
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment