HRC
-
‘కర్నూలు నుంచి లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలిస్తే ప్రజా ఉద్యమమే..’
సాక్షి, కర్నూలు: కర్నూలు నుండి అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ను తరలించరాదని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం అందజేశారు వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, న్యాయవాదులు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయింది. కర్నూలుకు వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించి వైఎస్ జగన్ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తాం. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి చంద్రబాబు.. కర్నూలుకు నష్టం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటాం. చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. -
ఇది ‘న్యాయ’మేనా!
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జరపాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పేదలకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్)ఏడు నెలలు గడిచినా చలనంలేదు..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్ సభ్యుడిగా దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు ఎన్జీఓల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్లో సీనియర్ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్ మూడేళ్లపాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్లో ఉన్నాయి.లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..ఇక లోకాయుక్త చైర్మన్గా జస్టిస్ పి. లక్ష్మణ్రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ ఎంపిక చేస్తారు. లోకాయుక్త చైర్మన్గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని నియమిస్తారు. మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చులేకుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పంపుతారు. లెటర్ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసినా వాది, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణలు జరుపుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు.పేదలకు ఉచిత న్యాయ సేవలు..హెచ్ఆర్సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా హెచ్ఆర్సీ, లోకాయుక్తలను ఆశ్రయించి న్యాయం పొందుతారు. కానీ, ఇప్పుడివి లేకపోవడంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. – కృష్ణమూర్తి, బార్ అసిసోయేషన్ అధ్యక్షుడు, కర్నూలు -
ఆ మూడింటి సంగతేంటి?
సాక్షి, అమరావతి: కర్నూలులో ఏర్పాటైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్లను అక్కడే కొనసాగించడమా? లేక విజయవాడకు తరలించడమా? అన్న విషయంపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయమైతే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుపై పిల్..ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే, విజయవాడలోనే వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలన్న జీఓకు విరుద్ధంగా కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయడాన్ని సవాలుచేస్తూ సామాజిక కార్యకర్త మహ్మద్ ఫరూఖ్ షుబ్లీ 2021లో పిల్ వేశారు. అంతేకాక.. హెచ్ఆర్సీ ఏర్పాటుచేసినా కూడా ఫిర్యాదులు తీసుకునేలా యంత్రాంగాన్ని ఇవ్వలేదంటూ ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ 2021లో పిల్ దాఖలు చేసింది. ఈ మూడు వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.విజయవాడలోనే ఉండాలని జీఓ ఇచ్చారు..వక్ఫ్ ట్రిబ్యునల్ రాజధాని ప్రాంతంలోనే ఉండాలంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఇచ్చిందని పిటిషర్ తరఫు న్యాయవాది సలీం పాషా తెలిపారు. ఆ జీఓ అమలులో ఉండగానే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 2021లో మరో జీఓ జారీచేసిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. లోకాయుక్త, హెచ్ఆర్సీ, వక్ఫ్బోర్డుల సంగతి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. ఆ మూడు సంస్థలు కర్నూలులో ఏర్పాటయ్యాయని, అక్కడే అవి పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వాటిని అక్కడే కొనసాగిస్తారా? లేక విజయవాడకు తరలిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రణతి చెప్పగా, ఏదో ఒక నిర్ణయం అయితే తప్పక తీసుకోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టంచేసి ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
నా డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చేస్తా: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ KA Paul మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని, అవినీతిని నిలదీస్తున్నందునే తనను కలవడానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అంటున్నారాయన. సదాశివపేట పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేసి.. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికే.. కేసీఆర్, కేటీఆర్లు మానవ హక్కులు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. ధరణి తీసుకువచ్చి మా ఛారిటీ భూములను లాక్కున్నాడు. కేసీఆర్ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయపడి నన్ను కేసీఆర్ కలవలేదు అని అన్నారాయన. ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకటేనన్న ఆయన.. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడమే అందుకు నిదర్శమని చెప్పారు. అధికార బీఆర్ఎస్ తనను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారాయన. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను. నా డబ్బు అంతా అమెరికాలో ఉండిపోయింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా’ అని చెప్పారాయన. గత 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్న కేఏపాల్.. వారం రోజుల్లో వాటికి చైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ను మానవ హక్కుల కమిషన్ గా తాను రికమండ్ చేస్తానని చెబుతూ.. లైవ్లోనే ఆయనకు ఫోన్ చేసి మరీ ‘మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా?’ అని అడిగారు. ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు ప్రగతి భవన్కు వెళ్లిన కేఏ పాల్ను.. అపాయింట్మెంట్ లేదని చెబుతూ సెక్యూరిటీ గేట్ బయటే అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి: బీజేపీ బలం సెన్సెక్స్ కాదు -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, తమపై విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా? అని రైతులు ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తన చాంబర్లో ఉండి కూడా, రాత్రి 8 గంటలైనా తమ గోడును పట్టించుకోలేదని, అలాగే ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్ఐలు లాఠీచార్జి చేసి రైతులను విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో తన్ని హింసించారన్నాని పేర్కొన్నారు. -
విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. -
అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
-
19 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన మహిళ.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
గచ్చిబౌలి(హైదరాబాద్): తన కొడుకు అలెక్స్ను ఓ యువతి ట్రాప్ చేసి తమ వద్దకు రాకుండా చేస్తుందని సుదర్శన్నగర్కు చెందిన బాబురావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. బట్టల షాపులో పనిచేసే సదరు యువతి బంధువుల సాయంతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిందన్నారు. గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అలెక్స్ స్టేట్మెంట్ రికార్డు చేసి పంపారని తెలిపారు. అతను మేజర్ అని ఎక్కడైనా ఉండవచ్చని పోలీసులు తెలిపారని, కానీ బాల్య వివాహ చట్టంలో 19 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమని ఆయన పేర్కొన్నారు. కొడుకు చదువు, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. జూన్లో పీఎస్లో ఫిర్యాదు తన కొడుకు అలెక్స్ను ఓ యువతి కిడ్నాప్ చేసిందని గత జూన్ 26న గచ్చిబౌలి ఠాణాలో బాబురావు ఫిర్యాదు చేశారు. జూన్ 28న ఇద్దరినీ పీఎస్కు రప్పించి విచారించగా తాము జూన్ 27న బీహెచ్ఈఎల్లోని దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని ఫొటోలు చూపించారు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని, నా బతుకు నే బతుకుతానని అలెక్స్ తెగేసి చెప్పాడు. అలెక్స్, జ్యోతిలు పెద్దలకు దూరంగా బతుకుతామని, ఎవరు కిడ్నాప్ చేయలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో బాబురావు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. -
ఫలించిన అంధుడి పదేళ్ల పోరాటం..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) చొరవతో మధ్యలో నిలిచిపోయిన డైట్ విద్యను కొనసాగించేందుకు ఓ అంధుడికి అవకాశం లభించింది. సీటును పునరుద్ధరిస్తూ విద్యాశాఖ శుక్రవారం నివేదికను సమర్పించడంతో పదేళ్ల పోరాట నిరీక్షణకు తెరపడింది. కడపలోని అల్మాస్ పేటకు చెందిన బి.రామాంజనేయులు కుమారుడు బి.కిరణ్కుమార్ అంధుడు. 2012లో డైట్ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించడంతో నెల్లూరు ప్రభుత్వ డైట్ కళాశాలలో సీటు వచ్చింది. తెలుగు మీడియంలో సోషల్ స్టడీస్ మెథడాలజీ డీఈడీ కోర్సులో చేరాడు. కొద్దిరోజులకే నెల్లూరు రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరిగిపోవడంతో ఐదారు నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాస్త కోలుకున్న తరువాత కాలేజీకి వెళ్లగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో సీటు నిలిపివేసినట్లు ప్రిన్సిపాల్, ఇతర అధికారులు చెప్పారు. ఒకపక్క ఆరోగ్యం బాగోలేకపోవడం, మరో పక్క సీటు రద్దు కావడంతో ఆందోళన చెందాడు. పూర్తిగా కోలుకున్నాక ఎలాగైనా డీఈడీ పూర్తి చేయాలని తలచి న్యాయం కోసం 2019లో ఉమ్మడి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. ఆ సమయంలో ఏపీ కేసులను విచారణకు తీసుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఈఏడాది ఫిబ్రవరిలో హెచ్ఆర్సీ కర్నూలు తరలివచ్చిన తరువాత మరోసారి ఫిర్యాదు చేశాడు. అయితే పోస్టులో పంపడంతో విచారణకు రాలేదు. చదవండి: (సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?) చివరగా అదే ఏడాది ఏప్రిల్ 8న నేరుగా కమిషన్ను ఆశ్రయించడంతో ప్రత్యేక కేసుగా పరిగణించి చైర్మన్ మంధాత సీతారామమూర్తి నేతృత్వంలోని బెంచ్ కిరణ్కుమార్ చదువుకోవడానికి ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని నెల్లూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు నోటీçులు జారీ చేసింది. అందుకు విద్యాశాఖ అధికారులు స్పందించి మొదటి ఏడాది డీఈడీ కాలేజీలో కొనసాగిస్తామని శుక్రవారం కమిషన్ చైర్మన్కు నివేదిక సమర్పించారు. దీంతో కిరణ్కుమార్ చదువుకోవాలన్న ఆశ, జిజ్ఞాస, పట్టుదలను చైర్మన్ అభినందించారు. విద్యాశాఖాధికారులు కూడా బాగా స్పందించి విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పించడంతో అభినందనలు తెలిపి కేసును మూసి వేసినట్లు కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గారం తారక నరసింహకుమార్ తెలిపారు. -
హీరో విశ్వక్ సేన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Complaint Of Hero Vishwak Sen: ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యుమర్ రైట్ కౌన్సిల్(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ‘ఆశోకవనంలో అర్జుణ కల్యాణం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం. చదవండి: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. చదవండి: ‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమానితో అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
తల్లిదండ్రుల రక్షణ బాధ్యత బిడ్డలదే
కర్నూలు (సెంట్రల్)/ఆళ్లగడ్డ: సంతానం ఉండి కూడా తల్లిని అనాథగా వదిలేయడం సరైన విధానం కాదని, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే అని హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని దేవరాయపురం కాలనీకి చెందిన పి.ఓలమ్మ (75) ను కుమార్తెలు, కుమారులు అనాథగా వదిలేయడంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై హెచ్ఆర్సీ స్పందించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఓలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓలమ్మ భర్త 25 ఏళ్ల క్రితమే చనిపోయినా పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఇటీవల ఆమె పక్షవాతానికి గురి కావడంతో కుమారులు, కోడళ్లు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. దీంతో తన బిడ్డలకు ఇచ్చిన మూడెకరాలను తిరిగి ఇప్పించాలని పెద్దలను కోరినా..వారెవరూ వినిపించుకోలేదు. దీంతో రోడ్డున పడిన ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సాక్షి వార్తపై హెచ్ఆర్సీ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యూడిషియల్, నాన్ జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావులు స్పందించారు. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం ఓలమ్మకు న్యాయం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్, ఆళ్లగడ్డ తహసీల్దార్, ఓలమ్మ సంతానానికి నోటీసులిస్తూ కేసు డిసెంబర్ 13కి వాయిదా వేశారు. కాగా, హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించారు. ఓలమ్మ ఉంటున్న ప్రదేశానికి చేరుకుని విచారించారు. తక్షణం ఆశ్రయం కల్పించేందుకు ఆమెను ఆళ్లగడ్డలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రానికి తరలించారు. -
న్యాయ రాజధానిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
కర్నూలు (సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) కార్యాలయం బుధవారం కర్నూలులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ ఎం.సీతారామమూర్తి తన చాంబరులో ఆశీనులవ్వగా.. జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా జడ్జి వి.రాధాకృష్ణ కృపాసాగర్, కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జేసీలు ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, ఎన్.మౌర్య, ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావుల చాంబర్లను కూడా ప్రారంభించారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి కరీం అన్నారు. మూడు రాజధానులకు ఉన్న అన్ని ఆటంకాలను ఆయన అధిగమిస్తారని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకున్న అడ్డంకులు కూడా త్వరలోనే తొలగిపోతాయన్నారు. దాదాపు 50కి పైగా జ్యూడీషియరీ కమిషన్లు న్యాయ రాజధానికి తరలివస్తాయని చెప్పారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు.. కార్యక్రమం అనంతరం జస్టిస్ ఎం.సీతారామమూర్తి మీడియాతో మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఇప్పటి నుంచి కర్నూలులో పనిచేస్తుందని ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రులను ఆయన అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే.. ప్రతి ఒక్కరూ కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఒకరోజు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో బి.పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
-
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
సాక్షి, కర్నూలు: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. -
హెచ్ఆర్సీ ఏర్పాటుపై స్టేకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: కర్నూలులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు తమ ముందున్న వ్యాజ్యాల్లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, లోకాయుక్త చైర్మన్, హెచ్ఆర్సీ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.. సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కర్నూలులో లోకాయుక్త ఏర్పాటైంది ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కర్నూలులో లోకాయుక్త ఏర్పాటైందన్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని చెప్పారు. హెచ్ఆర్సీ సైతం బుధవారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఈ సంస్థల విభజన పూర్తి కాలేదని, 2017లో హెచ్ఆర్సీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. అయితే అది ఇప్పటివరకు హైదరాబాద్లోనే కొనసాగిందని, అప్పుడు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన రాష్ట్ర భూభాగంపై హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు చేస్తుంటే అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. సీఎం, మంత్రులను ఎలా ప్రతివాదులుగా చేరుస్తారు..? ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులందరినీ ప్రతివాదులగా చేర్చడంపై ఏజీ అభ్యంతరం తెలిపారు. 2020 నుంచి ఇదో ట్రెండ్గా మారిపోయిందని, ఏ పిటిషన్ వేసినా అందులో ముఖ్యమంత్రినో, మంత్రులనో ప్రతివాదులుగా చేరుస్తున్నారని, ఇలాంటి వాటికి ఫుల్స్టాఫ్ పెట్టాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు ప్రతివాదులుగా చేర్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాదబాబును ప్రశ్నించింది. మంత్రి మండలి నిర్ణయం కాబట్టి, అందరినీ చేర్చారని చెప్పగా.. పాలన వికేంద్రీకరణ చట్టాన్ని శాసన సభ చేసింది కాబట్టి మొత్తం సభ్యులందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారా? అని ప్రశ్నించింది. కేసుకు ఏది అవసరమో అదే చేయాలంది. ఏజీ తన వాదనలను కొనసాగిస్తూ.. లోకాయుక్త, హెచ్ఆర్సీలను కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయన్నారు. పాలన వికేంద్రీకరణ చట్టానికీ కర్నూలులో ఏర్పాటు చేయడానికి సంబంధం లేదన్నారు. కర్నూలు ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లయినా కూడా ఫిర్యాదులు స్వీకరించవచ్చని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల ఏర్పాటు అంశం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. -
నేడు హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు (సెంట్రల్): న్యాయ రాజధాని కర్నూలులో మరో న్యాయసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లోకాయుక్త ప్రారంభం కాగా బుధవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇటీవల మానవహక్కుల కమిషన్ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం 10–11 గంటల మధ్య ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. -
కర్నూలులో ఏపీ మానవహక్కుల కమిషన్
సాక్షి, విజయవాడ: కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్(ఏపీ హెచ్ఆర్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్ని మానవ హక్కుల కమిషన్కి హెడ్ క్వార్టర్గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది. చదవండి: (ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’) -
హెచ్ఆర్సీని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను (హెచ్ఆర్సీని) రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసే విశేషాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫలానా చోటునే హెచ్ఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పలేమంది. తెలంగాణలో కాకుండా మన రాష్ట్ర భూభాగంలో హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పామని హైకోర్టు గుర్తుచేసింది. కర్నూలులో హెచ్ఆర్సీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అమరావతిలో హెచ్ఆర్సీని ఏర్పాటు చేస్తూ 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ను సవరించి కర్నూలులో ఏర్పాటుకు తాజా నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. హెచ్ఆర్సీ ఏర్పాటుకు వీలుగా కర్నూలులో రెండు ప్రాంగణాలను హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులు పరిశీలించారని, అవి అనువుగా లేకపోవడంతో కొత్త ప్రాంగణాన్ని చూస్తున్నారని తెలిపారు. హెచ్ఆర్సీ ఏర్పాటు విషయంలో పురోగతిని తెలిపేందుకు విచారణను ఓ నెలపాటు వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ విచారణను సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ హెచ్ఆర్సీ కార్యాలయం తెలంగాణలో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటు చేయడం దూరాభారం అవుతుందని పిటిషనర్ న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
పోలీసులు కబ్జాదారులతో కలిసి బెదిరిస్తున్నారని HRC లో ఫిర్యాదు
-
ఉన్నతాధికారులకు మరో అవకాశం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు న్యాయస్థానం మరో అవకాశం ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించిన హైకోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని ఇద్దరు అధికారులు అభ్యర్థించడంతో సానుకూలంగా స్పందించి జైలు శిక్ష, జరిమానా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏం జరిగిందంటే.. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మ«ధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. కోర్టు ఆదేశాల మేరకు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరు కాగా నెల రోజులు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ ఇద్దరు అధికారుల తరఫున హాజరై కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కావాలని కోరారు. సుమన్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ విచారణను వాయిదా వేశారు. హెచ్ఆర్సీలో సదుపాయాలపై వివరాలివ్వండి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి కార్యాలయం, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్సీ కార్యాలయం హైదరాబాద్లో ఎందుకు ఉంది? అది ఏపీ భూ భాగం నుంచి ఎందుకు పనిచేయడం లేదో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను జూలై 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదు తీసుకుని విచారించడం సాధ్యం కావడంలేదంటూ ఏపీ పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్ను కోరారు. -
రోడ్డుపై గుంత: చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు
చందానగర్: రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్కు చెందిన వంగల వినయ్ గత ఏడాది డిసెంబర్ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడటంతో వినయ్ వెన్నెముకకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం..రహదారి పర్యవేక్షణ లేకపోవడంతో తనకు గాయమైందని దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 6న ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేశారు. 15 రోజులైనా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో శనివారం చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 21న హెచ్ఆర్సీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ( చదవండి: నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం ) -
సాక్షి కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ
నాంపల్లి: ‘అధికారుల నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణ సంకటం’ గా మారిందంటూ సాక్షి దినపత్రిక కూకట్పల్లిలో ఈ నెల 10న వెలువడిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ స్థానిక ప్రజలు, కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం పట్ల విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానందనగర్ అపార్ట్మెంట్స్, అల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, సుమిత్రానగర్, పాపిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మార్చి 18కి వాయిదా వేసింది. చదవండి: యూటర్న్ తీసుకుని వచ్చి మరీ మంత్రి పరామర్శ -
చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని
సాక్షి, నాంపల్లి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన కు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) -
శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై సినీ నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) బుధవారం స్పందించింది. మౌంట్ లిటేరా జీ స్కూల్పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
జగ్గారెడ్డిపై ఎచ్ఆర్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి హరీష్ రావుపై అసభ్యపదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మంగళవారం ఖండించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రైవేటు ఉద్యోగ సంఘం నేతలు మండిపడ్డారు. అదేవిధంగా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తెలిపింది. చదవండి: ‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’ ఈ సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగ్గారెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి హరీష్రావుపై అనుచిత వాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగ్గారెడ్డి తక్షణం హరీష్ రావుకి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై అనుచితన వాఖ్యలు చేస్తే ఉరుకోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. జగ్గారెడ్డి భాష మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామనాని గంధం రాములు పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..! -
చిన్నారులపై చిన్న చూపేలా?
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో దొరికిన పిల్లలు, లైంగిక దాడులకు గురైన చిన్నారులకు కుటుంబ వాతావరణం కల్పించి వారి బాగోగులు చూడాల్సిన శిశు విహర్ కేంద్రాలు ఆ దిశగా పనిచేయడం లేదని బాలల హక్కుల సంఘం మండిపడింది. ఇటీవల హైదరాబాద్లోని యూసఫ్గూడ శిశు విహార్ కేంద్రంలో 4 రోజుల వయసున్న నిత్య తలకు గాయమై, 9 నెలల వయసున్న సత్యశ్రీ ఫంగల్ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శిశు విహార్ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారులు మృతి చెందారని, వారి మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీలో పిటిషన్ వేసింది. -
పెళ్లికాని వాళ్ళే ఓయో రూమ్ బుక్ చేస్తున్నారు..
నాంపల్లి: ఓయో ఫ్రాంచైజీ, అసోసియేటెడ్ లాడ్జీలు ప్రేమోన్మాదులకు అడ్డాగా మారాయని సంఘ సేవకులు సీహెచ్.రాహుల్ ఆరోపించారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న యువకులకు లాడ్జిల్లో గదులను కేటాయిస్తున్నారన్నారు. ఎక్కువ శాతం పెళ్లికాని అమ్మాయి, అబ్బాయిలు ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకుని పట్టణాల్లోని ఓయో లాడ్జిలలో దిగుతూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఓయో ఫ్రాంచైజీ, అసోసియేటెడ్ హోటల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ హోటల్స్లో పెళ్లికాని వారిని అనుమతించకుండా చూడాలన్నారు. దిల్సుఖ్నగర్లో జరిగిన ప్రేమోన్మాది ఘటన కూడా ఓయో హోటల్లోనే జరిగిందని గుర్తు చేశారు. -
సౌదీ నుంచి శవాన్ని తెప్పించాలని విజ్ఞప్తి
-
సౌదీ నుంచి మృతదేహాన్ని తెప్పించండి
రియాద్ : సౌదీ అరేబియాలోని రియాద్లో నెలరోజుల క్రితం మరణించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన చౌక రమేశ్(42) అనే కారు డ్రైవర్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ మృతుని భార్య లావణ్య తల్లి రుక్కుంబాయి, తమ్ముడు రాజేశ్వర్ మానవహక్కుల కమిషన్లో ఫిటిషన్ దాఖలుచేశారు. అనంతరం హెచ్చార్సీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 67 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య లావణ్య ఇద్దరు కుమార్తెలు శివాణి (11), పావని (9) ఉన్నారు. హక్కుల కమిషన్ను ఆశ్రయించడానికి సహకరించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి సురేందర్సింగ్ ఠాకూర్, వలసకార్మికుల హక్కుల కార్యకర్త, న్యాయవాది అబ్దుల్ ఖాదర్లు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో మరణించినవారి శవాలను తెప్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలలో ప్రత్యేక విభాగాలను, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలరూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. గల్ఫ్లో గత ఐదేళ్లలో తెలంగాణ ప్రవాసులు వెయ్యిమందికిపైగా చనిపోయారని వారు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఫోరం హెల్ప్ లైన్ నెం. +91 93912 03187ను సంప్రదించాలని కోరారు. -
ఎంపికైన టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలి
హైదరాబాద్: పబ్లిక్ కమిషన్ ద్వారా సెలక్ట్ అయిన 8,792 మంది టీచర్లకు వారం రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకపోతే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన సెలక్టెడ్ టీచర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సెలక్ట్ అయిన టీచర్లకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని విమర్శించారు. జాప్యం మూలంగా నెలకు రూ.100 కోట్లు బడ్జెట్ మిగుల్చుకోవాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. అనేక వివాదాల మధ్య 6 నెలల క్రితం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్టెడ్ టీచర్ల జాబితాను విద్యాశాఖ అధికారులకు పంపారని, గత 6 నెలలుగా సీఎం పేషీలో ఈ ఫైలు పెండింగ్లో ఉందన్నారు. సీఎం ఫైళ్లను చూడటం లేదని, అందువల్ల సెలక్ట్ అయిన వేలాదిమంది టీచర్లు నిరుద్యోగులుగా మారా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్ను నియమించకుండా విద్యను భ్రష్టు పట్టిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్న ఇంటర్ గందరగోళానికి కారణం సరైన అధ్యాపకులు లేకపోవడమేనన్నారు. దాదాపు 70% జూని యర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో విద్యార్హతలు లేని వారితో పేపర్ వ్యాల్యుయేషన్ చేయించారని ఆరోపించారు. టీచర్ ఉద్యోగాల భర్తీని పీఎస్సీ నుంచి బదిలీ చేసిన డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా టీచర్ ఉద్యోగాల భర్తీని జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, దాసు సురేష్, జి.అంజి తదితరులు పాల్గొన్నారు. -
కడుపులో కత్తెర మరచినందుకు భారీ జరిమానా
సాక్షి, అమరావతి: ఆపరేషన్ సమయంలో కడుపులో కత్తెర పెట్టి అలాగే మరచిపోయినందుకు గాను జాతీయ మానవహక్కుల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రూ.3 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నెల్లూరు జిల్లా కొత్తకలువకు చెందిన పి.చలపతికి కొద్ది నెలల క్రితం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులోనే కత్తెర మరచి కుట్లు వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తీవ్రంగా కడుపునొప్పి వచ్చి అతను మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా కడపులో కత్తెర ఉన్నట్టు గుర్తించి తిరిగి ఆపరేషన్ చేసి తీశారు. దీనిపై బాధితుడు హెచ్చార్సీని ఆశ్రయించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తనకు అన్యాయం జరిగిందని, తనకు పరిహారం వచ్చేలా చూడాలని విన్నవించారు. దీనికి స్పందించిన హెచ్చార్సీ... బాధితుడికి రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు బాధితుడికి రూ.3 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన అర్చకుడు గంటి రాధాకృష్ణ
-
కేసీఆర్పై హెచ్చార్సీలో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావుపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో దివ్యాంగులను ఉద్దేశించి కుంటోళ్లు, గుడ్డోళ్లు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారని, ఇలా మాట్లాడటం వారి ని కించపరచడమేనంటూ టీపీసీసీ దివ్యాంగుల విభాగం హెచ్చార్సీని ఆశ్రయించింది. ఈ మేరకు టీపీసీసీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తినేని వీరయ్య వర్మ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా దివ్యాంగుల చట్టం 2016లో పేర్కొన్న 14 రకాల వైకల్యాల్ని గుర్తించకపోవటం వల్ల లక్షలమంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగ సమయంలో ఎన్నికల సంఘం కల్పించే సదుపాయాలను కోల్పోతున్నారని, ఇది దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హెచ్చార్సీని ఆశ్రయించిన వారిలో దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు సతీశ్గౌడ్ కూడా ఉన్నారు. -
హెచ్ ఆర్సీ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
-
కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన అంశంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. ఆ çఘటనకు సంబంధించి వివరణ కోరుతూ వైద్య ఆరోగ్యశాఖకు నోటీసులు జారీచేసింది. ఆపరేషన్లు వికటించడంలో బాధ్యత ఎవరిది? ఆస్పత్రిలో ఎక్కడ లోపం జరిగింది? అందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల పరిస్థితెలా ఉంది? వారికెలాంటి చికిత్స అందిస్తున్నారు? వంటి వివరాలనూ పంపాలని ఆదేశించి నట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ జయ ఆస్పత్రిలో 17 మందికి కంటి ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. వారందరినీ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో 13 మందిని డిశ్చార్జి చేయగా.. మిగిలిన నలుగురికి చికిత్స జరుగుతోంది. ఆస్పత్రిదే బాధ్యత: కంటి ఆపరేషన్లు వికటించిన çఘటనలో వరంగల్లోని ప్రైవేటు ఆస్పత్రిదే బాధ్య తని వైద్యారోగ్యశాఖ నిర్ధారణకు వచ్చింది. దీన్నే హెచ్చార్సీకి విన్నవించాలని నిర్ణయించింది. హెచ్చార్సీకి వివరిస్తూ సమగ్ర నివేదికను ఆ శాఖ తయారు చేసింది. ఆపరేషన్ చేసిన వైద్యులూ బాధ్యులేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ థియేటర్ను ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించకపోవడం, రోగులకు శస్త్రచికిత్స సమయంలో నిర్లక్ష్యం కనిపించిందని వివరించింది. అవి కంటి వెలుగు కింద చేసిన ఆపరేషన్లు కావని హెచ్చార్సీకి విన్నవించనుంది. తద్వారా కంటి వెలుగు పథకంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆస్పత్రి సీజ్..? ఘటన జరిగిన వెంటనే తాము ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని వరంగల్కు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చార్సీకి పంపే నివేదికలో ప్రస్తావించింది. ఆస్పత్రిదే బాధ్యతగా నిర్ధారణకు వచ్చామని సర్కారు వెల్లడించింది. దీంతో ఆస్పత్రిపైనా, వైద్యం చేసిన డాక్టర్లపైనా చర్యలు తీసుకుంటామని విన్నవించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వైద్య బృందం సిఫార్సుల మేరకు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయడమా? లేదా ఆస్పత్రిని సీజ్ చేయడమా? లేదా ఆస్ప త్రిలో కంటి వైద్య విభాగాన్ని సీజ్ చేయడమా అన్నది పరిశీలన చేస్తున్నట్లు హెచ్చార్సీకి ఇచ్చే వివరణలో తెలిపింది. అలాగే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
కొండగట్టు ప్రమాదంపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి కరీంనగర్ లోక్సత్తా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన 60 మందికి రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని హక్కుల కమిషన్ను కోరారు. -
కొండంత విషాదం: వెంటీలెటర్పై మరో నలుగురు
సాక్షి, జగిత్యాల/హైదరాబాద్ : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. మరోవైపు హైదరాబాద్లోని సన్షైన్ ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు వెంటిలేటర్పై ఉన్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని సన్షైన్ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హెచ్చార్సీలో ఫిర్యాదు కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో హైకోర్టు న్యాయవాది అరుణ్కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాద్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన హెచ్చార్సీని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రెషియా ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ను అభ్యర్థించారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం ఆర్టీసి అధికారుల నిర్లక్ష్య కారణంగానే కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిందని, ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల పేదల కుటుంబాలు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. బుధవారం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. -
షికాగో సెక్స్ రాకెట్ : హెచ్ఆర్సీలో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో కలకలం రేపుతున్న షికాగో సెక్స్ రాకెట్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించాలని న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీలో పిటిషన్ వేశారు. సెక్స్రాకెట్లో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నందున సమాజంపై అది ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. షికాగో సెక్స్రాకెట్ లాంటి వ్యవహారాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని న్యాయవాది అరుణ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది చదవండి : షికాగో సెక్స్రాకెట్: గుట్టువిప్పిన సినీతారలు -
‘ఐరాస హక్కుల’ నుంచి అమెరికా ఔట్
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి: అగ్రరాజ్యం అమెరికా అన్నంత పనిచేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(యూఎన్–హెచ్ఆర్సీ) ఇజ్రాయెల్పై పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఆ సంస్థ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీహేలీ, విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో కలసి వాషింగ్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అత్యంత అమానవీయమైన దేశాలు తనిఖీల్ని తప్పించుకుంటున్నాయి. కానీ యూఎన్ హెచ్ఆర్సీ మాత్రం వారిని వదిలేసి మానవహక్కుల పరిరక్షణలో మంచి రికార్డు ఉన్న దేశాల్ని(ఇజ్రాయెల్) లక్ష్యంగా చేసుకుంటోంది. మండలి ఇజ్రాయెల్పై ఎడతెగని శత్రుత్వాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మానవహక్కుల ఉల్లంఘనలు, దురాగతాలకు పాల్పడే దేశాలే మండలిలో సభ్యులుగా ఉన్నాయి’ అని నిక్కీ హేలీ విమర్శించారు. యూఎన్ హెచ్ఆర్సీ ప్రస్తుతం రాజకీయ పక్షపాతంలో కూడిన మురికిగుంటగా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. మానవహక్కుల్ని ఉల్లంఘించి, దుర్మార్గాలకు పాల్పడిన దేశాలే యూఎన్ హెచ్ఆర్సీకి ఎన్నికవుతున్నాయని హేలీ ఎద్దేవా చేశారు. మండలి నుంచి వైదొలిగినప్పటికీ అమెరికా మానవహక్కులకు కట్టుబడి ఉంటుందన్నారు. తాజాగా మెక్సికో అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం అన్యాయమని యూఎన్–హెచ్ఆర్సీ విమర్శించింది. దీంతో ట్రంప్ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని అవలంబిస్తుందని ఆరోపిస్తూ అమెరికా గతేడాది ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నుంచి కూడా బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఏర్పడిన యూఎన్ హెచ్ఆర్సీలో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి. -
యాసిడ్ దాడి బాధితురాలి పోరాటం
కోల్కతా: ఆమె నాలుగేళ్ల పోరాటం ఫలించింది. తనపై యాసిడ్తో దాడిని దుర్మార్గుడిని కటకటాల వెనక్కునెట్టింది. పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న యాసిడ్ దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంచయిత యాదవ్(25) బెంగాల్లోని డుండుంలోని సెత్బగాన్ ప్రాంతంలో 2014లో సోమెన్ సాహా అనే యువకుడి చేతిలో యాసిడ్ దాడికి గురైంది. తన తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమెపై యాసిడ్ పోశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో తన తల్లిముందే సంచయితపై సాహా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పోరాటం తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయించగలిగింది. పూర్తిగా కాలిపోయిన ముఖంతో మానసికంగా ఎంతో కుంగిపోయానని, తన తల్లి సహాయంతో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశానని సంచయిత తెలిపింది. నాలుగేళ్లనుంచి పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరు తమను పట్టించుకోలేదని, తనకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదన్న ఉద్దేశంతో పోరాటం చేశానన్నారు. యాసిడ్ దాడి బాధితుల తరుఫున పోరాడే ఎన్జీవోల సహాయంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను కలిసి 2017లో బెంగాల్ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు డండం పోలీసులు ఆదివారం సోనార్పూర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లో నిందితుడిని చూసిన సంచయిత పట్టరాని కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. నాలుగేళ్లుగా ఎంతో క్షోభ అనుభవించానని, తన జీవితాన్ని నాశనం చేసిన సాహా మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కోపాన్ని ఆపులేకపోయినట్టు ఆమె వివరించింది. తన పోరాటం ఆగిపోలేదని, నిందితుడికి శిక్ష పడేవరకు తన పోరాటం ఆపనని స్పష్టం చేసింది. -
లాకప్ డెత్ : పోలీసులే చంపేశారు
రక్షక భటులే భక్షకులయ్యారంటూ జనం తిరగబడ్డారు. ప్రజాగ్రహానికి పోలీస్స్టేషన్ రణరంగమైంది. ఆందోళనకారులు బీభత్సం సృష్టించి పోలీస్స్టేషన్, అక్కడి వాహనాలకు నిప్పుపెట్టారు. స్టేషన్లోని విలువైన పత్రాలను తగులబెట్టారు. అలజడి సృష్టిస్తున్న ఆందోళనకారులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. సంబల్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ విధ్వంసకర సంఘటనపై బాధ్యులను చేస్తూ ముగ్గురు పోలీస్ సిబ్బందిపై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు. భువనేశ్వర్/సంబల్పూర్: సంబల్పూర్ జిల్లాలోని ఒంయిఠాపల్లి పోలీస్స్టేషన్లో జరిగిన లాకప్డెత్ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి ఓ నిందితుడు పోలీస్స్టేషన్లో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం ఈ వార్త ప్రసారం కావడంతో సంబల్పూర్లో శాంతిభద్రతలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల 7వతేదీన జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మొబైల్, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా చోరీ కేసులో ఒంయిఠాపల్లి పోలీసులు భాలూపల్లి గ్రామస్తుడు ఒవినాష్ ముండాను(25) అనుమానిత నిందితుడిగా గురువారం స్టేషన్కు తీసుకువచ్చారు. మర్నాడు ఉదయం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. బెడ్షీట్తో ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల కథనం. శుక్రవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో కుటుంబీకులకు ఈ వార్త తెలిసింది. జిల్లా ప్రధానఆస్పత్రికి మృతదేహం తరలించినటుŠల్ తెలియడంతో అంతా అక్కడకు చేరారు. మృతుని కుటుంబీకులు, మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులే చంపేశారు తమబిడ్డ ప్రాణాల్ని పోలీసులే పొట్టన పెట్టుకున్నారని కుటుంబీకులు వాపోతున్నారు. పోలీసుల వేధింపులు తాళలేని పరిస్థితుల్లోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని మృతుని కుటుంబీకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. వీరితో పాటు స్థానికులు కూడా పోలీస్ చర్యల పట్ల సందేహం వ్యక్తం చేస్తున్నారు. దుశ్చర్యలకు ఆత్మహత్య రంగు పులిమి దాటవేతకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో జరిగిన సంప్రదింపులు క్రమంగా వేడెక్కాయి. నిందితుని ప్రాణాల్ని పోలీసులే బలిగొన్నారన్న ఆరోపణ బహిరంగంగా ప్రసారం కావడంతో ఒంయిఠాపల్లి పోలీస్స్టేషన్ పరిసరాలు యుద్ధరంగంగా మారాయి. మృతుని కుటుంబీకులు, బంధుమిత్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా పోలీస్స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుతూ విజృంభించారు. స్టేషన్లోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. స్థానికుల ఆగ్రహావేశాల్ని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఒంయిఠాపల్లి స్టేషన్పై నిరవధికంగా రాళ్లు రువ్విన స్థానికులు చివరికి నిప్పు అంటించారు. అలాగే స్టేషన్ ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పరిస్థితి చేయి దాటింది. ప్రజలు పోలీసులపై ప్రత్యక్ష తిరుగుబాటుకు సిద్ధం కావడంతో పోలీస్స్టేషన్ ఆవరణ రణక్షేత్రంగా మారింది. పోలీసులు, ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు సాధారణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువుర్ని ఆస్పత్రిలో చేర్చారు. స్టేషన్ పరిసరాల్లో బీభత్సానికి పాల్పడిన ప్రజానీకం అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో సంబల్పూర్–ఝార్సుగుడ మార్గంలో వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మానవ హక్కుల కమిషన్ విచారణ ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించినట్లు డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. ముగ్గురు సభ్యుల మానవ హక్కుల కమిషన్ బృందం ఈ దర్యాప్తు చేపడుతుంది. ఉత్తర ప్రాంతీయ ఇనస్పెక్టర్ జనరల్ ఈ సంఘటనలో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి నివేదిక దాఖలు చేస్తారని డీజీపీ తెలిపారు. సత్వరమే ఈ నివేదిక దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. సంబల్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంప్రదింపులతో మానవ హక్కుల పరిరక్షణ బృందం విచారణ, దర్యాప్తు కొనసాగుతుందని మానవ హక్కుల పరిరక్షణ విభాగం – హెచ్ఆర్పీసీ అదనపు డైరెక్టర్ జనరల్ మహేంద్ర ప్రతాప్ తెలిపారు. ఇన్స్పెక్టర్ ఇన్చార్జిపై వేటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణ కింద సంబల్పూర్ ఒంయిఠాపల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జిని తక్షణమే విధుల నుంచి తప్పించి సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్టేషన్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు డీజీపీ ప్రకటించారు. వీరిలో స్టేషన్ డైరీ చార్జ్ ఆఫీసర్, సెంట్రీ ఇన్చార్జి ఉన్నట్లు ఉత్తర ప్రాంతీయ ఇన్స్పెక్టర్ జనరల్ సుశాంత నాథ్ తెలిపారు. 2 యూనిట్ల అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటల్ని నివారించింది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటే శాంతిభద్రతల పరిరక్షణ సక్రమంగా ఉంటుందని డీజీపీ వివరించారు. పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించడం అనివార్యమవుతుందని డీజీపీ స్పష్టం చేశారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు 7 ప్లాటూన్ల పోలీసు దళాల్ని రంగంలోకి దింపారు. హెచ్ఆర్సీ మార్గదర్శకాలతో పోస్ట్మార్టం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు సందిగ్ధ లాకప్ డెత్ సంఘటనలో మృతదేహానికి పోస్ట్మార్టం జరుగుతుంది. వైద్య నిపుణుల బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో శవపరీక్షలు నిర్వహిస్తారు. ఈ యావత్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ అవుతుందని సంబల్పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం పోలీసు స్టేషన్లో తుదిశ్వాస విడిచిన నిందితుని కుటుంబీకులకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. లాకప్ డెత్ను పురస్కరించుకుని ఆయన ఈ పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపట్ల సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
హైపర్ ఆదిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు కూడా ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని పోస్ట్ చేశాడు. అయితే గురువారం ప్రసారమై ఆది స్కిట్లో ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సి)లో ఫిర్యాదు చేశారు. శుభ్రంగా ఉండరు.. చదువు రాదు.. ఎన్ని వసతులు కల్పించినా దళితులు మారరంటూ వారిపై ఇటీవల వైఎస్సార్జిల్లా జమ్మలమడుగులో మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళితులను కించపరిచిన ఆయనపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మేడ కృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్ఆర్సీ స్పందించి అక్టోబర్ 31వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కడప ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
అమాయకులపై థర్డ్ డిగ్రీనా?
హైదరాబాద్: సిరిసిల్ల మండలం తంగెపల్లికి చెందిన ఆరుగురిని తీవ్రంగా చిత్రహింసల పాలు చేసిన పోలీసులను విచారణకు హాజరుకావాలని హెచ్చార్సీ ఆదేశించింది. ఇసుక రవాణాకు అడ్డు నిలుస్తున్నారంటూ గ్రామంలోని ఓ కుంటుంబానికి చెందిన ఆరుగురిపై సిరిసిల్ల పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. వారిని తీవ్రంగా కొట్టడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బాధిత కుటుంబీకులు డీఐజీకి కూడా ఫిర్యాదు చేశారు. మంగళవారం వారు హైదరాబాద్ కు వచ్చి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. చిత్ర హింసలు పెట్టిన ఎస్పీతో పాటు ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకునే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. స్పందించినా హెచ్చార్సీ సెప్టెంబర్ 13వ తేదీన హాజరు కావాలని సిరిసిల్ల పోలీసులను ఆదేశించారు. -
రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్దదెబ్బే!
► జేసీ బ్రదర్స్కు తాడిపత్రిలో వ్యతిరేక పవనాలు ► నేడు బీజేపీలో చేరనున్న ప్రభోదానందస్వామి కుమారుడు ► కేంద్ర, రాష్ట్ర మంత్రులు రవిశంకరప్రసాద్, మాణిక్యాలరావు తాడిపత్రికి రాక ► మట్కా, పేకాటపై డీఐజీ, ఎస్సీ సీరియస్...74మందితో జాబితా సిద్ధం ! ► అధికశాతం మంది అధికార పార్టీ నేతలు, జేసీ అనుచరులే అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? స్వపక్ష నేతలు జేసీ బ్రదర్స్ వైఖరి తాళలేక పార్టీకి దూరమవుతున్నారా? మిత్రపక్షం బీజేపీ నేతలు వీరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? ప్రభోదానంద ఆశ్రమం విషయంలో వారి జోక్యం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతోందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు జేసీ ప్రభాకర్రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో జేసీ బ్రదర్స్ డైలమాలో ఉన్నారు. దీంతోపాటు రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత తాడిపత్రి పేకాట, మట్కాపై డీఐజీ, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో అధికశాతం మంది జేసీ అనుచరులే ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి తాజా పరిణామాలతో జేసీ బ్రదర్స్తో పాటు వారి అనుచరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ అవినీతిపై కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితోనూ విభేదించి పోరాడారు. ఉన్న కౌన్సిలర్లలో జయచంద్రారెడ్డి బలమైన నేత. ఈయన పార్టీకి దూరం కావడంతో స్వపక్షసభ్యులు జేసీ బ్రదర్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘ఎవరైనా మా మాట వినాల్సిందే. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాం’. అనే ధోరణిలో సంకేతాలు పంపడం ఏమిటని బాహాటంగానే నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు.. జేసీ ప్రభాకర్రెడ్డిపై గతనెల 29న హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఆశ్రమానికి ఇసుక రవాణా చేస్తున్న లారీ అంశంలో దాసరి వెంకటేశ్ అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించి ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలిచారు. ఇదేరోజు తాడిపత్రి వాసి పైలా నర్సింహయ్యకు చికిత్స విషయంలోనూ జేసీపీఆర్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడం, ప్రభాకర్తో తనకు ప్రాణహాని ఉందని పైలా పేర్కొనడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఈక్రమంలో తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం కూడా కలకలం రేపింది. పేకాటతోనే ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది, మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికారపార్టీ నేతలు, కార్యకర్తలే అధికంగా ఉన్నారు. వెరసి ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిలో ‘బ్రదర్స్’ పాత్రపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. నేడు బీజేపీలోకి వివేకానంద ప్రభోదానంద ఆశ్రమనిర్వహణకు జేసీ బ్రదర్స్ అడ్డుపడుతున్నారనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారు. దీంతో వీరిని రాజకీయంగానే ఎదుర్కోవాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రభోదానంద స్వామి కుమారుడు వివేకానందచౌదరి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇతను కాకినాడలో ఉంటున్నారు. తాడిపత్రిలో ఆశ్రమంలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి నేడు చిన్నపొడమల ఆశ్రమానికి రానున్నారు. వీరి సమక్షంలో వివేకానంద పార్టీలో చేరనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేపనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో టీడీపీ నుంచి బలమైన వర్గం వైఎస్సార్సీపీకి దగ్గరవుతోంది. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండటంతో వారి నుంచి ఇబ్బందులు ఎదురవుకుండా టీడీపీలో కొనసాగుతున్నారు. మంచి సమయం చూసి వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో బీజేపీ రూపంలో మరోదెబ్బ తగలడం, అందులోనూ టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ ఉండటం, ఇందులో జేసీని వ్యతిరేకించేవారు చేరడంతో రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్దదెబ్బే! అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ అశోక్కుమార్ తాడిపత్రి పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా 74మందితో ఓ జాబితాతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా మట్కా, పేకాట రాయుళ్ల జాబితాను ఎస్పీకి సమర్పించినట్లు తెలుస్తోంది. తాడిపత్రి పోలీసులు చురుగ్గా లేరనే కారణంతో అనంతపురం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి తనిఖీలు చేయించే యోచనలో ‘పోలీస్ బాస్లు’ ఉన్నారు. అరెస్టుల తర్వాత ఇన్నిరోజులు పేకాట, మట్కా నిర్వహణలో తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై కూడా వారు ఆరా తీసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికశాతం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికే తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లు తాడిపత్రి వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో అధికార పార్టీ నేతలను కాపాడితే పేకాట, మట్కాకు అండగా నిలిచిలిన వాళ్లవుతారు? వదిలిస్తే సొంతపార్టీ నేతలు తమను కాపాడలేదు అనే ధోరణిలో పార్టీకి దూరం అవుతారు. ఈ క్రమంలో మొత్తం పరిణామాలతో జేసీ బ్రదర్స్ చక్రబంధంలో ఇరుక్కున్నట్లు తాడిపత్రి వాసులు చర్చించుకుంటున్నారు. -
జబర్దస్త్, పటాస్ షోలకు ఝలక్!
హైదరాబాద్: పలు విమర్శలకు కారణమవుతున్న జబర్దస్, పటాస్ టీవీ షో నిర్వాహకులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది. కామెడీ పేరుతో ఈ షోలలో బూతును ఎక్కువ ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను గతంలో బాలానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని దివాకర్ తెలిపారు. దీంతో స్పందించిన హెచ్ఆర్సీ ఈ రెండు టీవీ షోల దర్శకులకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసిందన్నారు. మహిళలు, చిన్నపిల్లలను కించపరిచేలా ఈ షోల్లో కొన్ని స్కిట్స్ ప్రదర్శిస్తున్నారని, రెండు కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం వల్ల సమాజంలోకి చెడు సందేశం వెళుతున్నదని ఆయన అన్నారు. -
సాయిశ్రీ మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు
విజయవాడ: సాయిశ్రీ ఘటనపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. సాయిశ్రీ మృతికి కారుకులైన బాలిక తండ్రితో పాటు ఎమ్మెల్యే బోండా ఉమలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ.. బాలల హక్కుల సంఘం అధికారులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన హెచ్చార్సీ జులై 20 కల్లా పూర్తి నివేదిక అందివ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రసూతి మరణాలపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: ప్రసూతి ఆస్పత్రుల్లో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేతలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు గాంధీభవన్ నుంచి మానవ హక్కుల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రసూతి ఆస్పత్రుల్లో మరణాలు ప్రభుత్వ హత్యలే అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, ఆకుల లలిత, నేరేళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ కార్పోరేటర్లపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గ అధికార పార్టీ కార్పోరేటర్లపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. స్థానిక బిల్డర్లను బెదిరించి టీఆర్ఎస్ కార్పోరేటర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం హెచ్చార్సీని ఆశ్రయించారు. -
కలెక్టర్ వ్యాఖ్యలపై వివరణ కోరిన హెచ్చార్సీ
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వివరణ కోరింది. ఈ ఘటన పూర్వాపరాలను నివేదించాలంటూ డీజీపీ, సీఎస్లను ఆదేశించింది. బ్రాహ్మణ కల్చర్పై కలెక్టర్ ఎ.మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ కొందరు బ్రాహ్మణ సంఘాల నాయకులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. తమ మనోభావాలను కలెక్టర్ దెబ్బతీశారని, అటవీ జంతువులను చంపాలంటూ గ్రామస్తులను కోరారని ఫిర్యాదు చేశారు. అంతకుముందు వారు రాష్ట్ర ఛీప్ సెక్రటరీ ఎస్.పి.సింగ్ను కూడా కలిశారు. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయంటూ కామెంట్ చేశారు. తన మాటలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగటంతో కలెక్టర్ మురళి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. -
హెచ్ఆర్సీలో టీ.వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణంపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించి రోగి మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. స్పందించిన హెచ్ఆర్సీ ఈ ఘటనపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (ప్రాణం ఖరీదు రూ. 150!) వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం రాయారంకు చెందిన వడ్త్యా కృష్ణ నాయక్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న అతనికి వెంటనే ఆక్సిజన్ పెట్టాలంటూ కృష్ణ భార్య డ్యూటీలోని సిబ్బందిని కోరింది. అయితే అందుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో అతడు కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను వైఎస్ఆర్ సీపీ ...హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్లింది. -
నా భార్య టార్చర్ నుండి కాపాడండి.
-
ఎక్సైజ్ సూపరింటెండ్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: వనపర్తి జిల్లా ఎక్సైస్ సూపరింటెండెంట్ నవీన్ నాయక్ పై హెచ్చార్సీ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ నవీన్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్దగూడెం తండాకు చెందిన వెంకటమ్మ హెచ్చార్సీని ఆశ్రయించింది. సారాయి తయారు చేస్తున్నావంటూ తనని వేధింపులకి గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
దంపతులపై పగ పట్టిన డోన్ పోలీసులు
-
డోన్ పోలీసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ పోలీసులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్తే.. అకారణంగా దాడి చేశారని.. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తుమని వేధిస్తుండటంతో బాధిత దంపతులు శుక్రవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఆ సన్నివేశాలు తొలగించాలంటూ ఫిర్యాదు’
విజయవాడ: వంగవీటి రంగా అభిమానుల సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ చిత్రంలోని పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఈ సందర్భంగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం కోరింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ....జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించింది. కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. -
వేధించారంటూ హెచ్చార్సీకి ఫిర్యాదు
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా పనిచేసిన డాక్టర్ శైలజ జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ అరుణ్కుమార్ సహా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏసీ, డీసీలకు షాక్ ఇచ్చారు. ఎంహెచ్వోగా పనిచేసిన సమయంలో వీరంతా తనను వేధింపులకు గురిచేశారంటూ మానవహక్కుల కమిష¯ŒSను ఆశ్రయించారన్న సమాచారం అధికారవర్గాల్లో కలకలం రేపింది. ఆమె ఫిర్యాదుపై శుక్రవారం గుంటూరులో జరిగే విచారణకు కలెక్టర్ మినహా మిగిలిన అధికారులంతా హాజరయ్యేందుకు పయనమై వెళ్ళిన అంశం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్ళితే...కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా డాక్టర్ శైలజ 2015 జూలై 17 నుంచి ఏడాది కాలంపాటు ఇక్కడ పని చేశారు. డిప్యూటేష¯ŒS కాలపరిమితి పూర్తి కావడంతో ఆమెను సొంత శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆమె బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేసి మరో ఏడాదిపాటు కొనసాగేందుకు వీలుగా ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభిస్తున్న సమయంలో ఆమెను రిలీవ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఆమె తాను ఎంహెచ్వోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిలీవ్ అయ్యేంతవరకు ఏడాది కాలంలో తనను ఎన్నో వేధింపులకు గురిచేశారంటూ ఆమె మానవహక్కుల కమిష¯ŒSతోపాటు జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిష¯ŒSకు, ఇతర ఉన్నత స్థాయి అధికార వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యాధికారిగా చేర్చుకునే సమయంలో అప్పటి కమిషనర్, రిలీవ్ చేసే సమయంలో ప్రస్తుత కమిషనర్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆమె తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. వీరంతా కలెక్టర్ అరుణ్కుమార్ను కూడా తప్పుదారి పట్టించి తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలా చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో దీనిపై హెచ్ఆర్సీ విచారణకు ఆదేశించింది. ఫిర్యాదులో అందరూ బాధ్యులే... ఆరోగ్యాధికారి డాక్టర్ శైలజ హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో కమిషనర్ ఆలీమ్భాషా, అదనపు కమిషనర్ గోవిందస్వా మి, డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, మేనేజర్ సత్యనారాయణ, సహా పలువురు అధికారులను బాధ్యులుగా పేర్కొన్నారు. కలెక్టర్ పేరును కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ పురపరిపాలనాశాఖ డైరెక్టర్కు విచారణకు ఆదేశించింది. దీంతో మెప్మా అడిషనల్ డైరెక్టర్ను విచారణాధికారిగా డీఎంఏ నియమించింది. నేడు గుంటూరులో విచరణ.. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరులో విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం కాకినాడ కమిషనర్తోపాటు ఏసీ, డీసీ, మేనేజర్, సూపరింటెండెంట్తోపాటు ఇతర అధికారులంతా గుంటూరు బయలుదేరి వెళ్తున్నారు. వీరితోపాటు ఫిర్యాదు చేసిన డాక్టర్ శైలజ కూడా విచారణకు హాజరుకానున్నారు. అయితే కలెక్టర్కు మాత్రం విచారణ నుంచి మిçనహాయింపునిచ్చారంటున్నారు. -
మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాల్ఘర్ జిల్లాలో ఈ ఏడాది పోషకాహార లోపంతో 600 మంది చిన్నారులు మరణించిన ఉదంతంలో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్నిఆదేశించింది. పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ స్పందించింది. పాల్ఘర్ లోని మొఖాడా, జవర్, వాడా , విక్రమ్ గఢ్ లలోని నాలుగు తాలూకాలో ఈ మరణాలు సంభవించాయి. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేసింది. పోషకాహారలోపంతో మరణాలు సంభవించడం అంటే పేదవారి జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో అమలు చేస్తున్న పథకాల గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. -
తెలంగాణ టీడీపీకి హెచ్చార్సీ లేఖ
రైతు ఆత్మహత్యలపై సమాచారం అందించాలంటూ హెచ్చార్సీ తెలంగాణ టీడీపీని కోరింది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించాలని కోరుతూ కొంతకాలం క్రితం తెలంగాణ టీడీపీ నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఈ మేరకు స్పందించిన మానవ హక్కుల సంఘం తమకు మరింత సమాచారం అందించాలని కోరుతూ బుధవారం టీడీపీకి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించారు. హెచ్చార్సీ కోరిన మేరకు సమాచారం అందించేందుకు సంసిద్ధత ప్రకటించారు. వెంటనే అందజేస్తామన్నారు. -
ఎస్సై ఆత్మహత్య ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం
ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక అందివ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. -
రెవెన్యూ అధికారులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
నాంపల్లి(హైదరాబాద్) : భూమిని ఆక్రమించి అనుభవిస్తున్న వ్యక్తులు, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్ధన్నపేట మండ లం జగ్గయ్యగుండ్ల గ్రామానికి చెందిన జోజి రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు ప్రకా రం.. సొంత గ్రామంలో పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి సర్వే నంబరు 2157, 2158 రెండున్నర ఎకరాలు, సర్వే నంబరు 749/50లో రెండున్నర ఎకరాలు ఉందన్నారు. అయితే 1994లో సర్వే నంబ రు– 749/50 లోని రెండున్నర ఎకరాల్లో ఒక ఎకరం భూమి అదే గ్రామానికి చెందిన గొలమారి చిన్నపరెడ్డికి అమ్మేసినట్లు వివరించారు. తదనంతరం జగ్గయ్యగుండ్ల గ్రా మం నుంచి ఉపాధి కోసం తన కుటుంబం హైదరాబాదుకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. ] హైదరాబాదుకు వచ్చేశాక తమ నుంచి ఎకరం భూమి కొనుగోలు చేసిన గొలమారి చిన్నపరెడ్డి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెండున్నర ఎకరాలను కొన్నట్లుగా ఫోర్జరీలు చేసి పట్టాపాస్ పుస్తకాల్లో రాయించుకున్నట్లు తెలిపారు. ఈ విషయం సదరు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లగా తమకేమీ తెలియదంటూ తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. అలాగే 2157, 2158 సర్వే నంబర్లలోని కొంత భూమిని స్థానికులు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్యాక్రాంతానికి గురైన తన భూమి తనకు ఇవ్వాలని, పహాణీలో దొర్లిన తప్పులను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 20 అక్టోబరు 2016న జరిగే విచారణకు కేసుకు సంబంధిం చిన పూర్వాపరాలను అందజేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. -
టీడీపీ ఎమ్మెల్యేపై హెచ్చార్సీలో ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై సోమవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందంటూ దామచర్లకు చెందిన ముస్లిం జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలపై ఉద్యమించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని షేక్ మహమ్మద్ ఆరోపించారు. ఫిర్యాదుపై స్పిందించిన హెచ్చార్సీ ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 19లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఒంగోలు ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన కుష్టు వ్యాధిగ్రస్తులు
-
పోలీసులు వేధించారంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు
మహబూబాబాద్ రూరల్ : కురవి పోలీసులపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ)లో ఈ నెల 30న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు, మహబూబాబాద్ మండలం బేతోలువాసి ఎడబోయిన భుజంగరావు ఆదివారం రాత్రి తెలిపారు. తాను ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జూలై 27న ఖమ్మం జిల్లాలోని అత్తగారి ఇంటికి వెళ్లి, బేతోలుకు తిరిగి వస్తుండగా.. తన ఆటోను కురవి హైవేపై ఆపి పోలీ సులు పరిశీలించారన్నారు. అందులో ఖాళీ సంచులే ఉన్నా.. డబ్బులు ఇవ్వమని పలువురు అడిగారని భుజంగరావు ఆరోపించారు. అందుకు నిరాకరించడంతో కొట్టారని వాపోయాడు. ఆ రోజు రాత్రి వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచారని పేర్కొన్నాడు. గాయాలతో తాను మానుకోట ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందాల్సి వచ్చిందన్నాడు. దీనిపై హైదరాబాద్కు వెళ్లి, హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు వివరించారు. సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వీసాల మోసగాళ్లపై హెచ్చార్సీకి ఫిర్యాదు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ హెచ్చార్సీ గడపతొక్కింది. సైనిక్పురికి చెందిన తాటిపత్రి డానియల్, షీబారాణి దంపతులు విదేశాల్లో ఉద్యోగం చూపుతామంటూ తన వద్ద రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఇర్ఫానా సుబానీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. గతంలో వీరిపై సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్లలో కూడా ఇదే విషయంలో కేసులున్నాయని ఆమె బుధవారం అందజేసిన ఫిర్యాదులో వివరించింది. -
తల్లిని చూడటానికి వెళ్లమని ఆదేశించండి
హెచ్చార్సీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తండ్రి ఫిర్యాదు నాంపల్లి: ‘‘ఆస్తులు అమ్ముకొని.. చివరికి కూలీ పని చేసి ఉన్నత చదువులు చదివించాం... రెక్కలొచ్చాక మమ్మల్ని కాదని తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్లో నా కుమారుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చూస్తున్నాడు... మూడేళ్లుగా వాడి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు’’.. అని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న తన భార్య మంచాన పడిందని, కొడుకును చూడాలన్న ఆమె కోరిక తీరేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత తండ్రి ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథన ప్రకారం.... కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా అరగినమర క్యాంపుకు చెందిన ఏరువ వెంకట్రెడ్డి, సాలమ్మలకు శ్రీనివాసరెడ్డి ఏకైక సంతానం. కుమారుడిని ఎంతో కష్టపడి చదివించారు. అతని చదువు కోసం వారికి ఉన్న చిన్న ఇంటిని, మూడు గేదెలను కూడా అమ్మేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి చేయగా.. ఏడాది పాటు తల్లిదండ్రులను చూసేందుకు సొంతూరు వచ్చేవారు. తదనంతరం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పూర్తిగా మరిచిపోయాడు. తల్లి సాలమ్మ దిగులుతో అనారోగ్యం పాలైంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిందని ఫోన్ చేస్తే మీకు, నాకు ఎలాంటి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని, కొడుకును చూడాలని కలవరిస్తోందని, ఎస్.ఆర్.నగర్ పోలీసుల ద్వారా కుమారుడికి తెలియజేస్తే.. వారు చనిపోయినా నాకు అనవసరం లేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లిని చూడటానికి కుమారుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి వెంకట్రెడ్డి మానవ హక్కుల కమిషన్ను తన ఫిర్యాదులో కోరాడు. -
కుమార్తె కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు
-
'కుమార్తెను చంపుకునేందుకు అనుమతించండి'
హైదరాబాద్: తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతించాలని రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన దంపతులు గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు. జగద్గిరిగుట్టకు చెందిన రామచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత (11) గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. లివర్ మార్పిడికి రూ.25 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావటంతో అంత మొత్తం నగదు సమకూర్చుకోలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తెకు మెర్సీ కిల్లింగ్ అంతిమ పరిష్కారమని ఆ తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వారు హెచ్చార్సీని ఆశ్రయించి.. తమ చిన్నారి వేదనను చూడలేకున్నామని తెలిపారు. అందువల్ల మెర్సీ కిల్లింగ్కు అనుమతించాలని కోరారు. -
సరోజినీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
-
సరోజినీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై లోకాయుక్తా శనివారం విచారణ ముమ్మరం చేసింది. లోకాయుక్తా పరిశోధనాధికారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విచారణకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ హెల్త్ వైద్యులు హాజరయ్యారు. లోపం ఎక్కడుందన్న దానిపై విచారణ జరిపారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని వైద్యులు స్పష్టం చేస్తూ, తమపై క్రిమినల్ కేసులను నమోదు చేయటాన్ని వైద్యులు బృందం ఖండించింది. కాగా కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అయితే వారిలో 13 మంది ఇన్ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే సెలైన్లో బ్యాక్టీరియా ఉండటం వల్లే ఈ ఘటనకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సెలైన్లు చాలా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేశారని, వాటిన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సెలైన్ల పంపిణీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిపుణులైన వైద్యులే శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం నిన్న సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం ఇవాళ ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించింది. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి నుంచి విచారణ బృందం వివరాలు సేకరించింది. రోగులతో పాటు డాక్టర్లను, నర్సులను విచారణ చేశారు. ఆపరేషన్ థియేటర్ను క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసి కంటి ఆస్పత్రుల రీజనల్ కమిటీ కూడా విచారణ జరిపింది. ఈ ఘటనపై ఆ కమిటీ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఐ ఆస్పత్రి రీజనల్ కమిటీ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెలైన్లో ఫంగస్ ఉందన్నారు. అలాగే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించింది. -
సరోజినీదేవి ఆస్పత్రిపై హెచ్చార్సీ సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు ఈ నెల 21లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించించింది. నూకాలమ్మకు కార్నియా మార్పిడి చికిత్స: కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్ఎల్)సెలెన్వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేయడం తెలిసిందే. వాసన్ఐ కేర్ నుంచి కార్నియాను సేకరించి కంటిచూపు కోల్పొయిన బాధితురాలు నూకాలమ్మతల్లికి శుక్రవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ థియేటర్లో కార్నియా మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు రెస్పాండ్ అవుతున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీలో చికిత్సలు: ఆర్ఎల్ సెలైన్బాటిల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తా చర్యల్లో భాగంగా జులై ఒకటో తేదీ న వాటిని మూసివేసిన విషయం తెలిసిందే. చికిత్సలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను ఆయ ూ ఆస్పత్రులకు తరలించి అక్కడే వారికి కాటరాక్ట్ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్య బందాలను కూడా సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మైక్రోబయాలజీ నిపుణులు ఆపరేషన్ థియేటర్లలో శాంపిల్స్ సేకరించారు. తుది నివేదిక రావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. థియేటర్లో ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించిన తర్వాతే ఇక్కడ సేవలను పునఃప్రారంభిస్తామని, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా స్పష్టం చేశారు. పీఎస్లో ఆమ్ఆద్మీ ఫిర్యాదు: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. -
అసదుద్దీన్ ఓవైసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశద్రోహులకు అండగా ఉన్నాడంటూ తెలంగాణా న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. నగరంలో పట్టుబడ్డ ఐసిస్ ఏజెంట్లకు న్యాయసహాయం అందిస్తామన్న ఎంపీ వ్యాఖ్యల వల్ల ఉగ్రవాదులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని హెచ్చార్సీ చైర్మన్ ను లాయర్స్ కోరారు. -
పాశం శ్రీను అదృశ్యంపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకుడు పాశం శ్రీను అదృశ్యంపై ఆయన భార్య నళిని బుధవారం హెచ్చార్సీని ఆశ్రయించింది. పాశం శ్రీనుపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో భువనగిరి డీఎస్పీ, సీఐ, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, విరసం నేత వరవరరావులపై శ్రీను కుటుంబసభ్యులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కలగజేసుకుని తన భర్త ఆచూకీ తెలపాలని నళిని కోరింది. కాగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో శ్రీను మృతిచెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా, స్థానిక ఆస్పత్రికి ఆదివారం గుండెపోటుతో పాశం శ్రీను అనే వ్యక్తి వచ్చాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో వేరే ఆస్పత్రికి పంపించినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న పాశం శ్రీను మృతిపై ఎటువంటి సమాచారం లేదని భువనగిరి పోలీసులు తెలిపారు. -
పోలీసులపై చర్య తీసుకోండి
-మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు హైదరాబాద్ తెలంగాణ న్యాయవాదుల విధులకు ఆటంకం కల్పిస్తూ.. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమీషన్లోలో మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జాక్ ఫిర్యాదు చేసింది.అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులపై చర్య తీసుకోవాలని కోరారు. -
గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి
అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిఖిల్ రె డ్డి ఎత్తు పెంచే ఆపరేషన్ చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బుధవారం నిఖిల్ రెడ్డి తండ్రి బీజేపీ నాయకులతో కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. గ్లోబల్ ఆస్పత్రిలో అనైతిక పద్దతిలో ఎత్తు పెంచే సర్జరీ చేయడం వల్ల నిఖిల్ రెడ్డి అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నాడని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. -
హెచ్చార్సీలో మల్లన్నసాగర్ బాధితులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రాజెక్టునిర్మాణం పేరుతో తమ భూములు, ఊళ్లను, ఇళ్లను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు జాగృతి
హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగిస్తున్న ప్రాంతం, అక్కడి పరిస్థితులపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు. ముద్రగడ దీక్ష సాగిస్తున్న రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో కఠిన ఆంక్షలు విధించి అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జాగృతి నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసు యంత్రాంగం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
సీఐ నుంచిప్రాణహాని ఉందంటున్న మహిళ
చిలకలగూడ సీఐ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఓ మహిళ హెచ్చార్సీని ఆశ్రయించింది. సీతాఫల్మండికి చెందిన లలిత..తమను అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. అయితే, సదరు ఫైనాన్సియర్లతో రాజీ చేసుకోవాలంటూ సీఐ కావేటి శ్రీనివాస్ బెదిరిస్తున్నారని లలిత ఆరోపించింది. దీనిపై ఆమె మంగళవారం హెచ్చార్సీని ఆశ్రయించింది. -
హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు నేతలు
దీక్షలో ఉన్న తమనేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అన్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసులు ఆవలంభించిన తీరుపై విచారణ జరిపించాలని కోరారు.