నేడు హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం  | HRC office starts from 1st September In Kurnool | Sakshi

నేడు హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం 

Sep 1 2021 4:05 AM | Updated on Sep 1 2021 4:05 AM

HRC office starts from 1st September In Kurnool - Sakshi

హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకానున్న రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం

కర్నూలు (సెంట్రల్‌): న్యాయ రాజధాని కర్నూలులో మరో న్యాయసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లోకాయుక్త ప్రారంభం కాగా బుధవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ – హెచ్‌ఆర్‌సీ) ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇటీవల మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శుక్రవారం గెజిట్‌ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 1వ తేదీన మానవహక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం 10–11 గంటల మధ్య ఆ సంస్థ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు జి.శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement