సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు | a complaint filed in HRC on police commissioner cv anand | Sakshi
Sakshi News home page

సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Dec 24 2013 3:55 PM | Updated on Sep 2 2017 1:55 AM

సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

సైబరాబాద్ సీపీ ఆనంద్ తన భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ నేత శంకర్ రెడ్డి హెచ్ఆర్సీసీని ఆశ్రయించారు.

హైదరాబాద్: సైబరాబాద్ సీపీ ఆనంద్ తన భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ నేత శంకర్ రెడ్డి హెచ్ఆర్సీసీని ఆశ్రయించారు. తనకున్న ఐదెకరాల భూమిని బంధువులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ డీజీపీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 6లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

 

సోమవారం సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆనంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కమల కుమారి అనే మహిళ కోర్టుకు తెలిపారు.  కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.సీవీ ఆనంద్‌ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరయ్యేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement