన్ ప్రసంగించారు. ఇదీ చదవండి: రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. బాబుకు ప్రచారం: సీఎం జగన్ ఫైర్ -
గతంలో దోచుకో.. పంచుకో.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్
-
డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్
-
ఉరవకొండలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన
-
YSR ఆసరా పథకం ద్వారా 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి
-
ప్రధాని దర్శించుకున్న వీరభద్రస్వామి ఆలయం ఇదే
-
ప్రజలకు ఆరోగ్య భారం తగ్గింది..!
-
జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రశంసలు
-
జగనన్న ఆరోగ్య సురక్షపై డాక్టర్ల గొప్ప మాటలు
-
‘అనంత’ ప్రభంజనం
అనంతపురం: 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో కేవలం నినాదంగా మాత్రమే ఉన్న ‘సామాజిక సాధికారత’ను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆచరణలో పెట్టి చూపించారని వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. సామాజిక సాధికారత తమ నినాదం కాదు విధానమని నిరూపించారని ప్రశంసించారు. రాజ్యాధికార పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అనంతపురం నగరంలో శుక్రవారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దీంతో సభాప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు చంద్రబాబుకు అధికారంలో ఉంటే అగ్రకులాలు, అధికారంలో లేకపోతే వెనుకబడిన కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. సామాజిక విప్లవ సృష్టికర్త జగనన్న దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక విప్లవాన్ని సృష్టించారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ విధానమని నిరూపించారన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటే నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలవారేనని గుర్తు చేశారు. గతంలో ఇంతటి గౌరవం ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకుందామని పిలుపునిచ్చారు. బలహీనవర్గాలకే సింహభాగం పథకాలు సీఎం వైఎస్ జగన్ పాలనలో సింహభాగం సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందుతున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. కలగా మారిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన అభినవ అంబేడ్కర్, అభినవ పూలే.. వైఎస్ జగన్ అని కొనియాడారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనన్నారు. ఆయా వర్గాల్లో చర్చ జరగాలి గతంలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు జరిగిందనే విషయంపై ఆయా వర్గాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ ఊదరగొట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ వర్గాలకు ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు తన ప్రభుత్వం కమ్మలకు 8, రెడ్లకు 6, కాపులకు 4, బీసీలకు 3, ఎస్సీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారని, మైనార్టీ, గిరిజనులకు అసలే ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ జగన్ కేబినెట్లోని 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని గుర్తు చేశారు. బాబును జీవితంలో నమ్మకూడదు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలకు ఆయనను జీవితంలో నమ్మకూడదని సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని తెలిపారు. మాటతప్పని, మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారన్నారు. పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.45 లక్షల కోట్లు జమ చేశారన్నారు. అందులో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందిందని జూపూడి అన్నారు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక సాధికారతను కల్పించారన్నారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి పేదల ఆర్థిక స్థితిగతులను మార్చేశారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ చొరవతో అనంతపురం నియోజకవర్గంలో రూ.800 కోట్లతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. -
అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర