murder case
-
చేసింది నలుగురు.. సహకరించింది ఆరుగురు
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజ లింగమూర్తి హత్య కేసు మిస్టరీ నేటితో వీడనుంది. బుధవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురి కాగా, పోలీసులు మూడు రోజుల పాటు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు సమాచారం. వి శ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూరి్త(49) ఈ నెల 19న రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు మూడు రోజులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు పాల్పడింది, సహకరిచింది ఎవరనేది సాక్ష్యాధారాలతో నిర్ధారించుకున్నట్లు సమాచారం.మారణాయుధాలను చెరువులో పడేసి తప్పించుకునే యత్నం.. ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురు రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. రెడ్డికాలనీ మలుపు వద్ద హత్య చేసిన తర్వాత ఒక కత్తిని అక్కడే విసిరి, మరో కత్తి, రాడ్డు, రాయిని తమ వెంట ఆటోలో తీసుకెళ్లి భూపాలపల్లి మండలం కొంపె ల్లి చెరువులో పడేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు పట్టుకుని పూర్తి స్థాయిలో విచారించగా.. రాజలింగమూర్తి రాకపోకల సమాచారం ఇవ్వడం, నిందితులను తప్పించేందుకు సహకారం అందించామని ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో కొత్త హరిబాబు ? నిందితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నిందితులు.. హరిబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించి హైదరాబాద్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని శనివారం రాత్రి భూపాలపల్లికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య కేసులో సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నేడు నిందితుల అరెస్ట్ చూపించనున్న పోలీసులు.. రాజలింగమూర్తి హత్య కేసులో 8 మంది నిందితులను నేడు(ఆదివారం) ఉదయం 8.30 గంటలకు అరెస్ట్ చూపించనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి హత్య కేసు వివరాలు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించనున్నారు.హత్యకు పాల్పడింది నలుగురు.. భూపాలపల్లి పీఎస్ ఎదుట గల సర్వే నంబర్ 319లోని భూమికి సంబంధించి తలెత్తిన వివా దంతోనే రాజలింగమూర్తిని ప్రత్యర్థులు హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హత్యకు పాల్పడిన రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమాంత్(బబ్లూ), మోరె కుమార్, కొ త్తూరి కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1, ఏ–2, ఏ–3, ఏ–4 గా చేర్చినట్లు సమాచారం. -
రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులు ఎందరు..?
భూపాలపల్లి : దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. హత్యకు పాల్పడింది ప్రత్యక్షంగా నలుగురే అయినప్పటికి ఆర్థికంగా, పరోక్షంగా పలువురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు తొలుత ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఏ–1 రేణుకుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి శ్రీమాంత్(బబ్లూ)లను హత్య జరిగిన రోజే అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కుమార్ పట్టుకున్నారు. ఏ–5 రేణుకుంట్ల కొమురయ్యతోపాటు నిందితులకు కారు ఏర్పాటు చేసి, డ్రైవింగ్ చేసిన పట్టణంలోని సుభాష్కాలనీకి చెందిన ఓ డ్రైవర్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా, అనుమానితులైన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హరిబాబు హస్తం ఉందా..? రాజలింగమూర్తి హత్య కేసులో భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం నిందితులు.. ఓ వ్యక్తిని ఫోన్ అడిగి తీసుకొని హరిబాబుకు కాల్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు హరిబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి రెడ్డికాలనీలోని ఆయన ఇంటికి వెళ్లగా అందుబాటులో లేనట్లుగా తెలిసింది. మరో వ్యక్తి ఆర్థిక సహకారం.. రాజలింగమూర్తి హత్యకు మరో వ్యక్తి ఆర్థికంగా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమి తనదేనంటూ కోర్టుకు వెళ్లిన ఒకరు ఆర్థికంగా నిందితులకు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతను కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి అరెస్ట్..రాజలింగమూర్తి హత్య కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితులు ఎంతమంది ఉన్నారన్నది గుర్తించాక, ఆధారాలతో రేపు(ఆదివారం), లేదా సోమవారం అరెస్ట్ చూపించనున్నట్లు తెలుస్తోంది. -
ఇల్లరికం అల్లుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్కు చెందిన రమేశ్కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది. ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
యూ బెగ్గర్ అంటూ.. తాత అవమానించాడు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దనరావు(Industrialist Janardhan Rao) హత్యకేసులో నిందితుడు, ఆయన మనవడు కిలారు కీర్తితేజ(Keerthi Teja) నాలుగు రోజుల (Police custody) సోమవారం ముగిసింది. కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్రావు అవమానించేవాడని.. అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ వెల్లడించాడు. ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. సీఐ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.ప్రతీరోజూ తనను బెగ్గర్ అంటూ సంబోధించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. -
దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో తొలి నుంచి నిందితుడి (ఏ–4)గా పేర్కొన్న దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణా సంస్థతోపాటు దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను అప్రూవర్గా మారినందున తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు.సీబీఐ కూడా దీనికి అనుకూలంగా వాదనలు వినిపించడంతో న్యాయస్థానం దస్తగిరిని సాక్షిగా పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాడియా హాజరై సమయం కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ల వాదన ఇదీ... ‘సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం సరికాదు. 2021, అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన చార్జ్షిట్ దస్తగిరిని నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత వేసిన రెండు మధ్యంతర చార్జ్షీట్లలోనూ దస్తగిరి పేరును తొలగించలేదు. 2022, ఫిబ్రవరి 21న సెక్షన్ 306(4)(ఏ) కింద అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా చార్జ్షిట్లో అతని పేరు తీసివేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన (కాగ్నిజెన్స్) తర్వాత.. ఇదే కోర్టు పునః సమీక్షించజాలదు.క్రిమినల్ ప్రొసిజర్ కోడ్లో అలాంటి నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం చెల్లదు. ఒకసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరుకానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’ అని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. -
వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
కరీంనగర్రూరల్: వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో కరీంనగర్ శివారు బొమ్మకల్లో ఆదివారం రాత్రి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. బొమ్మకల్కు చెందిన బెజ్జంకి మహేశ్(22) ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. కొంతకాలం నుంచి కాల్వ సతీశ్కు ఓ మహిళతో ఉన్న సంబంధం వ్యవహారంలో మహేశ్తో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం సమీపంలో సతీశ్తో ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ వ్యక్తిని మహేశ్ కోరాడు. దీంతో సదరు వ్యక్తి వెంటనే కాల్వ సతీశ్ను అక్కడికి పిలిపించారు. ముగ్గురు కలిసి మద్యం తాగుతుండగా.. కాల్వ సతీశ్, బెజ్జంకి మహేశ్ల మధ్య వివాదమేర్పడింది. ఈక్రమంలో సతీశ్ బీరు సీసాను పగలగొట్టి మహేశ్ గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న రూరల్ ఏఎస్పీ శివం ప్రకాశ్, సీఐ ప్రదీప్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. స్థానికులను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం కోసం మహేశ్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
శిల్పీ–గౌతమ్ హత్య
1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు. ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది. కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు. శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్ను అనుమానితుడిగా గుర్తించారు. దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. -
వీడని యువతి హత్య మిస్టరీ
గంగాధర(చొప్పదండి): మంచిర్యాల జిల్లాలో అదృశ్యమై, కరీంనగర్ జిల్లాలో శవమై కనిపించిన యువతి హత్య మిస్టరీ వీడటం లేదు. గంగాధర పోలీస్స్టేషన్లో సోమవారం గుర్తు తెలియని యువతి హత్య కేసు నమోదవగా మృతురాలి కుటుంబ వివరాలు మంగళవారం సాయంత్రం తెలిశాయి. అయితే, ఆమెను ఎవరు తీసుకెళ్లారు.. ఎక్కడ హత్య చేశారు, ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కుమారుడి జాడ తెలియలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండే మమత కాసిపేటకు చెందిన భరత్ను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా, మమత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి మంచిర్యాల వచ్చి, తెలిసినవారి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 25న సాయంత్రం నూనె ప్యాకెట్ తీసుకువస్తానని కుమారుడితో కలిసి బయటకు వచ్చింది. ఆమె కారు ఎక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం కొండన్నపల్లి బస్టాండ్ సమీపంలోని మామిడితోట వద్ద రోడ్డు పక్కన మమత శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఫొటోతో అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. మంచిర్యాలలో ఉండే ఆమె కుటుంబసభ్యులు గుర్తించి, మంగళవారం సాయంత్రం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు వారికి అప్పగించారు. మమత హత్యపై, ఆమె కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతురాలు ఎక్కిన కారు ఎవరిది, అందులో ఉన్నది ఎవరు, ఎటు తీసుకెళ్లారు అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే హత్య మిస్టరీ వీడుతుందని ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. -
మీర్పేట మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మీర్పేట వెంకట మాధవి హత్య కేసులో ఎట్టకేలకు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు.. మధ్యాహ్నాం అరెస్టును ధృవీకరించారు. అంతకు ముందు.. మాధవి కనిపించకుండా పోయిందన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చారు. సాయంత్రం నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. ఆమెను హతమార్చాక.. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ప్రేరణతో మృతదేహాన్ని మాయం చేశాడు గురుమూర్తి. ఆ తర్వాత కూడా సినిమా టికెట్లు బుక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రకరకాల ప్రచారాలు మీడియాలో జరగ్గా.. సాయంత్రం ప్రెస్మీట్లో పోలీసులు ఆ విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.భార్య మాధవితో గొడవ పడి ఆమెను హతమార్చి.. ఆపై మృతదేహాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు గురుమూర్తి. ఆపై ఆ మాంసాన్ని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్పై కాల్చాడు. చివరకు ఎముకల్ని పొడి చేసి చెరువులో కలిపాడు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే!..
సాక్షి ప్రతినిధి కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉద్యోగులను మార్చడంలో భాగంగానే ఈరన్న హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆశించి నియోజకవర్గ టీడీపీ కీలక నేతకు డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను హత్య చేసినట్టు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్గా 2019 నుంచి ఈరన్న కొనసాగుతున్నాడు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్గా తప్పించాలని టీడీపీ నేతలు భావించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరు ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ దుకాణాలతో పాటు ఇతర పోస్టుల్లో లంచాలు తీసుకుని నియమింపచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నియోజకవర్గ నేతకు రూ.3 లక్షలు లంచమిచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో తనను నియమించాలని కోరాడు. దీంతో ఆ నేత ఈరన్నను తప్పుకోవాలని రెండు నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించేలా గ్రామస్తులు, పంచాయతీ తీర్మానం చేసినట్టు సర్పంచ్ లేఖ ఇవ్వాలి.కాగా.. గ్రామ సర్పంచ్ నాగరాజుకు, నియోజకవర్గ టీడీపీ నేత మధ్య విభేదాలున్నాయి. దీంతో సర్పంచ్ లేఖ ఇవ్వలేదు. టీడీపీ కీలక నేత ఈరన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను మట్టుపెడితే తప్ప తనకు పోస్టు రాదని భావించి అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మరోవైపు రాజీనామాకు సిద్ధపడిన ఈరన్నకు ఈ నెలాఖరు వరకూ విధులు నిర్వర్తిస్తేనే జనవరి వేతనం వస్తుందని అధికారులు చెప్పారు.దీంతో నెలాఖరు వరకూ పనిచేసి రాజీనామా చేయాలని ఈరన్న నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉపాధి హామీ పనుల నుంచి వస్తున్న ఈరన్నను కొందరు దారిలో ఆపి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా హత్య చేశారు. ఈరన్నను గ్రామానికి చెందిన గాదె లింగప్ప, గోవర్ధన్, గోపి, రామదాసు మరికొందరు కలిసి హతమార్చారని ఈరన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.లంచాలు తీసుకుని పోస్టుల్లో నియామకంటీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లంచాలు తీసుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఈ నెల 18న ఆరోపణలు చేశారు. ఇది జరిగిన వారానికే లంచాలతో పోస్టు మార్పునకు సిద్ధపడిన టీడీపీ నేత వల్ల హత్య జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పి.కోటకొండ ఫీల్డ్ అసిస్టెంట్ను మార్చి మరొకరిని నియమించేందుకు నియోజకవర్గ కీలక నేత రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేందుకు లేఖలు ఇవ్వగా.. ఇప్పటివరకు 11 మందిని మార్చినట్టు తెలుస్తోంది. -
మీర్పేట్ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన మీర్పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్ఎస్(BNS) 101 సెక్షన్ పెట్టారు.క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్ల్యాబ్కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితో మాధవి డీఎన్ఏ మ్యాచింగ్ కోసమే ఫోరెన్సిక్ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్ఏ నివేదిక చేరనుంది. డీఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్గా మారింది. డీఎన్ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. -
బియ్యం కోసం తల్లి హత్య
భువనేశ్వర్:పది కేజీల బియ్యం కోసం జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. అది కూడా కన్నకొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపే దాకా వెళ్లింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని శరత్చంద్రాపూర్లో జరిగింది. అన్నదమ్ములైన రోహిదాస్,లక్ష్మికాంత్సింగ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రోహిదాస్ 10 కిలోల బియ్యం కోసం తల్లి రాయ్బరిసింగ్తో గొడవ పెట్టుకున్నాడు. బియ్యం ఇవ్వడానికి ఆమె తిరస్కరించడంతో గొడవ కాస్తా సీరియస్ అయి రోహిదాస్ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. గొడ్డలితో దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.అనంతరం రోహిదాస్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం..భార్యా,కుమారుడి ఆత్మహత్య -
శ్రీరాములును పైకి తెచ్చింది నేనే
సాక్షి, బళ్లారి: రాష్ట్ర బీజేపీలో, అందులోను ఉమ్మడి బళ్లారి కాషాయ దళంలో చీలికలు ప్రస్ఫుటమయ్యయి. ఒకనాటి ఆప్త మిత్రులు నేడు కత్తులు నూరడం గమనార్హం. మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మధ్య విమర్శలు తీవ్ర తరమయ్యాయి. శ్రీరాములు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, ఆయన రాజకీయంగా ఎదిగేలా చేసింది నేనే. బీజేపీ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లని, కానీ నాపై ఆరోపణలు ఎందుకు చేయాలి? ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారన్నది ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం బెంగళూరులో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కర్మ ఎవరిని వదలదని, తనను కూడా వదలదని, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని వేదాంతధోరణిలో అన్నారు. శ్రీరాములుకు బీజేపీలో ఉండడం ఇష్టం లేకపోతే ఏ నిర్ణయమైనా తీసుకోనీ, నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఢిల్లీ నాయకుల సహకారంతోనే తాను మళ్లీ బీజేపీలోకి వచ్చానన్నారు. 40 ఏళ్ల కిందట పరిస్థితి ఏమిటి? 40 సంవత్సరాల క్రితం శ్రీరాములు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆయన ఎదగడానికి తాను ఎంతో శ్రమించానని గత పరిణామాలను జనార్దనరెడ్డి ఏకరువు పెట్టారు. అప్పట్లో శ్రీరాములుపై ఓ మర్డర్ కేసు ఉండేదని, ఆయన్ను సన్మార్గంలోకి తీసుకుని వచ్చాను. ఎమ్మెల్యే, మంత్రి కావడానికి పాటుపడ్డాను. మొళకాల్మూరులో నిలబడినప్పుడు ఒక్క రోజు అయినా అక్కడ ప్రచారం చేశారా? మరి నేను అక్కడే మకాం వేసి గెలిపించలేదా అని అన్నారు. శ్రీరాములు కాంగ్రెస్లో చేరే యత్నాల్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోందని జనార్దనరెడ్డి చెప్పడం విశేషం. తాను నోరు విప్పితే విచారణ సంస్థలు వచ్చి తనిఖీ చేయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. శ్రీరాములుకు ఢిల్లీ పెద్దల పిలుపు సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి శ్రీరాములు పనిచేయకపోవడమే కారణమని పార్టీ ఇన్చార్జి రాధామోహన్దాస్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం, దీంతో శ్రీరాములు.. గాలి జనార్దనరెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీజేపీ అధిష్టానం మేలుకుంది. గురువారం బళ్లారిలో ఉన్న శ్రీరాములుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు. మాటల యుద్ధం ఆపాలని, ఢిల్లీకి వచ్చి అంతా మాట్లాడాలని సూచించారు. వచ్చే వారంలో తాను ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలను కలిసి జరిగిన వాస్తవాలను వివరిస్తానని శ్రీరాములు బదులిచ్చినట్లు సమాచారం. అలాగే పలువురు రాష్ట్ర సీనియర్లతోనూ ఫోన్ చర్చలు జరిగాయి. -
అన్నే హంతకుడు
సేలం: మేట్టుపాళయలో 2019వ సంవత్సరం పరువు హత్య కేసులో ప్రేమికుడి అన్నే హంతకుడని కోవై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. మరణశిక్ష వేసే స్థాయికి నేరం జరిగినట్టు తెలిపిన న్యాయమూర్తి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని విడుదల చేసింది. వివరాలు.. కోవై జిల్లా మేట్టుపాళయం సమీపంలోని వెల్లై పాళయం. అక్కడ ఉన్న సిరంగరాయన్ ఓడై ప్రాంతానికి చెందిన కరుప్పుసామి. ఈయన కుమారులు వినోద్ (27), కనకరాజ్ (23). వీరిద్దరు కూలీ కార్మికుడు. వీరిలో కనకరాజ్ అదే ప్రాంతానికి చెందిన వర్షిణి ప్రియా (17)ను ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన అన్న వినోద్ దళిత యువతితో ప్రేమ వదులుకోమని తమ్ముడు కనకరాజ్ను హెచ్చరించాడు. అయినప్పటికీ ప్రేమికులు ఇద్దరు 2019, జూలై 25వ తేది కలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వినోద్ ఆవేశంతో వారిద్దరిని నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడు కనకరాజ్ రక్తపు మడుగులో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కోవై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన వర్షిణి ప్రియ అదే నెల 29వ తేది మృతి చెందింది. జంటను హత్య చేసిన వినోద్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో వినోద్ సహచరులు కందవేల్, అయ్యప్పన్, చిన్నరాజ్ అనే ముగ్గురిని మేట్టుపాళయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోవై ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే న్యాయస్థానంలో జరుగుతూ వచ్చింది. ఈ కేసు తుది విచారణ గురువారం జరిగింది. మొదటి ముద్దాయి వినోద్పై నేరం నిరూపించబడిన కారణంగా అతడిని నేరస్తుడిగా న్యాయమూర్తి వివేకానంద తీర్పు ఇచ్చారు. అదే విధంగా మరణ శిక్ష విధించి స్థాయికి నేర జరిగిందని తెలిపిన న్యాయమూర్తి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని విడుదల చేశారు. వినోద్కు విధించిన శిక్ష గురించిన వివరాలను ఈ నెల 29వ తేది (బుధవారం) వెల్లడించబడుతుందని న్యాయమూర్తి తెలిపారు. -
వెంటాడి మరీ.. పట్టపగలే హనుమకొండలో దారుణం
హనుమకొండ, సాక్షి: పట్టపగలే నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అందరూ చూస్తుండగా.. వెంటాడి మరీ అతన్ని కిరాతకంగా హత్య చేశారు. హనుమకొండలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమలో తాము గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో హత్యకు దారి తీసింది. మాచర్ల రాజ్కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లు. ఈ ఇద్దరికీ స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.అయితే ఈ విషయమై ఇద్దరు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోవెంకటేశ్వర్లు రాజ్కుమార్ను వెంబడించాడు. సుబేదారి డీమార్ట్ ఎదురుగా దొరకబుచ్చుకుని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని.. ఎంజీఎంకు తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మర్డర్ మిస్టరీని ఛేదించిన సిగరెట్ పీక
ఎంత ప్రొఫెషనల్ నేరగాడైనా నేరానికి సంబంధించి ఏదో ఒక క్లూ వదులుతాడంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించిన ఉదంతమిది. అప్పుడెప్పుడో 1984లో జరిగిన ఓ హత్య మిస్టరీని 2014లో చేధించారు. హంతకుడు తాగి పడేసిన సిగరెట్ పీకే అతని పీకకు చుట్టుకుంది. అత్యాధునికమైన డీఎన్ఏ ప్రొఫైలింగ్ మనవాన్ని పట్టించింది. 2021లో అతనికి శిక్ష పడింది.బ్రిటన్లో గ్లాస్గోకు చెందిన 58 ఏళ్ల మేరీ మెక్ లాఫ్లిన్కు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొత్తం 11 మంది పిల్లలున్నారు. వారు వేర్వేరు నగరాల్లో ఉంటడంతో ఒక్కతే ఉంటోంది. కొడుకు మార్టిన్ కలెన్ (24) వారానికోసారి తల్లిదగ్గరకు వచ్చేవాడు. 1984 అక్టోబర్ 2న తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు ఫ్లాట్ నుంచి భయంకరమైన వాసన వచ్చింది. లోపల మేరీ శవమై, మంచం మీద పడుంది. ఐదు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోస్టుమార్టంలో తేలింది. సెప్టెంబర్ 26న ఆమె పబ్లో గడిపిందని, తర్వాత నడుచుకుంటూ ఇంటికెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దారిలో ఆగి సిగరెట్ కొనుక్కుందని కూడా చెప్పారు. బూట్లు చేతబట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించడం చూసినట్టు ఓ ట్యాక్సీ డ్రైవర్ వాంగ్మూలమిచ్చాడు. అయినా కేసు ఎటూ తేలలేదు. ఒకానొక దశలో ఆమె పిల్లలపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏడాది దర్యాప్తు తర్వాత కేసును మూసేశారు. తర్వాత మరో నాలుగుసార్లు దర్యాప్తు చేసినా లాభం లేకపోయింది. 30 ఏళ్ల తరువాత 2014లో ఈ హత్యకు సంబంధించిన సాక్షాధారాలను మరోసారి సమీక్షించాల్సిందిగా స్కాటిష్ క్రైమ్ క్యాంపస్లో పనిచేస్తున్న జోవాన్ కోక్రాన్ను మేరీ కుమార్తె గినా మెక్ గావిన్ అడిగారు. 1984ల్లో డీఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి అంతగా తెలియకపోయినా అన్ని సాక్ష్యాలనూ భద్రపరిచారు. వాటిలోని మేరీ జుట్టు, గోరు వంటివాటిని డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారు. లివింగ్ రూమ్లో కాఫీ టేబుల్ మీది యాష్ ట్రేలోని ఉన్న సిగరెట్ పీక కీలక క్లూగా మారింది. పీకకు అంటిన డీఎన్ఏ గ్రాహం మెక్ గిల్ అనే నేరస్తుని డీఎన్ఏతో సరిపోలింది. అతను పలు లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నాడు. సరే, కేసు వీడింది కదా అనుకుంటే మరో చిక్కు వచ్చి పడింది. మేరీ హత్యకు గురైన సమయంలో మెక్ గిల్ ఖైదీగా ఉన్నట్టు రికార్డులు చూపించాయి. జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలడా అని అధికారులు తల పట్టుకున్నారు. నేషనల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్లో విచారించిన మీదట చిక్కు ముడి వీడింది. మేరీ హత్య జరిగిన సమయంలో మెక్ గిల్ ఐదు రోజులు పెరోల్పై బయట ఉన్నట్టు తేలింది. దాంతో 2019లో మెక్గిల్ను అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి 2021లో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మేరీ హత్య సమయంలో మెక్గిల్కు 22 ఏళ్లు. 59 ఏళ్ల వయసులో అతనికి శిక్ష పడింది. ‘‘తల్లి హంతకుడిని జీవితకాలంలో చూస్తామనుకోలేదు. ఆశే మమ్మల్ని నడిపించింది. మొత్తానికి ఉపశమనం కలిగింది’’అని గినా అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
HYD: జంట హత్య కేసులో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నార్సింగి(narsingi) పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు తేలింది. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు గుర్తించారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్, ఛత్తీస్గఢ్కు చెందిన బిందుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. నార్సింగిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే వీరి హత్యకు కారణమైనట్టు పోలీసులు తెలిపారు. అంకిత్ సాకేత్కు వివాహిత బిందూతో గత పరిచయం ఏర్పడింది. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును సాకేత్ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. బిందును తన స్నేహితుడి రూమ్లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.అనంతరం, అక్కడ ఏకాంతంగా గడిపారు. అయితే, సాకేత్కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. మరో ప్రియుడు.. వీరిద్దరినీ రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో బాది హత్య చేశాడు. సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్పై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. వీరిద్దరి హత్య కన్నా ముందు అంకిత్ అదృశ్యమైనట్టు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా.. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. నిన్న నార్సింగిలో ఇద్దరి హత్య జరిగింది. -
సంచలనంగా జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకర్ కేసు.. ముగ్గురి అరెస్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోడ్డు పనుల్లో అవినీతి జరిగిందని ఈమధ్య ఆయన స్టోరీ చేశారు. అందుకే ఆయన్ని హతమార్చి ఉంటారనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు. బీజాపూర్కు చెందిన ముఖేశ్ చంద్రాకర్(mukesh chandrakar) గతంలో పలు పత్రికలు, చానెళ్లలో పనిచేయగా ప్రస్తుతం ఓ టీవీలో పనిచేస్తూనే.. సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో ముఖేశ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్లోని చట్టాన్పారా(Chattanpara) ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. సదరు ఇల్లు కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్దిగా తేలింది. సురేష్ను హైదరాబాద్లో బీజాపూర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.మధ్యవర్తిగా వార్తల్లో.. ఛత్తీస్గఢ్లో పలు సందర్భాల్లో కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే ముఖేశ్ అడవుల్లోకి వెళ్లి చర్చల ద్వారా వారిని విడిపించిన ఘటనలు ఉన్నాయి. 2021 ఏప్రిల్లో బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు తెర్రెం సమీపాన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చి సీఆర్పీఎఫ్(CRPF) కానిస్టేబుల్ రాకేశ్సింగ్ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, జవాన్ కుటుంబీలకు వినతితో మావోయిస్టులతో చర్చలు జరిపి జవాన్ను బయటకు తీసుకొచ్చారు. అంతకు ముందు బీజాపూర్కు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఏఈని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే సహచర జర్నలిస్టులతో కలిసి ఆయన మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించారు. -
పంజగుట్టలో మిస్సింగ్.. ఎస్ఆర్ నగర్లో శవమై తేలాడు
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విష్ణు రూపాని (45) కిరాణా అండ్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గత నెల 29వ తేదీన రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో షాపు మూసేసి కొద్దిసేపట్లో వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన విష్ణు రూపాని తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు 30వ తేదీన పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బుధవారం సాయంత్రం ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బుద్ధానగర్లో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి చూడగా ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. అతన్ని పరిశీలించగా గత నెల 29న మిస్సయిన విష్ణు రూపానిగా గుర్తించారు. మృతి చెందిన గదిలో మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం. సదరు గదిలో ఉండే విష్ణు స్నేహితుడు కనిపించకుండా పోయాడని, దీంతో అతనే హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేసున్నారు. 29వ తేదీన రాత్రి విష్ణు, అతని స్నేహితుడు యాక్టివా ద్విచక్రవాహనంపై వెళ్లిన సీసీ పుటేజీలు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. విష్ణు ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో శరీరంపై గాయాలు సరిగ్గా కనిపించడంలేదని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్లాస్మేట్ను చంపిన టీనేజర్కు జీవిత ఖైదు
బీజింగ్: క్లాస్మేట్ను దారుణంగా చంపిన నేరానికి గాను ఇద్దరు టీనేజర్లకు చైనా న్యాయస్థానం కఠిన జైలు శిక్షలు విధించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మరో టీనేజర్ను కరెక్షన్ సెంటర్కు పంపించింది. హెబీ ప్రావిన్స్లోని హండన్లో ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న ఈ ఘటన చైనాలో సంచలనం కలిగించింది. బాధితుడు, దోషుల వయస్సు 13 ఏళ్లు. అందుకే అధికారులు వీరిని క్లుప్తంగా ఇంటి పేర్లతో వెల్లడించారు. క్లాస్మేట్ వాంగ్ను కొంతకాలంగా ఝాంగ్, లి, మా అనే బాలురు వేధిస్తున్నారు. వాంగ్ను చంపాలని ఝాంగ్ పథకం వేశాడు. దాని ప్రకారం మార్చి 3న నగరం శివార్లలోని పాడుబడ్డ గ్రీన్ హౌస్కు అతడిని తీసుకెళ్లాడు. అనుకున్న ప్రకారం మిగతా ఇద్దరూ అక్కడికి వచ్చారు. వాంగ్ను ఝాంగ్ పారతో కొట్టడం మొదలుపెట్టగా అతడికి లి సహకరించాడు. ఇది చూడలేక మా అక్కడికి నుంచి వెళ్లిపోయాడు. దెబ్బలతో చనిపోయిన వాంగ్ను ఇద్దరూ కలిసి అక్కడున్న గుంతలో పూడ్చి వేశారు. మార్చి 10న పోలీసులు ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగుచూసింది. సోమవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇది చాలా హేయమైన, క్రూరమైన చర్యగా అభివరి్ణంచింది. నేరానికి ప్రధాన సూత్రధారి ఝాంగ్కు జీవిత ఖైదును, అతడికి సహకరించిన లి కి 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మూడో బాలుడు మా ను పరివర్తన విద్యాకేంద్రానికి పంపించాలని తీర్పు వెలువరించింది. అయితే, వీరిని ఈ నేరానికి పురిగొలి్పన అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు. కోర్టు తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కఠిన శిక్షల భయం లేనందునే పిల్లలు కూడా ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ నలుగురి తల్లిదండ్రులు నగరానికి పనుల నిమిత్తం వెళ్లిపోగా, అమ్మమ్మతాతల వద్ద ఉంటూ అల్లరిచిల్లరగా తిరగడం అలవాటు చేసుకున్నారని చెబుతున్నారు. 2020 నాటి గణాంకాల ప్రకారం ఇలా ‘వదిలివేయబడిన బాలలు’దేశంలో 6.70 కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. -
నేరం వెనుక నిజం
సాక్షి, హైదరాబాద్: సమాజంలో జరిగే ప్రతి నేరం వెనుక ఓ కారణం కచ్చితంగా ఉంటుంది. వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా ఆదివారం డీజీపీ డాక్టర్ జితేందర్ నేరాల సంబంధిత గణాంకాలను విడుదల చేశారు. 2024కు (నవంబర్ వరకు) సంబంధించి రాష్ట్రంలో నమోదైన నేరాలను పరిశీలిస్తే..వీటిల్లో అనేక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి. కుటుంబీకులే కత్తికడుతున్నారు... బాడీలీ అఫెన్స్గా పిలిచే హత్య కేసులకు పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలనూ రంగంలోకి దింపుతారు. సాధారణంగా ఓ వ్యక్తి/వ్యక్తులు మరొకరిని చంపడానికి ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తాం. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నమోదైన 856 హత్య కేసుల్లో అత్యధికంగా 229 (26.75 శాతం) కేసులు కుటుంబ కలహాల వల్లే జరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా 102, భూ వివాదాలతో 82, చిరు వివాదాల వల్ల మరో 82 హత్యలు జరిగితే.. ఆర్థిక కారణాల వల్ల 53 హత్యలు జరిగాయి. మరో 259 మాత్రం రకరకాలైన ఇతర కారణాల వల్ల జరిగాయి. పిల్లలు తప్పిపోయినా కిడ్నాపే... డబ్బు కోసం లేదా ఇతరత్రా లబ్ధి కోసం వ్యక్తులో, ముఠానో ఎవరినైనా ఎత్తుకుపోయి నిర్భంధిస్తే కిడ్నాప్గా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది తెలంగాణలో 1,525 అపహరణ కేసులు నమోదయ్యాయి. ఇంతమంది కిడ్నాప్కు గురయ్యారని అనుకుంటున్నారా? కానే కాదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మైనర్ల మిస్సింగ్ కేసుల్ని కూడా కిడ్నాప్గా నమోదు చేయడం తప్పనిసరి. దర్యాçప్తుల్లో నిర్లక్ష్యాన్ని నిరోధించడానికి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఏడాది నమోదైన కిడ్నాపుల్లో మిస్సింగ్ సంబంధిత కేసులే 1,251 (82.03 శాతం) ఉన్నాయి. మిగిలినవి ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, చిరు వివాదాల నేపథ్యంలో జరిగినవి ఉన్నాయి. చోరీలకు సెల్ఫోన్ల లింకు ప్రతి వ్యక్తి చేతిలోకి అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్ ప్రభావం కేవలం సైబర్ నేరాల పైనే కాదు. చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం (డెకాయిటీ) కేసుల పైనా ఉంటోంది. ఈ ఏడాది 58 డెకాయిటీ కేసులు నమోదు కాగా.. వీటిలో 5 సెల్ఫోన్లు లాక్కుపోవడానికి సంబంధించివే. 703 దోపిడీ కేసుల్లో 67, 19480 చోరీ కేసుల్లో 1960 ఫోన్లతో ముడిపడి ఉన్నవే కారణం కావడం గమనార్హం.పరిచయస్తులే చెరబట్టారు! మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 2,945 కేసులు నమోదు కాగా...వీటిలో 2,922 (99.21 శాతం) పరిచయస్తుల వల్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించే అంశం. కేవలం 23 కేసుల్లో మాత్రమే బాధితులకు పరిచయం లేని వాళ్లు నిందితులుగా ఉన్నారు. మైనర్ను ప్రేమ పేరుతో మోసం చేయడం, పెళ్లి చేసుకోవడం తరహాకు చెందినవీ మొదటి కేటగిరీలోనే ఉంటున్నాయి. రేప్ కేసు బాధితుల్లో 15 ఏళ్ల లోపు వాళ్లు 87 మంది, 15–18 ఏళ్ల మధ్య వయసు్కలు 1,970 మంది, మేజర్లు 888 మంది ఉన్నారు. మోసాల్లో సైబర్ నేరాలదే అగ్రస్థానం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 33,618 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 24,643 (73.3 శాతం) సైబర్ నేరాలే కావడం గమనార్హం. చిన్న చిన్న మొత్తాలతో కూడిన సైబర్ నేరాలు ఫిర్యాదు దశలోనే ఆగిపోతున్నాయి. పెద్ద మొత్తాలు కోల్పోయిన వారిలోనూ దాదాపు సగం మంది పరువు, ప్రతిష్ట కోసం, సమాజానికి భయపడి ఫిర్యాదుల వరకు వెళ్లట్లేదు. ఇవి కూడా రికార్డుల్లోకి ఎక్కితే మోసం కేసుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. ప్రమాదాలు, మరణాలు పైపైకే.. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో (నవంబర్ వరకు) 20,702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... 6,541 మంది చనిపోయారు. ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 23,491 రోడ్డు ప్రమాదాల్లో 6,640 మంది మరణించారు. మృతులు నమోదు కాని రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి. 2023లో వీటి సంఖ్య 14,161 కాగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 16,851కి చేరింది. 2023లో అన్ని రకాల నేరాలూ కలిపి 1,38,312 నమోదు కాగా, 2024లో 1,69,477 నమోదయ్యాయి. -
కంకాళాల కలకలం
అది 2009 ఫిబ్రవరి 2, ఉదయం 7 దాటింది. అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రంలోని, వెస్ట్ మేసాలో అల్బుకర్కీ ప్రాంతమంతా సందడిగా ఉంది. సమీపంలో నివాసముండే క్రిస్టీన్ రాస్ అనే అమ్మాయి ఎప్పటిలానే ఆరోజు ఉదయం తన పెంపుడు కుక్క రుకాను తీసుకుని వాకింగ్కి బయలుదేరింది. తిరిగి వచ్చేటప్పుడు రుకా నోట్లో మనిషి ఎముక చూసి క్రిస్టీన్ హతాశురాలై, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.వెస్ట్ మేసా అనే ప్రాంతం గురించి అప్పటి వరకూ ఆ దేశానికే కాదు, ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా తెలియదు. ఆరోజు తర్వాత ప్రపంచమే ఉలిక్కిపడి వెస్ట్ మేసా వైపు చూడటం మొదలుపెట్టింది.రుసా తెచ్చిన ఎముక ఎక్కడిది? ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అధికారుల దృష్టి సమీపంలోని విస్తారమైన మెట్ట ప్రాంతం మీద పడింది. న్యూ మెక్సికో, సౌత్ వ్యాలీలో బెర్నెలీయో కౌంటీకి ఉత్తరాన ఉన్న అరోయో అనే నదీ పరివాహక ప్రాంతమది. అయితే ఆ నది కొన్నేళ్ల క్రితమే ఎండిపోయింది. అలాంటి చోట ఎముక దొరకడంతో తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వగా తవ్వగా ఓ అస్థిపంజరం దొరికింది. ఇంతలో ఆ పక్కనే మరో అనుమానాస్పదమైన గుంత దర్శనమిచ్చింది. వెంటనే క్రైమ్ టేప్స్ వేలాడదీసిన అధికారులు, తమ బలగాలను దించారు. ఇంతలో మరో అస్థిపంజరం దొరికింది. దాంతో చుట్టూ విస్తృతంగా తవ్వకాలు జరిపించారు. ఈలోపు మీడియా చుట్టుముట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 11 అస్థిపంజరాలు దొరికాయి. అన్నీ ఆడవారివే! బాధితుల్లో 15 ఏళ్ల బాలిక దగ్గర నుంచి 32 ఏళ్ల మహిళ వరకూ చాలా వయసులవారు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మృతులలో నాలుగు నెలల గర్భవతి కూడా ఉంది. వీరంతా 2001 నుంచి 2005 మధ్య అదృశ్యమైనవారేనని తేలింది. దీని వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కొందరు, సెక్స్ రాకెట్ ఉందని మరికొందరు ఊహించడం మొదలుపెట్టారు. సీరియల్ కిల్లర్ అని భావించిన వారంతా ‘ది బోన్ కలెక్టర్’ అని పేరుపెట్టారు. మీడియా ఎక్కువ శాతం ఆ వాదనకే ఓటేసింది.ఇడా లోపెజ్ అనే మహిళా డిటెక్టివ్ అప్పటికే అల్బుకర్కీకి చెందిన సుమారు 19 మంది మహిళలు కనిపించడం లేదని లిస్ట్ తయారు చేసింది. వారంతా సెక్స్వర్కర్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగినవారే కావడంతో పోలీసులు పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే వెస్ట్ మేసా తవ్వకాల్లో బయటపడిన పదకొండు మందిలో, పదిమంది ఆ లిస్ట్లోని వారే కావడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఇడా లిస్ట్లో మరో తొమ్మిది మంది ఏమయ్యరో తెలియకపోవడంతో, లిస్ట్లో లేని అభాగ్యులు చాలామందే ఇలా ఖననమై ఉంటారని అంచనాకొచ్చారు. ఇక పదకొండో అమ్మాయి, ఓక్లహోమాకి చెందిన 15 ఏళ్ల సిలానియా టెరెన్ (ఆఫ్రికన్ అమెరికన్) అని తేలింది. ఆమె 2003లో ఇంటి నుంచి పారిపోయింది. దొరికిన అస్థిపంజరాలు ఎవరివో తేల్చారు కాని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరో గుర్తించలేకపోయారు.ఈ కేసులో అనుమానితులు చాలామందే ఉన్నా లోరెంజో మోంటోయా, జోసెఫ్ బ్లీ అనే నేరగాళ్లు ప్రధాన అనుమానితులుగా నిలిచారు. లోరెంజో అనే వ్యక్తి పదకొండు మందిని ఖననం చేసిన ప్రదేశానికి చాలా సమీపంగా నివసించేవాడు. సెక్స్ వర్కర్లపై హింసాత్మక దాడులకు తెగబడి రెండుసార్లు అరెస్టయ్యాడు. అతడు 2006లో 19 ఏళ్ల సెక్స్ వర్కర్ షెరికా హిల్ను చంపి, ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లబోతుంటే, షెరికా ప్రియుడు ఫ్రెడరిక్.. లోరెంజోను తుపాకీతో కాల్చి చంపాడు. అతడు షెరికాను చంపిన తీరు చూస్తే అది, అతడి మొదటì హత్య అయి ఉండదని అప్పట్లోనే చాలామంది డిటెక్టివ్స్ భావించారు. అయితే 2009లో వెస్ట్ మేసా తవ్వకాల తర్వాత ఆ రోజు షెరికా బాడీని లోరెంజో వెస్ట్ మేసాలో కప్పెట్టడానికే తీసుకెళ్లబోయాడేమో? అనే అనుమానం కలిగింది. నిజానికి లోరెంజో మరణం తర్వాతే వెస్ట్ మేసా హత్యలు ఆగిపోయి ఉంటాయని అధికారులు నమ్మారు.2010 డిసెంబర్ 9న అల్బుకర్కీ పోలీసులు.. గుర్తుతెలియని ఆరుగురు మహిళల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిలో కొందరు అపస్మారక స్థితిలో (ఎవరో కిల్లర్కి చిక్కినట్లుగా) ఉన్నారు. అయితే ఆ ఫొటోలు ఏ నేరగాడి కెమెరా నుంచి సేకరించారో అధికారులు చెప్పలేదు కాని, ఇదంతా వెస్ట్ మేసా కేసు దర్యాప్తులో భాగమని వివరించారు. ఆ ఆరుగురిలో ఇద్దరు అమ్మాయిలు సజీవంగా ఉన్నట్లు సమాచారం ఉందని, వారు దొరికితే కిల్లర్ వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే ఆ ఇద్దరమ్మాయిలూ దొరకలేదు. ఆ ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో కూడా తెలియలేదు.2015 నాటికి జోసెఫ్ బ్లీ అనే రేపిస్ట్ కూడా వెస్ట్ మేసా కేసులో అనుమానితుడిగా మారాడు. 1980–82 మధ్యకాలంలో అల్బుకర్కీ సమీపంలోని ఇళ్లలోకి దూరి, 13 నుంచి 15 ఏళ్ల బాలికలపై అత్యాచారాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బ్లీ.. 2015లో ఓ సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు. డీఎన్ఏ నమూనాతో నేరం నిరూపితమైంది. గత నేరాలను కూడా కలిపి బ్లీకి 36 ఏళ్లు జైలు శిక్ష పడింది. పైగా ఈ పదకొండు అస్థిపంజరాలు దొరికిన చోట, క్లూ మాదిరి ఒక నర్సరీ ట్యాగ్ లభించింది. ఆ నర్సరీని గుర్తించిన అధికారులు.. బ్లీ రెగ్యులర్గా అక్కడే మొక్కలు కొనేవాడని తెలుసుకున్నారు. అయితే ఒకసారి బ్లీ.. తన సెల్మేట్ ముందు వెస్ట్ మేసా బాధితులను ‘నేను వాడి పడేసిన చెత్త’ అని సంబోధించాడట. కానీ విచారణలో బ్లీ నోరువిప్పకపోవడంతో, కేసు తేలలేదు. మొత్తానికీ ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడా? లేక ఈ ఉదంతం వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనేది నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
గూగుల్ స్ట్రీట్ ఫొటోతో మర్డర్ మిస్టరీ వీడింది!
గూగుల్ మ్యాప్ ఫొటో ఓ హంతకుడిని పట్టించిన ఘటన స్పెయిన్లో జరిగింది. సోరియా ప్రావిన్స్లోని తజుకో పట్టణ వీధులను గత ఏడాది నుంచి గూగుల్ యాప్ చిత్రించడం మొదలు పెట్టింది. అందులో కనిపించిన ఒక ఫొటో చివరికి హత్య కేసు తాలూకు దోషుల్ని పట్టించింది.క్యూబాకు చెందిన జార్జి అనే 33 ఏళ్ల వ్యక్తి 2023 అక్టోబర్లో అదృశ్యమయ్యాడు. తానో మహిళను కలిశానని, స్పెయిన్ నుంచి వెళ్లిపోతున్నానని చివరిసారిగా బంధువుకు జార్జి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత అతడు కనబడకుండా పోవడంతో సదరు బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఒక వ్యక్తి తన కారు డిక్కీలోకి పెద్ద ప్లాస్టిక్ సంచిని లోడ్ చేస్తున్న చిత్రం ఇటీవల గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోలీసుల కంట పడింది. అనుమానం వచ్చి విచారించగా ఓ మహిళ తన మాజీ బాయ్ఫ్రెండ్తో కలిసి జార్జిని హత్య చేసినట్లు తేలింది. దాంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: వింత ఆచారం.. నేలపై పాకుతూ వెళుతూ.. -
రహదారిపై రక్తచరిత్ర
నాగోలు: అది కొత్తపేట– నాగోలు రహదారి.. శుక్రవారం సాయంత్రం.. వాహనాల రొద ఒకవైపు.. జన సంచారం మరో వైపు.. ఇదే సమయంలో అక్కడ వేట కొడవళ్లు విరుచుకుపడ్డాయి. సినీ ఫక్కీలో ఓ గుంపు దారుణంగా దాడికి పాల్పడింది. బాధితుల రోదనలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భయాందోళనతో గజగజ వణికిపోయింది. పాత కక్షలతో.. ఒకరిపై గురి పెట్టి వచ్చిన.. తమకు సంబంధం లేని ఇద్దరు యువకులపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చైతన్యపురి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి రెండేళ్ల క్రితం హయత్నగర్లో జరిగిన పెళ్లి ఊరేగింపు ఏర్పడిన వివాదం నేపథ్యంలో తన స్నేహితుడైన తట్టిఅన్నారంనకు చెందిన బోడ్డు మహేష్ పై బీరు బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు గాయాలైన మహేష్ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టులో నడుస్తోంది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరూ రాజీ కోసం మాట్లాడుకున్నారు. పురుషోత్తం వద్ద మహేష్ కొన్ని డబ్బులు కూడా తీసుకున్నాడు. శుక్రవారం కేసు విషయమై మహేష్ కోర్టుకు రావాల్సి ఉంది. కానీ తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్కు చెప్పి పురుషోత్తం హత్యకు పథక రచన చేశాడు. నాగోలు వెళ్లే రోడ్డులోని అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నాడనే పక్కా సమాచారంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్ అలియాస్ సూరి తదితరులు కారు, బైక్లపై వచ్చారు. పురుషోత్తంపై వేట కొడవలితో దాడి చేయబోగా అతను తప్పించుకున్నాడు. దీంతో పురుషోత్తం స్నేహితులైన సికింద్రాబాద్ తుకారాం గేట్కు చెందిన గడ్డమోయిన రాము, నాగోలు తట్టిఅన్నారంనకు చెందిన పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు సమీపంలోని ఓ బ్యాంకులో తలదాచుకున్న రాముపై వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఆ ప్రాంతమంతా రక్తం మడుగును తలపించింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు చైతన్య పురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావుతో వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం -
హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష
కాచిగూడ: నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒకరికి మరణ శిక్ష, మరో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పు వెలువరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రాగుల సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత నాగరాజు ఆర్తిని వేధింపులకు గురి చేసేవాడు. ఆర్తిని చెల్లిగా పిలవాలని నాగరాజు స్నేహితుడైన రాగుల సాయికి తెలపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు ఎ.రాహుల్ ఇద్దరూ కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజును, వీరి ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్మెంట్స్ నారాయణగూడ పోలీసులు రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్తి, నాగరాజు, వీరి ఏడాది కుమారుడు విష్ణు, ఆర్తి కడుపులోని బిడ్డతో సహా నలుగురూ మృతి చెందారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న నారాయగూడ పోలీసులు దర్యాప్తు సాగించారు. మొదటి ప్రాధాన్యతగా ఈ కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు. -
AP: కిల్లర్ లేడీ.. క్రైమ్ సినిమా రేంజ్లో అన్నదమ్ముల హత్య!
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కిరాతకం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్కు అడ్డు తగులుతున్నారనే అక్కసుతో ఓ యువతి తన అన్న, తమ్ముడిని ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అనంతరం, శవాలను కూడా మాయం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..‘పల్నాడు జిల్లాలోని నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలు రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన పక్షవాతంతో కొద్ది నెలల క్రితమే చనిపోయారు. పౌలు రాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ, బొల్లాపల్లి మండలు, బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు. రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్లైన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణకు వివాహమైనా కుటుంబ కలహాలతో భార్య విడిచి పెట్టింది. పెద్ద కొడుకు గోపికృష్ణ భార్య కూడా అతడిని విడిచిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తికోసం ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం ఘర్షణ పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలని కుమార్తె గొడవ పడుతోంది.అయితే, ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములిద్దరూ అంగీకరించలేదు. ఈ విషయంలో కూడా వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి.. ఆస్తిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వారిని కిరాకతంగా హతమార్చింది. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉండంటంతో డిసెంబర్ 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్యచేయగా.. తమ్ముడిని నవంబరు 26న కాల్వలో తోసేసి చంపేసింది. వీరి మృతదేహాలు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదిలా ఉండగా.. నకరికల్లులో మరో వ్యక్తితో కృష్ణవేణికి సంబంధం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అతడితో సాయంతో వారిని హత మార్చినట్టు తెలుస్తోంది. ఇక, కానిస్టేబుల్ గోపీకృష్ణ బండ్లమోటు పీఎస్కు విధులకు హాజరు కాకపోవడంతో వారి హత్య వ్యవహారం బయటకు వచ్చింది. వారి మృతదేహాలను ఏం చేసిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు.. కృష్ణవేణిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
పోలీసులకు సవాల్గా మారిన విజయ హత్య కేసు
కాజీపేట: ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కొట్టి చంపి ఏడాది కాలం గడిచినా.. హంతకుల ఆనవాళ్లు పోలీసులకు చిక్కకపోవడం చర్చనీ యాంశంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం 62వ డివిజన్ రహమత్ నగర్ కాలనీలో ఉండే కోన విజయ (68) అనే మహిళ గత ఏడాది డిసెంబర్ 14న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి విగతజీవిగా ఇంటి పక్క సందులో కనిపించింది. విజయ మృతదేహంపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతోపాటు బంగారు నగలు కనిపించకుండాపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో విజయ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ.. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సభ్యులు, డ్వాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ దాదాపు 16 గంటలపాటు పట్టణంలో ఎక్కడ ఉంది.. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నిందితులు హత్యచేసి ఇంటి వద్ద పడేసి ఉంటారా.. లేక తెల్సిన వాళ్లకు అప్పుడప్పుడు చిన్న మొత్తంలో నగదును ఇస్తుండే విజయను మరెవరైనా హత్య చేశారా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినా ఆచూకీ లభించలేదు. అయితే .. విజయను ఏమార్చి కిడ్నాప్ చేసిన నిందితులు తలపై బలంగా కొట్టి చంపడంతోపాటు శరీరాన్ని పూర్తిగా సబ్బు పెట్టి కడిగి మృతురాలి ఇంటి పక్కన ఉన్న గల్లీలోనే అర్ధరాత్రి వేళ పడేసి వెళ్లారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో వెతికినా హత్యప్రదేశాన్ని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు సబ్బుతో కడిగి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగల కోసమే హత్య చేసి ఉంటారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా.. అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పోలీసులకు నిందితులకు సంబంధించిన ఆచూకీ చిక్కకపోవడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంది. హత్య జరిగినప్పుడు ఉన్న అధికారులు బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన అధికారులు హత్య కేసు ఫైల్ను తిరిగి తెరచి విచారణ జరుపుతున్నారు. ఘటనా సమయంలో ఉన్న అధికారులు ఒక క్రమపద్దతిలో విచారణ చేయకపోవడం కారణంగానే సమస్య తీవ్రత పెరగడంతోపాటు నిందితులు దొరక్కుండా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు సుమారు 100మందిని విచారించారు. చిన్న క్లూ దొరికినా విడిచి పెట్టకుండా నేరస్తుల ఆట కట్టిస్తున్న పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. విజయ కేసులో నానాటికీ చిక్కుముడులు పెరుగుతున్నాయి. మొదట్లో కేసును సునాయాసంగా పరిష్కరించవచ్చని భావించిన పోలీసులకు గతంలో వచ్చిన దృశ్యం సినిమాను జ్ఞప్తికి తేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సీపీ అంబర్ కిశోర్ ఝా క్రైమ్ సమీక్ష సమావేశాల్లో తరచూ ఈ కేసును పరిష్కరించాలంటూ ఆదేశిస్తున్నప్పటికీ పోలీసుల విచారణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. -
కన్నడ నటుడు దర్శన్కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
పెద్దల మాదిరిగానే పదేళ్ల పిల్లలకూ జైలు శిక్షలు
క్వీన్స్ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్ల్యాండ్లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి. 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. -
యువతిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది అరెస్ట్
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై హత్యా యత్యానికి పాల్పడిన పేమోన్మాదిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం కడపలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వేముల మండలానికి చెందిన కుళ్లాయప్ప కొంతకాలంగా యువతి వెంట పడుతున్నాడు.ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపాయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వేముల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే గ్రామస్తులు తనను కొట్టి చంపుతారేమోనని భయపడిన నిందితుడు గ్రామ సమీపాన గల కొండల్లో ఉండి చనిపోవాలనుకుని కత్తితో చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళుతుండగా పోలీసుల చేతికి చిక్కాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్టు ఎస్పీ విద్యాసాగర్నాయుడు వివరించారు. -
మూడో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
దొడ్డబళ్లాపురం: రెండవ భార్యను హత్య చేసి మూడో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బిహార్కు చెందిన మహమ్మద్ నసీమ్ (39) అరెస్ట్ నిందితుడు. రుమేశ్ ఖాతున్(22) హత్యకు గురైన రెండవ భార్య. సర్జాపురలో పెయింటర్గా పని చేస్తున్న నసీమ్కు మొటి భార్య ఆమెకు ముగ్గురు పిల్లలు, రెండో భార్య ఖాతున్కు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రెండవ భార్య శీలాన్ని శంకించిన నసీమ్ ఆమెను నవంబర్ 11న గొంతు నులిమి హతమార్చాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టి మురుగు కాలువలో పడేశాడు. బిహార్ వెళ్లి తలదాచుకున్నాడు. మరోవైపు సర్జాపుర పోలీసులు ఖాతున్ మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నసీమ్ జాడ తెలుసుకుని బిహార్ వెళ్లగా అక్కడ అతడు మూడో వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. సర్జాపుర పోలీసులు అతడ్ని పెళ్లింటి నుండే అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
భార్యను కడతేర్చి ఆపై గూగుల్లో ఏం సెర్చ్ చేశాడంటే..
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత తనకేం తెలియదన్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. భార్య కనిపించడం లేదని తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఆమె మరణానంతరం ఏం జరుగుతుందని గూగుల్లో సెర్చ్ కూడా చేశాడు. అయితే తన నాటకం ఎన్నో రోజులు నడవలేదు. చివరికి పోలీసులు భర్తే హంతకుడని తేల్చి కటకటాల వెనక్కి పంపారు.వర్జినియాకు చెందిన నరేష్ భట్(33).. నేపాల్కు చెందిన తన భార్య మమతా కప్లే భట్(28)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఓకూతురు కూడా ఉంది. మమతా గత జూలై 19 నుంచి కనిపించకుండాపోయింది. ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తున్న మమతా.. ఆ రోజు సాయంత్రం హెల్త్ ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్లో చివరిసారిగా కనిపించింది. తరువాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో పనికి వెళ్లిన తన భార్య కనిపించకుండాపోయిందని భర్త ఆగష్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో మొదట ఆమె న్యూయార్క్, టెక్సాస్లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. కానీ తరువాత, ఆమెకు ఆ రాష్ట్రాల్లో ఎవరూ బంధువులు లేరని, ఆమె ఫోన్ ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో అతడు తడబడ్డాడు.ఆగస్టు 22న నరేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భర్త నరేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో తన భార్యతో విడియేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు చెప్పాడు. అంతేగాక ‘భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. భాగస్వామి చనిపోయాక అప్పులు ఏమవుతాయి.. వర్జినీయాలో జీవిత భాగస్వామి కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది’ అంటూ నరేష్ గూగుల్లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అయితే భర్త మమతాను హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక నరేష్ తన ఇంటి సమీపంలోని వాల్మార్ట్లో మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారలు వెలువడ్డాయి. వాటిలో రెండిటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భార్య అదృశ్యమైన తర్వాత భట రక్తంతో తడిసిన బాత్ మ్యాట్, బ్యాగ్లను చెత్త కాంపాక్టర్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చెత్త సంచులను పారవేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో మమతను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడనే పోలీసుల అనుమానం బలపడింది. దీని ద్వారా తన నేరాన్ని దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సెప్టెంబర్లో బెయిల్ నిరాకరించడంతో కస్టడీలోనే ఉన్నాడు. -
అప్పు డబ్బులు తిరిగి అడిగినందుకు గొంతు కోసి చంపేశాడు
లింగోజిగూడ: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మన్నందుకు వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దోనకొండకు చెందిన యక్కలి కాశీరావు (37), భార్య సుమలత, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్నగర్ భాగ్యలత అరుణోదయ నగర్లో రెండున్నరేళ్లుగా ఉంటున్నాడు. కాశీరావు స్థానికంగా కార్ల క్రయ విక్రయాలు చేస్తుంటాడు. కాశీరావు కిరాయికి ఉంటున్న ఇంట్లోని మొదటి అంతస్తులోనే నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన బ్యాచ్లర్లు పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి, ఐతరాజు శంకర్లు అద్దెకి ఉంటున్నారు. వీరిలో సాయి, శంకర్ హయత్నగర్లోని బొమ్మలగుడి సమీపంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాశీరావు, పెద్దగాని శేఖర్ ఇద్దరూ కలిసి కార్ల వ్యాపారం ప్రారంభించారు. 2023లో రూ.1.5 లక్షలు ఒకసారి, రూ. 3.60 లక్షలు మరోసారి కాశీరావు వద్ద శేఖర్ అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు డబ్బులు ఇవ్వాలని శేఖర్ గదికి వెళ్లి కాశీరావు అడుగుతుండేవాడు. ఈ విషయమై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సాయి, శంకర్ వ్యక్తిగత పనిపై గదిలోంచి బయటకు వెళ్లారు. 10 గంటల సమయంలో కాశీరావు.. పైఅంతస్తులో ఉన్న శేఖర్ గదికి వెళ్లాడు. 20 నిమిషాలు గడుస్తున్నా కాశీరావు కిందకు రాలేదు. 10.20 గంటల సమయంలో శేఖర్ రక్తపు మరకలతో కిందకు దిగి వచ్చాడు. అక్కడే దుస్తులు ఆరేస్తున్న కాశీరావు భార్య సుమలతతో.. ‘నీ భర్తను చంపేశాను’ అంటూ వెళ్లిపోయాడు. సుమలత వెంటనే పైఅంతస్తులోని గదికి వెళ్లి చూడగా.. మెడ భాగంలో బలమైన గాయాలతో కాశీరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భర్తను పైకి లేపాలని సుమలత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు గ్రహించిన సుమలత స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడనే కోపంతోనే గొడపడిన శేఖర్.. కాశీరావును గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమలత ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శేఖర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
AP: ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య
సాక్షి,వైఎస్ఆర్జిల్లా : ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గాంధీ రోడ్డు సమీపంలోని బీజీఆర్ లాడ్జిలో హత్య జరిగింది. మద్యం సీసాతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తిని రౌడీ షీటర్ పప్పిగా పోలీసులు అనుమానిస్తున్నారు.హత్యలో స్థానిక టీడీపీ నేతల సోదరుల ప్రమేయం ఉందని సమాచారం. హత్య జరిగిన లాడ్జి రూమ్ టీడీపీ నాయకుడు యనమల సుబ్బిరెడ్డి సోదరుని అధీనంలోనే కొన్ని నెలలుగా ఉన్నట్లు సమాచారం.మరో టీడీపీ నేత ముక్తియర్ సోదరుడు ముజీబ్ కూడా ఆ రూంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముజీబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కెచ్ మొత్తం నిహారిక నేతృత్వంలోనే!
సాక్షి, హైదరాబాద్: మొదటి భర్తను వదిలేసింది..రెండో భర్తను మోసం చేసింది..మూడో భర్తను ఏకంగా చంపేసింది.. నాలుగో భర్తగా చేసుకోవాలనుకున్న డాక్టర్ను జైలుకు పంపింది..పోచారం ఐటీ కారిడార్కు చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిహారిక వ్యవహారమిది. తన స్నేహితుడు అంకుర్ రాణాతో కలిసి పీర్జాదిగూడలో ఈ హత్య చేసిన నిహారిక ప్రియుడు నిఖిల్ సూచనల మేరకు మృతదేహాన్ని 850 కిలోమీటర్లు తీసుకువెళ్లి, కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఉన్న కాఫీ ఎస్టేట్లో కాల్చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిటీకి తీసుకువచ్చినప్పుడే అంకుర్ కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకోవడం, మళ్లీ చిక్కడం జరిగాయి. త్వరలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించిన కొడగు పోలీసులు ప్రధాన నిందితురాలు నిహారిక గత చరిత్రను తవ్వితీశారు.రెండో భర్తకు రూ.70 లక్షల టోకరా..నగర శివార్లలోని భువనగిరికి చెందిన ఆకుల శ్రీలతకు (29) ఇక్కడ ఉండగానే ఓ వ్యక్తితో వివాహమైంది. ఓ కుమార్తె కలిగిన తర్వాత డబ్బుపై ఆశ, జల్సాల కోసం శ్రీలత మొదటి భర్తను వదిలేసి, బెంగళూరుకు మకాం మార్చింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ప్రచారం చేసుకుంది. తన పేరును పంతుల నిహారికగా మార్చుకుని..కొన్నేళ్ల క్రితం హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన కమల్దీప్ శైనీ అనే వ్యక్తితో ‘మీట్4యూ’ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా బిల్డప్ ఇచ్చిన నిహారిక కమల్ను 2019 జూన్ 22న రెండో పెళ్లి (అతడికి మొదటి వివాహం) చేసుకుంది. తనకు అప్పటికే పెళ్లి కావడం, భర్త నుంచి విడిపోవడాన్ని దాచి ఉంచింది.ల్యాప్టాప్లో కనిపించిన ఫొటోతో..వీళ్లిద్దరూ బెంగళూరులో నివసిస్తుండగానే తన కుమార్తెను మేనకోడలు అంటూ చెప్పి తమ వద్దకు తెచ్చుకుంది. అనారోగ్యం సహా వివిధ రకాలైన కారణాలు చెప్తూ కమల్దీప్ నుంచి రూ.70 లక్షలు తీసుకుంది. కరోనా సీజన్లో వీళ్లిద్దరూ తమ మకాంను కర్నాల్కు మార్చారు. నిహారిక తనతో పాటు తన కుమార్తెను తీసుకువెళ్లింది. ఓ రోజు నిహారిక ల్యాప్టాప్లో ఆమె మొదటి భర్తకు సంబంధించిన ఫొటోలు చూసిన కమల్దీప్ అసలు విషయం తెలుసుకున్నారు. తాను మోసపోయానని గుర్తించిన కమల్దీప్ 2021 జనవరిలో కర్నాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 4న నిహారికను అరెస్టు చేశారు. ఆ ఏడాది డిసెంబర్ వరకు కర్నాల్ జైల్లో గడిపిన ఆమెకు బెయిల్ వచ్చింది. జైల్లో ఉండగా వేధింపుల కేసులో జైలుకు వచ్చిన సభా అనే మహిళతో నిహారికకు పరిచయం ఏర్పడింది. సభాను ములాఖత్లో కలవడానికి వచ్చే ట్యాక్సీ డ్రైవర్ అంకుర్ రాణాతోనూ ఈమెకు స్నేహం ఏర్పడింది.కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్..మోసం కేసులో బెయిల్ పొందిన నిహారిక కోర్టు వాయిదాలకు దాదాపు రెండేళ్ల పాటు హాజరుకాలేదు. దీంతో ఆమైపె న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా కర్నాల్ పోలీసులు ఈ ఏడాది మేలో మరోసారి అరెస్టు చేయగా..ఆగస్టులో బెయిల్ పొంది బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా..నగరంలోని తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్షిప్లో ఒంటరిగా నివసించారు. నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమేష్తో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్షిప్లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈ కారణంగానే ఆమె వివాహాలు, అరెస్టులు రమేష్కు తెలియలేదు.వెటర్నరీ డాక్టర్ నిఖిల్తో ప్రేమాయణం..ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వాసవీనగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏవర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమేష్తో చెప్తోంది. అయితే కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో ఈ మొత్తం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో గత నెల్లో నగరానికి వచ్చిన నిహారిక, అంకుర్ పథకం ప్రకారం రమేష్ను చంపి, నిఖిల్ సలహాతోనే మృతదేహాన్ని కొడగు వరకు తీసుకువెళ్లి కాల్చేశారు. ఈ ముగ్గురూ అరెస్టు కాగా..దర్యాప్తు కోసం నగరానికి తీసుకురాగా తప్పించుకున్న అంకుర్ మళ్లీ అరెస్టు అయ్యాడు. కొడగు పోలీసులు తమ దర్యాప్తులో ఈ హత్యలో నిహారిక కీలకమని గుర్తించారు. ఈ మేరకు త్వరలోనే అక్కడి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆధిపత్యం కోసమే అంతమొందించారు
నెల్లూరు (క్రైమ్): ఆధిపత్యం, పాత కక్షల నేపథ్యంతోనే హిజ్రా సంఘ నాయకురాలు మానికల హాసిని హత్య జరిగినట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ చెప్పారు. ఈ కేసులోని 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో హాసిని హత్యకు దారి తీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను ఎస్పీ ఆదివారం వివరించారు.తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరుకి చెందిన హాసిని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, ధార్వాడ్, చిక్మగ్ళూరు, హుబ్లీ జిల్లాల్లోని ట్రాన్స్జెండర్లకు నాయకురాలు. నెల్లూరు జిల్లాకు చెందిన హిజ్రా సంఘ మాజీ నాయకురాలు అలేఖ్య అలియాస్ అనిల్కుమార్కు హాసిని మధ్య విభేదాలున్నాయి. ఇద్దరి మీద నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు కేసులున్నాయి. హాసినికి బోడిగాడితోటకు చెందిన షీలా, సులోచనతోనూ విబేధాలున్నాయి. ఇవి తారస్థాయికి చేరుకోవడంతో హాసినిని అంతమొందించాలని వీరందరూ నిర్ణయించుకుని సుందరయ్యకాలనీకి చెందిన రౌడీషిటర్ చింతల భూపతిని,నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మరో రౌడీషిటర్ను సంప్రదించారు.వీరి ద్వారా కొందరిని సమీకరించుకుని సుపారీ ఇచ్చి అదను కోసం వేచి చూడసాగారు. గత నెల 26న రాత్రి హాసినిని టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిందితులు హత్య చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను గుర్తించారు. కోవూరు అండర్ బ్రిడ్జి వద్ద కార్లలో వెళ్తున్న నిందితులైన రౌడీషిటర్ వంశీకృష్ణ అలియాస్ నాని, రాము, కార్తీక్, సుబ్రహ్మణ్యం, షేక్ మస్తాన్ వలీ అలియాస్ వలీ, వెంకటాద్రి, రాజే‹Ù, వంశీ, షీలా అలియాస్ శ్రీనివాసులు, అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్, చింతల భూపతి, ఓ బాలుడిని అరెస్ట్ చేశారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘రాక్షసుడు’
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్పై కరమ్వీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్లోని జోద్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్పాత్స్ పైన గడిపాడు.ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..ఆపై కతిహార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్కు స్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మహిళ హత్య..అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫామ్పై మంగుళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్ప్రెస్లో సోమవారం గుజరాత్లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య
వాజేడు: పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారనే నెపంతో మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు పోలీసు స్టేషన్కు సుమారు అరకిలో మీటరు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు మండల పరిధి బాలలక్ష్మీపురం (పెనుగోలు కాలనీ) గ్రామంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉయిక అర్జున్ (38) ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. వారు అర్జున్ను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఆరుబయట గొడ్డళ్లతో నరికారు.అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు ఉయిక రమేశ్ (38) ఇంటికి వెళ్లి మంచంపై పడుకున్న రమేశ్ను గొడ్డళ్లతో నరికి వెళ్లిపోయారు. రమేశ్ కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగానే అతను చనిపోయాడు. పేరూ రు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేశ్కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, అర్జున్కు భార్య సావిత్రి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులు కాయడానికి అడవుల్లోకి వస్తున్న అర్జున్ తమ దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, ఇతనితోపాటే ఉయిక రమేశ్ కూడా పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నాడని వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఘటనాస్థలంలో వదిలిన రెండు లేఖల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. అమాయకులను హత్య చేశారుఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన ఉయిక రమేశ్, ఉయిక అర్జున్ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు, గిరిజనులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసుకు వచ్చిన అంబులెన్స్ను అడ్డుగా పెట్టి పెనుగోలు కాలనీకి వెళ్లే దారి వద్ద వాజేడు, వెంకటాపురం(కె) రహదారిపై ధర్నాకు దిగారు.ఇన్ఫార్మర్ ముద్ర వేసి అమాయక గిరిజనులను మావోయిస్టులు అన్యాయంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రమేశ్ భార్యకు నెలరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు ఏటూరునాగారం ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. -
ప్రేమికుడే కాలయముడు!
మియాపూర్: మైనర్ అమ్మాయిని ఇన్స్ట్రాగాంలో పరిచయం చేసుకుని హత్యచేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సోమవారం కేసు వివరాలను తెలిపారు. అశోక్ కుటుంబం మియాపూర్లోని టేకు నర్సింహనగర్లో నివాసముంటోంది. చిన్న కుమార్తె(17) గత నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటు(22)పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను నగరంలోని ఫలక్నుమా దేవాలయంలో పరిచయం చేసుకుని ఇన్స్టాలో చాటింగ్ చేసుకునేవారని చెప్పాడు. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి గత నెల ఇంటినుంచి వెళ్లిపోయింది. విఘ్నేష్ ఆ బాలికను మీర్పేట్లోని స్నేహితులు సాకేత్, కళ్యాణిల గదిలో ఉంచాడు. అమ్మాయి తరచూ పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు. అనంతరం బాలికను హత్యచేయాలనే పథకం పన్నాడు. 8న విఘ్నేష్.. అమ్మాయి గొంతు నులిమి మొఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అదేరోజు అర్ధరాత్రి సాకేత్, కళ్యాణిలతో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాకేత్.. బాలిక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విఘ్నేష్ తనకేమి తెలియనట్లు అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిందని, వచి్చందా అని అడిగాడు. అనుమానించిన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేష్ను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పారిశ్రామిక వాడకు వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతోనే హత్యచేసినట్లు తెలిపారు. హత్యచేసిన విఘ్నేష్, అతనికి సహకరించిన సాకేత్, కళ్యాణిలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
AP: రూ.100 కోసం హత్య
కర్నూలు (టౌన్): ఇద్దరూ కల్లు తాగారు. బొమ్మ–బొరుసు ఆడారు. రూ.వంద పోగొట్టుకున్న వ్యక్తి.. గెల్చిన యువకుడి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ విషాద సంఘటన కర్నూలులో సోమవారం జరిగింది. స్థానిక మమతానగర్కు చెందిన కృపానందం అలియాస్ ఆనంద్ (27) వృత్తిరీత్యా గౌండా (తాపీ) పని చేస్తున్నాడు. తల్లి, నలుగురు సోదరులు ఉన్న అతడు రోజూ కల్లు తాగేవాడు.స్థానిక రోజావీధికి చెందిన అజీజ్ అతడికి పరిచయమయ్యాడు. సోమవారం ఇద్దరూ కల్లు తాగిన తర్వాత సంకల్బాగ్లోని ఓ స్కూల్ వద్ద బొమ్మ–బొరుసు ఆట ఆడారు. ఈ ఆటలో కృపానందం రూ.100 గెల్చున్నాడు. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తన డబ్బులు ఇచ్చేయాలంటూ అజీజ్ రాయితో కృపానందం తలపై కొట్టాడు. దీంతో కృపానందం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
యోగా టీచర్పై లైంగిక దాడి.. హత్యకు సుపారీ
గౌరిబిదనూరు: యోగా టీచర్ హత్యకు సుపారీ తీసుకున్న నిందితులు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు నటించడంతో చనిపోయిందని భావించి గుంతలో పడేసి వెళ్లారు. బాధితురాలు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. చిక్కబళ్లాపురం పోలీసులు గురువారం వివరాలు వెల్లడించారు. బెంగుళూరులోని కేఆర్ పురకు చెందిన ఓ మహిళ తన భర్తతో విభేదించి విడిగా ఉంటోంది.యోగా నేర్పుతూ జీవనం సాగిస్తోంది. ఆమెతో సంతోష్ అనే వ్యక్తి సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సంతోష్ భార్య సింధు అనుమానించింది. యోగా టీచర్ను హత్య చేయాలని డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న సతీశ్రెడ్డికి రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చింది. సతీశ్రెడ్డి టీచర్తో పరిచయం చేసుకున్నాడు. తాను మాజీ సైనికుడినని, రైఫిల్ షూటింగ్ నేర్పుతానని చెప్పి కారులో తీసుకెళ్లి స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. తొలుత ఒక పర్యాయం లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ దాడికి యత్నిస్తుండగా ఎలాగైనా వారి నుంచి తప్పించుకోవాలని భావించిన బాధితురాలు తాను యోగాలో నేర్చుకున్న విద్య ద్వారా శ్వాసను బంధించింది. శ్వాస లేకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి శిడ్లఘట్ట వద్ద ధనమిట్నహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గుంతలో పడేశారు. శరీరంపై చెట్లు వేసి ఉడాయించారు. అర్ధరాత్రి సమయంలో ఆమె నాలుగు కిలోమీటర్లు నడిచి ధనమిట్నహళ్లి చేరుకొని అక్కడి వారి సహయాంతో చిక్కబళ్ళాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి నిందితులు సతీశ్రెడ్డి, నాగేంద్రరెడ్డి, రమణారెడ్డి, రవిచంద్ర, రవితోపాటు సుపారీ ఇచ్చిన సింధును అరెస్ట్ చేశారు. -
మహిళ హత్య.. సుపారీ డబ్బులు ఇవ్వలేదని ట్విస్ట్ ఇచ్చిన కిల్లర్
లక్నో: సుపారీ సొమ్ము అందలేదని.. హత్య చేసిన వ్యక్తే పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు పెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగు చూసింది. ఏడాది క్రితం హత్య చేసిన కేసులో.. సుపారీ ఇచ్చిన వారి నుంచి డబ్బులు చెల్లించలేదని వారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఖంగుతున్నారు. దీంతో పాత హత్య కేసును తాజాగా రీఓపెన్ చేశారు.వివరాలు.. 2023 జూన్ 7న మీరఠ్లోని చెందిన అంజలి అనే న్యాయవాది ఇంటికి వస్తుండగా ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. ఆస్తి వివాదంలో భాగంగా అత్తింటివారే ఆమెను హత్య చేయించారనే కోణంలో పోలీసులు ఆమె మాజీ భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వారి ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని వదిలేశారు. తరువాత కొన్ని రోజులకు పోలీసులు ఇద్దరు షూటర్లు నీరజ్ శర్మ, యశ్పాల్ను అరెస్టు చేశారు.బాధితురాలు తన మాజీ భర్త నితిన్ గుప్తా పేరుతో ఉన్న ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆ ఇంటిని ఆమె అత్తమామలు యశ్పాల్, సురేష్ భాటియాకు విక్రయించారు. కాని మహిళ ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఆస్తి కొనుగోలుదారులు అంజలిని చంపడానికి రూ. రెండు లక్షల సుపారీ కుదుర్చుకున్నట్లు తేలింది. దీంతో యశ్పాల్, భాటియా, నీరజ్ శర్మ, ఇద్దరు హంతకులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే ఇది జరిగిన ఏడాది తర్వాత బెయిల్పై విడుదలైన నీరజ్ శర్మ..పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. మృతురాలి భర్త, అత్తింటివారే ఈ హత్య చేయించినట్లు చెప్పాడు.ఇందు కోసం తమ మధ్య రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరిందని వెల్లడించాడు. అడ్వాన్స్గా ఒక లక్ష ఇచ్చారని, మిగతా సొమ్ము అందలేదని తెలిపాడు. అయిత, ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడంతో మిగిలిన మొత్తం కోసం బాధితురాలి అత్తమామలను సంప్రదించగా వారు నిరాకరించారని శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో అంజలి హత్యలో ప్రధాన కుట్రదారులైన ఆమె భర్త, అత్తమామలు, మరో బంధువుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంట్రాక్ట్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందించాడు. దీంతో నీరజ్ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు -
డాక్టర్పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్లోనే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్ టాస్్కఫోర్స్(ఎన్టీఎఫ్) సైతం తమ నివేదికను అందజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్టీఎఫ్కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్టీఎఫ్ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై కోల్కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. -
కోల్కతా హత్యాచార ఘటన: కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దారుణ ఘటన కేసుకు సంబంధించిన విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇక.. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ లాయర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్ స్టేట్మెంట్లు చేయొద్దని సూచించారు.‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి లేదు. కావును అటువంటి బదిలీ చేయలేం. ఇక.. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్ పోర్టును మేం పరిశీలించాం. అయితే..సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో మేం కేసు స్టేటస్ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వత స్టేటల్ అప్డేట్ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. వాదన సమయలో పశ్చిమ బెంగాల్ ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని ఓ న్యాయవాది అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. ‘‘ మీరు ఎవరి తరపున హాజరవుతున్నారు. ఇలాంటి సాధారణ ప్రకటనలు చేయొద్దు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు. కోర్టులో క్యాంటీన్ కబుర్లు చెప్పొద్దు’’ అని మందలించారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.చదవండి: నేను ఏ నేరం చేయలేదు.. ప్రభుత్వమే ఇరికిస్తోంది: సంజయ్ రాయ్ కేకలు -
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్షిప్లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్లను బెంగళూరులో, అంకుర్ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
రియల్టర్ రమేష్ హత్య కేసు: నిందితుడు రాణా పరార్
సాక్షి,హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్లో నివాసం ఉంటున్న రియల్టర్ రమేష్ కుమార్ భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం నిందితులు రమేష్కుమార్ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. సీన్ రీ కన్స్ట్రషన్ కోసం అక్టోబర్ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా కానిస్టేబుల్ హరీష్ మొబైల్ తీసుకుని పారిపోయాడని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య -
బాలిక హత్యకేసులో ఐటీ దంపతుల అరెస్టు
సేలం: బాలికను కొట్టి చంపి, సూట్ కేస్లో పెట్టి సేలం జిల్లా సంగగిరిలో పడవేసిన ఐటీ దంపతులను పోలీసులు మంగళవారం భువనేశ్వర్లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని వైకుందం ప్రాంతంలో రోడ్డు పక్కన గత సెప్టెంబర్ 30వ తేదీ అనుమానాస్పదస్థితిలో ఒక సూట్కేసు కనిపించింది. సంగగిరి పోలీసులు తనిఖీ చేయగా అందులో 15 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా నిర్వహించారు. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి టోల్ గేట్ మార్గంలో వెళ్లిన కార్లను తనిఖీ చేశారు. అప్పుడు బెంగళూరులోని ఐటీ సంస్థలో పని చేస్తున్న దంపతులకు చెందిన కారుపై వారికి అనుమానం కలిగింది. ఆ కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపారు. అందులో ఆ కారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్కు చెందిన అభినేష్ సాహు, అతని భార్య అశ్విన్పట్టిల్కు చెందినదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆ కారు అభినేష్ సాహు, అశ్విన్పట్టిల్ దంపతులు బెంగళూరు ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉండడంతో ఆ పాపను చూసు కోవడం పని మనిషి అవసరమైంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్, ముండమన్ ప్రాంతానికి చెందిన సుమైనా (15) బాలిక ఒడిశాలో ఉన్న అనాథ ఆశ్రమంలో పెరుగుతూ వచ్చింది. ఆ ఆశ్రమాన్ని అభిషేక్ సాహు తండ్రి నడుపుతున్నారు. దీంతో సుమైనాను ఇంటి పని కోసం అభిషేక్ సాహు బెంగళూరుకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఆ బాలిక సరిగ్గా పని చేయలేదని, చిన్నారికి పెట్టే ఆహారం తింటున్నట్టు ఆరోపిస్తూ బాలికను వేధింపులకు గురిచేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒక రోజు వేడి నీళ్లు తీసుకురమ్మన్ని కోరగా, ఆ బాలిక వేడినీళ్లు ఇచ్చిన సమయంలో అశ్విన్పట్టిల్పై పడిందని, దీంతో తీవ్ర ఆవేశానికి గురై ఆ బాలికపై దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆ బాలిక మృతదేహాన్ని సూట్ కేస్లో పెట్టి సేలం జిల్లా సంగగిరి ప్రాంతంలో వారు పడవేసి వెళ్లినట్టు తేలింది. దీంతో పోలీసులు అభినేష్ సాహును గత 26వ తేదీ అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం అశ్విన్పట్టిల్ను అరెస్టు చేసినట్టు బుధవారం వెల్లడించారు. -
హత్య కేసులో స్టార్ హీరోకి మధ్యంతర బెయిల్
కన్నడ హీరో దర్శన్కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.దర్శన్కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)డాక్టర్ రిపోర్టులో దర్శన్కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం) -
కోల్కతాలో మర్డర్... చార్మినార్లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సంచలనం సృష్టించిన బడా వ్యాపారి ఆరిఫ్ ఖాన్ హత్య కేసు లింకులు నగరంలో వెలుగు చూశాయి. అతడిని హతమార్చిన నిందితులు నేరుగా సిటీకి వచ్చి చారి్మనార్ ప్రాంతంలో ఆశ్రయం పొందినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శుక్రవారం ఆనందాపూర్ కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో ఈ విషయం పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే నిందితుల జాబితాలో నగరానికి చెందిన మహ్మద్ షేక్ నౌషాద్ పేరునూ చేర్చారు. అతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్కు చేరుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మరో ఇద్దరు స్నేహితులతో కలిసి... తాను ఎంతగా డిమాండ్ చేస్తున్నా, బెదిరిస్తున్నా ఆరిఫ్ ఖాన్ డబ్బులు ఇవ్వకపోవడాన్ని అబ్బాస్ జీర్ణించుకోలేకపోయారు. ఓ సందర్భంలో ఆరిఫ్ బహిరంగంగా తనను మందలించడంతో అబ్బాస్ కోపంతో రగిలిపోయాడు. ఒకప్పుడు తనతో పాటు చిన్న ఉద్యోగం చేసిన ఆరిఫ్ ఇప్పుడు బడా వ్యాపారిగా మారడంతో అప్పటికే ఈర‡్ష్యతో రగిలిపోతున్న అబ్బాస్ కోపానికి ఇది ఆజ్యం పోయినట్లయ్యింది. ఆరిఫ్ను వదిలేస్తే అతడి మాదిరిగానే మరికొందరు వ్యాపారులూ హఫ్తా ఇవ్వడం మానేస్తారని, ఆ ప్రాంతంలో తన ఆ«ధిపత్యం దెబ్బతింటుందని అబ్బాస్ భావించాడు. దీనికి ఆరిఫ్ను బహిరంగంగా, నడిరోడ్డుపై హత్య చేయడమే పరిష్కారమని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన స్నేహితులైన మహ్మద్ జహీర్ ఖాన్, అమీర్బకర్లతో కలిసి రంగంలోకి దిగాడు. హత్య తర్వాత నగరానికి వచి్చ... ఆరిఫ్ను హత్య చేయడం కోసం దాదాపు రెండు నెలల పాటు వేచి చూసిన ఈ త్రయం... ఈ ఏడాది జూలై 26న సాయంత్రం ఆనందాపూర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆరిఫ్ను అడ్డగించిన వీరు ముగ్గురూ ఘర్షణకు దిగారు. ఆపై అతడిని వెంటాడి దారుణంగా హత్య చేశారు. హత్యానంతరం ముగ్గురిలో ఇద్దరు ముంబై పారిపోగా.. అబ్బాస్ మాత్రం చారి్మనార్ ప్రాంతంలో నివసించే తన సమీప బంధువు మహ్మద్ షేక్ నౌషాద్ను సంప్రదించాడు. హత్య విషయం అతడికి చెప్పి... తనకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. నౌషాద్ అంగీకరించడంతో సిటీకి వచి్చన అబ్బాస్ అతడి వద్ద ఆశ్రయం పొందాడు. హత్య జరిగిన మూడో రోజు నగరానికి వచి్చన కోల్కతా పోలీసులు అబ్బాస్ను, ముంబైలో మిగిలిన ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు. స్నేహితుడే పగబట్టి.. కోల్కతా శివారులోని పంచన్నగ్రామ్ ప్రాంతానికి చెందిన ఆరిఫ్ ఖాన్, మోయిన్ అబ్బాస్ స్నేహితులు. గతంలో ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికారు. ఇరు కుటుంబాల మధ్యా మంచి సంబంధాలు ఉండేవి. కొన్నేళ్ల క్రితం ఆరిఫ్ ఖాన్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారం ప్రారంభించి కోల్కతాలోనే ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అబ్బాస్ మాత్రం ఆనందాపూర్ ప్రాంతంలో రౌడీగా మారి హఫ్తాలు వసూలు చేయడం మొదలెట్టాడు. ఇందులో భాగంగా తరచూ ఆరిఫ్ ఖాన్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసేవాడు. నగదు ఇచ్చే ప్రతి సందర్భంలోనూ ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా అబ్బాస్కు ఆరిఫ్ ఖాన్ హితబోధ చేస్తూ వచ్చాడు. ఇతడి ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాస్ డబ్బులు ఇవ్వడం మానేశాడు. అభియోగపత్రాల్లో నౌషాద్ పేరు... అప్పట్లో కోల్కతా పోలీసులు నౌషాద్ను అరెస్టు చేయలేదు. హత్య విషయం తెలియకపోవడతంతో అబ్బాస్కు ఆశ్రయం ఇచ్చి ఉంటాడని భావించారు. అయితే అబ్బాస్ను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించగా అన్నీ తెలిసే నౌషాద్ ఇతడికి ఆశ్రయం ఇచి్చనట్లు వెలుగులోకి వచి్చంది. దీంతో అక్కడి కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో నౌషాద్ను నాలుగో నిందితుడిగా చేర్చారు. 100 పేజీల ఈ చార్జ్ïÙట్లో 48 మందిని సాక్షులుగానూ చేర్చారు. నౌషాద్ను అరెస్టు చేయడానికి ఓ ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. అతడి ఆచూకీ లేకపోవడంతో ముమ్మరంగా గాలిస్తోంది. -
సినిమా రేంజ్ ట్విస్ట్తో మహిళ హత్య.. నాలుగు నెలల తర్వాత..
ఢిల్లీ: కాన్పూర్లో ఓ మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని బయటపడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు మహిళ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త భార్యగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేసిన జిమ్ ట్రైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ షాకింగ్ ఘటనపై నార్త్ కాన్పూర్ డీసీపీ శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్లోని రాయ్పూర్వాలో ఉన్న ఓ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద తాజాగా ఓ పని కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళ డెడ్బాడీ కనిపించింది. మృతదేహానికి పోస్టుమార్టం చేయగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త భార్య ఏక్తాగా గుర్తించాము. అయితే, ఏక్తా కనిపించడం లేదని ఆయన భర్త.. గత జూన్లో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.తాజాగా ఆమె మృతిచెందడంతో అసలు ఏం జరిగిందనే కోణం విచారణ చేపట్టాం. ఈ క్రమంలో జిమ్ ట్రైనర్తో ఆమెకు పరిచయం ఉన్నట్టు గుర్తించాము. పోలీసులు దర్యాప్తులో భాగంగా అతడే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే, ఏక్తా జూన్ నాలుగో తేదీన నిందితుడు విమల్ సోనీకి కలిసేందుకు జిమ్కు వచ్చింది. ఈ సందర్భంగా విమల్ సోనికి పెళ్లి నిశ్చయం అయినట్టు తెలుసుకుంది. దీంతో, వీరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్లారు. అప్పటికీ వాగ్వాదం కొనసాగడంతో..ఆగ్రహానికి లోనైనా విమల్.. ఆమెకు తలపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను హత్య చేసి అక్కడ పాతిపెట్టినట్టు చెప్పారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నిందితుడి వద్ద ఫోన్ లేకపోవడంతో దర్యాప్తు ఆలస్యమైందన్నారు. ఇదే సమయంలో మహిళ ధరించిన ఆభరణాలను అతడు తీసుకున్నాడా? లేదా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అలాగే, అసలు వీరి పరిచయం గురించి కూడా వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. -
ప్రేమ పేరుతో ట్రాప్.. గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమన్నందుకు..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి (19)ని గర్భవతిని చేసిన ఆమె బాయ్ఫ్రెండ్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను పూడ్చిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీకి చెందిన సోనీ (19) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సంజూ అకా సలీమ్ అనే ఓ యువకుడితో పరిచయం అయ్యాడు. వారి మధ్య స్నేహం పెరిగింది. అయితే కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే.. పెళ్లి చేసుకోవాడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అబార్షన్ చేయించుకోవాలన్నాడు.#LoveJihad: In a tragic incident in Nangloi, Delhi, a 19-year-old pregnant woman named Soni was allegedly murdered by her boyfriend, Mohammad Salim, also known as Sanju, with the assistance of two accomplices.Soni, seven months pregnant, had been pressing Salim for marriage,… pic.twitter.com/M0cqJDDfCq— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 26, 2024దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం అతడిని కలిసేందుకు యువతి వెళ్లగా.. సలీమ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హర్యానాలోని రోహ్తక్కు తీసుకెళ్లి హత్య చేశాడు. ప్రస్తుతం సోని ఏడు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. ఇక.. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుతులు సలీమ్, అతడి స్నేహితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.చదవండి: ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్ -
ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్
ఢిల్లీ: ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఉన్న బర్గర్ కింగ్ అవుట్లెట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఈ ఏడాది జూన్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ హిమాన్షు భావు గర్ల్ ఫ్రెండ్ అన్ను ధంకర్(19)ను ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసే సమయంలో నేపాల్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. హిమాన్షు భావు గ్యాంగ్లోని సభ్యులు అన్ను ధంకర్ ‘‘లేడీ డాన్’’గా పిలుస్తారని పేర్కొన్నారు.హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె అమెరికా పరారు కాలనఇక.. జూన్ 18న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్లోని బర్గర్ కింగ్ అవుట్లెట్లో అమన్ జూన్ (26) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్స్ట్ర్ హిమాన్షు భావు ప్రకటించించారు. శక్తి దాదా హత్యకు ప్రతీకారంగా అమన్ జాన్ను హత్య చేసినట్లు తెలిపాడు. అతని స్నేహితులు.. ఆశిష్, వికాస్, బిజేందర్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు షూటర్లు ఉన్నట్లు గుర్తించారు. అమన్ హత్య అనంతరం కత్రా రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ధంకర్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.నిందితురాలు అన్ను నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను ఉపయోగించి అమన్తో స్నేహం చేసింది. జూన్ 18న అతడిని బర్గర్ కింగ్ అవుట్లెట్కు పిలింపించింది. ఆమె కోసం అమన్ వేచిచూస్తుండగా.. ఆశిష్ , వికాస్ లోపలికి వెళ్లి అమన్పై 39 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బిజేందర్ అనే మరో వ్యక్తి బైక్పై వచ్చి బయట వేచి ఉన్నాడు. కాల్పుల అనంతరం ముగ్గురు పరారయ్యారు. -
హత్య కేసు: గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు బెయిల్
ముంబై: జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు ఉపశమనం లభించింది. 2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో చోటా రాజన్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు పడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజనల్ బెంచ్ జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి.. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మే 30, 2024న ముంబైలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టు రాజన్కు జీవిత ఖైదు విధించింది.Bombay High Court has given bail to Gangster Chhota Rajan in the 2001 Jaya Shetty murder case. He was convicted and sentenced to life in this case earlier this year. Divisional bench of Justice Revati Mohite Dere and Justice Prithviraj Chavan has given him bail for Rs 1 lakh. pic.twitter.com/pCzVYHY8IJ— ANI (@ANI) October 23, 2024సెంట్రల్ ముంబైలోని గామాదేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్ను జయాశెట్టి అనే మహిళ నిర్వహిచేవారు. అయితే.. 2001, మే 4న హోటల్లో ఉన్న సమయంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసి పారిపోయారు. ఈ హత్య కేసు విచారణలో చోటా రాజన్ చేయించినట్లు తేలింది. ఆమెను హత్య చేయడానకి ముందు చోటా రాజన్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్ల వెలుగులోకి వచ్చింది. దీంతో తనకు చోటా రాజన్ నుంచి ప్రాణహాని ఉందని జయా శెట్టి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ కల్పించారు. ఎలాంటి హాని లేదని పోలీసులు కొన్ని సెక్యూరిటీ ఉపసంహరించుకున్నారు. సెక్యూరిటీని తొలగించిన రెండు నెలలకే జయా శెట్టి హత్యకు గురికావటం తీవ్ర కలకలం రేపింది.చదవండి: 2006 Fake Encounter Case: 18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు -
భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు..
రాయచూరు రూరల్: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల నవ్వుల పాలవుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు పర వ్యామోహానికి గురై కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆపై చట్టానికి చిక్కి ఊచలు లెక్కించే ఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. బెళగావి నగరంలోనూ అదే జరిగింది.చంపి, కళ్లను దానం చేసివివరాలు.. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్ నగరలో నివాసమున్న పారిశ్రామికవేత్త సంతోష్ పద్మణ్ణవర్ (47) గుండెపోటుతో చనిపోయాడని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్ అందరికీ చెప్పి అంత్యక్రియలు జరిపించింది. పైగా భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న వారి కుమార్తె సంజన ఇంటికి వచ్చాక ఏదో జరిగిందని గ్రహించి 3 రోజుల కిందట స్థానిక మాళమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే సంగతులు వెలుగు చూశాయి. సంతోష్ నిరంతరం యువతులను ఇంటికి తెచ్చుకుని వారితో గడిపేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్ డిస్కులను, రికార్డర్లను తనిఖీ చేయగా అవే దృశ్యాలు కనిపించడంతో కంగుతిన్నారు.విరక్తి పుట్టి..భర్త వైఖరిని చూసి భార్య ఉమకు విరక్తి పుట్టింది. ఫేస్బుక్ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్ గౌడ (31), పవన్ (35)కు విషయం తెలిపింది. ప్లాన్ ప్రకారం సంతోష్కు నిద్రమాత్రలు మింగించారు. నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా హత్యచేశారు. పోలీసులు ఉమ ను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్బుక్ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్ గౌడతో సన్నిహితంగా ఉండేదని గుర్తించారు.హార్డ్ డిస్కుల నిండా అవేబనశంకరి: సంతోష్ ఇంటిలో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లో హతుడు సంతోష్ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్లో భద్రపరిచేవాడు. నిందితులను జైలుకు తరలించారు. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్తో ప్లాన్
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీ హత్యకు సింబంధిచి.. నిందితుల బుల్లెట్ల నిల్వ, యూట్యూబ్ ద్వారా గన్ షూటింగ్ శిక్షణ, ఘననాస్థలం నుంచి వెంటనే తప్పించుకునే ప్రణాళిక వివరాలను పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. హర్యానా చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19) షూటర్లు. హరీష్కుమార్ బలక్రమ్ నిసాద్ (23), పూణేకు చెందిన రవీణ్ లోంకర్ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్ధిఖీని హత్యకు చేసేందుకు నిందితులు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ తమ తుపాకుల్లో 65 బుల్లెట్లు అమర్చారు. ముందుగానే భారీగా బుల్లెట్లు నిల్వ ఉంచుకున్నారు. నిందితులు ఉపయోగించిన రెండు తుపాకీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి ఆస్ట్రియాలో తయారు కాగా, మరొకటి స్థానికంగా తయారు చేయబడింది. ఈ ఆయుధాలతో పాటు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు వారి వద్ద 28 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.టర్కీలో తయారు చేసిన 7.62 బోర్ పిస్టల్, 30 రౌండ్లకు సరిపడే బుల్లెట్లు కలిగివున్న నల్లటి బ్యాగ్ను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ బ్యాగ్లో రెండు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ఒకటి కేసులో అనుమానితుడైన శివకుమార్ గౌతమ్ పేరుతో ఉంది. మరొకటి సుమిత్ కుమార్ పేరుతో ఉంది. కానీ, రెండు కార్డులలో శివకుమార్ ఫోటో ఉండటం గమనార్హం.సెకండ్ హ్యాండ్ బైక్ కొని..నిందితులు ముందుగా మోటర్బైక్పై నుంచి కాల్పులు జరపాలని ప్లాన్ వేశారు. షూటర్లు లొకేషన్ వరకు ప్రయాణించి కాల్పులు జరిపి.. ఆపై బైక్పై త్వరగా పారిపోవాలని అనుకున్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రణాళికను పక్కకుపెట్టారు. అయితే.. ముగ్గురు నిందితులు హత్య జరిగిన ప్రదేశానికి ఆటో రిక్షాలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. హత్య తర్వాత వారిని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు బట్టలు మార్చుకున్నారు. నిందితుడు హరీష్కుమార్ బలక్రమ్ నిసాద్ మోటార్ బైక్ కొనుగోలుకు మిగతా నిందితులకు రూ. 60 వేలు పంపిచాడు. రూ.32 వేలతో సెకండ్ హ్యాండ్ బైక్ను కొనుగోలు చేశారు.ప్రధాన నిందితుడు, లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శుభమ్ లోంకర్తో పాటు పలువురు అనుమానితుల ప్రమేయం పోలీసుల విచారణలో వెల్లడైంది. నేపాల్కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్న లోంకర్పై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. లోంకర్ హత్యకు మూడు రోజుల ముందు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తూ అక్టోబర్ 9న తన ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అతని సోదరుడు ప్రవీణ్ లోంకర్ నిందితులకు ఆర్థిక సహాయం అందించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.యూట్యూబ్ వీడియోలతో ప్రాక్టీస్షూటర్లు యూట్యూబ్ వీడియోలు చూసి తుపాకీలను ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. హత్యకు ముందు నిందితులు ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారు ఆయుధాలను లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, హ్యాండిల్ చేయడం ప్రాక్టీస్ చేశారు. ఖాళీ స్థలం లేకపోవడంతో బుల్లెట్లు లేకుండా షూటింగ్ ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్తో కాల్పలు జరిపారు’ -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
కెనడా అడ్డగోలు ఆరోపణలు
ఒట్టావా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, కెనడా దౌత్యబంధానికి హఠాత్తుగా బీటలు పడుతున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ హైకమిషన్ పేరును చేర్చిన కెనడా తాజాగా వ్యవస్థీకృత నేరగ్యాంగ్తో భారతీయ ఏజెంట్లకు సంబంధం అంటగట్టి భారత్తో దౌత్యబంధంలో ఆగ్రహజ్వాలలను రగలించింది. భారత్పై కెనడా నోటికొచి్చనట్లు ఆరోపణలు గుప్పించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మొదలు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులదాకా అందరూ మూకుమ్మడిగా భారత్పై అభాండాలు మోపారు.కెనడాలోని ఖలిస్తానీ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఇందుకోసం కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్తో ఏజెంట్లు చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కెనడియన్లపై దాడులకు భారత్ తన ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను ఆశ్రయించిందని కెనడా ప్రధాని ట్రూడో మంగళవారం దారుణ విమర్శలు చేశారు. తప్పని పరిస్థితుల్లో భారత్పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. కెనడా అధికారులు, నేతల మూకుమ్మడి విమర్శలను భారత్ ఏకపక్షంగా తోసిపుచ్చింది.నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్కుమార్ వర్మ పేరును చేర్చడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్ అందుకు ప్రతిగా ఢిల్లీలోని ఆరుగురు దౌత్యాధికారులను బహిష్కరించడం, దానికి ప్రతీకారంగా కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యాధికారులను బహిష్కరించిన నేపథ్యంలో మంగళవారం కెనడా ఆరోపణల పర్వం మొదలెట్టింది. ఖలిస్తాన్ ఉద్యమకారులపై దాడులు కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమకారులు, నేతలపై దాడులను ప్రస్తావిస్తూ రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ డ్యూహెన్, డిప్యూటీ కమిషనర్ బ్రిగిట్ గౌవిన్లు మంగళవారం ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. ‘‘దక్షిణాసియా వాసులను, ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమంలో భాగస్వాములైన వారిని భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్తో చేతులు కలిపారు. హత్య, డజనుకుపైగా బెదిరింపులు, హింసాత్మక ఘటనలతో భారత్కు సంబంధం ఉంది. హత్యల కేసులో 8 మందిని, భారతప్రభుత్వంతో సంబంధం ఉండి బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో 22 మందిని అరెస్ట్చేశాం’’అని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసులో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ తెరపైకి వచి్చన వేళ ఆ నేరముఠా పేరును కెనడా పోలీసులు ప్రస్తావించడం గమనార్హం. భారత్ పెద్ద తప్పిదం చేసింది: ట్రూడో కెనడా రాయల్ పోలీసులు ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ట్రూడో మీడియాతో మాట్లాడారు. ‘‘కెనడియన్లపై దాడి చేసేందుకు భారత్ తన దౌత్యవేత్తలు, ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను వినియోగించి భారీ తప్పిదం చేసింది. కెనడాలో హింస పెరగడంలో భారత పాత్ర దాగి ఉంది. భారత వైఖరితో మా పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హింసకు పాల్పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గత వేసవికాలం నుంచి మా పంచ నేత్ర నిఘా కూటమి(ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా)తో భారత వైఖరిని పంచుకుంటున్నాం. చట్టాలకు అతీతంగా భారత్ హత్యలకు ప్రయత్నించింది. భారత్తో ఇలాంటి ఘర్షణాత్మక సంబంధాలను మేం కోరుకోవట్లేము. కానీ మాతో కలిసి పనిచేసేందుకు భారత్ విముఖత చూపుతోంది’’అని ట్రూడో వ్యాఖ్యానించారు. ఆరోపణలను తోసిపుచి్చన భారత్ ‘‘నిజ్జర్ కేసులో సాక్ష్యాలను ఇచ్చామని కెనడా చెబుతున్న దాంట్లో నిజం లేదు. ట్రూడో మళ్లీ అదే పాత కారణాలను, పాత విషయాలను వల్లె వేశారు. నిజ్జర్ హత్య ఘటనకు ఎవరు బాధ్యులో, ఎందుకు బాధ్యులో కెనడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఆ ఉదంతంలో గత ఏడాదికాలంగా భారత హైకమిషర్ను వేధించి ఇప్పుడు కేసులో ఇరికించి లక్ష్యంగా చేసుకోవడం అసంబద్ధం’’అని భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది.కెనడా, భారత్ జాతీయ భద్రతా సలహాదారుల రహస్య భేటీ! భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కెనడా జాతీయ భద్రతా మహిళా సలహాదారు నాథలీన్ డ్రౌలీ, ఉన్నతాధికారులతో వారం రోజుల క్రితం సింగపూర్లో రహస్యంగా సమావేశమయ్యారని అమెరికా వార్తాసంస్థ వాషింగ్టన్ పోస్ట్ కొత్త కథనం ప్రచురించింది. నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయముందని కెనడా రాయల్ పోలీసులు ఆరోపించిన వేళ ఈ వార్త చర్చనీయాంశమైంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై దాడులకు, నిజ్జర్ను హత్యచేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ నెట్వర్క్ను భారత్ వాడుకుందని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కెనడా అధికారులు దోవల్కు సమరి్పంచారని కథనం సారాంశం. -
తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..
తండ్రిని చంపిన వాడిని హతమార్చేందుకు పోలీసుగా మారి పట్టుకోవడం వంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. ప్రతికారం తీర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడి హీరో పైకి వచ్చి విలన్ని చంపుతాడో చూసి హ్యాపీగా ఫీలవ్వుతాం. అంతే కానీ ఇదే ఘటన రియల్ లైఫ్లో జరిగితే..ఔను మీరు వింటుంది నిజమే. ఓ మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోలీసుగా మారింది. మరీ ఆ హంతకుడిని పట్టుకుని హీరోలా శిక్షించిందా అంటే..ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్లో రోరైమాలోని గిస్లేనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసుగా మారింది. దారుణ హత్యకు గురైన తండ్రికి ఎట్టకేలకు న్యాయం జరిగేలా చేసింంది. అందుకోసం ఆమె 25 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి నిందితుడిని పట్టుకుని తన కుటుంబం పడ్డ బాధకు తెరపడేలా చేసింది. అసలేం జరిగిందంటే..సదరు మహిళా పోలీసు అధికారి తండ్రి జోస్ విసెంటే ఫిబ్రవరి 1999లో జస్ట్ 20 పౌండ్ల అప్పు కోసం కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన స్థానిక బార్లో చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోస్ సూపర్ మార్కెట్ యజమాని. ఆయన స్థానిక బార్లో తన స్నేహితుడితో కలిసి పూల్ ఆడుతున్న సమయంలో ఈ దిగ్బాంతికర ఘటన జరిగింది. తన తండ్రి మార్కెట్కి సంబంధించిన సరఫరదారుడు రైముండో అల్వెస్ గోమ్స్ చేతిలోనే హత్యకు గురయ్యాడు. నిజానికి గోమ్స్ తన అప్పు చెల్లించాలని డిమాండ్ చేయగా ఫ్రీజర్తో సరిపెట్టుకోమని సూచించాడట జోస్. అయితే అందుకు గోమ్స్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో గోమ్స్ క్షణికావేశంలో తుపాకీతో జోస్ తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కేడే చనిపోయాడు జోస్. అయితే 2013లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్ని పట్టుకుని 12 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ జైలు శిక్షను తప్పించుకున్నాడు. 2016లో అతని చివరి అప్పీల్ను తిరస్కరణకు గురై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే గోమ్స్ పట్టుబడకుండా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇదంతా జరిగినప్పుడూ జోస్ కూతురు డ్యూస్కు తొమ్మిదేళ్లు. అప్పుడే ఆమె నిశ్చయించుకుంది ఎలాగైన తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించాలని తీవ్రంగా నిశ్చయించుకుంది.అందుకోసం బోయా 18 ఏళ్ల వయసుకే న్యాయశాస్త్రం అభ్యసించింది. తర్వాత పోలీసు దళంలో చేరింది. తన తండ్రిని హతమార్చిన వాడిని ఎలాగైన న్యాయస్థానానికి తీసుకురావలన్న సంకల్పంతో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించింది. నిందితుడి ఆచూకీకై అలుపెరగని పోరాటం చేసింది డ్యూస్. చివరికి నిందితుడు బోయా విస్టాకు సమీపంలో ఉన్న నోవా సిడేడ్ ప్రాంతంలోని ఒక పొలంలో దాక్కున్నట్లు గుర్తించి సెప్టెంబర్ 25న అరెస్టు చేసింది. 60 ఏళ్ల వయసులో గోమ్స్ని జైలుకి పంపిచాను. అంతేగాదు అతడితో నా కారణంగానే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అతడి చెంప పగిలేట్టు చెప్పగలిగాను అని ఉద్వేగంగా చెప్పింది డ్యూస్.తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని సంకెళ్లు వేసిన క్షణంలో డ్యూస్కి కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చేశాయి. నిజాయితీపరుడైన తండ్రిని కోల్పోవడంతో తన కుటుంబం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో మర్చిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన అమ్మ ఎట్టిపరిస్థితుల్లోనూ సరైన మార్గంలోనే పయనించండి అదే మీకు మంచి చేస్తుంది అనేది. అదే ఇవాళ నిజమయ్యింది అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది డ్యూస్. సెప్టెంబర్ 26, 2024న అల్వెస్ గోమ్స్ నేరారోపణకుగాను 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిజం నిప్పులాంటిది అంటే ఇదే కదూ..!. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్సైకిల్ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్పోర్ట్లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
సిద్ధిఖీ హత్య కేసులో కొత్త కోణం.. హంతకుల దగ్గర పెప్పర్ స్ప్రే!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మూడవ నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు పెప్పర్ స్ప్రే వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులో పట్టుబడిన నిందితులిద్దరినీ అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి పంపారు.ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితులిద్దరి నుంచి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు తమ వెంట పెప్పర్ స్ప్రే కూడా తీసుకొచ్చారు. ఒక నిందితుడు గాలిలోకి పెప్పర్ స్ప్రే వెదజల్లి కాల్పులు జరపబోతుండగా, మూడో నిందితుడు(పరారీలో ఉన్న) శివకుమార్ నేరుగా కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో బాబా సిద్ధిఖీ వెంట ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయారు.ఈ కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ తరపున హత్యకు బాధ్యత వహించినట్లు ప్రకటించిన షుబు లోంకర్ సోదరుడు ప్రవీణ్ లోంకర్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడు. బాబా సిద్ధిఖీతో పాటు అతని కుమారుడు జీషన్ సిద్ధిఖీని కూడా చంపాలని ఆదేశాలు అందాయని పోలీసులకు పట్టుబడిన నిందితులు విచారణలో తెలిపారు. డీసీపీ క్రైమ్ బ్రాంచ్ దత్తా నలవాడే తెలిపిన వివరాల ప్రకారం అరెస్టయిన నిందితులిద్దరి నుంచి 28 లైవ్ కాట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: సల్మాన్కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
యూఎస్లో తెలంగాణ విద్యార్థి హత్య.. నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: తెలంగాణ విద్యార్థి హత్య కేసులో అమెరికాలోని ఇండియానా కోర్టు కీలక తీర్చు వెల్లడించింది. అమెరికా దేశస్థుడైన 25 ఏళ్ల నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్కు 60 సంవత్సరాల శిక్ష విధించింది. 2023 అక్టోబర్లో తెలంగాణకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చా జిమ్లో హత్యకు గురయ్యాడు. కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. తాజాగా కోర్టు తీర్పుతో ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్లో నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ శిక్షను అనుభవించనున్నాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడికి సాంప్రదాయ జైలు శిక్షవిధిస్తారా లేదా మానసిక ఆరోగ్య సదుపాయంతో కూడిన శిక్షను విధిస్తారా అనేదానిపై స్పష్టత లేదు.ఈ తెలంగాన విద్యార్థి హత్య సంఘటన గత ఏడాది అక్టోబర్ 29న వాల్పరైసోలోని ప్లానెట్ ఫిట్నెస్ జిమ్లో జరిగింది. హత్యకు గురైన వరుణ్ రాజ్ పుచ్చా.. మసాజ్ చైర్లో కూర్చున్నప్పుడు ఆండ్రేడ్ కత్తితో దాడి చేశాడు.తీవ్రంగా గాయడిని వరుణ్.. ఫోర్ట్ వేన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వరుణ్ వాల్పరైసో యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని చదువుతున్నాడు. రెండు నెలల్లో డిగ్రీ పూర్తి పూర్తీ చేసుకోనున్న సమయంలో హత్యకు గురయ్యాడు. వరుణ్ది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆయన తండ్రి పి.రామ్ మూర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.Telangana Student Stabbed to Death in Indiana: 60-Year Sentence for AccusedJordan Andrade, a 25-year-old from Porter Township, was sentenced to 60 years in the Indiana Department of Correction for the brutal stabbing of Varun Raj Pucha, a graduate student from Telangana, India.… pic.twitter.com/N4nIE3l7Nw— Sudhakar Udumula (@sudhakarudumula) October 13, 2024 -
సిద్ధిఖీ హత్య కేసు: ‘ ఆ నిందితుడు మైనర్ కాదు’
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హ్యత కేసులో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్కు ముంబై పోలీసులు ఆసిఫికేషన్ టెస్ట్ (వయసు నిర్ధారణ) నిర్వహించగా మైనర్ కాదని తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడు కశ్యప్ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ముందు పోలీసులు హాజరుపర్చారు.Baba Siddique murder case: Ossification test confirms accused Dharmaraj Kashyap is not minor; sent to police custodyRead @ANI Story | https://t.co/ozKl30zuSo#MumbaiPolice #BabaSiddiqueShotDead #Maharashtra pic.twitter.com/QaljPVVnUe— ANI Digital (@ani_digital) October 13, 2024 దీంతో కోర్టు కశ్యప్ను సైతం అక్టోబర్ 21 వరకు పోలీసు కస్టడీని అనుమతి మంజూరు చేసింది. అయితే ఆదివారం నిందితుడు కశ్యప్ మైనర్ అని అతని న్యాయవాది పేర్కొనడంతో ఎస్ప్లానేడ్ కోర్టు ఆసిఫికేషన్ పరీక్షను ఆదేశించించిన విషయం తెలిసిందే. నిన్ననే మరో నిందితుడు గుర్మైల్ సింగ్ను కోర్టు.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యఇక.. ఈ హత్య కేసులో మూడో నిందితుడు శివకుమార్ అనే మూడో షూటర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతన్ని మొహమ్మద్ జీషాన్ అఖ్తర్గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు.చదవండి: బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ -
మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్
ముంబై:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు నిందితులు కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు అయిన నిందితులు విచారణలో తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందినవారమని చెప్పారని సమాచారం.అరెస్టయిన ఇద్దరు నిందితుల పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్రాజ్ కశ్యప్ అని పోలీసులు గుర్తించారు. కర్నైల్ సింగ్ హర్యానా నివాసి కాగా, ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్ నివాసి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు గత 25-30 రోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ చేశారు. ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో బాంద్రా వద్దకు వచ్చారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు, ఆ ముగ్గురూ కొంతసేపు అక్కడ వేచి ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపేందుకు నిందితులు 9.9 ఎంఎం పిస్టల్ను ఉపయోగించారు. ముష్కరులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని బాంద్రా పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీకి తగిలాయి. హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పరారైన మూడో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు కోణాల్లో క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకటి బాంద్రాలోని ఎస్ఆర్ఏ వివాదానికి సంబంధించినది. మరొకటి లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించినది. బాబా సిద్ధిఖీ.. బాంద్రా (పశ్చిమ) అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
RG Kar Medical Hospital: బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు
కోల్కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోల్కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది. -
రతన్ టాటాను చంపాలనుకున్నారట!
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు?టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మధ్యమంలో పంచుకున్న వివరాల ప్రకారం..కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. తలవంచని నైజంలేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుచంపేందుకు పోటీదారులతో ఒప్పందంజైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు రూ.లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. -
అతీగతీలేని దర్యాప్తు
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు. .. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు. సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు.. నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్ఎస్పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు. -
యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం అత్యంత దారుణ హత్యకు గురైంది. గురువారం ఉపాధ్యాయుడికి ఇంట్లో చొరబడిన గుర్తుతెలియని దుండగులు నాలుగురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. ఆయన పన్హౌనాలోని కాంపోజిట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. దుండగుల కాల్పల్లో సునీల్ భార్య పూనం (32), వారి కుమార్తె దృష్టి (6), ఏడాది వయసున్న కుమార్తె మృతి చెందారు.ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీచర్ భార్య ఆగస్టు 18న చందన్ వర్మా అనే వ్యక్తి రాయ్ బరేలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు, తమ కుటుంబానికి ఏమైనా జరిగినే చందన్ వర్మానే బాధ్యుడు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్లు కూడా కేసులో ఆమె ప్రస్తావించటం గమనార్హం. అయితే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడు చందన్ వర్మా ఆచూకీ ఇంకా దొరకలేదని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కుటుంబ హత్యకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదని అన్నారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా చందన్ వర్మా వాట్సాప్ చాట్ బయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ ఐదుగురు చనిపోతారు" అని వర్మ వాట్సాప్ చాట్లో వ్రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు. -
యూపీలో ఎన్కౌంటర్..యువతిని హత్య చేసిన ముగ్గురిపై కాల్పులు
సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు గాయపడ్డారు. సుల్తాన్పూర్లో పెళ్లి పేరుతో యువతిని వంచించి, హత్య చేసిన నిందితులు సల్మాన్, సర్వర్, జావేద్లపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలపాలైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ అఖండ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.అదనపు పోలీసు సూపరింటెండెంట్ అఖండ్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 21న గోసైంగంజ్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైందన్నారు. ఊపిరాడక ఆ యువతి మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని తెలిపారు. అయితే ఇంతలో ఒక యువతి అదృశ్యంపై జూన్ ఒకటిన కడిపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యిదన్నారు.సల్మాన్, షహెన్షా, సర్వర్, జావేద్ అనే నలుగురు యువకులకు ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా సల్మాన్ ఆ యువతిని ముంబై తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె తనను పెళ్లి చేసుకోవాలని సల్మాన్ను అడిగింది. దీంతో సల్మాన్ పెళ్లికి నిరాకరిస్తూ, ఆమెను తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడు. అనంతరం సల్మాన్, అతని సహచరులు ఒక పథకం ప్రకారం సెప్టెంబర్ 20 న ఆమెను హత్య చేశారు. ఈ కేసులో షాహెన్షాను అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అఖండ్నగర్ ప్రాంతంలో పోలీసులు వారిని వెంబడించి, కాల్పులు జరిపారు. తరువాత వారిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..! -
కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోం
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్, కుటుంబసభ్యుల హత్య కేసు దోషుల మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు(రెమిషన్) చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ గత తీర్పులో తాము చేసిన పరుష వ్యాఖ్యలను తొలగించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. కోర్టు వ్యాఖ్యానాల తొలగింపు అంశాన్ని పునర్సమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ రివ్యూ పిటిషన్లో ఎలాంటి పస లేదు. గతంలో తీర్పు సందర్భంగా మేం చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ కోణంలో గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. దోషులు రెమిషన్పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్కు ఉంటుందని 2022 మేలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ చెప్పడంతోనే తాము తుది నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ ప్రభుత్వం వాదించింది. అయితే మహారాష్ట్రలోని సీబీఐ కోర్టులో కేసు విచారణ జరిగినందున రెమిషన్పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని గుజరాత్ బలవంతంగా లాక్కుందని, తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెల్సిందే. 11 మంది దోషుల రెమిషన్ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గోధ్రాలో రైలు దహనం ఉదంతం తర్వాత 2002లో గుజరాత్లో ముస్లింలపై దాడుల సందర్భంగా ఐదునెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోను రేప్ చేసి, ఆమె మూడు నెలల కూతురుసహా ఏడుగురు కుటుంబసభ్యులను ఈ 11 మంది చంపేయడం తెల్సిందే. -
మహాలక్ష్మి నన్ను కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా
బనశంకరి: ఐటీ నగరంలో వయ్యాలికావల్ మునేశ్వరనగరలో మహాలక్ష్మీ (29) అనే నేపాలీ యువతిని హత్య చేసి, ఖండాలుగా నరికి ఫ్రిజ్లో కుక్కి పారిపోయిన హంతకుడు ముక్తిరంజన్ రాయ్ కూడా కడతేరిపోయాడు. అతడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కారణాలను డెత్నోట్లో రాశాడు. ఈ నెల 3వ తేదీన ప్రేయసి మహాలక్ష్మీని హత్యచేశానని అందులో తెలిపాడు. ఆమె ఇంటికి వెళ్లాను, వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది, ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశానని రాశాడు. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టాను. ఆమె ప్రవర్తనతో విరక్తిచెంది ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. ముందుగా ఆమెను గొంతు పిసికి చంపాను, తరువాత బాత్రూమ్లో ఆమె శరీరాన్ని హ్యాక్సా బ్లేడుతో ముక్కలుముక్కలుగా చేశాను. ఆపై ఫ్రిజ్లో పెట్టాను. బాత్రూమ్లో యాసిడ్ పోసి శుభ్రం చేశానని డెత్నోట్లో రాశాడు.సొంతూరికి వెళ్లి ఆత్మహత్య20 రోజులుగా మృతదేహం ఫ్రిజ్లో ఉండిపోయింది. నాలుగు రోజుల కిందట యువతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్తిరంజన్ రాయ్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలింది. ఇద్దరూ ఒకే మాల్లో పనిచేసేవారు. అలా ప్రేమాయణం ప్రారంభించారు. హత్య తరువాత దుండగుడు 23వ తేదీ ఒడిశాలో సొంతూరైన పండి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంట్లో గడిపి మరుసటి రోజు స్కూటర్, ల్యాప్టాప్ తీసుకుని సమీప శ్మశానానికి వెళ్లాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆరుగురు బిడ్డలున్నా.. అనాథలే!
సాక్షి, చైన్నె: ఆరుగురు పిల్లలు ఉన్నా, అనాథలుగా జీ వించాల్సి రావడం ఆ వృద్ధ జంటను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. ఒక్కోనెల ఒకొక్కరి ఇంటి నుంచి ఆహారం వస్తున్నా, తమతో ప్రేమగా మా ట్లాడే వారు లేక, అనారోగ్యంతో భార్య పడుతున్న వేదనను చూడ లేక ఆమెను హత్య చేశాడు. బుధ వారం కన్యాకుమారి జిల్లా కురుందన్ కోడు ఆచారి పల్లం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన చంద్రబోస్(83), లక్ష్మీ(75) దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఆ పరిసర గ్రామాలలో తమ తమ కుటుంబాలతో ఉంటున్నారు. నెలకు ఒక ఇంట్లో నుంచి ఆహారం మాత్రం ఈ దంపతులకు వచ్చి చేరుతుండేది. అయితే వృద్ధాప్యంతో వీరు పడుతున్న బాధలు, ఆరోగ్య సమస్యలు ఆ కుమారులు, కుమార్తెల కంట పడ లేదు. మధుమేహం మరీ ఎక్కవ కావడంతో భార్య లక్ష్మి మూడు నెలలుగా మంచానికే పరిమితం కావడం చంద్రబోస్ను మరింత వేదనకు గురి చేసింది. తనకు సైతం చూపు మందగించడంతో ఆమెను చూసుకోలేని పరిస్థితి. మంచానికి పరిమితమైన ఆమె వీపు భాగం అంతా పుండు ఏర్పడి ఆ నొప్పితో లక్ష్మీపడుతున్న బాధ ఆయనను కలచి వేసింది. తమను చూసుకునే వారు లేక పోవడంతో ఇంట్లో ఉన్న కత్తి ద్వారా లక్ష్మి గొంతు కోసేశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఇంటి గుమ్మం ముందు బైటాయించాడు. బుధవారం ఉదయం అటు వైపుగా వచ్చిన చిన్నకుమార్తె చంద్రకుమారి తండ్రి గొంతు భాగం నుంచి రక్తం కారుతుండటం, లోపల తల్లి గొంతు కోయబడ్డ స్థితిలో మరణించడం చూసి ఆందోళనతో అన్నలు, అక్కలకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు, గాయాలతో పడి ఉన్న చంద్రబోస్ను ఆస్పత్రికి తరలించారు. చంద్రబోస్ వద్ద జరిపిన విచారణలో తన భార్య పడుతున్న వేదనతో హత్య చేసినట్టు, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గొంతు కోసుకున్నట్టు పోలీసులకు వివరించారు. పొడి పొడి మాటలతో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు బిడ్డలు ఉన్నా అనాథగా బతికి , చివరకు తన భార్యను హత్య చేసి, ఆతర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఈ వృద్ధుడి దీన గాథ ఆ పరిసర వాసులను కలచి వేసింది. -
ఐటీ దర్యాప్తునకు దర్శన్!
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రముఖ సినీ నటుడు దర్శన్ బళ్లారి జైల్లో ఖైదులో ఉన్నారు. ఆయన మరో విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. హత్యను కప్పిపుచ్చేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలు బయటకు రావడంతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దర్శన్ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బళ్లారి జైలులో దర్శన్ను కలిసిన ఆయన న్యాయవాది త్వరలో బెయిల్ లభిస్తుందని సూచనలిచ్చారు. ఇంతలో ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోర్టు నుంచి సెంట్రల్ జైలు అధికారులకు ఈ–మెయిల్ వచ్చింది. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు దర్శన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రేణుకాచార్య హత్య తరువాత మృతదేహం తరలింపు, ఆ నేరాన్ని ఇతరులు వేసుకోవాలని రూ. 30 లక్షలకు పైగా నగదును దర్శన్ కొందరు నిందితులకు ఇచ్చినట్లు, ఆ నగదును ఓ నిందితుని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో నగదు గురించి ఐటీ అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని సిద్ధమయ్యారు. -
వాడొక శాడిస్టు!
బనశంకరి: వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్లో మహాలక్ష్మీ (29) హత్య కేసుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో తనిఖీల్లో ఫ్రిడ్జ్పై వేలిముద్రల ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీనిపై ఎఫ్ఎస్ఎల్ నిపుణులు నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మహాలక్ష్మీ హత్య వెనుక హంతకుడు ఒక్కరేనా లేక ఇద్దరా అనే దానిపై అనుమానం వ్యక్తమైంది. హంతకుడిని శాడిస్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానిత హంతకుడి సోదరుడిని పిలిపించి సుమారు 2 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు సమాచారం రాబట్టారు. హతురాలు మహలక్ష్మీ అనుమానిత హంతకుడు ఒకేచోట పనిచేసేవారు. మల్లేశ్వరంలోని వస్త్రదుకాణంలో ఇద్దరు పనిచేసేవారు. పలు కారణాలతో హంతకుడు ఆరునెలలు క్రితం విడిచిపెట్టాడు. దీంతో అప్పటి నుంచి మహలక్ష్మీ అతని నుంచి దూరంగా ఉండటంతో అతనిలో పగ రగిలింది. ఆ కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.హంతకుడిలో వికృత ప్రవృత్తి :మహలక్ష్మీ హంతకుడు సడోమాసోకిస్ట్ తరహా ఉన్నారని అతడిని త్వరలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. హంతకుడు మహిళ దేహాన్ని 30 ముక్కలుగా కోసి ప్రిజ్లో భద్రపరచాడు. హంతకుడిలో శాడిస్టు ప్రవృత్తి ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. -
ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం
న్యూఢిల్లీ: కొత్త ఫోన్ కొన్న స్నేహితుడి నుంచి చిన్న పార్టీ ఆశించి భంగపడిన తోటి స్నేహితులు అతడిని దారుణంగా పొడిచి చంపిన విషాద ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నిందితులు ముగ్గురు 9వ తరగతి చదివే 16 ఏళ్ల టీనేజర్లు కావడం గమనార్హం. తూర్పు ఢిల్లీ పరిధిలోని షకర్పుర్ ప్రాంతం రాంజీ సమోసా దుకాణం దగ్గర అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. మంగళవారం ఢిల్లీ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఈస్ట్) అపూర్వ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సచిన్ అనే 16 ఏళ్ల టీనేజర్ ఫోన్ కొనేందుకు స్నేహితుడిని వెంట తీసుకెళ్లాడు. వారికి మరో ముగ్గురు స్నేహితులను కలుపుకున్నారు. కొత్త ఫోన్ చూశాక స్నేహితులంతా పార్టీ ఇవ్వాల్సిందేనని సచిన్పై ఒత్తిడి తెచ్చారు. అందుకు సచిన్ ససేమిరా అన్నాడు. దీంతో మాటామాటా పెరిగింది. స్నేహితుల్లో ఒకడు సచిన్ను వెనుక నుంచి కత్తితో రెండుసార్లు పొడిచి హత్యచేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. రక్తమోడుతున్న సచిన్ ఆస్పత్రిలో చనిపోయాడు. ఘటనా స్థలి మీదుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ బృందం రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను చూసి ఆగి ఆరా తీశారు. స్థానికంగా ఉండే ఆ ముగ్గురు టీనేజర్లను అరెస్ట్చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 103(1), 3(5) సెక్షన్లకింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. ఘటనాస్థలిలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. -
రేణుకాస్వామి హత్యకేసులో ఇద్దరికి బెయిల్
బనశంకరి: సంచలనాత్మక రేణుకాస్వామి హత్య కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రముఖ నటుడు, రెండవ నిందితుడు దర్శన్ బెయిల్ అర్జీ విచారణను 27వ తేదీకి నగర 57వ సీసీహెచ్.కోర్టు వాయిదావేసింది. కానీ 15, 17 నిందితులుగా ఉన్న కార్తీక్, నిఖిల్నాయక్కు బెయిలు జారీ చేసింది. సాక్షులపై ఒత్తిడి చేయరాదని, పూచీకత్తు ఇవ్వాలని కోర్టు తెలిపింది. పవిత్రాగౌడ బెయిల్ విచారణ 25 కి వాయిదా పడింది. -
హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులకు రెండు జీవితకాల కఠిన కారాగార శిక్షలు (ఏకకాలంలో అమలవుతుంది) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి, అతని కుమారుడు భానుప్రకాష్రెడ్డి 2018, మార్చి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్పై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా, వారి గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్) అడ్డుకునేందుకు ప్రయత్నించారు.బైక్ నడుపుతున్న భానుప్రకాష్రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్లగా, బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్రెడ్డి, శివారెడ్డి కిందపడిపోయారు. బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్), సూర్యనారా యణ వేటకొడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముళ్లు భాస్కర్, విజయ్, కుమారుడు (మైనర్) వేటకొడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకా ష్రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోనే పొలంలో ఉన్న అతని చిన్నాన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్రెడ్డి రావడంతో బాలకృష్ణ, అతని తమ్ముళ్లు, బంధువులు పారిపోయారు.తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. భానుప్రకాష్రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో బోయ సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్కుమార్, తలా రి సూర్యనారాయణ, మహేంద్రలకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష (ఏకకాలంలో అమలు) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్కుమార్లకు రూ.35వేలు చొప్పున, మిగిలిన ఐదుగురికి రూ.30 వేలు చొప్పున జరిమానా విధించారు. ఇద్ద రు మైనర్లపై జువైనల్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడినవారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఆరుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం.