Government of Andhra Pradesh
-
ప్రభుత్వ ఇఫ్తార్ను బహిష్కరిస్తున్నాం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించారు. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. బుధవారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు. -
రోడ్డెక్కిన మిర్చి రైతులు
సాక్షి, ప్రతినిధి గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరీ ఇంత దారుణమా?గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్ గేట్ ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లాధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. – గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్బుక్లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
ఆ ఐదేళ్లూ గణనీయ ప్రగతి
విత్తు నుంచి పంట విక్రయం వరకు.. ప్రకృతి సాగుకు ప్రోత్సాహం మొదలు యాంత్రీకరణ వరకు.. కౌలు చట్టం నుంచి మద్దతు ధర వరకు.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2019–24 మధ్య కాలం స్వర్ణయుగం అని తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందని టీడీపీ కూటమి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే –2024 స్పష్టం చేసింది.సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సాధించిన పురోగతిని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందులోని ముఖ్య అంశాలు పరిశీలిస్తే..⇒ 2018–19లో 150 లక్షల టన్నులున్న ఆహార పంటల దిగుబడులు 2019లో రికార్డు స్థాయిలో 175 లక్షల టన్నులకు పెరిగాయి. 2019–24 మధ్య సగటున 161.20 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి.⇒ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 45.59 లక్షల ఎకరాలకు పెరగగా, 2023–24లో రికార్డు స్థాయిలో 365.92 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. నేషనల్ ఆయిల్ పామ్ మిషన్లో 2023–24లో రికార్డు స్థాయిలో 2.27 లక్షల హెక్టార్లలో సాగు ద్వారా 17.63 లక్షల టన్నుల దిగుబడులు నమోదైంది.⇒ 2023–24లో 2548.74 లక్షల గుడ్ల ఉత్పత్తితో ఏపీ నంబర్ వన్గా నిలవగా, మాంసం (10.68 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఐదో, పాల (139.94 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది.⇒ గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా రైతులకు మార్కెట్ ధరకు మించి ఆదాయం వచ్చింది. ప్రకృతి సాగుదారులు 4 లక్షల నుంచి 9.53 లక్షలకు పెరిగారు.ఆర్బీకేలు నిజంగా ఓ వినూత్నంరైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) నిజంగా ఓ వినూత్న ప్రయోగమని ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు.⇒ విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడుగా నిలిచేందుకు ఒకేసారి 10,778 ఆర్బీకేలతో ఈ వ్యవస్థ ఏర్పాటైందని చెప్పుకొచ్చారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా, ఆక్వా ఫీడ్ వంటి సాగు ఉత్పాదకాలను గ్రామ స్థాయిలో రైతులు కోరిన 24 గంటల్లో వారి ముంగిట అందించడం, ఆధునిక సాగు విధానాలు, సలహాలు, సూచనలు అందిస్తూ అగ్రి ఇన్పుట్ షాపులుగా, ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్స్గా రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నియోజకవర్గ స్థాయిలో అగ్రి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆక్వా, వెటర్నరీ ల్యాబ్స్ ఏర్పాటుతో నాణ్యమైన సాగు ఉత్పత్తుల పంపిణీ సులభతరమైంది. –రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా.. మార్కెట్లో ధర లేని సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.ఏఐఎఫ్ ద్వారా మౌలిక వసతులు⇒ వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి (ఏఐఎఫ్) ద్వారా 2022–24 మధ్య గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ⇒ పీఏసీఎస్లను బహుళ ప్రయోజిత సదుపాయాల కేంద్రాలు (ఎంపీఎఫ్సీ)గా తీర్చిదిద్దారు. రూ.736 కోట్లతో 695 గోదాముల నిర్మాణం ద్వారా 3.98 లక్షల టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ⇒ రికార్డు స్థాయిలో 2,037 పీఏసీఎస్ల డిజిటలైజేషన్తో పాటు 207 పీఏసీఎస్లను ఎఫ్పీవోలుగా అభివృద్ధి చేశారు. ఈ–పీఏసీఏస్లుగా మార్పుతో ఆన్లైన్ లావాదేవీలకు మార్గం సులభతరమైంది. జన ఔషధ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, కామన్ సర్వీస్ సెంటర్లుగా పీఏసీఏస్లను తీర్చిదిద్దారు. రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ను కంప్యూటరైజ్ చేశారు.⇒ చేపల ఉత్పత్తిలో 31 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 30 శాతంతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్థానిక వినియోగం పెంచేందుకు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా ఫిష్ ఆంధ్రకు బ్రాండింగ్ తీసుకొచ్చింది. అప్సడా, ఏపీ ఫిష్ సీడ్, ఫీడ్ యాక్ట్లతో పాటు ఏపీ బొవైన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్టిఫీషియల్ ఇన్సెమినేషన్ సర్వీస్ యాక్ట్, భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా పంట సాగు హక్కుదారుల చట్టం వంటి సంస్కరణలకు నాంది పలికింది.కూటమి కనికట్టుకూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25లో వ్యవసాయ యాంత్రీకరణ కింద ఒక్క పరికరం కూడా పంపిణీ చేసిన పాపాన పోలేదు. కానీ, ఈ ఏడాది ఏకంగా రూ.75.80 కోట్ల సబ్సిడీతో 42,864 మంది రైతులకు వ్యక్తిగత పరికరాలు ఇచ్చినట్టుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 80 శాతం సబ్సిడీపై 875 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేసినట్టుగానూ ప్రస్తావించారు. కాగా, ఇదే రిపోర్టులో 2021–24 మధ్య ఆర్బీకేలకు అనుసంధానంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణను గత ప్రభుత్వం ప్రోత్సహించిందని కొనియాడడం గమనార్హం. -
పాలనలో సమన్వయ లోపం
ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధి పతులు, మంత్రుల సమీక్షా సమావేశం 12 గంటల పాటు జరిగింది. గత అనుభవంతో సీబీఎన్ త్వరితంగా పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవలసి ఉండగా, ఇప్పటికీ మూడుసార్లు కలెక్టర్ల సమా వేశాలు నిర్వహించి, ఎనిమిది నెలలుగా నిత్యం ఏదో ఒక శాఖ సమీక్ష చేస్తున్నా... మళ్ళీ మరో సమన్వయ సమావేశం ఎందుకు నిర్వహించినట్లు? నిజానికి ఐదేళ్ళ వైసీపీ పాలన తర్వాత ‘బ్యురోక్రసీ’ వైఖరితో ‘కూటమి’ ప్రభుత్వం సమన్వయ సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నదా? అనేది ఇక్కడ కీలకం. కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన 2022 ఉగాది నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జగన్ మోహన్ రెడ్డి– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సాధించే దిశలో ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) పాటించి తీరాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘సరళీకరణ’ కాలంలో పొలిటికల్ ఎగ్జిక్యుటివ్ అధికా రులను ‘మార్గదర్శక నిబంధనలు దాట డానికి వీలులేదు’ అనే మాట పైకి అనడం చిన్న విషయం కాదు. ఈ మార్పుకు కారణం, గతంలో పాలన ‘పిరమిడ్’ తరహాలో పైన ఒక్కరిదే నిర్ణయమైతే, దిగువ పలు అంచెల్లో దాన్ని అమలుచేసే యంత్రాంగం ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో పైన ఉండే నిర్ణయ శిఖరం ‘చతురస్రం’గా మారింది. విధాన నిర్ణయంలో సమష్టి బాధ్యత వచ్చింది. మండల గ్రామ సచివాలయ సిబ్బంది నిర్ణయాల అమలుకు దఖలు పడ్డారు. సీబీఎన్ శైలి దీనికి పూర్తిగా భిన్నమైంది.రాజకీయ నాయకుల నిర్ణయాల అమలుకు మాత్రమే ఐఏఎస్లను పరిమితం చేస్తే, తదుపరి పరిణామాలకు జడిసి కొందరు అధికారులు పోస్టులు మారుతున్నారు. సీఎం తనది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అంటే, అది ‘నీతి ఆయోగ్’ అయినా, ప్రపంచ బ్యాంకు షరతులు అయినా మాకు వర్తించవు’ అని చెప్పడమే అవుతుంది. సీఎం కలెక్టర్లకు చెప్పిందే సెక్రటరీలకు వర్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో బహుశా వేగంగా కదలని ‘ఫైళ్ళు’ ఈ సమావేశ నిర్ణయానికి కారణం కావొచ్చు.అయితే, అధికారులు ఉన్నదే వారు తమ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి కనుక... ఇక్కడ 2019 ఎన్నికల ముందు జరిగింది ఒకటి చెప్పాలి. ‘సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (‘సెర్ప్’) సంస్థ 2019 ఫిబ్రవరి 16 నాటికి ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు, సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేం వర్క్’ పేరుతో ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. ఈ పనిలో ప్రపంచ బ్యాంక్ది ప్రధాన భూమిక.రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నర ఏళ్ల తర్వాత, ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన కొరకు రూపొందించిన అధికారిక ‘డాక్యుమెంట్’ ఇది. ఇది జరిగిన నాలుగు నెలలకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మనకు ‘నెట్’లో అందుబాటులో ఉన్న ఈ పత్రం– ‘వైరుధ్య –ఆంధ్రప్రదేశ్’ అనే ముందుమాటతో మొదలవుతుంది. అందులో – ‘ఇక్కడ ఒకపక్క వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, ఐటీ వృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పెట్టుబడులు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పేదరికం కూడా తగ్గుతున్నది. కానీ ఇక్కడి వ్యవసాయ రంగంలో రైతుల వెతలు అలాగే ఉన్నాయి. సామాజిక మానవీయ విలువల సూచీ అట్టడుగున ఉంది. ఇక్కడి మహిళా స్వయం సహాయ సంఘాల చొరవ గొప్ప మార్పుకు నాంది పలికినా అది ఎస్సీ, ఎస్టీల విషయంలో సామాజిక పెట్టుబడిగా రూపాంతరం చెందలేదు. దాంతో వారి ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్య వసతుల మెరుగు దలను అది ఏ మాత్రం ప్రభావితం చేయలేక మినిమవ్ు డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ) వద్దకు వారిని చేర్చలేక పోయింది.’ ఇది చదివాక, మన కామన్ సెన్స్కు వచ్చే ప్రశ్నలు రెండు. ఈ పత్రంలోని అంశాలు తన ప్రభుత్వ కృషి ఫలితం అని సీబీఎన్...పైకి అనకపోవడానికి కారణం ఏమిటి? ఈ నివేదికలో గుర్తించిన వ్యత్యాసాలను అధిగమించేలా తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పథకాలను అమలు చేసింది. అయితే వాటిలో లోపాలు ఉంటే వాటిని చూపడం కాకుండా, ‘సంక్షేమమేనా... అభివృద్ధి ఏదీ?’అంటూ ముప్పేట దాడి చేయడం ఏమిటి? ఈ ‘పత్రం’ సీబీఎన్ ప్రాధాన్యాలలోని అంశం కాకపోవచ్చు. అలాగే పేదలకు మేలు చేసేది కనుక వైసీపీ దాన్ని తన మేనిఫెస్టోలో చేర్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ‘కూటమి’ దాని ఊసు ఎత్తడం లేదంటే దాన్ని అమలుచేసే ఆలోచన లేక కావొచ్చు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం: వైఎస్ జగన్
శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. – వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి.. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీ భవిష్యత్తుకు నాది భరోసా..ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.ప్రజలకు అన్నీ తెలుసు..పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది. అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు. -
మా జీవితాలతో చెలగాటం.. వాయిదాపై వంచన
సాక్షి, అమరావతి: అర్ధరాత్రి వరకు ఆందోళనలు.. అడ్డగింతలు.. అరెస్టులు.. తరలింపులు.. తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి తమ జీవితాలతో ఆడుకుందని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లు తమను నమ్మించి నిండా ముంచారని, తమ జీవితాలతో చెలగాటం ఆడారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర మనస్థాపానికి గురయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇంత గందరగోళం సృష్టించిందని, ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదని ధ్వజమెత్తారు. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని తొలుత చెప్పిందే టీడీపీ అని, అలాంటప్పుడు అది సరిచేయకుండా ఎలా పరీక్ష నిర్వహిస్తారని నిలదీశారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి వల్లే తమ సమయం వృథా అయిందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దోబూచులాట మధ్య పరీక్ష నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసి ఆశలు రేపారని.. ఇప్పుడింత గందరగోళం జరుగుతుంటే ఆయన మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్లో ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నారని విరుచుకుపడ్డారు. తమను ఇంత దగా చేసిన కూటమి సర్కారును ఊరికే వదిలి పెట్టం అని.. ‘బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్’ కాదు.. ‘ఎన్నికల్లో పాల్గొందాం.. కూటమికి గట్టిగా బుద్ధి చెబుదాం’ నినాదంతో తమ సత్తా చాటుతామని శపథం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా ముంచిందో కళ్లారా చూశామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కూడా తమ శక్తి ఏపాటిదో చూపిస్తామని లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ స్పష్టం చేస్తున్నారు. ఇంతటి గందరగోళం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమని కోపంతో రగిలిపోయారు. పచ్చి దగా.. దుర్మార్గం ‘పరీక్ష వాయిదా పడుతుందని సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి ట్వీట్ చేసినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం? పరీక్షపై సమీక్షిస్తున్నాం అంటూ ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి అయోమయమే. ఎటూ పాలుపోని పరిస్థితి. టెన్షన్తో రాత్రంతా నిద్రపోలేదు. ఈ గందరగోళంలేకుండా ఉండివుంటే పరీక్ష ఇంకా బాగా రాసి ఉండేదాన్ని’ అని తిరుపతికి చెందిన సౌజన్య ఆవేదన వ్యక్తం చేసింది. ‘రోస్టర్ విధానంలో తప్పులున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? రేపు న్యాయపరమైన చిక్కులతో పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? ఇంత గందరగోళం మధ్య పరీక్ష నిర్వహించడం దుర్మార్గం కాదా?’ అని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని శ్రీకాకుళంకు చెందిన గణేష్ ప్రశ్నించాడు. పరీక్ష జరుగుతుందో లేదో ముందు రోజు రాత్రి వరకు తేల్చకపోతే ఎలా అంటూ కడపకు చెందిన మూల బిందు మాధవి నిలదీసింది. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ల ప్రకటనల వల్ల పరీక్ష వాయిదా పడుతుందని భావించాను. చివరి నిమిషం వరకు స్పష్టత లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాను. పరీక్షకు బాగా ప్రిపేర్ అయినప్పటికీ తీవ్రంగా కలత చెందాను. పరీక్షను సరిగా రాయలేకపోయాను. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం’ అంటూ విజయవాడకు చెందిన కె.కాంతారావు మండిపడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం 92 వేల మందిని మోసం చేశారని నంద్యాలకు చెందిన హుస్సేన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ ఏమి చేసుకోలేరనే అభిప్రాయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలా మా జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇంత టెన్షన్ ఎన్నడూ పడలేదన్నారు. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా అని నిప్పులు చెరిగారు. అంతా టెన్షన్.. టెన్షన్.. ⇒ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు అభ్యర్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడింది. పరీక్ష వాయిదా పడుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఓ వైపు ప్రకటించడం.. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోను పరీక్ష కొనసాగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేయడం.. వెరసి అసలు పరీక్ష ఉంటుదా.. లేదా? అన్న సందిగ్ధంలో అభ్యర్థులు ఉండిపోయారు. ఈ క్రమంలో పరీక్ష వాయిదా పడుతుందని ప్రకటించిన ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మిన అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లున్న ప్రాంతాలకు వెళ్లకుండా నిలువునా మోసపోయారు. రెండు వ్యవస్థల విరుద్ధ ప్రకటనలతో మీ మాంసలో మరికొందరు పరీక్ష ఉంటుందో ఉండదో తెలియక చాలా మంది సమయానికి సెంటర్లకు చేరుకోలేకపోయారు. దీంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ⇒ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని శనివారం అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఆందోళన చేశారు. తాము కూడా వాయిదా వేయమని సర్వీస్ కమిషన్ను కోరామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం, కానీ చైర్మన్ అంగీకరించలేదని ఆరోపణలు చేయడం వంటి నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.45 తర్వాత అభ్యర్థులను అనుమతించేది లేదని సర్వీస్ కమిషన్ ప్రకటించడంతో సమయం దాటాక వచ్చిన మరికొంత మంది పరీక్షకు దూరమయ్యారు. గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర నిమిషం ఆలస్యం అవడంతో పరీక్షకు దూరమైన కొండబాబు, శ్యామల ⇒ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, 92,250 మందిని మెయిన్స్కి ఎంపిక చేశారు. వీరికి 2024 జూలైలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సాధారణ ఎన్నికల అనంతరం జూన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ఏపీపీఎస్సీ చైర్మన్ను అర్ధంతరంగా తొలగించింది. దాదాపు 3 నెలల పాటు కమిషన్కు చైర్మన్ లేకుండా చేయడంతో జూలైలో జరగాల్సిన మెయిన్స్ డిసెంబర్కు వాయిదా వేశారు. ⇒ అక్టోబర్లో ఏఆర్ అనురాధను చైర్మన్గా నియమించి పరీక్షను ఫిబ్రవరి 23కి మార్చారు. సరిగ్గా పరీక్షకు వారం రోజుల ముందు కూటమి నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు. హైకోర్టు పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీపీఎస్సీ తన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఈనెల 20 నుంచి పరీక్షపై అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ⇒ రోస్టర్లో జరిగిన తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలన్న డిమాండ్తో అభ్యర్థులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ అంశంపై చివరి వరకు స్పందించని ప్రభుత్వం.. ఈనెల 21న రాత్రి మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్తో పరీక్ష వాయిదా పడుతుందన్న అభిప్రాయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించింది. పరీక్షకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసి పరీక్ష వాయిదా వేయాలని కోరడం, సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు పరీక్ష వాయిదాపై సర్వీస్ కమిషన్ చైర్మన్ అంగీకరించలేదని వాయిస్ లీక్ చేసి తప్పును చైర్మన్పైకి నెట్టే ప్రయత్నం చేశారు. సర్వీస్ కమిషన్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ వాతావరణంలో జరిగిన పరీక్షగా గ్రూప్–2 మెయిన్స్ నిలిచింది.గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష పూర్తిఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 175 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 905 పోస్టులకు 92,250 మంది మెయిన్స్కు అర్హత సాధించగా, 86,459 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం జరిగిన పేపర్–1కు 79,599 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్–2కి 79,451 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమిషన్ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకే లైజన్ అధికారులు సంబంధిత మెటీరియల్తో కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి పోలీసు భద్రత నడుమ పరీక్షా కేంద్రాలకు తరలించారు. డ్రోన్లతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు. ఉదయం వచ్చిన వారిలో కొంత మంది మధ్యాహ్నం జరిగిన పరీక్షకు హాజరు కాలేదు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక అభ్యరి్థకి పరీక్ష రాస్తున్న సమయంలో బీపీ తగ్గటంతో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసు భద్రత నడుమ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మమ్మల్ని మోసం చేశారు గ్రూప్–2 పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే వార్తలు రావడంతో మేలుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు ప్రకటనలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ డబుల్ గేమ్ ఆడారు. చివరకు చేతులెత్తేశారు. మేమంతా.. ఇది డబుల్ గేమ్ అని తెలియని అమాయకులమా? మమ్మల్ని మానసికంగా హింసించారు. – హుస్సేన్బాషా, నంద్యాలభావోద్వేగాలతో ఆడుకుంటారా?గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్–2లో రోస్టర్ విధానం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. రోస్టర్లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీయే గతంలో పలు మార్లు చెప్పింది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. కానీ విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చారు. పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని డైవర్ట్ చేసి నాశనం చేశారు. నిరుద్యోగులను వంచిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి త్వరలోనే తెలిసి వస్తుంది. – రవికుమార్, తిరుపతిఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు తొలుత ఏపీపీఏస్సీ అధికారులు గ్రూప్–2 మెయిన్ పరీక్ష ఆదివారం జరగుతుందన్నారు. కానీ పరీక్షపై సమీక్షిస్తున్నాం.. వాయిదా పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు హల్చల్ చేశాయి. పరీక్షపై గందరగోళం సృష్టించారు. పరీక్ష జరుగుతుందో లేదో అనే అనుమానం కలిగింది. శనివారం అర్ధరాత్రి వరకు పరీక్ష నిర్వహణపై స్పష్టత లేదు. అంతా గందరగోళం. రాత్రంతా టెన్షన్తో గడిపా. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు ఓవరాక్షన్ చేశారు. గతంలో ఏ పరీక్షప్పుడూ ఇలా వ్యవహరించలేదు. – సౌజన్య, తిరుపతిఫలితం అనుభవిస్తారు.. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలనేది నా కల. తాడిపత్రి నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. గ్రూప్–2 మెయిన్స్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాను. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని, ప్రభుత్వంలోని పెద్దలే చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? న్యాయ చిక్కులతో రేపు పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? అందుకే మేము ఆందోళన చేశాం. కానీ మా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఇది ఎంతమాత్రం భావ్యం కాదు. ఇందుకు ఫలితం చవిచూడక తప్పదు. – హరి, తాడిపత్రి ప్రభుత్వం తీరు దారుణం గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధించింది. రాత్రి పొద్దుపోయే వరకు పరీక్ష జరుగుతుందో లేదో అనే టెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఖరి కారణంగా మా సమయం వృథా అయింది. ఈ గందరగోళం మధ్య పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వదిలే పోస్టులు కావని తెలిసినప్పటికీ, ఈ పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం దారుణం. – మూల బిందు మాధవి, కడపతప్పులు ఎందుకు సరిదిద్ద లేదు? రిజర్వేషన్ రోస్టర్లో తప్పులు ఉన్నాయని చెప్పింది టీడీపీనే. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. అలాంటప్పుడు ఆ తప్పులు సరిదిద్దాక పరీక్ష నిర్వహించాలన్న కనీస విషయాన్ని విస్మరించడం దారుణం. ఏపీపీఎస్సీ తమ మాట వినలేదని చెప్పడం భావ్యం కాదు. అలా చెప్పడం ప్రభుత్వ పెద్దలకు ఇన్సల్ట్. – ఎ.ఢిల్లేశ్వరరావు, శ్రీకాకుళంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గ్రూప్–2 పరీక్ష నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక వైపు రోస్టర్ సమస్య ఉన్నప్పటికీ దాన్ని సకాలంలో పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాయడం నాటకమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగానే సరైన నిర్ణయం తీసుకొని ఉండేది. – మేఘన, ఒంగోలుప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థులందరం డైలమాలో పడ్డాం. ఇది సీఎం చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవంతో ఆడిన డ్రామా అని చాలా స్పష్టంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం వల్ల పరీక్ష ఉంటుందా, ఉండదా.. అనే విషయంలో చాలా గందరగోళానికి గురయ్యాను. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామాగా భావిస్తున్నా. ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఇలా ఆడుకోకూడదు. – కె.కాంతారావు, విజయవాడనిరుద్యోగులతో రాజకీయం దుర్మార్గం రోస్టర్ విధానం పాటించకుండా అభ్యర్థులను చివరి ఘడియ వరకు ఉత్కంఠకు గురిచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తీవ్రమైన గందరగోళానికి తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఇంత డ్రామా ఆడింది. కష్టపడి చదివాం. తీరా పరీక్ష రాసే సమయంలో తీవ్రంగా టెన్షన్ పడ్డాం. నిరుద్యోగులతో రాజకీయం చేయడం దుర్మార్గం. – రౌతు రామచంద్రులు, విజయనగరంనిరుద్యోగులను మోసం చేస్తారా? గ్రూపు–2 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే కాలయాపన చేసేందుకు పూనుకుంది. రోస్టర్లో తప్పులున్నాయని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు లోపాలు సరి చేసి మరో 10 రోజులు తర్వాత పరీక్ష జరిపితే వచ్చే నష్టమేముంది? కోర్టు తీర్పు అంటూ మరికొంత కాలం కాలయాపన చేసి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణం. – గుడిపాటి చంద్రశేఖర్, కండాపురం, నెల్లూరు జిల్లా అర నిమిషం ఆలస్యంతో పరీక్షకు దూరంఓ అభ్యర్థి అర నిమిషం ఆలస్యంతో మెయిన్స్ పరీక్షకు దూరమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖ గ్రామీణ ప్రాంతం రొంగలినాయుడుపాలేనికి చెందిన అభ్యర్థి కొండబాబుకు విశాఖపట్నం ద్వారకానగర్లోని బీవీకే కళాశాలలో సెంటర్ కేటాయించారు. ఉదయం 9.45 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించి, సమయం దాటగానే గేట్లు మూసివేశారు. ఇంటి నుంచి బస్సులో బయలుదేరిన కొండబాబు సెంటర్కు రావడం అర నిమిషం ఆలస్యమైంది. దీంతో అతన్ని లోనికి అనుమతించలేదు. తాను ఈ పరీక్ష కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నానని, లోనికి అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా సిబ్బంది అనుమతివ్వలేదు. దీంతో తాను పడ్డ శ్రమ వృథా అయిందని కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగాడు. మరో ఘటనలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన డి.శ్యామలకు విశాఖపట్నంలోని విజయం స్కూల్లో సెంటర్ కేటాయించారు. ఈమె ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయింది. ఎంతో కష్టపడి మెయిన్స్కి సిద్ధమయ్యానని, ఐదు నిమిషాల ఆలస్యంతో తాను పరీక్ష రాయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. -
గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. – గ్రూప్–2 అభ్యర్థినిసాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. ‘బాయ్కాట్ ఎలక్షన్’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో రోస్టర్ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? గ్రూప్–2 రిజర్వేషన్లలో రోస్టర్ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్–2 మెయిన్స్ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే ‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్ కమిషన్ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్ చైర్మన్ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. ఇందులో గ్రూప్–2తో పాటు గ్రూప్–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్–2 మెయిన్స్ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్ కమిషన్కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. నేడు గ్రూప్–2 మెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధంగ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్–2 నిర్వహిస్తారు. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్టౌన్, టుటౌన్ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్ర్ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తోంది. మా భవిష్యత్ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – గ్రూప్–2 అభ్యర్థి -
ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు: హైకోర్టు
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు తామేమీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తమపై బాధ్యత లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని తాము చాలా స్పష్టంగా చెబుతున్నామంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరంది. అందుకు తాము ఎంత మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. ఆ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో తెలియదని, అందువల్ల కమిటీ నివేదిక కోసం వేచి చూడటం మంచిదని పిటిషనర్లకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు విషయంలో అభిప్రాయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి గత ఏడాది నవంబర్ 20న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ కర్నూలులో భవనాలను పరిశీలించనుందని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు తాండవ యోగేష్, తురగా సాయి సూర్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుంది విచారణ మొదలు కాగానే ధర్మాసనం స్పందిస్తూ, బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా? లేదా? దేశంలో పలు చోట్ల హైకోర్టు బెంచ్ల ఏర్పాటు ఎలా జరిగింది? అందుకు అనుసరించిన విధి విధానాలు ఏమిటి? వంటి అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంది. క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపింది. కమిటీ నివేదిక వచ్చాక ఆ నివేదికపై న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్కోర్టులో చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవేళ కమిటీ నివేదికపై అభ్యంతరం ఉంటే, దానిని సవాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ దృష్ట్యా పిల్ను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కమిటీ నివేదిక తర్వాత సవాలు చేసుకోవాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆప్షన్ ఇచ్చింది. అయితే యోగేష్ తమ పిల్ను పెండింగ్లో ఉంచాలని పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఇదే అంశంపై న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి దాఖలు చేసిన పిల్ను కూడా యోగేష్ తదితరుల పిల్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అమరావతి రాజధాని విషయంలో ఇదే హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని, ఆ తీర్పును పరిశీలించాలని యోగేష్ కోరగా, తాము ఇప్పుడు పరిశీలించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కప్పం కడితేనే మైనింగ్
రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ‘ముఖ్య’ నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే.. లేదంటే గనులను బంద్ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత.. నాకింత.. అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాథుడే లేడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయినా సరే తమ ఆదాయం మాత్రం బాగుండాలనే కూటమి పెద్దల తీరుతో రాష్ట్రంలో మైనింగ్ రంగం అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లోనూ గనుల తవ్వకాలు స్తంభించిపోయాయి. తమకు కప్పం కట్టిన వారికి మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కప్పం కట్టని గనుల యజమానులపై పది రెట్లకు పైగా జరిమానాలు విధిస్తుండడంతో వారు విలవిల్లాడిపోతున్నారు. దీంతో మైనింగ్ ఆదాయం సగానికి సగం పడిపోయింది. మరోవైపు కూటమి నేతలు మాత్రం ఎక్కడికక్కడ గనులను స్వాధీనం చేసుకుని అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇదంతా కూటమి ముఖ్య నేత, ఆయన కుమారుడి నేతృత్వంలోనే జరుగుతుండడం గమనార్హం. ఎనిమిది నెలలుగా కూటమి నేతలు జిల్లాల వారీగా క్వార్ట్జ్, సిలికా శాండ్, గ్రానైట్, రోడ్ మెటల్, బీచ్ శాండ్, లేటరైట్, బెరైటీస్ వంటి అన్ని ఖనిజాలను తమ బినామీల పరం చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. దీనివల్ల ఇప్పటికే రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో అత్యంత డిమాండ్ ఉన్న క్వార్ట్జ్, మైకా తవ్వకాలను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నాయకుడికి అప్పగించారు. ఆ నేత ప్రతి నెలా రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.600 కోట్లు ‘ముఖ్య’ నేతకు కప్పం కట్టాలనే ఒప్పందంతో మొత్తం క్వార్ట్జ్ మైనింగ్ అంతా ఆయన చేతిలో పెట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమలను పరిశీలించి, అదే తరహాలో తిరుపతి జిల్లా సైదాపురంలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ‘ముఖ్య’ నేతకు 50 శాతం వాటా ఇచ్చేందుకు చీకటి ఒప్పందం జరిగినట్లు తెలిసింది.రూ.50 వేల ఖనిజాన్ని రూ.10 వేలకివ్వాలట!ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో దాదాపు 140 ఓపెన్ కాస్ట్, 7 అండర్ గ్రౌండ్ క్వార్ట్జ్ గనులు ఉన్నాయి. వాటిలో తవ్వే ఖనిజాన్ని ఎంపీ చెప్పిన మనుషులకు.. అది కూడా వారు నిర్ణయించిన రేటుకు విక్రయిస్తేనే లీజులను కొనసాగిస్తామంటూ ప్రభుత్వ ‘ముఖ్య’ నేత స్పష్టం చేయడంతో వారు అంగీకరించలేదు. దీంతో తవ్వకాలు నిలిచిపోయి ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ఖనిజాన్ని విక్రయించే వారికి మాత్రమే అనుమతులు జారీ చేస్తూ, మిగిలిన క్వారీలను నిలిపివేశారు. రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే క్వార్ట్జ్ గనులను చేజిక్కించుకునేందుకు కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలతో మైనింగ్ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యే ఈ ఖనిజానికి టన్నుకు కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తానని ఆ ఎంపీ చెబుతుండటంతో మైనింగ్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఖనిజాన్ని చైనాలో టన్ను రూ.50 వేలకు విక్రయించుకుంటూ, తమకు మాత్రం కనీసం మైనింగ్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని రేటును ఇస్తున్నారంటూ పలువురు మైనింగ్ వ్యాపారులు వాపోతున్నారు.కోర్టు ఉత్తర్వులూ బేఖాతరురాజకీయ దురుద్దేశంతో మైనింగ్ అనుమతులు నిలిపి వేయడంపై రాష్ట్రంలోని ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్ ఇండస్ట్రీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సమర్థించిన కోర్టు నెల రోజుల్లో అన్ని అనుమతులు ఉన్న క్వారీలకు రవాణా ఫారాలను జారీ చేయాలని, పోర్టర్స్ను అన్ బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్య నేత సూచనలతో మైనింగ్ ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.రెండు పోర్టుల నుంచి అక్రమంగా ఖనిజ రవాణామరోవైపు లీజులను నిలిపి వేయడంతో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్కు డిమాండ్ పెరగడంతో కూటమి నేతలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడుకుని రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన క్వారీ నిర్వాహకులపై అక్రమ మైనింగ్ చేశారని పది రెట్లు జరిమానాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు నిత్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్ లారీలు పెద్ద ఎత్తున అక్రమ ఖనిజాన్ని చేరవేస్తున్నాయి. చీమకుర్తి తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్ను నిబంధనలకు విరుద్ధంగా పోర్టులకు తరలిస్తున్నారు. అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు, మైనింగ్ అధికారులు ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఇందులో ముఖ్య నేత తనయుడి పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. వీటి వైపు కన్నెత్తి చూడకూడదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు అందడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.నిఘా నిర్వీర్యం.. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చెక్పోస్ట్ల వద్ద అక్రమ మైనింగ్ రవాణాను అడ్డుకుంటున్న దాఖలాలే లేవు. విజిలెన్స్ బృందాలను తమ బినామీలకు ఖనిజాన్ని కారుచౌకగా ఇచ్చేందుకు నిరాకరించే వారి పని పట్టడానికే ఉపయోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన క్వారీ యజమానులపై తప్పుడు కేసులు పెట్టడం, పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడానికే ఈ బృందాలను వాడుకుంటున్నారు. రోడ్ మెటల్, గ్రావెల్, గ్రానైట్, బాల్ క్లే తదితర ఖనిజాల రవాణాపై ఎన్ని ఫిర్యాదులు అందినా.. ఏ మాత్రం పట్టించుకోవద్దని జిల్లాల్లోని అధికారులకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలే అక్రమ మైనింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ సంపాదన విషయంలో పార్టీ నేతల మధ్యే విభేదాలు వచ్చి, బజారునపడి రచ్చ చేసుకుంటున్నారు. నూజివీడులో మైనింగ్ దందాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా మంత్రి కొలుసు పార్థసారథిపై ఆరోపణలు చేశారు.వైఎస్ జగన్ హయాంలో పెరిగిన ఆదాయంవైఎస్ జగన్ హయాంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడంతో ఆదాయం భారీగా పెరిగింది. పారదర్శక విధానాలు, లీజుల జారీలో జాప్యాన్ని నివారించడంతో పాటు ఔత్సాహికులు మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో మొదట వచ్చిన వారికే మొదటి అవకాశం (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) విధానం ద్వారా మైనింగ్ లీజులు జారీ చేసేవారు. దీనివల్ల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్లో ఉండడంతో లీజులున్నా, మైనింగ్ చేయకుండా జాప్యం చేసేవారు. గతంలో 4,988 లీజుల్లో 2,826కు మాత్రమే వర్కింగ్ లీజులుండేవి. ఆ విధానాన్ని రద్దు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించడంతో అదనంగా 1,700 లీజులు వర్కింగ్లోకి వచ్చాయి. దీంతో మైనింగ్ ఆదాయం బాగా పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని లీజులను అనధికారికంగా నిలిపి వేయడంతోపాటు మళ్లీ పాత విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండడంతో మైనింగ్ రంగం కుదేలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ ఆదాయం రూ.1,950 కోట్లు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణల వల్ల 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆది రూ.4,800 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3 వేల కోట్లు రావడమే గగనంగా మారింది.టెక్కలిలో కక్ష సాధింపుగా అడ్డగోలు దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నాయకుడి సోదరుడు గ్రానైట్ క్వారీలపై లేని పోని ఆంక్షలు విధించాడు. అది తట్టుకోలేక టెక్కలి సమీపంలో ఓ గ్రానైట్ క్వారీని మూసి వేశారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇదే క్వారీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులతో పాటు యజమాని సైతం రోడ్డున పడ్డాడు. ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతుండడంతో క్వారీ నిర్వహణ పూర్తిగా నిలిపివేశారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు అధికారులను ఉసిగొలిపి అడ్డగోలుగా విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు. దీంతో టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో గ్రానైట్ క్రషర్లను నిలిపివేశారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అది తట్టుకోలేక పలువురు క్రషర్లను నిలిపివేశారు. అయితే టీడీపీకి చెందిన కొన్ని క్రషర్లు ఎలాంటి నిబంధనలు పాటించక పోయినప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం.. రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల గనుల యజమానులు, కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా వేధిస్తున్నారు. ఒకరిద్దరు కూటమి నేతల కన్నుసన్నల్లోనే అనధికారికంగా గనుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల తీరువల్ల అందరికీ ఇబ్బందులెదురవుతున్నాయి. ఇది చాలా అన్యాయం.– ప్రవీణ్ కుమార్, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాపర్మిట్లు బ్లాక్ చేశారుమైకా గనులను దక్కించుకునేందుకు ఎనిమిది నెలలుగా కూటమి నేతలు పడారని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని గనులకు అనుమతులను మంజూరు చేసినప్పటికీ, నేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకూ మైనింగ్ పరిశ్రమ కుదేలవుతోంది. కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.– నాగార్జున, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాఎంతగా సర్దుకుపోతున్నా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రచారం చేసిన వ్యక్తి క్వారీని నిలిపివేశారు. క్వారీలో ఎలాంటి అవకతవకలు లేకపోయినా ఎందుకు నిలిపివేశారని మైన్స్ అధికారులను అడిగితే దయచేసి తమను ఏమీ అడగొద్దని, పైనుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. దీంతో గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డంపింగ్లను అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఎంతగా సర్దుకుపోతున్నా ఇక్కట్లు తప్పడం లేదు. – క్వారీ యజమానులు, ప్రకాశం జిల్లా -
‘మార్జిన్’లో చీర్స్! బాబు చీర్స్!
సాక్షి, అమరావతి: మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ‘ముఖ్య’నేతకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు..! అందుకే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు..! 40 ఇయర్స్ ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు! ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ(TDP) సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా బెదిరించి సీఐల నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చ ముఠాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ‘ముఖ్య’నేత అంతటితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా రూ.వందల కోట్లు కమీషన్ వసూలు చేసుకునేందుకు ‘ఛీర్స్’ చెప్పారు! ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే చానల్ను ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14 శాతానికి పెంచేందుకు ‘పచ్చ’జెండా ఊపారు! ఈమేరకు ‘ఏఆర్టీ’ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు(liquor prices) భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరగనుంది. అంతిమంగా మందుబాబులపై ఈ భారం పడనుంది. ఒక్క డీల్తో ఈ కుతంత్రం కథను నడిపించిన తీరు ఇదిగో ఇలా ఉంది...ముందస్తు పన్నాగం..అటు నుంచి నరుక్కురావడం అంటే ఏమిటో ‘ముఖ్య’నేత మరోసారి చేతల్లో చూపించారు. మద్యం దోపిడీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన తీరే అందుకు తాజా నిదర్శనం. కూటమి సర్కారు గతేడాది అక్టోబరు నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో అడ్డుకుని టీడీపీ సిండికేట్కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కట్టబెట్టింది. 2024 అక్టోబరు నుంచి రెండేళ్లపాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీ ముడుపులు కొల్లగొట్టారు. మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాకు రూ.5 చొప్పున కమీషన్ కింద లెక్కించి ముందుగానే రెండేళ్ల మద్యం అమ్మకాలపై ఏకమొత్తంగా భారీ కమీషన్ల మూటలు కరకట్ట బంగ్లాకు చేరేలా కథ నడిపారు. అనంతరమే మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ‘ముఖ్య’నేత అంతటితో ఆగలేదు. మద్యం దందాలో మరింత పిండుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో.. మద్యం విక్రయాలపై తమకు మార్జిన్ పెంచాలని సిండికేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు మద్యం అమ్మకాలపై వాస్తవంగా వస్తున్న 10 శాతం లాభం మార్జిన్ సరిపోవడం లేదనే వాదనను అందుకుంది. తమకు వాస్తవంగా 14 శాతం మార్జిన్ వచ్చేలా చూడాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది.మూటలు ఇస్తేనే మార్జిన్ పెంచుతాం...– మెలిక పెట్టిన ‘ముఖ్య’ నేత మార్జిన్ పెంచాలని మద్యం సిండికేట్ నుంచి డిమాండ్ మొదలైన తరువాత ‘ముఖ్య’నేత అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టారు. మరి మార్జిన్ పెంచితే ‘నాకేంటి..?’ అని ఆయన సూటిగానే అడిగేసినట్లు సమాచారం. దీంతో ‘ముఖ్య’నేత ఆంతర్యం ఏమిటన్నది మద్యం సిండికేట్కు అర్థమైంది. ఈ అంశంపై తర్జన భర్జనల తరువాత ‘ముఖ్య’నేతతో డీల్ కుదుర్చుకున్నారు. తమ మార్జిన్ను వాస్తవంగా 14 శాతానికి పెంచితే అందుకు తగిన కమీషన్ ఇస్తామంటూ మంతనాలు సాగించారు. ‘ముఖ్య’నేత కోరుకున్నదీ... సిండికేట్ ఇస్తానన్నది ఒకటే కావడంతో డీల్ కుదిరింది. దాంతో మద్యం అమ్మకాలపై మార్జిన్ను వాస్తవంగా 14 శాతం వచ్చేలా చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం కూడా పొందారు.‘ముఖ్య’నేతకు ఏటా మూట..!మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే మద్యం దుకాణదారులకు మార్జిన్ 14 శాతం వచ్చేటట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ మేరకు మద్యం దుకాణదారులకు ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి అందులో మూడో వంతు తనకు కమీషన్గా ఇవ్వాల్సిందేనని ‘ముఖ్య’నేత పట్టుబట్టారు. అందుకు మద్యం సిండికేట్ సమ్మతించింది. అంటే మద్యం సిండికేట్ ‘ముఖ్య’నేతకు ఏటా రూ.వెయ్యి కోట్ల మూట ముట్టజెప్పనుందన్నది స్పష్టమవుతోంది. ఈ డీల్ ద్వారా ‘ముఖ్య’నేత సొంత ఖజానాకు ఏటా రూ.వెయ్యి కోట్లు చేరనుండగా టీడీపీ మద్యం సిండికేట్ రూ.2 వేల కోట్ల వరకు అదనపు లాభం కొల్లగొట్టనుందన్నది తేటతెల్లమవుతోంది. డీల్ కుదరడంతో ఈ పన్నాగానికి ముగింపుగా మద్యం ధరలపై అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్టీ)సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా మద్యం దుకాణదారులకు 14 శాతం మార్జిన్ వచ్చేలా చేశారు.ధరలు భారీగా పెంపు...రాష్ట్రంలో రూ.99కి అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్పై మినహా మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై ధరలను మూడు కేటగిరీల కింద పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ధరల పెంపు ప్రభావం భారీగా ఉండనుంది. అంతిమంగా మందుబాబులపై భారీగా భారం పడనుంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీరు కేసుల విక్రయాలు జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం క్వార్టర్ బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు పెంపు అంటే మద్యం ప్రియులపై భారీ ఆర్థిక భారం పడనుందన్నది సుస్పష్టం. ‘ముఖ్య’ నేత కమీషన్ల కోసం ఇంత కథ నడిపించడం పట్ల ఎక్సైజ్ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దోపిడీ కోసం అటు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి... ఇటు మద్యం సిండికేట్ నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తూ... మరోవైపు మద్యం ధరలు పెంచి మందు బాబుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యారు. -
రెడ్బుక్ కుట్రతో.. గాడి తప్పిన పోలీసింగ్
సాక్షి, అమరావతి: ⇒ విజయవాడ వరదల్లో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది పోలీసుఅధికారులనువినియోగించని ప్రభుత్వం ఫలితం.. దాదాపు 50మంది దుర్మరణం ⇒ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం.. ఫలితం.. తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల మృతి ⇒ సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నా సైబర్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయని ప్రభుత్వం ఫలితం.. గత ఏడాదిలో ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాలు ⇒ ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతులేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలకు అంతన్నదే లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ అన్నదే కనిపించకుండా పోయింది. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో సమర్ధులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం.. ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం. ఇది నిఖార్సైన నిజం. ఎందుకంటే.. అధికారులపై రెడ్బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్బుక్ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్లోనో లేదంటే సస్పెన్షన్లోనే పెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, మహిళలపై అత్యాచారలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా, సామాన్యుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, అధికారులందరినీ పక్కన పెట్టేసింది. ‘వెయిటింగ్’లో పెట్టు...‘వీఆర్’లో ఉంచూ వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్).. ఈ రెండు పదాల మధ్యే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక మంది పోలీసు అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచి, మరో నలుగురు ఐపీఎస్ అధికారులను కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం అంతటితో ఆగ లేదు. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్లోనే ఉంచింది. పరిపాలన పరమైన అంశాలతో నలుగురైదురుగురికి స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సది్వనియోగం చేసుకోవడం రివాజు. కానీ ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసి, వారందరినీ పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. వారిలో నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, ఒక ఏఆర్ డీఎస్పీ ఉన్నారు. – ఇక శాంతి–భద్రతల పరిరక్షణ, ఇతర పోలీసు విధుల్లో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారులపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దురీ్నతి ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్లో ఉంచడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు రేంజ్లో 28 మంది, కర్నూలు రేంజ్లో 21 మంది, ఏలూరు రేంజ్లో 24 మంది, విశాఖపట్నం రేంజ్లో 17 మంది సీఐలను ‘వీఆర్’లో పెట్టింది. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్సైలను ‘వీఆర్’లో ఉంచింది. దీంతో పని చేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అమాంతంగా పెరిగిన నేరాలు– ఘోరాలు అధికారులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్లో, వీఆర్లో పెట్టడంతో పోలీసు వ్యవస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతోంది. దాంతో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2024లో సైబర్ నేరాలపై ఏకంగా 7.23లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. దాంతో సైబర్ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులకు నియోగించలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది. -
జగన్ 2.0: కార్యకర్తల కోసం.. ఎలా పని చేస్తానో చూపిస్తా
వరుసగా రెండేళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలూ తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘మన ప్రభుత్వ పాలనతో చంద్రబాబు సర్కార్ పరిపాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారు.. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారు.. మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. మరి చంద్రబాబు అదే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ విజయం సాధించడం తథ్యం.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయం. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy)స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్ధ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ‘ఒక్కటే గుర్తు పెట్టుకోండి.. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటాం అన్నదే నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి.. ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నామీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రినయ్యా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు.. దొంగ కేసులు పెడతారు.. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దాం. మీకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తు పెట్టుకోండి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్థ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులుదృఢంగా నిలబడినందుకు గర్వపడుతున్నా..విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలు ఉంటే అప్పట్లో మనం 49 గెలిచాం. టీడీపీకి వచ్చిన స్థానాలు కేవలం 14. కమ్యూనిస్టులు ఒక్క సీటు గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 36 మంది నిటారుగా నిలబడ్డారని చెప్పేందుకు గర్వపడుతున్నా. కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఏవి తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత వాటికి ఎన్నికలు జరిగితే మన పార్టీ క్లీన్స్వీప్ చేయగలిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. ప్రతి నెలా ఏ పథకాన్ని అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి ఏటా క్రమం తప్పకుండా, ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా, వారు ఇబ్బంది పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం..వైఎస్సార్సీపీ విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకూ ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వ్యవహరించాం. ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా ఈ రోజుకు కూడా గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల మధ్య నిలబడి సమస్యలను వినగలుగుతాం. వారితో మమేకం కాగలుతాం. కారణం.. మనం ప్రజలకు మంచే చేశాం. ఏరోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో.. అది చేసి చూపించిన తర్వాత వాళ్లను ఓట్లు అడిగాం. కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.నిలదీస్తారన్న భయంతోనే రెడ్బుక్ రాజ్యాంగం..ఎన్నికలు జరిగి 9 నెలలు కూడా తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే మొదలు.. కార్యకర్త వరకు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం.. ఏ గడపకు వెళ్లినా ఎన్నికల ముందు వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు గురించి ప్రజలు నిలదీస్తున్నారు. తల్లికి వందనం కింద తమకిస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఆ ఇంట్లో 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు తమకిస్తామన్న రూ.48 వేలు ఏమయ్యాయని అడుగుతున్నారు. అదే ఇంట్లో 20 ఏళ్ల యువకుడు తమకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న రూ.36 వేల గురించి నిలదీస్తున్నాడు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళితే అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సంగతేమిటని కండువా వేసుకున్న రైతన్నలు నిలదీస్తున్నారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు తాము చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నారు. అదే మాట గుర్తు చేస్తూ.. ఈరోజు ప్రజలు ఎక్కడ కాలర్ పట్టుకుంటారో అని భయపడి రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు.ఆ రోజే చెప్పా.. అదే జరిగిందిఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత.. ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పా. ‘చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే..! చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే..!’ అని చెప్పా. మన మేనిఫెస్టో, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పా. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు ఆ పథకాలు అమలు చేయలేక చేతులెత్తేశారు.చేసేదే చెప్పాం.. చెప్పిందే చేశాంరాష్ట్ర బడ్జెట్ ఇదీ.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవీ.. వీటికింత ఖర్చవుతుంది అని నాడు మనం చెప్పాం. మరోవైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నారు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసం.. అని వివరిస్తూ మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాం. ఆరోజు మన ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనం కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లా హామీలు ఇద్దామన్నారు. కానీ అప్పుడు నేను ఒక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పా. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పా. ఓడిపోయాం.. ఫరవాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం.. అదీ ఫర్వాలేదు. మళ్లీ అదే రోజుకు వెనక్కి వెళ్లినా కూడా ఇదే విధంగానే మరలా చెబుతాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్ధం అదే! జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్సీపీ మళ్లీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్ధం అవుతోంది.ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. ఇది కచ్చితంగా చెబుతున్నా. జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలోనూ మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసమే తాపత్రయపడ్డా. వారి కోసమే నా టైం కేటాయించా. ప్రజల కోసమే అడుగులు వేశా. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశా. కార్యకర్తల బాధలను గమనించా. వారి అవస్థలను చూశా. ఆ కార్యకర్తలకు మీ జగన్ అండగా ఉంటాడు.- వైఎస్ జగన్ ‘‘జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. నాడుృనేడుతో స్కూళ్లు బాగుపడటమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ పాఠశాలల ప్రయాణం మొదలైంది. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది డిజిటలైజ్ అయింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు కనిపించేవి. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్ధితిని రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొదటిసారిగా గవర్నమెంట్ బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి..’’- వైఎస్ జగన్ పాలన పోలుస్తున్నారు.. ప్రజలే తేల్చేస్తారుఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే.. రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక ముందు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్భందీగా జరిగింది. అదే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి పిల్లలను చదివించేలా ప్రోత్సహించాం. వారు ప్రపంచంతో పోటీ పడాలని, ఎంతో ఎదగాలని తపిస్తూ చదువుల్లో సమూల మార్పులు తెచ్చిన పరిస్థితి మన పాలనలో కనిపిస్తే.. ఇప్పుడు 9 నెలల్లోనే ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైంది. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చూస్తే.. నాడు–నేడు పాయె... అమ్మఒడి పాయే... ఇంగ్లీషు మీడియం పాయే... ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే... ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం పాయే... మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ కూడా పాయే..! ఇక వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశా.. 70% బడుల్లో 70 మంది పిల్లలు కూడా లేరు అని రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు.ప్రజారోగ్యానికి భరోసా కరువు..పేదవాడికి ఆరోగ్యం బాగా లేకుంటే వారి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారైంది. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్థితి లేదు.అదే మన ప్రభుత్వంలో ఉచితంగా వైద్యం అందించడంతోపాటు ప్రొసీజర్లు వెయ్యి నుంచి ఏకంగా 3,300కి పెంచాం. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రులను 900 నుంచి 2,400కి పెంచాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత పరిపాటే అనే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేశాం. మొదటిసారిగా గవర్నమెంటు ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే మందులు దొరకని దుస్ధితి నుంచి.. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న ఔషధాలు మాత్రమే లభించేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్ సీపీదే. రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. 105 రకాల మందులు సరఫరా చేస్తూ 24 గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అక్కడే నిర్వహించేలా విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. తొలిసారిగా పీహెచ్సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలో ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్లో గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూశాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి నెలలో కనీసం రెండు రోజులు అక్కడకు వెళ్లేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెఫ్ట్ను అందుబాటులోకి తెచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభత్వమే. కనీవీని ఎరుగని విధంగా తొలిసారిగా ప్రివెంటివ్ కేర్ కూడా వైఎస్సార్ సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయాయి. విలేజ్ క్లినిక్లు పని చేయడం లేదు. పీహెచ్సీలు కూడా పని చేయడం లేదు. కూటమి సర్కారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బిల్లులను చెల్లించలేదు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ పేదలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ఇదీ.. మన ప్రభుత్వానికి, వీళ్ల ప్రభుత్వానికి మధ్య తేడా!అన్ని వ్యవస్థలు నిర్వీర్యం..తొలిసారిగా రైతుల కోసం ఆర్బీకేలు తేవడం.. ఇ–క్రాప్.. దళారీ వ్యవస్థను తొలగించి ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోలు చేయడం.. అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ద్వారా వ్యవస్ధను మార్చడం.. ఇలా మనం చేపట్టిన చర్యలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాశనం అయ్యాయి. నాడు గ్రామాల్లో సచివాలయాలను నెలకొల్పి ఎవరెవరు ఎలాంటి పౌర సేవలు అందించాలో నిర్ణయించాం. ప్రతి 50–60 ఇళ్లకు వలంటీర్ను నియమించి ప్రతి పథకాన్ని పారదర్శకంగా ప్రతి ఇంటికీ చేరవేసిన కార్యక్రమాలన్నీ ఇవాళ నాశనం అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్ధలన్నీ నాశనం అయ్యాయి. మరోవైపు ఏది చూసినా స్కామే...! ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులను రూ.2 లక్షలకో, రూ.3 లక్షలకో ఎమ్మెల్యేలు దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులను తొలగించి ప్రైవేట్ దుకాణాలను తెచ్చారు. ఎక్కడ చూసినా ఇసుక రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నాకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. -
‘మన మిత్ర’.. మరో మారీచుడే!
సాక్షి, అమరావతి: మొన్న ‘‘సేవా మిత్ర..!’’.. నేడు ‘‘మన మిత్ర..!’’ పేర్లు మారినా కుతంత్రాలు మాత్రం మారలేదు!!రామాయణంలో మారీచుడు ఎలా రూపాలు మార్చుకుని దారుణాలకు ఒడిగట్టేవాడో... రాష్ట్ర రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయ వేషాలతో కుట్రలకు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సర్కారు రాజకీయ కుతంత్రాలపై సర్వత్రా మండిపడుతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో నమోదు చేసే ఆధార్ నంబర్తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం బహిర్గతం కావడంతో గిట్టని వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేయడంతోపాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యంగా పౌరుల వ్యక్తిగత డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ గుప్పిట్లో పెట్టారని.. అసలు ప్రజల వ్యక్తిగత డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో...! ఎన్ని చేతులు మారుతాయో? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ప్రభుత్వానికి పౌర సేవలపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘‘దిశ’’ యాప్ తరహాలో ప్రభుత్వమే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ సేవా మిత్ర మొబైల్ యాప్తో లక్షలాది మంది ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన కుతంత్రానికి సరికొత్త రూపాన్నిచ్చారు. అదే.. ‘మన మిత్ర’ మొబైల్ యాప్. మీ ఆధార్ నంబర్ వాట్సాప్ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. బాలనాగమ్మను మాయల ఫకీరు చిలుకలో బంధించి ఎత్తుకుపోయినట్టు... యావత్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా అంతా నిక్షిప్తం చేసి అక్రమాలకు పాల్పడేందుకు రాజకీయ మాయల ఫకీరు వేసిన ఎత్తుగడే మన మిత్ర యాప్. ఒక్క ఆధార్ నంబరుతో మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, చిరునామాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఓటరు నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు... సర్వం మాయల ఫకీరు గుప్పిట్లోకి వెళుతుంది. ఆ తరువాత ఏడు సముద్రాలు దాటి విదేశాలకు చేరుతుంది. అక్కడ నుంచి సైబర్ నేరస్తులు ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టొచ్చు...! ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించవచ్చు...! అర్హులైనప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తొలగించవచ్చు...! ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరుల ఓట్లను గంపగుత్తగా తొలగించవచ్చు...! చంద్రబాబు సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ ఎత్తుగడ వెనుక ఇంత దారుణ పన్నాగం దాగి ఉంది. రాజ్యాంగం కల్పించిన ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే కుతంత్రం ఇది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అరాచక పర్వం ఇది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బరితెగింపు ఇది. ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించాలనే టీడీపీ దీర్ఘకాలిక దురాలోచన దీని వెనుక ఉన్నట్లు సాంకేతిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.గవర్నెన్స్ ముసుగు.. డేటా చోరీ కుట్ర!వాట్సాప్లో మీ ఆధార్ నంబర్ మెసేజ్ చేస్తే చాలు.. 520 రకాల పౌర సేవలు అందిస్తామని మంత్రి నారా లోకేశ్ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రస్తుతం 161 సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మిగిలినవి కూడా అందిస్తామంటూ దీనికి ‘మన మిత్ర’ అనే పేరు ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఆ పౌర సేవలను ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో అందిస్తామని తెలిపారు. ‘వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా పౌర సేవలు పొందాలంటే 95523 00009 నంబర్కు ప్రజలు తమ ఆధార్ను వాట్సాప్ చేయాలి. అలా చేయగానే ప్రజల వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతున్నాయి. ఇక పౌర సేవలు పొందేందుకు ఆ వాట్సాప్ నంబరులో సూచించే ఫారాన్ని ఆన్లైన్లో పూరించాలి. దాంతో ఆయా వ్యక్తుల అదనపు వివరాలన్నీ వెల్లడవుతున్నాయి. పేరు, ఇంటి నంబరు, ఓటరు కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు, మొబైల్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీ... ఇలా సమస్త వివరాలు సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండానే బహిర్గతమవుతున్నాయి.అంటే ప్రజల వ్యక్తిగత గోప్యత అన్నది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినట్లు నిర్ధారణ అవుతోంది.పౌరుల డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లోకి...వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికి చేరుతోందన్నది అత్యంత కీలకంగా మారింది. వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రవేశ పెట్టలేదు. ప్రభుత్వ విభాగం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా సొంతంగా ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. నిజంగా చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే ప్రభుత్వమే సొంతగా మొబైల్ యాప్ను రూపొందించవచ్చు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల భద్రత కోసం ‘దిశ’ మొబైల్ యాప్ను పోలీసు శాఖే స్వయంగా రూపొందించింది.ప్రజలు అన్ని రకాల పోలీసు సేవలు పొందేందుకు ‘పోలీసు సేవా యాప్’ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలే సొంతంగా మొబైల్ యాప్లు రూపొందించి పౌర సేవలు అందిస్తున్నాయి. అంతేగానీ సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారంతో ముడిపడిన అంశాలపై ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. మరి పౌర సేవల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం సొంతంగా యాప్ ఎందుకు రూపొందించలేదన్నది సందేహాలకు తావిస్తోంది. అంటే ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ ప్రైవేట్ సంస్థకు అందుబాటులోకి వచ్చినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పథకాల్లో కోత... ఓట్ల తొలగింపు – ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యం..వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ సర్కారు అసలు కుట్ర. వైఎస్సార్సీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులను వేధించడం.. వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం.. టీడీపీకి ఓట్లు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పన్నాగం దాగి ఉంది. 2029 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్న దీర్ఘకాలిక దురాలోచన ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారంటే.. ఒకరి ఆధార్ నంబరు టైప్ చేస్తే చాలు ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆధార్ నంబర్లు, వారి వ్యక్తిగత డేటా కూడా మొత్తం బట్టబయలవుతోంది. సాధారణంగా ఎక్కడైనా ఆధార్ నంబరు నమోదు చేస్తే సంబంధిత వ్యక్తి మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేశాకే మిగతా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుంటుంది. కానీ టీడీపీ ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్లో ఇలాంటిదేమీ లేదు. ఒకరి ఆధార్ నంబరు వెల్లడిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, వ్యక్తిగత డేటా సైబర్ నేరస్తులకు కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ అన్ని రకాల సైబర్ నేరాలు, మోసాలకు తలుపులు బార్లా తెరుస్తోంది.ఆధార్ చట్టం ఉల్లంఘన...ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. ఆధార్ సంబంధిత డేటా పరిరక్షణ కోసం కేంద్రం రూపొందించిన యూఐడీఏఐ చట్టం పటిష్ట మార్గదర్శకాలను నిర్దేశించింది. వాటి ప్రకారం..– ఆధార్ డేటాను భారత్లోనే భద్రపరచాలి. దేశ సరిహద్దులు దాటించి విదేశీ సర్వర్ల ద్వారా డేటా ప్రాసెసింగ్ అన్నది పూర్తిగా నిషిద్ధం. కానీ చంద్రబాబు ప్రభుత్వం విదేశీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తద్వారా ప్రజల ఆధార్ డేటా దేశ సరిహద్దులు దాటేందుకు ఆస్కారం ఇచ్చింది. – ఆధార్ నంబరు, డేటాను ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రచురించకూడదని చట్టం చెబుతోంది. రేషన్ కార్డు, జనన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లలో ఆధార్ పూర్తి నంబరు ప్రచురించకూడదు. కేవలం ఆధార్లోని చివరి నాలుగు అంకెలే ప్రచురించాలి. అందుకు విరుద్ధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆధార్ నంబరును పూర్తిగా అంటే మొత్తం పది అంకెలను బహిర్గతం చేస్తున్నారు.ఐటీ, డేటా భద్రతా చట్టాలకు విరుద్ధంగా..పార్లమెంట్ ఆమోదించిన ఐటీ చట్టం–2000, ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్–2023’ను చంద్రబాబు ప్రభుత్వం యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే ఐటీ చట్టం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించింది. ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణలో విఫలమైతే ఒక్కో ఉల్లంఘనకు ఏకంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అవకాశం కల్పించింది. వీటిని టీడీపీ సర్కారు ఏమాత్రం లెక్క చేయడం లేదు.సుప్రీం తీర్పు బేఖాతర్...వ్యక్తిగత డేటా పరిరక్షణ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత వివరాలను ఎలా ఉపయోగించాలన్నది పూర్తిగా ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇతరులు ఎవరికీ ప్రజల వ్యక్తిగత డేటా మీద నియంత్రణ ఉండకూడదని 2017లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తేవడం విస్మయపరుస్తోంది.2019లో ‘సేవా మిత్ర’ యాప్తో అక్రమాలు2014–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడింది. 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలను హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా టీడీపీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించారు. టీడీపీ ఎన్నికల వ్యూహం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్లోకి ప్రజల వ్యక్తిగత డేటాను చేరవేశారు. పేరు, చిరునామా, కులం, మతం, ఆధార్ నంబరు, ఓటరు కార్డు నంబరు, పోలింగ్ బూత్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు... ఇలా పూర్తి వివరాలు టీడీపీ సేవా మిత్ర యాప్లో అనుసంధానమయ్యాయి. అనంతరం వాటిని దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడింది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని భావించిన దాదాపు 35 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు బరి తెగించింది. దానిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఓ నెల విద్యుత్ బిల్లు.. రూ.30,758
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సీఎం అయ్యాక కరెంట్ బిల్లుల మోతకు ఇదో నిదర్శనం. కర్నూలులోని అజీముద్దీన్నగర్కు చెందిన ఉస్మాన్ బాషా ఇంటికి మూడు నెలలుగా వస్తున్న విద్యుత్ బిల్లులను పరిశీలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆయన ఇంటికి అక్టోబర్ మాసం వినియోగానికి సంబంధించి రూ.3,380, నవంబర్కు సంబంధించి రూ.7,723, డిసెంబర్కు సంబంధించి ఏకంగా 30,758 బిల్లు రావడంతో బెంబెలెత్తిపోతున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. -
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్
సాక్షి, అమరావతి: ప్రజలు నేరుగా ఫోన్ ద్వారానే ధృవపత్రాలు అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది. వాట్సాప్ గవర్నెన్స్పై బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలి, ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. మొదటి విడతలో దేవదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆరీ్టసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డయాఫ్రం వాల్ నాణ్యత బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది. తాము ఆమోదించిన విధానం, నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారా? లేదా? అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)దేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏకు బుధవారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన 1.5 మీటర్ల మందం, 1,396.6 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రం వాల్ డిజైన్.. నిర్మించే విధానంపై డిసెంబర్ 26న సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక ఇచ్చారు. దీనిపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ(పీవోఈ)తో సీడబ్ల్యూసీ డిజైన్స్ సీఈ విజయ్శరణ్ ఈ నెల 9న ఒకసారి.. 15న రెండోసారి.. 17న మూడోసారి సమీక్షించారు. ఈ సమీక్షల్లో వెల్లడైన అంశాల ఆధారంగా డయాఫ్రం వాల్ నిర్మించే విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ.. వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పోలవరం సీఈని ఆదేశించారు. సీడబ్ల్యూసీ లేఖలో ప్రధానాంశాలివీ ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే టీ–16 కాంక్రీట్ మిశ్రమం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం బలంగా, ధృడంగా, సీపేజీని సమర్థవంతంగా అడ్డుకుంటుందా లేదా అన్నది నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారో నివేదికలో పేర్కొనాలి. ప్లాసిŠట్క్ కాంక్రీట్ నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల నాణ్యత నియంత్రణ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనే అంశంపై నివేదిక ఇవ్వాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం ట్రెంచ్ కట్టర్, గ్రాబర్తో భూమిని తవ్వుతూ.. ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతూ రాతిపొర తగిలే వరకూ ప్యానల్ను దించుతూ పోతారు. రాతి పొర తగిలాక.. కఠిన శిల(హార్డ్ రాక్)లోకి ఎగువ మొన నుంచి ఏకీకృత రీతిలో రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్ను దించాలి. ఆ తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా 12 గంటల్లోగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పోయాలి. ⇒ కఠిన శిల ఫర్మియబులిటీ, సీపేజీపై పరీక్షలు నిర్వహించాలి. పరిమితి కంటే ఎక్కువ సీపేజీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైతే.. దాన్ని అరికట్టడానికి గ్రౌటింగ్ (అధిక ఒత్తిడితో సిమెంట్ను రాతి పొరల్లోకి పంపడం) చేసే విధానాన్ని ఖరారు చేయాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్కూ మరో ప్యానల్ మధ్య జాయింట్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా.. అన్నది నిర్ధారించాలి. ⇒ పాత డయాఫ్రం వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాసిŠట్క్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయాఫ్రం వాల్ మందం 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్లు తగ్గింది. ఇప్పుడు నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ మందం 0.5 శాతం అంటే 7.5 సెంటీమీటర్లు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. అప్పటికీ.. ఇప్పటికీ మందం తగ్గడానికి కారణాలు ఏమిటన్నది సవివరంగా నివేదిక ఇవ్వాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయ్యాక.. ప్రధాన డ్యామ్ నిర్మాణ సమయంలో ఎగువ భాగం కొంత తొలగిస్తారు. అలా తొలగించే సమయంలో డయాఫ్రం వాల్ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నివేదికలో స్పష్టం చేయాలి. ⇒ ప్రాజెక్టు పనులను రోజూవారీ, నెలవారీ సమీక్షిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నారా? లేదా అన్నది పీపీఏ నివేదిక ఇవ్వాలి. -
ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని మహిళల పేరుతో మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట ఏపీ టిడ్కో సహా, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కేటాయించాలని సూచించింది. ఈ పట్టాలపై పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు దక్కేలా కన్వేయన్స్ డీడ్స్ ఇస్తామని తెలిపింది. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇళ్ల స్థలం ఇవ్వాలని, కేటాయించిన రెండేళ్ల లోపు ఇల్లు కట్టుకోవాలని, ఆధార్ కార్డుతో పట్టాను లింకు చేయాలని స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ లబ్ధిదారులు, రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం లేనివారు, గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీం కిందకు రాని వారు, ఐదు ఎకరాలకు మించి మెట్ట వ్యవసాయ భూమి, 2.5 ఎకరాలకు మించి మాగాణి వ్యవసాయ భూమి, లేదా రెండు కలిపి 5 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఇళ్ల స్థలాలకు అర్హులని స్పష్టం చేసింది. గతంలో ఇళ్ల పట్టా పొంది కోర్టు కేసుల వల్ల ఇల్లు పొందని వారికి దాన్ని రద్దు చేసి కొత్తగా పట్టా ఇవ్వవచ్చని పేర్కొంది. గతంలో ఇళ్ల పట్టా పొంది అక్కడ ఇల్లు కట్టుకోని వారికి పట్టాలు రద్దు చేసి తిరిగి మరొక చోట ఇవ్వాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని వీఆర్వో, ఆర్ఐలు అర్హతలకు అనుగుణంగా విచారణ జరిపి జాబితాను తయారు చేసి అక్కడ అంటించాలని సూచించింది. లబి్ధదారుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాలకు తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోవాలని పేర్కొంది. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల్ని జిల్లా కలెక్టర్లు గుర్తించాలని స్పష్టం చేసింది. -
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేం
తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు.. 46 లక్షల మంది తల్లులకు షాక్! అన్నదాతా సుఖీభవపై ఆలోచనే అనవసరం.. 54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం! ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల సాయం గల్లంతే.. 1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన! నిరుద్యోగ భృతి నీటి పాలేనని కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన!సూపర్ సిక్స్లు.. సెవెన్లు ఇక గాలిలో కలిసినట్లే! ఎందుకంటే.. సూపర్ సిక్స్లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15 శాతానికి పెరగాలి! అందుకే.. విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు! ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశలను పటాపంచలు చేశారు!! సాక్షి, అమరావతి: ఇందుమూలంగా ఐదున్నర కోట్ల మంది ప్రజానీకానికి తెలియచేయునది ఏమనగా.. సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు! తన మార్కు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారు. మోకాలికి బోడి గుండుకు ముడిపెడుతూ.. సూపర్ సిక్స్ హామీలకు, వృద్ధి రేటుకు లంకె పెట్టారు! కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. సంపద సృష్టించి.. ఆదాయం పెరిగితే.. అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుబట్టడం లేదంటూ కాడి పారేశారు. సూపర్ సిక్స్లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు మూతలతో నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు! వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానంటూ తన మనసులో ఎప్పుడో ఆవిష్కృతమైన వాటిని కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రాల ఆర్ధిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అబ్బే... ఇప్పుడు చేయలేం...! రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఏటా 15 శాతం మేర పెరిగి తద్వారా ఆదాయం, సంపద సమకూరిన తరువాతే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబడి తగ్గుతోందని.. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు వెసులుబాటు లేదని, అవకాశం ఉంటే ఒక్క నిమిషం కూడా జాప్యం చేయనని చెప్పారు. వృద్ధి రేటు పెరిగి సంపద, ఆదాయం పెరిగితేనే వెసులుబాటు వస్తుందని, అప్పటి వరకు సూపర్ సిక్స్ అమలులో జాప్యం తప్పదని సీఎం స్పష్టం చేశారు. వీటితో మాకేం సంబంధం? బాబు చేస్తారని ఓటు వేశామని, హామీలు అమలు చేయాలనే విధంగా సామాన్య ప్రజలు ఆలోచన చేస్తున్నారని, అందుకే వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని వెల్లడించారు. నమ్మి ఓట్లు వేశాం కదా..! ఇంకా హామీలను అమలు చేయడం లేదని కొంత మంది ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులున్నాయి కదా..! ఎందుకు అమలు చేయడం లేదు? నమ్మి ఓట్లు వేశాం కదా..! అనే ఫీలింగ్లోకి ప్రజలు వెళ్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి రూ.12,150 కోట్లు రాగా, అమరావతికి రూ.15,000 కోట్లు వచ్చాయని, విశాఖ ఉక్కు రివైవ్ (పునరుద్ధరణ)కు రూ.11,114 కోట్లు ఇచ్చిందని, అయితే వాటిని సంక్షేమానికి వ్యయం చేయలేనని చంద్రబాబు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు పడుతుందో.. పదేళ్లు పడుతుందో..! గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నానని, ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో తెలియడం లేదని, సూపర్ సిక్స్ హామీల అమలుకు లేట్ అవుతుందని చంద్రబాబు చెప్పారు. విశ్వ ప్రయత్నం చేసినా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదన్నారు. ఆర్ధికంగా వెసులుబాటు వచ్చిన తరువాత సంపద సృష్టించడం ద్వారా ఆదాయం పెంచిన అనంతరం సంక్షేమ పథకాలను అమలు చేస్తానన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెబుతూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది.. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, మూలధన వ్యయం తక్కువ చేసిందని, దీంతో వృద్ధి తగ్గిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయి అప్పులు పెరిగాయన్నారు. రెవెన్యూ మాత్రం పెరగలేదన్నారు. తద్వారా ఏడాదికి రూ.76 వేల కోట్లు నష్టపోతున్నట్లు చెప్పారు. అభివృద్ధిపై డబ్బులు వ్యయం చేయడం ద్వారా 15 శాతం వృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నానని, తద్వారా సంపద వస్తుందని, దాన్ని సంక్షేమానికి వెచ్చిస్తానని తెలిపారు. శ్రీలంకలా రాష్ట్రం.. ప్రజల కోరికలు తీర్చాలంటే రెవెన్యూ రాబడి పెరగాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నానని, అయితే ఇందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. రాష్ట్రం శ్రీలంకలా అవుతోందని గతంలోనే చెప్పానని, ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ఆరోగ్య సూచికల్లో అదే చెప్పిందన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి జల్సాలు చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తీర్చే స్థోమత కూడా లేకుండా చేసిందన్నారు. కచ్చితంగా వ్యయం చేయాల్సిన వేతనాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపు, పరిపాలన వ్యయం గత ప్రభుత్వంలో 64.6 శాతానికి పెరిగిందన్నారు. మరో పక్క మూలధన వ్యయం తగ్గిపోయిందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇతర హామీలివీ...⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు ⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు ⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు ⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు ⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు ⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు ⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు ⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెల్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు. ⇒ ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. -
సిబ్బందిని కుదించేశారు..
సాక్షి, అమరావతి: రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారు ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల ఉద్యోగులను మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్ధం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేశంలో తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా సచివాలయాల సిబ్బందిని జనాభా ప్రాతిపదికన తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2,500 కంటే జనాభా తక్కువ ఉండే చోట ‘ఏ’ కేటగిరీ గ్రామ సచివాలయాలుగా పరిగణించి ఆరుగురు ఉద్యోగులను కేటాయిస్తారు. 2,500–3,500 జనాభా ఉండే ‘బీ’ కేటగిరీ గ్రామ సచివాలయాలలో ఏడుగురు చొప్పున, అంతకు మించి జనాభా ఉంటే ‘సీ’ కేటగిరీగా పరిగణించి కనీసం 8 మంది చొప్పున సచివాలయాల ఉద్యోగులను పరిమితం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ⇒ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఐఓటీ తదితర సాంకేతిక విధానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులను ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ పేరుతో ఆయా సచివాలయాల్లో కొనసాగిస్తారు. ⇒ రేషనలైజ్ తర్వాత మిగులు ఉద్యోగులుగా గుర్తించే వారిని ఇతర ప్రభుత్వ శాఖలలో వినియోగించుకోవటంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ⇒ ఏదైనా గ్రామం సంబంధిత సచివాలయానికి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పంచాయతీకి ఇబ్బంది లేకుండా సమీప సచివాలయం పరిధిలో చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి మిగులు ఉద్యోగులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ⇒ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శి, వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు వార్డు అడ్మిన్ సెక్రటరీ హెడ్గా కొనసాగుతారు. ⇒ సచివాలయాల పర్యవేక్షణకు కొత్తగా మండల లేదా మున్సిపల్ స్థాయితో పాటు జిల్లా స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మిగులు సిబ్బందిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ⇒ ఆస్పిరేషనల్ ఉద్యోగుల ద్వారా సచివాలయాల స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ అక్షరాస్యత, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందించనున్నారు. వీఆర్వో కోసం వెతుక్కోవాల్సిందే..!ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రేషనలైజేషన్ అనంతరం చాలా సచివాలయాల్లో ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే ఉద్యోగులు అందుబాటులో ఉండని పరిస్థితి ఉత్పన్నం కానుంది. ప్రస్తుతం సచివాలయాల్లో ప్రజలు వెళ్లగానే వారి నుంచి వినతులు స్వీకరించి అప్పటికప్పుడే కంప్యూటర్లో అప్లోడ్ చేసి రశీదు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఇకపై చాలా చోట్ల ఉండరు. 2,500 లోపు జనాభా ఉండే సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య ఆరుకు కుదింపు కారణంగా ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిసెంట్లలో ఎవరో ఒకరు మాత్రమే పని చేస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల సరి్టఫికెట్ల జారీలో కీలకమైన వీఆర్వోలు రేషనలైజేషన్ అనంతరం దాదాపు అన్ని చోట్ల ప్రతి రెండు సచివాలయాల్లో ఒకరు చొప్పున మాత్రమే విధులు నిర్వహించే అవకాశం ఉంది. వ్యవసాయ సహాయకుడు, పశు సంరక్షక సహాయకుడు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిసెంట్లు సైతం రెండు సచివాలయాలకు ఒకరు చొప్పున మాత్రమే పని చేస్తారు. వార్డు సచివాలయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉత్పన్నం కానుంది. -
పక్కా.. అది బ్యారేజే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయట పడింది. నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, ఆ ప్రాజెక్టు ఊపిరి తీయడాన్ని సాక్ష్యాధారాలతో అక్టోబర్ 30న ‘పోలవరానికి ఉరి’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బహిర్గతం చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయలేదని సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. కానీ.. ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు గతేడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనులకు నవంబరు 30 వరకు 18,348.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. ఇందులో ఇప్పటిదాకా రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని, అక్టోబర్ 9న రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2024 వార్షిక సమీక్షను విడుదల చేసింది.ఎత్తు తగ్గిస్తున్నా నోరెత్తని టీడీపీఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తు చేసింది. 2467.50 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1121.20 మీటర్ల పొడవున స్పిల్తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లతో నిర్మించడానికి అంచనా వ్యయం 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించడాన్ని సమీక్షలో ప్రస్తావించింది. కానీ.. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో కాకుండా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ, ఆ మేరకు మిగిలిన పనుల పూర్తికి అవసమైన నిధులు విడుదల చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఏ అభ్యంతరం చెప్పలేదు. దీన్ని బట్టి.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. -
పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అంటే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు అంగీకరించిందన్న మాట. అయితే.. ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించేలా గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇదెలా సాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయగలిగితేనే.. జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి, ఇటు గోదావరి–బనకచర్ల, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి జీవం తీసి.. బనకచర్లకు తరలిస్తామనడం చూస్తే ఆ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవచ్చని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.కుడి కాలువ ఆయకట్టు, కృష్ణా డెల్టాకే చాలవు..పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకూ నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లకు గోదావరి ఇలా..గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా నది, నాగార్జునసార్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల అభయారణ్యంలో 26.8 కిలీమీటర్ల టన్నెల్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరింది. ఆ నివేదికలో పేర్కొన్న మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ఇలా..తొలి దశ..– పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ–శాడిల్ డ్యాం, ఎఫ్–శ్యాడిల్ డ్యాం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచుతారు.– తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1400 నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, 178 కిలోమీటర్ల వరకూ పొడగిస్తారు. ఇందులో 5 వేల క్యూసెక్కులను ఆయకట్టుకు, మిగతా 5 వేల క్యూసెక్కులను భలేరావు చెరువులోకి తరలిస్తారు. – బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణా నదిలోకి తరలిస్తారు.– తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు రూ.13,511 కోట్లు వ్యయం అవుతుంది.రెండో దశ– కృష్ణా నదిలో 12.5 మీటర్లు (సముద్ర మట్టానికి) ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు ఐదు దశల్లో రోజూ 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి.. నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకూ సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు. – సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి, పల్నాడులో బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్లో ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి.– రెండో దశ పనులకు 28,560 కోట్లు వ్యయం అవుతుంది.మూడో దశ:– బొల్లాపల్లి రిజర్వాయర్లో 172 మీటర్ల నుంచి మూడు దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి.. నల్లమలలో తవ్వే సొరంగం ద్వారా తరలించి, అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్కు తరలిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు వ్యయం అవుతుంది.– ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం. బొల్లాపల్లి రిజర్వాయర్, కాలువల తవ్వకానికి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాలు అటవీ భూమి. -
కాంతి లేని కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. పాలనపై తనదైన ముద్ర వేయ డానికి ఇది సరిపడ సమయంగానే భావించ వచ్చు. అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి 7 నెలలు గణనీయమైన సమయంగానే పరిగణించాలి. ముందుగా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. ‘నీకు 15,000... నీకు 15,000’గా పాపులర్ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తామని తాజగా ప్రకటించి మరో వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం మునుపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’కి పేరు మార్పు పథకం. అంటే, ఉన్న పథకానికి తిలోదకాలు ఇచ్చి కొత్త పథకం ఇవ్వకుండా ‘అప్పు రేపు’ తరహా గోడ మీద రాత గారడీ చేయడమే! ‘దీపం’ పథకాన్ని చంద్రబాబు మార్కు చాకచక్యంతో ముందుగానే అరకొరగా అమలు చేసే ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న హామీపై నోరు మెదపట్లేదు. అలాగే, ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ. 18,000 ఇస్తా మంటూ చేసిన వాగ్దానమూ అటకెక్కినట్టే ఉంది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉగాదికి అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో వేచి చూడాలి. రైతులకు వాగ్దానం చేసిన సంవత్సరానికి 20 వేల రూపాయల పథకం రేపో మాపో అని దాటేస్తున్నారు – ఇది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పథకమే అయినప్పటికీ వారు ఇచ్చిన రూ. 13,500 కూడా గడచిన సంవత్సరానికి ఇంకా ఇవ్వనేలేదు. వెరసి, ‘సూపర్ సిక్స్’ హమీలలో ఒక్కటి కూడా చిత్త శుద్ధితో అమలు చెయ్యలేదు అనేది సుస్పష్టం.‘నాడు–నేడు’ పథకం ద్వారా పెక్కు ప్రభుత్వ బడులను జగన్ ప్రభుత్వం ఆధునీకరించి, మరుగుదొడ్ల నిర్వహణకై ప్రత్యేక నిధులు కేటాయించి, పిల్లలకి స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తూ అధ్యాపకులకీ, పిల్లల తల్లి–తండ్రులకీ పర్యవేక్షణ అప్పజెబితే, లోకేష్ అధ్యాపకులకు ఉపశమనం పేరిట పర్యవేక్షణ పద్ధతికి తూట్లు పొడిచారు. పేద పిల్లలకు ఇంగ్లీషు చదువు చెప్పించి విప్లవాత్మకమైన మార్పులు జగన్ తెస్తే, మాతృ భాష పేరుతో సదస్సులు పెట్టి తమ అస్మదీయులైన మాజీల నోటితో ఆ పథకానికి తెర దించే కార్యక్రమం మొదలు పెట్టారు. బుడమేరు వరద తీవ్రతను ముందుగానే అంచనా వేయలేక పోవటం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించలేకపోవటంలో ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార లెక్కల ప్రకారంగానే 45 మంది చనిపోయారంటే ధన, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డూ వివాదానికి తెరలేపటం చాలా దిగజారుడు చర్యగా నిలిచిపోతుంది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ హావభావ కేళి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది.పవన్ కల్యాణ్ ప్రతి విషయానికీ గత ప్రభుత్వానిదే బాధ్యత అనడం ఒక రివాజుగా పెట్టుకున్నారు. అది ఎంత చవకబారు స్థాయికి చేరిందో ఇటీవల జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్కి వచ్చి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు యువకుల ఉదంతం చెబుతుంది. కనీసం ఆ కుర్రాళ్లు చనిపోయిన రహదారి తీరు ఎలా ఉందో తెలుసుకోకుండా జగన్ రోడ్లు బాగు చేయకపోబట్టే వారు చనిపోయారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు. మరుసటి రోజు స్వయానా ఆయనే వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్రాలలో చక్కని రోడ్డు కనిపిస్తూనే ఉంది. పై పెచ్చు యువతను బైక్ స్టంట్లు చేయమని, సైలెన్సర్లు తీసేసి రచ్చ చేయమని ఒక సినీ వేదిక పైనుంచి పిలుపు నివ్వడం అత్యంత హేయమైన చర్య. రాష్ట్రంలో జరిగిన ప్రతిపక్ష కార్య కర్తల బహిరంగ హత్యలు, నేతల అరెస్టులు ఒక ఎత్తయితే, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన వేల కొలది కేసులు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగం. చంద్రబాబు వాగ్దానాలు నీటిమూటలనే విషయం ఇప్పుడు కళ్ళు తెరిచి పరిశీలించగలిగే ఎవరికైనా అర్థమవుతుంది. ‘సూపర్ సిక్స్’ అని హమీ ఇచ్చిన వారికే వాటిపై విశ్వాసం లేదు అనేది ఇప్పుడు అందరికీ విదితమయ్యింది. అయితే, ఇవన్నీ తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా? సామాజిక సమీకరణాలే తప్ప ప్రభుత్వ పనితీరు కానీ, వాగ్దానాల అమలుపై నమ్మకం గానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత సంత రించుకోవా? రానున్న కాలం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రతి గ్రామంలో రెండు, మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే.. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యా శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 3–5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్టు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే.. తెచ్చిన మార్పు ఓ ఐదేళ్లపాటు కొనసాగాలి, తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ.. ఇక్కడ జీవో117 ద్వారా 2022 జూన్లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ.. జీవో–117లో ఉన్న మంచి పోయి.. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది.కొత్త విధానంతో 10 వేల సబ్జెక్టు టీచర్ల మిగులుజీవో–117 రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దుచేసి, ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసురావాలి. కానీ.. ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు.. ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో 27 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ నమోదైంది. ఆరో తరగతిలో 19 మంది, 7వ తరగతిలో 17 మంది, 8వ తరగతిలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత తరగతులు ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు బోధన అందిస్తున్నారు. అయితే, 6, 7, 8 తరగతుల్లో మొత్తం 50 మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్ను రద్దు చేస్తారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు 27 మంది 2025–26 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగితే అప్పుడు 6, 7, 8 తరగతుల్లో 63 మంది, 9వ తరగతిలో 14 మంది మొత్తం 77 మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు. కానీ.. అక్కడ బోధనకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను రద్దు చేసి, ఎస్జీటీలను మాత్రమే ఇస్తుంది. అంటే హైస్కూల్గా మారినా పరిస్థితి మెరుగుపడకపోగా.. ఉన్న పోస్టులు సైతం వెళ్లిపోయి అప్గ్రేడ్కు బదులు డౌన్గ్రేడ్ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,760 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఇలాగే మారే ప్రమాదముంది. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవో–117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. దీంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు 8 సెక్షన్లు కొనసాగుతున్నాయి. 180 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున.. గణితం, ఇంగ్లిష్కు ఇద్దరు చొప్పున 12 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో 140 మంది విద్యార్థులతో 5 సెక్షన్లే మిగులుతాయి. దీంతో ఒక గణితం, ఒక ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, మరో రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి. ఇలానే జీవో–117 ద్వారా 3–5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున మూడు చొప్పున 10 వేల పోస్టులు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10 వేల స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. ఇంత భారీగా మిగులుతున్న స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.34 వేల ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావంప్రస్తుతం జీవో–117 ప్రకారం ఉన్నత, యూపీ స్కూళ్లకు కి.మీ. పరిధిలో ఉన్న 4,731 ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. వీరికి సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. అలాగే, 1, 2 తరగతుల్లో 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్నా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 117 జీవోను రద్దు చేసి, 3–5 తరగతులను తిరిగి వెనక్కి తెస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేగాక, 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించకుండా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం కి.మీ. పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులనే విలీనం చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 34 వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారు. దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కి.మీ. దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఇక 1, 2 తరగతుల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కారు.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక ఎత్తయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు, పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో (హేమ్లెట్స్) దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1–5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు. కూటమి కొత్త మోడల్ ప్రకారం ఇకపై వీటిలో 3 నుంచి 5 తరగతులు చదివే వారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే.ఆ హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టు ఉండదుప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు రెండు వేల హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా.. 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దాని ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ఎన్రోల్మెంట్ మొదటి 53 మంది వరకు ఒక సెక్షన్, 54 నుంచి 88 వరకు రెండో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్గా గుర్తించి టీచర్లను ఇచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 54 మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్, 55 నుంచి 94 వరకు రెండో సెక్షన్, 95 మంది నుంచి 3వ సెక్షన్గా నిర్ణయించారు. కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల మిగులతో డీఎస్సీపై ప్రభావం కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్ జాడ లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15 వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్ అసిస్టెంట్లే దాదాపు 5 వేలకు పైగా, ఎస్జీటీలు మరో 10 వేలు మిగిలే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీలో ఖాళీలను ఎక్కడ నుంచి చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్ అమరావతిఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీవో–117 రద్దు చేస్తున్నందున అంతకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారానికి 10 పీరియడ్లు గణితానికి కేటాయించాలని, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టని పక్షంలో జీవో–117 రద్దు వల్ల హైస్కూల్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్నత పాఠశాల విద్య నిర్వీర్యం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సందడి లేని సంక్రాంతి
చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలుపండగంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటికొచ్చిన బంధువులకు కానుకలు, చుట్టుపక్కలోళ్లకు పెట్టుబతలు.. గ్రామస్తులంతా తలో చేయి వేసి నిర్వహించే సామూహిక సంబరాలు.. ఇలా కోలాహలం కళ్లకు కట్టేది. ఈ ఏడాది ఏ ఊళ్లో అయినా ఇలాంటి సందడి కనిపిస్తుందేమోనని దివిటీ పట్టుకుని వెతికినా కనిపించని దుస్థితి. అన్ని వర్గాల ప్రజల్లో అదో నిర్లిప్తత, నైరాశ్యం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై ‘సాక్షి’ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించాయి. ‘ఆనందంగా పండుగ చేసుకోవాలని ఉంది. అయితే అందుకు చేతిలో నాలుగు డబ్బులుంటేనే కదయ్యా..’ అని అంటున్నారు ఊరూరా జనం. పండగ అంటే గత ఐదేళ్లలోనే అని గుర్తు చేసుకున్నారు. ‘ఊళ్లో పరిస్థితి బాగోలేదు.. ఇంట్లోనూ అందుకు భిన్నంగా లేదు’ అని పెద్దలు వాపోయారు. ‘స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ ఆగిపోయాయి.. సచివాలయాల్లో పనులు కావడం లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి.. ఇంటికొచ్చి పని చేసి పెట్టే వలంటీర్లు కనిపించడం లేదు.. నెలకు రెండుసార్లొచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారో తెలీదు.. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా లేదు.. మత్స్యకార భరోసా లేదు.. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇళ్లకు పంపించేస్తున్నారు.. పరిస్థితి ఇట్లా ఉంటే ఏంది పండుగ చేసుకునేది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో ఊరారా ఇదే దుస్థితి కనిపించింది. అందరి నోటా ఇదే మాట వినిపించింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళ తప్పింది.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘అవసరానికి అందివచ్చే డబ్బులు.. కష్టకాలంలో ఆదుకునే పథకాలు.. వెరసి ప్రతి రోజూ పండుగ రోజే’ అన్నట్లుగా గత ప్రభుత్వ పాలనలో ప్రతి పేద ఇంటిలో సంతోషం కనిపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ‘అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. కష్టకాలంలో పట్టించుకునే నాథుడే కరువు.. పెద్ద పండుగ వస్తున్నా కన్పించని సందడి’ అన్నట్లు ప్రతి ఇల్లూ మారిపోయింది. రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సందడి ఈ ఏడాది ఊళ్లల్లో కనిపించడం లేదు. గడిచిన ఏడు నెలల్లో సంక్షేమాభివృద్ధి ఆగిపోవడమే ఇందుకు కారణం. దేశంలోనే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ‘నవరత్నాలు’ ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల గడపకు చేరడం లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ (డీబీటీ పద్దతి) చేస్తూ గత సర్కారు అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనీసం కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ సైతం అమలు చేయక పోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఐదేళ్లు మహోజ్వల వైభవంగత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, చెప్పిన నెలలో చెప్పిన సమయానికి ఆయా వర్గాలకు ఆర్థిక లబ్ధిని వారి ఖాతాలకు (డీబీటీ పద్దతి) నేరుగా జమ చేసేవారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బులు ఉండేలా చేశారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. విద్యార్థులు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లతోపాటు పొదుపు మహిళలు, రైతులకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఆర్థిక లబ్ధిని కలిగించే సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించడంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఆర్థిక ఇక్కట్లను అధిగమించి కొనుగోలు శక్తి కొనసాగేలా చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సామగ్రి, పిండి వంటలకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునేలా చేశారు. ప్రధానంగా విద్య, వైద్యం పరంగా దిగుల్లేకుండా చేశారు. సచివాలయ–వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే పనులన్నీ జరిగేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మార్పుల దిశగా గత 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ అడుగులు పడలేదు. అలాంటి మార్పులను.. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో సాకారం చేసింది. తద్వారా ఉన్నత వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా పండుగలను ఆనందంగా జరుపుకొనేలా ఆర్థిక ఊతం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లలో కోత పెట్టేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో పాటు మరో పథకాన్ని ప్రజలకు అందివ్వలేదు. ఏడు నెలలైనా ఒక్క పథకాన్ని కూడా అందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు చేతికి వచ్చేవని, ఆ డబ్బులతో కావాల్సినవి కొనుక్కుని ఇంటిల్లిపాది పెద్ద పండుగను గొప్పగా జరుపుకొనేవాళ్లమని గతం గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. కూటమి సర్కారు రాకతో తమ పరిస్థితి తారుమారైందని వాపోతున్నారు. గత సర్కారే కొనసాగి ఉంటే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు పథకాల ద్వారా దాదాపు 2.63 కోట్ల మందికి రూ.20,102 కోట్లçకుపైగా లబ్ధి చేకూరేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు అందక పోవడంతో పండుగ పూట పస్తులు తప్పడం లేదని పేదలు ఆవేదన చెందుతున్నారు.అసంపూర్తి గదిలో పాఠాలుఇది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో దాదాపు 220 మంది చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తరగతి గదుల నిర్మాణానికి రూ.1,93,88,511 మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలోనే రూ.75,42,872 ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గదులకు కిటికీలు, డోర్లు, టైల్స్ అమర్చాల్సి ఉంది. బయటి వైపు ప్లాస్టింగ్ చేయాలి. గదుల కొరత కారణంగా అసంపూర్తిగా ఉన్న నూతన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులకు ఎండ తగలకుండా ఉండేందుకు యూరియా సంచులు అడ్డు పెట్టారు. బంధువులను పిలవలేకపోతున్నాంగత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల ఫీజు కట్టే వాళ్లం. ఈసారి ‘తల్లికి వందనం’ సాయం అందలేదు. పంటలో వచ్చిన డబ్బులన్నీ స్కూల్ ఫీజులకే చాలడం లేదు. పండుగ వచ్చినా మా ఇంట్లో ఎలాంటి సంబరాలూ చేసుకోలేని స్థితి. మా చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా సంక్రాంతి సందడి కనిపించడం లేదు. చాలా మందితో ఫోన్లో మాట్లాడితే ఇదే సమాధానం చెబుతున్నారు. బంధువులను కూడా ఇళ్లకు పిలవలేని పరిస్థితి నెలకొంది.– రైతు గోవిందప్ప, సంతేబిదనూరు, హిందూపురంఇప్పుడు ఆ సందడి లేదువిజయనగరం పట్టణం మూడు రాష్ట్రాలకు వాణిజ్య కేంద్రం. గత ఐదు సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే ఉమ్మడి విజయనగరం ప్రజల నుంచి మార్కెట్లో కొనుగోలుదారులు పెరిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ వ్యాపారం తగ్గింది. ముఖ్యంగా బడుగు మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. గతంలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఉండేవి. అటు హోల్సేల్ ఇటు రిటైల్ వ్యాపారాలతో పట్టణం కళకళలాడేది. ఇప్పుడా సందడి కనిపించడం లేదు.– కాపుగంటి ప్రకాష్, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్కొనుగోలు శక్తి తగ్గిందిగత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో కరోనా వచ్చినప్పటికీ సంక్రాంతంటే మార్కెట్ కళకళలాడేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తాయి. ఇప్పుడు ఏ పథకాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లు లేక ఈ సంక్రాంతి కళ తప్పింది. – షేక్ చాంద్బాషా, మండీ మర్చంట్, పాత మార్కెట్, కడప సంక్రాంతి పండగలానే లేదుఈ ఏడాది సంక్రాంతి కళ మా గ్రామంలో కనిపించడం లేదు. వ్యాపారాలు పడిపోయాయి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. రొటేషన్ లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. గ్రామంలో మా కిరాణా షాపు గత ఏడాది వరకు రోజుకు రూ.15 వేలు అమ్మకం జరిగేది. ప్రస్తుతం రూ.5 వేలు కూడా అమ్మకం జరగడం లేదు.– లావుడియా శ్రీనివాసరావు, సర్పంచ్, కనిమెర్ల, ఎన్టీఆర్ జిల్లాసంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాంపశువులు, వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గత ఆర్నెల్లుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనీసం సంక్రాంతి కానుకైనా ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. అది కూడా లేకుండా చేశారు. పెరిగిన పప్పులు, నూనెల ధరలు చూస్తుంటే పండుగకు పిండి వంటలు మానుకోవడమే ఉత్తమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది మాలాంటోళ్లందరూ ఇలానే అంటున్నారు. – ఎస్.భవాని, కొత్తవలస, విజయనగరం జిల్లాపంట మునిగినా పైసా ఇవ్వలేదు.. ఇంక పండగెక్కడ?వైఎస్సార్ హయాంలో కాలనీ ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి అమ్మ ఒడి పడేది. పదో తరగతి పూర్తయింది. మాకు 30 సెంట్లు భూమి ఉంది. గత ఏడాది వరకు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం ఇచ్చేది. రైతులం పంటలు పండించుకునేవాళ్లం. ఈసారి ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పోసప్పో చేసి పంట వేశాం. మొన్న అక్టోబర్లో వర్షాలకు పొలం మునిగిపోయింది. పంట నష్టం ఇస్తామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాను. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంక మా బతుకులకు పండగొకటి. అన్నిటికీ ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. – పల్లా రాము, రైతు, టి.నగరపాలెం, భీమిలి నియోజకవర్గంగత ప్రభుత్వంలోనే ఎంతో మేలుప్రస్తుతం ఏ కుటుంబమూ సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఓ వైపు ఆర్థిక సమస్య, మరోవైపు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఉంటే పిండి వంటలు ఎలా వండుకుంటాం? సంతోషంగా పండగ ఎలా జరుపుకుంటాం? గత ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మా బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేది. ఖర్చులకు, అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – సీహెచ్ భారతి, గృహిణి, నెల్లూరుచేతిలో లెక్కేదీ?వైఎస్సార్ జిల్లా అనిమెల గ్రామంలో సుమారు 2,500 జనాభా ఉంది. ఈ గ్రామంలో గత ఐదేళ్లు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కళ తప్పింది. పండుగ ఆనందం ఏ ఒక్క ఇంట్లోనూ కనిపించలేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు లేకపోగా, వచ్చిన అరకొర దిగుబడికి ఆశించిన ధరలు లేక రైతులు ఆవేదనతో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఒక్క గ్రామానికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.1.8 కోట్లు లభించింది. ఈ లెక్కన ప్రజల చేతుల్లో డబ్బు ఏ రీతిన రొటేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని గ్రామస్తులు అన్నారు. ఏం ఉందని జరుపుకోవాలి?బాపట్ల జిల్లా రాజుబంగారుపాలెంలో 3,200 కుటుంబాలుంటున్నాయి. ఈ ఊళ్లో దాదాపు అందరూ సామాన్యులే. ‘ఏమ్మా.. పండుగ ఎలా చేసుకుంటున్నారు..’అన్న ప్రశ్నకు రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కూరగాయలమ్ముకునే మహిళలు.. ఇలా అందరూ కూడబలుక్కున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చేయూత రాలేదు. ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు.. అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పిల్లోళ్లకు బట్టలు కొందామంటే డబ్బులు లేక ఉప్పుకయ్యల్లో పనికెళుతున్నానని జొన్నలపావని కన్నీటి పర్యంతమైంది. జగనన్న లాగా నెలనెలా డబ్బులు ఇచ్చివుంటే అందరం సంతోషంగా పండుగ చేసుకునేవారమని సరస్వతి పేర్కొంది. పింఛన్లు తీసేశారని కొందరు, రైతు భరోసా ఇవ్వలేదని ఇంకొందరు వాపోయారు. ఇలాంటి కష్టాల్లో పండుగ ఎలా జరుపుకోగలమని ఊరు ఊరంతా ఎదురు ప్రశ్నిస్తోంది. సాయం అందితే కదా..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బులు లేకుండా పండుగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2,600 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరు ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుపానులతో పంటలు నష్టపోయినా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మద్యం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామంలోకి వచ్చేయడంతో రోజంతా కష్టపడ్డ రెక్కల కష్టంలో సగం సొమ్ము మద్యానికే వెచ్చించడం కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని మహిళలు అంటున్నారు. నాడు వలంటీరు వ్యవస్థతో ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడు చేపల కథ!
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
క్షమార్హం కాని నేరం!
కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు. కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట. ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్గిరీ వెలగ బెడుతున్న బీఆర్ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు. అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది. కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్లైన్లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది. ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి. విశాఖలో స్టీల్ప్లాంట్ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. 2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
ఇంగ్లిష్ మీడియంపై అక్కసు ఎందుకు?
ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరం. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగు వర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ దళిత బహుజనులు ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేయడం న్యాయం కాదు. తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తీర్మానం సామాజిక న్యాయానికి విరుద్ధమైనది, నిజాయితీ లోపించినది.తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్దాల్లో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు జమీందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశ వాదంగా బ్రాహ్మణవాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో రాజ్యాధి కారాన్ని చేపట్టాయి. అంతకుముందు వీళ్లు తెలుగు భాషకు పట్టం గట్టారు. కానీ తెలుగు విద్య వల్ల తమ పిల్లలకు ఉద్యోగ వసతి రాదనీ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపా దించాలంటే ఇంగ్లిష్ విద్య అవసరమనీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ విద్యను దెబ్బతీశారు. ఎవరైతే తమ పిల్లలకు, మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా చేసి వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ దీన్ని తెలుగు మీద ప్రేమ అనలేము. ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతా’రనే భావనతోనే బడుగులకు తెలివిగా ఆంగ్ల మాధ్యమ నిరాకరణ జరుగుతోంది.నిజానికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ లాంటివాళ్లు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి వారి ఇంగ్లిష్ విద్యే కారణం. అంబేడ్కర్. భారత రాజ్యాంగంతో పాటు, వేలాది పేజీలు వివిధ అంశాలపై రాయడం ఆయన ఆంగ్ల భాషా అధ్యయనం వల్లే జరిగింది. ఆంగ్ల భాషాధ్యయనం వల్లే రాజా రామ్మోహన్ రాయ్ సతీసహగమన దురాచారానికి ఎదురు తిరగగలిగారు. రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతనం స్థాపించి, నోబెల్ బహుమతి గ్రహీత కాగలిగారు. దీని వెనుక ఇంగ్లిష్ పునరుజ్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరమనే విషయం అందరూ తెలుసుకోవాలి. దాన్ని అందిపుచ్చుకుంటూ దళిత బహుజనులు కూడా ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే, చదువుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని పాఠశాలల్లో ఉంది. తెలుగును ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి నూరు పద్యాలు కంఠతా వస్తేనే ఆ విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్ ఇవ్వండి అని ‘దళిత మహాసభ’ సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టినవాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను నెలకొల్పారు. అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు పిల్లలకు తెలుగే రాకుండా చేశారు. తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దళిత బహుజన వర్గాలు ఆంగ్ల విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే అర్హతను సంపా దిస్తారేమో అనే భయం వీరిని వెంటాడుతున్నట్టుంది.ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాల లను రద్దుచేసి ఆ కళాశాలల్లోని తెలుగు పండితుల పొట్ట కొట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. ఆధిపత్య కులాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బ తీసి ఐటీ సెక్టారుకు ఉపయోగపడే బీటెక్, ఎంటెక్లకే ప్రాధాన్యం ఇచ్చారు. మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. కుటుంబ సంబంధాలన్నీ నాశనం అయినాయి. తమ సామాజిక వ్యవస్థలను గుర్తించ కుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గోలు పెడు తున్నారు. నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపో క్రసీని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్ని వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని కాంక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనేవారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలో చనల్లో విస్తృతి, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి; ఆలోచనలు సంకు చితంగానే కనబడతాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి అందరూ సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీ కరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లిష్ విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా? కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభి వృద్ధి అని తెలుసుకోలేక పోతున్నారు. మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్నీ లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతోంది. విద్య అనేది జ్ఞానం, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి ఉన్నారు. ఆయా వృత్తుల్లో ఆ యా జీవన వ్యవస్థల్లో, ఆ యా దేశ పాలనల్లో వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఆంగ్ల విద్య ఎంతో తోడ్పడిందనేది చారిత్రక సత్యం. అందుకే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, బడుగు వర్గాలకు ఆంగ్ల విద్యను నేర్పడం అవసరం. దీనివల్ల వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంతిమంగా దేశానికే మేలు కలుగుతుంది. జీడీపీ పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ ఎగు మతులు పెరుగుతాయి. ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటినీ రద్దు చేయాలనే భావన మంచిది కాదు. పాలకులు మారుతూఉంటారు. కానీ మంచి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే పక్షంలో, అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళను ఒకే విధానంలోకి తేగలరా? ఒకసారి సామాజిక న్యాయ కోణంలో, దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్ బాట. ఆ బాటలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్మెన్ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్జీపీ) బి.రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'
సాక్షి, అమరావతి: కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి! పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యా రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపన పడ్డారు. మునుపెన్నడూ చూడని విద్యా సంస్కరణలు తెచ్చారు. విద్యా బోధనలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకోకుండా మూస విధానాలతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గుర్తించారు. పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ఓ మేనమామలా అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. ఐరాస వేదికపై మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా రూ.72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు? ఏ ఒక్కరైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా? పిల్లల్లో బలమైన ఆసక్తి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గతేడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో 91.33 శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం.. 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ.. ‘దేశంలో పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యం. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువొక్కటే. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అది ఇంగ్లీష్ చదువులతోనే సాధ్యమవుతుంది..’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివీ! అందుకు అనుగుణంగానే ఆయన 2020–21లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ను అందుబాటులోకి తెచ్చారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024–25 నాటికి టెన్త్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు (మిర్రర్ ఇమేజ్), ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనేవైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో 2023 – 24లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల చేరికలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1,50,005 అధికంగా నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2023–24 పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి టాప్ 28 మంది విద్యార్థుల్లో 26 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590 నుంచి 594 వరకు మార్కులు సాధించడం గమనార్హం. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది. ఇంగ్లీష్ మీడియంలో కేరళను దాటిన ఏపీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) 2023లో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్లో నిలిచింది. ఈమేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో 84.11 శాతంగా నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. ప్రైవేట్ స్కూళ్లకు 2 లక్షల మంది విద్యార్థులు వైఎస్ జగన్పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులను నీరుగార్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా నీరుగారుతోందో చెప్పేందుకు నిదర్శనం. 95% తల్లిదండ్రుల కోరిక ఇంగ్లీష్ మీడియంరాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను బలంగా కోరుకున్నారు. అది ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ బాట పట్టారు. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలు వివిధ దశల్లో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలోప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై అధ్యయనం నిర్వహించిన జగన్ ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం సేకరించింది. రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఫీజులు ఆర్ధికంగా భారమైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నట్లు చెప్పారు. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో మరో దారి కానరాక ప్రైవేట్లో చేర్చినట్లు వాపోయారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు దిశగా జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. తొలుత ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగా 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం మనబడి నాడు–నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2019–20లో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో కార్పొరేట్కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. డ్రాపౌట్స్ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందచేశారు. గోరుముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్లు వెచ్చించింది.మేధావుల్లారా ఆలోచించండి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు, మేధావులు డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వానికి తెలుగు భాషపై నిజంగా ప్రేమ ఉంటే ప్రతి గ్రామం, పట్టణంలో ఒకేచోట తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మీడియం కావాలంటే అందులో చేరుతారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం తలపెట్టవద్దు. – ఎస్.రామకృష్ణ, పురపాలక టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుమీ పిల్లలు ఎక్కడ చదివారు?.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, రచయితలు మూకుమ్మడిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే జీవో 85ను రద్దు చేయాలని కోరడం అత్యంత దుర్మార్గం. వారిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగ్లీష్తోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, తెలుగు భాషా రచయితల పిల్లలు ఏ మాధ్యమంలో చదివారో.. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉంటున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. – బి.మనోజ్కుమార్, రమేష్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుఏపీలో విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తీప్పాలనే..⇒ తెలుగు మీడియంలో చదివి కష్టపడి న్యాయవాద డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లీష్లో సమర్థంగా వాదించే నైపుణ్యం లేక ఎంత డిప్రెషన్కు గురవుతున్నారో నేను చూశా. ⇒ ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న తెలుగు భాషకు సివిల్ సర్వీస్లో ప్రశ్నాపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ⇒ కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని జీవో ఇచ్చినప్పుడు తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్టే చెప్పింది కదా! ⇒ చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? ⇒ మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువదించి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలిగానీ దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా! ⇒ ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో లేదా రచించాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! ⇒ ఆంధ్రప్రదేశ్లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. ⇒ ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే గానీ అది బతకదు. పోరాటం చేస్తేగానీ ఈ తిరోగమన రథ చక్రం ఆగదు. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత -
సీఎస్గా విజయానంద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు. -
వాన కాటు.. సర్కారు పోటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయడం రైతులకు ఆశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడుతున్న రైతులు.. తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు. మరో వైపు కళ్లాల్లోని పంట నేలకొరిగి ముంపునకు గురవుతుంటే.. ఇంకో వైపు కోసిన ధాన్యం రాసులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ధాన్యం మొలకలెత్తి.. రంగు మారిపోతూ.. తేమ శాతం అంతకంతకు పెరిగిపోతుండడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వరుస వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ఏపుగా ఎదిగే వేళ జూలైలో కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రెండోసారి విత్తుకున్నారు. పంట ఏపుగా ఏదిగే వేళ సెప్టెంబర్లో వరదలు, భారీ వర్షాలు దెబ్బతీస్తే.. కోత కోసే సమయంలో ఫెంగల్ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. కృష్ణా డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఇంకా పంట పూర్తిగా చేనుపైనే ఉంది. ఉత్తరాంధ్ర మొదలు పల్నాడు వరకు 8 లక్షల ఎకరాల్లో పంట చేలల్లోనే ఉంది. శ్రీకాకుళంలో 70 వేల ఎకరాలు, అనకాపల్లిలో 65 వేలు, కృష్ణా డెల్టాలో 80 వేలు, గుంటూరులో 30 వేల, బాపట్లలో 1.82 వేల ఎకరాలు, పల్నాడులో 50 వేల ఎకరాల్లో పంట చేనుపై ఉంది. ఆయా జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట ముంపు నీటిలో చిక్కుకుని నేలకొరిగింది.మొలకెత్తుతున్న ధాన్యం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆయా జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా కప్పుకునేందుకు టార్పాలిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అద్దెకు తెచ్చుకొని మరీ కప్పుకుంటున్నారు. మరొక వైపు ఒబ్బిడి చేసుకునేందుకు, చేనుపై వరిగిన పంటను కాపాడుకునేందుకు కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరొక వైపు రైతుల వద్ద సిద్ధంగా ఉన్న 3–4 లక్షల టన్నుల ధాన్యం రంగుమారి, మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర లభించక అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖాధికారులు.. దళారీలు, మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో 75 కేజీల బస్తాకు 300–400 వరకు నష్టపోతున్నారు. వరుస వైపరీత్యాలతో తేమ 20–25 శాతం మధ్య నమోదవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలు, మంచు ప్రభావంతో అది 25–30 శాతం వరకు వెళ్లొచ్చని వాపోతున్నారు. 16 లక్షల టన్నుల ధాన్యం మాటేంటి?రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా, 34.92 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 84.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు తొలుత 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించగా, దాన్ని 36–37 లక్షల వరకు పెంచినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే 22.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా, ప్రొక్యూర్మెంట్ వెరైటీస్కు సంబంధించి 16 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. అత్యధికంగా శ్రీకాకుళం, కృష్ణ జిల్లాల్లో 2.50 లక్షల టన్నుల చొప్పున, విజయనగరం జిల్లాలో 1.50 లక్షల టన్నులు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో లక్ష టన్నుల చొప్పున ధాన్యం ఉంది. నాన్ ప్రొక్యూర్మెంట్ వెరైటీస్కు సంబంధించి మరో 3–4 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
బాలికా విద్యపై ఇంకా వివక్షా?
భారతదేశ వ్యాప్తంగా దళిత, బహుజన స్త్రీ విద్యపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. నిజానికి గురుకుల హాస్టల్స్లోనూ, జనరల్ హాస్టల్స్లోనూ విద్యార్థినులు నిరంతరం అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీనికి కారణం పౌష్టికాహార లోపం, శుభ్రతగా ఉండే పరిస్థితుల లేమి, సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడం. అందుకే పిల్లలు రక్త హీనతతో శక్తి లేక కళావిహీనంగా ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంరక్షణ విషయంలో సరైన బడ్జెట్ను రూపొందించ లేకపోతున్నాయి. వీరిపట్ల ఎంతో అశ్రద్ధ కనబడుతోంది. వార్డెన్స్ను శాశ్వతంగా నియమించకపోవడం, హాస్టల్స్కు సొంత భవనాలు లేకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు తగినట్లుగా గదులు లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు బాలికలకు మెరుగైన చదువును నిరాకరిస్తున్నాయి.తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్తుండగా, ఇంట్లో ఆలనా పాలనా లేని జీవన వ్యవస్థలో దళిత బాలికలు ఎంతో సంక్షోభాన్ని అనుభవి స్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల దోపిడీ విధానాలు కూడా పిల్లల నోటికాడి కూడును దొంగిలించే పరిస్థితులు వచ్చాయి. ఇస్తున్న కొద్దిపాటి సామాన్లనే వార్డెన్లు పరిగ్రహించటం, రాత్రుళ్లు కనీసం గర్ల్స్ హాస్టల్స్లో కూడా వార్డెన్లు నిద్రించకపోవడం, విద్యార్థులను సొంత పనులకు వాడుకోవడం లాంటి ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గన్మెన్ వెంట తిరుగుతూ ఉంటారు. బాలికల హాస్టల్స్కు కనీసం ఒక గార్డ్ కూడా కాపలా ఉండడు.సౌకర్యాలు కల్పించకూడదా?విద్యకు ఆహారం, వసతి ముఖ్యం. ప్రభుత్వం ప్రతి మూడు జిల్లాలకైనా ఒక స్పెషల్ కలెక్టర్ను వెయ్యాల్సి ఉంది. ఆయనకు కొన్ని టాస్క్ ఫోర్స్ టీములను అప్పగించాల్సి ఉంది. ఈ సంవత్సరం హాస్టళ్ళలో అత్యాచారాల సంఖ్య పెరిగింది. ప్రతి మహిళా పోలీస్ స్టేషన్కు ఆ ప్రాంతంలో వున్న బాలికల హాస్టల్ రక్షణ బాధ్యతను అప్ప గించాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నిసార్లు గురుకుల విద్యార్థినులు కలుషిత ఆహారంతో ఆసుపత్రుల పాలయ్యారు? రెండు రాష్ట్రాల లోనూ నాసిరకం బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు సరఫరా చేస్తు న్నారు. దీనికి కారణం వీళ్ళలో గూడుకుట్టుకున్న కులతత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి దళిత విద్యార్థుల్లో విద్య పెరుగుతుందనే ఆ పథకం మీద గొడ్డలివేటు వేశారు. అమరావతి నిర్మాణం, పోలవరం అనే పాట పాడుతూ, ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తెస్తూ మహా నగరాన్ని నిర్మిస్తాననే మాటతో ఏపీ ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మి స్తున్నారు. దళిత బహుజన విద్యార్థుల్ని విద్యాశక్తికి పనికిరాకుండా మానసిక దౌర్భల్యానికి గురిచెయ్యాలనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. దళిత బహుజనుల జీవన వ్యవస్థల మీద దెబ్బ కొట్టాలనే ప్రయ త్నంతోనే ‘అమ్మఒడి’కి ‘తల్లి దీవెన’ అని పేరు పెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని రోజుకొక ప్రకటన చేస్తున్నారు. గిరిజనుల హాస్టళ్ళకు ఆహార, ఆహార్య, రక్షణలను కలిగించకుండా, తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించాలనే ఆసక్తిని పోగొడుతున్నారు. నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారమే అగ్రకులాధిపత్యం చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోవడా నికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఆటోలో 25 మంది వరకు ఎక్కి, ప్రమాదాల్లో చనిపోయి, పిల్లలు అనాథలవుతున్న స్థితి మనకు కనబడుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బహుజన స్త్రీలలో మొబిలిటీ పెరుగుతుందనీ, వారు దూర ప్రాంత పనులకు వెళ్ళగలుగుతారనీ అంచనా వేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని దాటవేస్తోంది.కుటుంబాల్లో సంక్షోభంఈ సందర్భంగా దళితవాడల పరిస్థితిని ఒకసారి చూద్దాం. రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో దళితవాడలు మురుగు నీరుతో, జబ్బులతో కునారిల్లుతున్నాయి. గ్రామ రాజ్యాన్ని పునరుద్ధరిస్తానంటున్న ఏపీ ఉపముఖ్యమంత్రి దళితవాడలకు ఇంతవరకు ఇళ్ళ స్థలాల విషయంగానీ, ఉపాధిని ఇచ్చే కుటీర పరిశ్రమల విషయంగానీ ఎత్తడం లేదు. దళిత వాడల్లో మద్యపానంతో పురుషులు ఎక్కువ మంది మరణిస్తూ స్త్రీలు విధవరాళ్లు అవుతున్నారు. గ్రామాలు సంక్షో భంలో, కుటుంబాలు వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతుంటే నోరు మెదపడం లేదు. దళిత బహుజన విద్యార్థినులు పేరెంట్స్ మీటింగ్కు పిలిస్తే సగంమంది విడిపోయిన భార్యాభర్తలు వస్తున్న విషయాలు వీరికి తెలిసి కూడా, ఈ కుటుంబ సంక్షోభం విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలి వేటు అని తెలుసుకోలేకపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరగడం ఎంత బాధకరమో అర్థం చేసుకోలేకపోతున్నారు.ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా స్త్రీ ఆర్థికాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం జీవగర్ర. మగవాళ్లు తాగి జుట్టు పట్టుకొని ఆడవాళ్లను, ఆఖరికి తల్లిని కూడా కొట్టి ఇళ్ళల్లోంచి తరుముతున్న దారుణాలు చూస్తున్నాం. ఈ సామాజిక సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించడానికి ప్రయత్నించడం లేదు. పైగా అనేక రకాల మత్తు పదార్థాలను విచ్చల విడిగా పాఠశాల పరిసర ప్రాంతాల్లోనూ, దళిత వాడల్లోనూ అమ్ముతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూడటం ఆశ్చర్యం వేస్తుంది.ఫూలే ఆశయాలు మరిచారా?తెలంగాణలో అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం హాస్టళ్లలోని దుర్భ రమైన పరిస్థితులను ఎత్తిచూపినా ప్రభుత్వం దాటవేసే చర్యలను చేస్తున్నదే తప్ప వాటిని నిజంగా నివారించే చర్యలు చేపట్టడం లేదు. అసలు హాస్టల్స్లో రగ్గులు పంచి, పిల్లలను చలి నుండి కాపాడాలనే ఉద్దేశం కూడా లేకుండా జీవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం భారతదేశంలోనే దళిత బహు జన విద్యపైన గొడ్డలివేటు పడుతోంది. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తిన వారున్నారు. కనీసం తమ నియోజక వర్గాల్లో కూడా విద్యార్థులకు దుప్పట్లు పంచడం గానీ, శక్తిమంతమైన ఆహారాన్ని కల్పించడం కోసం పాలు, గుడ్లు, పండ్లు, పప్పులు వంటివి పంచిపెట్టడం గానీ చెయ్యడం లేదు. దీనికంతటికీ కారణం వీళ్లు స్వార్థ పూరితమైన జీవితంతో మహాత్మ ఫూలే జీవితానుసరణను, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను మరచిపోయి అగ్రవర్ణాలతో సంపాదనలో పోటీ పడటమే.మహాత్మా ఫూలే 1848లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి బహుజన స్త్రీల మీదే కాక మొత్తం స్త్రీలకే విద్య రావాలనే విషయం మీద ఎన్నో ఉత్తరాలు రాశారు. అంబేడ్కర్ తన జీవితం మొత్తం దళిత బహు జనుల విద్యకోసం పోరాడారు. ఆనాడు ఎలాగైతే అగ్రవర్ణాల్లో దళిత బహుజనులు చదువుకోకూడదనే దురుద్దేశం ఉండిందో, అది ఇప్పటికీ కొనసాగుతోందని అర్థం అవుతోంది. ఒక పదవ తరగతి విద్యార్థిని ఏడు సబ్జెక్టులు చదవాలంటే, పాఠాలు వినాలంటే, పరీక్షలు రాయా లంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఆహారం తినాలి అని ప్రభుత్వాలకు తెలియదా! మహాత్మా ఫూలే చెప్పినట్లు మన గ్రామాలను మనమే పునర్ నిర్మించుకునే సందర్భం వచ్చింది. అంబేడ్కర్, పెరియార్ రామ స్వామి నాయకర్ స్వీయ వ్యవస్థల ద్వారా విద్య సంస్కరణలను చేసు కోవాలనీ, విద్యా వ్యవస్థలను నిర్మించుకోవాలనీ చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకు మనమే మార్గం వేసుకోవాలి. ముఖ్యంగా చర్చిల్లో కేవలం ప్రార్థనలే కాకుండా విద్యా బోధనలకు అవకాశం కల్పించాలని కోరాలి. దళిత బహుజన సామాజిక సంఘాలు, స్వీయ సామాజిక విద్యా పునర్జీవనం కోసం పాటుపడాలి. ఆత్మ గౌరవ పోరాటాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యం. విద్యే జీవన వ్యవస్థలకు సోపానం. విద్య మానవ వ్యక్తిత్వ వికాసానికి పునాది. విద్య మానవాభ్యుదయానికి నాంది. విద్యా పునాదుల మీదే నూత్న సమాజం రూపొందుతుంది. అందుకే అంబే డ్కర్ దళితులకు విద్యా విప్లవ నినాదాన్ని ఇచ్చారు. అందునా బాలికా విద్య సామాజిక భవితవ్యానికి వారధి. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. నూత్న సమాజాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్మెన్గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్లో ఎగ్జామినేషన్ గ్లౌజ్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్..!
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.ధరలు పెద్దగా పెరగకపోయినా..గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం. -
6 నెలల్లో తారుమారు.. హామీలకు చంద్రబాబు తూట్లు
ఓ నాయకుడు మాట ఇస్తే... ఆరు నూరైనా నూరు ఆరైనా కట్టుబడి ఉండాలంటారు! కానీ సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఏరు దాటాక తెప్ప తగలేశారు! ఆర్నెళ్ల పాలనలో కనిపించేదంతా ఉత్త ‘గ్యాసే’!ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ఇసుకలో దోపిడీ.. మద్యంలో దోపిడీ.. రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలను గుల్ల చేస్తున్నారు. మరోవైపు కొత్త పథకాలు లేకపోగా ఉన్నవాటినే రద్దు చేస్తూ రెడ్బుక్ పాలనతో ప్రశ్నించే గళాలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. రెడ్బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్ల పాలన సాగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడు నెలలు తరువాత.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్నెళ్లు గడిచాక ఇదీ పరిస్థితి!!సాక్షి, అమరావతి: అలవి మాలిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత ఐదేళ్లూ అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన ‘తల్లికి వందనం’ ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఎటు పోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి లేదంటే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన పేదలను ధనికులుగా మార్చే ‘పూర్ టు రిచ్’ కాన్సెప్ట్ కాగితాలకే పరిమితం! ‘యువగళం’, ‘ఆడబిడ్డ నిధి’ పథకాలు కనుచూపు మేరలో లేవు. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు ఆశగా పడిగాపులు కాస్తున్నారు. అయితే కనీసం వాటిని అమలు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వ పెద్దల్లో కానరాక పోవడంతో మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. రాజకీయ వేదికలుగా ప్రభుత్వ విద్యా సంస్థలు..అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో 16 వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీని పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకం మురిగిపోయింది! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆర్నెళ్లుగా ప్రభుత్వ పాఠశా>లలపై అనేక ప్రయోగాలు చేసి ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకం అమలుపై మాత్రం చేతులెత్తేసింది. ఇంగ్లీషు మీడియం చదువులు, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు ట్యాబ్లపై చేతులెత్తేసింది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్కు లబ్ధి చేకూరుస్తోంది. రాష్ట్రంలో స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ ఇస్తామన్న హామీ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లల్లో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చిందే గానీ ఒక్క విద్యా సంస్కరణను అమలు చేసింది లేదు. మెగా పీటీఎం పేరుతో ఉపాధ్యాయులను ఉరుకులు పెట్టించి ప్రభుత్వ విద్యా సంస్థలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లకు మోకాలడ్డిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. అన్ని విధాలా దగా పడిన రైతన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.1000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. గత ఆర్నెళ్లలో 70 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1.80 కోట్ల మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్కపైసా విదల్చక పోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది.వైఎస్ జగన్ హయాంలో ఏటా ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే లో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్లో చేయూత.. అక్టోబర్లో రైతు భరోసా.. నవంబర్లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టారు.సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర ముఖ్యమైన హామీలు⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం.⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెళ్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు.⇒ ఉచితంగా ఇసుక అంటూ దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు.ఆసరా, చేయూత అసలే లేవువైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది. కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఉచిత గ్యాస్లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారంఅధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. ఇంకా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపిన కూటమి ప్రభుత్వం మరో రూ.9,412 కోట్ల భారం కూడా మోపేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్నెళ్లలో వేసిన మొత్తం విద్యుత్ చార్జీల భారం రూ.15,485.36 కోట్లకు చేరింది.మద్యం సిండికేట్లతో లూటీప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ సిండికేట్ దోపిడీకి రాచబాట పరిచారు. ప్రైవేటు మద్యం దుకాణాలను నెలకొల్పారు. టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించి టీడీపీ సిండికేట్కే అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసు యంత్రాంగంతో బెదిరించి అడ్డుకున్నారు. మాట వినకుంటే దాడులకు పురిగొల్పారు. తద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది. ప్రతి మద్యం దుకాణం పరిధిలో 4 నుంచి పది వరకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఊరూవాడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.15, బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెర తీశారు. మద్యం విక్రయాల ద్వారా టీడీపీ సిండికేట్ ఏటా రూ.41,850 కోట్ల చొప్పున ఐదేళ్లలో 2.09 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నింది.పాలనా వైఫల్యాలు.. డైవర్షన్ రాజకీయాలుఆర్నెళ్ల పాలన అంతా వైఫల్యాల మయంగా మారడంతో డైవర్షన్ రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్లో రుషికొండ భవనాల పేరుతో బురద చల్లి మభ్యపుచ్చేందుకు యత్నించారు. ఆగస్టులో కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని వైఎస్సార్సీపీ నేతలు బోట్లతో ఢీకొట్టి ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారంటూ ఏమార్చే కుతంత్రాన్ని రచించారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమలను రాజకీయాలకు వాడుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. అక్టోబర్లో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేశారు. నవంబర్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియా కేసులు పెట్టారు. అమెరికాలో అదానీపై కేసుల వ్యవహారాన్ని వైఎస్ జగన్కు ముడిపెట్టి దుష్ప్రచారానికి కుట్ర పన్నారు. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేసి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు.ఇది అప్పుల కుప్ప ప్రభుత్వంసంపద సృష్టిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిరంతరం అప్పుల ఊబిలోకి దించుతున్నారు. ఇప్పటివరకు రూ.67,237 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చలేదు.ఉచితం అంటూ.. ఇసుక దోపిడీఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం యార్డుల్లో 80 లక్షల టన్నులను నిల్వ చేయగా కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రజాప్రతినిధులు మాయం చేశారు. 108 రీచ్లకు షార్ట్ టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద అయిన వారికి అప్పగించేశారు. ఇసుక లేక నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు అల్లాడుతున్నారు. భూ సమస్యలు మళ్లీ మొదటికిల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ వివాదరహితంగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములపై ఆంక్షలు తొలగిస్తే ఇప్పుడు టీడీపీ మళ్లీ ఆంక్షలు పెట్టి రైతులను కష్టాల్లోకి నెడుతోంది. -
Andhra Pradesh: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం నుంచి గురువారం వరకు జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చిస్తారని, స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ఈ సదస్సులో 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు పాల్గొంటారని, వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకుని, రానున్న నాలుగున్నరేళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తారని తెలిపింది. తొలి రోజు ఉదయం ఆర్టిజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై, మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, శాంతిభద్రతలు వంటి అంశాలపై చర్చిస్తారని వివరించింది. -
రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు చెల్లదు
సాక్షి, అమరావతి: రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక, ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్లో నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ, అది రూల్స్లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ‘ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(కె)(1) ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలంటే.. సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ/అసైన్డ్/దేవదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి. అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు/ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్డీడ్లను రద్దు చేయడం సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే, సేల్డీడ్ల రద్దుకు రూల్ 26(కె)(1) వర్తించదు. ఈ రూల్లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు. సేల్డీడ్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే.. దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్లో లేదు కాబట్టి, దానిని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్లో లేకుంటే.. ఆ రూల్స్ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్లో లేకపోయినా.. అది రూల్స్లో ఉన్నట్లే భావించాలి’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ఇటీవల తీర్పు వెలువరించారు.సేల్డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 4.90 ఎకరాల భూమిని జి.నాగేశ్వరరావు, ఎన్.రమణ, షేక్ ఆసీఫ్ పాషాలకు 2013లో విక్రయించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో ఆ సేల్డీడ్లను అధికారులు రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్రావు తుది విచారణ జరిపి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
ఫీజు బకాయిలు చెల్లిస్తేనే హాల్టికెట్లు
గుడివాడ టౌన్: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వీకేఆర్, వీఎన్బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదోవిధంగా ఫీజు బకాయిలు చెల్లించగా.. 30 మందికి పైగా చెల్లించలేకపోయారు. దీంతో వారికి హాల్ టికెట్ ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని హాల్ టికెట్లు ఇచ్చారు. -
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న
సాక్షి, అమరావతి: అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో.. అంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కంకులతోనే నిరసనలకు దిగారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయల ఎదుటే సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. తుపాను ప్రభావంతో కురిసిన వరా్షలకు తడిసి ముద్దయిన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ ధైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని, జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.గింజ ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర దక్కలేదురాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజా కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాధికారులు కూడా దళారుల అవతారమెత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. 25 శాతం తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపాటుతుపాను వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కళ్లాలపై ఉన్న పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తేమ శాతం పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా, రైతు సేవా కేంద్రంలోనే రూ.1,450కు మించి రాదని చెబుతున్నారని తెలిపారు. పైగా తరుగు రూపంలో 15 నుంచి 20 బస్తాలు తగ్గించి రశీదులిస్తున్నారని, ఎందుకిలా కోత విధిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేరని చెప్పారు. గతంలో రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) – మిల్లులకు మధ్య మ్యాపింగ్ ఉండేదని, ప్రస్తుతం పొరుగు జిల్లాలకు కూడా ఇష్టమొచ్చినట్టు తోలుతున్నారని ఆరోపించారు. రవాణా చార్జీల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, దానినీ రైతుల నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సరఫరా చేసిన ఎంటీయూ 1262 రకం విత్తనాన్ని సాగు చేస్తే, ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరూ కొనడంలేదని వాపోయారు. బీపీటీ, ముతకలు మాత్రమే కొనమని చెప్పారని, మధ్యస్తంగా ఉండే ఎంటీయూ 1262 కొనలేమని చెబుతున్నారని, దీంతో దళారులకు 75 కేజీల బస్తా రూ.1,250 నుంచి రూ.1,350కు అమ్ముకోవల్సి వస్తోందని వాపోయారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి ఆర్బీకే పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని, ఇక మీదట కొనేది లేదంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సగం కూడా కొనకుండానే లక్ష్యం పూర్తయిందని చెప్పడంలో అర్థం ఏమిటని మండిపడుతున్నారు.గింజ కొనే వారు లేరు..కృష్ణా జిల్లా మొవ్వ మండలం అవురుపూడికి చెందిన ఈ రైతు పేరు ఎం.హరిబాబు. 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళితే 24 శాతం తేమ వచ్చింది. 30 కాటా వేశారు. తేమ 25 శాతం ఉన్నా మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ చెప్పారు. నిన్నటికి నిన్న తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం తెనాలిలో చెప్పారు. ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకొని మద్దతు ధర లెక్కగట్టి ఇవ్వాలని అడుగుతుంటే.. మిల్లర్లు రూ.1,450కు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెబుతున్నారని హరిబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు రూ.3 వేలు, టార్పాలిన్ల అద్దె రూ. 8 వేలు ఖర్చయిందని తెలిపారు. ధాన్యం తరలించకపోతే మొలకలొస్తాయని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడంలేదని, తూర్పు గోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు వాపోతున్నారు.ఇదేనా 48 గంటల్లో డబ్బులేయడమంటే..ఈ రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. ఒకటిన్నర ఎకరాల్లో వరి పంటను కోసి గతనెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతుసేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్లుకు ఈ నెల 21వ తేదీన పంపారు. అదే రోజున ఎఫ్టీవో 906200015240005 జనరేట్ అయ్యింది. కానీ 81 బస్తాలకే రశీదు ఇచ్చారు. 24న రూ.74,520 రైతు ఖాతాలో జమైనట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంకులో చూసుకుంటే సొమ్ములు పడలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ లింక్ అయి ఉండకపోవచ్చని చెప్పారు. రెండ్రోజులు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరిగి ఆధార్ లింక్ చేశారు. 26 నుంచి రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు రాలేదు. అడిగితే కంగారెందుకు.. నాలుగు రోజులాగండంటూ చిరాకు పడుతున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకుగాను 81 బస్తాలకే రశీదు ఇచ్చారని వాపోయారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చారిత్రక నిర్ణయాలతో.. సంపద సృష్టించాం: వైఎస్ జగన్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ.. ఏపీ ప్రభుత్వం, డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే.. ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది? రేపు అమెరికా కంపెనీ వ్యాపారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిందనుకుందాం. ప్రభుత్వం భూములు, సౌకర్యాలు కల్పిస్తుంది. జీఎస్టీ మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాగని అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రోత్సాహకాలు ఇప్పించారని అంటారా? అలా అనొచ్చా? వాస్తవాలు తెలియకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ముగింపు ఉండట్లేదు. – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే.. మరో వైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు.రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏవైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకుని, రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించి, ఆచరణలో పెట్టింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మూడు కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జీఎస్డీపీ పెరుగుతుంది. ఉద్యోగాలొస్తాయి. అభివృద్ధి కనిపిస్తుంది. దీనినే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు రేపు రూ.లక్షల కోట్ల విలువ చేస్తాయి.అంతర్రాష్ట్ర ట్రాన్స్విుషన్ చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపుతో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు సౌర విద్యుత్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ(సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదో చరిత్రాత్మక ఒప్పందం.. చారిత్రక ఘట్టం గతంలో రాష్టంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్కు రూ.5.10 కాగా మేం దాని కంటే యూనిట్ రూ.2.61 తక్కువకు కొనుగోలు చేశాం. దీనివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. ఈ లెక్కన 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంది. సంపద సృష్టించడమంటే ఇదీ చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు చేస్తూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. మేం సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా?– వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంపద సృష్టిలో భాగంగా విప్లవాత్మక అడుగులు వేశామని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నిజమైన సంపద సృష్టి జరిగింది, రాష్ట్రానికి అదనపు ఆదాయాలు పెరిగింది, అదనపు ఆస్తులు సమకూరింది వైఎస్సార్ సీపీ హయాంలోనేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించామన్నారు. అధిక ధరలతో పీపీఏల ఒప్పందాల గుదిబండ వల్ల సీఎం చంద్రబాబు రూ.87,500 కోట్లు ఆవిరి చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.13 వేల కోట్లతో మూడు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపట్టామని.. వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్తులో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల సంపద సృష్టించే ఆస్తులుగా మిగులుతాయని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.చరిత్రలో నిలిచే ఒప్పందం..సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా, రైతుల జీవనోపాధులు పెంచడమే ధ్యేయంగా వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మా ప్రభుత్వ ఆశయాన్ని కేంద్రం సైతం అభినందించింది. రైతులకు మంచి చేస్తూ మీరు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి మా వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పింది. ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ యూనిట్ విద్యుత్ అత్యంత చౌకగా రూ.2.49కే సరఫరా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ కేంద్ర సంస్థ సెకీ లేఖ రాసింది. నాడు ఆ ప్రతిపాదనకు నేను ఒప్పుకోకుండా ఉంటే ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన ఎల్లో బ్యాచ్ నాపై ఏరకంగా దుమ్మెత్తిపోసేవారో అందరూ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి నాపై ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? ఇంత తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఏ ఒక్కరూ చేయలేనిదాన్ని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. ఒక చరిత్ర సృష్టించాం. చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది.రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ లక్ష్యంగా..రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మీద భారం పడకుండా.. మరో 25 ఏళ్ల పాటు రైతన్నలకు ఢోకా లేకుండా ఉచిత విద్యుత్తు అందించడంలో భాగంగా గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఆలోచన చేశాం. 2020 నవంబర్లో 6,400 మెగావాట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీఈసీఎల్) ఆధ్వర్యంలో సోలార్ పార్కులు రాష్ట్రంలో నెలకొల్పేందుకు టెండర్లు పిలిచాం. రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున విద్యుత్ సరఫరా చేయడానికి ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అందులో పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కారణంగా న్యాయ వివాదాలు తలెత్తి ఈ ప్రక్రియ ఆగిపోయింది.మేం సంపద సృష్టించాం.. ఆవిరి చేసింది చంద్రబాబేమాట్లాడితే సంపద సృష్టిస్తానంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు తన హయాంలో సంపద ఏ విధంగా ఆవిరి చేశాడో ఒక్కసారి మీరే చూడండి. 2,500 మెగావాట్ల సోలార్ పవర్,, 3,494 మెగావాట్ల విండ్ పవర్ కోసం చేసుకున్న పీపీఏలను.. మా హయాంలో యూనిట్ రూ.2.49కే సరఫరా చేసేందుకు చేసుకున్న పీపీఏతో పోల్చి చూస్తే ఎవరు సంపద సృష్టించారన్నది అందరికీ అర్థమవుతుంది. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుంది. చంద్రబాబు హయాంలో 3,494 మెగావాట్ల పవన విద్యుత్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే సగటున యూనిట్ రూ.4.84 చొప్పున చేసుకున్నారు. మా హయాంలో అదే విద్యుత్ యూనిట్ రూ.2.49కే వచ్చింది. మా హయాంతో పోలిస్తే బాబు హయాంలో చేసుకున్న ఒప్పందాల వలన రూ.2.35 అదనంగా భారం పడుతుంది. 3,494 మెగావాట్లు అంటే 9 వేల మిలియన్ యూనిట్లు! యూనిట్ రూ.2.35 చొప్పున చూస్తే ఏడాదికి రూ.2 వేల కోట్లు అదనపు భారం పడింది. ఆ లెక్కన 25 ఏళ్లకు అక్షరాల రూ.50వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇక 2,500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే.. సగటున యూనిట్ విద్యుత్ రూ.5.90 చొప్పున కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2,500 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్లు. మన హయాంలో చేసుకున్న పీపీఏల ప్రకారం యూనిట్ రూ.2.49లతో పోల్చి చూస్తే.. చంద్రబాబు హయాంలో సోలార్ పవర్ యూనిట్ విద్యుత్ రూ.3.41 పైసల చొప్పున అదనంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏడాదికి రూ.1,500 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రూ.37,500 కోట్ల అదనపు భారం పడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా ఆ మేరకు నేను సంపద సృష్టిస్తే.. అదే చంద్రబాబు హయాంలో చేసుకున్న సోలార్, విండ్ పీపీఏల వల్ల 25 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.87,500 కోట్ల భారం పడటం వల్ల ఆ మేరకు సంపద ఆవిరి అయిపోతుంది. ఈ తేడా గమనించాలని అందరినీ కోరుతున్నా.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్గా అంతర్రాష్ట్ర ట్రాన్స్ విుషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్గఢ్లకు సెకి ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సిందిపోయి బురదజల్లుతారా? ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సమంజసమేనా? సంపద సృష్టించింది నేనా? చంద్రబాబా ? మీరే ఆలోచించండి. నేను సంపద సృష్టిస్తే.. చంద్రబాబు సంపద ఆవిరి చేశాడు. ధర్మం..న్యాయమనేది ఉండాలి కదా..! మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు, మిడిమిడి జ్ఞానంతో సగం తెలిసి సగం తెలియక..చంద్రబాబును మోయాలన్న తపన, తాపత్రయంతో, జగన్పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?అడ్డగోలు రాతలు.. వక్రీకరణలువాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా రాయడం వక్రీకరణ కాదా? ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా యూనిట్ రూ.2.49కే అత్యంత చౌకగా కొంటున్నప్పుడు ఇదే ఈనాడు రూ.5.73కు కొంటున్నామని ఎలా రాస్తారు. ఇది అబద్ధం కాదా? వక్రీకరణ కాదా? మనం యూనిట్ రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. అది కూడా కోవిడ్ సమయంలో. ఈ ఏడాది మార్చిలో గుజరాత్లో సెకీ టెండర్లు పిలిస్తే యూనిట్ రూ.2.62 నుంచి రూ.2.67 చొప్పున ఖరారయ్యాయి. గుజరాత్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను గుజరాత్లోనే సరఫరా చేసేందుకు ఈ ధర నిర్ణయించారు. టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగా పవర్ ఉత్పత్తి రేట్లు కూడా తగ్గాలి అంటూ మరో వక్రీకరణ చేశారు. 55 అంగుళాల టీవీ గతంలో రూ.2 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.55 వేలకే వస్తుంది కదా..! ఆ లెక్కన విద్యుత్ ధర కూడా ఇప్పుడు తగ్గాలి అంటూ వాదిస్తున్నారు. ఈనాడు వాదన ప్రకారమైతే.. ఇదే సోలార్ పవర్ను మా హయాంలో రూ.2.49 చొప్పున కొనుగోలు చేశాం. అంటే ఇప్పుడు అది రూ.1.50కే రావాలి కదా..? మరి గుజరాత్లో రూ.2.67 చొప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? వాస్తవాలను వక్రీకరించి ఏ విధంగా అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తారో.. మాట్లాడుతున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ!!తియ్యటి కబురుతో కేంద్రం లేఖ..చంద్రగ్రహణం పట్టిన సోలార్ బిడ్ల వ్యవహారంపై దాదాపు 10 నెలలు కోర్టుల్లో పోరాటాలు చేస్తుండగా.. 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి తియ్యటి కబురు మాదిరిగా సెకీ నుంచి లేఖ వచ్చింది. రైతులకు పగటి పూటే ఉచితంగా 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించింది.సెకీ రాసిన ఆ లేఖలో యూనిట్ రూ.2.49 కే ట్రేడింగ్ మార్జిన్తో కలిపి ఇస్తామని ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మీ ఉద్దేశాన్ని అభినందిస్తూ ఈ ప్రతిపాదన చేస్తున్నామని ఆ లేఖలో సెకీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటివ్ కింద ఇంటర్ స్టేట్ ట్రాన్స్విుషన్ సిస్టం(ఐఎస్టీఎస్) చార్జీలు 25 ఏళ్ల పాటు మాఫీ అవుతాయని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తంగా 9 వేల మెగావాట్లు సౌర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ తెలిపింది. తమ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా స్పందన తెలియచేయాలని సెకీ లేఖలో కోరింది.డిస్కంలను బాబు సంక్షోభంలోకి నెడితే.. మేం నిలబెట్టాం..రైతన్నలకు దాదాపుగా 18 లక్షల వ్యవసాయ పంపు సెట్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్ను రైతన్నలకు ఇచ్చేందుకు ఏటా దాదాపు రూ.9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. పెట్టుబడి ఖర్చు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత విద్యుత్ ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనివల్ల ప్రతి రైతన్నకు ఏటా దాదాపు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ప్రయోజనం చేకూరుతుంది. డిస్కంల పరిస్థితి చూస్తే చంద్రబాబు అధికారంలోకి రాకముందు అంటే 2014 నాటికి రూ.29 వేల కోట్లు అప్పులు, బకాయిలు ఉండగా ఆయన దిగిపోయే నాటికి అంటే 2019కి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపుగా 23.88 శాతం వార్షిక అప్పు పెరుగుదల (సీఏజీఆర్)తో చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా ఉంది. డిస్కంలను ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే వైఎస్సార్సీపీ హయాంలో రూ.47,800 కోట్లు డిస్కంలకు అందించి ఆదుకున్నాం.రూ.6.99కు కొన్న బాబు గొప్పా..? రూ.2.49కు నేను కొంటే తప్పా?చంద్రబాబు హయాంలో పవన విద్యుత్(విండ్ పవర్)కు సంబంధించి 2014–19 మధ్య 3,494 మెగావాట్ల విద్యుత్ కోసం 133 పీపీఏలు చేసుకున్నారు. సగటున యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో మాత్రం రూ.4.70 చొప్పున కొన్నారు. సోలార్ విద్యుత్ సంబంధించి 2014–19 మధ్య 2,500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం 35 పీపీఏలు చంద్రబాబు చేసుకున్నారు. యూనిట్ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో 649 మెగావాట్ల కోసం 30 పీపీఏలు చేసుకోగా యూనిట్ రూ.6.49కు కొన్నారు. 2015లో రూ.5.96కు, 2016లో వరుసగా యూనిట్ రూ.6.80కు, రూ.5.99, రూ.4.61,రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే చంద్రబాబు హయాంలో సోలార్ విద్యుత్ను సగటున యూనిట్ రూ.5.90 చొప్పున కొన్నారు. 2019–20లో ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ సగటు ధర యూనిట్ రూ.4.63, సోలార్ పవర్ సగటు ధర యూనిట్ రూ.5.90కు కొనేందుకు అనుమతినిస్తే.. మా హయాంలో రూ.2.49 చొప్పున అత్యంత చౌక ధరకు 7 వేల మెగావాట్లు సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటే నాపై బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ఆత్మనిర్భర్ కింద సోలార్ ప్యానళ్ల తయారీని ప్రోత్సహించేందుకు దేశంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద కేంద్రం గొప్ప అడుగు వేసింది. రాష్ట్రానికి మంచి చేయాలన్న తపనతో చరిత్రలో ముందెన్నడూ లేనంత చౌక ధరకు విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకున్న నేను మంచోడినా? లేక అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచోడా?సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందంయూనిట్ రూ.2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 16న కేబినెట్ మీటింగ్ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించాం. అయితే ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలపలేదు. కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలిచ్చాం. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం 2021 అక్టోబర్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్ 28న కేబినెట్ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. ఐఎస్టీఎస్ చార్జీలు, ఆ విధమైన ఇతర చార్జీలు ఏవీ కూడా వర్తించవంటూ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పంద పత్రంలో స్పష్టంగా పేర్కొన్న భాగం నవంబర్ 11న ఏపీఈఆర్సీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం, డిస్కమ్లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్ పార్టీ ఎవరూ లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ 3.2 క్లాజ్లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు నుంచి మినహాయింపు ఇస్తామని స్పష్టంగా పేర్కొంది.గుజరాత్, రాజస్థాన్లలో పీఎల్ఎఫ్ అధికంచంద్రబాబు ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఓ విచిత్రమైన లాజిక్ తీసుకొచ్చారు. గుజరాత్లో రూ.1.99 విద్యుత్ వస్తుంటే... సెకీతో రూ.2.49కు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని అడు గుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! గుజరాత్, రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు. అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్(పీఎల్ఎఫ్) 23.5 శాతం నమోదైతే, మన రాష్ట్రంలో 17–18 శాతం దగ్గర నమోదవుతాయి. ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే, గుజరాత్, రాజస్థాన్లో సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వాళ్లకు యూనిట్కు రూ.0.50 అడ్వంటేజ్ (తక్కువ) ఉంటుంది. దీనిపై మాట్లాడుతున్న వీళ్లు ట్రాన్స్మిషన్ వ్యయంపై ఎందుకు మాట్లాడడం లేదో తెలియడం లేదు. ఐఎస్టీఎస్ ధర ప్రతీ యూనిట్కు దాదాపు రూ.2 అదనంగా పడుతుందన్న విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. -
వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు మార్గదర్శకాలపై 2005లో జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, జర్నలిస్టులను ‘ప్రత్యేక వర్గం’గా పేర్కొంటూ వారి హౌసింగ్ సొసైటీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హౌసింగ్ సొసైటీలు చెల్లించిన సొమ్మును రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీతో సహా వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సొసైటీలకు అనుకూలంగా లీజు డీడ్లు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు అవుతాయని తెలిపింది. అలాగే సొసైటీలు చెల్లించిన డెవలప్మెంట్ చార్జీలను కూడా వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.సంజయ్ కుమార్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిల సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను కొట్టేస్తూ 2010లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ప్రభుత్వం ఆ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంటే వాటి సభ్యులకు అర్హతలు నిర్ణయించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీబీ చెలికాని తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పలు తరగతులతో పోలీస్తే ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు మంచి స్థానంలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులకు ఒకే రకమైన హక్కులను తిరస్కరించడం ఎంత మాత్రం సహేతుకం కాదంది. తాము ఎన్నో త్యాగాలు చేశామని, అందువల్ల తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలకు ఎన్నికైన వారు, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ జర్నలిస్టులు ‘వెనుకబడిన వర్గాల’కిందకు రారని స్పష్టం చేసింది. -
వాస్తవాలు దాచి.. అడ్డగోలు రాతలా?
మరి ధరలెందుకు తగ్గలేదు..?ఎల్ఈడీ టీవీ ధర 2016లో రూ.రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఇంకా మెరుగైన సదుపాయాలతో అవే కంపెనీ టీవీలు ఇప్పుడు రూ.55 వేలకే దొరుకుతున్నాయంటూ ఈనాడు తన కథనంలో రాసుకొచ్చింది. అలాంటప్పుడు కరెంట్ ధరలు మాత్రం ఎందుకు తగ్గవనే సందేహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఈనాడు చేస్తున్న వాదనే గనుక నిజమైతే 2020లో రూ.1.99 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కాకుండా)గా ఉన్న యూనిట్ విద్యుత్తు ధర 2024 నాటికి రూ.1.50 లేదా అంతకంటే తక్కువకు పడిపోవాలి. కానీ అలా జరగలేదు. రూ.2.70 కంటే ఎక్కువకు పెరిగింది. అయిన్పటికీ గత ప్రభుత్వం యూనిట్ రూ.2.49 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కలిపి)కే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదీగాక భారత ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్రం ప్రభుత్వం చెప్పడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది.సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందించేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తాపత్రయపడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్తు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసింది. చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. దేశంలో మరే రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం. అంతేకాదు.. ఆత్మ నిర్భర్లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహంగా అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు సైతం సెకీ కల్పించింది. అత్యంత చౌక ధరకు విద్యుత్తు అందించే గొప్ప కార్యక్రమం అది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా, డిస్కమ్ల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్తు పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం అది. అలాంటి కార్యక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి ‘ఈనాడు’ బురద చల్లేందుకు తెగబడింది. చౌకగా విద్యుత్తు ఇస్తామని సెకీ స్వయంగా లేఖ రాసినప్పుడు గత ప్రభుత్వం స్పందించకుంటే ఇదే ఎల్లో మీడియా నిందించేది కాదా? అయినా ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వానికి – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన ఒప్పందం. మధ్యలో లంచాలెక్కడ? కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా? అసలు మూడో వ్యక్తికి తావెక్కడ? ఇందులో అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అమెరికాకు చెందిన సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే వైఎస్ జగన్పై విషం చిమ్మడం ఏమిటి? అంతా అసంబద్ధ వాదనలు.. పసలేని ఆరోపణలు!! సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా రూ.3,750 కోట్ల విద్యుత్తు భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై రూ.లక్ష కోట్ల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చర్యగా భావించవచ్చు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్తు అందించే ఒప్పందం కుదిరిందంటూ ఈనాడు ఓ పసలేని వాదన తెరపైకి తెచ్చింది. సరఫరా చార్జీల కింద వాటిపై మరో రూ.రెండు అదనంగా భారం పడుతుందనే విషయాన్ని దాచిపెట్టింది. మన రాష్ట్రానికి ఆ విద్యుత్తు చేరవేసేందుకు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలతో కలిపితే అది రూ.3.98 నుంచి రూ.4 వరకు అవుతుంది. అంటే ఒక మెగావాట్కే నెలకు రూ.4 లక్షలు చొప్పున సరఫరా చార్జీల భారం అదనంగా పడుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ మభ్యపెట్టేందుకు యత్నించడం ఈనాడు మార్కు జర్నలిజానికి నిదర్శనం. ఐఎస్టీఎస్ చార్జీల భారం పడుతోందంటూ ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్రోత్సాహకంగా దాని నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు సెకీ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ నిలువెల్లా విషం చిమ్ముతోంది. ఇక అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చంద్రబాబును వెనకేసుకొస్తూ ఈనాడు ఆదివారం ఓ కట్టుకథ అల్లింది. తక్కువ ధరకు సౌర విద్యుత్ను కొనడం తప్పన్నట్లు అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఉత్పత్తి వ్యయం తక్కువ కాబట్టే.. గుజరాత్లో నెలకొల్పే ప్లాంట్ల నుంచి మధ్య గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్లోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2020 డిసెంబర్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్ఎల్) 2020 సెపె్టంబర్ 28న ఫేజ్ 11లో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు జారీ చేసింది. ఈ టెండర్లో యూనిట్ రూ.1.99కి ఇచ్చేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. విషయం ఏమిటంటే గుజరాత్, రాజస్థాన్లోని ప్రదేశాలు ఎడారి భూభాగం కారణంగా అధిక సూర్యరశ్మి తీవ్రత(వికిరణం) ఉన్న ప్రాంతాలు. మన రాష్ట్రంలో పీఎల్ఎఫ్ 17 శాతం నుంచి 18 శాతం ఉంటే అక్కడ 23.5 శాతం ఉంటుంది. అంటే అక్కడ ఒక యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు 60 నుంచి 70 పైసలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషమేముంది. అదే విధంగా 1,070 మెగావాట్ల విద్యుత్కు సెకీ టెండర్లు పిలవగా టారిఫ్ యూనిట్కి రూ.2కి ఒప్పందం కుదిరింది. అయితే ఆ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యేది కూడా రాజస్థాన్లోనే కాబట్టే ఆ రేటు! 2020లో ఆంధ్రప్రదేశ్లో 6,400 మెగావాట్ల పీవీ సోలార్ ప్రాజెక్టుల స్థాపనకు టెండర్ జారీ చేసినప్పుడు యూనిట్ రూ.2.49, రూ.2.58 చొప్పున ఇచ్చేందుకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ రెన్యూవబుల్, హెచ్ఇఎస్ ఇన్ఫ్రా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పాల్గొన్నాయి. ప్రసార చార్జీలు లేనందున తక్కువే కదా..మరో అంశాన్ని కూడా ఈనాడు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చింది. ఒకవేళ యూనిట్ రూ.1.99 లేదా రూ.2.01, రూ.2.36కి ఇస్తామని చెప్పినా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) లేని కారణంగా ఆ ప్రాజెక్ట్లకు ఛార్జీల మినహాయింపు వర్తించదు. ఈ విద్యుత్ను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే అత్యధిక ప్రసార చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఆ విద్యుత్ ఖరీదు యూనిట్కు రూ.3.98 (యూనిట్ రూ.1.99కి కొంటే మరో రూ.1.99) చెల్లించాలి. అదే యూనిట్ రూ.2.01కి కొంటే దానికి ఐఎస్టీఎస్ చార్జీ రూ.1.99 కలిపి యూనిట్కు మొత్తం రూ.4.00 కట్టాలి. ఇక యూనిట్ రూ.2.36కు తీసుకుంటే దానికి రూ.1.99 జోడిస్తే యూనిట్ ధర రూ.4.35 పడుతుంది. అంటే నెలకు ఒక మెగావాట్కు రూ.4 లక్షలు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలకే చెల్లించాల్సి వస్తుంది. అదే సెకీ నుంచి తీసుకుంటే ఈ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ఈ లెక్కన సెకీ అందిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 తక్కువే కదా. కోవిడ్ తర్వాత పెరిగిన సోలార్ ప్యానల్స్ ధరలు.. జీయూవీఎన్ఎల్ ఫేజ్ 9 టెండర్ గుజరాత్ ప్రభుత్వం చేపట్టే నాటికి కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా సోలార్ ప్యానెళ్ల ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులోనూ ధరలు అదే స్థాయిలో కొనసాగుతాయని ఆ ప్రభుత్వం భావించింది. కానీ కోవిడ్∙తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్యానెల్ ధరలు పెరిగాయి. దీంతో తర్వాత టెండర్లలో సోలార్ టారిఫ్లు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు జీయూవీఎన్ఎల్ 2024 మార్చి 15న గుజరాత్లోని ఖవ్డా ప్రాంతంలో అధిక సూర్యరశ్మి తీవ్రత, అధిక పీఎల్ఎఫ్ ఉన్న ప్రాంతాల్లో టెండర్ను జారీ చేసింది. ఈ టెండర్లో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్కు వచ్చిన టారిఫ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...టీడీపీ హయాంలో అత్యధిక ధరలతో పీపీఏలు.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందానికి భిన్నంగా ఉన్నాయి. అధిక ధరలకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు టీడీపీ హయాంలో పీపీఏలు కుదుర్చుకున్నారు. 2019–20 నాటి ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం సౌర విద్యుత్ సగటు ధర రూ.5.90కి పెరిగింది. అంత ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను డిస్కంలు హడావుడిగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు కారణమయ్యారని ఈనాడు పత్రిక ఏనాడైనా ప్రశ్నించిందా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆందోళన చెంది ఉంటే చంద్రబాబును దీనిపై ఎందుకు నిగ్గదీయలేదు?ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అని చెప్పిన కేంద్రం 2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్లో భాగంగా సెకీ టెండర్ ద్వారా ఏర్పాటయ్యే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆరీ్పఓ)తో సంబంధం లేకుండా అది ఉన్న సంస్థలకు కూడా ఈ ప్రయోజనం అందుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహంతో సెకీ టెండర్ ద్వారా స్థాపించే ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా అందుతుంది. అదే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మన రాష్ట్రంపై ఈ భారం యూనిట్కు రూ.1.99 నుంచి రూ.2 వరకూ పడుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు గత ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈ విషయాలను కథనంలో ప్రస్తావించకుండా వదిలేసింది. -
అదిగో పులి... ఇదిగో తోక!
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే. స్వైర కల్పనలతో పేజీల నిండా చెలరేగి పోవడమే. అదానీలు–ఆమెరికా న్యాయశాఖ వివాదంలోనూ దానిది అదే వీరంగం. మోకాలుకూ బోడిగుండుకూ ముడిపెట్టే కథనాలు వండి వార్చుతున్నారు. యెల్లో మీడియా ప్రచురిస్తున్న అబ్సర్డ్ పొయెట్రీని వదిలేసి సంఘటనల కదంబాన్ని మాత్రమే పరిశీలిస్తే కామన్సెన్స్లో అనేక సందేహాలు తలెత్తుతాయి.సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) అనేది ఒక కేంద్రప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్కు రూ. 4.50 చొప్పున సౌరవిద్యుత్ను కొనుగోలు చేసేటందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే సంస్థతో జగన్ ప్రభుత్వం రూ. 2.49కి యూనిట్ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకున్నది. ప్రజాధనం దుబారాను భారీగా అరి కట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎట్లయింది? జగన్ పొదుపు తప్పు ఎట్లయింది?సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి ‘సెకీ’ కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు, ‘సెకీ’కి నడుమనే ఒప్పందాలుంటాయి. అట్లాగే ఉత్పాదక సంస్థలకూ, ‘సెకీ’కి మధ్యనా వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థలలో అదానీ పవర్ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవాడు లంచాలు ఇవ్వజూపడమేమిటి?‘సెకీ’తో పాటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా యూనిట్కు రూ. 6.99 పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినందువల్ల కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి వుండాలి కదా!జగన్ ప్రభుత్వానికి కుంభకోణం మీద దృష్టి ఉంటే ‘సెకీ’ని పక్కన పెట్టి, నేరుగా అదానీతోనో ఇంకొకడితోనో ఒప్పందం చేసుకొని ప్రజాధనాన్ని ఎక్కువగా కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కదా! ఎందుకట్లా చేయలేదు? అటువంటి ఉద్దేశం లేదనే కదా సారాంశం!జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలతో కూడా ‘సెకీ’ ఒప్పందం చేసుకున్నది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్గఢ్, జమ్ము–కశ్మీర్ రాష్ట్రాల అధికా రులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? ‘సెకీ’ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయ బేరాలు ఎందుకుంటాయి?ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్న మైతే అందుకు బ్రోకరేజి ఎవరు చేసి ఉండాలి? ‘సెకీ’యే కదా! కేంద్రప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజులు చేస్తుంటే అందుకు వేలెత్తి చూపవలసింది కేంద్రప్రభుత్వ అధినేతనే కదా! మరి యెల్లో మీడియా వేలు అటువైపు ఎందుకు తిరగడం లేదు?ఈ వ్యవహారానికి సంబంధించి మన మీడియా ‘అశ్వత్థామ హతః’ అన్నంత ఉచ్చస్వరంతో జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతూ, ‘కుంజరః’ అన్నంత నెమ్మదిగా ఇంకో నాలుగు రాష్ట్రాల పేర్లను చెబుతోంది. ఆ రాష్ట్రాలు తీవ్రంగా ఖండించిన తర్వాత మళ్లీ వాటి ప్రస్తావన కూడా తేవడం లేదు. ఎందు వలన? ఆ సమయంలో జమ్ము–కశ్మీర్ రాష్ట్రం కేంద్రం ఏలు బడిలోనే ఉన్నది. అదానీ లంచాలు ఎవరికి ముట్టినట్టు?ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాలు ‘అదిగో పులి’ అనగానే ‘ఇదిగో తోక’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు ముందుకు దూకుతున్నారు. ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రే అధికారంలో ఉన్నారు. ఆ పులి నిజంగానే ఉంటే ఆ తోకను తాను చూసింది నిజమే అయితే ముందుగా అప్పటి ఛత్తీస్గఢ్ పార్టీ నాయకత్వాన్ని సస్పెండ్ చేయాలనీ, కూటమి నుంచి డీఎమ్కేను బయ టకు పంపించాలనీ డిమాండ్ చేయగలరా?అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు ఓ రెండు ఆకాశరామన్న లేఖలు వచ్చాయట. ఆ లేఖల సారాన్ని ఎస్ఈసీ ఫిర్యాదుగా స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది. అదానీ ఖాన్దాన్లోని సాగర్ అదానీ టెలిఫోన్ మెసేజీల ఆధారంగా కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్బీఐ నేరారోపణ చేసింది. ఇది నేరారోపణ (Indictment) మాత్రమే! నేర నిరూపణ కాదు!! దీనిపై అమెరికా న్యాయశాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు గానీ, ప్రస్తావన గానీ లేదు. కానీ యెల్లో మీడియా సంస్థలు మాత్రం జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి. సీరియల్ కథనాలను రాసేస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి ఇంతకంటే పెద్ద ఉదాహ రణ ఉంటుందా?అమెరికాలోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగే వ్యవహారం ఏ దేశంలో జరిగినా అమెరికా విచారణ జరుపుతుందనీ, అమెరికాలో అటువంటి చట్టాలున్నాయనీ భారత్లోని అమెరికా ప్రియులు తన్మయత్వంతో చెబుతున్నారు. కానీ భారత్ ఒక సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక గణతంత్ర దేశమనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. భారత్లో జరిగినట్టు వారు భావిస్తున్న అదానీల అక్రమంపై భారత ప్రభుత్వానికి అమెరికా ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరవలసింది. ఈ విషయంలో ఆమెరికా తన పరిధులు దాటి వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబ్బల్ తదితరులు విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఇలా పరిధులు దాటడం అమెరికాకు అలవాటే.ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థను ఫక్తు వ్యాపారసంస్థగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. సంస్కరణల పేరుతో విద్యుత్ బోర్డును ముక్కలుగా విడగొట్టారు. విద్యుత్ ఛార్జీలను విపరీ తంగా పెంచి, జనంపై మోయలేని భారాన్ని వేశారు. నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. నష్టాల్లో ఉన్నాయనే నెపంతో చక్కెర ఫ్యాక్టరీలు వగైరాలను తన మనుషులకు కట్టబెట్టిన చందంగానే జెన్కో ముక్కలను, ట్రాన్స్కో ముక్కలను అప్పగించాలని భావించారు. కుంభకోణం చేసే ఆలోచన అంటే ఇది. కానీ చివరకు కథ అడ్డం తిరిగి అప్పగింతల కార్యక్రమం నెరవేరలేదు.కేజీ బేసిన్లో గ్యాస్ నిల్వలు తగినంతగా లేవని నివేదికలు ఉన్నప్పటికీ, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పీపీఏలు కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ ప్లాంట్లకు తగినంత గ్యాస్ను సరఫరా చేయలేకపోతే వాటి ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతం వరకు ప్రభుత్వం అప్పనంగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతి అంటే, స్కామ్ అంటే ఇలాఉంటుంది. ప్రజా ఖజానాపై భారం తగ్గించేలా ఉండదు.వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందజేయాలన్న ఆలోచనకు ఆయన స్వతహాగా వ్యతిరేకమన్నది జగమెరిగిన సత్యం! ఉచితంగా విద్యుత్తును అందజేస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవలసి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యానం సూర్యచంద్రులున్నంత వరకూ మరిచిపోయేది కాదు. ఈ వైఖరి కారణంగానే వ్యవసాయ విద్యుత్ను ఆయన నిరుత్సాహ పరుస్తూ వచ్చారు. 2019కి పూర్వం కూడా రైతన్నల విద్యుత్ కష్టాలు చెప్పనలవిగానివి. పేరుకు 7 గంటల విద్యుత్ సరఫరా. కానీ రోజూ రెండు మూడు గంటలు కోత పడేది. రెండు మూడు దఫాలుగా ఇచ్చేవారు. రాత్రి పూట కూడా పడిగాపులు పడాల్సి వచ్చేది.ఆ కొద్దిపాటి సరఫరా కూడా నాణ్యమైనది కాదు. హెచ్టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండటంతో తరచూ గాలికి అవి కలిసిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీడర్లలో సగం మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అనువుగా ఉండేవి. ఈ వ్యవస్థను మార్చడానికి ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతాంగంపై దృష్టి పెట్టారు. 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను, లైన్లను ఆధునీకరించి పగటిపూటే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధం చేశారు.ఒక్క విద్యుత్రంగంలోనే ఇద్దరు నాయకుల ఆలోచనలు, వారు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలేమిటో తేటతెల్లమవుతుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మీద భారాన్ని మోపడం ఆయన నైజం. కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర. వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం, వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం. జగన్మోహన్ రెడ్డి ఈ వైఖరికి పూర్తి భిన్నం. ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటికీ, అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్ కాటేసినప్పటికీ ప్రజాశ్రేయస్సే తన అధికార పరమావధి అని చాటుకున్నారు. ఆయన అవలంభించిన విధానాలే ఇందుకు సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని చెరిపేయడానికీ, వారి చరిత్రలను మరిపించడానికీ కూటమి సర్కార్ యెల్లో మీడియా సహకారంతో ప్రయత్ని స్తున్నది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనం దృష్టి మరలిపోవాలి. అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నడిపిస్తున్న నాటకం పేరు ‘అదిగో పులి... ఇదిగో తోక!’వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా సాగుతోంది... ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? రాష్ట్రంలో సోషల్మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్ స్టేషన్కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిర్ధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్ బాస్కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.చిత్రహింసల తర్వాతే అరెస్ట్..ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
అత్యవసర సేవకుల సమ్మెబాట
సాక్షి నెట్వర్క్: తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టు సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురిచేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అదనపు సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 3,600 మంది ఉద్యోగులు (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు) సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 768 అంబులెన్స్లు నిలిచిపోనున్నాయి. ఆపదలో ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. 108 సర్వీస్లను ప్రభుత్వమే నిర్వహించాలి.. ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.. వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 108లో పని చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలి.. మరణించిన 108 ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా రూ.25 లక్షలు ఇవ్వాలి.. తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల డీఎంహెచ్వోలు, డీఆర్వో, మండల స్థాయి అధికారులకు సమ్మె నోటిస్లు ఇచ్చారు. -
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ది. రెసిడెన్షియల్ క్యాంపస్లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. ⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. ⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్షాపులు నిర్వహించండి ⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. ⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
నిబంధనలకు లోబడే గత సర్కారు అప్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని, గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కుండబద్ధలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాది అకౌంట్స్ను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 2023–24లో మార్కెట్ నుంచి రూ.68,414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారెంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడే ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీ అప్పులను కూడా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నారంటూ గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. బడ్జెట్, కాగ్ నివేదిక సాక్షిగా..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గత సర్కారు హయాంలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. నిన్న బడ్జెట్ సాక్షిగా.. నేడు కాగ్ నివేదిక ద్వారా వైఎస్సార్సీపీ హయాంలో అప్పులకు సంబంధించి ఎల్లో మీడియా, చంద్రబాబు అండ్కో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనేనని తేలిపోయింది. 2023–24 నాటికి ప్రజా రుణం రూ.4,86,151 కోట్లుగా ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. 2023–24 నాటికి ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా చేసిన రుణాలు రూ.1,54,797 కోట్లు మాత్రమేనని కాగ్ వెల్లడించింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు 2023–24లో జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువకే 2.68 శాతానికే పరిమితం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యలోటు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా స్వల్పంగా పెరిగి 4.35 శాతానికి చేరిందని కాగ్ పేర్కొంది. -
కూటమిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రైతులు విక్రయించారు. క్వింటాల్కు రూ.500 బోనస్ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్టేకింగ్’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. బ్యాంక్ గ్యారంటీలిస్తేనే... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్ రైస్మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటూ బ్యాంక్ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ అవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్మిల్లర్లు అండర్ టేకింగ్ ఇచ్చారు. – కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి. – జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్ రైస్మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు. – సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – యాదాద్రి జిల్లాలో అఫిడవిట్లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. – సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు. – ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం. – చందు మల్లయ్యతేమ పేరుతో కొనడం లేదు నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది. – మూఢావత్ శంకర్, డిండి మిల్లుల కేటాయింపు జరగాలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. – లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) -
Andhra Pradesh: ఉల్లి రైతు గుల్ల!
సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన పంటను దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి రావడం... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో హతాశులవుతున్నారు. ఒకపక్క బయట మార్కెట్లో ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మరోపక్క రైతన్నలు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నాడు. వెరసి అటు వినియోగదారులకు ఇటు అన్నదాతలకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి పంటకు పేరుపొందిన కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేక నష్టపోతుంటే వైఎస్సార్ కడప జిల్లాలో గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్నారు.1.72 లక్షల ఎకరాల్లో సాగు..రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 70 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఆ తర్వాత వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఖరీఫ్లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఖరీఫ్ సీజన్లో కర్నూలు, అనంతపురం జిల్లాలలో మినహా మిగిలిన చోట్ల అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. అలాగే ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో రైతులు తమకు మంచి ధర వస్తుందని ఆశగా ఖరీఫ్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగుచేశారు. తీరా పంట మంచిగా ఎదిగే సమయంలో వర్షాభావంతోపాటు భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురై 30 నుంచి 40 శాతం వరకు దెబ్బతిన్నది. అయినా మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర ఉండటంతో మిగిలిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూశారు. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటం, సౌకర్యాల లేమితో మార్కెట్కు తీసుకువెళ్లిన పంట దెబ్బతినడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కోతలు మొదలైనప్పటి నుంచి కష్టాలుకోతకొచ్చిన పంట మార్కెట్కు రావడం మొదలైన దగ్గర నుంచి ఉల్లి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన విస్తీర్ణం, దిగుబడులను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈనామ్లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు తోడు కాటాలు, కూలీల కొరత ఉల్లి రైతుల ఆశలను దెబ్బతీసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రోజుకు 26 వేల క్వింటాళ్ల పంట వస్తుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యల కారణంగా టెండర్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో టన్నుకు 50–100 కేజీల వరకు ఉల్లి దెబ్బతినడంతో ఆ మేరకు నష్టపోయారు. కర్నూలు యార్డు పరిధిలో ఈ సీజన్లో గరిష్టంగా క్వింటాకు రూ.4,300 ధర లభించగా, సగటున రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున ధర లభించింది.రోజు విడిచి రోజు విక్రయాలుఈనామ్లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు వారం పట్టింది. అదేవిధంగా వాహనాలు, కాటాలు సమకూర్చలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజు విడిచి రోజు ఉల్లి విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైఎస్సార్ జిల్లాలో 15 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగవుతోంది. వర్షాల వల్ల పంట దెబ్బతింది. క్వాలిటీ లేదనే సాకుతో ఇక్కడ క్వింటాకు గరిష్టంగా రూ.1,500 ధర లభించగా, సగటున రూ.వెయ్యికి మించి దక్కడం లేదు.ఉల్లి రైతుకు అండగా జగన్ సర్కారుఒక జిల్లాలో ఒక పంట పథకం కింద ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీ యుటిలిటీ కేంద్రాలను నిర్మించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ఉత్పత్తిదారుల సంఘాలకు 75% సబ్సిడీతో సోలార్ పాలీ డ్రయర్లు, వాహనాలు, 50% సబ్సిడీపై ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, ఉల్లి సీడ్ డిబ్లర్స్తో 40% సబ్సిడీపై సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లను గత ప్రభుత్వం సమకూర్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధర ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంది. ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా అండగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.13 వేలకు పైగా ధర లభించింది. కిలో రూ.2 నుంచి రూ.4 మించి ధర లేని సమయంలో కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ లెక్కన టన్నుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా వెచ్చించింది. ఇలా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, 2014–19 మధ్య టీడీపీ హయాంలో కేవలం రూ.6.38 కోట్లు వెచ్చించి 4,900 టన్నుల ఉల్లిని మాత్రమే కొన్నారు. -
పోలవరానికి 'చంద్రబాబు కూటమి' ఉరి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు.⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.జీవనాడి కాదు జీవచ్ఛవమే..!⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తగ్గించేందుకు తలూపడం వల్లే..పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. -
ఇసుక దందాను అడ్డుకుంటే అంతే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన సనపల సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు. దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసులోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలిపెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్ తయారీ ఇండస్ట్రియల్ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్ కారును అడ్డగించి దాడిచేశారు. డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్ పోలీసుస్టేషన్కు సురేష్ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటికి రాగానే రూరల్ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్ఐ కె. రాము తెలిపారు.కక్షపూరితంగా అరెస్టు చేశారు..పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్స్టేషన్కు సురేష్తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక , సనపల సురేష్ భార్య కక్షపూరితంగానే అరెస్టు.. పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్స్టేషన్కు సురేష్తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక, సనపల సురేష్ భార్య -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ను కోరే ప్రతిపాదన పెండింగ్లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించగా సస్పెన్షన్పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్టెక్కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది
-
దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!
సాక్షి నెట్వర్క్: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. మంత్రి జనార్ధన్రెడ్డి వర్గం బెదిరింపులు..⇒ బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్విల్ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. ⇒ డోన్లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గం దక్కించుకుంది. ⇒ కోడుమూరులో టీడీపీ ఇన్చార్జీ విష్ణువర్దన్రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు. ⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్విల్కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. ⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్విల్కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. ⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. కప్పం కట్టలేక షాపు వదిలేసి..చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్కు లక్కీడిప్లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి సోదరుడు విష్ణువర్థన్రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. ⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్ తీసే రోజు నేరుగా కలెక్టర్కే ఫోన్ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. ⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కడపలో నేరుగా బేరసారాలు..⇒ వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్విల్కు అప్పగించారని సమాచారం. జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్చార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్ బార్ అండ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో లైసెన్స్దారు దీక్షితను బెదిరించి గుడ్విల్కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన రంగనాథ్ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్ నిర్వాహకుడు దినేష్ కుమార్ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. చేయి కలిపితేనే సహకారం..⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వెనిగండ్ల వర్గం వార్నింగ్లు⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్కుమార్ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం. ఉదయభాను వర్గం ఒప్పందాలు.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్ విల్ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్విల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. పల్నాడులో డబ్బులు కడితేనే..⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు. ⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సిండికేట్ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి. ⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ⇒ నరసన్నపేటలో 76వ నెంబర్ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ చేసి గుడ్విల్కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం మాఫియా దోపిడీకి కూటమి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ హయాంలో సీసాలో బంధించి బిరడా బిగించి పాతరేసిన సిండికేట్ భూతాన్ని వెలికితీసి మళ్లీ రాష్ట్రంపైకి వదిలిపెట్టింది. ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ ‘ముఖ్య’నేత పక్కా పన్నాగంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి సిండికేట్ దందాను యథేచ్ఛగా సాగించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కేటాయింపు విధానాన్ని ప్రహసనంగా మార్చేసి ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులతో బెంబేలెత్తించారు. లాటరీ ముసుగులో 80 శాతం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందిన వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేసి వాటిని సైతం హస్తగతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతోంది.80 శాతం ఏకపక్షం.. 20 శాతం కబ్జా– ఇదీ టీడీపీ సిండికేట్ దందా...ఊహించిందే జరిగింది..! రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేటే దక్కించుకుంది. 80 శాతం దుకాణాలకు ఇతరుల నుంచి పోటీ లేకుండా అడ్డుకుని ‘లాటరీ’ ముసుగులో ఏకపక్షంగా హస్తగతం చేసుకోగా.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందినవారిని బెదిరించి మరీ కబ్జా చేశారు. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధుల సిండికేట్ మొత్తం లాటరీ ప్రక్రియను తమకు అనుకూలంగా హైజాక్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారి కనుసన్నల్లోనే అధికారులు లాటరీ ప్రక్రియను నిర్వహించి తతంగాన్ని ముగించారు. కూటమి ఎమ్మెల్యేల వర్గీయులు ముందుగానే లాటరీ నిర్వహించే ప్రాంగణాల్లో భారీ సంఖ్యలోతిష్ట వేసి అంతా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే వర్గీయులు చెప్పింది చేసే కీలుబొమ్మలుగా మిగిలిపోయారు. దాంతో ‘లాటరీ విధానం’లో 80 శాతం మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్కు దక్కాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఇతరులు చివరి నిమిషం వరకు అజ్ఞాతంలో ఉండి లాటరీ సమయానికి వచ్చారు. అలాంటి వారికి 20 శాతం మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దాంతో ఉలిక్కిపడ్డ టీడీపీ సిండికేట్ వారి గురించి ఆరా తీసి లాటరీ ప్రాంగణంలోనే బహిరంగంగా బెదిరించింది. మద్యం దుకాణాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కాదు కూడదు.. నిర్వహిస్తామంటే తమకు 50 శాతం వాటాగానీ ఆదాయంలో 30 శాతం కమీషన్గానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సమ్మతించకుంటే మద్యం దుకాణం కూడా తెరవలేరని.. తరువాత పరిణామాలతో తమకు సంబంధం లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది.డీల్ సెట్.. సిండికేట్కు పచ్చజెండాప్రభుత్వ ‘ముఖ్య’నేతతో డీల్ కుదరడంతోనే టీడీపీ మద్యం సిండికేట్కు ఏకపక్షంగా లైసెన్సులు దక్కాయి. అందుకే యావత్ అధికార యంత్రాంగం సిండికేట్కు సహకరించింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.10 అధికంగా... వాటికి అనుబంధంగా నెలకొల్పనున్న బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధికంగా విక్రయించేందుకు ‘ముఖ్య’నేత అనుమతించారు. అందుకుగాను ఒక్కో బాటిల్పై ఆయనకు రూ.3 చొప్పున కమీషన్ చెల్లించేందుకు సిండికేట్ సమ్మతించింది. మరోవైపు డిస్టిలరీలు కూడా ‘ముఖ్య’నేతకు 20 శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. మొత్తం 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు గతంలో 1995–2004, 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం త్వరలో పర్మిట్ రూమ్లకు అనుమతించడంతోపాటు అనధికారికంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగి డిస్టిలరీ యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. అందుకు ప్రతిఫలంగా డిస్టిలరీలు తమ ఆదాయంలో 20 శాతం ‘ముఖ్య’నేతకు కమీషన్ రూపంలో కప్పం చెల్లించేందుకు సమ్మతించాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరించి టీడీపీ మద్యం సిండికేట్కు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేసింది.345 దుకాణాలు మహిళలకే...రాష్ట్రంలో 345 దుకాణాల లైసెన్సులు మహిళల పేరిట దక్కించుకున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 10.2 శాతం మహిళలకు దక్కాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించగా అనకాపల్లి జిల్లాలో 25 మందికి, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున మహిళలకు లైసెన్సులు లభించాయి.రెండేళ్లలో రూ.6,384 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో ఏకంగా రూ.6,384 కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017–19లో వచ్చిన ఆదాయం కంటే ఇది 349 శాతం అధికం కావడం గమనార్హం. 2017–19లో రూ.1,422 కోట్లు ఆదాయం రాగా 2024–26లో రూ.6,384 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎకైŠస్జ్ శాఖ తాజాగా ప్రకటించింది. అందులో రూ.1,798 కోట్లు కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే వచ్చింది.ఇతర రాష్ట్రాలవారికీ లైసెన్సులు..శ్రీకాకుళం జిల్లాలో ఐదు మద్యం దుకాణాల లైసెన్సులను ఒడిశాకు చెందినవారు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన నందినీ గోయల్, సారికా గోయల్, సౌరబ్ గోయల్ విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు దరఖాస్తులు చేయగా వారికి ఆరు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్కు చెందినవారికి మచిలీపట్నంలో రెండు దుకాణాల లైసెన్సులు లభించాయి. యూపీకి చెందిన ఇద్దరు మహిళలు నందిని, మంజు రాణికి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రెండు షాపులు లాటరీలో దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గవరపు సరస్వతికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక షాపు లాటరీలో తగిలింది.అంతా సిండికేట్ ఇష్టారాజ్యం..రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా హస్తగతం చేసుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ..అచ్చెన్నదే హవా..మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో చక్రం తిప్పారు. జిల్లాలో దాదాపు అన్ని లైసెన్సులు అచ్చెన్న వర్గం చెప్పినవారికే దక్కడం గమనార్హం. మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరాపు పుష్పలతకు పోలాకిలోని 81 నెంబర్ దుకాణం, కోటబొమ్మాళిలోని 113 నెంబర్ దుకాణం, జలుమూరులోని 121 నెంబర్ దుకాణం దక్కాయి. మరికొన్ని దుకాణాలను అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ అనుచరులు సదాశివుని రాంబాబు(120), సాహుకారి ఝాన్సీరాణి(122), మెండ మోహనరావు(123), అంధవరపు బాలరాజు(98), రత్నాల గణేష్ చౌదరి(99), కె.కె.రామయ్య(101,102), మండల రమణబాబు(104), డొంకాన మోహన్రావు(103), బొడ్డేపల్లి నాగవల్లి(116), పల్లి శ్రీనివాసరావు(115), బొంగు అప్పారావు(118), బొంగు దేవి(119), కూశెట్టి మోహనరావు(105), పైడిశెట్టి సంతోష్కుమార్(109), బెండి అరుణ్కుమార్(110), పులి గణపతి(111), టి.వీరాంజనేయులు(112), కొట్టి మల్లేష్(114)లకు మద్యం దుకాణాలు కేటాయించారు. ⇒ నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోడలు భైరి మోహినికి 74 నెంబర్ దుకాణం, మరదలి కుమారుడు ధర్మాన రామప్రసాద్కు 71,72 నెంబర్ల దుకాణాలు దక్కగా... వియ్యంకుడు గుండ ఏలేశ్వరరావుకు 77, 78 నెంబర్ల దుకాణాలు లభించాయి.⇒ జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధారాణికి బూర్జ మండలంలోని 40వ నెంబర్ దుకాణం దక్కింది.విశాఖలో పచ్చదండు పాగా..విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మద్యం సిండికేట్కు నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలోని జనప్రియ, పుష్కరిణి సిండికేట్లకే దాదాపు అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కడం గమనార్హం.⇒ అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన వియ్యంకుడు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులను దక్కించుకుంది. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకారావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలను ఈ సిండికేట్ హస్తగతం చేసుకుంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి చెందిన గిరిజనేతర నేతలు గిరిజనుల హక్కులను కాలరాశారు. జిల్లాలో 40 మద్యం దుకాణాలను గిరిజనులకే కేటాయించగా... గిరిజనులను బినామీలుగా చేసి టీడీపీ గిరిజనేతర నేతలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ వర్గీయులే ఆ 40 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. ⇒ విజయనగరం జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. టీడీపీ నాయకులు, వారి బినామీలే షాపులను దక్కించుకున్నారు.అధికార పార్టీ అరాచకాలు⇒ వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ చానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఆ చానల్ ప్రతినిధులను పిలిపించి బెదిరించారు. తమకు 50 శాతం వాటా ఇస్తేనే దుకాణాలు నిర్వహించుకోగలరని హెచ్చరించారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా పలువురికి ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. కడపలో లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారంతా తన వద్దకు రావాలని.. తనకు 50 శాతం వాటాగానీ 30 శాతం కమీషన్గానీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే ఒక్కరు కూడా మద్యం దుకాణాన్ని నిర్వహించలేరని బెదిరించినట్లు తెలుస్తోంది.⇒ అన్నమయ్య జిల్లాలో మంత్రి రామ్ప్రసాద్రెడ్డి సోదరుడు రాహుల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్రెడ్డి బంధువు కిరణ్, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సానపురెడ్డి సుజతోపాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు. సంబేపల్లి, కోడూరు, తంబళ్లపలత్లి, పీలేరు తదితర ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందినవారిని పిలిపించి బెదిరిస్తున్నారు. ⇒ అనంతపురం జిల్లాల్లో టీడీపీ సిండికేట్ బెదిరింపులు యథేచ్ఛగా సాగాయి. ఆత్మకూరులో షాపు నెంబర్ 35 లైసెన్స్ స్వాతి అనే యువతికి లాటరీలో దక్కడంతో పరిటాల సునీత వర్గీయులు ఆమెను తీవ్రంగా బెదిరించారు. ఆమె డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించినా అధికారులు స్వీకరించేందుకు నిరాకరించడం గమనార్హం. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల వర్గీయులకు ఆ లైసెన్సును కేటాయించారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మద్యం షాపులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు దక్కాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు ఆయన సన్నిహితుడు. ⇒ కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,046 దరఖాస్తులు అందాయి. కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 125 షాపులకు లాటరీ నిర్వహించగా సింహభాగం టీడీపీ, జనసేన సిండికేట్ దక్కించుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 17 షాపులు సిండికేట్కు దక్కాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు రాగా లాటరీలో మొదట షాపు దక్కిన దరఖాస్తుదారుడు డ్రాప్ అవడంతో మరో రెండు రిజర్వు టోకెన్లు తీశారు.⇒ ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,499 దరఖాస్తులు అందాయి. ఆగిరిపల్లిలో మూడు షాపులను మంత్రి అనుచరుల సిండికేట్ దక్కించుకుంది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్కు షాపు దక్కింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలకు వైన్షాపులు దక్కాయి. ⇒ కాకినాడ జిల్లాలో 155 మద్యం షాపులకు 3,332 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలోని ఒక దుకాణానికి 37 మంది పోటీ పడ్డారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన వారిలో 20 మంది షాపులు దక్కించుకున్నారు. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలకు 3,890 దరఖాస్తులు అందాయి. 24 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపులకు 4,448 టెండర్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారు. ⇒ బాపట్ల జిల్లాలో మద్యం దుకాణాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏకి రెండు దుకాణాలు దక్కాయి. కొండపిలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీఏకి ఒక దుకాణం లభించింది. మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు రెండు దుకాణాలు, జనసేన నేత ఒక దుకాణాన్ని దక్కించుకున్నారు. దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి 50 శాతం కప్పం చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.మాచర్లలో తెలంగాణ వ్యాపారి తిప్పలుతెలంగాణకు చెందిన ఓ వ్యాపారికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆయన్ని బెదిరించడంతో తెలంగాణలోని ప్రజాప్రతినిధి ద్వారా సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే 50 శాతం వాటా ఇస్తేనే సమ్మతిస్తామని జూలకంటి వర్గీయులు చెప్పడంతో ఆ వ్యాపారి సమ్మతించక తప్పలేదు. ఆ రెండు మినహా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే జూలకంటి వర్గమే ఏకపక్షంగా దక్కించుకుంది.హిందూపురంలో కిడ్నాప్.. ధర్నాసాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో మద్యం షాపు (నం.57) లాటరీలో దక్కించుకున్న రంగనాథ్ను కిడ్నాప్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామం వద్ద ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని.. షాపు వదిలిపెట్టాలని రంగనాథ్ను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అయితే ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వెనక్కి తగ్గిన కిడ్నాపర్లు రంగనాథ్ను వదిలేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనంతరం రంగనాథ్ పోలీసులతో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దరఖాస్తుల ప్రక్రియ సాగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
PV సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ చర్యలను తప్పు బట్టిన RS ప్రవీణ్ కుమార్
-
ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం'
‘‘నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. బియ్యం రూ.55 అయిపోయింది.. కందిపప్పు 160.. వంట నూనె 120.. ఇలా కడాన ఇంటికి అదనంగా ఐదేళ్లలో రూ.8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రీ?’’. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా మైకు పట్టుకుని ఇలా హోరెత్తించారు. సీన్ కట్చేస్తే.. ఆయన సీఎం పీఠమెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి.. ధరలు దిగిరావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో.. ‘వాటిజ్ దిస్ బాబుగారు.. వీ ఆర్ ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్’.. అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రంలో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30–100 శాతం మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం.. ‘కూటమి’ పార్టీల్లాగే వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు.. సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే.. మార్కెట్ను నియంత్రించి, ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగితేలుతోంది. – సాక్షి, అమరావతి కాటేస్తున్న కూరగాయలు.. రిటైల్ మార్కెట్లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఓ దశలో కిలో రూ.150 చొప్పున సేకరించింది. ఇలా రూ.14.66కోట్లు వెచ్చించి రూ.1,364.55 టన్నుల టమోటాలు సేకరించి రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70–80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట సైతం రూ.50–60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. పైగా.. కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద రూ.150–200 పెడితే బ్యాగ్ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500–600 పెట్టాల్సి వస్తోంది. మరుగుతున్న నూనె ధరలు.. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలూ విపరీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి రూ.25–30 వరకు పెరిగిపోయాయి. దిగుమతి సుంకంతో సంబంధంలేని కొబ్బరి నూనె కిలోకి రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10 నుంచి రూ.30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ అయితే ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.10 అదనంగా ఉన్నాయి. ధరలు పెంచిన తర్వాత మొక్కబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. ఆ మూడింటి తర్వాత ఏపీలోనే పప్పుల ధరలు ఎక్కువ.. ఇక మేలో కిలో రూ.166.12 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.120.85 నుంచి రూ.139కి పెరిగింది. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా కందిపప్పు కాదు కదా కనీసం అర కిలో పంచదార కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.10–20 తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో రూ.45 నుంచి రూ.76కు పైగా పెరిగింది. బాబోయ్ బియ్యం.. మరోవైపు.. రోజువారీ మెనూలో ముఖ్యభూమిక పోషించే బియ్యం ధరలూ ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్లో కిలో బియ్యం ధర రూ.39.58 మాత్రమే. కానీ, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొస్తున్నాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో రూ.57 ఉండగా, సూపర్ ఫైన్ బియ్యం (సోనా మసూరి, హెచ్ఎంటీ, బీపీటీ రకాలు) కిలో రూ.65 నుంచి రూ.76కి పైనే పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం కిలో రూ.119కి పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకూ లోటులేదు. కానీ, వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్గా మారి బ్లాక్ చేస్తుండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే, పారాబాయిల్డ్, బ్రౌన్ రైస్ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.ధరల స్థిరీకరణ నిధి ఏది.. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు విక్రయించేవారు. ఐదేళ్లలో రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయించే వారు. అలాగే, రూ.69 కోట్ల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. ఇలా ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,758 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో రూ.11కే పంపిణీ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్లేదని తేల్చి చెప్పేస్తున్నారు. గడిచిన నెలరోజులుగా స్థానిక హోల్సేల్ మార్కెట్లో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకుని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కూరగాయలు కొందామంటే భయమేస్తోంది. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుంది. – జే.సోమేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి, విశాఖపట్నం ధరలను నియంత్రించాలి.. బహిరంగ మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కిలో రూ.20–30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం నేడు రూ.కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. టమోటాలైతే కిలో రూ.100 దాటింది. రైతుబజార్లలో నాణ్యతలేనివి కిలో రూ.70కు పైగానే పలుకుతున్నాయి. – వన్నెంరెడ్డి సురేష్, విజయవాడ సబ్సిడీ ధరకే విక్రయించాలి.. గతంలో ఇలా టమోటాలు పెరిగినప్పుడు కిలో రూ.50లకే రైతుబజార్ల ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అన్ని రైతుబజార్లలో కిలో రూ.50కే టమోటాలు సరఫరా చేయాలి. కూరగాయలతో పాటు నిత్యావసర ధరలనూ నియంత్రించాలి. – సీహెచ్ శివపార్వతి, కొల్లూరు, బాపట్ల ఇలా అయితే బతికేదెలా.. మార్కెట్లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. కిలో రూ.25–40 మధ్య దొరికే కూరగాయలు ప్రస్తుతం రూ.80కుపైగా పలుకుతున్నాయి. నూనెలు, బియ్యం ధరలూ అంతే. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది. – శ్రీలక్ష్మి, వెంగళాయపాలెం, గుంటూరు నూనె ధరలు పెరిగిపోయాయి.. ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్ఫ్లవర్ ఆయిల్స్ లీటర్కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువలేదు. చికెన్ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. – పి. దేవీకృష్ణవేణి, కాకినాడ -
బాబు మోసాలపై ప్రజాగ్రహం: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ – టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందన్నది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలవుతాయి.. ఆ మోసాలపై ప్రజలకు రోజురోజుకూ ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సీఎం చంద్రబాబు కనీసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. దేశం, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఇంతవరకు రెగ్యులర్ బడ్జెట్ పెట్టలేదని, ఇంకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పైనే కాలం గడుపుతోందని విమర్శించారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఏయే స్కీమ్కు ఎంత కేటాయించారన్నది చెప్పాల్సి ఉంటుందని.. అలా చెప్పకుంటే ప్రజలు తిడతారనే భయంతో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పార్టీ నాయకులు, జెడ్పీటీసీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ పార్టీ మారినా, జెడ్పీటీసీలు కలసికట్టుగా నిలబడ్డారని ప్రశంసించారు. జెడ్పీటీసీల పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. ‘రాజకీయాల్లో మీరు విలువలు, విశ్వసనీయత చూపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జెడ్పీటీసీల్లో మన పార్టీ తరఫున 46 మంది గెలిచాం. అందులో ఒకరు ఎమ్మెల్సీ కావడంతో 45 మంది మిగిలారు. కలసికట్టుగా నిలిచిన జెడ్పీటీసీలందరికీ ధన్యవాదాలు. మీ వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది..’ అని అభినందించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... సమావేశానికి హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు సమస్యలున్నా మేం వెనక్కి తగ్గలేదు మన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాం. రాజకీయాల్లో మేనిఫెస్టో అన్నదానికి ఒక నిర్వచనం ఇచ్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి తు.చ. తప్పకుండా తొలి రోజు నుంచే అమలు చేశాం. ఎలాంటి సాకులు వెతుక్కోలేదు. రెండేళ్లు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నా.. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా ఎక్కడా ప్రజలకు చేయాల్సిన పనుల్లో మనం వెనక్కి తగ్గలేదు. అదే కారణాలు చెప్పాల్సి వస్తే.. మన ప్రభుత్వంలో వచ్చినన్ని కష్టాలు ఎక్కడా, ఎవరూ చూసి ఉండరు. చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ఇన్ని కష్టాలున్నప్పుడు, ఆ కారణాలు చెప్పొచ్చు కదా? అని అన్నారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మేనిఫెస్టోను అమలు చేయవచ్చని కూడా చెప్పారు. అయితే మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోను ఇచ్చాం. ప్రజలు మనకు ఓటేశారు. మనం ప్రజలకిచ్చిన మాట మరో 30 ఏళ్ల పాటు మన బాటను నిర్దేశిస్తుంది. ఎన్ని కష్టాలున్నా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని చిరునవ్వుతో నెరవేర్చాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్ కన్నా ముందే ప్రతి పథకానికి సంబంధించి క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ముందే చెప్పాం. చెప్పినట్లుగా ఆ నెలలో బటన్ నొక్కి నేరుగా డబ్బులు విడుదల చేయడం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. సమావేశానికి హాజరైన ఏలూరు జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు అబద్ధాల్లో అస్సలు పోటీ పడలేదుఐదేళ్ల పాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. ‘జగన్ మంచే చేశాడు... ఎక్కడా చెడు చేయలేదు’ అన్న మాటే ప్రతి చోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుతో మనం అస్సలు పోటీ పడలేదు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చంద్రబాబులా జగన్ కూడా హామీలు ఇవ్వాలని చాలా మంది ఆశించారు. పిల్లలు కనిపిస్తే చంద్రబాబులా.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. చెల్లెమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని జగన్ కూడా చెబుతాడని ఆశించారు. మెడలో కండువాలతో రైతులు కనిపిస్తే.. నీకు రూ.20 వేలు అని జగన్ చెబుతాడని ఆశించారు. 20 ఏళ్లు దాటిన యువత కనిపిస్తే నీకు రూ.36వేలు అని చంద్రబాబు మాదిరిగా జగన్ కూడా చెబుతాడని ఆశించారు. కానీ జగన్ అలా చెప్పలేకపోయాడు. ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం.. ఒకవేళ జగన్ అవే మాటలు చెప్పి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లమేమో! కానీ ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నెరవేర్చని పరిస్థితి కనిపిస్తోంది. మరి నేను కూడా అదే మాదిరిగా చేసి ఉంటే.. మీలో ఏ ఒక్కరైనా తలెత్తుకుని గ్రామాల్లోకి వెళ్లగలిగేవారా? మా జగన్ ఇది చెప్పాడు..! కానీ మా ప్రభుత్వంలో ఇది చేయలేకపోతున్నామనే మాట చెప్పాల్సి వస్తే.. మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకునేవారా? అందుకే.. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా అలాంటి రాజకీయాలే చేస్తాం. కష్ట కాలంలోనే వ్యక్తిత్వం బయట పడుతుంది రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అవుతాయి. వేధింపులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు తోడుగా, అండగా ఉండాలి. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా న్యాయపరమైన సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించాలి. రాజకీయాల్లోనూ చీకటి తర్వాత మళ్లీ పగలు వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించామన్నది రాజకీయాల్లో మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కష్ట కాలంలోనే ఒక మనిషి వ్యక్తిత్వం బయట పడుతుంది. కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి గట్టిగా నిలబడగలిగితే తనకు దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయి. అప్పుడే తను ఒక నాయకుడిగా ఎదుగుతాడు. ఇది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన అంశం. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేప్రజల తరపున మనం ఉద్యమించాలి. ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి. కేసులు పెడతారని భయపడొద్దు. కేసులు పెడితే ఏమవుతుంది? నన్ను 16 నెలలు జైలుకు పంపించారు. నన్ను వేధించినట్టుగా ఎవరినీ వేధించి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. మళ్లీ బయటకు వచ్చి ప్రజలకు అండగా నిలబడ్డాం. ముఖ్యమంత్రిని కూడా అయ్యా. కేసులు పెట్టడం మినహా ఇంతకన్నా ఏం చేయగలుగుతారు? రెడ్ బుక్ పెట్టడం ఏమన్నా పెద్ద పనా? అదేమన్నా గొప్ప విషయమా? న్యాయం, ధర్మం కచ్చితంగా ఉండాలని మన ప్రభుత్వంలో తాపత్రయ పడ్డాం. అందుకే ఈ మాదిరిగా పరిపాలన చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. ధైర్యంగా, కలిసికట్టుగా పోరాడుతూ ఉద్యమిద్దాం. కచ్చితంగా.. వచ్చేది మన ప్రభుత్వమే. అంతులేని అవినీతి.. పచ్చ నేతలకే మద్యం షాపులు ఇక ప్రభుత్వ అవినీతి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. పేరుకు ఉచిత ఇసుక అంటూ వైఎస్సార్ సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా అధిక ధరకు అమ్ముతున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక మాయం అవుతోంది. ఇక మద్యం పరిస్థితి కూడా అంతే. ప్రజలు బాగు పడాలని, వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వినియోగం తగ్గాలని మనం తాపత్రయ పడ్డాం. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్ అమ్మాలి అనే ధోరణితో వెళ్తోంది. 120 రూపాయల మద్యం క్వాలిటీ బాగుంటుందా?. లేక 99 రూపాయల మద్యం బాగుంటుందా? రూ.99కే మద్యం సరఫరా చేసి అమ్మకాలు పెంచుతామంటున్నారు. అలా అమ్మకాలు పెంచితే డిస్టిలరీస్ చంద్రబాబుకు డబ్బులిస్తాయి. ప్రతి దాంట్లోనూ స్కామే. అధికార పార్టీ నేతలకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపుల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వాటాలు సరేసరి. ఇక ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. దీన్ని ప్రశ్నిస్తూ ఎవరైనా పోలీస్స్టేషన్కు వెళ్తే రివర్స్లో వారి మీదే దొంగ కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారి పోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోంది.వేధింపులు అడ్డుకోలేవు.. పార్టీ అండగా ఉంటుంది రాజకీయాలలో ఎప్పుడూ చీకటే ఉండదు. వెలుగు కూడా వస్తుంది. ప్రజల తరపున పోరాటాలు చేయండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ వేధింపులు, కేసులు తాత్కాలికం మాత్రమే. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. ఇంత వేగంగా వ్యతిరేకత మూట గట్టుకుంటున్న ప్రభుత్వం మీద ప్రజల తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసులు పెడతారని ఎవరూ భయపడొద్దు. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు అనేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారమే ఒక ఉదాహరణ. దారుణమైన అబద్ధాలతో విష ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్ కళ్యాణ్.. అంతా కలిసి గోబెల్స్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి, దాన్ని మార్కెటింగ్ కూడా చేసి అమ్మేయగల సమర్ధుడు. అందుకే దేవుడు చంద్రబాబు పాపాలకు మొట్టికాయలు వేశాడు.సూపర్ సిక్స్, సెవన్ ఏమయ్యాయి?జగన్ పలావు పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదు కదా.. చివరకు ఉన్న పలావు కూడా పోయింది. ఇవాళ ప్రతి ఒక్కరూ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. చదువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యాదీవెన, వసతి దీవెన పోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందని దుస్థితి. మూడు క్వార్టర్లు గడిచిపోయినా ఫీజుల్లేవు. డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు. ఇంగ్లీషు మీడియం చదువులు అటకెక్కాయి. టోఫెల్ గాలికెగిరిపోయింది. రోజుకొక మెనూతో అమలయ్యే గోరుముద్ద కార్యక్రమాన్ని నీరు గార్చారు. వైద్య రంగం పూర్తిగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2 వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉండగా ఆరోగ్య ఆసరా అటకెక్కింది. ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మన హయాంలో ఐదు వచ్చాయి. మరో 5 కొత్త మెడికల్ కాలేజీలకు సీట్లు వస్తే వద్దని ఇప్పుడు అడ్డుకున్నారు. కడుతున్న కొత్త కాలేజీల నిర్మాణాన్ని ఆపేశారు. అవి కూడా అమ్మేస్తామంటున్నారు. 104, 108 ఉద్యోగులకు చంద్రబాబు వచ్చిన తర్వాత జీతాల్లేవు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్), డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రమాణాలతో మందులు సరఫరా చేస్తే ఇప్పుడు అవి ఏమయ్యాయో తెలియదు. మనం స్పెషలిస్టు డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటే.. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారి కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం దేవుడెరుగు.. ఉచిత ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆర్బీకేలు అటకెక్కాయి. ఈ–క్రాప్ సక్రమంగా నమోదు చేయలేదు. మన హయాంలో పథకాలు డోర్ డెలివరీ జరిగితే ఇవాళ అది గాలికెగిరిపోయింది. ఇప్పుడు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అక్క నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు అక్కడికే వెళ్లాలట. రెండు నెలలు అక్కడికి వెళ్లకపోతే పథకాలు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల పెన్షన్లు నిలిపివేశారు. ప్రతి అడుగులోనూ ఇదే జరుగుతోంది. -
ఫర్నీచర్ సంగతి ఏదో ఒకటి తేల్చండి: వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్ అంశంపై వైఎస్సార్సీపీ.. మూడు నెలల వ్యవధితో ఇప్పుడు ఐదోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఫర్నీచర్ వీలైనంత త్వరగా వచ్చి తీసుకెళ్లాలని ఆ లేఖలో సాధారణ పరిపాలన విభాగాన్ని(GAD) కోరింది.‘‘గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. కాబట్టి.. వెంటనే ఫర్నీచర్ను తీసుకెళ్లండి. ఎప్పుడు తీసుకెళ్తారో సమయం చెప్పండి. ఒకవేళ తీసుకుని వెళ్లకపోతే గనుక ఆ ఫర్నీచర్ ఖర్చులు చెబితే.. వాటిని చెల్లిస్తాం’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ఐదుసార్లు విషయాన్ని జీఏడీ దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని తేదీలతో సహా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సీఎంగా పని చేసిన క్యాంప్ ఆఫీస్లోని ఫర్నీచర్ అంశంపై అనుకూల మీడియాతో రాద్ధాంతం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పటికే జీఏడీకి వైస్సార్సీపీ లేఖ రాసింది. ఇప్పటిదాకా నాలుగుసార్లు లేఖ, మెయిల్ ద్వారా కబురు పంపినా జీడీఏ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో కేవలం నిందలు మోపడానికే దీనిపై స్పందించడం లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
సాక్షి, అమరావతి/పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో వలంటీర్లు సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబరు 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని.. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ చేపట్టనున్నట్లు వలంటీర్ల సంఘాలు హెచ్చరించాయి. ఇక వీరి ఆందోళనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించిన దాదాపు రెండువేల మంది వలంటీర్లు పాడేరులో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వలంటీర్లు చంటి పిల్లలతో పాల్గొన్నారు. అనంతరం గంటసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వలంటీర్లతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే, కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వలంటీర్లు భారీఎత్తున ఆందోళన నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ఏడాది జూన్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి గౌరవ వేతనాలు చెల్లించలేదు. -
రాయలసీమకు తీవ్ర అన్యాయం
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్ను సీఆర్డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘పంతం’ నెగ్గింది.. నిందితుల వైపే కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ వివాదాన్ని కంచికి చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటనపై నాలుగు రోజుల్లో నాలుగు మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్నివర్గాలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఆదినుంచీ అదే ప్రయత్నం వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెరవెనుక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంతపాటిల్ నేరుగా రంగంలోకి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ.. ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ నరసింహం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీస్ యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీస్ యంత్రాంగం మొదటినుంచీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. ప్రాయశ్చిత దీక్ష చేస్తే సరిపోతుందా? అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుడిని బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తానంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే నానాజీ నాటకీయంగా క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చితమంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్యవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ముకాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బెయిల్బుల్ సెక్షన్లతో సరి చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిల్బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్ 292 బీఎన్ఎస్ (భారత న్యాయసంహిత) పబ్లిక్ న్యూసెన్స్ (రూ.200 జరిమానా), 115(2) బీఎన్ఎస్ స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం (ఏడాది జైలు, రూ.1,000 జరిమానా) 351 బీఎన్ఎస్ వ్యక్తి పరువు తీయడం, శారీరకంగా, మానసికంగా బెదిరించడం (126(2) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం నెల జైలు, రూ.500 జరిమానా) వంటి సెక్షన్లతో సరిపెట్టారు. ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన ఈ సెక్షన్లన్నీ బెయిల్కు అవకాశం ఉన్నవే కావడం గమనార్హం. దళితుడైన వైద్యుడిని తీవ్రంగా అవమానించి.. చంపేస్తానని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా ప్రభుత్వ ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా బెయిల్కు అవకాశం ఉన్న సెక్షన్లతో కేసును నీరుగార్చేశారు. -
సిట్.. బాబు స్కిట్
శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దాన్నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీమ్కు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చ నీయాంశమైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆరోపిస్తున్నట్లు తిరుమల లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచ వ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల, టీటీడీ ఈవో రెండు నాల్కల ధోరణిపై సర్వత్రా అనుమానాలు పెల్లుబుకుతుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ.. సర్వం భ్రష్టు పట్టించే అధికారిగా ఇప్పటికే పేరుగాంచారు.ఇప్పుడు ఈ అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయ్యింది.. తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పేరిట తిమ్మిని బమ్మిని చేసే కుతంత్రానికి తెరతీశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్ను బేఖాతరు చేస్తూ.. తాము చెప్పినట్టుగా దర్యాప్తును ప్రభావితం చేయాలన్న లక్ష్యంతోనే సిట్ను నియమించారు. తానే కర్త, కర్మ, క్రియగా మారి తిరుమల లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు.. ఆ కుట్రను కప్పిపుచ్చడమే లక్ష్యంగా ఈ సిట్ను ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే అవాస్తవ ఆరోపణలతో తిరుమల పవిత్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం దెబ్బ తీసిందన్నది బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన ఏ ఆరోపణకు కూడా ఆధారం చూపించలేకపోయారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదన్నది స్పష్టమైంది. ఇక కర్ణాటక సహకార పాడి రైతుల సమాఖ్య డెయిరీ (నందిని నెయ్యి)కి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని నిలదీసేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే తొలిసారిగా నందిని డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వకుండా మహారాష్ట్రలోని ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టిందన్నది వెల్లడైంది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆహార శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఫిర్యాదులు రాని విషయాన్ని గుర్తు చేశారు. అన్నింటికంటే ప్రధానంగా.. నెయ్యి కల్తీ జరిగినట్టు నివేదిక వస్తే టీడీపీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదని నిపుణుల ప్రశ్నకు చంద్రబాబు ప్రభుత్వం ఖంగుతింది. దాంతో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించే కుట్ర పన్నారని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. లడ్డూ ప్రసాదం అంశంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. లడ్డూ ప్రసాదం అంశంపై హైకోర్టుగానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల వ్యవహారాలపై సాధికారికత ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలపై విచారించాలని కోరారు. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు కూడా ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో చంద్రబాబు బెంబేలెత్తారు. సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారానో మరో దర్యాప్తు సంస్థ ద్వారానో విచారణ నిర్వహిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిట్టింగ్ న్యాయమూర్తిగానీ ఇతర దర్యాప్తు సంస్థకు గానీ సమర్పించాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు ఎటువంటి ఆధారాలు చూపించ లేరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేట్టుగా.. తాను చెప్పింది చేసేలా సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఇన్చార్జ్గా బాబు జేబులో మనిషి అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. కాగా, ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి పక్కా పన్నాగంతో వ్యవహరించి రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులపై దు్రష్పచారం చేశారు. ఎవరెవర్ని బదిలీ చేయాలి.. ఆ స్థానాల్లో ఎవర్ని నియమించాలనే జాబితాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు సమర్పించడం గమనార్హం. టీడీపీ కూటమి ఒత్తిడికి లొంగి ఎన్నికల కమిషన్ అప్పటి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న పాలరాజును హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో చంద్రబాబు ఆదేశాలతో దగ్గుబాటి పురందేశ్వరి సూచించిన జాబితాలోని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీగా నియమించింది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ రౌడీమూకలు చెలరేగిపోయి విధ్వంసకాండ సృష్టించడం తెలిసిందే. ప్రధానంగా పల్నాడులో టీడీపీ కూటమి గూండాలు దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించారు. మాచర్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ రౌడీలు దాడులు చేశారు. అప్పటి గురజాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గురజాలలో బాంబు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు వేయకుండా పచ్చ రౌడీలు దాడులతో విధ్వంసం సృష్టించారు. టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఎంతగా ఫిర్యాదులు చేసినా సరే.. సర్వశ్రేష్ఠ త్రిపాఠి పట్టించుకోలేదు. పోలింగ్ రోజున కనీసం ఫోన్లకు కూడా స్పందించ లేదు. అదీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ట్రాక్ రికార్డ్. అంతటి వివాదాస్పద అధికారిని చంద్రబాబు ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై ఏర్పాటు చేసిన సిట్కు ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. అంటే ఇక సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో.. నివేదిక ఎలా ఉండనుందో ఊహించుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిబద్ధులైన అధికారులను కాదని.. సిట్ ఇన్చార్జ్గా నియమించేందుకు ఐజీలు వినీత్బ్రిజ్లాల్, పీహెచ్డీ రామకృష్ణ, ఆకే రవి కృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. కానీ వినీత్ బ్రిజ్లాల్ నిజాయితీపరుడు, ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన తాము చెప్పినట్టుగా తప్పుడు నివేదిక ఇవ్వరని చంద్రబాబు భావించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అడ్డగోలు వ్యవహార శైలితో విసిగిపోయిన ఆయన డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఇక పీహెచ్డీ రామకృష్ణ కూడా తాము చెప్పినట్టుగా నివేదిక ఇస్తారని చంద్రబాబుకు నమ్మకం లేదు. ఆకే రవికృష్ణ పేరు పరిశీలించారు గానీ పూర్తి నమ్మకం లేకపోవడంతో పక్కన పెట్టేశారు. అందుకే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలికిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠినే సిట్ ఇన్చార్జ్గా నియమించారు. లడ్డూ ప్రసాదంపై తాము వ్యాప్తిలోకి తెచ్చిన దు్రష్పచారానికి అధికారిక ముద్ర వేసేలా.. తిరుమల పవిత్రతకు భంగకరంగా నివేదిక ఇచ్చి సర్వభ్రష్ఠత్వం పట్టించాలన్న చంద్రబాబు పన్నాగంలో భాగంగానే సర్వ శ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించారన్నది స్పష్టమవుతోంది. -
నెయ్యిపై నిగ్గు తేల్చండి
టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం.. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు ‘సుప్రీం’ పర్యవేక్షణలో కమిటీని నియమించండి ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్గా) వాదనలు వినిపించనున్నారు. ఏ నివేదిక ఆధారంగా అయితే రాద్దాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో... ఆ నివేదిక రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? ఆ నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను కోర్టు తేల్చాల్సిన అవసరం ఉందని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. ఈ ప్రశ్నలపై కమిటీ దృష్టి సారించాలి... ‘21.06.2024న టీటీడీ ఈవో మంచి నాణ్యమైన నెయ్యితో శాంపిల్ లడ్డూలు తయారు చేయాలని దేవస్థానం కార్మీకులకు చెప్పారు. 17.7.2024న ల్యాబ్కు నెయ్యి నమూనాలు ఇచ్చారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్ ఇచ్చిన నివేదికను చూస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ నెయ్యిని 100 శాతం వాడలేదని ఈవో ‘ద ప్రింట్’ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? నివేదిక విషయంలో రాజకీయ జోక్యం ఏదైనా ఉందా?’ అనే అంశాలను స్వామి తన పిటిషన్లో ప్రస్తావించారు. నాణ్యత ఉన్న నెయ్యి ట్యాంకర్లకే అనుమతి... ‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్పీవో) ప్రకారం నెయ్యి వాహన ట్యాంకర్ రాగానే అధికారులు నమూనాలను సేకరించి మౌలిక పరీక్షలు నిర్వహిస్తారు. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యతకు అనుగుణంగా ఆ నెయ్యి నమూనాలు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలితేనే ఆ నెయ్యిని శ్రీవారి లడ్డూతో సహా అన్ని ప్రసాదాల్లో వినియోగించేందుకు వాడతారు. పరీక్షల్లో విఫలమైన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు. దశాబ్దాలుగా ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అందువల్ల కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారన్నది అవాస్తవం. ‘ద ప్రింట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఈవో ఆ నెయ్యిని 100 శాతం ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా లడ్డూ విషయంలో తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు భక్తులను తీవ్రంగా ప్రభావితం చేశాయి’ అని స్వామి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు... ‘కొందరు వ్యక్తులు ఓ చిన్న కాగితంలోని కొంత సమాచారాన్ని పట్టుకుని దాని ఆధారంగా రాజకీయ ప్రకటనలు చేశారు. వాస్తవానికి దేని ఆధారంగా అయితే వారు రాజకీయ ప్రకటనలు చేశారో అది ప్రజా బాహుళ్యంలో లేదు. దీనిపై తీవ్ర రాజకీయ ప్రతిఘటన మొదలైంది. వెంకటేశ్వరస్వామిని కొలిచే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అతి సున్నితమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకు చేసి దానిపై రాద్దాంతం మొదలుపెట్టారు. ఆ సమాచారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తులు అలా చేయడానికి ముందు దాన్ని టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాస్తవాలను నిర్దారించుకోవాల్సింది. అలా చేయకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని స్వామి తన పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు.- సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్స్వతంత్ర విచారణ జరిపించండిసుప్రీంకోర్టును కోరిన ఎంపీ వైవీ సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సోమవారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి తరఫున∙సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్పై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరారు. ఆ నివేదికలో పేర్కొన్న నెయ్యిని ఎక్కడ నుంచి సేకరించారన్న దానిపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అభ్యర్ధించారు. లడ్డూపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడం గానీ, ప్రచురించడం గానీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో సీఎం చంద్రబాబు, పలువురు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. -
నాడు 87 శాతం హామీలు.. వంద రోజుల్లోనే అమలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే 87 శాతం హామీలను అమలుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయిన చంద్రబాబు సర్కారు... అప్పులు కూడా పుట్టకుండా తరువాత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను కూడా చేసేసింది. అయినా సరే.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి తొలి కేబినెట్ సమావేశంలోనే పలు హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ప్రారంభించారు. ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీల అమలును ఏనాడూ వాయిదా వేయకుండా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మేనిఫెస్టోను ఎదురుగా పెట్టుకుని వాటి అమలుకు నిరంతరం తపనపడ్డారు. తొలి కేబినెట్ భేటీలోనే అనేక హామీలకు ఆమోదంనిజానికి.. 2019 జూన్ 10న జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే పలు హామీలు అమలుకు ఆమోదముద్ర వేశారు. నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వైఎస్ జగన్ హామీల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు. వంద రోజుల పాలనలోనే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు సామాజికన్యాయం, మహిళా సాధికారత, పాలనలో పారదర్శకతకు పలు చారిత్రక చట్టాలను చేశారు. ఇందులో సాహసోపేతమైన చర్యలు కూడా ఉన్నాయి. ఇలా హామీల అమలు ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తొలి వంద రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందారు. ఇదీ హామీలపట్ల వైఎస్ జగన్ చిత్తశుద్ధి. అలాగే, ప్రజల వద్దకే పాలన, పథకాలు నేరుగా లబ్ధిదారులకే తీసుకెళ్లడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం తొలి వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి 2019 అక్టోబరు 2న ప్రారంభించారు. ఈ సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఏకంగా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించి పారదర్శకంగా భర్తీచేశారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రజల సేవకు వలంటీర్లను నియమించారు.తొలి వంద రోజుల్లో జగన్ అమలు చేసిన హామీలివే..⇒ వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను రూ.2,250కి పెంచారు. వికలాంగులకు రూ.3 వేలకు.. డయాలసిస్ పేషెంట్లకు రూ.10వేలకు పెన్షన్ను పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని జూన్ 2019కి సంబంధించిన పింఛన్ను ఆ తర్వాత నెల జూలై 1న పంపిణీ చేశారు.⇒ ఉద్యోగులకు జూలై నుంచి 27 శాతం మధ్యంతర భృతి.⇒ అక్టోబరులో వైఎస్సార్ రైతుభరోసా అమలు.. 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం.⇒ అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం..⇒ అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18 వేలకు పెంపు.⇒ అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల వేతనాలూ పెంపు.⇒ డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్కు రూ.10 వేలు గౌరవ వేతనం⇒ మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్.⇒ వచ్చే నాలుగేళ్లలో వైఎస్సార్ పేరుతో 25 లక్షల ఇళ్లు నిర్మాణం.⇒ జనవరి 26 నుంచి తెల్లకార్డు ఉన్న ప్రతీ తల్లికి అమ్మఒడి కింద రూ.15 వేలు.⇒ సెప్టెంబరు 1 నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతీ గడపకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ.⇒ రాష్ట్రంలో 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్పు.. అన్ని సౌకర్యాల కల్పన.⇒ నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు.⇒ ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు అమలు. ⇒ జూలై 8న వైఎస్సార్ పుట్టిన రోజు రైతు దినోత్సవంగా నిర్వహణ.⇒ రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి.⇒ రైతులకు ఉచితంగా బోర్లు.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లోకి 200 రిగ్ల కొనుగోలు.⇒ సున్నా వడ్డీ అమలుకు శ్రీకారం.⇒ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.⇒ అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు.⇒ ఈ ఏడాది ఇళ్ల జాగాలు లేని ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు.⇒ ఆస్పత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు.⇒ 108, 104 వాహనాల ఆధునికీకరణ⇒ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత.⇒ టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.⇒ ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు.⇒ భూముల రీసర్వే–శాశ్వత హక్కుల కల్పనకు చట్టం.⇒ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం.⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే చట్టం. -
వంద రోజుల వంచన.. మంచి ఎక్కడ? అంతా మోసమే
వంద నాలుకలు..! వంద మోసాలు... వైఫల్యాలు..! ఇదీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన!! అన్ని వర్గాలను దారుణంగా మోసగించి సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన సీఎం చంద్రబాబు తాజాగా ఇది మంచి ప్రభుత్వం అంటూ తన ఫొటోలతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చాక దగా చేశారు. నాడు ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ హామీలను ప్రచారం చేసి బాండ్లు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ హామీల పేరు వింటేనే భయమేస్తోందంటున్నారు. దీన్ని మంచి అంటారా? మోసం అంటారా? అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. సూపర్ సిక్స్ మోసాలివిగో..సాక్షి, అమరావతి: బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి తల్లులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు .. ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికి అన్ని పథకాలు అందేవని, ఆయన ఇచ్చిన పథకాలకు సైతం చంద్రబాబు అడ్డుపడటాన్ని మంచి అంటారా? మోసం అంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఏ రైతన్నను పలుకరించినా రైతు భరోసా లేదని.. రూ.20 వేలు పెట్టుబడి సాయం హామీని మట్టిలో కలిపేశారని, క్రాప్ ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ, ఈ క్రాప్ ఊసే లేకుండా వంచించారని ఆవేదన చెందుతున్నారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తామంటూ చిన్న పిల్లలను సైతం చంద్రబాబు మోసగించారని తల్లులు ఆక్రోశిస్తున్నారు. 40 లక్షల మందికిపైగా తల్లులు అమ్మ ఒడికి దూరమై నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీతో ఒక్కో ఇంటికి రూ.30 వేలు చొప్పున వస్తాయని నమ్మామని ఇద్దరు పిల్లలున్న తల్లులంటున్నారు. పిల్లలకు నాణ్యమైన గోరుముద్ద కరువైందని, ఇంగ్లీషు మీడియం చదువులు, టోఫెల్, ఐబీ, సీబీఎస్ఈ సిలబస్ సర్కారు బడికి దూరమయ్యాయని, నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కళ తప్పాయని నిర్వేదంగా చెబుతున్నారు.ఆసరా, చేయూత వంటి పథకాలు ఏవీ? ఇప్పటికీ చేయూతగానీ, సున్నావడ్డీ గానీ, ఆసరా లాంటి పథకాలు గానీ అందలేదని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని సొంత ఉపాధి పొందుతున్న వారు పేర్కొంటున్నారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. యువతకు నిరుద్యోగ భృతి లేకపోగా డీఎస్సీ దరిదాపుల్లోనే లేదు..! ఇన్ని మోసాలు చేశాక ఇక మంచి ఎక్కడుందని నిలదీస్తున్నారు. గత వంద రోజులుగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కొత్తవి ప్రవేశపెట్టకపోగా గత ఐదేళ్లుగా అమలైన సంక్షేమ పథకాలు, వ్యవస్థలను రద్దు చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కనీసం బడ్జెట్ను ప్రవేశపెట్టలేక కాలయాపన చేస్తుండటం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనం. ఉచిత ఇసుక విధానం ముసుగులో పచ్చముఠాల భారీ దోపిడీకి రాచబాట వేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లకు మోకాలడ్డి, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేసి మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. విజయవాడను వరదలు ముంచెత్తుతాయని స్పష్టమైన సమాచారం ఉన్నా అలవి మాలిన నిర్లక్ష్యంతో వ్యవహరించింది. వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ప్రభుత్వం పత్తాలేకుండా పోయింది. వంద రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం సాధించింది మాత్రం ఒక్కటి ఉంది... అదే రెడ్బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో అరాచక రాజ్యాన్ని సృష్టించడం. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, లైంగిక దాడులు, వేధింపులు, కక్ష సాధింపులతో రాష్ట్రాన్ని భయానక వాతావరణంలోకి నెట్టివేయడం. ఇదీ చంద్రబాబు వంద రోజుల పాలన ట్రాక్ రికార్డ్! ఈ నేపథ్యంలో ఇన్ని మోసాలు చేసి రెడ్బుక్ పాలన సాగిస్తూ మంచి చేశామని నిస్సిగ్గుగా చెప్పుకునేందుకు మనసు ఎలా వచ్చింది? అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. పాలనలో ఘోర వైఫల్యం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యానికి తాజా నిదర్శనం విజయవాడను ముంచెత్తిన వరదలే. అతి భారీ వర్షాలతో బుడమేరుకు వరద వస్తుందని వాతావరణ విభాగం (ఐఎండీ) రెండు, మూడు రోజులు ముందే హెచ్చరించినా సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫ్లడ్ కుషన్ నిబంధనలను పాటించలేదు. అధికార యంత్రాంగంతో కనీసం సమీక్షించలేదు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని తరలించడం కాదు కదా కనీసం వారికి సమాచారం కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వరదలు వచ్చిన పది రోజుల వరకూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో వరద భారీగా ముంచెత్తి 50 మందికిపైగా దుర్మరణం చెందగా దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇదీ చంద్రబాబు పాలనా దక్షత! రద్దులే.. కొత్త పద్దు లేదు.. చంద్రబాబు అధికారం చేపట్టాక ఎస్జీటీలకు పదోన్నతి లేకుండా బదిలీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని నిలిపివేశారు. కౌలు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో 16 లక్షలమంది సన్న, చిన్నకారు రైతులు సంక్షేమ పథకాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అమూల్ కేంద్రాలు మూసివేయడంతో దాదాపు 6 లక్షల మంది పాడి రైతులు రోడ్డున పడ్డారు. వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వృద్ధాప్య, సామాజిక పింఛన్లను తొలగింపునకు ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి...టీడీపీ నేతల సిండికేట్ దోపిడీకి రాచబాట పరుస్తూ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని అక్టోబరు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. సచివాలయాల వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చి వలంటీర్లకు పొగబెట్టారు. ఇంటింటికీ రేషన్ సరుకులు అందించే ఎండీయూ వాహనాలను నిలివేశారు. రైతన్నకు వెన్నుపోటు.. ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియంను చెల్లించకపోవడంతో రూ.1,500 కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అన్నదాతలకు అందలేదు. కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లను ఎగవేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరాలో కోత పెట్టడంతో లక్షలాదిమంది ఎరువులు అందక ఖరీఫ్ సీజన్లో ఇబ్బందులు పడ్డారు. నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ నిలిపివేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై యూటర్న్ భూ వివాదాలు లేని శాశ్వత వ్యవస్థ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసి తప్పుదారి పట్టించింది. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేసినట్టు నమ్మించారు. భూసర్వే వెంటనే నిలిపివేయాలన్నారు. కానీ అంతలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై యూటర్న్ తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలకే 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. దాంతో ఆ చట్టం పేరు మార్చి అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే కేవలం ప్రజల్ని భయపెట్టేందుకే టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. ఇది అప్పుల కుప్ప ప్రభుత్వంసంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. 80 రోజుల్లోనే ఏకంగా రూ.19 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి టీడీపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అంత భారీ అప్పులు చేసినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను మాత్రం అమలు చేయకపోవడం గమనార్హం. ఆరోగ్యంతో ఆటలు.. ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కి కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున డయేరియా కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. డెంగీ, మలేరియా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. గురుకులాలు, హాస్టళ్లలో కలుíÙత ఆహారంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రులపాలయ్యారు. అయినా సరే ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది.ఉచితం అంటూ.. ఇసుక దోపిడీ రాష్ట్రంలో ఇసుక విధానాన్ని పచ్చముఠాలు తమ దోపిడీకి మార్గంగా మార్చుకున్నాయి. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ముందుచూపుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుక యార్డుల్లో నిల్వ చేసిన లక్షల టన్నుల ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోసం అల్లాడుతున్నారు. పేరుకి ఉచిత ఇసుక అంటూ టీడీపీ నేతల సిండికేట్ అధిక రేట్లు నిర్ణయించి భారీగా సొమ్ము చేసుకుంటోంది. డీఎస్సీ ఆశలు ఆవిరి.. మెగా డీఎస్సీ పేరిట చంద్రబాబు నిరుద్యోగులను బురిడీ కొట్టించారు. 25వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించి రానున్న ఆరు నెలల్లో భర్తీ చేస్తామన్నారు. తొలి సంతకాన్ని ఈ ఫైల్ మీదే చేశారు. కొత్తగా ఈ ఏడాది డీఎడ్ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తామంటూ టెట్ను అక్టోబరుకు వాయిదా వేశారు. అనంతరం టెట్కు, డీఎస్సీకి మధ్య కనీస వ్యవధి 90 రోజులు ఉండాలంటూ డీఎస్పీ నిర్వహణను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో ఈ ఏడాది అసలు డీఎస్సీ నిర్వహించరన్నది తేలిపోయింది. ఆ తరువాత కూడా ఎప్పుడు నిర్వహిస్తారన్నది చెప్పలేని పరిస్థితి. మరోవైపు రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలను కుదించివేస్తున్నారు. తద్వారా ఉపాధ్యాయ పోస్టులు భారీగా రద్దు చేసేందుకు కుట్రపన్నుతున్నారు. రెడ్ బుక్ అరాచకంచంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల్లో సాధించింది ఏమైనా ఉందంటే... రెడ్బుక్ పేరిట రాష్ట్రంలో అరాచకానికి తెగబడుతూ బీభత్సం సృష్టించడమే. తొలి వంద రోజుల్లోనే ఏకంగా 40 మంది హత్యకు గురి కాగా, 400 మందిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. 3 వేలకుపైగా దాడులతో పచ్చ ముఠాలు చెలరేగిపోయాయి. 40 మంది మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వారిలో నలుగురు బాధితులు హత్యకు గురయ్యారు. టీడీపీ గూండాల దాడులతో 3 వేల కుటుంబాలు తమ గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు యథేచ్చగా దాడులకు పురిగొల్పుతున్నారు. కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై పుంగనూరులో దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. 10 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు మూడు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. హనీ ట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరీ జత్వానీని అడ్డం పెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్ గున్నిలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారు. -
ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు
(సాక్షి అమరావతి, నెట్వర్క్): చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయింది! మరో 15–20 రోజుల్లో చేతికొస్తాయనుకున్న పంటలు ముంపు నీటిలో కుళ్లిపోతుంటే అన్నదాత కుమిలిపోతున్నాడు. వేలకు వేలు అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలు కాస్తా వర్షాలు, వరదలకు తుడిచిపెట్టుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయాడు. కృష్ణా లంక గ్రామాల్లోని పొలాల్లో ఎటు చూసినా ఇసుక మేటలే కనిపిస్తుండగా బుడమేరు వరద పంట చేలల్లో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఏలేరు వరద రైతులను కకావికలం చేసింది. ముంపు తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న పంట పొలాలు అన్నదాత గుండెను పిండేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ఈ ఏడాది మూడుసార్లు వరదలు ముంచెత్తగా పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో బహుదా, నాగావళి, వంశధార పోటెత్తడం, విరుచుకుపడ్డ వరదలతో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకం చవిచూశారు. దెబ్బతిన్న రోడ్లు.. ఉత్తరాంధ్రలో వరదలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే రోడ్డు చెరువును తలపిస్తోంది. రాజాంలో ప్రధాన రహదారి అంబేడ్కర్ జంక్షన్ నుంచి జీఎంఆర్ఐటీ వరకూ లోతైన గోతులు పడ్డాయి. తెర్లాం మండలంలో కుసుమూరు–అంపావల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికీ రాకపోకలు లేవు.నష్టం అపారం...రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 5.42 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 51 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా 3.08 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. అత్యధికంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది. వ్యవసాయ పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. పచ్చనేతల కనుసన్నల్లోనే అంచనాలురాజకీయాలకతీతంగా జరగాల్సిన పంట నష్టం అంచనాలు పచ్చనేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాల్సిందేనని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చేదే అరకొర సాయం.. దానికి కూడా రాజకీయ రంగు పులమడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూపూడికి చెందిన ఓ రైతు 80 ఎకరాల్లో పంట వరదలకు నష్టపోగా గత ప్రభుత్వ హయాంలో నామినేట్ పదవి పొందారనే అక్కసుతో ఆయన పేరు జాబితాలో తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.⇒ కృష్ణా, బుడమేరు వరదలు ఉమ్మడి కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. 44,521 హెక్టార్లలో పంటలు ముంపు బారిన పడగా మరో 4,070 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ⇒ పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గ పరి«ధిలో పంటలు ఎక్కువ దెబ్బతిన్నాయి. జిల్లాలో వ్యవసాయ పంటలు 8,818.48 హెక్టార్లలో దెబ్బ తినగా 33 శాతం కన్నా ఎక్కువగా 2,852.747 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 3,368 మంది రైతులకు రూ.4.8 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. జిల్లాలో వరద తాకిడికి 259.13 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాలకు జిల్లాలో 41 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో విద్యుత్శాఖ(ఏపీఎస్పీడీసీఎల్)కు రూ.64.55 లక్షల మేర నష్టం వాటిల్లింది.‘ఏలేరు’ గుండెకోత..ఏలేరు వరదలతో పిఠాపురం, కిర్లంపూడి, గొల్లప్రోలుల్లోని పంటపొలాల్లో టన్నుల కొద్దీ మేట వేసిన ఇసుకను చూసి రైతులు విలవిలలాడుతున్నారు. ఏలేరు కాలువకు గండ్లు పడి 40 వేల ఎకరాలకుపైగా పంట పొలాల్లో రెండు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. ఏలేరు రిజర్వాయరుపై ఆధారపడి 62 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. 40 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గత నెలలో ఏజెన్సీ పరిధిలోని పెదవాగు పొంగడం.. ఆ తరువాత తమ్మిలేరు, ఉప్పుటేరు నుంచి భారీగా వరద నీరు చేరడం.. మళ్లీ వారం పాటు విస్తారంగా వర్షాలు కురవడం రైతులకు తీవ్ర వేదన మిగిల్చింది. ప్రధానంగా 5,683.20 హెక్టార్లలో వరి పూర్తిగా పాడైపోయింది.రాళ్లు రప్పలతో పొలాలు..కృష్ణా పరీవాహక ప్రాంతంలోని దిబ్బల్లంక, బెజవాడలంక, వాసనలంక తదితర లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ అత్య«ధిక భూములను ఎస్సీ రైతులే సొసైటీలుగా ఏర్పడి సాగు చేసుకుంటున్నారు. వారికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరయ్యాయి. ఏడాదిలో ఏ సమయంలో వచ్చినా ఇక్కడ పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. అలాంటి లంకల్లో నేడు చూద్దామంటే పచ్చని పైరు కానరాని దుస్థితి. రెండు నుంచి ఐదు అడుగుల మేర ఇసుక మేట వేసింది. పిందె కట్టిన పత్తి, కాపుకొస్తున్న కూరగాయలు, కోతకు సిద్ధమైన వరి పొలాలు, గెలలేసిన అరటి, ఏపుగా ఎదిగిన జొన్న, మొక్కజొన్న.. ఇలా ఏ పంట చూసినా విగత జీవిలా నేలకొరిగి ఇసుక మేటల్లో కలిసిపోయాయి. ఉచిత విద్యుత్ కోసం గతంలో ఏర్పాటు చేసిన వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు, ఇంజన్లు దాదాపు 12 రోజులుగా వరద నీటిలో చిక్కుకుని బురదకు పాడైపోయాయి. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన పెద్దపెద్ద రాళ్లు రప్పలతో పంటపొలాలు నిండిపోయాయి. ముంచేసిన బుడమేరు..బుడమేరు వరద ముంపునకు గురైన ఉంగు టూరు, నందివాడ, బాపులపాడు, పెదపారు పూడి మండలాల్లోని వంద లాది గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరద ప్రభావానికి గురైన దిబ్బనపాడు, గారపాడు, ఆముదలపల్లి, ముక్కుపాలెం, లంకపల్లి, సిరివాడ, చినలింగాల, పెదలింగాల, చెదుర్తిపాడు, మోపాడు, ఇంజరుపూడి తదితర గ్రామాల్లో అన్నీ మాగాణి భూములే. నీటి వనరులకు లోటు ఉండదు. ఇప్పుడు ఎటు చూసినా పైర్లన్నీ సెలయేర్లను తలపిస్తున్నాయి. బుడమేరు వరద ఇంకా పంట చేలల్లో ప్రవహిస్తూనే ఉంది. ఆయా గ్రామాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైగా పంట భూములున్నాయి. ఈ ప్రాంత రైతులంతా ఎంటీయూ 1318 వరి రకాన్నే సాగు చేస్తున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈ ప్రాంతంలో మంచి పంటలు పండాయి. ఈసారి కూడా మంచి రేటు వస్తుందన్న ఆశతో రైతులంతా అదే సాగు చేశారు.కోనసీమను మూడుసార్లు ముంచెత్తిన వరద..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లో పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీటిలో నానుతుండడంతో పంట నష్టం తీవ్రంగా ఉంది. అరటి 1,876 ఎకరాల్లో దెబ్బతింది. 2,625 ఎకరాల్లో రైతులు కూరగాయ పంటలు నష్టపోయారు. తమలపాకు, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. అయినవిల్లి మండలంలో వరద నీట నానుతున్న కొబ్బరి తోటలో సాగవుతున్న అరటి, పోక (వక్క) పంట వరదల వల్ల డిమాండ్ ఉన్నా బత్తాయి కోయలేక నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. మొదటి ప్రమాదకర హెచ్చరిక జారీ చేయగానే గోదావరి పాయల్లో చేపల వేట నిలిపివేయడంతో 14 మండలాల్లో సుమారు 2 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి లేక అల్లాడుతున్నారు. పి.గన్నవరం మండలం గంటి పెదడిపూడి లంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంక వాసులు ఏటా వరద మొదలైన నాటి నుంచి నవంబరు వరకు పడవలపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.13 వేలకుపైగా ఎకరాల్లో రెండోసారి మునక..ఖరీఫ్ ప్రారంభం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. ఆగస్టు చివరిలో వచ్చిన వర్షాలకు యనమదుర్రు, వయ్యేరు, ఎర్ర కాలువ, ఉప్పుటేరు ఉప్పొంగడంతో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో 14 వేల ఎకరాల్లో నాట్లకు, 30 వేల ఎకరాల్లో నారుమడులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రెండోసారి నాట్లు వేశారు. అప్పటికే ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టగా మరోసారి దమ్ము చేసి నాట్లు వేసేందుకు అంతే ఖర్చు చేయాల్సి వచ్చింది. నాటి వర్షాలకు రూ.9.54 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. తాజాగా కొల్లేరు, గోదావరి వరదలకు ఆకివీడు, కాళ్ల, అత్తిలి, పెంటపాడు తదితర మండలాల్లో 13,300 ఎకరాల్లో పంట రెండోసారి నీట మునగడం రైతులకు తీరని వేదన మిగిల్చింది.ఉత్తరాంధ్ర విలవిల.. వంద గ్రామాలు చీకట్లోనేఉత్తరాంధ్రలో వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరదలో కొట్టుకుపోయి ముగ్గురు, కొండ చరియలు విరిగిపడి మరొకరు మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకంలో గడిపారు. ఒక్క చింతూరు డివిజన్లోనే దాదాపు 20 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఉత్తరాంధ్రలో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అధికారికంగా ప్రాథమిక లెక్కల ప్రకారం 4,987ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. మరో 500 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ ముఖం చూపించలేదువర్షాలకు సాయన్న గెడ్డ పొంగి దిశ మార్చుకొని మా పొలాలపై పడింది. మూడు గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అందులో నా మూడెకరాల వరి పొలం కూడా ఉంది. తొలిరోజు కలెక్టరు, రాజాం ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ ముఖం చూపించలేదు. నష్టపరిహారం ఇస్తారో లేదో తెలియదు– బొడ్డేపల్లి జగన్నాథం, మల్లయ్యపేట, విజయనగరం జిల్లాబస్తా కూడా రావు..నాకు జూపూడిలో నాలుగు ఎకరాలుంది. మరో 50 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 24 ఎకరాల్లో మినుము, మిగతాది వరి వేశా. మినుముకు రూ.15 వేలు, వరికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టా. మినుము సాగు చేసే పొలానికి కౌలు కూడా చెల్లించా. ఇప్పటికే రూ.15.90 లక్షల వరకు ఖర్చు అయింది. రెండు పంటలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బస్తా గింజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా నష్టపోయాం. –పల్లా శ్రీరామయ్య, ఇబ్రహీంపట్నంతీవ్ర నష్టం అయినా కౌలుకట్టాలి..40 ఏళ్లుగా వరి, చెరకు సాగు చేస్తున్నా. కౌలుకు తీసుకుని పండిస్తున్నా. ఈ ఏడాది వరి నాట్లు వేశాక ముంపు బారిన పడింది. ఇక కోలుకునే పరిస్థితి లేదు. తీవ్ర నష్టం వాటిల్లినా కౌలు కట్టాల్సిందే. పెట్టుబడి మొత్తం నీళ్ల పాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాలి. లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కోలుకోవడం కష్టం. – గంజి చిలుకునాయుడు, కౌలు రైతు, నూతలగుంటపాలెం, కశింకోట మండలం ఎకరాకు రూ.30 వేలు నష్టం గ్రామంలో ఎస్సీ రైతులంతా సొసైటీలుగా ఏర్పడి దిబ్బలంక, బెజవాడలంకల్లో 400 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాం. మూడు పంటలు పండుతాయి. 15 ఎకరాలు మాగాణి, 3 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో మినుము వేశా. వరదలతో పూర్తిగా నష్టపోయాం. ఇసుక మేట వేయడంతో ప్రతి రైతు ఎకరాకు రూ.30 వేలకుపైగా నష్టపోయారు. – రెంటపల్లి నాగరాజు, కొటికలపూడి, ఎన్టీఆర్ జిల్లా -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి.. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. బాధ్యతల నుంచి తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా? ⇒ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? ⇒ దీన్ని గుర్తించే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023–24 సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? ⇒ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్లకు ఆలోచన చేయడం ఏంటి? ప్రైవేటు మీద అంతమోజు ఎందుకు? ⇒ కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ⇒ ఇలా చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? కోవిడ్లో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే ⇒ కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం కలగ కూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయట పడ్డారు. ⇒ పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్సీలకు, పీహెచ్సీలకు, విలేజ్ క్లినిక్స్కు మార్గదర్శిగా ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా.. ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ⇒ ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బ తీస్తుందనడం వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబూ? పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదన్నదే మీ విధానమని తెలుస్తోంది. -
సీబీఎస్ఈకీ మంగళం!
సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కారు పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్ఈ బోధనకూ తూచ్ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.విద్యా సంవత్సరంలో మధ్యలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.జగన్పై కోపంతోనే విద్యపై అక్కసు..‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్పై కోపంతో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.విద్యా సంస్కరణలకు జగన్ శ్రీకారం..పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్ మీడియం అమలుచేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్’ను సిలబస్లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.అంధకారంలోకి 84 వేల సీబీఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తు..నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్–పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.తల్లికి వందనం ఎగనామం!మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్’ రద్దు..ఇక పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్ సర్కారు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.ఐబీ శిక్షణకూ అదే గతి..‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. -
బాబుపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలి: వైఎస్ జగన్
చంద్రబాబు రెడ్బుక్ పాలనలో నిమగ్నమై తుపాన్ వస్తోందన్న సంకేతాలను పట్టించు కోలేదు. శుక్రవారం (గత నెల 30వ తేదీ) నుంచి భారీ వర్షాలు వస్తాయన్న అలర్ట్ బుధవారమే (గత నెల 28వ తేదీ) వచ్చింది. చంద్రబాబు వద్ద బుధ, గురు, శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం ఉండింది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి వరద నీరు వస్తోందని కూడా తెలుసు. అలాంటప్పుడు బాబు బుధవారమే రెవెన్యూ, ఇరిగేషన్, హోం సెక్రటరీలతో సమీక్ష నిర్వహించి ఉండాలి. అలా చేసి ఉంటే డ్యాంలన్నీ నిండి ఉన్నాయనే విషయం అర్థమయ్యేది. – వైఎస్ జగన్ఇరిగేషన్ సెక్రటరీ నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాంలలో ఒక్కోదానిలో కనీసం 25 టీఎంసీలను తగ్గించుకుంటూ వచ్చి ఫ్లడ్ కుషన్ ఉండేలా చూసేవారు. పై నుంచి వస్తున్న వరదను ఆయా డ్యాంలలో ఉన్న ఫ్లడ్ కుషన్లో అడ్జస్ట్ చేసే అవకాశం ఉండేది. రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి అందులో ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేసేవారు. హోం సెక్రటరీ లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే పని చేసేవారు. ఈ పనులన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేదు? – వైఎస్ జగన్ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పై నుంచి వచ్చే నీరు, ఇక్కడ వచ్చిన వరద నీరు కలిసి ప్రళయంగా మారింది. చివరికి బుడమేరు కూడా కృష్ణా నదికి పోవాల్సి ఉండగా, తన ఇంటిని రక్షించుకునేందుకు అర్ధరాత్రి ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తేశారు. చంద్రబాబు చేసిన ఈ దుశ్చర్య, ఈ తప్పుడు పని వల్ల ఏకంగా సుమారు 60 మంది చనిపోయారు. ఇంకా పూర్తి లెక్క తేలలేదు. గతంలో ఎప్పుడైనా తుపాను వస్తే ఇంత మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయా? ఇంత మంది చనిపోవడానికి కారకుడైన చంద్రబాబుపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి.గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై, ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసుల ద్వారా పాత కేసుల్లో కావాలని చాలా మందిని ఇరికిస్తున్నారు. తప్పుడు సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారు. ఇవి ఇలానే కొనసాగితే.. రేపు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైళ్లలో ఉంటారు. మార్పు తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతారు. రెడ్బుక్ పెట్టుకోవడం చాలా సులభం. ఎవరికి చెప్పినా ఆ పని చేస్తారు. ఇది ఘన కార్యం, గొప్ప పనికాదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని గుర్తుంచుకోండి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వర్షాలకు 60 మంది చనిపోవడం ఎప్పుడూ లేదు. సహాయక చర్యలకు సమయం ఉన్నా చంద్రబాబు నాయుడు స్పందించక పోవడం వల్లే అంత మంది మృతి చెందారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకే మూడు, నాలుగేళ్ల క్రితం కేసును బయటకు తీసి దానిలో సంబంధం లేని ఒక దళిత మాజీ ఎంపీని అరెస్టు చేసి లోపలపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గోడు పట్టించుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుడి వంద తప్పులు త్వరలోనే పూర్తవుతాయని, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని.. తప్పుడు సంప్రదాయాలు సృష్టిస్తే దాని ఫలితం మీరు అనుభవించక తప్పదని హెచ్చరించారు. గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిలను బుధవారం ఆయన ములాఖాత్లో కలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నిస్సిగ్గుగా డైవర్షన్ పాలిటిక్స్ వరదకు ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు వస్తే, దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. ఇదే పెద్దమనిషి బోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ బోట్లు ఎవరివి? ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి? చంద్రబాబు హయాంలోనే కదా.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే బోట్లలో విజయోత్సవం చేసుకున్నది నిజం కాదా? 4 నెలలుగా చంద్రబాబుతో కలిసి ఇసుక దోపిడీలో భాగస్వాములయ్యారు. ఉషాద్రి అనే వ్యక్తి ఎవరు? చంద్రబాబు, లోకేశ్తో ఫొటోలు కూడా దిగారు. అలాగే రామ్మోహన్న్అనే వ్యక్తి కూడా టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడు కాదా? ఆలూరి చిన్న అనే వ్యక్తి కూడా టీడీపీ మనిషే. తన నిర్లక్ష్యంతో చంద్రబాబు 60 మందిని చంపేసిన విషయాన్ని పక్కదోవ పట్టించడానికి నానా యత్నాలు చేస్తూ వేలు ప్రతిపక్షం వైపు చూపిస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు జరిగితే క్షమాపణ చెప్పాల్సింది మీరు. ప్రజలకు అండగా నిలబడాల్సింది మీరు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాక్షస పాలన సాగిస్తున్నారు. ఎల్లో మీడియాతో బోగస్ స్టోరీలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని అడ్డం పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాతో బోగస్ స్టోరీలు రాయిస్తున్నారు. రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయని ఈనాడులో స్టోరీ రాశారు. దీని వల్ల వర్షం ఎంత పడిందో చంద్రబాబుకు తెలియడం లేదన్నట్టు రాశారు. ఎంత దుర్మార్గంగా రాస్తున్నారంటే అసలు మనుషులేనా? రాష్ట్రంలో పాత రెయిన్ గేజ్ మీటర్ల స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు వచ్చాయి. రాష్ట్రంలో 1,599 వెదర్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మరింత బలపరుస్తూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా 450 ఏర్పాటు చేశాం. ఇవి లేకపోతే వర్షాలు వచ్చిన రోజు ఏ మండలంలో ఎంత పడిందో ఎలా చెప్పగలిగారు? విజయవాడలో ఇంత పడిందీ, జి.కొండూరులో ఇంత పడిందీ అని ఎలా చెప్పగలిగారు? ఇవన్నీ ఉన్నాయి కనుకే రైతులకు ఇన్సూ్యరెన్స్ వస్తోంది. ఈ క్రాప్ నమోదు అవుతోంది. కళ్లెదుట ఇన్ని వాస్తవాలున్నా టాపిక్ డైవర్షన్లో భాగంగా రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోతే పట్టించుకోలేదని, ఇప్పుడు చంద్రబాబు బాగు చేయిస్తున్నారని రాశారు. ఈనాడు దినపత్రికకు సిగ్గుండాలి. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నించకూడదనే దాడులు.. చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో మంగళవారం జరిగిన సంఘటనే సాక్ష్యం. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి అండగా ఉండేందుకు వచ్చిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకరరావును అడ్డుకున్నారు. ఆయన కార్లు పగలగొట్టారు. వరద బాధితులను పరామర్శించకూడదట. ఆ ప్రాంతాలను చూడ కూడదట. అలా చేస్తే చంద్రబాబునాయుడి తప్పిదాలు బయటకు రావని వారు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబూ.. ఇవన్నీ తాత్కాలికం. నష్టపోయింది, దెబ్బతిన్నదీ, నొప్పి కలిగేది ప్రజలకు. ఈ ప్రజలే చంద్రబాబు చేస్తున్న తప్పులను యాడ్ చేసుకుంటూ పోతున్నారు. శిశుపాలుడిలా వంద తప్పులు వేగంగా చేస్తుండటాన్ని వారు గమనిస్తున్నారు. మీరు, మీ పార్టీ భూస్థాపితం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మార్కెట్ యార్డు చైర్మన్గా పని చేసిన సాంబిరెడ్డి కారు ఆపి.. కాళ్లు, చేతులు రాడ్లతో విరగ్గొట్టి మరణించాడనుకుని వదిలి వెళ్లారు. ఎవరూ జెండా పట్టుకోకూడదు. ప్రజలు ఎవరూ నిలదీయకూడదనే వైఖరిలో అధికార పార్టీ ఉంది.అధైర్య పడొద్దు.. తెలుగుదేశం గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి, శస్త్రచికిత్స అనంతరం గత రెండు నెలలుగా మంచానికే పరిమితమైన క్రోసూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిని బుధవారం వైఎస్ జగన్ గుంటూరులోని ఎస్వీఎన్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొందామని, వారి దాడులకు భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, కైలే అనిల్కుమార్, అన్నాబత్తుని శివకుమార్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు ఉన్నారు.ఒక సీఎంను పట్టుకుని బోస్డీకే అని అంటారా?ఏపీ చరిత్రలో ఇంత దుర్మార్గమైన, అన్యాయమైన పాలన ఎప్పుడూ చూసి ఉండరు. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమై పోతున్న సమయంలో ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్కు వెళ్లి మాజీ పార్లమెంటు సభ్యుడైన ఒక దళిత నాయకుడ్ని అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే వరదల్లో దాదాపు 60 మంది చనిపోయారని విజయవాడ అట్టుడుకుతుంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం నగర డిప్యూటీ మేయర్ భర్తను అరెస్టు చేశారు. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. డైవర్షన్ కోసమే ఈ అరెస్టులు. టీడీపీ కార్యాలయం కేసు జరిగి దాదాపు నాలుగేళ్లయింది. ఆ రోజు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని బోస్డీకే అని తిట్టాడు. బోస్డీకే అంటే ఏంటో తెలుసా? లంజాకొడకా అని. నిజంగా ఆ మాదిరిగా తిడితే, అలాంటి మాటలు అన్న తర్వాత ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వారు, కడుపు మండిన వారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న వారి మీద టీడీపీ వాళ్లు దాడులు చేశారు. ఆ దాడి జరిగిన సమయంలో, తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా రాళ్లు పడ్డాయి. సీఎంని అంత మాట అన్నా సరే, మేం చంద్రబాబు మీద కక్ష సాధింపుకు దిగలేదు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు చూసి ఆ ఘటనలో ఉన్న వారందరికీ చట్ట ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చూపించాం. ఏడేళ్ల లోపు శిక్షా కాల పరిమితి ఉన్న కేసు కాబట్టి చట్ట ప్రకారం, నిబద్ధతతో వ్యవహరించాం. అప్పటి ఎంపీ నందిగం సురేష్ కానీ, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త కాని ఈ ఘటనలో లేరు. ఈ విషయం సెల్ఫోన్లు ట్రాక్ చేస్తే తెలియదా? టీడీపీ ఆఫీసు సీసీ కెమెరాలు చూసినా తెలుస్తుంది. వీరెవరూ లేనప్పుడు, మూడేళ్ల తర్వాత దాన్ని మళ్లీ తవ్వి, అందులో ఉన్న వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు స్టేట్మెంట్లతో అరెస్టు చేస్తున్నారు. రెడ్బుక్లో పేర్లున్న వారి ఇళ్లు ధ్వంసం చేయడం, వాళ్లపై దాడులు చేయడం, వాళ్లపై కేసులు పెట్టడం, రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం చేస్తున్నారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు. కొన్ని లక్షల మంది అగచాట్లు పడుతున్నారు. ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? -
అధికారంలోని వారి అజ్ఞాన ఫలితం
రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయంలో ఒకే స్పేస్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్ జరుగుతుందనేది ఫిజిక్స్ సూత్రం. మనుషులు సామాజిక జీవితంలోనూ తరచూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. పాపం వాళ్ళకు యాక్సిడెంట్ సూత్రం తెలీక పోవచ్చు. కానీ, అత్యంత బాధ్యతగల పదవుల్ని నిర్వహిస్తున్న వారికి తెలియాలిగా? తెలియకపోతే విజయవాడ ముంపు లాంటి విషాదాలే జరుగుతాయి. ప్రకాశం బ్యారేజిని కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజికి కొన్ని అడు గులు దిగువన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన ‘బెజవాడ ఆనకట్ట’ వుండేది. దీన్ని 1852లో మొదలెట్టి 1855లో పూర్తిచేశారు. ఆ ఆనకట్టను కెప్టెన్ ఆర్థర్ థామస్ కాటన్ డిజైన్ చేయగా, మరో కెప్టెన్ ఛార్లెస్ అలెగ్జాండర్ ఆర్ర్ నిర్మించాడు. ఒక శతాబ్ద కాలం సమర్థంగా పనిచేసిన కాటన్–ఆర్ర్ ఆనకట్ట 1952 సెప్టెంబరులో కూలిపోయింది. అప్పుడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి.రాజగోపాలాచారి ముఖ్య మంత్రి. అప్పుడే ఆం్ర«ధలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతోంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టడంతో రాజకీయం వేడెక్కింది. ఈ సంక్షోభ సమయంలో మద్రాసు ప్రభుత్వం, బెజవాడ ఆనకట్ట కూలిపోవడాన్ని పట్టించుకోలేదు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం; చిన్న రాష్ట్రం; నిధుల కొరత వున్న రాష్ట్రం. అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బరాజ్ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టు కన్నా మూడురెట్లు ఎక్కువ – అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టా గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్ఠంగా 12 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుందని 175 యేళ్ళ క్రితం ఆర్థర్ థామస్ కాటన్ అంచనా వేశాడు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడు గుల ఎత్తు క్రస్ట్ గేట్లతో ఒక భారీ డిజైనింగ్ రూపుదిద్దుకుంది. బరాజ్ నిర్మాణ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఆంధ్రా ప్రాంతానికి తెలంగాణా కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1957లో బరాజ్ నిర్మాణం పూర్త యింది. మూడు రాష్ట్రాలు నలుగురు ముఖ్యమంత్రులు మారినా అంతటి నిర్మాణం మూడేళ్ళలో (1954–57) పూర్తయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా చిత్తశుద్ధి తగ్గినందున భారీ బరాజ్ల నిర్మాణానికి దశాబ్దాలు పడుతోంది. సాంకేతికంగా ప్రకాశం బరాజ్ నిర్మాణంలో ఒక మెలిక వున్నది. వర్షాకాలంలో మాత్రమే బరాజ్కు నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఎగువ నుండి నీరు రావు. బరాజ్ రిజర్వాయర్లో నిల్వవుండే మూడు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడేవారు. నది ఎండిపోయినపుడు క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేసేవారు. జలాశయంలో చేరిన మేటను తొలగించే వారు. ఇప్పుడయితే నీరుండగానే గేట్లు మార్చే ‘స్టాప్ లాగ్ గేట్ల’ సౌకర్యం వచ్చింది. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చినట్టు విజయవాడ సమీపంలో థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్) రావడంతో ప్రకాశం బరాజ్కు ముప్పు మొదలైంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో వేడి నీటిని చల్లార్చి మళ్ళీ వాడటానికి వీలుగా కూలింగ్ టవర్స్ను ఏర్పాటు చేయాలి. వీటీపీఎస్ నేరుగా కృష్ణా నదిని కూలింగ్ యూనిట్గా మార్చుకుంది. అందుకు అనువుగా కృష్ణానది నుండి వీటీపీఎస్కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కాలువలు నిర్మించారు. ఇన్ ఫ్లో కాలువ లోనికి కృష్ణానది నీరు పారాలంటే (గ్రావిటీ ఫ్లో) రిజర్వాయర్ నీటి మట్టాన్ని పూర్తి స్థాయిలో (ఎఫ్ఆర్ఎల్) నిరంతరం నిండుగా వుంచాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నిర్మించిన బరాజ్ను వేరే లక్ష్యంతో నిర్మించిన వీటీపీఎస్తో లంకె పెట్టడం పొరపాటు. ఒకే సమయంలో ఒకే స్పేస్లో రెండు ఆబ్జెక్ట్స్ ప్రవేశించాయి. దీనివల్ల నాలుగు ప్రమాదాలు జరిగాయి. జలాశయాన్ని నిరంతరం నిండుగా వుంచాల్సి రావడంతో వేసవిలో దిగువ గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యం కాలేదు. వేసవిలో క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేపట్టడం కుదరలేదు. బరాజ్ పిల్లర్లు, క్రస్ట్ గేట్లు నీటిలో ఎలా వున్నాయో కనీసం పరిశీలించడానికి వీలు కాలేదు. మేటను తీయడం సాధ్యం కాకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ప్రకాశం బరాజ్ బలం తగ్గుతోందనే భయాలు 1980ల లోనే మొద లయ్యాయి. వీటీపీఎస్తో లింకు తెగ్గొట్టాలని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యకు పరిష్కారంగా వీటీపీఎస్కు ఇన్–ఫ్లో కెనాల్ కోసం బరాజ్ ఎగువన పంపింగ్ స్టేషన్ నిర్మించారు. ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది అనేది జ్ఞాన సూత్రం. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు దారితీయడం అజ్ఞాన సూత్రం. అలాంటిది వీటీపీఎస్ ఔట్ ఫ్లో (కూలింగ్) కెనాల్ విషయంలో జరిగింది. ఆ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందు బుడమేరు చరిత్రను పరిశీలించాలి. అదొక చిన్న వాగు. తరచూ నీళ్లు లేక ఎండిపోయి వుంటుంది. ఏరు మార్గం త్రాచుపాములా మెలికలు తిరిగి వుంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలోమీటర్లు సాగుతుంది. అలా కిందికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనో, కృష్ణాజిల్లా వాయవ్య ప్రాంతంలోనో భారీ వర్షాలు కురిసినపుడు బుడమేరుకు అకస్మిక వరదలు వస్తాయి. వరద రోజుల్లో బుడమేరులో 20 వేల క్యూసె క్కుల వేగంతో నీరు పారుతుందని అంచనా. ఈ వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవు గనుక గట్లు తెగి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు ‘విజయవాడ దుఃఖదాయని’ అని ఓ చెడ్డ పేరుంది. 1960లలో విజయవాడ కృష్ణలంకను వరద ముంచేసినపుడు ఆ బాధి తులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు అప్పటి మునిసిపల్ కమిషనర్ అజిత్ సింగ్. అలా ఆయన పేరున సింగ్ నగర్ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్ నగర్ కూడా అనేక పేర్లతో విస్తరించింది. విచిత్రం ఏమంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతం. దాని అర్థం ఏమంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు. అంతిమంగా నీతి ఏమంటే, ఇళ్ళకు నీరు కావాలిగానీ, ఇళ్ళ లోనికి నీరు రాకూడదు. ఇళ్ళూ నీళ్ళూ ఒకే సమయంలో ఒకే స్పేస్లో వుండడం అస్సలు కుదరదు. నీటిలో ఇళ్ళు కట్టినా, ఇళ్ళ లోనికి నీరు వచ్చినా విపత్తు తప్పదు. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
Vijayawada Floods: ముంచింది ప్రభుత్వమే
సర్వం కోల్పోయాంఏడాది కిందటే సింగ్నగర్ తోట వారి వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని మారాం. గత ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదకు ఇంట్లో సామాన్లు అన్ని పాడయ్యాయి. పదేళ్లుగా సంపాదించిన వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి. మా అమ్మాయి, అబ్బాయి సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. వరద వస్తుందని ముందుగా చెబితే వీలైనంతవరకు జాగ్రత్త పడేవాళ్లం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్వం కోల్పోయాం.– రాధాకృష్ణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, తోటవారి వీధి, సింగ్నగర్అజిత్సింగ్ నగర్ ఫ్లైఓవర్పై రిక్షాలో సామాన్లు తరలిస్తున్న గుండు కృష్ణ ఓ ఆటో డ్రైవర్. మరి ఇంటి సామాన్లు రిక్షాలో ఎందుకు తీసుకువెళుతున్నారనే కదా మీ సందేహం? విజయవాడలోని కండ్రికలో నివసించే కృష్ణ, ఆయన సోదరుడు ఫైనాన్స్లో తీసుకున్న రెండు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బుడమేరు వరద ముంచెత్తడంతో రెండు ఆటోలు వరదలో పూర్తిగా మునిగి దెబ్బతిన్నాయి. ఆటోకు నెలకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.20 వేలు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీ చెల్లించాలి. ఆటోలను బాగు చేయించాలంటే ఆటోకు రూ.లక్ష చొప్పున మొత్తం రెండు లక్షలు అవుతుందంటున్నారు. ఇన్సూరెన్స్ రాదని చెప్పారు. ఇంట్లో వంట సామాన్లు, ఫ్రిజ్, గ్యాస్ స్టౌ, పిల్లల పుస్తకాలు, ఫర్నిచర్ అన్నీ దెబ్బతిన్నాయి. మళ్లీ అవి కొనాలంటే రూ.50 వేల దాకా ఖర్చవుతుంది. వంట దినుసులైతే తడిసి ముద్దయి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇంట్లో కరెంటు వైరింగ్ దెబ్బతింది. ఇల్లు కూడా మరమ్మతులకు గురైంది. ఇవన్నీ బాగు చేయించుకోవాలంటే కనీసం మరో రూ.లక్ష అవుతుంది. ఆటో నడిపి రోజూ రూ.వెయ్యి దాకా సంపాదించేవారు. ఇప్పుడు సంపాదన లేదు. వరద తగ్గాక ఆటోలు బాగు చేయించుకుని రోడ్డెక్కితేనే మళ్లీ ఉపాధి లభించేది! అదెన్ని రోజులు పడుతుందో తెలియదు. కనీసం నెల రోజుల పాటు ఉపాధికి దూరం కానున్నాడు. మరోవైపు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీలు కట్టాలి. ఇలా కృష్ణ కుటుంబానికి దాదాపు రూ.నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లింది. కేవలం వరద వస్తుందని ప్రభుత్వం ముందుగా చెప్పకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా అంత నష్టపోయింది. అదే ప్రభుత్వం అప్రమత్తం చేసి ఉంటే కనీసం ఇంట్లో ముఖ్యమైన సామాన్లు, పిల్లల పుస్తకాలు, మరికొన్ని వస్తువులను రెండు ఆటోల్లో తరలించి ఈ గండం నుంచి గట్టెక్కేవాళ్లమని కృష్ణ ఆక్రోశిస్తున్నాడు. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)సింగ్నగర్ డాబా కొట్ల జంక్షన్లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్న వ్యాపారి కె.నాగేశ్వరరావును పలకరించగానే ఆయన ఆవేదన కట్టలు తెంచుకుంది. ‘ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద నీరు ముంచెత్తడంతో మొదటి అంతస్తుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాం. ఇంటి ముందున్న మూడు కార్లు వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంట్లోకి నీళ్లొచ్చి సామాన్లు అన్నీ తడిసిపోయాయి. మా అల్లుడు రూ.5 వేలు డబ్బులిచ్చి సోమవారం ఉదయం పడవ తేవడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఆరు రోజులుగా ఓ హోటల్లో ఉంటున్నాం. మా కుటుంబానికి రూ.25 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాకు ఏం సాయం చేస్తుంది..? వరద వస్తుందని మాకు ముందుగానే చెప్పి ఉంటే ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ప్రభుత్వం ప్రజల పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశాడు. సోమవారం వరద ముంపులోనే విజయవాడలోని కండ్రిక నిర్లక్ష్యం ఖరీదు.. 60 నిండుప్రాణాలువిజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 1.45 లక్షల కుటుంబాల దుస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏకంగా 7 లక్షల మంది వరద కష్టాలివి! బుడమేరుకు భారీ వరద వస్తోందని తెలిసి కూడా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఫలితం ఇదీ. ఇందుకు సామాన్యులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికి దాదాపు 60 నిండు ప్రాణాలు బలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారమే 1.45 లక్షల కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదలు ముంచెత్తిన వారం రోజుల తరువాత కూడా ఏకంగా 7 లక్షల మంది వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇక 1.45 లక్షల కుటుంబాలకు కలిగిన నష్టం ఎంతన్నది అంచనాలకే అందడం లేదన్నది కఠోర వాస్తవం. లక్షల ఇళ్లు వరదకు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయించుకునేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వరదకు ఇళ్లల్లో వంట సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. గ్యాస్ స్టౌ, వంట సామాన్లు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. లక్షలాది ఇళ్లల్లో పిల్లల పుస్తకా>లు, సర్టిఫికెట్లు తడిసిపోయాయి. ఎంతోమంది సర్టిఫికెట్లు, బ్యాంకు పుస్తకాలు, దస్తావేజులు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, సరుకు రవాణా వాహనాలు, ఇతర వాహనాలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండటంతో బురద పేరుకుపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ప్రకృతి వైపరీత్యంతో దెబ్బతిన్న ఆ వాహనాలకు బీమా వర్తిందని బీమా కంపెనీలు ఇప్పటికే తేల్చి చెప్పేశాయి. ‘మా పెంకుటిల్లు వరదకు మునిగిపోయింది. వరద తగ్గిన తరువాత కరెంట్ వైరింగ్ పూర్తిగా మార్పించుకోవాలి. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వైరింగ్కు కనీసం రూ.50 వేలు అవుతుంది’అని రాజీవ్నగర్కు చెందిన లక్ష్మీ నారాయణ తన కష్టాలను చెప్పుకొచ్చారు. ఇక రోజు కూలీలు, కార్మికులకు ఇప్పటికే వారం రోజులుగా ఉపాధి లేదు. మరో 15 రోజుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో సంపాదన లేక ...చేతిలో డబ్బులు లేక పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సగటున ఒక్కో కుటుంబానికి కనీసం రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సగటు అంచనాల ప్రకారం 1.45 లక్షల కుటుంబాలకు రూ.10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందన్నది ప్రాథమిక అంచనా.చంద్రబాబుకే పునరావాసంఏకంగా 7 లక్షల మందిని వరదకు వదిలేసిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబానికి మాత్రం పునరావాసం కల్పించింది. నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు కరకట్ట బంగ్లాను వరద ముంచెత్తనుందనే హెచ్చరికలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ ఇంటిని కాపాడేందుకు కనీసం అప్రమత్తం చేయకుండా వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తేశారు. అంతకుముందే చంద్రబాబు కుటుంబం హుటాహుటిన బంగ్లాను ఖాళీ చేసేసింది. చంద్రబాబు స్వయంగా విజయవాడ కలెక్టరేట్కు మకాం మార్చారు. అన్ని సౌకర్యాలతో కూడిన తన వాహనాన్ని అక్కడే పార్క్ చేయించుకున్నారు. వారం రోజులుగా అన్ని సౌకర్యాలతో అక్కడే ఉంటున్నారు. ఇక లోకేశ్ కూడా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు షిఫ్ట్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నివాసానికి తరలి వెళ్లిపోయారు. వరదలతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కుటుంబాన్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించిందన్నది స్పష్టమవుతోంది.బొండా ఉమా బిస్కట్ ప్యాకెట్లిచ్చి వెళ్లిపోయారు..‘కండిగ్రలో ఓ అపార్ట్మెంటులో వాచ్మేన్గా పని చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్ చిన్న గదిలో మా కుటుంబం ఉంటోంది. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా గది వరదలో మునిగిపోయింది. ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. కనీసం వంటపాత్రలు కూడా లేవు. మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వీధిలో తెలిసిన వారి డాబా మీద ఉండమని ఆశ్రయం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నాం. ఎమ్మెల్యే బొండా ఉమా రూ.5 బిస్కట్ ప్యాకెట్లు పంచి వెళ్లిపోయారు. వాటితో కడుపు నింపుకోవాలా? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’ – వెంకటరావు, వాచ్మేన్, కండ్రిక -
AP Floods: ఎటు చూసినా ఆక్రందనలే
జీవనోపాధిని దెబ్బతీసిందిశనివారం అందిన పింఛను డబ్బుల్లో రూ.3,500 పెట్టి సిగరెట్లు, ఇతర సరుకులు తెచ్చి షాపులో పెట్టా. ఆదివారం తెల్లవారేసరికి నాలుగు అడుగుల నీరు రావడంతో షాపులో ఉన్న సరుకులన్నీ కొట్టుకుపోయాయి. షాపు నడిస్తేనే మా జీవనం సాగుతుంది. షాపులో సరుకుల్ని తీసుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దిగలేక.. ఒకవేళ దిగినా నీటి వడిలో కొట్టుకుపోతాననే భయంతో రాలేకపోయా. కనీసం ముందురోజే మాకు సమాచారం ఇస్తే.. కనీసం కొంతమేరైనా నష్టాన్ని నివారించుకోగలిగే వాడిని. మాలాంటి చిరు వ్యాపారులను ఎవరు ఆదుకుంటారు? – ఆర్.కొండలరావు, దివ్యాంగుడు, వైఎస్సార్ కాలనీపదేళ్ల కష్టం వరద పాలైందిపదేళ్ల కష్టాన్ని వరద ఎత్తుకుపోయింది. వైఎస్సార్ కాలనీలోని క్రీడా మైదానం వద్ద చిన్న దుకాణంలో చెప్పులు, దుస్తుల వ్యాపారం చేసుకుంటున్నాను. గత శనివారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో షాపులో ఉన్న చెప్పులు, దుస్తులను రెండు అడుగుల ఎత్తులో పెట్టుకున్నాను. తెల్లవారేసరికి షాపు మొత్తం నీటిలో మునిగిపోవడంతో మొత్తం వరద పాలైంది. మళ్లీ తేరుకోవడానికి కనీసం మూడు నెలలైనా సమయం పడుతుంది. ఈలోగా బతుకు సాగించేదెలా? – కరీముల్లా, వైఎస్సార్ కాలనీ⇒ ‘కట్టుకోవటానికి బట్టల్లేవు. మందులు కొందామన్నా డబ్బుల్లేవు. ఇళ్లల్లోని సామగ్రి లేదు. పిల్లల పుస్తకాలు కొట్టుకుపోయాయి. ఏ అవసరాలు తీరాలన్న కనీస నగదు అందుబాటులో ఉండాలి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అందుకే.. తక్షణ సాయం అందించాలి. ప్రభుత్వం ఇచ్చే ఆహారం మా కాలనీలోకి రావటం లేదు. మేమెలా బతకాలి’ అంటూ ఆంధ్రప్రభ కాలనీకి చెందిన కనకదుర్గ విలపిస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు: వారు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు. ఏరోజుకారోజు కూలికి పోతే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి పోవు. ఇలాంటి వారిని వరద ముంచింది.. దీనికంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకా ముంచుతోంది. విజయవాడను వరద ముంచెత్తి వారం దాటిపోయినా లోతట్టు కాలనీల ప్రజల వైపు ప్రభుత్వం తొంగిచూస్తే ఒట్టు. ప్రధాన రోడ్లలో ఉన్నవారికి సాయం చేస్తున్నట్టు షో చేస్తున్న సర్కారు పెద్దలు లోతట్టు కాలనీల పేదలను పూర్తిగా వరదకు వదిలేశారు. దీంతో దారుణ పరిస్థితుల్లో ఈ కాలనీల్లో పేదలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారానికి పైగా పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నారు. పసిపిల్లలకు పాలు పట్టడానికి పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడంతో దాతల సహాయంపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. యజమానులు అద్దె ఇంటిని ఖాళీ చేయమంటారేమోనని కలత చెందుతూ సాయం చేయాలంటూ బంధువులు, స్నేహితులను అర్థిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని బాధి™è ులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో వరదలకు పేదల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వారం రోజులకు పైగానే జలదిగ్భందంలో ఉండిపోవడంతో పూట గడవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. బయట కూడా అప్పు పుట్టడం లేదు. దాతలు పంచే ఆహారాన్ని పిల్లలకు పెట్టి పెద్దలు పస్తులుంటున్నారు. దాతల ఆహార పంపిణీ కూడా నిలిచిపోతే తమను ఆదుకునేవారెవరని పేద కుటుంబాలు చింతిస్తున్నాయి. ముంపు బాధితులను తక్షణ సాయంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.. విజయవాడ లక్షలాది మంది ముంపు బారిన పడ్డారు. వీరు గత 8 రోజులుగా చుట్టూ నీళ్లను తప్ప వేరే ప్రపంచాన్ని చూడలేదు. ముంపునకు గురైన భవానీపురం, సింగ్నగర్, కండ్రిక, పాయకాపురం, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, వైఎస్సార్ కాలనీ ఇలా వివిధ ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు దొరుకుతాయి. నిర్మాణ రంగం, ఆటోనగర్ కారి్మకులు, ఆటో, రిక్షావాలాలు, ఇతర రోజువారీ కూలీ పనులపై ఆధారపడ్డ పేదలు ఇక్కడే నివసిస్తున్నారు. పగబట్టినట్టు వరద ప్రభావం ఈ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. వరద నీరు ఇంట్లో చేరి కట్టుబట్టలు మినహా ఏ ఒక్క వస్తువు పనికొచ్చే పరిస్థితిలో లేవు. దీంతో ఇంట్లో వంట సామాగ్రి, నిత్యావసరాలు, దుస్తులు ఇలా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయాల్సి ఉంది. వారం రోజులుగా పని లేకపోవడం.. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో పాడైన వస్తువులన్నింటినీ కొనాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఇప్పడు ఎక్కడ నుంచి తేవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికీ చివరి కాలనీల్లో ఆకలి కేకలు.. నందమూరి నగర్, భరతమాత కాలనీ, ఉడా కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, ఇందిరానాయక్ నగర్, రాజీవ్ కాలనీ, శాంతి నగర్, ప్రశాంతి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఊర్మిళా నగర్, పాయకాపురం, కండ్రిక, పాత రాజీవ్ నగర్, తదితర ప్రాంతాల్లో ఆదివారం కూడా నడుములోతు నీరు ఉంది. ఇప్పటికీ ఈ కాలనీలకు తాగునీరు, ఆహారం అందడం లేదు. స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తొంగి చూడటం లేదు. నీట మునిగిన ఇంటి నుంచి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూపించకపోవడంతో మేడలు, మిద్దెలపైనే టార్ఫాలిన్లు కప్పుకుని జీవిస్తున్నారు. ప్రచార యావే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ పెద్దలు లోతట్టు ప్రాంతాలను గాలికొదిలేశారు. దీంతో కనీసం ఆహారం, తాగునీళ్లు కూడా దక్కక పస్తులుండాల్సిన దుస్థితి. చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లోనివారు వరద నీటిలోనే కి.మీ కాలినడకన వచ్చి రోడ్లపై దాతలు ఇచ్చే ఆహార పొట్లాల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. అమ్మో.. అద్దె.. విజయవాడ లోతట్టు కాలనీలో వరదబారిన పడ్డవారిలో పేదలే అత్యధికం. వీరంతా కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. ఇప్పుడు వరదలతో పనులు లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఈ నెల అద్దె కట్టడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా 1న అద్దె కోసం యజమాని ఇంటికి వస్తే.. ఈసారి మాత్రం తెల్లారేసరికే వరద ముంచెత్తింది. దీంతో అద్దె చెల్లించకపోతే యజమానులు ఇళ్లు ఖాళీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెలా వచ్చే ఆదాయంలో 40 శాతం అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. ‘ఇంటి యజమానికి వరద వచ్చిందని చెబితే ఆలస్యంగానైనా అద్దె ఇమ్మనే చెబుతారు. ఊరికే ఎందుకు వదులుకుంటారు? మాకేమో పనులు లేవు. తిండి మాట దేవుడెరుగు.. అద్దె కట్టకపోతే ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేసి రోడ్డున పడాలి. దీనికి తోడు మమ్మల్ని నిండా ముంచిన ప్రభుత్వం ఆలస్యంగానై కరెంటు బిల్లు కట్టమంటుందే కానీ మాఫీ చేస్తామనట్లేదు’ అంటూ వరద బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులకు భారంగా మారి.. వరద ముంపు పూర్తిగా తగ్గనప్పటికీ చాలా మంది నీటిలో నానుతున్న తమ ఇళ్లను చూసుకునేందుకు తిరిగి వస్తున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆశ్రయం పొందుతున్నవారు.. ఎక్కువ రోజులు ఉండి భారంగా మారుతున్నామని బాధపడుతున్నారు. తమ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోయినప్పటికీ తమ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో చిరుజీవులు, ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు.వర్షాలతో పెరిగిన కష్టాలుబుడమేరు వరద కొంతమేర తగ్గిందని భావిస్తున్న తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో ముంపు బాధితుల కష్టాలు మరింత పెరిగాయి, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వరద ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అర్థంకాక గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పలు కాలనీలకు తాగునీటి సరఫరా జరగటం లేదు. విద్యుత్ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. వరదతో వాహనాలు దెబ్బతిన్నాయి.. పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అలస్యమైతే వాహనాలు మరింత దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. వ్యర్థాలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలుతున్నాయని కన్నీరుపెడుతున్నారు.పేదలను దోచుకుంటున్న ప్రభుత్వంముంపు ప్రాంతాల్లో మొబైల్ కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వారం రోజులుగా ఉపాధి లేని పేదల దగ్గర వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న వాస్తవాన్ని విస్మరించింది. ఉచితంగా అందించాల్సిన కూరగాయలకు రేట్లు పెట్టి మరీ విక్రయిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. వర్షాలకు పాడైపోయిన కూరగాయలను అంటగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని చెబుతున్నా అధికార పార్టీకి చెందిన చోటా నాయకులకే అందుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏ సాయం చేయలేదు.. వరద వస్తోందని ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. ముందే చెప్పి ఉంటే మా చావేదో మేం చచ్చే వాళ్లం. మూడు రోజుల పాటు డాబాపైనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ వచ్చి ఆహారం, నీళ్లు ఇవ్వలేదు. ఆకలితో అలమటించి చనిపోతామని నడుము లోతు నీటిలోనే భార్య, కూతురితో సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాను. ప్రస్తుతం అక్కడే ఉన్నాం. ఇప్పటివరకూ ప్రభుత్వం ఏ సాయం ప్రకటించలేదు. – వి. విజయ్కుమార్, పాత రాజీవ్నగర్తక్షణ సాయం కింద రూ.10 వేలు ఇవ్వాలి.. కూలిపనులకు వెళితే రోజుకు రూ.500–700 వచ్చేది. వరద మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాను. దాతలు ఇచ్చే ఆహారంతోనే పూట గడుస్తోంది. ఇంట్లోకి వరదనీరు చేరి వస్తువులన్నీ పాడైపోయాయి. ప్రతి దానికీ డబ్బు కావాలి. ప్రభుత్వం వెంటనే రూ.10 వేలు తక్షణ సాయం ఇవ్వాలి. వరద నష్టం అంచనా వేశాక పరిహారం అందించి ఆదుకోవాలి. లేదంటే మాలాంటి పేదలు జీవనం సాగించలేరు. –సుబ్బారావు, ఎన్ఎస్సీ బోస్ కాలనీఒక్క అధికారి కూడా మా దగ్గరకు రాలేదు.. వరద వచ్చి వారం దాటింది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మా ఇళ్ల వైపు రా లేదు. కాలనీలో లోపలికి వచ్చి అన్నం మెతుకూ పచలేదు. మెయిన్ రోడ్లలో పంచుతుంటే అక్కడకు పోయి ఆహారం కోసం యుద్ధం చేశాం. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి సాయం ఊసే లేదు. – కొరివి లక్ష్మి, కండ్రిక -
స్థానికంగా ఉంటే అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషనర్లు 85 శాతం స్థానిక కోటా కింద అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని.. అందువల్ల తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. వైద్యవిద్య ప్రవేశాల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్ చేస్తూ దాఖలైన 53 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్ధికి స్థానిక కోటా వర్తింపజేయాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో దాదాపు 130 మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. టెన్త్, ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలన్న నిబంధనతో.. ‘జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన కల్లూరి నాగనరసింహ అభిరామ్తోపాటు మరికొందరి తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఏడేళ్లు స్థానికంగా ఉండాలి. ఇది చట్టవిరుద్ధం. లోకల్గా పరిగణించేందుకు కొత్త నిబంధనలు తెస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవోను కొట్టేయాలి’అని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారని స్థానికులు కాదంటున్నారు.. ‘చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారు. వారంతా తెలంగాణలోనే పుట్టి టెన్త్ వరకు ఇక్కడే చదివినా జీవో ప్రకారం వారికి స్థానికత వర్తించదు. అదే తెలంగాణలో పుట్టకపోయినా ఆ నాలుగేళ్లు ఇక్కడే చదివిన వారికి స్థానికత వర్తిస్తుంది. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఫిబ్రవరి 9న నీట్కు నోటిఫికేష¯న్Œ వెలువడగా మే 5న పరీక్ష, జూలై 26 ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఫలితాల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయడం చట్టవిరుద్ధం’అని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు మయూర్రెడ్డి, డీవీ సీతారామమూర్తి వాదించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారున్నారని ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి వాదించారు. నీట్ దరఖాస్తులో అభ్యర్థులే ఆ విషయాన్ని పేర్కొన్నారన్నారు. కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనలనే ఇక్కడ తీసుకొచ్చామని చెప్పారు. మార్గదర్శకాల మేరకు అనుమతించండి.. ‘తెలంగాణకు చెందిన విద్యార్థులకే స్థానిక కోటా వర్తింపజేయాలని ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ) ఉద్దేశం మంచిదే. అయితే తెలంగాణకు చెందిన విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం రూపొందించే ‘నివాస’మార్గదర్శకాల మేరకు ప్రతి కేసును పరిశీలించాలని.. అర్హులైన పిటిషనర్లను స్థానిక కోటా కింద కౌన్సెలింగ్కు అనుమతించాలని కాళోజీ వర్సిటీని ఆదేశించింది. -
Vijayawada Floods: ‘సాయం’ లేక కన్నుమూత
వాంబే కాలనీ జీ బ్లాక్.. 4 రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది.. బయటకు వచ్చే అవకాశమే లేదు.. ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి.. చాలా మందికి తినడానికి తిండి ఏమీ లేదు.. వీరిలో 78 ఏళ్ల రాజశేఖర్ అనే వృద్ధుడు కూడా ఒకరు.. పాస్టర్గా పని చేస్తున్న ఇతను తన భార్య కమలమ్మతో కలిసి జీవిస్తున్నాడు.. వయసు పైబడిన ఇద్దరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. పూట పూటకూ మందులు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఒక్క పూట ఆహారం లేకపోతే షుగర్ స్థాయి తగ్గి నీరసించే వారు.. వరద కారణంగా 2 రోజుల పాటు ఏమీ తినకుండా ఉండిపోవాల్సి వచ్చింది. తాగేందుకు మంచి నీళ్లు లేని దయనీయ స్థితి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఉన్నట్లుండి రాజశేఖర్ తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం ఆహారం, నీరు అందించి ఉంటే బతికి ఉండే వారని చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకుని ఇలా ఎందరో అర్ధంతరంగా తనువు చాలించడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.వాంబే కాలని నుంచి సాక్షి ప్రతినిధి/ సాక్షి నెట్వర్క్ : ఆకలితో చనిపోవటం అనేది ఇటీవల కాలంలో మన ప్రాంతంలో ఎప్పుడూ వినలేదు. అంధ్ర అన్నపూర్ణగా పిలిచే కృష్ణా డెల్టాలో అకలి చావు సంభవించడం యావత్ రాష్ట్రాన్ని విస్మయానికి గురి చేస్తోంది. బుడమేరు వరదను అంచనా వేయడంలో, ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మంగళ, బుధవారాల్లో తిండి, నీరు లేక చనిపోయిన వారే ఎక్కువ. పాస్టర్ మృతి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఇందిరానాయక్ నగర్లో ఓ మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు చెప్పారు. పాముల కాలువ వద్ద పడవ బోల్తా పడి గల్లంతైన పోతుల దుర్గారావు బుధవారం శవమై కనిపించాడు. పెరుగుతున్న మరణాల సంఖ్యవరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వీరి గోడు మాత్రం ఆలకించడం లేదు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా పలు మృతదేహాలు నీటిలో తేలియాడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ వాటి లెక్క తేలడం లేదు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎవరూ వెళ్లలేదు. ఆ ప్రాంతంలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఇంకెన్ని శవాలు బురదలో ఉన్నాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులు ప్రైవేటు అంబులెన్స్లలోనే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయలేదు. తమవారి ఆచూకీ కోసం.. వరదలో చాలా మంది కొట్టుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా వారి ఆచూకీ లభించలేదు. అయితే మార్చురీలో కొన్ని మృతదేహాలు ఉన్నాయనే విషయం తెలియడంతో గల్లంతు అయిన వారి బంధువులు పెద్ద సంఖ్యలో మార్చురీకి క్యూ కట్టారు. ‘నాలుగు రోజుల క్రితం మా అన్న పోలినాయుడు పనికి వెళ్లి వస్తూ.. వరదలో కొట్టుకుపోయాడు. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లినా పట్టించుకోలేదు. మా కుటుంబ సభ్యులం, మా ప్రాంత వాసులం వెతుకుతున్నాం. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగైతే ఎలా?’ అని న్యూరాజరాజేశ్వరరావుపేటకు చెందిన కరుభుక్త సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. వరద మృత్యురూపంలో కబళించిన వారందరి మృతదేహాలను మార్చురీలో ఉండటంతో తమ వారిని గుర్తించేందుకు వందల సంఖ్యలో ముంపు ప్రాంత ప్రజలు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. అక్కడ కుళ్లి ఉన్న తమ వారి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి ముందే వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడుస్తాడని ఊహించలేదంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న దుర్గారావు మేనత్త అమ్మడమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలిసి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు ఇంటి ముందే వరదలో కొట్టుకు పోయి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో కొట్టుకుపోయి.. ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వచ్చి తమ వారి మృతదేహాలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. అక్కడ కుళ్లి, ఉబ్బిపోయి ఉన్న మృతదేహాలను ఆతృతతో పరిశీలిస్తున్నారు. వారిలో తమ వారు లేక పోవడంతో వెనుతిరుగుతున్నారు. అక్కడ ఉన్న అంబులెన్స్ల వారిని, పోలీసులను ఆరా తీస్తున్నారు. ఇలా సింగ్నగర్, పాయకాపురం, ప్రకాష్నగర్ ప్రాంతాలతో పాటు, వైఎస్సార్కాలనీ ప్రాంతాల నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. డీ కంపోజ్ అయిన మృతదేహాలు చాలా వరకు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. విపరీతమైన దుర్వాసన వస్తున్నప్పటికీ, వరదలో కొట్టుకుపోయిన వారి కుటుంబ సభ్యులు వాటిని వెళ్లి పరిశీలిస్తున్నారు. అడుగు కదలని పరిస్థితి...అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.. మూడు రోజులుగా మృతదేహం నీళ్లలోనే తేలియాడుతున్న దుస్థితి.. వ్యక్తి గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నా, అధికారులు.. ప్రభుత్వం నుంచి కనీస సాయం కరువైంది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఉన్నా.. కేవలం అలంకారప్రాయమే. సింగ్నగర్ పరిధిలోని నందమూరినగర్, ఇందిరానాయక్నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో తమ వాళ్ల కోసం వెతుకుతున్న దృశ్యాలు కంట నీరు తెప్పిస్తున్నాయి. చెట్టుకొకరు.. పుట్టకొకరు..తెల్లారేసరికి ఒక్కసారిగా వరద ముంచేసింది. ఎటు వెళ్లాలో తెలియలేదు. ఇంత ఉధృతంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు. పోనీ వరద ముంచెత్తుతున్నప్పుడైనా బయటకు వద్దామంటే అంత సమయం లేదు. అతికష్టం మీద వచ్చినా ఎక్కడికెళ్లాలో, ఎక్కడుండాలో తెలియదు. సర్కారు ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు తమ ఇళ్లలోనే ఉండిపోయారు. వారిలో వృద్ధులున్నారు. చిన్న పిల్లలున్నారు. అనారోగ్యం పాలైన వారున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు. వారిని ఎవరూ పట్టించుకోలేదు. కనీసం మందులు సమకూర్చలేదు. తాగునీరు, ఆహారం లేక, ఆకలితో, అనారోగ్యంతో ఎంతో మంది అభాగ్యులు ఇళ్లలోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు సాయం కోరేందుకు, అపాయం నుంచి తప్పించుకునేందుకు బయటకు వచ్చి వరద నీటిలో కొట్టుకు పోయారు. అలాంటి వారి మృతదేహాలు చెట్టుకొకటి, పుట్టకొకటిగా వేలాడుతున్నాయి. సింగ్నగర్ ప్రాంతంలోని ఇందిరానాయక్ నగర్లో మృతదేహం ఉందని స్ధానికుల ద్వారా తెలుసుకున్న ‘సాక్షి’ ఆ సమాచారాన్ని సహాయక చర్యల కోసం వచ్చిన జాతీయ విపత్తు నిర్వహణ బలగాల(ఎన్డీఆర్ఎఫ్)కు తెలియజేసింది. సాయిబాబా గుడి వీధిలో ఇంటి గోడపై అనాథగా పడి ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించింది. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బోటు సాయంతో ఒడ్డుకు చేర్చింది. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తరలించారు. ఇలా ఎవరూ గుర్తించని మృతదేహాలు ఆ వరదలో ఇంకా చాలానే ఉన్నాయి. ముంపు కాస్త తగ్గుముఖం పట్టడంతో అవన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అంతిమ యాత్రకు కూడా నోచుకోకుండా, కనీసం బయటకుతీసేవారు లేక చాలా వరకూ కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిధిలోని మునేరులో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన తోట శ్రీనివాసరావు(40)గా గుర్తించారు. అయ్యా.. ఈయన (ఫొటో చూపుతూ) ఇక్కడున్నాడేమో కొంచెం చూసి చెప్పండి.. ఇంట్లోంచి బయట పడదామని వెళ్తూ మా కళ్లెదుటే వరదలో కొట్టుకుపోయాడు. ఏమయ్యాడో ఏమో.. ఇక్కడ ఉండకూడదని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఓ వృద్ధురాలు విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఉన్న వారితో అంటున్న మాటలు అక్కడున్న వారందరికీ కంట నీరు తెప్పించాయి. ఇలాంటి వాళ్లు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రికి ఇదే పనిపై వచ్చి వెళ్లడం దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. గ్రౌండ్ ఫ్లోర్లో చిక్కుకు పోయిన వారు, గుడిసెల్లో ఉన్న వారు ఏమై ఉంటారోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మనిషిని బట్టి బోటు రేటుఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు షేక్ అమీనా. ఈమెది విజయవాడ పాయకాపురం ఏరియాలోని పాకిస్థాన్ కాలనీ. ఆమె ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. పీకల్లోతు నీటిలోనే నాలుగు రోజులు గడిపారు. కాస్త వరద తగ్గడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరు కిలోమీటర్లు నడిచి బయటకు వచ్చారు. వరదలో చిక్కుకున్న తమను ఎవరూ పట్టించుకోలేదని అమీనా తెలిపారు. ఓట్ల కోసం మా ఇంటి ముందుకు వచ్చిన నాయకులు... ఇప్పుడు కనీసం మేం ఎలా ఉన్నామో అని చూసేందుకు కూడా రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రాంతంలో ఒకటి, రెండు బోట్లు తిరుగుతున్నాయని, డబ్బులున్న వాళ్ల వద్దకే అవి వెళుతున్నాయని తెలిపారు. మనిషిని చూసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, రూ.300 తక్కువ ఇస్తే తీసుకువెళ్లలేమని తెగేసి చెప్పారని వాపోయారు. ఇక చేసేదేమీ లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరు కిలోమీటర్లు నీటిలో నడిచి బయటకొచ్చామని, ప్రాణాలతో బయటపడతాం అనుకోలేదని అమీనా కన్నీటి పర్యంతమయ్యారు.జీవనోపాధిని దెబ్బతీసింది వరద ముంపు జీవనోపాధిని దెబ్బతీసింది. రూపాయి.. రూపాయి కూడబెట్టుకుని కిరాణా దుకాణం పెట్టుకున్నాం. వరద కారణంగా మా కష్టార్జితం మొత్తం పోయింది. షాపులోకి 5 అడుగుల నీరు వచ్చి మొత్తం నాశనం చేసింది. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ముంపు నష్టం నుంచి తేరుకోవాలంటే ఎంతకాలం పడుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసంతి కేఎల్రావునగర్ -
Heavy Rains: విజయవాడ విలవిల
సాక్షి విజయవాడ: ముంచెత్తిన అతి భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చోవడంతో విజయవాడలో మూడున్నర లక్షల మందికిపైగా వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. చుట్టుముట్టిన నీళ్ల నుంచి బయటకు రాలేక, కనీసం తాగునీరు కూడా అందక అల్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందనే అభిప్రాయం అధికారవర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. అతి భారీ వర్షాలు కురవడం.. కృష్ణా, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పల్లపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేయలేదు. కృష్ణా నదికి భారీ వరద వస్తున్న సమయంలోనే బుడమేరు ఉప్పొంగింది. కృష్ణా వరద ప్రవాహం ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో బుడమేరు కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 లాకులను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తేశారు. ఫలితంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల నుంచి బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. 30 వేల క్యూసెక్కుల ప్రవాహం సింగ్ నగర్, ఇందిరా నాయక్ నగర్, వాంబే కాలనీ, దేవీనగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, న్యూరాజరాజేశ్వరిపేట, కండ్రిగ, వైఎస్సార్ కాలనీసహా పలు ప్రాంతాలను ముంచేసింది. నగరంలో 12 డివిజన్లు పూర్తిగా మునిగాయి. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పోటెత్తిన వాగులతో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి తగినంత నిధులు, సహాయ సామగ్రిని అందించాల్సిన సీఎం చంద్రబాబు తన కరకట్ట నివాసం వరదలో చిక్కుకోవడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కార్యాలయాల్లో గడుపుతూ బస్సులో బస పేరుతో డ్రామాకు తెర తీశారు. సీఎం నివాసాన్ని వరద నుంచి కాపాడేందుకు దాదాపు 25 ట్రక్కుల ఇసుకను తరలించినా లాభం లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. మోటార్లతో నీటిని తోడాల్సి వచ్చిందంటే సీఎం ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. చట్టాలను తుంగలో తొక్కి తాను నివాసం ఉంటున్న అక్రమ సౌధం కృష్ణా వరదలో మునిగిపోయిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్థరాత్రి పూట పర్యటన పెట్టుకున్నారు. వరద బాధితులకు సహాయం అందించడంలో నిమగ్నం కావాల్సిన అధికారులు సీఎం పర్యటిస్తుండడంతో ఆయన చుట్టూ చేరిపోయారు. దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. తాగునీరు, ఆహారం అందకం పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా మహా విపత్తు సంభవించినప్పుడు ఆ దేశ అధినేతలు, ప్రధానులు సహాయక చర్యలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయడం సాధారణం. సహాయ చర్యలు ముగిశాక క్షేత్ర స్థాయిలో బాధితులను పరామర్శించి సంతృప్తికరంగా సాయం అందిందో లేదో ప్రధానులు, ముఖ్యమంత్రులు తెలుసుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రజలను అప్రమత్తం చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించారు.అర్ధరాత్రి హడావుడివరద సహాయ చర్యల్లో విఫలమవడంతో ఆ విషయం గురించి చర్చ జరగకుండా శనివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు చంద్రబాబు డ్రామా నడుపుతూనే ఉన్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించకుండా తాను మాత్రం అక్కడే ఉండి వరుస సమీక్షలు, మీడియా సమావేశాలు, పర్యటనలతో హడావుడి చేశారు. మూడుసార్లు మీడియా సమావేశాలు పెట్టి రెండుసార్లు సింగ్నగర్లో పర్యటించారు. ఒకవైపు లక్షలాది మంది వరద నీటిలో చిక్కుకుపోయి ఉంటే సాయంత్రం ఒకసారి వెళ్లి రెండు గంటలు షో చేశారు. మళ్లీ రాత్రి 11.30 గంటలకు సింగ్నగర్ వెళ్లి హంగామా నడపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. షో చేయడం మినహా బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. నగరంలో ముంపు ప్రాంతాలు.. బుడమేరు పొంగటంతో అజిత్సింగ్నగర్, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఎల్బీఎస్నగర్, వాంబేకాలనీ, అయోధ్యనగర్, మధురానగర్, రామకృష్ణాపురం, మధురానగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్న, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, పైపులరోడ్డు, కండ్రిక, పాయకాపురం, శాంతినగర్, ప్రశాంతినగర్, జక్కంపూడి, పాతపాడు, నైనవరం, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, వించిపేట, భవానీపురం హెచ్బీ కాలనీ, ఉర్మిళానగర్, విద్యాధరపురం, గొల్లపూడి, రాయనపాడు, నల్లకుంట, గుంటుపల్లి నీట మునిగాయి. సంబంధాలు పూర్తిగా తెగిన కాలనీలుసింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరినగర్, భరతమాత కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ వాంబే కాలనీ, అయోధ్యనగర్, ఊర్మిళా నగర్ ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ 1.5 లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. మొత్తంమ్మీద సుమారు మూడున్నర లక్షల మందికి పైగా వరద ముంపు బారిన పడ్డారు.కళ్లెదుటే కొట్టుకుపోయాయి..మంచాలు.. టీవీలు.. కార్లు.. బైకులు.. కళ్లముందే క్షణాల్లో కొట్టుకుపోవడంతో నిర్వేదంగా మిగిలిపోయారు. సింగ్నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ, రాజీవ్నగర్, కండ్రిక, రామకృష్ణాపురం, దేవినగర్, మధ్యకట్ట, దావుబుచ్చయ్యకాలనీ, గద్దెవారి పొలాల పరిసర ప్రాంతాల్లో ఆదివారం కనిపించిన దయనీయ పరిస్థితి ఇదీ!! బుడమేరు ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పైనుంచి వరద రావడంతో శనివారం రాత్రే కొత్తూరు సమీపంలోని బుడమేరు గేట్లను ఎత్తివేశారు. ఈ సమాచారాన్ని బుడమేరు పరిసర ప్రాంతాల నివాసితులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో లక్షలాది మంది కట్టుబట్టలతో రోడ్ల పాలయ్యారు.సీఎం ఎదుట బాధితుల ఆక్రోశంవిజయవాడలో ముంపు ప్రాంతాల ప్రజలు ఆదివారం ఉదయం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. రహదారులు మునిగిపోవడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం వారిని బయటికి తెచ్చే ప్రయత్నం చేయకుండా వారి ఖర్మకు వదిలేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భోజనం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేకపోయారు. ఇంత మంది వరదలో చిక్కుకుంటే ఏడు మాత్రమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయంత్రం వరకు రెస్క్యూ టీములు, పడవలు లేవు. కొంత మంది ట్రాక్టర్ల సహాయంతో బయటపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తమను పట్టించుకున్న నాథుడే లేడని, కనీసం తాగునీరు కూడా అందలేదని స్వయంగా సీఎం చంద్రబాబు ఎదుట బాధితులు ఆక్రోశించారు. విజయవాడలో వరదలో చిక్కుని ఇద్దరు మరణించగా మరొకరు గల్లంతు అయ్యారు.పిల్లల కోసం ఉరుకులు.. పరుగులు..సింగ్నగర్, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ పరిసర ప్రాంతాల్లో వారంతా దాదాపుగా కూలి పనులు చేసుకునేవారే. తెల్లవారుజామున పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి పనులకు వెళ్లిపోయారు. సింగ్నగర్ పరిసర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నట్లు తెలియడంతో ఉరుకులు పెట్టారు. సీఎం బందోబస్తు పేరుతో అధికారులు వారిని అడ్డుకున్నారు. సాయంత్రానికి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని లోపలకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు.. కన్నవారి కోసం చిన్నారులు తల్లడిల్లారు. న్యూ రాజరాజేశ్వరీపేట, ఇందిరా నాయక్నగర్, నందమూరినగర్, సింగ్నగర్ ప్రాంతాలన్నీ నీట మునిగినా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదు. దీంతో బాధితులు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనతో అధికార యంత్రాంగం అంతా సహాయ చర్యలను పక్కనబెట్టి అక్కడకు చేరుకుంది. -
కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ సజావుగా సాగిన పంటహక్కు సాగుదారు పత్రాల (సీసీఆర్సీ) జారీ ప్రక్రియలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని కాజేయడమే లక్ష్యంగా కౌలు కార్డులను అధికార టీడీపీ నేతలు కాజేస్తున్నారు. కనీసం సెంటు భూమి కూడా లేని వారితోపాటు సాగుకు దూరంగా ఉండే టీడీపీ కార్యకర్తలు సైతం సీసీఆర్సీ కార్డులు పొందుతున్నారు. భూ యజమాని అంగీకారం అనే నిబంధన వల్ల మెజార్టీ కౌలు రైతులు నష్టపోతున్నారనే సాకుతో సీసీఆర్సీ చట్టం స్థానంలో కౌలురైతు చట్టం–2024 తెస్తున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. అయితే కొత్త చట్టం ముసాయిదా ఇంకా సిద్ధం కానందున పాత చట్టం ప్రకారమే నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీలు జారీ చేయాలి. గత సర్కారు ఏటా సగటున 5.19 లక్షల చొప్పున ఐదేళ్లలో 25.93 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేసింది. 2023–24లో రికార్డు స్థాయిలో 8.35 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. 2024–25 సీజన్లో కనీసం 10 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా మే 15వతేదీ నుంచే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా ఎన్నికల కోడ్ సాకుతో విపక్షాలు అడ్డుకోవడంతో సీసీఆర్సీ కార్డుల జారీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జూన్ నెలాఖరులో సీసీఆర్సీల జారీ ప్రక్రియ చేపట్టింది. అయితే కేవలం 40 రోజుల్లో 8.50 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ కావడం సందేహాలకు తావిస్తోంది.టీడీపీ నేతల బెదిరింపులుఇది మా ప్రభుత్వం.. భూ యజమాని అంగీకారంతో పనిలేదు.. మేము చెప్పిన వారికే కౌలు కార్డులు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పలు చోట్ల క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. వాస్తవానికి కౌలుకిచ్చిన సాగుదారుడికే కౌలు కార్డు ఇచ్చేందుకు భూ యజమాని అంగీకారపత్రం ఇవ్వాలి. అలాంటిది భూయజమాని తాను కౌలుకిచ్చిన భూమినే భాగాలుగా విభజించి తమ కుటుంబ సభ్యుల పేరిట, తమకు నచ్చిన వారి పేరిట అంగీకార పత్రాలిస్తూ బోగస్ సీసీఆర్సీలు పొందుతున్నట్టు గుర్తించారు. మరికొన్ని చోట్ల భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి దొడ్డిదారిన కౌలుకార్డులు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా కార్డుకు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.పెట్టుబడి సాయం కాజేసేందుకే..రూ.20 వేల పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ ఫలాలు పొందేందుకు ఈ కార్డే ప్రామాణికం కావడంతో టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులు, కార్యకర్తల పేరిట సీసీఆర్సీలు పొందుతున్నారు. దీనివల్లే పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్డులు జారీ అయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల్లో మూడో వంతు బోగస్ కావచ్చని భావిస్తున్నారు.విచారిస్తున్నాం..సీసీఆర్సీల జారీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో భూమి ఖాతా ఆధారంగా సీసీఆర్సీలు జారీ చేస్తారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో సభ్యులు ఒకే భూమిపై వేర్వేరుగా సీసీఆర్సీ కార్డులు పొందుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆరోపణలపై సీఎంఆర్వో పీడీని వివరణ కోరాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం.– ఎస్.ఢిల్లీరావు, డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియలను సైతం నిలిపివేసే దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో 2 వేలకు పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశం నిర్వహించి.. నోటిఫికేషన్లు రద్దు చేస్తే తలెత్తే న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించినట్లు సమాచారం. జీరో వేకెన్సీకి తిలోదకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు, డాక్టర్లు, నర్సుల, ఇతర వైద్య సిబ్బంది కొరత లేకుండా జీరో వేకెన్సీ(ఎప్పటికప్పుడే ఖాళీలు భర్తీ) పాలసీని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే.. రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా పారామెడికల్తో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ)లు 2 వేలకు పైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జీరో వేకెన్సీ పాలసీకి తూట్లు పొడిచింది. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ 18 నోటిఫికేషన్లనూ రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. తుది దశలో ఉన్నా.. రద్దుకే మొగ్గు! వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన 18 నోటిఫికేషన్లకు సంబంధించి.. మూడింటిలో ఇప్పటికే తుది మెరిట్ జాబితాలు విడుదలయ్యాయి. మరో 8 నోటిఫికేషన్లలో ప్రాథమిక మెరిట్ జాబితాలు జారీ చేయగా.. ఏడింటిలో ప్రాథమిక మెరిట్ జాబితాలు విడుదల చేయాల్సి ఉంది. ఇలా దాదాపు ముగింపు దశలో ఉన్న నోటిఫికేషన్లను రెండు నెలలకు పైగా పెండింగ్లో ఉంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అలాగే విజయనగరం వైద్య కళాశాలలో 60 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి.. గత నెలలో రెండో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత రెండో నోటిఫికేషన్ను కూడా నిలిపివేసింది. ఇక మచిలీపట్నం వైద్య కళాశాలలో 96 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఒక విడత ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎంపిక జాబితా మాత్రం ఇంకా ప్రాసెస్లోనే ఉండిపోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో.. తమ జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య సేవలపై ప్రభావం.. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో విష జ్వరాలు విలయతాండవం చేస్తున్న తరుణంలో.. బోధనాస్పత్రుల్లో పారామెడికల్, ఇతర సహాయక సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కాపురం బోధనాస్పత్రిలో రోజుకు 500 నుంచి 600 మేర ఓపీలు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీíÙయన్లు 25 మంది అవసరమవ్వగా.. ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. రోజుకు 300 వరకు ల్యాబ్ పరీక్షలు చేయాల్సిన చోట.. ఐదుగురే ఉండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయితే గానీ ఈ సమస్య పరిష్కారమవ్వదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. -
అది నేనే.. ఇదీ నేనే
యూపీఎస్ను మేం వ్యతిరేకిస్తున్నాంకేంద్రం తెచ్చిన యూపీఎస్ను మేం వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉద్యోగులకు నష్టదాయకం. ఉద్యోగుల సంపదంతా ప్రభుత్వానికి పుణ్యానికి ఇవ్వడమే. ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. – ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘంముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను తెస్తే ఆయన గగ్గోలు పెట్టారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను తెస్తే బాబు కిమ్మనడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నా తనపై ఉన్న కేసులకు భయపడి యూపీఎస్ను వ్యతి రేకించే సాహసం చంద్రబాబు చేయడం లేదు. దీంతో ఆయన వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగులను నిలువెల్లా మోసం చేయడమే బాబు ఉద్దేశమని నిప్పులు చెరుగుతున్నారు.సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల పింఛన్ విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మెరుగైన పింఛన్ వచ్చేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెస్తే చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. జీపీఎస్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ప్రచారం చేశారని ఉద్యోగుల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంయక్తంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పేరుతో జీపీఎస్ తరహాలోనే తెచ్చినా నోరుమెదపకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి అద్దం పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ తరహాలోనే యూపీఎస్ను తెచ్చినా.. దాదాపు జీపీఎస్ తరహాలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను తెచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నా చంద్రబాబు వ్యతిరేకించకపోవడంపై మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు, కూటమి నేతలు సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన యూపీఎస్ వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నా నోరు విప్పకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులను దగా చేయడమే ఆయన ఉద్దేశమని దుయ్యబడుతున్నారు. బయటపడ్డ చంద్రబాబు మోసపూరిత నైజం.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై 12న జీపీఎస్ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు మెరుగైన విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించలేదని ధ్వజమెత్తుతున్నారు. జీపీఎస్ అమలు కోసం గెజిట్ విడుదల చేయించడంతోనే చంద్రబాబు మోసపూరిత నైజం బయటపడిందని నిప్పులు చెరుగుతున్నారు. గెజిట్ విడుదల విషయం మీడియాలో రావడంతో ‘చంద్రబాబు ఆగ్రహం’ అంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని, గెజిట్ అమలు నిలిపేయాలని ఆదేశించారంటూ కూడా కథనాలు అచ్చేశాయని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు గెజిట్ నిలుపుదల ఉత్తర్వులే జారీ కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాబు ఆగ్రహమనేది ఉత్తి మాటేననేది.. గెజిట్ నిలుపుదల చేయకపోవడంతోనే అర్థమైందని మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం తెచ్చిన యూపీఎస్ను చంద్రబాబు, కూటమి నేతలు వ్యతిరేకించకపోవడంతో ఆ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ చేయించడంతో పాటు ఇప్పుడు కేంద్రం తెచ్చిన యూపీఎస్ను చంద్రబాబు వ్యతిరేకించలేదంటే సీపీఎస్ ఉద్యోగులను నిలువునా మోసం చేయడమేనని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందో మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడంలో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం యూపీఎస్ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూటమి నేతల ద్వంద్వ వైఖరికి అర్థం పడుతోందని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పెన్షన్ భిక్ష కాదు.. ప్రాథమిక హక్కు..తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్.. ఉద్యోగులను పూర్తిగా ముంచే స్కీమ్. చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పింఛన్ పథకాన్ని అందించాలి. పెన్షన్ భిక్ష కాదు.. ప్లాన్లతో వచ్చే డబ్బు కాదు. ఇది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఉద్యోగుల ఆకాంక్షలకు సోమనాథన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడున్న ఎన్పీఎస్ పథకంలో రిటైరయ్యాక వచ్చే 60 శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎలాంటి ప్లాన్లతో సంబంధం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 35, 40 ఏళ్ల పాటు ఉద్యోగి సర్వీసులో బేసిక్ పే, డీఏలో పది శాతం నొక్కేసి.. మ్యాచింగ్ గ్రాంట్ అంటూ దానికి కొంత పోగేసి, చివర్లో రిటైరయ్యాక మొత్తం కార్పస్ ఫండ్ను మింగేసే కుట్రే యూపీఎస్. ఉద్యోగుల పెన్షన్ సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం?. – సీఎ దాస్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుయూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్లో ప్రాన్ ఎమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుని 50 శాతం పింఛన్ను డీఆర్తో కలిపి ఇస్తారా? లేక ప్రస్తుత పింఛన్ పథకంలో ఉన్నట్లు 60 శాతం ప్రాన్ అమౌంట్ ఇస్తారా? అనేది తేల్చాలి. అలాగే యూపీఎస్ పెన్షన్ను ఏ విధంగా, ఎవరి ద్వారా చెల్లిస్తారనేదానిపైనా స్పష్టత ఇవ్వాలి. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగికి కుటుంబ పింఛన్ 60 శాతం చెల్లిస్తారా? స్వచ్ఛంద పదవీ విరమణ విషయంలో కనీస సర్వీస్ ఎంతగా నిర్ణయిస్తారు? రిటైర్ అయ్యాక అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తం తిరిగి ఉద్యోగికి చెల్లిస్తారా? లేకపోతే యూపీఎస్, లంప్సమ్ ఎమౌంట్తో సరిపెడతారా? వీటన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలి. – కె.సతీష్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకుడు -
నిలువెల్లా నిర్లక్ష్యం.. అచ్యుతాపురం ఘటనలో సర్కారు అలసత్వం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది. ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి విషాద సమయాల్లో ప్రజాప్రతినిధులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తోడుగా నిలవడం కనీస బాధ్యత. అయితే అధికార పార్టీ నేతలెవరూ అటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సీఎం చంద్రబాబుతోపాటు పర్యటనలో పాల్గొనడం, ఆయనతో పాటే కేజీహెచ్కు చేరుకుని తూతూమంత్రంగా కలవడం మినహా అధికార పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఘటన జరగగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, మంత్రి గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి తీరుకు నిదర్శనం.తనిఖీలకు తిలోదకాలు..పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లకు అలవాటుపడ్డ కూటమి నేతలు అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల అధికారులు కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆడిట్ రిపోర్టు సమర్పించేవారు. ఈమేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తనిఖీలకు తిలోదకాలు ఇవ్వడంతో పరిశ్రమల్లో నిర్లక్ష్యం పొడచూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎసైన్షియా కంపెనీ ముందు మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల పడిగాపులు ‘20 పాయింట్ ఫార్ములా’ విస్మరించడంతో..విశాఖలో 2020లో ఎల్జీ పాలీమర్స్ ప్రమాద ఘటన తరువాత నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు ‘20 పాయింట్ ఫార్ములా’ అమలులోకి తెచ్చింది. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ వస్తే ఆ సంస్థ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పరిగణించారు. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి 20 పాయింట్ ఫార్ములా అమలుపై పర్యవేక్షణ కొరవడటంతోపాటు తనిఖీలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అంచనాలకు అందని అసమర్థతవిశాఖ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రెడ్ కేటగిరీలో ఉన్న రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాల్సి ఉండగా, రెండు గంటల తర్వాత కానీ కలెక్టర్, ఎస్పీ అందుబాటులోకి రాలేదనే విమర్శలున్నాయి. మృతుల విషయంలో తొలుత ఇద్దరు ముగ్గురేనని చెబుతూ వచ్చిన అధికారులు రాత్రి 8 గంటల సమయంలో 14 అని తేల్చారు. చివరకు 17 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇది అతి పెద్ద ప్రమాదమనే విషయాన్ని పసిగట్టడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేదు. కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది. ఆందోళనకు దిగితేగానీ ఆలకించలేదు..తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా తొలుత అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే విశాఖకు తరలించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు సహనం నశించిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగితేగానీ రాత్రికి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించలేదు. రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టించుకునే దిక్కులేక..విపత్తులు, దుర్ఘటనల సమయాల్లో వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. తాజా ఘటనలో మాత్రం అది ఎక్కడా కానరాలేదు. మృతదేహాలు తరలించిన అంబులెన్సులు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని కేజీహెచ్ సిబ్బంది సూచించగా మిగిలిన భౌతిక కాయాలను తెచ్చేందుకు తాము వెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. సమన్వయం కొరవడటంతో మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. దీంతో న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో వార్తలను చూస్తూ బాధిత కుటుంబాలు తల్లడిల్లాయి. బాధితుల బంధువులను మానవత్వంతో ఓదార్చేందుకు ఏ ఒక్క అధికారీ అందుబాటులో లేకుండా పోయారు. రాత్రి నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక ప్రమాదం ఎలా సంభవించిందనే సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది.గంటలో పరిహారం ఇస్తామని చెప్పి..మృతుల కుటుంబ సభ్యులకు గంటలో రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే, ఆయన వెళ్లిపోగానే అధికారులు మాట మార్చేశారు. మృతదేహాలను తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని, దారి ఖర్చులకు ముందుగా రూ.10 వేలు ఇస్తామనడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు నిర్దిష్ట హామీ లభించే వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. దీంతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశం అనకాపల్లి జిల్లాలో ఉండగా విశాఖ కలెక్టర్ మాట ఎలా విశ్వసించాలని బాధిత కుటుంబాలు ప్రశ్నించాయి. అనంతరం అనకాపల్లి జేసీ జోక్యం చేసుకుని పరిహారానికి రెండు, మూడు, రోజులు పడుతుందని చెప్పారు. తమకు ప్రభుత్వంపై నమ్మకంలేదని బాధితులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత కేజీహెచ్కు మ.1.45 గంటల ప్రాంతంలో సీఎం వచ్చి మరో గంటలో పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కానీ, సా.5 గంటల వరకు ఆ ప్రస్తావనే లేకపోవడంతో బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు రూ.కోటి పరిహారం ఇస్తున్నట్లు ప్రొసీడింగ్స్ కాపీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాత్రి 7 గంటలకు శవ పంచనామాలు పూర్తిచేశారు. -
ఇందుకా మీకు ఓట్లేసి గెలిపించింది..
-
హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు శుక్రవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురు వారం జీవో జారీ చేస్తే శుక్రవారం వారి ప్రమాణం ఉంటుంది. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ సోమయ్య, కోటేశ్వరమ్మలకు 1964 ఆగస్టు 30న జన్మించారు. 10వ తరగతి మచిలీపట్నంలోని జైహింద్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కాలేజీలో.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయ విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. 1989 ఏప్రిల్ 5వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో చేరి ప్రాక్టీస్ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం 2016 నుంచి 2019 వరకు శ్రీకాకుళంలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జిగా పని చేశారు. అనంతరం తిరుపతిలోని ఫ్యామిలీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.వెంకట జ్యోతిర్మయి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలిలో పీవీకే శాస్త్రి, బాల త్రిపుర సుందరి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలోనే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్లో ఎంపికై.. ఫ్యామిలీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్మన్, ఎస్సీ ఎస్టీ కోర్టు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ఈ ఏడాది మే 16న ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. -
తప్పుడు ఆరోపణలు నిరూపించడానికే...
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరాక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫైళ్లను కాల్చివేయడం ఒక ఆనవాయితీగా మారినట్లు కనిపిస్తోంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో రికార్డులు తగలబడితే ఏకంగా డీజీపీ, సీఎస్లు హెలికాప్టర్లో అక్కడకు వెళ్లడం ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు తన తరహా మార్కు రాజకీయాలను చూపించడంలో దిట్ట. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరగలేదనే సంగతి నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం పది రోజుల్లోనే ప్రభుత్వ పెద్దలందరికీ అర్థమైంది. తాము చేసిన ఆరోపణలను నిరూపించడానికి దారిలేక రికార్డులను వాళ్లే తగలబెట్టిస్తున్నట్లుంది. ‘వైసీపీవాళ్లు... వాళ్లు చేసిన అక్రమాలు బయటపడకుండా ఫైళ్లను తగలబెట్టిస్తున్నార’నే ప్రచారం చేయడానికి ఈ తరహా దహన కార్యక్రమాలు చేపడు తున్నా రనేది ప్రజల అవగాహన.ఎన్నికల ఫలితాల ప్రకటనకు, ప్రమాణ స్వీకారానికి మధ్య వారం రోజుల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలోనే గతంలో వారికి వచ్చిన సమాచారాన్ని సరిచూసుకునే వెసులుబాటు కలిగింది. అందులో భాగంగానే 20 ఏళ్ల తరు వాత 22 ఏ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా తెరపైకి తీసుకొచ్చి జగన్ మీద తాము చేసిన తప్పుడు ప్రచారానికి వాస్తవ రూపం తీసుకురావాలని భావించారు.అందులో భాగంగా అధికార యంత్రాంగాన్ని 24/7 పనిచేయించి రికార్డులను జల్లెడపట్టారు. ఎక్కడా లోపం లేకపోవడంతో రికార్డులను కాల్చివేతకు పూనుకుంటున్నారు. నేరం మాత్రం వైఎస్సార్సీపీపై వేస్తున్నారు. అయితే, దొంగ ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడన్న నిజాన్ని ఇక్కడ వారు మరచి పోయారు. ఫిజికల్గా ఉన్న ఫైళ్లను తగులబెట్టారేగానీ ఆన్లైన్లో ఉన్న ఫైళ్ల సంగతిని మరచిపోయినట్లు ఉన్నారు. అదీకాకుండా ఇదే ఫైలుకు సంబంధించిన వివరాలు కింద ఉండే ఎమ్మార్వో కార్యాలయంలోనూ, పైన ఉండే కలెక్టర్ కార్యాలయంలోనూ ఉంటాయి. వాటిని ఏం చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఆ వాస్తవం ప్రజలకు తెలుస్తుందని గమనించి బాబు తదితరులు ఇదే తరహాలో మరికొన్ని ఘటనలు చూపి ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కొంతమంది అధికారులపై వారికి తెలియకుండానే విచారణ నిర్వహించారు. వారి విచారణలో ఏం తేలకపోయినా వారి అరెస్టులు, విచారణలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 16 మంది ఐపీఎస్లకు మెమో జారీ చేశారు.అనూహ్య పరిణామాల నేపథ్యంలో అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు... జగన్ పార్టీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని ప్రయత్నిస్తు న్నట్లుంది. వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలు, ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం మూసేసిన కేసులు తిరగదోడటం, ఆ పార్టీ కార్యకర్తలపై తమ పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం... వంటివన్నీ ఇందులో భాగమే. ‘సూపర్ సిక్స్’ అమలును వదిలి అమరావతి రాజధానిపై దృష్టిపెట్టడం, కళాశాల ఫీజుల పెంపు నిర్ణయం... ఇలా అనేక అంశాలపై ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిని గమనించిన ప్రజలు ఇప్పుడు పేదలకు–పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ జగన్ చేసిన కామెంట్ను గుర్తు చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణగా రాజధాని ప్రాంతం ఆర్5 జోన్లో పేదలకు ఇచ్చిన ఇళ్లను చంద్ర బాబు సర్కార్ రద్దుచేసిన అంశాన్ని ప్రజలు చూపిస్తున్నారు.తిరుమల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వాడితే తప్పన్న బాబు... చంద్రగిరి అభివృద్ధికి ఇప్పుడు ఇవే నిధులు వాడుతున్నారు. ఉపాధ్యాయులతో మరుగు దొడ్ల ఫొటోలు తీయించడంపై తప్పుబట్టిన బాబు సచివాలయ ఉద్యోగులతో ఇదే పని చేయిస్తున్నారు. ఇసుకను తమ నేతలకు దోచి పెడుతున్న విషయాన్నీ ప్రజలు గమనిస్తు న్నారు. నిజంగా ప్రజల్లో ఇంత త్వరగా ప్రస్తుత ప్రభుత్వంపై పెదవి విరుపు వస్తుందని ఎవరూ ఊహించలేదు.పాలనపై దృష్టిపెట్టాల్సిన పాలకులు వ్యక్తిగత కక్షలపై దృష్టిపెట్టడంతో పాలన అస్తవ్యస్తమవుతోంది. పాత పథకాలు నిలిచిపోవడం ఒక వైపు, ఎప్పుడు ఎవరు ఎవరిని కొడతారో, చంపుతారో తెలియని పరిస్థితి మరోవైపు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ స్థితిలో ప్రజాదరణ పొందిన వాలంటీర్ వ్యవస్థను తీసేసి మళ్లీ ‘జన్మభూమి–2’ తీసుకురావాలని అను కోవడం సరికాదు. ఇదీ మొత్తంగా రెండు నెలల నారా వారి పాలన సాధించిన ఘనకార్యం. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుమొబైల్: 98481 05455 -
సర్కారు ‘షోకాజ్’ కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్ బుక్ టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఇప్పటికే రాక్షసానందం పొందుతున్న టీడీపీ– జనసేన– బీజేపీ సర్కారు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు, అన్యాయంపై ప్రశ్నించే గొంతుకకు తావులేదన్నట్లుగా తన తీరును, భావ దారిద్య్రాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఇందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ.దేశాన్ని కుదిపేసిన కోల్కత ఆర్జీ కార్ ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైద్యశాఖకు సంబంధించిన 33 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పైఅధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇందులో పాల్గొన్నందుకు డీఎంహెచ్ఓ డాక్టర్ జమాల్ బాషా వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు బాషా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని.. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళలే ఉండటం గమనార్హం. నిజానికి.. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సంఘీభావం ప్రకటించి సానుభూతి చూపించాల్సిన ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో రిషితేశ్వరి.. ఇప్పుడు తాజాగా ఈ రెండు నెలల్లో ముచ్చుమర్రి, హోంమంత్రి వంగలపూడి ఇలాకా అనకాపల్లి జిల్లాల్లో బాలికల దారుణ హత్యలపై చలనంలేని మొద్దుబారిన కూటమి సర్కారు.. కోలకత ఘటనపట్ల స్పందించకపోగా అందుకు నిరసన వ్యక్తంచేసిన వారిపై కక్షసాధింపునకు దిగడాన్ని పౌరహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
పింఛన్లపై పిడుగు
సూపర్ సిక్స్ హామీలిచ్చారు.. ఇంకా వాటిని ఎందుకు అమలు చేయడంలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికే అమలవుతున్న పథకాలలో కోతలకు మాత్రం కత్తులు నూరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులన్న కనికరం లేకుండా పింఛన్లు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాబితాలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు నోటీసులు అందాయి. ఇంకా అందుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులిచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్ తొలగించడానికి ఎంపీడీవోలకు ఆప్షన్ ఇచ్చేశారు. కొత్త పెన్షన్ చేర్చడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటంటే పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించబోతున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వబోవడం లేదు.. సాక్షి, అమరావతి: సామాజిక పింఛన్లకు కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరబడి ప్రతి నెలా ఠంఛన్గా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారులకు ‘మీ పింఛను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైంది’ అంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామాల్లో అధికార టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్ చేసి.. స్థానిక అధికారులకు లేనిపోని ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారి పింఛన్ తొలగింపునకు అధికారులు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా గుర్తించిన వారి పేర్లను ప్రభుత్వ అధికారిక సామాజిక పింఛన్ల ఆన్లైన్ పోర్టల్ నుంచి తొలగించే వెసులుబాటును ఆయా మండల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత అధికారులకు మొబైల్ మేసేజ్ రూపంలో సమాచారం ఇచ్చారు. చెప్పినట్లు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి గత ఐదేళ్లలో ఏ పైరవీలు, రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా పింఛన్ డబ్బులు తీసుకున్న పేద లబ్ధిదారులకు మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పట్లో 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాల తరహాలోనే ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వంలోనూ అధికార పార్టీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్ చేస్తున్నారు. స్థానిక అధికారులకు లేనిపోని ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆపై పింఛన్ తొలగింపు నోటీసులు ఇప్పిస్తున్నారు. తాము చెప్పినట్లు చేయాలని కొన్ని చోట్ల బలవంతంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అర్హతను నిరూపించుకోవడానికి గడువివ్వరా? పేద లబ్ధిదారులు తాము పింఛను పొందేందుకు అర్హులమని నిరూపించుకోవడానికి వీలులేకుండా నోటీసులో అసాధ్యమైన గడువు విధిస్తున్నారు. దివ్యాంగులు తమ శరీర వైకల్యాలను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకుని, తాను దివ్యాంగుడిగా నిరూపించుకునే సర్టిఫికెట్లు పొందడానికి ‘సదరం’లో పేర్లు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి స్లాట్లు విడుదల చేస్తూ అవకాశం ఇస్తుంది. స్లాట్లు విడుదలైన మూడు రోజుల్లోనే 90 రోజులకు సరిపడా పేర్ల నమోదు పూర్తయిపోతోంది. మిగిలిన వారు మళ్లీ మూడు నెలల దాకా ఆగాల్సిన పరిస్థితి. అలాంటిది ఓ దివ్యాంగుడు ఎన్నో ఏళ్ల క్రితం వైద్య పరీక్షల అనంతరం తన శరీర వైకల్య సర్టిఫికెట్ పొంది, ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకుంటున్న నేపథ్యంలో.. ‘ప్రస్తుతం నువ్వు అర్హత లేకుండా పింఛను పొందుతున్నావు. నీ శరీర వైకల్యాలకు సంబంధించి 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించుకుని, ఆ సర్టిఫికెట్ అధికారులకు అందజేయాలి’ అని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అంటే ఈ లెక్కన ఉద్దేశ పూర్వకంగా అతని పింఛను శాశ్వతంగా తొలగించేందుకు రంగం సిద్ధమైందని ఇట్టే అర్థమవుతోంది. వృద్ధాప్య పింఛను పొందే లబ్ధిదారులకు ఇచ్చే నోటీసుల్లో కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చి, ఆయా లబ్ధిదారుల ఆధార్లో మొదటి నుంచీ జరిగిన మార్పులు, చేర్పుల వివరాలతో కూడిన (అప్డేట్ హిస్టరీ ఫామ్) ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని నోటీసులు ఇస్తున్నారు. లేదంటే శాశ్వతంగా పింఛన్ రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పింఛను లబ్ధిదారునికి పల్నాడు జిల్లా శావల్యాపురం ఎంపీడీవో జారీ చేసిన నోటీసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో..⇒ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పరిధిలో అక్కడి స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదుల కారణంగా ఆ మండల పరిధిలోని కేవలం 8 గ్రామాల్లో 209 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో షోకాజ్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. ⇒ విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు 60 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో నోటీసులు జారీ చేశారు. ⇒ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం పంచాయతీలో 13 మంది దివ్యాంగ లబ్ధిదారులపై స్థానిక టీడీపీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మండలాధికారులు నోటీసు జారీ చేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని స్థానిక అధికార పార్టీ నాయకుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నందిగాం మండలం నౌగాం పంచాయతీలో ఎనిమిది మంది దివ్యాంగులతో పాటు ఇద్దరు వృద్ధులు, కవిటి మండలంలో 9 మందికి నోటీసులు జారీ చేశారు. ఆమదాలవలసలో 8 మందికి, సరుబుజ్జిలి మండలం వ్యాసలిపేటలో 9 మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించాలన్న టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు 730 మంది లబ్ధిదారులకు అధికారులు నోటీసులు అందజేశారు. ఒక్కో గ్రామంలో 10 నుంచి 50 మంది దాకా నోటీసులు ఇచ్చారు. కనగానపల్లి మండలం వేపకుంటలో 52 మందికి, భానుకోటలో 40 మందికి, నరసంపల్లిలో 25 మందికి, కోనాపురంలో 26 మందికి నోటీసులు ఇచ్చారు. పార్టీ నేతల కనుసన్నల్లో ‘పింఛన్లు’జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ–జనసేన –బీజేపీ కూటమి ప్రభుత్వం జూలైలో తొలిసారి పింఛన్లు పంపిణీ చేసింది. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం కొనసాగినా, ప్రతి చోటా పంపిణీ మొత్తం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలోనూ 2014–19 మధ్య వృద్ధులు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల పంపిణీలో ప్రతి అంశంలోనూ అప్పటి అధికార టీడీపీకి సంబంధించిన జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం విపరీతంగా కొనసాగిన విషయం తెలిసిందే. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు మొదలు, పంపిణీలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి జోక్యం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకం అమలు కొనసాగిన విషయం తెలిసిందే. గత ఐదేళ్ల పరిస్థితికి పూర్తి భిన్నంగా జూలై, ఆగస్టు నెలలో జరిగిన పింఛన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వెంట ఆ ప్రాంతంలోని స్థానిక అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ ఫొటోలు కూడా దిగారు. కొన్ని ప్రాంతాల్లో తమకు ఓటు వేయలేదన్న కారణంతో పింఛను డబ్బులు ఇవ్వకుండా ఆపేయించారు. పింఛన్ల పంపిణీలో ఆధిపత్యం కోసం పలు ప్రాంతాల్లో కూటమి పార్టీ నాయకులు పరసర్పం గొడవలు కూడా పడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్లు పొందేందుకు అర్హత ప్రమాణాలపై అప్పటి జన్మభూమి కమిటీల పేరుతో తనిఖీలు చేపట్టి లక్షల మంది పింఛన్లకు కోత పెట్టారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో 43.11 లక్షల మంది పింఛనుదారులు ఉన్న పరిస్థితిలో 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు.. తదితర పదవులకు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు వేశారు. వారి ద్వారా పింఛన్లపై తనిఖీలు చేయించారు. దీంతో సెపె్టంబర్ నాటికి పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా పింఛన్లను తొలగించారు. అప్పట్లో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జన్మభూమి కమిటీ సభ్యులకే ఎక్కువగా భాగస్వామ్యం కల్పించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి పథకం మంజూరులోనూ లబ్ధిదారులు తమ పార్టీ వారా, కాదా అని నిర్ధారించుకుని.. పక్షపాతం చూపేవారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ రద్దు అయిన లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించి తిరిగి పింఛన్ పొందిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ల -
బాబు సర్కార్కు షాక్!.. జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
-
ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంబేడ్కర్ విగ్రహంపై దాడి తర్వాత వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసింది. ఒకవేళ.. ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.చంద్రబాబు సర్కార్కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు -
AP: మన కేసులు ఎత్తేద్దాం!
ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే.. పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు! మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే కేసును ఆ పోలీసు మూసివేస్తాడు! సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగ అన్నది రుజువై శిక్ష పడుతుంది కాబట్టి! ఈ ఉదాహరణ ఊహాజనితమే కావచ్చు. కానీ రాష్ట్రంలో అదే వాస్తవ రూపం దాల్చి కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. 2014–19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన అవినీతి దందాపై సీఐడీ ఇప్పటికే కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం సీఎంగా ఉన్న అదే చంద్రబాబు ఆ కేసులను నీరుగార్చే కుతంత్రానికి తెర తీశారు!– సాక్షి, అమరావతి పక్కా ఆధారాలతోనే కేసులు నమోదు..నాటి టీడీపీ ప్రభుత్వంలో అవినీతి దందాపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. రూ.241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన్ను అరెస్ట్ చేయడంతో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక అమరావతిలో దాదాపు రూ.5 వేల కోట్ల అసైన్డ్, ప్రభుత్వ భూముల దోపిడీ.. రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు.. రూ.333 కోట్లు కొల్లగొట్టిన ఫైబర్నెట్ స్కామ్పై సిట్ పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ దిశగా చర్యలు చేపట్టింది. 2015లో ప్రవేశపెట్టిన మద్యం విధానం ద్వారా టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏటా రూ.2.50 లక్షల కోట్లు చొప్పున కొల్లగొట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల పన్ను రాబడికి గండి కొట్టింది. ఇక ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సీఐడీ గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆయా కేసుల్లో ప్రధాన నిందితులుగా చంద్రబాబు, లోకేశ్తోపాటు పి.నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, లింగమనేని రమేష్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు బినామీలు, సన్నిహితులను నిందితులుగా చేర్చి సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తును తొలుత నీరుగార్చి అనంతరం విచారణను ఉపసంహరిస్తూ మంత్రి మండలి ద్వారా నిర్ణయం తీసుకోవాలనే పన్నాగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అందుకోసం ఏకంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ డీజీపీ, సీఐడీ చీఫ్ల ద్వారా కుట్ర కథను నడిపిస్తున్నారు. అటకెక్కిన దర్యాప్తుజూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే చంద్రబాబు తనపై ఉన్న సీఐడీ కేసులను నీరు గార్చే కుట్రకు తెర తీశారు. ముఖ్యమంత్రిగా ఆయన జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయగా ఫలితాలు వెలువడిన రోజు నుంచే సీఐడీ కేసులను తొక్కిపెట్టే ఆపరేషన్ చేపట్టారు. చంద్రబాబుపై అవినీతి కేసులను విచారిస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని పోలీసులు జప్తు చేశారు. తద్వారా ఆ కేసుల దర్యాప్తును అటకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు.సిట్ కేసులు క్లోజ్ చేయాలనే షరతులతో డీజీపీ, సీఐడీ చీఫ్లకు పోస్టింగ్లుచంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తనపై సిట్ కేసులను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పావులు కదిపారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసేందుకు తెగించారు. ప్రధానంగా డీజీపీ, సీఐడీ చీఫ్ల నియామకాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. తనపై ‘సిట్’ గతంలో నమోదు చేసిన స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్రింగ్ రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ కేసులను నీరు గార్చేసి అనంతరం విచారణను పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు. దీనికి లోబడే డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు పోస్టింగ్లు ఇచ్చినట్లు పోలీసువర్గాలు అప్పట్లోనే వ్యాఖ్యానించాయి. తదనంతర పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.నిందితులపై లుక్ అవుట్ నోటీసుల ఉపసంహరణ!2014–19 మధ్య చంద్రబాబు అవినీతి కార్యకలాపాల్లో పలువురు షెల్ కంపెనీల ప్రతినిధులు, ప్రైవేటు వ్యక్తులు కీలక పాత్రధారులుగా వ్యవహరించారు. సీమెన్స్కు తెలియకుండా ఆ కంపెనీ పేరుతో స్కిక్ల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టడం.. అసైన్డ్ భూములను కాజేసేందుకు షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు.. ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రతినిధుల పాత్ర... ఫైబర్నెట్ స్కామ్ ద్వారా నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితులు, బినామీల బాగోతం.. ఇలా ఈ కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని సీఐడీ అధికారులు గతంలోనే గుర్తించారు. నిందితులు విదేశాలకు పరారు కాకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను నీరుగార్చేందుకు ముందుగా లుక్ అవుట్ నోటీసులను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న దర్యాప్తు అధికారులను డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తమ కార్యాలయానికి పిలిపించారు. ఆ కేసుల్లో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అంటే ఆ కేసుల దర్యాప్తును ఇక పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. అందులో మొదటి అడుగుగా ఆ కేసుల్లో కొందరు నిందితులపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరింపజేశారు.నీరుగార్చుదాం... ఉపసంహరిద్దాంఇదీ చంద్రబాబు పన్నాగంచంద్రబాబుపై అవినీతి కేసుల్లో విచారణ ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించే దిశగా కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవహరిస్తోంది. ఆ కేసుల్లో సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చంద్రబాబు పూర్తిస్థాయిలో కుతంత్రానికి తెరతీశారు. ముందుగా ఆ కేసుల్లో సీఐడీ వాదన వీగిపోవాలి..! విచారణ ప్రక్రియ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు చేతులెత్తేయాలి...! న్యాయస్థానం లేవనెత్తే ప్రశ్నలకు దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పకుండా ఉండిపోవాలి...! అవసరమైతే న్యాయస్థానం ఆగ్రహానికి కూడా గురి కావాలి...! కేసుల విచారణలో డిఫెన్స్ న్యాయవాదుల వాదనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమాత్రం ఎదురు చెప్పకూడదు...! కేసుల విచారణ ప్రక్రియ సందర్భంగా అన్ని పరిణామాలు సీఐడీకి వ్యతిరేకంగా సాగాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇది మొదటి వ్యూహం కాగా అదే అదనుగా చంద్రబాబుపై నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు రెండో వ్యూహం. సీఐడీ అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, ఆ కేసులను ఉపసంహరించుకోవడమే సరైన చర్యని న్యాయ శాఖ అభిప్రాయపడినట్టుగా ఓ నోట్ తయారు చేయించి అనంతరం ఈమేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకోవాలన్నది చంద్రబాబు అంతిమ లక్ష్యం. ఆ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి కేసులను పూర్తిగా మూసివేయడం ద్వారా తన అవినీతి దందాకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలని చంద్రబాబు పకడ్బందీగా కుట్రను వేగంగా అమలు చేస్తున్నారు. -
AP: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. వారిని స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రీలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్లోనే విధుల్లో చేరతారని వెల్లడించింది. రిలీవ్ అయిన ఉద్యోగుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
బ్రోకర్.. జోకర్.. సర్కారే!
‘పేకాట ప్రియుల్లారా.. రండి రండి.. అనువైన చోటు, తిండీ తిప్పల బాధ్యత మాదే.. ముక్కలూ మావే.. మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు.. అదీ కష్టం అనుకుంటే ఫోన్ పే/గూగుల్ పే అయినా ఓకే. ఇన్నాళ్లూ మీరు ఈ అదృష్టానికి దూరమయ్యారు.. ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేదిక.. మా శిబిరానికి రండి.. మీ భద్రతకు మాదీ పూచి.. మీకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టడానికి చేతి కింద ఎంతో మంది ‘జాకీ’లూ సిద్ధం.. మీరు డబ్బు గెలుచుకోవాలే గానీ ‘క్వీన్’ కూడా రెడీ.. పైన ‘కింగ్’ మనోడే.. ఇంకెందుకు ఆలోచిస్తారు? జోకర్ పడకపోయినా కూడా ‘షో’ చెప్పొచ్చు.. ట్రిపులెట్లా మీ జీవితం వెలిగిపోవచ్చు.. మీ అదృష్టం పరీక్షించుకోండి..’ అని రాష్ట్రంలో పేకాడేవాళ్లను అధికార టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆహ్వానిస్తున్నారు. ఇసుక రీచ్లలో అడ్డగోలు తవ్వకాలతో జేబులు నింపుకుంటున్నది సరిపోదన్నట్టు పేకాటపై పడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు సొంతానికి ‘ఇలా’ సంపద సృష్టించుకుంటున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : ఎన్నో కుటుంబాలను చిధ్రం చేసిన చరిత్ర జూదానిది. పండుగలు, పబ్బాలకు జరిగే జూదంతోనే ఎందరో ఆస్తులమ్ముకుంటున్నారు. పేకాట వల్ల గతంలో ఎన్ని వేల కుటుంబాలు అప్పుల పాలయ్యాయో, ఎంత మంది ఐపీ పెట్టారో ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే రాష్ట్రంలో సామాన్యుల బతుకులతో పేకాడేస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధుల సిండికేట్ల ఆధ్వర్యంలో మూడు ముక్కలు.. ఆరు ఆటలుగా పేకాట దందా బరితెగించి సాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెరుచుకున్న అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బుల ద్వారా రోజూ అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో జూదానికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రంలో సాగిన పేకాట క్లబ్బుల దందాకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బుల అనుమతులను రద్దు చేసింది. అనధికార పేకాట క్లబ్బుల దందానూ అణచి వేసింది. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల సర్వస్వాన్ని దోచుకుంటున్న పేకాట క్లబ్బుల దందాకు ముగింపు పలికింది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా సరే తలొగ్గ లేదు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పేకాట క్లబ్బుల సిండికేట్లు మరోసారి జూలు విదిల్చాయి. ఏకంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బుల సిండికేట్కు నాయకత్వం వహిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.ఒకరిని చూసి మరొకరు..కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తుండటం చూసి ఇతర జిల్లాల కూటమి పార్టీల నేతలు సైతం ఈ దందాను ప్రారంభిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మూడు క్లబ్లతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అండదండలున్నాయని, ప్రధానంగా ఎమ్మెల్యే కుమారుడు నిర్వాహకులకు మద్దతుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పాలకొల్లులో రెండు క్లబ్బుల్లో పేకాట జోరుగా సాగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొందరు ఇళ్ల వద్ద, వ్యక్తిగత గెస్ట్ హౌస్లలో, పొలాల్లో, ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో పేకాట నిర్వహిస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఐ.పోలవరం, సఖినేటిపల్లి మండలాల్లో ఈ తరహా పేకాట కొనసాగుతోంది. పొలాల్లో పేకాట ఆడేవారిపై పోలీసులు రైడింగ్లు, కేసులు నమోదు చేస్తున్నారు తప్ప గెస్ట్ హౌస్లలో పేకాట జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడుల్లో పేకాట స్థావరాలు ఏర్పాటయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాలు, ఎత్తైన భవంతులు, అటవీ ప్రాంతాలు ఇందుకు వేదికయ్యాయి. వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో జోరువైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెలో అధికార పార్టీనేత లక్ష్మిరెడ్డి, నాగార్జునరెడ్డి పేకాట నిర్వహిస్తున్నారు. వీరు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరులు. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో టీడీపీ నేత శివ, ఆయన సోదరుడి ఆధ్వర్యంలో పేకాట జరుగుతోంది. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వరరెడ్డినగర్లో పక్కీర్రెడ్డి, బండ రాముడు పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. పులివెందుల, సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని పలు ప్రాంతాలలో టీడీపీ చోటా నాయకులు పేకాట దందా నడిపిస్తున్నారు. బ్రహ్మంగారిమఠంలో పేకాట స్థావరం త్వరలో మొదలవుతుందని తెలిసింది. చెన్నూరు మండలం బలసింగాయపల్లె, కనపర్తి, కైలాసగిరి ప్రాంతాల్లో దట్టమైన చెట్లున్న ఏరియాలో టీడీపీ నేతలు పేకాట స్థావరాలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరి, చిన్నమండెం, పెద్దమండెం, గుర్రంకొండ సమీపంలోని పాత చిత్తూరు జిల్లా సరిహద్దులోని గుట్ట ప్రాంతాల్లో మొబైల్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. రోజుకొక చోట శిబిరాలను నడిపిస్తున్నారు. కొంతమంది పోలీసులు, అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో ఈ వ్యవహారం జరుగుతోంది. మదనపల్లె, రైల్వేకోడూరు ప్రాంతాల్లో కూడా మామిడి తోటల్లో పేకాట కొనసాగుతోంది. ఒంగోలు నడిబొడ్డున గాంధీ రోడ్డులోని ఒక వీధిలో, ఒంగోలు–దశరాజుపల్లి మార్గంలోని ఒక పాత బిల్డింగ్లో పేకాట శిబిరాలు సాగుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లోని పలు గ్రామాల్లో రోజూ పేకాట సాగుతోంది. రేపల్లె నియోజకవర్గంలోని ఓ పేకాట శిబిరంలో లోన–బయట ఆటకు రెడీ అన్ని జిల్లాల్లోనూ అదే దందావిశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి నగరాల్లో అధికారికంగా మూడేసి చొప్పున పేకాట క్లబ్బులు తెరుచుకోగా.. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప వంటి జిల్లా కేంద్రాల్లో అధికారికంగా ఒకటి రెండు క్లబ్బులకు తలుపులు తెరిచి.. అనధికారింగా లెక్కలేనన్ని కేంద్రాలు ఓపెన్ చేసేశారు. ఎంపిక చేసిన హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ఊరి బయట పొలాల్లో అనధికార పేకాట క్లబ్బులు వెలిశాయి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే దాదాపు 100కుపైగా అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బులు దందా సాగిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులను కాపలా పెట్టి మరీ పేకాట దందా సాగిస్తుండటం విస్మయ పరుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పేకాట క్లబ్బుల జోరు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఒక్కోక్లబ్బులో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు సగటున రూ.3 కోట్ల వరకు.. శని, ఆదివారాల్లో రోజుకు రూ.12 కోట్ల వరకు దందా సాగుతున్నట్లు సమాచారం. ఆ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో రూ.1500 కోట్లు.. శని, ఆదివారాల్లో రూ.2,400 కోట్ల వరకు పేకాట దందా సాగుతోంది. పేకాట క్లబ్బుల నిర్వహణకు కొమ్ముకాస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇందులో 10 శాతం చొప్పున కమీషన్ తీసుకుంటున్నారు. ఆ ప్రకారం టీడీపీ కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు వారానికి కమీషన్ల రూపంలోనే దాదాపు రూ.400 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్లబ్బుల సంఖ్య, టీడీపీ నేతల కమీషన్ కూడా పెరగనుంది. ‘అనంత’లో దందాకు ఎక్కడా నో డ్రాప్అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ హెడ్కానిస్టేబుల్ పేకాట నిర్వహణకు రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తున్నాడు. పై అధికారులకు ఆదాయంలో వాటా ఇస్తున్నారని సమాచారం. ఇదే నియోజకవర్గంలోని కూడేరులోనూ పేకాట జోరుగా సాగుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టపగలే యథేచ్ఛగా పేకాట ఆడుతున్నా పట్టించుకునే వారు లేరు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు మండలాల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో అటవీ ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఇక్కడికి కర్ణాటక నుంచి సైతం పేకాటరాయుళ్లు భారీగా వస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో రాత్రింబవళ్లు జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒక్కో స్థావరంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. పుట్టపర్తిలో టీడీపీకి చెందిన రామ్– లక్ష్మణ్ సోదరులు గోవా నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు జూద నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఒక్కో స్థావరం నుంచి రోజుకు రూ.3 లక్షల చొప్పున కమీషన్ రూపంలో పోలీసులకు వెళ్తోంది. రూ.లక్షకు రూ.2 వేల కమీషన్ తీసుకుంటూ అప్పుగా ఇస్తున్న వారు కూడా పెరిగిపోయారు. చాలా మంది టీడీపీ నేతలు జూద కేంద్రాలను ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నారు. ప్రతి జూద కేంద్రం నుంచి 20 శాతం కమీషన్ తీసుకుని నడిపిస్తున్నారు. ఇటీవల పెనుకొండ మండలం శెట్టిపల్లి సమీపంలో 15 మంది పేకాటరాయుళ్లు దొరికారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షలు, ఐదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.కుప్పంలో రోజూ రూ.2 కోట్లుచిత్తూరు జిల్లా కేంద్రంలో నెల రోజులుగా పేకాట స్థావరాలు మొదలయ్యాయి. తుమ్మిందపాళ్యం–మాపాక్షి మార్గం, గంగనపల్లె, చర్చీవీధిలో జూదం నిర్వహిస్తున్నారు. ఓ టీడీపీ ప్రధాన నాయకుడి తమ్ముడి ఆదేశాలతో ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం అతడికి రోజుకు రూ.2 లక్షలు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టులోని బంగారుపాళ్యం అటవీ ప్రాంతంలో, పలమనేరు కౌండిన్య అడవుల్లో రోజుకు రూ.లక్ష చొప్పున పోలీసులు మామూళ్లు తీసుకుని పేకాట జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. గంగాధరనెల్లూరులో ఓ కీలక నాయకుడి తమ్ముడి ఆదేశాలతో పేకాట నిర్వహిస్తున్నారు. నగరిలో తడుకుపేట–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న జూదానికి ఓ మండల టీడీపీ నేత ఇటీవల పచ్చజెండా ఊపారు. పుంగనూరులో నక్కగుంట, బోయకొండ ప్రాంతాలు నిత్యం పేకాటరాయుళ్లతో కనిపిస్తున్నాయి. రోజూ జరిగే మొత్తంలో 20 శాతం స్థానిక టీడీపీ నాయకులకు ఇస్తున్నారు. కుప్పంలో గుడివంక సరిహద్దు ప్రాంతాల్లో, శాంతిపురం–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆటకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ టీడీపీ నేత, పోలీసులతో కలిసి ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజూ రూ.2 కోట్ల వరకు లావాదేవీలు నడుస్తున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి పుత్తూరు, రేణిగుంట, వెంకటగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తిరుపతిలో ఇద్దరు టీడీపీ నేతల కనుసన్నల్లో దందా సాగుతోంది. లాడ్జి ఓనర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆట సాగిస్తున్నారు. పోలీసుల నుంచి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ప్రధాన నాయకుడు రోజుకు ఒక పల్లెలో పేకాట శిబిరాన్ని విస్తరిస్తున్నాడు. కర్నూలు జిల్లాలో పెద్ద మొత్తాలే!బనగానపల్లి నియోజకవర్గం ఇస్రేనాయక్ తండా పరిధిలోని కంబగిరి స్వామి సమీపంలోని ఎర్రమలలో పేకాట నడుస్తోంది. ఇక్కడ ‘హైస్టేక్స్’ ఆడతారు. రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున ఆడతారు. ఇక్కడి నుండి నంద్యాలలోని ఓ జిల్లా పోలీసు అధికారికి రోజూ రూ.2 లక్షలు పంపేవారు. ఇటీవల ఆయన బదిలీ అయ్యారు. అయినా పేకాట ఆగలేదు. ఇక్కడికి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, పులివెందుల తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి అలంపూరు, గద్వాల ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడిస్తున్నారు. కొణిదెల పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో పేకాటరాయుళ్లను సభ్యులుగా చేర్చి జూద శిబిరం నిర్వహించే ప్రాంతం, సమయం మెసేజ్ రూపంలో పంపి జోరుగా పేకాట ఆడిస్తున్నారు. ఇటీవల తెలంగాణ పోలీసులు దాడి చేసి రూ.20 లక్షల దాకా నగదు స్వాధీనం చేసుకున్నారు. నెలన్నరగా కర్నూలు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పేకాట శిబిరాలు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఆలూరు నియోజకవర్గం అగ్రహారం, హత్తి బెళగల్, కల్లెవంక పరిధిలో రోజుకో చోట పేకాట ఆడిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఆరుగురు ప్రధాన అనుచరులు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు సిటీలో వెంకటరమణ కాలనీ, జొహరాపురంలోని ఓ ఇంట్లో, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు ఉన్న విల్లాలో, కర్నూలు–నంద్యాల ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో కొండకు దగ్గరగా ఉన్న ఓ వెంచర్లో, మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని బసాపురంలో, నంద్యాల పరిధిలోని పులిమద్దిలో, ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆదోని వద్ద ఉన్న శిబిరానికి బళ్లారి నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నారు. జూలై 18న ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడులో ‘భూమా గోడౌన్’లో అఖిలప్రియ చిన్నాన్న భూమా బ్రహ్మానందరెడ్డి పేకాట ఆడిస్తుంటే పోలీసులు దాడి చేశారు. 20 మంది టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జూలై 29న శిరివెళ్ల మండలం బోయిలకుంట వద్ద శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేవలం ఏడుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. భారీగా పట్టుపడినప్పటికీ, కొంత డబ్బు మాత్రమే దొరికినట్లు చూపారు. పేకాట కేంద్రాల అడ్డాగా రేపల్లెబాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మద్దతుతో పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల నగరం మండలం వెలమవారిపాలెం వద్ద ఆటగాళ్ల వాహనాల పార్కింగ్కు అనువుగా ఉండేలా దాదాపు ఎకరం స్థలంలో పేకాట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటగాళ్లను రప్పిస్తున్నారు. రోజూ రూ.కోట్లలోనే ఆట నడుస్తోంది. ఈ ఒక్క కేంద్రం నుంచే ముఖ్యనేత బంధువుకు రోజూ రూ.లక్షల్లో కమీషన్ వెళుతోంది. రేపల్లె ఓల్డ్టౌన్లో గుడ్డికాయలంక, పద్మావతీ టాకీస్ సెంటర్, బస్టాండ్ ఏరియాలో పేకాట కేంద్రాలు నడుపుతున్నారు. చెరకుపల్లి మండల కేంద్రంలోని భవానీపురం, నిజాంపట్నం మండల కేంద్రం సమీపంలోని ఒక గ్రామంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్క రేపల్లె నియోజకవర్గంలోనే 20 కేంద్రాలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మద్దతులో వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరులోనూ పేకాట నడుస్తోంది. కొందరు అధికార పార్టీ నేతల గెస్ట్హౌస్లు సైతం పేకాట కేంద్రాలుగా మారాయి. పర్చూరు మండలం కారంచేడు, స్వర్ణ, ఆదిపూడి, దగ్గుపాడు గ్రామాల పరిధిలో నిత్యం పేకాట నడుస్తోంది. ఇక్కడ పొలాల్లోనే ఆట నడిపిస్తున్నారు. అద్దంకి, బాపట్ల నియోజకవర్గాల్లోనూ పేకాటలు నిత్యం నడుస్తున్నాయి. పేకాట శిబిరాలకు మంత్రి మద్దతు ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదు.గుంటూరు, కృష్ణాలో సకల సౌకర్యాల మధ్య..గుంటూరు నగరంలో నిత్యం పేకాట రూ.కోట్లలో నడుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లబ్లలో యథేఛ్చగా సాగుతోంది. కొరిటెపాడు వద్ద గల ఎల్వీఆర్ క్లబ్లో నెలన్నరగా పేకాట ప్రారంభించారు. పేకాట ఆడే వారికి అన్ని రకాల సదుపాయాలు, మద్యం, బిర్యానీలతో పాటు వడ్డీ వ్యాపారులు సైతం సిద్ధంగా ఉండేలా క్లబ్ నిర్వాహకులు శ్రద్ధ తీసుకుంటున్నారు. గూగుల్పే, ఫోన్పే ద్వారా కూడా లావాదేవీలు జరుపుతున్నారు. ఈ క్లబ్ను ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో నడిపిస్తున్నారని సమాచారం. ఇక్కడికి అరండల్పేట పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ క్లబ్లో 40 టేబుళ్లపై ఆట సాగుతోందని సమాచారం. తద్వారా క్లబ్కు రోజూ రూ.20 లక్షలకు పైగానే ఆదాయం వస్తున్నట్లు తెలిసింది. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి, ఇటు పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న నార్త్ క్లబ్లో, పలకలూరులోని గుంటూరు క్లబ్లో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. నగర శివారులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పలుచోట్ల పేకాట ఆడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రులోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. జూద కేంద్రంగా మారిన పుట్టపర్తిప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని జూద కేంద్రంగా మార్చిన కవల సోదరులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జూద కేంద్రాలను ప్రోత్సహించడం సరికాదు. జూదం కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయనే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు గుర్తుంచుకుంటే మంచిది. ఆ ఇద్దరినీ నియంత్రిస్తే పుట్టపర్తి ప్రశాంతంగా ఉంటుంది.– ఆడపాల వేమనారాయణ, సీపీఐ జిల్లా సమితి సభ్యుడుకుటుంబాలు నలిగిపోతాయిరాష్ట్ర ప్రభుత్వం పేకాటను ఇలా ప్రోత్సహిస్తూ పోతే వేల కుటుంబాలు వీధిన పడతాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పేకాటలను ఇంతలా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం పేకాటను అధికారికం చేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు సంపన్న కుటుంబాలు సైతం ఆర్థికంగా నలిగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే మహిళా లోకం పోరాటానికి దిగడం ఖాయం. ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహిళలే తిరిగి గద్దె దించే పరిస్థితి వస్తుంది.– లాస్య, మచిలీపట్నం, కృష్ణాజిల్లాపోరాటానికి ఐద్వా సిద్ధమవుతోందిరాష్ట్రంలో పేకాట క్లబ్లకు, పేకాట స్థావరాలకు ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వం అనధికార అనుమతులివ్వడం దారుణం. సమాజాన్ని నాశనం చేసే పేకాట పట్ల ఈ ప్రభుత్వం ఇలా మద్దతు ఇవ్వడం సరికాదు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి, పేకాట వంటి అంశాలకు ప్రాధాన్యత నివ్వటం తగదు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమించటానికి ఐద్వా సిద్ధమవుతోంది.– గాదె ఆదిలక్ష్మి, కార్యదర్శి, ఐద్వా విజయవాడ పశ్చిమంసంపద ఇలా సృష్టిస్తారా? రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే పేకాటను ప్రోత్సహించడం దారుణం. ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాన్ నోరు మెదపటం లేదు. సంపద సృష్టించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు. పేకాల క్లబ్లను ఏర్పాటు చేసి అందులో యువతకు ఉద్యోగాలు కల్పిస్తారా? క్లబ్ల నుంచి వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పిల్లల స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేని స్థితిలోకి ఎందరో వెళ్లిపోతారు. ఏ గృహిణి మెడలోనూ పుస్తెలు ఉండవు. – కోట సామ్రాజ్యం, గృహిణి, విజయవాడ -
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది. ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తనకు గతంలో ఉన్న భద్రతను భారీగా కుదించడంపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వారంలోపు ఆ కౌంటర్కు సమాధానం దాఖలు చేయాలని వైఎస్ జగన్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.మాజీ ప్రధానుల్లా ఎందుకు భద్రత కల్పించకూడదు...?వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకు జెడ్ ప్లస్ కేటగిరీ అలాగే ఉన్నా భద్రతను మాత్రం భారీగా కుదించి వేశారని నివేదించారు. గతంలో 10 మంది పీఎస్ఓలు ఉంటే ఇప్పుడు ఇద్దరినే కేటాయించారన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా భద్రతను కుదించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో ఓ నిర్దిష్ట విధానపరమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధానులకు కల్పిస్తున్న రీతిలోనే మాజీ ముఖ్యమంత్రులకు కూడా భద్రత కల్పించడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారని ప్రశ్నించారు. దీనికి దమ్మాలపాటి బదులిస్తూ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించారని చెప్పారు. మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రుల సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో వారికి ‘వై’ కేటగిరీ భద్రతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి భద్రత కల్పించాలన్నది వారికి ఉన్న ప్రాణహానిని బట్టి ఉంటుందని దమ్మాలపాటి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా..?ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ అందుకు అభ్యంతరం లేదని, అప్పటి వరకు 3.6.24 నాటికి జగన్కున్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దీనిని దమ్మాలపాటి వ్యతిరేకించారు. చట్ట ప్రకారం ముఖ్యమంత్రికే ఆ స్థాయి భద్రత ఉంటుందన్నారు. ఈ సమయంలో శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పూర్తి లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. కారు అద్దాలపై పగుళ్లు ఉన్నాయని, వెనుక డోరు తెరుచుకోవడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నివేదించారు. జామర్ సదుపాయం కూడా తొలగించారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రికి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా? ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. దీనిపై ఏం చేయబోతున్నారో తెలుసుకుని చెప్పాలని దమ్మాలపాటిని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.ప్రాణహాని లేదనేందుకు ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు...తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగానే దమ్మాలపాటి స్పందిస్తూ వైఎస్ జగన్కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అద్దాలకు పగుళ్లు ఉన్నాయని అంగీకరించారు. ఆ అద్దాన్ని మారుస్తామని, ఆ వాహనం మొత్తానికి మరమ్మతులు చేయిస్తామన్నారు. అప్పటి వరకు వైఎస్ జగన్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తామని చెప్పారు. మరి జామర్ సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జగన్ ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఆర్సీఐఈడీ) ఉపయోగించే అవకాశాలు ఉంటే ఆ విషయాన్ని ఆయన భద్రతా సిబ్బందికి తెలియచేసి అప్పుడు మాత్రమే జామర్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మిగిలిన అన్ని సమయాల్లో జామర్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై శ్రీరామ్ స్పందిస్తూ వైఎస్ జగన్కున్న ప్రాణహానిని ప్రభుత్వం సరిగా మదింపు చేయలేదని చెప్పారు. ప్రాణహాని లేదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేశారు. -
నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గతంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో.. 3–6–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేగాక.. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్ధించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. వైఎస్ జగన్ తన పిటిషన్లో ఏం పేర్కొన్నారంటే.. నన్ను ప్రమాదంలోకి నెట్టేందుకే.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్ ప్లస్ భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు, వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత రెండునెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఉపసంహరించింది. నా భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందనలేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదు. వారు కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధులను వారు విస్మరించడంవల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్పై, ఆస్తులపై వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీనిపై మేం ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు నా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని’ ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. చచ్చేవరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భద్రత కుదింపు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాకు భద్రతను కుదించారు. అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తగ్గించారు. నాకు భౌతిక హాని తలపెడతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. అందులో భాగంగానే నాపై ఎన్నికల ప్రచార సమయంలో గులకరాయి దాడి జరిగింది. గతంలో నాపై కోడికత్తితో హత్యాయత్నం కూడా చేశారు. వీటన్నింటి దృష్ట్యా నాకు 3–6–2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీచేయండి. నాకు రక్షణగా ఇద్దరు అధికారులే ఉన్నారు..రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే, అధికార పార్టీ కూటమి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్, నేతలపై దాడులు జరగడానికి పునాది. నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద సహేతుక కారణాలుగానీ, ఆధారాలుగానీ ఏమీలేవు. అత్యున్నత భద్రత వ్యవస్థ అయిన జెడ్ ప్లస్ నుంచి నా భద్రతను కుదించారు. వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను తొలగించనప్పటికీ, నా చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని మాత్రం బాగా కుదించారు. నాకు రక్షణగా ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నారు. నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్ ఆక్టోపస్ టీమ్స్ను ఈ ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారు. గతంలో ఇలా 10 మంది ఉండేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల సంఖ్యే తక్కువ. గతంలో ఇల్లు, ఆఫీసు వద్ద 11 మంది గార్డులు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇక నా భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన బుల్లెట్ప్రూఫ్ కారును చూస్తే అర్థమైపోతుంది. అద్దాలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. వెనుక డోర్ తెరుచుకోవడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకొచ్చే పరిస్థితిలేదు. మధ్యలో ఆగిపోతోంది. ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్యలో ఆగిపోవడంతో పర్యటనను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. నేను నా వ్యక్తిగత బుల్లెట్ప్రూఫ్ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు అనుమతినివ్వలేదు. పైగా వాళ్లు ఇచ్చే కారునే వాడాలన్నారు. నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతోనే అలాంటి కారును ఇచ్చారు. -
శ్రీ వేంకటేశ్వర ఎయిర్పోర్ట్గా తిరుపతి ఎయిర్పోర్ట్ పేరు !
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్పోర్ట్గా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్పోర్ట్ల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్బంగా ఎయిర్పోర్ట్ను విద్యాపతి ఎయిర్పోర్ట్గా మార్చాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి. -
దేశం దృష్టికి ఆటవిక పాలన.. నేడు ఢిల్లీలో ధర్నా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 50 రోజులుగా రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి.. వెంటాడి, వేటాడి హతమారుస్తూ.. ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ.. ఆస్తులను ధ్వంసం చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న మారణహోమం, అరాచక, ఆటవిక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర శంఖం పూరించారు. కేవలం 50 రోజుల్లోనే రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి దిగజారిన శాంతిభద్రతలను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా అక్కడే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దారుణకాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు.. 11 కేసులు ఉంటే నన్ను కలవడానికి అనర్హులు.. 12 కంటే ఎక్కువ కేసులు ఉంటేనే తనను కలవడానికి అర్హులు అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరింత రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెప్పుతో కొట్టండి.. హాకీ స్టిక్లతో కొట్టండి.. అధఃపాతాళానికి తొక్కేయండి అంటూ కూటమి నేతలు పేట్రేగిపోయారు. వారి పిలుపునందుకున్న టీడీపీ శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 నుంచే అరాచకాలకు తెరతీశారు. బ్లడ్ బుక్గా రెడ్ బుక్ రూపాంతరం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేసుకున్నానని.. అధికారంలోకి వచ్చాక వారి అంతు చూస్తానని పాదయాత్రలో లోకేశ్ పదే పదే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో టీడీపీ శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో నరికి చంపేయడం కూటమి ప్రభుత్వం మోగిస్తున్న మరణ మృదంగానికి పరాకాష్ట. లోకేష్ రెడ్ బుక్ బ్లడ్ బుక్గా రూపాంతరం చెందిందనడానికి ఇదే నిదర్శనం. టీడీపీ శ్రేణుల చర్యలతో సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బాధ్యతాయుతంగా స్పందించక పోవడం విభ్రాంతి కలిగిస్తోంది. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు ప్రయతి్నంచకపోగా, టీడీపీ మూకల విధ్వంసకాండను వెనుకేసుకొచ్చే రీతిలో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారు. అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశి్నంచలేదని మంత్రులను తప్పుపట్టారు. దారుణకాండపై పోరాటం టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతకు ముందు వినుకొండలో నడిరోడ్డుపై హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాంటి దారుణాలన్నింటి గురించి వివరించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఏజెన్సీలతో విచారణ చేయించాలని కోరారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంసకాండపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు సాగిస్తోన్న మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.గన్నవరం విమానాశ్రయంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకొన్న వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై 24న నిరసన, ఫొటోగ్యాలరీ ఏర్పాటు సాక్షి, అమరావతి/విమానాశ్రయం(గన్నవరం)/సాక్షి, న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో హింస, క్షీణిస్తోన్న శాంతి భద్రతలపై బుధవారం (24న) నిరసన కార్యక్రమంతో పాటు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన ద్వారా ఏపీలో జరుగుతోన్న అకృత్యాలను దేశ ప్రజలందరి దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకువెళ్లనుంది. వైఎస్ జగన్ వెంట ఢిల్లీకి వెళ్లిన వారిలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యులు ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి వైఎస్ జగన్కు ఘనంగా వీడ్కోలు పలికాయి. -
AP: కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే లిక్కర్ మాఫియాలా చెలరేగుతున్నారు. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని లారీలు, కంటైనర్లలో తెప్పించి గ్రామగ్రామాన విక్రయిస్తున్నారు. గత నెల రోజుల్లో భారీ మొత్తంలో మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకొని, కాసుల పంట పండించుకుంటున్నారు. భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లారీల నంబర్లు ముందే చెప్పి తనిఖీ చేయొద్దని హుకుం జారీ చేయడంతో పోలీసులు ఆ లారీలను వదిలేస్తున్నారు. దీంతో అక్రమ మద్యం నిరాఘాటంగా రాష్ట్రంలోకి వచ్చేస్తోంది. కర్నూలులోని ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు కర్ణాటక, గోవా మద్యం సరఫరా అవుతోంది. ఆళ్లగడ్డలో ఇప్పటికే కర్ణాటక నుంచి 3 లారీల మద్యం దిగుమతి అయింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకూ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ మద్యం దందాలో టీడీపీకి చెందిన కొందరు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు భాగస్వామ్యమైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. గోవా బ్రూవరేజి కంపెనీ నుంచి.. కర్నూలు జిల్లాలో మద్యం వ్యాపారంలో ఆరితేరి మంత్రిగా పని చేసిన ఓ నేతకు గోవాలోని ఓ బ్రూవరేజి కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. 2014 డిసెంబర్లో టీడీపీ ప్రభుత్వం ఉండగానే గోవా నుంచి కర్నూలు జిల్లాకు వెళుతున్న మద్యం కంటైనర్ను గుత్తి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవాకు వెళ్లి అక్కడి బ్రూవరీని పరిశీలిస్తే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టమైంది. అప్పట్లో మంత్రి ప్రమేయంతో ఈ కేసును నీరుగార్చారు. ఇప్పుడు మళ్లీ అధికారం దక్కడంతో అక్కడి బ్రూవరేజి కంపెనీ నుంచి తిరిగి మద్యం సరఫరా మొదలైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు రెండు, తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకు ఒక కంటైనర్ మద్యం వచ్చినట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాహనాల ద్వారా ఈ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, గోవా లిక్కర్తో భారీ ఆదాయం మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటక, గోవాలో ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) బేస్డ్తో తయారవుతుంది. ఈఎన్ఏతో పోలిస్తే ఆర్ఎస్ బేస్డ్ మద్యం ధర తక్కువ. అందువల్ల కర్ణాటక, గోవా మద్యం తక్కువకు లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈఎన్ఏ మద్యం నాణ్యమైనది. కర్ణాటకలో 90 ఎంఎల్ టెట్రాప్యాకెట్ ధర రూ.45, క్వార్టర్ రూ.90 మాత్రమే. ఇది అక్కడి మద్యం షాపుల్లోని రేటు. నేరుగా బ్రూవరేజెస్ నుంచి తెప్పించుకుంటే మరింత తక్కువకు వస్తుంది. ధర తక్కువ కావడంతో కర్ణాటక, గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇది అక్రమంగా వచ్చేది కావడంతో పన్నులు కూడా ఉండవు. దీంతో టీడీపీ నేతలు తక్కువకు కొని, ఎక్కువకు అమ్ముకొని డబ్బులు దండుకొంటున్నారు. గ్రామాల్లోనే విచ్చలవిడిగా మందు కర్నూలు నగరంలోని ప్రభుత్వ వైన్షాప్ పక్కనే మద్యం తాగుతున్న మందుబాబులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో మద్యం నివారించాలని బెల్ట్షాపులను రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతలే జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల ద్వారా గ్రామాల్లోనే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మేస్తున్నారు. మద్యం దుకాణాలు ఉన్న చోట సీటింగ్కు కూడా అనధికారికంగా అనుమతి ఇచ్చి, అక్కడా అక్రమ మద్యాన్నే తక్కువ ధరకు అమ్ముతున్నారు. -
రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తోంది. జాబ్ క్యాలెండర్పై గంపెడాశలు పెట్టుకుంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు ‘నిరుద్యోగ భృతి’ ఇవ్వాలని కోరుతోంది. అధికారంలోకి వచ్చి నెల దాటినా, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్లోని 1.60 కోట్ల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. 2014లో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారు. అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయ వలలో చిక్కుకుని ఐదేళ్లూ నిరుద్యోగ యువత విలవిల్లాడిపోయారు. మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపక పోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. మళ్లీ బూటకపు హామీలతోనే ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన రాజకీయ జీవితంలో చెప్పింది చెప్పినట్లు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని.. లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో ఎదురు చూస్తోంది. చాలామంది చిన్నా చితకా పనులు వదిలేసి.. స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్ధిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. సూపర్ సిక్స్ టాప్లో భృతి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. మెగా డీఎస్సీ పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16 వేల పోస్టుల భర్తీ కాస్తా నత్త నడకను తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీపడే వారు లక్షల్లో ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయస్సు ఉండి.. ఆర్ధిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్లలో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్కు రూ.లక్షల్లో ఫీజులు ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్ధిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తున్నారు. పేరొందిన సంస్థల్లో గ్రూప్ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్ కోసమే రూ.లక్షలు, సాధారణ శిక్షణ కేంద్రాల్లో రూ.50 వేల వరకు ఖర్చువుతోంది. గ్రూప్–2కు అయితే రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. డీఎస్సీ, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా రూ.వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికి తోడు భోజనం, హాస్టల్ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు రూ.6 వేలకుపైగా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు, ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. గతంలో చేసినట్టే చేస్తారా? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది. అయితే అధికారంలోకి రావడం.. పాలనను ప్రారంభించడంతో పాటు.. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలెట్టారు. కానీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించ లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014–19లో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఐదేళ్లు పబ్బం గడుపుకుని మొండి చెయ్యి చూపించారు. అప్పట్లో కూడా ఇంటికో ఉద్యోగం అని ఊదరగొట్టి నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతికి 2017–18లో రూ.500 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ, రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని మెలిక పెట్టారు. కొన్ని చోట్ల కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి, 120 సీసీ ద్విచక్ర వాహనం ఉన్న వారిని సైతం పక్కన పడేశారు. ఇలా వడపోత అనంతరం తొలుత 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత ఆ సంఖ్యను పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ.. 1.62 లక్షల మందికే ఇస్తామని.. దీనికి ఈ–కేవైసీ లింక్ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి.. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అనుభవం దృష్ట్యా ఈ సారైనా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వయో పరిమితిని గుర్తించాలి.. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 42 ఏళ్లు, రిజర్వడ్ కేటగిరి అభ్యర్థులకు మరో 5 ఏళ్లు అదనంగా ఉంటుంది. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటినప్పటికీ ప్రభుత్వ కొలువు సాధించాలనే సంకల్పంతో చాలా మంది ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ, విజయం కూడా సాధిస్తున్నారు. ఏపీపీఎస్సీ వయో పరిమితి ఇలా ఉంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 22–35 ఏళ్ల వయసు్కలు మాత్రమే భృతికి అర్హులని ప్రకటించడంతో చాలా మంది నష్టపోయారు. ఇంటర్ చదువుకున్న వారు కూడా ఏదో ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతారు. డిప్లొమా చేసిన వారి వయసు కూడా 19 ఏళ్ల లోపుగానే ఉంటుంది. వీళ్లందరిని కూడా గతంలో గుర్తించక పోవడం నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టినట్టు మరే నాయకుడూ చేసి ఉండరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వాలి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా తక్షణమే భృతిని ప్రకటించాలి. ఒక్క నెల నోటిఫికేషన్ ఆలస్యమైనా లక్షలాది మంది నిరుద్యోగులు వయో పరిమితి దాటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. యువగళంలో లోకేశ్.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీడీపీ 2014–19లో నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో ఆడుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నిరుద్యోగుల ఉద్యమ సత్తాను చూడాల్సి వస్తుంది. – వై.రామచంద్ర, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా జనరల్ అభ్యర్థులతో సహా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్ధిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. ఈసారి అమలు చేయబోయే నిరుద్యోగ భృతి కనీసం 40 ఏళ్లు దాటి పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ధీమా లేకుండా చేస్తున్నారు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలపై నేరుగా పడుతుంది. – మేడూరి నవీన్ దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్, విశాఖపట్నం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. జాబ్ క్యాలెండ్ కంటే ముందు పాత నోటిఫికేషన్లను పూర్తి చేయాలి. ఈలోగా నిరుద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెలా రూ.3 వేల భృతి వెంటనే అమలు చేయాలి. దీని స్పష్టమైన తేదీలను ప్రకటించాలి. – కొనిగపాగ అనిల్ బాబు, విజయవాడవీటి సంగతేంటి బాబూ?వైఎస్సార్ రైతు భరోసాఈ పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున ఏటా 51,13,249 మంది రైతులకు రూ.6,857.63 కోట్లు.. ఐదేళ్లలో రూ.34,288.17 కోట్లు ఇచ్చింది. కూటమి హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పుడు ఇస్తారు?వైఎస్సార్ మత్స్యకార భరోసా గత ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసాను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి, ఏటా సగటున 1,07,602 మందికి రూ.107.60 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.538.01 కోట్లు ఇచ్చింది. మీరు ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారు?వైఎస్సార్ సున్నా వడ్డీఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఏటా సగటున 96,70,720 మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,242.26 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 4,969.05 కోట్లు ఇచ్చింది. ఈ పథకం సొమ్మును మీరు ఎప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు?జగనన్న విద్యా, వసతి దీవెనఈ పథకం కింద (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున 27 లక్షల మంది విద్యార్థులకు రూ.18,663.44 కోట్లు అందజేసింది. విద్యార్థులకు మీరు ఈ సాయాన్ని ఎప్పుడు అందిస్తారు?అమ్మ ఒడి పథకంఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున సగటున 42.62 లక్షల మంది తల్లులకు నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.26,067.28 కోట్లు ఇచ్చింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ కింద కోటికి పైగా పిల్లలకు మీరు ఎప్పుడు ఈ సాయం అందిస్తారు? -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొంత మంది అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక సీఎస్గా ఆర్పీ సిసోడియా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సీఎస్గా జి.అనంతరాము నియమితులయ్యారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా హిమాన్షు శుక్లాను నియమించింది. ఆర్థిక శాఖ (సీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గిరిజా శంకర్ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్ను బదిలీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బాధ్యతల నుంచి అజయ్ జైన్ను రిలీవ్ చేసింది. ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు ఇలా.. -
చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్.. ఒక్కరికే వందనం.. అందరికీ ఎగనామం!
ఎన్నికల ప్రచారంలో..తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకూ 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా.‘నేను హామీ ఇస్తున్నాను.. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకూ (విద్యార్థిని, విద్యార్థులు) 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊరూరా లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా మాట ఇచ్చారు. బాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇంటింటా ఇవే మాటలు చెప్పారు. ఇలా మాయ మాటలు చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. మరీ ఇంత దుర్మార్గమా.. అని ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించడం ఆయన నైజం. సూపర్ సిక్స్లో మిగతా హామీలన్నింటిలో కోతలు.. దాటవేతలేనని బాబు వాలకం చెబుతోంది.సాక్షి, అమరావతి: మాట మార్చడంలో డబుల్ పీహెచ్డీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి తన నైజాన్ని చూపించారు. ‘తల్లికి వందనం’ పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామన్న అంశంపై మాట తప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి.. ఒక్కరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తామని లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా ఇచ్చిన మాటను గాలికి వదిలేశారు. ఇప్పుడు ఈ పథకాన్ని చదువుకునే పిల్లల్లో ఒక ఇంట్లో ఒక్కరికే అమలు చేస్తామని ప్రకటించారు. ఆధార్ అనుసంధానం పేరుతో అనేక కొర్రీలు వేసి లబ్ధిదారులను తగ్గించే పనిలో ఉన్నారు. అందుకే ఏటా జూన్ నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన పథకంపై కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జీవో నం.29 విడుదల చేసి.. పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అంటే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన 42.62 లక్షల మంది లబ్ధిదారుల కంటే తక్కువ మందికే ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఆ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటిస్తే.. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ పథకం గురించి తనదైన శైలిలో ‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు..’ అంటూ చిన్న పిల్లలను చూపిస్తూ ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇన్ని ఆధారాలు ఉన్నా ఇప్పుడు ‘వందనం ఒక్కరికే’ అనడంపై తల్లులు మండి పడుతున్నారు. కోటి మంది పిల్లల్లో భారీగా కోత రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి రాగానే అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను తగ్గించండంతో పాటు రుణ మాఫీని సైతం భారీగా కుదించేశారు. ఇప్పుడు తల్లికి వందనం పైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభ్వుం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తూ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చేసిన ప్రకటనకు విరుద్ధంగా ముందుకెళుతోంది. అందుకు అనుగుణంగానే జీవో నం.29లో జారీ చేసింది. పిల్లలు అందరికీ ఇస్తామన్న పథకాన్ని ‘తల్లికి మాత్రమే రూ.15000’ అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంటే రాష్ట్రంలో దాదాపు కోటి మందికి పైగా పిల్లలున్నారు. ఇందులోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఆధార్తో లింక్ అయ్యి ఉన్న అన్ని ఆస్తుల వివరాలను తీసుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలను కాకుండా మరిత కఠినంగా నిబంధనలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతి బిడ్డా చదువుకునేందుకు బడికి వెళ్లడమే లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలను ప్రోత్సహించేందుకు వారి తల్లులకు ఏటా రూ.15 వేలు జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లో చదివే పిల్లలకు మాత్రమే పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిలోనూ వివిధ ఆదాయ మార్గాలను సాకుగా చూపి పిల్ల సంఖ్యను భారీగా తగ్గించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో అమ్మ ఒడి అందుకున్న 42.62 లక్షల మందిలో చాలా మంది ఈ పథకానికి దూరమవుతారు. మూడుసార్లు మాట మార్చిన కూటమి చదువుతో సంబంధం లేకుండా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలకు మాట ఇచ్చారు. ‘స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఆర్ధిక సాయం’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలున్న తల్లికే ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అంటే ఒకే అంశంపై మూడుసార్లు మాట మార్చారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీలు, ప్రయివేట్ ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలు గల తల్లులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా స్కూళ్లు, కాలేజీల ప్రస్తావన చేయలేదు. సర్వే పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేసి, అనంతరం తీరిగ్గా మార్గదర్శకాలు విడుదల చేస్తే తాము అర్ధికంగా నష్టపోతామని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల డేటా ఉన్నా కాలయాపన స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యపై రాష్ట్రాలు ఏటా ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’ (యూడైస్ ప్లస్) ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఈ ఏడాది నుంచి విద్యార్థుల చేరికలు, బదిలీలు నేరుగా ‘యూడైస్ ప్లస్’ ద్వారానే చేయాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. యూడైస్ ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు మొత్తం 82,29,858 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య కూడా దీనికి జత చేయాలి. విద్యార్థుల చేరిక సమయంలోనే ఆధార్తో పాటు కుటుంబ నేపథ్యం, ఆర్ధిక స్థాయి కూడా నమోదు చేస్తున్నారు. ఇదంతా ఆన్లైన్లో జరిగేదే. పైగా గతేడాది కూడా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పిల్లల వివరాలను ప్రభుత్వానికి అందించారు. ఈ వివరాలు ప్రభుత్వం వద్ద నూరు శాతం ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం విద్యార్థుల డేటా ఆధారంగా గత ప్రభుత్వం తొలి ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. 2020లోనూ ముందు సంవత్సరం విద్యార్థుల సంఖ్య (డేటా) ఆధారంగా పథకాన్ని అందించింది. ఇలా నాలుగు విద్యా సంవత్సరాల్లో ముగిసిన ఏడాది డేటా ఆధారంగా అమ్మ ఒడి జమ చేసింది. దీంతో పాటు 75 శాతం హాజరు శాతం తప్పనిసరి అన్న నిబంధన విధించినా, పేద కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదన్న మానవతా దృష్టితో హాజరు సరిపడినంత లేకున్నా ఇతర అర్హతలు గల ప్రతి తల్లికీ అమ్మఒడి అమలు చేశారు. పది, ఇంటర్ ఫెయిల్ అయ్యి, తిరిగి ప్రవేశం పొందిన విద్యార్థులు, మధ్యలో స్కూల్లో చేరిన అర్హత గల పిల్లలకు కూడా పథకాన్ని అమలు చేశారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్యను సర్వే చేసి తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వం వద్ద పూర్తి డేటా ఉన్నా కేవలం పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా దాట వేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రభుత్వమే ఉండి ఉంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కొనసాగుతూ ఉండిఉంటే ఈ పాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా పథకాలు అమలై ఉండేవి. గత ఐదేళ్లలో ఈ పథకాలన్నీ చెప్పిన రోజు చెప్పినట్లు అర్హత గల లబ్ధిదారులందరికీ అందాయి. అర్హత ఉండీ కూడా ఏ కారణం వల్లనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి మరీ మేలు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నిజంగా పిల్లలపై ప్రేమ ఉంటే జూన్ నెలలోనే తల్లికి వందనం (అమ్మ ఒడి) పథకాన్ని అమలు చేసి ఉండేది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఎలా కోత పెట్టాలా.. అని నెల రోజులకు పైగా ఆలోచించి ఇప్పుడు తీరిగ్గా గైడ్లైన్స్ మాత్రమే జారీ చేసింది. పిల్లలందరికీ అని చెప్పి ఇప్పుడు ఒక్కరికే అంటూ ప్లేటు ఫిరాయించింది. అది కూడా ఎప్పుడిస్తారో చెప్పక పోవడం గమనార్హం. ఆశ పెట్టి.. మాట మార్చకూడదు మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకరు ఈపూరు యూపీ పాఠశాలలో, మరొకరు అనంతవరం జెడ్పీ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పదో తరగతి చదువుతున్న మా మేనకోడలిని కూడా మేమే పెంచుతున్నాం. గత ప్రభుత్వంలో మా బిడ్డలతోపాటు, మా మేనకోడలికి సైతం మా బ్యాంక్ ఖాతాలో అమ్మ ఒడి సొమ్ము జమైంది. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామన్న హామీని నిలుపుకోవాలి. అధికారంలోకి వచ్చాక టీడీపీ హామీని విస్మరించడం మంచిది కాదు. మాలాంటి కుటుంబాలను ఆశ పెట్టి.. ఇలా ఏమార్చి కష్టాల్లోకి నెట్టడం తగదు. – బూసే జోత్న్స, ఈపూరు, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? మాకు నలుగురు పిల్లలున్నారు. ప్రభుత్వం ‘తల్లికి వదనం’ ద్వారా సాయం చేస్తుందని అందరినీ ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నాం. వారి ఫీజులు, పుస్తకాలు, డ్రస్సులు, బూట్లు ఇలా అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా ఖర్చు అవుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలు పాఠశాలకు వెళితే వారందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తాన్ని త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పథకంలో కొర్రీలు వేయాలని చూడటం మంచిది కాదు. ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు..? – షాఫియా భాను, హస్నాబాద్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లామరీ ఇంత మోసమా!? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి సంవత్సరం చెప్పిన తేదీన బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ పథకం అర్హతకు కొత్త నిబంధనలు పెట్టడం ఆందోళనకరంగా ఉంది. నాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఐదో తరగతి, రెండో కొడుకు నాలుగో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కూతురు అంగన్వాడీ చదువు పూర్తి చేసుకుంది. పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.45 వేలు వస్తుందని ఆశించాం. కూతుర్ని ప్రయివేటు స్కూల్లో చేరుద్దామనుకున్నాం. హామీ ఇచ్చి మరీ ఇంత మోసం చేస్తారనుకోలేదు. – ఎం.పూజిత నాగలక్ష్మి, ఎనికేపాడు, విజయవాడ రూరల్ మండలంరూ.60 వేలు వస్తాయని ఎదురు చూస్తున్నాం మేము విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది దరి కె1 కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి రుషిత్ సింగ్ 10వ తరగతి, రెండవ అబ్బాయి సౌమిత్రి సింగ్ 6వ తరగతి, మూడవ అబ్బాయి హేమంత్ సింగ్ మూడవ తరగతి, నాలుగవ అబ్బాయి ప్రకృత్ సింగ్ నర్సరీ చదువుతున్నాడు. గతంలో ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, ఒక అబ్బాయిని ప్రైవేట్ పాఠశాలలో చదివించే వాళ్లం. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతీ విద్యార్ధికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని చెప్పడంతో నలుగురినీ ప్రైవేట్ పాఠశాలలో చేరి్పంచాం. పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం మాపై ఒత్తిడి తెస్తున్నాయి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తల్లికి వందనం పథకం కింద రూ.60 వేలు ఇవ్వాలి. – లక్ష్మీ కౌర్ -
AP: హామీ గాలికి.. ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే!
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది. టెట్, డీఎస్సీ మధ్య కనీసం 90 రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్ షెడ్యూల్ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి కూడా అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది. అయితే నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం టెట్ను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించనుంది. టెట్ ఫలితాలను నవంబర్లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మరో 8 నెలలపాటు డీఎస్సీ శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు. దీంతో అన్నాళ్లపాటు ఉపాధి లేకుండా ఉండటం ఎలా అనే బెంగ వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలుచుకుని తల్లడిల్లుతున్నారు. ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని.. చివరకు తూచ్తొలుత చంద్రబాబు డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టులో టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సెప్టెంబర్లోనే డీఎస్సీ కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు టెట్ (జూలై) పరీక్షలను అక్టోబర్కు మార్చారు. ఈ ఫలితాలను నవంబర్లో విడుదల చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన మేరకు టెట్కు, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఇచ్చినట్టయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్, జూలైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది.సంఘాల పేరుతో కాలయాపనగత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటే టెట్ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించగా 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను జూన్ 25న ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ లేకుంటే ఏప్రిల్లోనే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డీఎస్సీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల 2న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, టెట్కు, డీఎస్సీకి మధ్య కనీసం 90 రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్ను మళ్లీ మార్చారు. వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డీఎస్సీ నిర్వహించి, ఈ ఏడాది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి మరో డీఎస్సీలో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను 2025 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే డీఎస్సీని ప్రకటిస్తే పోస్టులను భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎవరూ అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం, ఇచ్చిన తొలి నోటిఫికేషన్నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.ఇది ముమ్మాటికీ మోసమే..అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10 వేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే. మెగా డీఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండిచేయి చూపించారు. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉంది. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఆ ఉద్యోగాలు వదులుకుని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే లక్షలాదిమందికి ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో నం.117ను తక్షణమే రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. – రామచంద్ర ఎంబేటి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
వైట్ పేపర్.. లైట్ తీస్కో.. 'కరెంట్పైనా కోతలే'!
శ్వేత పత్రం... యథార్థాలు చెబుతుందన్న అర్థాన్ని వదిలేస్తే.. జస్ట్ తెల్ల కాగితం! ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకోవచ్చు. అందుకే... సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల పరంపర మొదలెట్టారు. పోలవరం.. అమరావతి... ఇప్పుడు విద్యుత్ రంగం. కాసుల కోసం ప్రత్యేక హోదాపై రాజీ పడి.. ప్యాకేజీగా తెచ్చుకున్న పోలవరాన్ని తమ వారికి కట్టబెట్టేసి... డబ్బులొచ్చే పనులు మాత్రమే చేసి తాను నాశనం చేసిన జీవనాడి పాపాలను సైతం జగన్పైకే నెట్టేయడమన్నది తొలి తెల్ల కాగితం సారాంశం. తను ఏలిన ఐదేళ్లూ గ్రాఫిక్స్లోనే చూపించిన అమరావతిని కూడా జగనే దెబ్బ తీశారనేది మరో శ్వేతపత్ర కథనం. కోలుకోలేని బకాయిలతో విద్యుత్ సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేసి... సరఫరా వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబు... పాత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించి విద్యుత్ వ్యవస్థను పట్టాలెక్కించిన జగన్పై మూడో పత్రం సహితంగా మరిన్ని అసత్యాలు వండివార్చారు. ఏడు అంశాలపై శ్వేతపత్రాలు తెస్తానని ముందే చెప్పిన బాబు... తన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయటానికి ముందే కొంత ప్రిపేరయ్యారనేదే ఈ రోత పత్రాల లోగుట్టు!! ఇక విద్యుత్తు పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏర్పాట్లు సరిగా లేవని ఉద్యోగులను బెదిరిస్తూ.. బాబు తన సహజ ధోరణి ప్రదర్శించారు!సాక్షి, అమరావతి: అబద్ధాలతో మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు మంగళవారం విద్యుత్ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్ హాలిడే విధించకుండా, విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో జరిగినప్పుడు కూడా ఎక్కడా సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన గత ప్రభుత్వంలో లేని తప్పులను, జరగని నష్టాలను కల్పించి శ్వేతపత్రంలో పొందుపరిచారు. తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలతో కుదేలైన డిస్కంలను ఆదుకున్న వైఎస్ జగన్ వల్లనే విద్యుత్ రంగం రూ.1,29,503 కోట్ల నష్టం వచ్చిందంటూ చంద్రబాబు కనికట్టు విద్యను ప్రదర్శించారు. 2018–19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 5613 మెగావాట్లుకాగా 7,213 మెగావాట్లు అని చంద్రబాబు శ్వేత పత్రంలో అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఆ అబద్దాలు..వాటి వెనుక వాస్తవాలు ఇవీ...డిస్కంలకు అప్పుల పాలు చేసింది మీరేగా చంద్రబాబుడిస్కంల నికర విలువ 2014లో చంద్రబాబు గెలిచే నాటికి సుమారు మైనస్ రూ.4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి... అంటే 2019 నాటికి నికర విలువ దారుణంగా క్షీణించి ఏకంగా మైనస్ రూ.20వేల కోట్లకు చేరింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ళలో రూ.13,225 కోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం సబ్సిడీ చెల్లించింది. 2019–20 నుంచి 2023–24 వరకు నాలుగేళ్ళలోనే సబ్సిడీ, ఆర్థిక మద్దతు కింద జగన్ సర్కారు రూ.47,800.92 కోట్లు చెల్లించింది. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల అప్పులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు పెరిగాయి. అంటే ఏకంగా 56,663 కోట్లు పెరిగాయి. సగటున అప్పుల వృద్ధిరేటు 24శాతం. అదే జగన్ హయాంలో రూ.86,215 కోట్లు కాస్తా..రూ.1,22,518కోట్లకు పెరిగాయి. అంటే కోవిడ్ లాంటి సంక్షోభాలున్నా, చంద్రబాబు చేసిన అప్పులభారం అధికంగా ఉన్నా... జగన్ హయాంలో పెరిగిన అప్పులు కేవలం రూ.36,303 కోట్లు. వాటి వృద్ధిరేటు 7.3 శాతమే. టీడీపీ ప్రభుత్వం 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధర (యూనిట్ రూ.7)లకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా దాదాపు రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని (బ్యాక్ డౌన్)తగ్గించింది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని రుణాలను తీసుకోవాల్సి వచ్చింది. బాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ విద్యుత్ కొనుగోలు వ్యయం (ట్రూ అప్)ను బిల్లుల్లో సర్ధుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ ట్రూ చార్జీలే జగన్ హయాంలో ఏపీఈఆర్సీ అనుమతితో డిస్కంలు వేశాయి. మరిప్పుడు ట్రూ అప్ ఛార్జీలను వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా?, విద్యుత్ చార్జీల టారిఫ్ పెంచరా? అని విలేకరులు అడిగితే ‘నేను అలా అన్నానా’ అంటూ, అవేవీ జరగవని, చార్జీల పెంపు తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ఇవ్వనే ఇచ్చారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలారేసుకోవాలన్నది ఎవరురాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఇదంతా తప్పని ఎన్నికల ముందు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం స్మార్ట్ మీటర్లపై సమాధానం దాటవేశారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే, రైతులపై విద్యుత్ బిల్లులు భారం వేస్తారని తప్పుడు ప్రచారం చేసిన బాబు..మీటర్లపై మీ వైఖరేమిటని అడిగితే అర్ధం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్మార్ట్ మీటర్ల గురించి చెప్పకుండా సోలార్ నెట్ మీటరింగ్ గురించి చెప్పుకొచ్చారు. నిజానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలను రూ.8845 కోట్లు ఇవ్వకుండా ఎగవేశారు. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది.ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.43,744 కోట్లను జగన్ ప్రభుత్వం అందించింది. రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది.మీ వల్ల కానిది జగన్ చేసి చూపించలేదా?కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్ల జాప్యం వల్ల రూ.12,818 కోట్లు నష్టమని అసత్యాల కథ అల్లారు చంద్రబాబు. నిజానికి ఈ రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తెచ్చిందే జగన్. ఈ 2 ప్రాజెక్టుల్లో పనులకు స్థిర (ఫిక్సిడ్) రేటును నిర్ణయించారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి, పెంచడానికి అవకాశం లేదు. ఎగ్జిక్యూషన్ ఏజెన్సీల్లో జగన్ హయాంలో ఎటువంటి మార్పులు, విజిలెన్స్ విచారణలు కూడా జరగలేదు. అంటే ఈ రెండు ప్రాజెక్టుల అమలులో ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జాప్యం జరగలేదు. కోవిడ్ రెండు దశల కారణంగా 2020, 2021ల్లో ఏడాదిన్నరకు పైగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. కోవిడ్ మూడో దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్మికులను సమీకరించడం, వారికి పునరావాసం కల్పించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ పనులు చకచకా జరిపించి 2022 అక్టోబర్లో ప్రారంభిచారు. ఎన్టీటీపీఎస్లో యూనిట్లో అదే ఏడాది డిసెంబరులో ఉత్పత్తి మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది. ఇందులో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. అంతేకాకుండా జగన్ హయాంలో ఉత్పత్తి 63,675 మిలియన్ యూనిట్లు కాస్తా, ఉత్పత్తి 2023–24 నాటికి 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదువ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79పై. (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది‡ తక్కువ. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. దీని వలన ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. ఈ విద్యుత్ను రాజస్థాన్ నుంచి ట్రాన్స్మిషన్ చేయాల్సి రావడం వల్ల అధిక ధర పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ సెకీ విద్యుత్కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ విషయాన్ని దాచిపెట్టారు చంద్రబాబు.ఈ మంచి కనిపించలేదా⇒ పునరుత్పాదక విద్యుత్ను ప్రోత్సహించేందుకు విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని గత ప్రభుత్వంలో ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్కు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో శంకుస్థాపన చేశారు. ⇒ నెడ్కాప్ ఆధ్వర్యంలో దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ⇒ వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ⇒ రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన భద్రత దిశగా చేస్తున్న కషిని గుర్తించి రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను కేంద్రం ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించింది. అలాగే ఏపీట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వరించాయి.ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. ⇒ రాష్ట్రానికి రావాల్సిన అంతరాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీలపై ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ ట్రాన్స్కో) చేసిన పోరాటం ఫలించి రాష్ట్రానికి రూ.306.2 కోట్ల ఆదాయం సమకూరింది. ⇒ మాచ్ఖండ్లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అప్పర్ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చింది. ⇒ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిర్మించిన 12 సబ్స్టేషన్లను అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. ఇందుకోసం మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు. ⇒ ఏపీట్రాన్స్కో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతానికి పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి ‘ది మోస్ట్ అక్యురేట్’ డే–ఎహెడ్ ఫోర్కాస్ట్ మోడల్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 3 శాతం లోపు ఉన్న ప్రసార నష్టాలను 2.69 శాతానికి ఏపీట్రాన్స్కో తగ్గించింది. ⇒ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 14948 మెగావాట్ల నుంచి 17102 మెగావాట్లకి మెరుగుపడింది. 2022–23 సంవత్సరంలో 93 శాతం (12.40 మిలియన్ మెట్రిక్ టన్) ఉన్న బొగ్గు లభ్యత, 2023–24లో 96.52 శాతానికి (14.74 మిలియన్ మెట్రిక్ టన్)కి పెరిగింది. ⇒ వ్యవసాయం, ఆక్వా ,పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలు కలిపి మొత్తం 39.64 లక్షల మంది వినియోగదారులకు ‘నవరత్నాల’ పథకాల ద్వారా ఉచిత, సబ్సిడీ విద్యుత్ను అందించింది. ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించింది. వెనుకబడిన వర్గాల కుటుంబాలకు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్రయ రేఖకు దిగువ ఉన్న వారికి, ప్రొఫెషనల్ గోల్డ్స్మిత్ల దుకాణాలకు కూడా ఉచిత, సబ్సిడీ విద్యుత్ సరఫరాను చేసింది.తెలంగాణ బకాయిలు వసూలుకు చొరవ తీసుకున్నది జగనేతెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్కు చెల్లించాల్సిన రూ.7300 కోట్ల బకాయిలను వసూలు చేసేందుకు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అనేక పర్యాయాలు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి విద్యుత్ బకాయిలు కట్టాల్సిందేనని కేంద్రం తెలంగాణకు చెప్పింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5625 కోట్ల రుణాలను ఏపీ జెన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. కానీ వాడుకున్న విద్యుత్కు తెలంగాణ నుంచి అప్పడు అధికారంలో ఉన్న చంద్రబాబు వసూలు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బకాయిలను కూడా గత ప్రభుత్వం ఖాతాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. మీరేం చొరవ తీసుకుంటున్నారని విలేకరులు అడిగితే మాత్రం ‘వాళ్లేదో అంటున్నారు. కమిటీ వేస్తాం..చూస్తాం’ అంటూ సమాధానం చెప్పలేకపోయారు. -
సంక్షేమం.. సాధికారత.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది. ⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్హెచ్జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ⇒ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
బిల్లుపై బాదుడు
సాక్షి, అమరావతి: ప్రతి నెలా మనం వాడుకున్న విద్యుత్కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లు పైనే చార్జీలు పడటం వినియోగదారులను షాక్కు గురి చేస్తోంది. బిల్లుపై మళ్లీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్తు వినియోగదారులపై ప్రతి నెలా దాదాపు రూ.30 కోట్ల వరకూ ఆర్ధిక భారం పడింది! అది కూడా విద్యుత్ చార్జీ లపై వేసే చార్జీ కావడం విశేషం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబో మని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.ఇదీ సంగతి...!ఇప్పుడు నెలవారీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి. చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టవచ్చు. ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్లు గుర్తు చేస్తుంటాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటో పే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. డిస్కమ్ల వెబ్సైట్, వాటి మొబైల్ యాప్లోనే విద్యుత్తు బిల్లుల చెల్లింపులు చేయాలి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) వెల్లడించాయి.చెల్లింపులపై చార్జీలు ఎలా అంటే..నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్ల యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీసీపీడీసీఎల్ వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, ఈపీడీసీఎల్ వినియోగదారులు www. apeasternpower. com ద్వారా, ఎస్పీడీసీఎల్ వినియోగదారులు www.apspdcl.in వెబ్సైట్ ద్వారా కూడా బిల్లులు కట్టవచ్చు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రూ.2.50 చొప్పున చార్జీ పడుతుంది. భారత్ క్యూఆర్ ద్వారా కడితే బిల్లు మొత్తంపై 0.85 పైసలు చార్జీ పడుతుంది. డెబిట్ కార్డులు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో 0.90 శాతం అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే 1 శాతం అదనంగా పడుతుంది. ఉదాహరణకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు కట్టాలంటే రూ.50 అదనంగా సమర్పించుకోవాలి. ఇలా రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు రూ.3 వేల కోట్ల విద్యుత్ బిల్లులపై 1 శాతం అదనంగా వేసుకుంటే రూ.30 కోట్లు భారం పడుతుంది. కాగా ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్ల ద్వారా ఇన్నాళ్లూ ఫ్లాట్ ఫామ్ చార్జీ కింద బిల్లుకు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం గమనార్హం.నిర్లక్ష్యంగా డిస్కమ్లు...తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్ను ఎనేబుల్ చేసుకోలేదు. దీంతో డిస్కమ్లు తమ వెబ్సైట్, యాప్లో చెల్లించమని సూచించడం మినహా అదనపు భారం నుంచి ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిల్లుల చెల్లింపులపై గందరగోళం నెలకొంది. బిల్లు కట్టడం ఆలస్యమైతే విద్యుత్ సర్వీసులను నిలిపివేయడం, లేట్ పేమెంట్ చార్జీలు విధించటం లాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన విద్యుత్తు సంస్థలు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ అంటే షాకులే..76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16లో టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60 వచ్చింది. అంటే బిల్లు 41.04 శాతం పెరిగింది. నాడు 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49కే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా కానుంది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లను వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు. -
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం
బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్.కొత్తపల్లి, రామగిరి మండలం -
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్నెన్స్ ఫండ్కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
పింఛన్లపై పెత్తనం.. మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో 94 మంది లబ్ధిదారులకు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదుతో ఈ నెల ఫించన్లు నిలిచిపోయాయి. ఇన్నాళ్లూ ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటివద్దే నిశ్చింతగా కోవిడ్ కష్టకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిన ఫించన్లు ఈసారి కొన్నిచోట్ల ఉదయం 8 గంటలు దాటుతున్నా చేతికి అందకపోవడంతో పలుచోట్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్ల మంజూరు మొదలు పంపిణీ దాకా రాజకీయాలకు అతీతంగా, ఎవరి సిఫారసులు అవసరం లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లను అందచేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నంగా తాజాగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. గ్రామాల్లోనూ, వార్డులోనూ సచివాలయాల ఉద్యోగుల వెంట స్థానిక టీడీపీ, జనసేన నాయకులు మోహరించారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందచేస్తూ పోటాపోటీగా నేతలు ఫోటోలు దిగారు. విజయనగరం తదితర చోట్ల తమ అధిపత్యం నిరూపించుకునేందుకు జనసేన – టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూటమి నేతలు కొన్ని చోట్ల తమ ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో పలువురు పింఛన్లను తొలగించినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో పెదంచలలో వైఎస్సార్ సీపీకి ఓటు వేసినందుకు తమ పింఛన్లు నిలిపివేశారంటూ కొందరు లబ్ధిదారులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. కాగా నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 29వ వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి (32) సోమవారం రాత్రి తన ఇంట్లో బాత్రూమ్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. వారం క్రితం స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాతో పాటు సచివాలయ ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సుధారాణి సోమవారం టీడీపీ నేతలతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అనంతరం అనుమానాస్పద రీతిలో మరణించారు.తొలిరోజు 95 శాతం.. మొత్తం 64.75 లక్షల మంది లబ్ధిదారులకుగానూ తొలి రోజు సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి 61 లక్షల మంది (దాదాపు 95 శాతం)కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వలంటీర్లతో సంబంధం లేకుండా పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వలంటీర్లు వారి వెంట వెళ్లి పంపిణీలో పాల్గొన్నారు. ఉదయం కొద్దిసేపు సాంకేతికపరమైన అవాంతరాలు తల్తెత్తడంతో వాటిని సరిదిద్ది ప్రక్రియ కొనసాగించారు.జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నేతల దాడిపింఛన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పింఛన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. చాలాసేపు సద్దుమణగకపోవడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశతో వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పింఛను అందించారని గుర్తు చేసుకున్నారు.వృద్ధులు ఉసూరు..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని వార్డుల్లో లబ్ధిదారులను నిర్దేశిత ప్రాంతానికి రావాలని ఆదేశించడంతో వృద్ధులు, దివ్యాంగులు నానా పాట్లు పడి అక్కడకు చేరుకున్నారు. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో ఐరిస్తో ప్రయత్నించారు. చివరకు సరిపోలడం లేదని, ఫించన్ ఇవ్వలేమని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పలువురు వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మరికొన్ని వార్డుల్లో సచివాలయాలకు తాళం వేసి సిబ్బంది పింఛన్ల పంపిణీకి వెళ్లి పోవడంతో సమాచారం తెలియక పలువురు అక్కడకు చేరుకుని ఇబ్బందులు పడ్డారు.మొదటి నెలలోనే చుక్కలు...– సత్యనారాయణ, 5వ వార్డు, తాడేపల్లిగూడెంఅధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మా వార్డులో పంపిణీకి ఇంటికి రాలేదు. ఎక్కడ ఇస్తున్నారో తెలియదు. సచివాలయానికి వెళితే తాళం వేసి ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.సచివాలయాలకు పరుగు ఉదయం 8 గంటలు దాటుతున్నా సచివాలయ సిబ్బంది జాడ లేకపోవడం, పింఛన్ తీసుకోకుంటే వెనక్కి వెళ్లిపోతుందనే ఆందోళనతో విజయనగరంలో లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు తీశారు. సర్వర్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరంలోని తోటపాలెం సచివాలయంలో ఈ పరిస్థితి కనిపించింది. ఫించన్లపై ఫిర్యాదులు..శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ప్రకాశంలో పడిగాపులు..ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన పింఛన్లను ప్రకాశం జిల్లాలో ఆలయాలు, స్కూళ్లు, ప్రైవేటు స్థలాల వద్దకు రప్పించడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరకు సర్వర్ పనిచేయడంలేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎక్కువ చోట్ల గ్రామాల్లో రచ్చబండ వద్ద కూర్చొని పింఛన్లు పంపిణీ చేశారు.కష్టాలు మొదలయ్యాయిఇన్నాళ్లూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 1వ తేదీ ఉదయం పింఛన్ అందుకున్నాం. ఈసారి మాకు పింఛన్ అందలేదు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల తరువాత గాని మాకు అందే పరిస్థితి లేదు. మాకు కష్టాలు మొదలయ్యాయి.పుట్టా ఫిర్యాదుతో 94 మందికి ఆగిన ఫించన్లువైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో గత నెల వరకు పింఛన్లు పొందిన 94 మంది లబ్ధిదారులకు ఈదఫా డబ్బులు అందలేదు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదులే దీనికి కారణం. మడూరులో 40, అన్నవరంలో 28, టీఓపల్లెలో 26 మందికి పించన్లపై పునర్విచారణ చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో 94 మందికి పింఛన్లను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తమ పింఛన్లను ఆపారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే ఇలా చేశారని, విచారణ జరిపి అర్హత ఉంటేనే తమకు పింఛన్ ఇవ్వాలని బాధితులు పేర్కొన్నారు.ఒంటరి మహిళ ఇక్కట్లు..భర్తకు పొగొట్టుకుని వితంతు పింఛన్ పొందుతున్నా. గత ఐదేళ్లుగా టంఛన్గా ఇచ్చారు. ఈసారి రాలేదు. డబ్బుల కోసం పంచాయతీ అధికారి వద్దకు వెళితే నీ పింఛన్ ఆపమన్నారని చెప్పారు. అర్హత పత్రాలు పరిశీలించిన తర్వాత అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పింఛన్ డబ్బులే నాకు జీవనాధారం.కారు వద్దే పింఛన్ల పంపిణీఓ సచివాలయ ఉద్యోగి తన కారు వద్దకే లబ్ధిదారులను రప్పించుకుని పింఛన్ పంపిణీ చేపట్టిన ఘటన రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. 16వ డివిజన్ పరిధిలోని 41వ వార్డు సచివాలయం ఎమినిటీ సెక్రటరీ వీవీడీ ప్రసాద్కు వాంబే కాలనీలో పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించారు. బ్లాక్–1 వద్ద దివ్యాంగులు, వృద్ధులు, వితంతవులు తన కారు వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక లబ్ధిదారులు అక్కడ బారులు తీరారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు, వైఎస్సార్ సీపీ నేత సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి దీన్ని వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు గంటల తరువాత ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.సాయంత్రం వరకు ఇవ్వలేదు..గతంలో వలంటీర్లు వేకువజామునే మా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ నగదు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే మీకు ఇప్పుడే ఇవ్వమన్నారని చెప్పారు. ఎందుకయ్యా? అని అడిగితే.. ఏమో టీడీపీ వాళ్లు చెప్పారని అంటున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, ప్రాంతం ఇవేమీ చూడకుండా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు. – రాజేంద్రరెడ్డి, మల్లారెడ్డికండ్రిగ గ్రామం, విజయపురం మండలం, నగరి నియోజకవర్గం. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇవ్వొద్దుఅనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వెంగన్నపల్లె, పుప్పాల గ్రామాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్ల పంపిణీ చేపట్టిన పంచాయతీ కార్యదర్శి వసుంధరను అడ్డగించారు. పుప్పాల గ్రామంలో 35, వెంగన్నపల్లెలో 50 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకూడదంటూ టీడీపీ సర్పంచులు దేవన్న, నాగమునిరెడ్డి తమ వర్గీయులతో కలసి అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ జరగలేదు. టీడీపీలో ఆధిపత్య పోరుపింఛన్ల పంపిణీ టీడీపీలో వర్గ పోరుకు వేదికగా మారింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో సుగవాసి సుబ్రమణ్యం వర్గం పంపిణీ చేపట్టగా అదే ప్రాంతంలో పార్లమెంటరీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు వర్గీయలు కూడా దీన్ని ప్రారంభించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా దుద్యాల గ్రామంలో టీడీపీ నాయకుడు కోటేశ్వర్ రెడ్డి మీ అంతు చూస్తానంటూ సచివాలయ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. పంచేందుకు కుమ్ములాట..కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పచ్చ కండువాతో మెప్మా ఆర్పీ..రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్(ఆర్పీ) పచ్చ కండువా మెడలో ధరించి పింఛన్లు పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రామారావు కాలనీకి చెందిన మెప్మా ఆర్పీ జాఫరున్నీసా టీడీపీ నాయకురాలిలా మెడలో పచ్చ కండువా వేసుకుని పింఛన్లు పంపిణీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనిపై శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని టీఎంసీ రవి తెలిపారు. -
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్తో బలమైన నెట్వర్క్ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు
సాక్షి, అమరావతి: సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కుని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. అధికారంలో ఉండగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో అత్యాధునిక కార్యాలయాలు సమకూర్చుకున్న టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాగు పోరంబోకు, రైతుల భూమిని కబ్జా చేసి మంగళగిరిలో అత్యంత విలాసవంతమైన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకోగా విశాఖలో దసపల్లా భూముల్లో పాగా వేసి పచ్చ భవనాలు కట్టుకున్నారు. విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ స్థలం.. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూమి.. కాకినాడలో జెడ్పీ స్థలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్క చాంతాడును తలపిస్తుంది. ఇవన్నీ ఎన్టీఆర్ భవన్లే. అధికారం మాటున చంద్రబాబు సమకూర్చుకున్న పార్టీ కార్యాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కరకట్ట నివాసమే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. నిబంధనలు, చట్టాలకు తూట్లు పొడిచి కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ విలాస రాజ భవనంలోనే చంద్రబాబు ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. అక్రమాల బాటలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో విలాసవంతమైన కోటలు కట్టేశారు. వీటిని కప్పిపుచ్చి నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ కార్యాలయాలపై బురద జల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.పార్టీలకు భూముల జీఓ ఇచ్చిందే బాబునిజానికి చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే విధానాన్ని తెచ్చారు. ఇందుకోసం 2016 జూలై 21న జీఓ నెంబర్ 826 విడుదల చేశారు. రాజధానిలో మూడు కేటగిరీలుగా పార్టీలకు భూములు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికి పైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి. మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, నాడు 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి అర ఎకరం పొందే అర్హత లభించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు రెండు ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్ 8న మరో జీఓ 340 జారీ చేశారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు సంబంధించి 2016లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో లీజు నిబంధనలు బేఖాతర్తాను ఇచ్చిన జీవోకు అనుగుణంగా రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి చాలాచోట్ల భూములు కేటాయించి ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. నాడు చంద్రబాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి. అయితే ఆ నిబంధనను కొన్నిచోట్ల ఉల్లంఘించి ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళంలో 99 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో అత్యంత విలువైన భూముల్లో స్థలాలు కేటాయించుకొని కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అదే జీవో ప్రకారం వివిధ జిల్లాల్లో వైఎస్సార్సీపీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంటే అదేదో ఘోరం అనే రీతిలో దుష్ప్రచారానికి తెర తీశారు.హైదరాబాద్లో రాత్రికి రాత్రేఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని రాత్రికి రాత్రే కేటాయించేసుకున్నారు. వాణిజ్య భూమిగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్ 30న జూబీ్లహిల్స్ మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎమ్మార్వోకు బదలాయించారు. ఆయన అదేరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీగా ఉన్న డి.శ్రీనివాసరావు పేరు మీదకు మార్చారు. అదే రోజున ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గమనార్హం. ఈ పనులన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.7,500 అద్దెకు చంద్రబాబు కేటాయించుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ భవన్ను నిర్మించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు.పోరంబోకు భూమికి మంగళం!ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం స్థలం కోల్కతా–చెన్నై హైవేను ఆనుకుని ఉంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.75 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు రూ.1,000 మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, అక్రమాలకు పర్యాయపదం టీడీపీ జాతీయ కార్యాలయం.గుంటూరులోనూ గుటకాయ స్వాహాతొలుత 2015లో గుంటూరు అరండల్పేటలోని పిచుకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్లో తీర్మానం చేయించి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని పార్టీ భవనం కట్టేశారు.సిక్కోలులో దళితుల భూమిలో పాగాశ్రీకాకుళంలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని టీడీపీ కార్యాలయానికి తీసుకున్నారు. ఉడా, కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా పార్టీ భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. 80 అడుగుల ప్రధాన రోడ్డులో ఉన్న ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు ఉంది. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు.కాకినాడలో జెడ్పీ స్థలంపై కన్నేసి..కాకినాడలో విలువైన జిల్లా పరిషత్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్ ఆఫ్ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్ తీర్మానం ద్వారా టీడీపీ పరం చేశారు. ఈమేరకు 2016 నవంబర్ 1న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.బెజవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలంవిజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్–గురునానక్ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్ శాఖకు 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్ విభాగం ఫ్లోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు. ఇందులో కార్యాలయం కూడా ఉండేది. అయితే టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కూల్చేశారు. ఇరిగేషన్ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయి ంచారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్ చేసి టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. విశాఖలో దసపల్లా కొండను తొలచి..విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేశ్ ప్రారంభించారు. -
ఏపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న బదిలీలు
-
పోలింగ్ అనంతర దాడులపై పూర్తి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాల ప్రజలే లక్ష్యంగా జరుగుతున్న లక్షిత దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిర్దిష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొవ్వూరి వెంకట్రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిపై మరో రాజకీయ పార్టీకి చెందిన వారు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్దిష్ట విధానం ఉందిగా అని ప్రశ్నించింది. అయినా కూడా కేసులు నమోదు చేయడం లేదన్నారు. దాడులపై రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఎంపీ ఫిర్యాదు చేశారని, అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. హింస, దాడులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశాలివ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది. -
Andhra Pradesh: భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ వీసీ–ఎండీ డి.మురళీధర్రెడ్డిలను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్గా నియమించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్కు ఆ జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్కుమార్ సింఘాల్ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్గా బి.రాజశేఖర్కు బాధ్యతలు అప్పగించారు. -
సచివాలయంలో పెండ్యాల ప్రత్యక్షం
సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెండ్యాల శ్రీనివాస్కు ఉన్న రెండు ఈ మెయిల్ ఐడీలకు మెయిల్చేయడంతోపాటు హైదరాబాద్లోని ఆయన చిరునామాకు స్పీడ్పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్ చేసింది.బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షంకాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే. -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
ఐదు సంతకాలు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో సాయంత్రం 4.41 గంటలకు వేద పండితుల పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. సీఎం హోదాలో ఐదేళ్ల తర్వాత తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు, మహిళలు సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరువైపులా నిలబడి రహదారిపై పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. వెంకటపాలెం వద్ద గజమాలతో స్వాగతించారు. సచివాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు సీఎంను సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆలిండియా సర్వీస్ అధికారులు.. పలువురు మంత్రులు సీఎంని కలసి శుభాకాంక్షలు తెలిపారు. తొలి రోజు ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. మొదటి హామీ అయిన మెగా డీఎస్సీపై నిరుద్యోగుల సమక్షంలో తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్న రెండో హామీపై రైతుల సమక్షంలో సీఎం సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపై లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణన దస్త్రంపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని పెట్టారు. ఇక ప్రజల పాలన ఉంటుందని ప్రకటించారు. కాగా డిసెంబర్ 31లోగా 16,347 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..⇒ ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత తమ ఆవేదనను నా దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు. దేశంలోనే ఎక్కువగా మన రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం రేటు ఉంది. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని ఎన్నికల ప్రచారంలో నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేశా. ⇒ గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అనేక సమస్యలున్నాయి. భూములకు రక్షణ లేకుండా చేసే ఈ చట్టంతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. భూమిని కొంతమంది కొనుగోలు చేయగా మరికొందరికి వారసత్వంగా లభించింది. ఆ పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం ఎంత వరకు న్యాయం? దానం చేసినట్లు జగనన్న భూహక్కు అని రాసుకున్నారు. చట్టాన్ని తెచ్చి ఆయన మనుషులను పెట్టుకుంటామన్నారు. సొంత మనుషులతో రికార్డులు మార్చడానికి ప్రయత్నించారు. రికార్డులు మార్చి సెటిల్మెంట్లు కూడా చేసుకున్నారు. ఒకసారి రికార్డులు మార్చితే హైకోర్టుకు వెళ్లాలి. హైకోర్టుకు వెళితే ఏళ్లు పడుతుంది. అందుకే దీన్ని రద్దు చేస్తున్నాం. ⇒ మొదటిసారి రూ.35తో పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. సమైక్య రాష్ట్రంలో నేను దాన్ని రూ.75కి పెంచా. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్లను రూ.1,000కి, తర్వాత రూ.2 వేలకు పెంచా. తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా పెంచింది రూ.వెయ్యి మాత్రమే. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి నెలకు రూ.1,000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పా. పెంచిన వాటితో కలిపి జూలైలో రూ.7 వేలు పెన్షన్ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్ కూడా రూ.6 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు. ⇒ ఉన్నత చదువులు చదివినా సరైన స్కిల్స్ లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కులు తీశారు. మొదటి సారిగా స్కిల్ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది? దేశంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి? దానికి తగ్గ స్కిల్స్ ఉన్నాయా లేదా? అన్నది లెక్కిస్తున్నాం. పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు కాకుండా మన రాష్ట్రం నుంచే మానవ వనరులు సమకూర్చేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ⇒ పేదవాళ్లకు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో గతంలో టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు తీసుకొచ్చాం. రూ.5 చొప్పున అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించాం. చిరు ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లే వారికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కర్నాటకలో ఇందిరాగా>ంధీ పేరుతో, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పేరుతో వాటిని ఏర్పాటు చేస్తే మనం అన్న క్యాంటీన్లను తీసుకొచ్చాం. చాలా మంది అన్న క్యాంటీన్లలో భోజనాలకు విరాళాలు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మూసివేసింది. బృహత్తర కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఐదో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చేశా. ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. -
AP: స్పీకర్ రేసులో సీనియర్లు..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు(బుధవారం) కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ రేస్లో సీనియర్లు పోటీ పడుతున్నారు.కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు కూడా ఏడు సార్లు ఏడుసార్లు గెలిచిన ఎమ్మేల్యేలే.. గతంలో చంద్రబాబును రఘురామకృష్ణం రాజు.. స్పీకర్ పదవి అడగ్గా, 2014 ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడెల శివప్రసాద్కి చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి అదే ఫార్ములా అనుసరిస్తారా? సామాజిక సమీకరణలు పాటించి బీసీ, ఎస్పీలకు ఇస్తారా?. గతంలో స్వీకర్ గా పని చేసిన అనుభవం ఉన్న నాదెండ్లకి మరోసారి అవకాశం కల్పిస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ మరోవైపు, చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. మంత్రుల జాబితా ఇంకా ప్రకటించలేదు. మంత్రి పదవి ఫోన్ల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. రాత్రికి చంద్రబాబు నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. అమిత్ షా అనుమతి తర్వాతే మంత్రుల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. -
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ
అమరావతి, సాక్షి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు కాకుండా.. ఎల్లుండి(జూన్13న) పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏటా జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఒక్కరోజు సెలవును పొడిగించింది విద్యాశాఖ. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్
-
కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ప్రస్తుత సీఎస్ డా.కేఎస్ జవహర్రెడ్డిని బదిలీ చేస్తూ నీరబ్కుమార్ప్రసాద్ను సీఎస్గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్ టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె.విజయానంద్, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్ ప్రకాశ్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులున్నారు. -
ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్..
-
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్పర్ట్స్గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
పశుపోషకులకు బాసటగా..
సాక్షి, అమరావతి: ఎవరైనా ఊహించారా మూగజీవాల కోసం అంబులెన్స్లు వస్తాయని, పాడి రైతు ఇంటి వద్దే ఆ మూగజీవాలకు వైద్యం అందుతుందని.. అయితే ఈ ఊహాతీతమైన విషయాన్ని నిజం చేసింది వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచింది. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో తీసుకొచ్చిన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ పశుపోషకులకు వరంగా మారాయి. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోనే పాడిరైతుల ఇంటి వద్దకు చేరుకుని వైద్యసేవలు అందిçస్తున్నాయి. పాడి రైతుల జీవనా«దారాన్ని నిలబెడుతున్నాయి. ఈ వాహనాలు రోడ్డెక్కి రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే 8.81 లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగాయి. ఏపీలోని సంచార పశు వైద్య సేవలపై కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ బృందాలు అధ్యయనం చేశాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. ఏపీలో సేవలను సమర్థంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే ఆ రెండు రాష్ట్రాలు వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏపీ మోడల్లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో వైద్యసేవలందించడమే లక్ష్యం..గతంలో పశువులకు అనారోగ్య సమస్య తలెత్తితే సుమారు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పాడి పశువులకు రైతుల ఇంటి ముంగిటే వైద్యసేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20వ తేదీన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి 2 చొప్పున రూ. 210 కోట్లతో 340 అంబులెన్స్లను, ప్రత్యేకంగా 1962 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంబులెన్స్లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమో సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్తో సహా 33 రకాల పరికరాలతో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. ప్రథమ చికిత్సతో పాటు చిన్న తరహా శస్త్రచికిత్సలు, కృత్రిమ గర్భధారణ లాంటి సేవలకు ప్రతీ వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వాహనాల ద్వారా 295 పశువైద్యులు, 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. పశువులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వాహనంలో హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్య సేవల అనంతరం తిరిగి ఇంటి వద్దకే తీసుకొచ్చి అప్పగించేలా ఏర్పాటు చేయడంతో రైతులకు వ్యయ ప్రయాసలు, రవాణా భారం తొలగిపోయాయి. 1962 కాల్ సెంటర్కు నిత్యం సగటున 1778 ఫోన్కాల్స్ వస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ వాహనాలు మండలానికి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 11,987 మారుమూల గ్రామాలకు చేరుకుని వైద్య సేవలందించాయి. సుమారు రెండేళ్లలో రూ. 24.48 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 7,55,326 మంది పశుపోషకులకు జీవనోపాధిని కాపాడగలిగారు.⇒ బాపట్ల జిల్లా రామకృష్ణ నగర్కు చెందిన పి.వెంకటేశ్వర్లుకు ఆరు పాడి గేదెలున్నాయి. ఓ పశువు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో కదల్లేని స్థితిలో కూలబడిపోయింది. ఉదయం 9.40 గంటలకు 1962కి కాల్ చేయగా 10.30 నిమిషాలకు అంబులెన్స్ ఇంటికే వచ్చింది. నొప్పి నివారణకు డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే కోలుకుని లేచి నిలబడగలిగింది. ఇప్పటివరకు మనుషుల కోసమే అంబులెన్స్ వస్తుందనుకున్నాం. మూగ జీవాలను సైతం సంరక్షిస్తూ ఉచితంగా మందులు కూడా అందించే సౌకర్యం కల్పించిన సీఎం జగన్కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.నిజంగా గొప్ప ఆలోచన..నాకు ఐదు పాడి ఆవులున్నాయి. పశువులు కొట్లాడుకోవడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. 1962కి ఫోన్ చేయగా గంటలో అంబులెన్స్ ఇంటికే వచ్చింది. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి వైద్యం చేశారు. ఉచితంగా మందులిచ్చారు. గతంలో పశువైద్యశాలకు తరలించేందుకు ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. ఇంటి వద్దే జీవాలకు సేవలందించడం నిజంగా గొప్పఆలోచన. సీఎం జగన్కు కృతజ్ఞతలు. –కాటి విద్యాసాగర్, కోతపేట, బాపట్ల జిల్లాఅరగంటలోనే అంబులెన్స్..మాకు రెండు పాడి గేదెలు, నాలుగు సన్న జీవాలున్నాయి. మేతకు వెళ్లిన ఓ గేదెకు కాలు చీరుకుపోవడంతో నడవలేక పోయింది. 1962కు కాల్చేస్తే అరగంటలో అంబులెన్స్ వచ్చింది. పశువు కాలుకు డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ కట్టారు. నొప్పికి ఇంజక్షన్ ఇచ్చారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పశువుని తరలించే విధానం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం.– ఎం.అసిరిరెడ్డి, దళ్లిపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లామాబోటి రైతులకు ఎంతో మేలు..నాకు 12 ఆవులున్నాయి. ఓ ఆవు కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడింది. 1962కి కాల్ చేశా. వెంటనే అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ చికిత్స అందించారు. ఆవు కోలుకొని నిలబడేలా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల ఏర్పాటు ఆలోచన చాలా బాగుంది. మాబోటి పేద రైతులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. – పర్రి ఉమా మహేశ్వరరావు, పర్రిపుత్రుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా -
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
-
ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. ఈలోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు,…— YSR Congress Party (@YSRCParty) May 16, 2024 -
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్లో లేక రెవెన్యూ కోర్ట్లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు గ్యాంగ్ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీచమైన ప్రచారం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది. అసలు ఈ చట్టంపై కూటమి నేతల ఆరోపణలు.., వాస్తవాలేమిటో తెలుసుకుందాం..కూటమి నేతల ఆరోపణలు–వాస్తవాలుఆరోపణ: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.వాస్తవం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం. ప్రభుత్వమే గ్యారెంటీ సర్టిఫికెట్ ఇవ్వడం. భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం. భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు.ఆరోపణ: భూ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి.వాస్తవం : భూ పత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి, ప్రజలకు గ్యారెంటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు.ఆరోపణ: కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి.వాస్తవం : మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారెంటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు.ఆరోపణ: కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పిలేట్ అథారటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్లీ కోర్టుకే ఉంటుంది.ఆరోపణ: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్ఓకు సమాచారమివ్వాలి.వాస్తవం : సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధింత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికీ పోకుండా ఉంటుంది.ఆరోపణ: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు?వాస్తవం : ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు.ఆరోపణ: వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి.వాస్తవం : వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు.ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు. ఏపీలోనే ఉంది.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది.ఆరోపణ: ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే. కేంద్రానిది కాదు.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్ను కేంద్రం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారెంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్లోపు అమలు చేయాలని ఆదేశించింది.ఆరోపణ: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది.వాస్తవం : ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రూపొందించలేదు.ఆరోపణ: ఈ చట్టం వల్ల రైతులకు నష్టం.వాస్తవం : ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి.ఆరోపణ : ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయి.వాస్తవం : ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు.ఆరోపణ : వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు?వాస్తవం : భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారెంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.ఆరోపణ : స్టాంపు కాగితాలకు బదులు జిరాక్సులు ఇస్తున్నారు.వాస్తవం : గత వంద సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ సర్టిఫికెట్ స్టాంపు కాగితాలకంటే విలువైనది. వీటిని జిరాక్స్ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారెంటీ సర్టిఫికెట్ పోగొట్టుకున్నా, టైట్లింగ్ ఆఫీసర్ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్లీ సర్టిఫికెట్ పొందవచ్చు.ఆరోపణ: న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది.వాస్తవం : ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక న్యాయవాదులకు సివిల్ కేసులు కూడా వస్తాయి.ఆరోపణ : పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి మీది కాదు.వాస్తవం : ఇది దిక్కుమాలిన వాదన. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణ ఇది. కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారెంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వేక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. -
సమాన అవకాశాల... విద్యా విప్లవం
భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్ పేరెంట్కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్ బస్స్టాప్ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్ పద్ధతిలో... అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్. జగన్ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్రూమ్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్ స్క్రీన్ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్మొబైల్: 94405 95858 -
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్లను హబ్లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్లను హబ్లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్లో ఉన్న కార్డియాలజిస్ట్కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్కి, సబ్ రిజిస్ట్రార్కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
ఏపీ ఉద్యోగులతో ఒక మాట!
దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది – స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది. ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోవడం ముఖ్యం.రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువ ఎటు ఓటు వేశారనేది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు – స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలలో పనిచేసేవారు ఎటువైపు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది ఎటు ఓటు వేస్తారనేది కూడా ముఖ్యం. వీరితోపాటు గణనీయ సంఖ్యలో ప్రభుత్వ పోలీసు రంగం ఉద్యోగులు కూడా ఎటు ఓటు వేస్తారనేది చాలా ముఖ్యం. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, సఫాయి శాఖతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మనెంటు ఉద్యోగులు ఎటు ఓటు వేస్తారు, ఎవరు గెలవాలనుకుంటారు అనేది చాలా ముఖ్యమైంది. ఇంతకీ ఈ ఉద్యోగుల ఓటు గురించి ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లోనే ఎందుకు చర్చించాలి? దానికొక ముఖ్య కారణమున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజినల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీ కరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది–స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దాన్ని ఆయన విపరీతంగా ప్రైవేటీకరించి అక్కడినుండి పార్టీ ఫండ్ను జమ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఎంట్రెన్సులు, కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పుట్టగొడుగుల్లా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, గైడ్ రైటింగ్ కంపెనీలు, అడ్వరై్టజ్ ర్యాంకులు మొదలయ్యాయి.వైద్య రంగంలో కూడా ప్రభుత్వ రంగాన్ని మండలాల వరకు అభివృద్ధి చెయ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక్కొక్క డాక్టరు తన సొంత హాస్పిటల్ కట్టి నడపడం మొదలయ్యాయి. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా రంగంలో ఇంగ్లిష్ మీడియం పెట్టి, స్కూళ్ళ అభివృద్ధి ప్రారంభించాక స్కూలు విద్యలో ప్రైవేట్ రంగం విద్య బాగా పడిపోయింది.స్కూలు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ వ్యతిరేక అభివృద్ధిని ఎలా చూడాలి? రాష్ట్రంలో మండలం, గ్రామ స్థాయిలో చిన్న, చిన్న ప్రభుత్వ హాస్పిటల్స్ పెరిగి, వాటిని టెలీ మెడిసిన్తో ముడేసిన వైద్యం... వైద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకమైందా, కాదా? గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం, చిన్న జీతాలతోనైనా 2,50,000 మంది వలంటీర్లను ప్రభుత్వ రంగంలో నియమిస్తే ప్రభుత్వ రంగం విస్తరించినట్టా, ప్రైవేట్ రంగం విస్తరించినట్టా?నిజంగానే బడ్జెట్ డబ్బులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత బీద, దిగువ మధ్యతరగతి రైతాంగానికి, కూలీలకు బదిలీ చేయబడ్డది కనుక ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల ఆగిందనుకుందాం. అయినా ప్రభుత్వ రంగ ఎదుగుదల, ప్రైవేట్ రంగ ఎదుగుదల కోణం నుండి చూసినప్పుడు ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో అమరావతి కట్టడం కోసం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు ఇస్తే ఏ రంగం పెరిగేది? అందుకు బదులు గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జాతీయ వాదంలో కీలకమైంది.ఈ స్థితిలో ప్రభుత్వ రంగ ఉద్యో గులు, ముఖ్యంగా టీచర్లు ఏ ముఖ్యమంత్రిని కోరుకోవాలి? ప్రభుత్వ రంగాన్ని గణనీయంగా పెంచిన జగన్నా, ప్రైవేట్ రంగ అనుకూల బాబునా? మరీ ముఖ్యంగా మోదీల కూటమినా? పవన్ కల్యాణ్కి సినిమా రంగం తప్ప ఏ రంగం గురించి తెలియదు. ఆయన మోదీ, బాబు ఏది చెబితే అది చేస్తాడు.ఉద్యోగస్తులు నిరంతరం ప్రజా జీవన విధానం, వారి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు, అనుకూల ట్రాన్స్ ఫర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి ఆలోచిస్తే క్రమంగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగ ఎదుగుదలకు ఓటెయ్యడమే. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి, రాష్ట్ర, దేశ భవిష్యత్ గురించి మాకెందుకు అనుకుంటే ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ ఉద్యోగులే కోరుకోవడం కాదా? ఉద్యోగుల్లో, ముఖ్యంగా టీచర్లు కమ్యూనిస్టు పార్టీలతో ఉండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు.అదే టీచర్లు ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోకి మారిస్తే, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే, నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలను మారిస్తే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి కదా! కమ్యూ నిస్టు పార్టీలు ఈ నూతన ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జగన్ను ఓడించాలని చూస్తున్నాయి. ఇది విద్యా, వైద్య రంగంలో పెరుగుతున్న ప్రభుత్వ ఆస్తులను వ్యతిరేకించడం కాదా?కమ్యూనిస్టులు ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియంను తీసేసి, ఆ బడులను మూసేసి, విద్యా దోపిడీదారులకు అప్పజెబుతారా? భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్, విద్యా రంగం. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ విద్య పేరుతో చంద్రబాబు మిత్రబృందం వేల కోట్లు దోచుకుంటుంటే జగన్ ప్రభుత్వం ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, మాతృభాష ప్రాంతీయ వాదానికి తలొగ్గి మళ్ళీ ప్రైవేట్ విద్యా వైద్యానికి ఊడిగం చేస్తే ప్రజలు వీరినెలా నమ్ముతారు? విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దాన్ని చంపెయ్యడానికి కమ్యూనిస్టులు నడుం కడితే ప్రజలు ఏమైపోవాలి?ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి పరీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయనిస్తున్నది. అంటే క్రమంగా హిందీని దేశపు ఉత్పత్తి కులాల పిల్లల మీద రుద్ది, ధనవంతులకు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లిష్ అంతర్జాతీయ జ్ఞాన సంపదను అందు బాటులో ఉంచ చూస్తున్నది.ఈ విద్యా విధానాన్ని ఎలా ఎదు ర్కోవాలి? దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చ కుండా విద్యా సమానత్వాన్ని సాధించగలమా? దేశంలో విద్యా వ్యవస్థని, కనీసం స్కూలు విద్యా వ్యవస్థనైనా ప్రభుత్వ రంగంలోకి మార్చడానికి ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మానవ సమానత్వం కోసం పనిచేసేవాళ్ళు సపోర్టు చెయ్యకపోతే ఎలా?అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు బీద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ డబ్బును ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తమ కుటుంబాల గురించే ఆలోచిస్తే ప్రభుత్వ రంగం కూలిపోక ఏమౌతుంది? ఈ సమస్య చాలా కీలకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ముందు ఉన్నది. దేశంలోనే అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ రంగ వ్యతిరేకికే ఓటు వేస్తే జరిగేదేంటి?గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమ జీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణ యించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపర్చే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలతో కొంత రాజీపడాల్సి వస్తే కూడా పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు.ఉద్యోగులు హక్కులను, ఆత్మగౌర వాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు. అయితే, తమ హక్కుల పోరాటం, ఉత్పత్తి రంగంలో పనిచేసే మానవాళిని ఆకలితో మాడ్చ టానికో, బీద పిల్లలు ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చెయ్యడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కు లేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మహిళా సంక్షేమంలో మునుముందుకు
ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విలక్షణమైన పద్ధతిని రూపొందించింది. ముఖ్యంగా మహిళా సంక్షే మాన్ని అభివృద్ధి నమూనాలో ప్రధానాంశంగా తీసుకు వచ్చింది. మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమష్టి ప్రయత్నాలు... రాష్ట్ర అభివృద్ధి పథాన్ని పునర్నిర్వచించడమే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా సంక్షేమంలో సాధించిన ప్రగతి, దాని విధానాల పరివర్తన ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలలో చైతన్యవంతులైన ఓటర్లలో ప్రతిబింబిస్తుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయడం, వెనుకబడిన వర్గాలకు ఇళ్లు, భూమిపై హక్కులు కల్పించడం... ప్రభుత్వం చూపించిన అంకితభావా నికి నిదర్శనాలు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ , తాగు నీరుతో సహా కొత్త హౌసింగ్ కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం గణనీయమైన నిధులను కేటా యించి అక్కడి పౌరుల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిబద్ధతను మరింత నొక్కి చెబుతుంది. అలాగే ‘అమ్మ ఒడి’, ‘విద్యా దీవెన’, ‘వసతి దీవెనల’తో సహా ‘నవరత్నాలు’ అన్నీ... విద్య, ఆర్థిక సాధికారత అంశాలలో మహిళలకు సహాయం చేయడంలో కీలకంగా మారాయి. ఒక్క ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ ద్వారానే 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చగా, మొత్తం వ్యయం రూ. 26,067 కోట్లు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా 78 లక్షల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు 25,570 కోట్లు జమయ్యాయి. ఇది స్వయం సహా యక సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని బలపరిచింది. ‘వైఎస్సార్ చేయూత’, ‘కాపు నేస్తం’ పథకాలు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆర్థిక ప్రగతికీ, స్వాతంత్య్రానికీ భరోసా ఇచ్చాయి. ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకం ద్వారా పాలిచ్చే తల్లులలకూ, శిశు వులకూ పౌష్టికాహారం అందింది. ఐదేళ్ల లోపు 17 ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపన... ముఖ్యంగా అట్ట డుగు వర్గాలకు ఆరోగ్య సంరక్షణ, వైద్యవిద్య అవకా శాలను గణనీయంగా విస్తరించింది. మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధత రాజ కీయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 1,356 నామినేట్ చేసే పోస్టుల్లో 688 మంది మహిళలను నియమించడం ద్వారానే భర్తీ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్ లుగా, స్థానిక పాలనా సంస్థల్లో ఇతర కీలక పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం గుర్తించదగిన విజయం. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా గణనీయమైన నిధులను పంపిణీ చేసింది. ప్రయోజనాలు ఎటువంటి పక్షపాతం లేకుండా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూసింది. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాలు వివాహ సంబంధిత ఖర్చుల కోసం మహిళలకు ఆర్థిక సహాయం అందించాయి. మొత్తం రూ. 427.27 కోట్లను 56,194 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సంక్షేమ పథకాల అమలును కొనసాగించాలనీ, మరిన్ని ప్రముఖ పదవుల్లో మహిళలను నియమించాలనీ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు మహిళా సంక్షేమంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం... భారత రాజ్యాంగ సూత్రాల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది. పరి పాలనా విధానాలు మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా సమగ్రతకు, సమానమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే పాలనకు కొత్త ప్రమాణాన్ని కూడా ఏర్పాటు చేశాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళ గౌరవంగా, అవకాశంతో, శ్రేయస్సులతో కూడిన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెందడం, విస్తరించడం తప్పనిసరి. ఓరుగంటి దుర్గ వ్యాసకర్త నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్, ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్కు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2–9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు. మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం 26 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన 81 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు 3 నెలలు సమయమిచ్చి ప్రిలిమ్స్ను మార్చి 17న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించగా, 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్లో మెయిన్స్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 81 పోస్టులకు అనంతరం మరో 8 పోస్టులను చేర్చడంతో గ్రూప్–1 పోస్టుల సంఖ్య 89కి పెరిగింది. ఇటీవల గ్రూప్–2 ఫలితాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ 1:100 నిష్పత్తిలో 905 పోస్టులకు 92,250 మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేసింది. చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఫలించని ఎల్లో బ్యాచ్ వ్యూహం మార్చి 17న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కుతోచలేదు. చివరికి 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీపై ఎన్నోసార్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాకు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. గత మూడేళ్లల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి, ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ ఇచ్చిన పలు నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఫిబ్రవరిలో గ్రూప్–2 ప్రిలిమ్స్ను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షను రద్దు చేయించాలని యత్నించారు. ఆ చిక్కులను అధిగమించి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ను నిర్వహించింది. తాజాగా గ్రూప్–1 విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగుతిన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్లో, పెట్రోలియం ఇంజనీరింగ్లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు.