IAS officer
-
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న రాధాకృష్ణన్కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
అన్వాంటెడ్ గర్ల్ టు ఐఏఎస్ ఆఫీసర్!
మగపిల్లాడు పుట్టాలని బలంగా కోరుకుంది ఆ కుటుంబం. అయితే ఆడపిల్లే పుట్టింది. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. నిర్లక్షంగా చూసేవారు. రూర్కెలాలోని పేద కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయికి బాగా చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం పెద్దగా లేకపోవడం వల్ల చదువు కొనసాగించడం అనేది అసాధ్యంగా మారినప్పటికీ వెనకడుగు వేయలేదు. ఒడిషాకు చెందిన సంజిత మహాపాత్రో ఎన్నో సమస్యల మధ్య చదువును పూర్తి చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయింది.‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి!’ అనిపించుకుంటుంది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ సీయీవో సంజిత మహపాత్రో. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది.ముఖ్యంగా పేదింటి బిడ్డల చదువు విషయంలో చొరవ తీసుకుంటుంది. ‘చదువుకోవాలనే కోరిక మీలో బలంగా ఉంటే ఏ శక్తీ అడ్డుకోలేదు’ అంటున్న సంజిత.. ‘చదివింది చాలు. ఇక ఆపేయ్’ అనే పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొంది. అయితే స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఉపకార వేతనాలతో చదువు కొనసాగించింది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సంజిత స్టీల్ అథారిటీ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసింది. వారి కుటుంబం సొంత ఊళ్లో ఇల్లు కట్టుకుంది. ‘ఐఏఎస్ చేయాలి’ అనేది సంజిత చిన్నప్పటి కల. భర్త కూడా ప్రోత్సహించాడు.ఇదీ చదవండి: ఫ్యాషన్తో కల సాకారం చేసుకున్న తాన్యాయూపీఎస్సీకి ముందు ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (వోఎఎస్)లో రెండో ర్యాంకు సాధించింది. ఉద్యోగంలో చేరకుండా యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టింది. అయితే విజయం ఆమెకు అంత తేలికగా దక్కలేదు. మొదటిసారి, రెండోసారి, మూడోసారీ ప్రిలిమినరి పరీక్షలలోనే ఫెయిల్ అయింది. చదువులో ‘సక్సెస్’ తప్ప ఫెయిల్యూర్ గురించి పెద్దగా పరిచయం లేని సంజిత వరుస ఫెయిల్యూర్లతో నిరాశపడి ఉండాలి. అయితే ఆమె ఎప్పుడూ నిరాశ పడలేదు. అలా అని అతి ఆత్మవిశ్వాసానికి పోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరుగుతుంది’ అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం సాధించింది. తాము నడిచొచ్చిన దారిని మరవని వారు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ సంజిత మహాపాత్రో ఈ కోవకు చెందిన స్ఫూర్తిదాయకమైన విజేత. చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!ఒక్కో మెట్టు ఎక్కుతూ...పేద కుటుంబంలో పుట్టిన నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది చిన్నప్పటి కోరిక. చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం. అనుకున్నవన్నీ నిజం కాకపోవచ్చు. అయితే సాధించాలనే పట్టుదల మనలో గట్టిగా ఉంటే అదేమీ అసాధ్యం కాదు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక్కోమెట్టు ఎక్కుతూ నా కలను నిజం చేసుకున్నాను.– సంజిత మహాపాత్రో -
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్లోని భరత్పూర్లో డివిజనల్ కమిషనర్గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్లో కెరీర్ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
ఇంటింటా లక్ష్మీకళ
ఆడపిల్ల పుడితే ‘అయ్యో’ అంటూ సానుభూతి చూపేవాళ్లు మన దేశంలో ఎన్నోచోట్ల కనిపిస్తారు.మధ్యప్రదేశ్లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆడిపిల్ల పుడితే ఆర్థికభారంగా భావించి పురిట్లోనే ప్రాణం తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి మన తెలుగు బిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’తో నడుం బిగించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కు స్ఫూర్తిగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని పదిహేను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం...కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆడపిల్ల పుడితే భారంగా భావించడం నుంచి భ్రూణహత్యల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడారు. ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది. ‘ఈ పరిస్థితుల్లో మనం మార్పు తేవాలి’ అనే పట్టుదల కనిపించింది.ఇదీ చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి‘మనం మాత్రం ఏం చేయగలం సర్, ప్రజలు అలా ఆలోచిస్తున్నారు!’ అని ఆ అధికారులు చేతులెత్తేస్తే కథ కంచికి వెళ్లినట్లే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే మొదలైంది. ముఖ్యమంత్రితో సమావేశం అయిన వారిలో ఐఏయస్ అధికారి నరహరి కూడా ఉన్నారు. ఒక సమస్యకు పది రకాల పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయన సొంతం.‘మనం ఏం చేయలేమా!’... సీఎం ఆవేదనపూరిత మాటలు నరహరి మనసులో సుడులు తిరిగాయి.‘కచ్చితంగా చేయాల్సిందే. చేయగలం కూడా’ అని ఒకటికి పదిసార్లు అనుకున్నారు. పేదింటి బిడ్డ అయిన నరహరికి పేదోళ్ల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆడపిల్ల అంటే పనిగట్టుకొని వ్యతిరేకత లేకపోయినా పేదరికం వల్ల మాత్రమే ‘ఆడబిడ్డ వద్దు’ అనుకునే వాళ్లను ఎంతోమందిని చూశారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి హరియాణ, పంజాబ్... మొదలైన రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో కోణాలలో ఎన్నో ప్రశ్నలు వేశారు.‘మేం బతకడమే కష్టంగా ఉంది. ఇక ఆడబిడ్డను ఎలా బతికించుకోవాలి సారు’ అనే మాటలను ఎన్నో ప్రాంతాలలో విన్నారు. వారికి ఆర్థిక భరోసా ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా! అలా మొదలైందే లాడ్లీ లక్ష్మీ యోజన(గారాల కూతురు). ఇది సంక్షేమ పథకం మాత్రమే కాదు... సామాజిక మార్పు తెచ్చిన శక్తి. ఆడపిల్ల భారం అనే భావన తొలగించేందుకు వారికి ముందు ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సమయంలో అమ్మాయిలను విద్యావంతులను చేయాలి... ఈ కోణంలో పథకానికి రూపకల్పన చేశారు. (అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు)‘పుట్టగానే అమ్మాయిని లక్షాధికారి చేస్తాం’ అని ప్రకటించారు. అయితే ఆ డబ్బు చేతికందడానికి షరతులు విధించారు. అమ్మాయి ఇంటర్ పూర్తి చేయాలి. 5వ తరగతి పూర్తి చేస్తే రూ.2000, 8వ తరగతి పూర్తి చేస్తే రూ.4000 చొప్పున ప్రతి తరగతికి బోనస్ చెల్లింపులు చేశారు. అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మాత్రమే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ కు సంబంధించిన డబ్బులు చెల్లించేవారు. అలా పథకం వందశాతం విజయవంతమైంది.ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్!మధ్యప్రదేశ్లోని చంబల్లోయప్రాంతాల్లో కొన్ని కులాల ప్రజలు రైఫిల్ను సామాజిక హోదాగా భావిస్తారు. మగవారు సైకిల్ మీద తిరిగినా భుజాన తుపాకీ ఉండాల్సిందే! ఆడపిల్లలను పురిట్లోనే చంపేసేవారు కూడా ఆప్రాంతాల్లో ఎక్కువే. ఆప్రాంతాలలో ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రతి 1000 మంది బాలురకు 400 మంది బాలికలే మిగిలారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల వారితో సమావేశం నిర్వహించారు. ‘ఆడపిల్లలను మీరు వద్దనుకుంటూ పోతే వారే కాదు చివరికి మీ కులాలు త్వరలోనే అంతరించి పోవడం ఖాయం’ అని కులపెద్దలకు చెప్పారు. దీంతో వారిలో మార్పు వచ్చింది. అయితే తమకు తుపాకీ లైసెన్స్ లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్ అని నిబంధన విధించారు!2007 నుంచి 50 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. బాలికల లింగ నిష్పత్తి 400 నుంచి 950కి పెరిగింది. ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ద్వారా సామాజిక ఫలాలు అందుతున్న తీరును అధ్యయనం చేసి ఎంతోమంది పీహెచ్డీ చేశారు.లింగ వివక్షకు తావు లేని సమాజాన్ని కల కంటున్నారు నరహరి. అది చారిత్రక అవసరం. తక్షణ అవసరం.భ్రూణహత్యల నివారణకు...‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకం విజయవంతంగా అమలు చేస్తూనే మరోవైపు భ్రూణహత్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, నర్సులు, కిందిస్థాయి సిబ్బందితో విస్తృతమైన విజిలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తప్పుదారి పట్టిన వైద్యులపై కేసులు నమోదు చేశారు. దీంతో చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు దారికొచ్చారు.పేదింటి బిడ్డఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నరహరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్నగర్. నిరుపేదింట జన్మించిన నరహరి కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఆశయంతో ‘ఆలయ ఫౌండేషన్ ’ స్థాపించి స్థానికంగా విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.– భాషబోయిన అనిల్కుమార్, సాక్షి ప్రతినిధి కరీంనగర్ -
ఏసీబీ విచారణకు హాజరైన IAS అధికారి అరవింద్
-
సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!
రాజస్థాన్(Rajasthan)కి చెందిన బిష్ణోయ్ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..రాజస్థాన్లోని అజ్మీర్కి చెందిన పరి విష్ణోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్ బిష్ణోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్ పోలీసు అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్లోని ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జెఆర్ఎఫ్ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. అయితే సివిల్స్ ఎగ్జామ్ తొలి రెండు ప్రయత్నాలలో పరి ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ని వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్టక్(Gangtok)లో ఎస్డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
చంద్రబాబు పాత కేసులు..
-
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్లపై ఒత్తిళ్లు..?
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: సూపర్సిక్స్కు ఎగనామం -
సీఎస్గా విజయానంద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు. -
డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..
డెంటిస్ట్గా సాగిన ప్రయాణం అనూహ్యంగా ఐఏఎస్ లక్ష్య సాధన వైపుకి మారింది. పట్టుదలతో ఐఏస్ సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. అంతలోనే ఇది కాదు నా గమ్యం అంటూ ఆ అత్యున్నత పదవికి రాజీనామా చేసేసింది. కేవలం టీచింగ్పై ఉన్న అభిరుచితో ఆమె తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ విస్తుపోయారు. ఇదేంటి అని అంతా నోరెళ్లబెట్టారు..కానీ ఆమె మాత్రం మనసుకు నచ్చింది చేయడంలో కలిగే అనుభూతి వేరేలెవెల్ అంటోంది. ఇంతకీ ఎవరామె..? అంతటి అత్యున్నత హోదాను ఎందుకు తృణప్రాయంగా వదిలేసిందంటే..?ఢిల్లీలోని సదర్ ప్రాంతానికి చెందిన తనూ జైన్ సాహసమే ఊపిరి అన్నట్లుగా ఊహకందని నిర్ణయాలతో అందర్నీ విస్తుపోయేలా చేస్తుంటారామె. ఆమె ప్రతి ఆలోచన వెనుక ఎంతో పెద్ద లక్ష్యం, కృతనిశ్చయాలు ఉంటాయి. అవి ఆలోచింపచేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇక జైన్ పాఠశాల విద్యని కేంబ్రిడ్జ్ స్కూల్లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీని చదువుతూనే సివిల్స్పై దృష్టిసారించింది. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్లో విజయం సాధించినప్పటికీ మెయిన్స్లో చాలాసార్లు వైఫల్యాలను ఎదుర్కొంది. అయినా.. పట్టుదలతో 2014లో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 648ని సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత జైన్ సివిల్ సర్వీస్కి సంబంధించి.. వివిధ హోదాల్లో ఏడేళ్ల పాటు సేవలందించారు. అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో అంతటి అత్యున్నత హోదాని వదులుకోవాలనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా తనూ తనలా యూపీఎస్సీ సన్నద్ధమయ్యేవాళ్లు ఎదుర్కొనే సవాళ్లలో.. అండగా నిలబడాలనే దృక్పథంతో ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. "సివిల్ సర్వీస్లో ఉద్యోగం సాధించాలన్న తన కల నెరవేరిపోయింది. అలాగే తనలా ఇతరులు కూడా తమ డ్రీమ్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది." జైన్. ఆ నేపథ్యంలోనే ఆమె 'ఐసీఎస్ తథాస్తు' అనే సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించింది. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారికి మార్గదర్శకం చేయడమే గాక ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆచరణాత్మక సలహాలతో ఆకట్టుకుంటారామె. ఆ వైవిధ్యభరితమైన బోధనాపద్ధతుల కారణంగా ఆమెకు సోషల్మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేగాదు ఇన్స్టాలో ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు జైన్. మాక్ ఇంటర్వ్యూలు, ప్రిపరేషన్ స్టాటజీలను మెరుగుపరుచుకోవడంపై మంచి మంచి సలహలిస్తుంటారు జైన్. తనలా ఇతరులు కూడా సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించే వ్యక్తులు దొరకడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వివాహాల గూఢచారి...భావనా పాలివాల్) -
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్ని అందించే స్టడీ సెంటర్గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
సార్ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుని టార్గెట్ చేసిన చింతకాయల విజయ్
-
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చోటు సంపాదించారు.ఉన్నత వ్యాపార కుటుంబంఅమిత్ కటారియా రియల్ ఎస్టేట్లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా. -
తెలంగాణ ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వం వరుస ఆంక్షలు
-
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్ఫోన్కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్లోని జైపూర్లో జన్మించిన నేహా.. జైపూర్లో తన పాఠశాల విద్యను, భోపాల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్మూర్తి. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. -
ఆయన జీవితం స్ఫూర్తిమంతం
ఈ దేశంలో నిజమైన పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాకమునుపే, నకిలీ విజేతలు వెలిగిపోయారు. ఇప్పుడు ఆ మూసను బద్ధలుకొట్టడమే ఈ తరం చేయాల్సిన పని. ‘నా అన్వేషణలో కత్తి చంద్రయ్య’ అనే జీవితగాథ రాసిన కత్తి కళ్యాణ్ చేసింది ఇదే! ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తే ఒక మహామనిషితో కరచాలనం చేస్తాం. తెలుగు నేల నుంచి ఆవిర్భవించిన తొలి దళిత కలెక్టర్ ‘పేదల కలెక్టర్’గా ఎట్లా ఎదిగి వచ్చాడో తెలుసుకుంటాం. ఆయన చేసిన సేవలకు ఆయనే గనుక ఉన్నతవర్గంలో పుట్టి ఉంటే ఈ పాటికి ఆయన పేరు నలుదిశలా మార్మోగేది.1924లో నిరుపేద రైతుకూలీ కుటుంబంలో జన్మించిన కత్తి చంద్రయ్య చదువే లోకంగా ఎదిగి వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు మద్రాసులో సైతం ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత మొదటి కలెక్టర్గా ఆయన పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సైతం ఆయన కలెక్టర్గా సేవలందించారు. ఏ జిల్లాలో ఉద్యోగం చేసినా తనదైన మార్క్ ఉండేది. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, పేదలకు పంచాలన్నా కత్తి చంద్రయ్యకే సాధ్యం అనేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.ఆయనలో ఒక గొప్ప మేధావి ఉన్నాడు. పురాతన చరిత్రను తెలుసు కోవడం, పత్రికలకు, మ్యాగజైన్లకు వ్యాసాలరూపంలో రాసి ప్రచారం చేయడం అభిరుచిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంచి పాఠకుడిగా ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. అలాగే తన పరిశోధనలో తెలుసుకున్న విషయాలను ఈ సమాజం ముందు పెట్టడానికి విలువైన రచనలు చేశారు. ‘దళిత్ ఎకానమీ’ అనే రచన అందులో ఒకటి. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో వేమన వంటి ప్రజా కవులను గురించి కూడా వ్యాసాలు రాశారు.చదవండి: కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!ఈ పుస్తకంలో చంద్రయ్య కాలం నాటి దినపత్రికల కట్టింగ్లను పొందు పరిచాడు రచయిత. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇవాళ పరాజిత జాతుల చరిత్రలన్నీ వెలికితీసే పని మరింతగా జరగాలి. నిజం చెప్పులేసు కునేలోపే, అబద్ధాలు ప్రపంచమంతా తిరిగి వస్తున్న యుగంలో మనం జీవి స్తున్నాం. నిజాలకు పట్టం కట్టాలి, నిజమైన ఆదర్శనీయుల చరిత్రను ఈ సమాజానికి అందించాలి. ఈ పుస్తకం విరివిగా ప్రజల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా విద్యార్థులు చదవాలి. చంద్రయ్య పేరు మీద ఉత్తమ అధికారులకూ, పరిశోధ కులకూ, చరిత్ర రచయితలకూ అవార్డులివ్వాలి. ఇందుకోసం ప్రజలు, ప్రభు త్వాలు పూనుకోవాలి. ఆ దిశలో వ్యవహరించడానికి అవసరమైన చైతన్యం కలిగించడానికి ఈ పుస్తకం ఒక దారి చూపుతుంది.– డాక్టర్ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడెమియువ పురస్కార గ్రహీత -
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
GHMC commissioner: వర్క్ ఫ్రమ్ ఝార్ఖండ్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు. ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్లు, సందర్భాన్ని బట్టి వెబినార్లు నిర్వహిస్తున్నారు. కుటుంబ సర్వేపైనా ఆరా.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు. ఇన్చార్జ్ ఆఫీసర్లు ఈ నేపథ్యంలోనే గ్రేటర్లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్చార్జులుగా నియమించారు. అడిషనల్ కమిషనర్లు ఎస్.సరోజ, ఎన్. యాదగిరిరావు, ఎస్.పంకజ, ఎన్. సామ్రాట్ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, సీఎన్.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. ఫైళ్ల క్లియరెన్స్ సైతం.. జీహెచ్ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం. డ్యూయల్ రోల్.. సాధారణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్గా ఉన్నందున, వేరెవరినీ ఇన్చార్జిగా నియమించలేదని సమాచారం. -
నాగారం ల్యాండ్ కేసు.. మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు..
-
దేవుడిచ్చిన కూతురు తల్లై ఎదురొచ్చింది!
డాక్టర్ జె. రాధాకృష్ణన్కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు. సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్కే తీసుకు వచ్చింది సౌమ్య. సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది! 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది. 2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.ఎకనామిక్స్లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్. -
TG: అమోయ్కుమార్పై ఈడీకి ఫిర్యాదుల వెల్లువ
సాక్షి,హైదరాబాద్:ఐఏఎస్ అధికారి, మాజీ రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం లోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు అమోయ్కుమార్పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా శనివారం(అక్టోబర్ 26) వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరో ఫిర్యాదు చేశారు.ధరణిని అడ్డం పెట్టుకొని అమోయ్కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 200ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫ్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. 40 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నా మందీ మార్బలంతో వచ్చి వెళ్లగొట్టే యత్నం చేశారన్నారు. తమ భూములపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఉదయం ఏడు గంటలకే రిజిస్ట్రేషన్ కానిచ్చి రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారన్నారు.సర్వేనెంబర్ 111 నుంచి 179 వరకు ఉన్న 460 ఎకరాల భూమిని కాజేసి సమారు 30 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని శంకర్హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్తో పాటు ఇతర అధికారులు,పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పదేళ్లలో అక్రమార్జన రూ.1000 కోట్లు -
TG: ఐఏఎస్ అధికారికి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.అమోయ్కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్కుమార్ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కలెక్టర్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు -
ఐఏఎస్ లకు హై కోర్టు షాక్..
-
ఆమ్రపాలి.. ఆంధ్రాకే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఇటీవల డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ మరికొందరు ఐఏఎస్ అధికారులతోపాటు ఆమ్రపాలి కూడా క్యాట్ను ఆశ్రయించగా, బుధవారంలోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.క్యాట్ ఈ నిర్ణయంతో ఏపీకి వెళ్లాల్సిన వారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. డీవోపీటీ ఆదేశాల కనుగుణంగా యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశించడంతో, హైకోర్డు ఎలాంటి ఆదేశాలిస్తుందో తెలియనందున ముందైతే ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల వరకు వేచి చూడనున్నారు. ఏపీకి వెళ్లినా, రెండు రాష్ట్రాల పరస్పర అవసరాలు, ఒప్పందాలతో తిరిగి తెలంగాణకు రప్పించే అవకాశాలూ ఉంటాయనే ప్రచారం మొదలైంది. బల్దియా బాస్ ఎవరో.. మరోవైపు, ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఎవరిని నియమించనున్నారనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సీనియర్ ఐఏఎస్ను నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ గురించి, నగర నైసర్గిక స్వరూపం గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారిని నియమించగలరనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రక్రియ జరిగేంతదాకా సీనియర్ ఐఏఎస్ అధికారి అవసరమని అర్బన్ప్లానింగ్ నిపుణులు అంటున్నారు.ఎక్కువ కార్పొరేషన్లుగా విభజన జరిగాక ఎవరున్నప్పటికీ, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యేంత వరకు తగిన అనుభవమున్న సీనియర్ ఉండాలంటున్నారు. 2025 చివర్లో, లేదా 2026 ఆరంభంలో జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశమున్నందున, అప్పటివరకు సీనియర్ అధికారి అవసరమంటున్నారు. ప్రస్తుతానికి.. కొంత కాలం వరకు ఎవరైనా సీనియర్ అధికారికి జీహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలప్పగించవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆ ఐదుగురు ఐఏఎస్లకు బిగ్ షాక్ -
క్యాట్ పిటిషన్ కహానీ
-
క్యాట్లో ఐఏఎస్లకు చుక్కెదురు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఉత్తర్వులు
సాక్షి,హైదరాబాద్: తాము పని చేస్తున్న రాష్ట్రంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అదే సమయంలో డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్రాస్, సృజనలకు బిగ్ షాక్ తగిలింది. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాల్సిన వారు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది. 5:12pmక్యాట్ తీర్పులో ముఖ్యాంశాలు..సుపరిపాలన కోసం అధికారులను బ్యాలెన్స్ చేసేందుకు కేంద్రానికి ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందిఒక రాష్ట్రంలో ఎక్సెస్గా అధికారులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి కేటాయింపులు జరిపే అధికారం డీవోపీటీకి ఉంటుందిఐదుగురు ఐఏఎస్ల కేటాయింపుల్లో ఒక్కొక్కరికి ఒక్కొ కారణం ఉన్నప్పటికీ డీవోపీటీదే తుది నిర్ణయంహైకోర్టు గత ఆదేశాలలో వన్ మాన్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పకపోయినా, కమిటీని నియమించే అధికారం డీవోపీటీకి ఉంటుందిడీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలి. ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది 5:02pmఐదుగురు ఐఏఎస్లకు బిగ్ షాక్క్యాట్లో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురుడీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సిందేనవంబర్ మొదటి వారంలో డీవోపీటీ కౌంటర్ వేయాలి4:48pmఐఏఎస్ పిటిషన్పై ముగిసిన వాదనలుతీర్పు చదువుతున్న క్యాట్ ధర్మాసనం 4:32pmముగిసిన అయిదుగురు ఐఏఎస్ల తరపు న్యాయవాదుల వాదనలుడీవోపీటీ తరుపున వాదనలు ప్రారంభం 4:25pmక్యాట్ ఐఏఎస్ల స్థిర నివాసాల పైనే కౌన్సిల్ వాదనలుస్థిర నివాసాల ఆధారంగా జరగాల్సిన కేటాయింపులు సక్రమంగా జరగలేదని కౌన్సిల్ వాదనలుఐఏఎస్ స్థిర నివాసాల (Domicile) ఐదు రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి(first posting, place of birth, address of metriculation, home town , 371(d)ఐఏఎస్ వాకాటి కరుణ, వాణి ప్రసాద్, శ్రీజన విషయంలో స్థిరనివాసం ఆధారంగా కేటాయింపులు చేయాలని ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ సిఫార్స్ చేసినా డీవోపీటీ పరిగణలోకి తీసుకోలేదు.ఐఏఎస్ ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ విషయంలో స్వాపింగ్ ద్వారా మ్యుచువల్గా కేటాయింపులు కోరారుకానీ డీవోపీటీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు 3:58pmఅమ్రపాలి తరుపున కౌన్సిల్ స్థానికత విశాఖపట్నం ఉన్నపటికీ స్వాపింగ్ ద్వారా తెలంగాణలో ఉన్నారుస్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్లో ఉందా - క్యాట్1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు - క్యాట్గైడ్ లైన్స్లో సీనియర్,జూనియర్తో సంబంధం లేకుండా స్వాపింగ్ చేసుకోవచ్చు - ఆమ్రపాలి కౌన్సిల్ 3:41pmముగిసిన ఐదుగురు ఐఏఎస్ల తరపు న్యాయ వాదుల వాదనలుడీవోపీటీ తరపున వాదనలు ప్రారంభం. 3:41pmక్యాట్ ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో వరదలతో ప్రజలు ఇబ్బంది పడటం చూశాంఅలాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రజాలకు సేవ చేయాలని లేదా - క్యాట్బోర్డర్లో సమస్యలు వస్తే వెళ్ళారాఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా ?? - క్యాట్అమ్రపాలి తరుపున కౌన్సిల్స్థానికత విశాఖపట్నం ఉన్నపటికీ స్వాపింగ్ ద్వారా తెలంగాణలో ఉన్నారుస్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్లో ఉందా - క్యాట్1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు - క్యాట్గైడ్ లైన్స్లో సీనియర్,జూనియర్తో సంబంధం లేకుండా స్వాపింగ్ చేసుకోవచ్చు - ఆమ్రపాలి కౌన్సిల్ 3:30pmవాకాటి కరుణ కౌన్సిల్ వన్ మ్యాన్ కమిటీ డీవోపీటీకి ఇచ్చిన నివేదికను మాకు ఇవ్వలేదు - వాకాటి కరుణ కౌన్సిల్వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వకుండానే డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిందిఐదుగురు ఐఏఎస్లకు వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ను చూపలేదుDomicile (స్థిర నివాసం)ఆధారంగా ఐఏఎస్ వాకాటి కరుణ హైదరాబాద్ చెందిన వారని ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ చెప్పింది - వాకాటి కరుణ కౌన్సిల్కానీ కమిటీ చేసిన సిఫార్సులను డీవోపీటీ పట్టించుకోలేదుఅసలు స్థిర నివాసానికి సరైన అర్థం ఏమిటో చెప్పాలని క్యాట్ ప్రశ్నడీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతున్నాంముగిసిన వాకాటి కరుణ కౌన్సిల్ వాదనలు 3:23pmవాకాటి కరుణ కౌన్సిల్ హై కోర్టు గత ఆదేశాల ప్రకారం ఐఏఎస్ల అభ్యర్థనను డీవోపీటీ పరిగణలోకి తీసుకోవాలికానీ డీవోపీటీ నేరుగా నిర్ణయం తీసుకోకుండా వన్ మ్యాన్ కమిటీని నియమించిందివన్ మ్యాన్ కమిటీని నియమించి నిర్ణయం తీసుకోమని హై కోర్ట్ ఆదేశించలేదుఐఏఎస్ల కేటాయింపుపై డీవోపీటీకే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కానీ వన్ మ్యాన్ కమిటీ సిఫార్సును డీవోపీటీ ఎలా అమలు చేస్తుందిక్యాట్ ప్రశ్నవన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడే ఎందుకు హై కోర్టుకు వెళ్ళలేదు వన్ కమిటీనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు మార్చ్ 21, 2024న వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు 3:00pmఐదుగురు ఐఏఎస్ల తరఫున హాజరైన ఐదుగురు న్యాయవాదులుఒక్కొ పిటిషన్పై వేర్వేరుగా వాదనలు వింటున్న క్యాట్ ధర్మాసనంఐఏఎస్ వాకాటి కరుణ పిటిషన్పై వాదనలు ప్రారంభంవాకాటి కరుణ తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది లక్ష్మి నరసింహ2.40PMఐఏఎస్ అధికారుల పిటిషన్పై మధ్యాహ్నం గం. 2.35ని.లకు విచారణ తిరిగి ప్రారంభంఐఏఎస్ అధికారుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. 12.10PM మధ్యాహ్నానికి విచారణ వాయిదాక్యాట్ను ఆశ్రయించిన ఐదుగురు ఐఏఎస్లుమధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు11.20AMహైదరాబాద్: కాసేపట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)లో ఐదుగురు ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్ను ఐదుగురు ఐఏఎస్లు ఆశ్రయించిన విషయం తెలిసిందే. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్లు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో ఐఏఎస్ సృజన గుమ్మాల కోరారు. ఐఏఎస్లు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత
-
అమ్మానాన్నల మాట.. సివిల్స్కు బాట
చదువుకోవాలి.. చదువుకొని తన కాళ్లపై తాను నిలబడి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన అమ్మ మాట.. సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఉండాలని చూపిన నాన్న బాట.. ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పుడే తాను ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. దేశంలోనే యువ ఐఏఎస్లలో ఒకరిగా నిలిచి పాలనలో పరుగులు పెట్టిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ మీకోసం..బాల్యం.. విద్యాభ్యాసంవల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలోనే..అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు ఎంపిక అయ్యారు.శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలుముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.కొత్త ఆశల ఉగాది అంటే ఇష్టంపండుగలలో కొత్త ఆశ ఆశయాలతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ అంటే నాకెంతో ఇష్టం. చదువుతోపాటు ఆటలు కూడా ఆడేవాళ్లం.ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టంప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్నారు.భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లువల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది. -
‘ఫోర్త్ సిటీ’ కోసం ప్రత్యేక అథారిటీ!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులోని ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ‘ఫోర్త్ సిటీ’కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనువుగా ఉండే ఫ్యూచర్ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతోపాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నారని తెలిసింది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం... హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఫోర్త్ సిటీ అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్తోపాటు దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్, గ్రేటర్ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. ఆయా విభాగాల ఏర్పాటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, తలెత్తిన ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగనుంది. సింగిల్ విండో విధానం ఉండేలా... కొత్తగా ఏర్పాటవుతున్న నగరం కావడంతో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ అదీనంలో పని చేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకురానున్నారని తెలిసింది. దీనివల్ల భూములు సమీకరణ, కేటాయింపు, అనుమతుల మంజూరు, మౌలిక వసతుల అభివృద్ధి.. ఇలా ప్రతి అంశంలోనూ సింగిల్ విండో విధానం అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘకాలం సజావుగా సాగేలా... ‘గ్రేటర్’పరిధిలో రోడ్డు, డ్రైనేజీ, ఫుట్పాత్ల వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పాత నగరం, ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందిన కొత్త నగరంలోనే కాదు.. గత కొన్నేళ్లుగా కొత్త హంగులు సంతరించుకుంటున్న ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్తోపాటు పశి్చమ ప్రాంతంలోనూ సమస్యలు తప్పట్లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా సమకాలీన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ సైతం రూపొందించాలని యోచిస్తోంది. కనిష్టంగా రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం అవసరమైతే ప్రత్యేక అ«థారిటీతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అధ్యయనం చేయించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు... త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉండనున్నాయని తెలిసింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీ సహా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సిబ్బంది, చట్టబద్ధతపైనా నిర్ణయాలు ఉండనున్నాయి. ప్రస్తుతానికి హైడ్రాను కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా పిలిచే జీవోతో ఏర్పాటు చేశారు. దీనికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించాలంటే చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో విధాన నిర్ణయం తీసుకోనుంది. దీని ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ అయ్యాక ఆర్డినెన్స్ జారీ చేయనుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో హైడ్రా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాలోకి నేరుగా నియమించుకొనే, డిప్యుటేషన్పై తీసుకొనే సిబ్బందిపైనా కేబినెట్లో నిర్ణయం ఉండనుందని సమాచారం. -
ఐఏఎస్.. ఐపీఎస్ల ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి
వాళ్లు అఖిలభారత సర్వీసు అధికారులు.. ప్రజాసేవను వృత్తిగా ఎంచుకుని ఉన్నతమైన లక్ష్యాలతో ఎన్నో కఠినపరీక్షలు గెలిచి ఈ అత్యున్నత సర్వీసుకు ఎంపికైనవారు. అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ బాధ్యతలలో ఉన్న అధికారులను ఎలా చూడాలి? ఎవరి సామర్థ్యం ఏమిటో గుర్తెరిగి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటు వేరు. నచ్చనివారికి నరకం చూపిస్తూ ఆనందించడం వారికి అలవాటు. అదిగో అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో బాగా పనిచేసిన ఓ పలువురు ఐఎఎస్ ఐపీఎస్లను ఎంచుకున్నారు. వారి ఆత్మగౌరవంపై ఆటవికంగా దాడిచేస్తున్నారు.. ఓ హోం గార్డుతోనో.. ఓ రౌడీషీటరుతోనో కిందిస్థాయి అధికారులు కూడా వ్యవహరించని రీతిలో డీజీ స్థాయి అధికారులనూ ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అవమానిస్తోంది. పోస్టింగ్ ఇవ్వకపోగా.. ఉదయం డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకం చేసి సాయంత్రం వరకు వెయిటింగ్ చేసి వెళ్లమంటున్నారు.. ఇందుకోసం ఏకంగా ఓ ఉత్తర్వు కూడా జారీ చేయడం చూసి యావత్ అఖిలభారత సర్వీసు అధికారులందరూ విస్తుపోతున్నారు. ఈ ఉన్మాద మెమో గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం దేశ చరిత్రలో ఎవరూ తీసుకోలేదని మాజీ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్కుమార్, స్వరణ్జిత్సేన్ వంటివారు వ్యాఖ్యానించారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి కక్షపూరిత రాక్షస పాలన కరాళ నృత్యం చేస్తోంది. ఓ పక్క ప్రజలపైనే టీడీపీ శ్రేణులు రాత్రీ పగలూ దాడులతో భయంకర వాతావరణాన్ని సృష్టిస్తుంటే.. ఇంకో పక్క ప్రభుత్వమే అధికారులపై పడింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర కీలక అధికారులపై నారా లోకేశ్ విరచిత రెడ్ బుక్ రాజ్యాంగంతో విరుచుకుపడుతోంది. వెంటపడి వేధిస్తోంది. వారిపట్ల నిరంకుశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ, అవమానాలకు గురిచేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. అఖిల భారత సర్వీసుల అధికారుల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏపీలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వ పోకడలపై జాతీయ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చోదక శక్తిగా వ్యవహరించేందుకు దేశంలో ప్రత్యేకంగా అఖిల భారత సర్వీసులకు రూపకల్పన జరిగింది. ఈ ఉన్నతాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది’ అని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఐపీఎస్ అధికారులకు పొస్టింగులు ఇవ్వకుండా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్టు దుష్ట సంప్రదాయానికి తెరతీసిన చంద్రబాబురాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొంది, సీఎంగా బాధ్యతలు స్వీకరించక ముందే చంద్రబాబు దుష్ట సంప్రదాయాలకు తెరతీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అనంతరం ఏకంగా 10 మంది ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారులకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత కక్షపూరితంగా, నిరంకుశత్వంతో వ్యవహరించలేదు. ప్రభుత్వం మారిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం సహజమే. కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యతల ప్రకారం అధికారులకు పోస్టింగులు ఇస్తుంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్లను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయమని కూడా ఆదేశిస్తుంది. ఆ తరువాత కొద్ది రోజులకే వారికి ఇతర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చి, వారి సేవలను సద్వినియోగం చేసుకుంటుంది. అంతేగానీ ఏకంగా ఇన్నేసి రోజులు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టదు.అపాయింట్మెంటూ ఇవ్వని బాస్లుసాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి బాస్లైన సీఎస్, డీజీపీలను అపాయింట్మెంట్ అడిగి కలిసే వీలుంటుంది. తమ సర్వీసుకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా విషయాలను వారు సీఎస్, డీజీపీల దృష్టికే తీసుకువెళ్లాలి. వాటిని సరైన దృక్పథంతో పరిశీలించాల్సిన బాధ్యత సీఎస్, డీజీపీలపై ఉంది. కానీ సీఎం చంద్రబాబు చెప్పడంతో ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎస్, డీజీపీ రెండు నెలలుగా అపాయింట్మెంటే ఇవ్వడం లేదు. ఇక్కడితోనూ చంద్రబాబు రెడ్ బుక్ దాహం తీరలేదు. ఐపీఎస్ అధికారులను మరింతగా అవమానించాలని పట్టుబట్టారు. ఆ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ సీహెచ్ ద్వారకా తిరమలరావుకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో డీజీపీ ఈ నెల 12న ఓ విభ్రాంతికరమైన మెమో జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న 23 మంది ఐపీఎస్ అధికారుల్లో 16 మందికి ప్రతి రోజూ డీజీపీ కార్యాలయానికి రావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఉదయం 10 గంటలకు వచ్చి వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్లో సంతకం చేయాలని, సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి, మళ్లీ ఆ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలి’ అని ఆదేశించారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన డీజీపీ కేవలం రాజకీయ ఒత్తిడితో సాటి అధికారులను ఈ విధంగా ఆదేశించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వెయిటింగ్ మెమో.. ఇదేమి పద్ధతి?ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వనప్పుడు వారిని సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయమని ఆదేశిస్తారు. తరువాత కొద్ది రోజులకే వారికి పోస్టింగులు ఇస్తారు. ఇటీవల పోస్టింగులు ఇవ్వని 16 మంది ఐపీఎస్ అధికారులను కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాజా ఆదేశాల ప్రకారం వారు రోజూ డీజీపీ కార్యాలయానికి రావాలి. వెయిటింగ్ హాల్లో పడిగాపులు కాయాలి. అన్ని గంటలపాటు వారు ఏం చేస్తారు అన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబు సర్కారుకు లేదు. ఇలా అధికారులను రోజుకో రీతిలో అవమానిస్తూ చంద్రబాబు ఓ రాజకీయ సైకోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోమ్గార్డు స్థాయి ఉద్యోగి పట్ల కూడా గతంలో ఏ ప్రభుత్వమూ ఈ రీతిలో వ్యవహరించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.రాజ్యాంగహక్కుల ఉల్లంఘనే.. డీవోపీటీకి నివేదిక..!చంద్రబాబు ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపట్ల అమానవీయంగా, కర్కశంగా వ్యవహరించడం అధికారులుగానే కాదు.. పౌరులుగా కూడా వారి రాజ్యాంగప రౖమెన హక్కుల ఉల్లంఘనేనన్న విమర్శలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, డీజీపీలుగా, ఉన్నత హోదాల్లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ల కక్షపూరిత చర్యలను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాన్ని వాట్సాప్ గ్రూపుల్లో, ప్రైవేటు సంభాషణల్లో నిరసిస్తున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు.టీడీపీ నేత వెంకటరెడ్డి ట్వీటో, ఎల్లో మీడియా పోస్టులో రాష్ట్రంలో అధికారుల పోస్టింగులను నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. – అనంతపురం జాయింట్ కలెక్టర్గా హరితకు పోస్టింగ్ ఇచ్చి, ఆ వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించిన ఉదంతంపై రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుగత రెండు నెలలుగా రాష్ట్రంలో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు సామాన్యులే లక్ష్యంగా టీడీపీ గూండాలు వరుస హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలతో బీభత్సం సృష్టిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అధికారిక కక్ష సాధింపులు, వేధింపులకు అఖిల భారత సర్వీసు అధికారులు బాధితులుగా మారడం విభ్రాంతి కలిగిస్తోంది. – ఓ సామాజిక విశ్లేషకుడి అభిప్రాయమిదిటీడీపీ సోషల్ మీడియా వద్దంటే.. వద్దు పోస్టింగులు ఇచ్చి మరీ ఉపసంహరణ చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడుతనానికి మరో ఉదాహరణ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆడమన్నట్టల్లా ఆడటం. ఎవరికైనా పోస్టింగు ఇవ్వొద్దని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు ఆ అధికారిని ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సోషల్ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అంతే.. ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. మహిళా అధికారి డి.హరితను అనంతపురం జేసీగా నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం తాజా ఉదాహరణ. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన డి.హరిత కొద్ది నెలలుగా వెయిటింగ్లో ఉన్నారు. ప్రభుత్వం ఆమెను రెండు రోజుల క్రితం అనంతపురం జేసీగా నియమించింది. వెంటనే టీడీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు వ్యతిరేకించారు. అంతే.. 24 గంటల్లోనే ఆమె పోస్టింగ్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకొని, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారుల పోస్టింగులు, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. కానీ చంద్రబాబు వాటిని టీడీపీ ప్రధాన కార్యాలయం వ్యవహారంగా దిగజార్చేశారని అఖిలభారత సర్వీసు అధికారులు మండిపడుతున్నారు.ఇవీ ఉత్తమ సంప్రదాయాలువైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలో సీఎస్గా వ్యవహరించిన మోహన్ కందానే సీఎస్గా కొనసాగించారు. ఆయన రిటైరయ్యే వరకు ఆ పోస్టులోనే ఉన్నారు. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టింగులు ఇచ్చింది. చంద్రబాబు హయాంలో సీఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్ను కీలకమైన సీసీఎల్ఏ కార్యదర్శిగా, సతీష్చంద్రను ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా చేసిన ఆర్పీ ఠాకూర్ను ఆర్టీసీ ఎండీగా నియమించి, ఆయన రిటైరైన తరువాత కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడిగానూ నియమించింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువైన ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ను గ్రేహౌండ్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేగానీ ఎవరికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచలేదు. చంద్రబాబు ఆ సత్సంప్రదాయాలను తుంగలో తొక్కింది.మూర్ఖమైన నిర్ణయంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు అధికారులను వేధిస్తోంది. ఇటువంటి దుర్మార్గమైన, హేయమైన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ దేశ చరిత్రలోగానీ ఎవరూ తీసుకోలేదు. ఏపీ, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. గొంతు విప్పలేనివారు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం గత నెల ఇద్దరు డీజీపీ స్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఏకంగా 16 మందికి పైగా ఐపీఎస్ అధికారులకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా అవమానిస్తోంది. వారి గాయాలపై కారం చల్లేలా ఏపీ డీజీపీ తాజాగా మెమో జారీ చేశారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించడం కేవలం కక్ష సాధింపు చర్యే. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను సంతృప్తి పరిచేందుకే ఈ మెమో జారీ చేశారు. ఇది అత్యున్నత స్థాయిలో తీసుకున్న మూర్ఖపు నిర్ణయం. వెయింటింగ్ హాల్లో కూర్చొని ఆ అధికారులు ఏం చేయాలి? గాసిప్పులు మాట్లాడుకోవాలా? ధ్యానం చేయాలా? సీనియర్ అధికారులను వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. బదిలీ చేసిన వారికి ఎక్కడో ఒక చోట పోస్టింగు ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిఏపీ ప్రభుత్వ చర్య అసంబద్ధం ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనలకు విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలని 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏమిటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి ఆ అధికారులకు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి, దేశానికే నష్టం. వారి సేవలను ఏదో రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణం పోస్టింగులు ఇవ్వాలి. – స్వరణ్జిత్ సేన్, ఉమ్మడి ఏపీ రిటైర్డ్ డీజీపీ -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ తదుపరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న గోవింద్ మోహన్ను అజయ్కుమార్ భల్లా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈనెల 22న అజయ్కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారు. నళిన్ ప్రభాత్ పదవీకాలం కుదింపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ పదవీకాలం 2028 ఆగస్టు 31 ఉండగా కేంద్రం అర్ధంతరంగా కుదించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ను డిప్యుటేషన్పై ఏజీఎంయూటీ కేడర్కు మార్చింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లేదా మూడేళ్లపాటు నళిన్ ఏజీఎంయూటీ కేడర్లో డిప్యుటేషన్పై కొనసాగుతారని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– కేంద్ర పాలిత ప్రాంతాలను కలిసి ఏజీఎంయూటీ కేడర్గా పిలుస్తారు. ఇది కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రభాత్కు కేంద్రం కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
అధికారులకు అడుగడుగునా అవమానాలు! అదే పనిగా పెట్టుకుని..
సాక్షి, అమరావతి: ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూటమి రాజ్యాంగం నడుస్తోంది. కారణం లేకుండానే ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథలు చెప్పొద్దు అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.ఇక, తాజాగా సమీక్ష సందర్బంగా చంద్రబాబు.. ఐఏఎస్ అధికారి సునీతపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, సమీక్షలో భాగంగా చంద్రబాబు పలువురు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈనెల ఏడో తేదీన చేనేత దినోత్సవం చీరాలలో నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ కార్యదర్శి ఐఏఎస్ సునీత కల్పించుకుని విజయవాడలో నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు చంద్రబాబు.అనంతరం చంద్రబాబు.. చీరాలలో పెట్టమంటే విజయవాడలో ఎందుకు నిర్వహించమంటున్నావ్?. నీకు చీరాల రావడానికి ఏదైనా ఇబ్బంది ఉందా?. విజయవాడలో పెట్టమని ఎవరు చెప్పారు? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారి సునీత మాట్లాడుతూ.. అదే రోజున కేబినెట్ ఉందని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు.. అయితే చేనేత దినోత్సవాన్ని చీరాలలోనే మధ్యాహ్నం కొనసాగించండి. అంతేకానీ, అంతా మీ ఇష్టం కాదు అంటూ మండిపడ్డారు.మరోవైపు.. ఇరిగేషన్ శాఖలో పనులు వేగంగా జరుగుతున్నాయని, మంత్రి రామానాయుడు ఎక్కువసేపు అందుబాటులో ఉంటున్నారని ప్రిన్సిపాల్ సెక్రటరీ సాయి ప్రసాద్ చెప్పుకొచ్చారు. మంత్రి సెక్రటరీలా.. సెక్రటరీ మంత్రిలా పనిచేస్తున్నారని అన్నారు. దీంతో, చంద్రబాబు.. కథలు చెప్పొదు అంటూ సాయి ప్రసాద్కు చురకలంటించారు. ఎవరూ ఎక్కువ మాట్లాడాల్సిన పనిలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. చంద్రబాబు సీఎంగా బాధ్యతల స్వీకరణ తర్వాత ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా బొకేను అందించారు. ఆమె బొకే ఇస్తే చంద్రబాబు తీసుకోవడానికి తిరస్కరించారు. ఈ సమయంలో చంద్రబాబు తీరును కొందరు మాజీ ఐఏఎస్లు ఖండించారు. సీఎం స్థానంలో ఉండి అధికారుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ప్రశ్నించారు. వారిని అవమానించడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు.ఇక, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి పీయూష్ కుమార్ను రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. -
పూజా కేద్కర్ కేసు: రిపోర్టు సమర్పించిన ఏకసభ్య కమిటీ
ఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా కేద్కర్ అధికార దుర్వినియోగం, యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించటం వంటి ఆరోపణలపై దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ దర్యాప్తు నివేదికను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కు అందజేసింది. డీఓపీటీ అడిషనల్ సెక్రటరీ మనోజ్ ద్వివేది ఈ కేసులోని అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అయితే ఈ రిపోర్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.చదవండి: యూపీఎస్సీపై మరక తొలగేదెలా?ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది.మరోవైపు.. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్లో ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది.చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ -
రాజ్యాంగ పరిధి దాటొద్దు.. కేరళపై కేంద్రం విమర్శ
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని మండిపడుతోంది. అందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయమేని తెలుస్తోంది.సీఎం పినరయి విజయన్ జులై 15న రాష్ట్ర లేబర్ అండ్ స్కిల్స్ విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణిని కే.వాసుకిని తరుఫున రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి విదేశాగ వ్యవహారాలన్నీ కేంద్రం చేతులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ కేరళ మాత్రం నియమాల్ని బేఖాతరు చేసి రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిని ఎలా నియమిస్తుందనేది కేంద్రం వాదనరణ్ధీర్ జైశ్వాల్ ఆగ్రహం కేరళ నిర్ణయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తీవ్రంగా దుయ్యబట్టారు. విదేశీ వ్యవహారాలు సంబంధిత కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకునే హక్కు కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. రాజ్యంగంలోని ఏడవ షెడ్యూల్లోని లిస్ట్ 1, ఐటమ్ 10లో విదేశీ వ్యవహారాలు, కేంద్రం ఇతర దేశాలతో సంప్రదింపులు, సంత్సంభందాలు ఇలా విదేశీ వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే ఏకైక అధికారమని స్పష్టంగా నిర్దేశిస్తుంది,’అని జైస్వాల్ అన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధికి మించి కేంద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనేది మా ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. MEA Spox @randhir_jk on Appointing IAS officer K Vasuki as 'state's secretary in charge of external cooperation' by #Kerala Gov Foreign affairs and all matter which brings union into the relation with any foreign country are the sole prerogative of Union Gov. Foreign affairs… pic.twitter.com/bAHWYNHgWJ— Siddhant Mishra (@siddhantvm) July 25, 2024పార్లమెంట్లో సైతం చర్చరాజస్థాన్ పాలి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేరళ ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం. కేంద్రం బాధ్యతల విషయంలో అక్రమంగా వ్యవహరిస్తోందని అభివర్ణించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం తమని తాము ప్రత్యేక దేశంలా భావిస్తోందా’అని ప్రశ్నించారు.విదేశీ వ్యవహారాల్ని చూసుకునే బాధ్యత కేంద్రానిదే. అలా కాకుండా కేరళ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఐఎఎస్ అధికారిణిని విదేశాంగ కార్యదర్శిగా నియమించడం సబబు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని వారిది చిత్త వైకల్యం!
‘వైకల్యం’ లేని మనుషులు అరుదు. కొందరికి అంగవైకల్యం, మరికొందరికి చిత్తవైకల్యం. ఎలాంటి వైకల్యమూ లేకపోవడం పరిపూర్ణత అవుతుంది. కాని అదెక్కడ కనిపిస్తుంది? చిత్తవైకల్యం మతిభ్రమణమూ కానక్కర లేదు, మందబుద్దీ కానక్కర లేదు. ఆస్థిర చిత్తాలు మనోవికారాలు ఆలోచనల వైపరీత్యాలు కూడా వైకాల్యాలే. కనుక ఒకరిని చూసి మరొకరు సానుభూతి చూపించ వలసిందేమి లేదు.వైకల్యాలు ప్రకృతి సహజంగా భావించి, పరస్పరం ప్రేమించుకొనడానికి, గౌరవించుకొనడానికి అవి అవరోధం కాకుండా చూసుకోవడమే మనం చేయవలసిందీ,చేయగలిగిందీ!‘ అంటూ ‘ మనోనేత్రం ’ పేరుతో వికలాంగుల సమస్యలను వస్తువుగా తీసుకొని, ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్బంగా ( 19 మార్చ్ 1989 ) నేను రచించిన కవితా సంపుటికి తమ అమూల్యమైన అభినందన సందేశం అందిస్తూ ఆనాటి ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బహుకాలంగా పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి సివిల్స్లో దివ్యాంగుల కోటాను విమర్శిస్తూ ‘వికలాంగులు ఐ ఏ ఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలకు సరిపోరని ’ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సరియైన సమాధానం పెద్దలు పొత్తూరి వారి మాటల్లో స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను.పై అధికారిణి ప్రభుత్వంలో ఉంటూనే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్వయంగా అంగవైకల్యంతో బాధపడుతున్న, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయే ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చే ఒక ఐ ఏ ఎస్ అకాడమీని విజయవంతంగా నడుపుతున్న మల్లవరపు బాలలత గారు ‘ సివిల్ సర్వంట్ గా తాను పన్నెండేళ్లు పనిచేసానని, ఇలాంటి అధికారులు ఉండబట్టే రాజీనామా చేయాల్సి వచ్చిందని తన బాధను వ్యక్తపరిచారు. అంతేకాదు పై అధికారిణికి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ వారు వేసిన ప్రశ్న సమంజసమైంది, అందరూ ఆలోచించవలసింది.అంధులంటే ఎవరో కాదు కళ్లుండీ వాస్తవాన్ని చూడలేని గర్వాంధులు, ధనాందులు , మాదాంధులు ‘ అన్నాను ’ మనోనేత్రం‘ లో నేను 1992 లో కూడా ‘ వికలాంగులలో ‘విజేతలు’ పేరుతో నేను చేసిన మరో రచనలో తమ అంగవైకల్యాన్ని అధిగమించి ఎన్నో రంగాల్లో రాణించిన భక్తకవి సూరదాస్ మొదలుకొని ద్వారం వెంకటస్వామి నాయుడు( వయలిన్ ) ఎస్ జైపాల్ రెడ్డి ( రాజకీయాలు ), సుధాచంద్రన్ ( నాట్యం ), లూయీబ్రెయిల్ ( బ్రెయిల్ లిపి ), మేధావుల్లో మేటి అంటోనియో గ్రాన్సీ , విశ్వకవి భైరన్ వంటి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల పరిచయాలతో పాటు , నాకు గురుతుల్యులు ప్రముఖ హాస్య రచయిత ఎన్వీ గోపాల శాస్త్రి, వికలాంగుల జంట మా అమ్మానాన్నలు ఆండాళమ్మ వేముల రాజంల గురించి కూడా ఇందులో రాశాను.‘లోక కళ్యాణం కోసం కొందరు అడవులకు వెళ్లి ఋషులు మునులైతే సభ్యసమాజంలో ఉంటూ సాటివారిని బాగుచేయడానికి మరికొందరు వికలాంగులు అయ్యారు ’ అన్న నా మాటలను పేర్కొంటూ‘ వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని చిత్తవైకల్యం ఎవరిలోనైనా ఉంటే ’మనోనేత్రం‘ దానిని పోగొట్టగల సాహిత్య ఔషధం’ అంటూ నా రచనకు మంచి కితాబునిచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్దలు కీశే పొత్తూరి వెంకటేశ్వర రావు ( 1934 - 2020 ) గారికి శతకోటి వందనాలు !-వేముల ప్రభాకర్ -
భార్య మృతదేహాన్ని ఛీ కొట్టిన ఐఏఎస్ ఆఫీసర్!
ఆయనో ఐఏఎస్ అధికారి. తన కళ్లెదుటే భార్య విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆయన ఏమాత్రం కనికరం చూపించలేదు. ఆమె మృతదేహాన్ని సైతం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ అధికారి నిరాకరించారు. ఛీ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే..గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీలో కమిషన్లో పని చేసే ఉన్నతాధికారి రంజిత్ కుమార్(తమిళనాడు). ఆయన భార్య సూర్య జై. తొమ్మిది నెలల నుంచి ఆమె కనిపించకుండా పోయారు. అయితే భార్య మిస్సింగ్పై ఆయన పోలీసులను ఆశ్రయించలేదు. పైగా విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. తాజాగా.. ఆమె ఓ కిడ్నాప్ కేసులో నిందితురాలు అని తేలింది. ఇంకో భారమైన విషయం ఏంటంటే.. ఓ గ్యాంగ్స్టర్ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయారని తేలింది.మహారాజ హైకోర్టు అనే గ్యాంగ్స్టర్తో రిలేషన్షిప్లో ఉన్న సూర్య జై.. తొమ్మిది నెలల కిందట ఓరోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అయితే ఈ నెల 11వ తేదీన తమిళనాడు మధురై పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో సూర్య జైని నిందితురాలిగా చేర్చారు. మహారాజ, అతని అనుచరుడు సెంథిల్ కుమార్తో కలిసి మధురైకి చెందిన ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేసిందామె. పోలీసులు ఆ కుర్రాడిని రక్షించినా.. నిందితులు మాత్రం తప్పించుకున్నారు.పరారీలో ఉన్న సూర్య జై సడన్గా గత శనివారం గాంధీనగర్లోని రంజిత్ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. తన తప్పు తెలుసుకున్నానని, విడాకులు వద్దంటూ, తనను రక్షించమని, కలిసి జీవిద్దామని భర్తను బతిమాలుకుంది. అయితే తన పరువు పోయిందంటూ ఆమె దూషిస్తూ.. ఇంట్లోకి అనుమతించలేదాయన. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అక్కడే విషం తాగి కుప్పకూలింది.స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆదివారం ఆమె కన్నుమూసింది. విషయం తెలిసిన ఆయన ఆస్పత్రికి వెళ్లారే తప్ప.. భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. పని మనుషులతో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి వెళ్లిపోయారట. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె రాసిన సూసైడ్ లెటర్ సారాంశాన్ని వివరించేందుకు మాత్రం నిరాకరించారు.సీఎంకు సూర్య లేఖ!అయితే మధురై బాలుడి కిడ్నాప్ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె రాసిన లేఖ సోమవారం మధురై పోలీసులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. అందులో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన మదురైలో ఓ బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. ఆ బాలుడి తల్లి మైథిలీ రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో మదురై పోలీసులు రంగంలోకి దిగారు. తిరునల్వేలికి చెందిన మహారాజ్తో పాటు మరికొందరి ద్వారా ఈ కిడ్నాప్ను గుజరాత్లో ఉన్న ఐఏఎస్ అధికారి రంజిత్ సతీమణి సూర్య ప్రమేయం కిడ్నాప్లో ఉన్నట్టుగా బాలుడి తల్లి ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన మదురై పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐఏఎస్ అధికారి సతీమని సూర్య, ఆ బాలుడి తల్లి మైథిలీ మధ్య నగదు లావాదేవీల వివాదం ఉన్నట్లుగా వారు వాగ్మూలం ఇచ్చినట్టు వెలుగు చూసింది. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, మైథిలీ రాజలక్ష్మి ఆరోపణల కారణంగా తన భర్తకు తీవ్ర తలవంపులు వచ్చినట్టు, ఈ వ్యవహారంలో సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ ఆమె రాసిన లేఖ సోమవారం మదురై పోలీసులకు చేరడం చర్చకు దారి తీసింది. -
ప్రఫుల్ దేశాయ్పై ట్రోలింగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన సివిల్స్లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు. కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటాంతనపై జరుగుతున్న ట్రోలింగ్పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్లైన్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్లైన్లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్చైర్ యూజర్ హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్లైన్లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. -
ట్రోలింగ్ ఉచ్చులో IAS అధికారి
-
పూజ ఖేద్కర్ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ దర్యాప్తు
-
ఐఏఎస్నంటూ నమ్మించి వివాహం
నిజాంపేట్: ఐఏఎస్ అధికారినని నమ్మించి ఓ మహిళను వివాహం చేసుకోవడమే కాకుండా భారీ మొత్తంలో నగదును తీసుకుని మోసం చేసిన వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజాంపేట్ శ్రీనిత్య రెసిడెన్సీకి చెందిన నల్లమోతు సందీప్కుమార్(34) సివిల్స్ ఎగ్జామ్లో ట్రాపర్గా నిలిచి కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పోస్టింగ్ వచి్చన్నట్లు ఇరుగుపొరుగును నమ్మించాడు. అదే విధంగా ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎండీ రేడియాలజీ పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఇది నిజమని నమ్మిన కర్నూలు జిల్లాకు చెందిన అరిమిల్లి శ్రావణి అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన తరువాత సైతం తీరు మార్చుకోని సందీప్కుమార్ తన బ్యాంక్ అకౌంట్లో రూ.40 కోట్లు ఉన్నాయని, ఇన్కమ్ టాక్స్ చెల్లించకపోవడంతో ఫ్రీజ్ అయ్యాయని, రూ.2 కోట్లు కడితే విడుదలవుతాయని భార్యను నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన శ్రావణి తన బంధువులు, స్నేహితుల వద్ద రూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఆడపడుచులక్ష్మి సాహితి, అత్తమామలు మాలతి, విజయ్కుమార్ల బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించింది. అంతే కాకుండా శ్రావణి నగలను సైతం సందీప్ కుదువ పెట్టి జల్సాలు చేశాడు. నకిలీ గుర్తింపుతో మోసం చేశారని గ్రహించిన బాధితురాలు భర్త, అత్తమామలు, ఆడపడచులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సందీప్కుమార్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ ఉపేందర్, ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బందిలను అభినందిస్తూ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్రావు రివార్డులను ప్రకటించారు. -
ఏపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న బదిలీలు
-
వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత
బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా ఫైట్ చేయడం సినిమాల్లోని హీరోలకే సాధ్యం. అదే రియల్ లైఫ్లో హీరో అయినా జీరో అయిపోతాడు. కానీ ఈ సంక్షేమ అధికారి కథ వింటే ఆ మాట తప్పు అని ఒప్పుకుంటారు. తన నిజాయితీకి బహుమానంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. చావు అంచాలదాక వెళ్లి వచ్చాడు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే జీవచ్ఛవంలా అయిపోతారు. కానీ ఆయన ఎక్కడైతే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అక్కడకే మళ్లీ ఐఏఎస్ హోదాలో వచ్చి మరీ వాళ్ల పనిపట్టారు. ఇలాంటి కథ సినిమాల్లోనే చూస్తాం. కానీ రియల్ లైఫ్లో కూడా సాధ్యమే అని ప్రూవ్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు ఆయనే....ఆ అధికారి పేరు రింకు సింగ్ రాహీ. ఉత్తరప్రదేశ్కి చెందిన రింకు రాష్ట్ర స్థాయి పీసీఎస్ ఎగ్జామ్ 2007 క్వాలిఫై అయ్యి సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం పొందాడు. తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడూ సంక్షేమ నిధుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆయన చేసిన దర్యాప్తులో డిపార్టుమెంట్ నుంచి పెద్దమొత్తంలో సంక్షేమ నిధులు మళ్లీంచబడ్డాయని తేలుతుంది. దీంతో ఎలా జరిగిందనే దిశగా..క్షణ్ణంగా దర్యాప్తు చేయగా ఏకంగా రూ. 100 కోట్ల స్కాలర్షిప్ స్కామ్ని వెలికితీశారు రాహీ. దీంతో కోర్టు ఈ కుంభకోణానికి పాల్పడ ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. వారిలో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో వారంతా కక్షతో రాహీని హత్య చేసేందకు కుట్ర పన్నారు. అదను చూసి ఏకంగా అతడిపై ఏడు రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాహి తీవ్రంగా గాయపడ్డాడు. కుడివైపు కన్ను, దవడ పూర్తిగా దెబ్బతిన్నాయి. వినికిడిని, ఒక కంటిని కోల్పోయాడు. చెప్పాలంటే అందవిహీనంగా అయ్యిపోయి సర్వం కోల్పోయినవాడుగా అయ్యిపోయాడు రాహీ. అంతేగాదు ఆ దాడి కారణంగా రాహీ నాలుగు నెలలు పైగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కనీసం ఆయన మెడికల్ లీవ్ని కూడా ఆమోదించకుండా అతనిపట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించారు అతడి పైఅధికారులు. ఇదంతా ఒక ఎత్తు అయితే అయితే..తన నిజాయితీని అధికారులు గుర్తించకపోగా..పిచ్చోడని ముద్రవేసి సస్పెండ్ చేశారు. అతను కష్టపడి వెలికితీసిన ఆధారాలన్ని వీగిపోయాయి. ఇవన్నీ రాహీని శారీరకంగా, మానసికంగా చాలా నిరాశనిస్ప్రుహల్లోకి నెట్టేశాయి. ఒక చిన్న అధికారిగా ఉంటే ఇలాంటి స్కామ్లకు అడ్డుకట్టవేయలేనని భావించి..ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. విధికి ఎదురీదైనా అనుకున్న లక్ష్యం సాధించాలని నిశ్చయించకున్నాడు. సరిగ్గా 40 ఏళ్ల వయసులో వికలాంగులో కోటలో యూపీఎస్సీ ఎగ్జామ్కి రాసేందుకు ప్రిపేర్ అయ్యాడు. తన చివరి ప్రయత్నంలో 2021లో ఉత్తీర్ణ సాధించి 683వ ర్యాంకు సాధించారు. ఎక్కడైతే పిచ్చోడని ముద్ర వేయించుకుని సస్పెండ్ అయ్యాడో అదే ప్రాంతానికి 15 ఏళ్ల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు మేజిస్ట్రేట్ అఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు రాహీ మాట్లాడతూ..తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. స్వప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య ఎప్పుడైనా ఘర్షణ తలెత్తితే, తాను ప్రజా ప్రయోజనాలను ఎంచుకుంటానని నిర్భయంగా చెప్పారు. ప్రస్తుతం ఆయనకి 44 ఏళ్లు, తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిజంగా రింకు సింగ్ రాహీ రియల్ హీరో కదూ. అంతటి పరిస్థితి ఎదర్కొంటే..ఎవ్వరైనా చాలా అవమానంగా భావించి కుంగిపోతారు. ఆయన మాత్రం విధికే సవాలు విసిసి లేచి నిలబడి తానేంటో చూపించాడు. అతడకి కథ ఎందరికో స్ఫూర్తి.(చదవండి: అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. -
అల్లునిపై మాజీ ఐపీఎస్ నిఘా?
యశవంతపుర: కుటుంబ కలహాలతో మాజీ ఐపీఎస్.. ప్రస్తుత ఐఏఎస్ అయిన అల్లుని ఫోన్ కాల్ డేటాను సేకరించారనేది వివాదమైంది. ఐఎఎస్ అధికారి డాక్టర్ ఆకాశ్ ఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ ఐపీఎస్ అధికారి సురేశ్ టిఆర్, బెంగళూరులోని హెబ్బగోడి సీఐ ఐయ్యణ్ణరెడ్డితో పాటు ఐదు మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సురేశ్ కుమార్తెతోనే ఆకాశ్కు పెళ్లయింది. అయితే వజ్రాల వాచ్, బెంజ్ కారు, మరింత కట్నం కావాలని వేధిస్తున్నాడని భార్య అతనిపై కేసు పెట్టింది. ఇది కోర్టులో కొనసాగుతోంది. ఇంతలో 2022 ఫిబ్రవరి నుంచి 2023 జనవరి వరకు ఆకాశ్ ఫోన్ కాల్ డేటా రికార్డ్ను సీఐ ఐయ్యణ్ణరెడ్డి సేకరించి వేధించారని ఆకాశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక ప్రస్తుత రేవ్ పార్టీ కేసులో సీఐ ఐయ్యణ్ణరెడ్డి నిర్లక్ష్యం చూపారని రూరల్ ఎస్పీ చార్జ్ మోమో ఇచ్చినట్లు తెలిసింది. -
ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఐఏఎస్ కావాలనేదే జీవిత లక్ష్యం
బోనకల్: తండ్రి ప్రోత్సాహానికి తోడు అపజయాలు ఎదురైనా వెనుదిరగని పట్టుదల ఆమెను విజేతగా నిలబెట్టింది. సివిల్స్లో నాలుగు పర్యాయాలు విజయం దరి చేరకున్నా కుంగిపోకుండా మరింత శ్రద్ధగా సిద్ధం కావడంతో బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన రావూరి అలేఖ్య ఐదో పర్యాయం 938వ ర్యాంకు సాధించింది. బుధవారం యూపీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఆమె ర్యాంకు సాధించినట్లు వెల్లడి కాగా స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానిస్టేబుల్ కుమార్తె గోవిందాపురం(ఎల్)కు చెందిన రావూరి ప్రకాశరావు మధిర టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతుల కుమార్తె అలేఖ్య ప్రాథమిక విద్య ఖమ్మంలోని త్రివేణి స్కూల్, తల్లాడ, నేలకొండపల్లి, కొత్తూరులోని ప్రైవేట్ స్కూళ్లలో పూర్తిచేశారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదివిన ఆమె ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో, ఉస్మానియా యూని వర్సిటీ బీఏ పూర్తిచేశాక వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీ నుంచి రూరల్ డెవలప్మెంట్లో పీజీ చదివి గోల్డ్మెడల్ సాధించింది. అనంతరం హైదరాబాద్లో సీబీసీఎస్బీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్న అలేఖ్యకు నాలుగు పర్యాయాలు విజయం దక్కలేదు. అయితే, ఆమెను తండ్రి ప్రకాశ్రావు అడుగడుగునా ప్రోత్సహించడంతో పాటు ఐఏఎస్ కావాలనే చిన్నప్పటి లక్ష్యం, పేదలకు సేవ చేయాలనే తపనతో మరింత పట్టుదలతో సిద్ధమై 938వ ర్యాంకు సాధించింది. కాగా, అలేఖ్యకు ఎస్టీ కేటగిరిలో ఐపీఎస్ వచ్చే అవకాశముందని తెలిసింది. కాగా, ఆమెను ఎంపీలు నామా నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, బోనకల్ ఎస్సై మధుబాబు తదితరులు అభినందించారు. -
ఐఏఎస్ అధికారిణి రాజీనామా.. లోక్సభ బరిలోకి!
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ నాయకుడు సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి పరంపాల్ కౌర్ సిద్ధూ బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సిద్ధూ ఈ ఏడాది అక్టోబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పరంపాల్ కౌర్ సిద్ధూ బీజేపీలో చేరి ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బటిండా పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయడానికి టికెట్ను పొందవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. సికందర్ సింగ్ మలుకా అకాలీ సీనియర్ నాయకుడు 2017 వరకు అకాలీ ప్రభుత్వంలో విద్యా మంత్రిగా ఉన్నారు. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. చివరి దశలో జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగనుంది. -
AP: ఐఏఎస్ ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ
సాక్షి, విజయవాడ: ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సెర్ప్ సీఈవోగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ రాజకీయ ప్రవేశం చేసేందుకు పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బంగారం లాంటి కల..అందమైన జీవితం: ఓ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
జీవితంలో పైకి రావాలని, ఉన్నతోద్యోగాలు సాధించాలని అందరూ కలలు కంటారు. కానీ ఆ కలలను సాధించుకోవడంలో చాలాకొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎదిగి పలువురి ప్రశంసలు పొందడం మాత్రమేకాదు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి వారిలో సృష్టి దేశ్ముఖ్ ఒకరు.సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించిన సృష్టి సక్సెస్ స్టోరీ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల్లో విజయం అంటే మామూలు సంగతి కాదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటారు. అయితే కొన్ని వందల మంది మాత్రమే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IAS అధికారిగా మారతారు. కానీ తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాకు సాధించిడం చాలా అరుదు. సృష్టి UPSC పరీక్షలో ఆలిండియా స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. అంతేకాదు UPSC 2018 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 182 మంది మహిళల్లో టాపర్ కూడా. అప్పటికి ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన సృష్టి దేశ్ముఖ్ గౌడ 1995లో పుట్టింది. చిన్ననాటి నుండి తెలివైన విద్యార్థి. భోపాల్లోని బిహెచ్ఇఎల్లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో 12వ బోర్డు పరీక్షలో 93.4 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని ఆశపడింది. కానీ సీటురాలేదు. చివరికి భోపాల్లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తరువాత తన డ్రీమ్ను పూర్తి చేసుకోవడం కోసం సివిల్స్ పరీక్ష రాసి, విజయం సాధించింది. సృష్టి తండ్రి జయంత్ దేశ్ముఖ్ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి సునీతా దేశ్ముఖ్ టీచర్. సృష్టికి సంగీతం అన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. రోజూ యోగా కూడా చేస్తుంది. మరో ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున బి గౌడను సృష్టి వివాహం చేసుకుంది. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్న సృష్టి , నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠినంగా ఉంటూ సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తున్నారు. -
తెలంగాణలో బయటపడుతోన్న పలువురు ఉన్నతాధికారుల బాగోతం
-
ఎవరీ ఉమ్ముల్ ఖేర్? ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు..
కటిక దారిద్య్రానికి తోడు నయం కానీ వ్యాధితో సహవాసం చేసింది ఆమె. అడగడుగున కఠినతరమైన కష్టాలు. అయినా వెరవక లక్ష్యం కోసం ఆహర్నిశలు పోరాటమే చేసింది. చివరికి అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్కి చెందిన ఉమ్ముల్ ఖేర్ బాల్యం డిల్లీలోని నిజాముద్దీన్లో మురికివాడలో సాగింది. పైగా ఖేర్ పుట్టుకతో ఎముకలకు సంబంధించిన డిజార్డర్తో బాధపడుతోంది. అయినప్పటికి చదువును కొనసాగించింది. అలా ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత జేఎన్యూ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఏ చేసింది. అక్కడితో ఆగకుండా ఎంఫిల్ చేస్తూనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యింది. ఈక్రమంలో 2012లో చిన్న ప్రమాదానికి గురయ్యింది. అయితే ఆమెకు ఉన్న బోన్ డిజార్డర్ కారణంగా శరీరంలో ఏకంగా 16 ఫ్రాక్చర్లు అయ్యాయి. దీంతో ఖేర్ దాదాపు ఎనిమిది సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇన్ని కష్టాల ఐఏఎస్ అవ్వాలనే అతి పెద్ద లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకోగలనా? అన్న సందేహానికి తావివ్వకుండా తన లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో సాగిపోయింది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ఆరోగ్యం వరకు ఏవీ ఆమె గమ్యానికి సహకరించకపోయినా.. నిరాశ చెందలేదు. పైగా అవే తనకు 'ఓర్చుకోవడం' అంటే ఏంటో నేర్పే పాఠాలుగా భావించింది. ప్రతి అడ్డంకిని తన లక్ష్యాన్ని అస్సలు మర్చిపోనివ్వకుండా చేసే సాధనాలుగా మలుచుకుంది. చివరికీ ఆ కష్టాలే ఆమె సంకల్ప బలానికి తలవంచాయేమో! అన్నట్లుగా ఉమ్ముల్ ఖేర్ సివిల్స్లో 420వ ర్యాంకు సాధించింది. తాను కోరుకున్నట్లుగానే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎందరికో ప్రేరణగా నిలిచింది. ద టీజ్ ఉమ్ముల్ ఖేర్ అని ప్రూవ్ చేసింది. -
ఫార్ములా-ఈ రేసింగ్: ఐఏఎస్ అరవింద్ కుమార్కు మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్కు సంబంధించిన వ్యహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 54 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్పై ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్-4) రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా-ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్పై పుకార్లు -
HYD: మాజీ ఐఏఎస్ భన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్ నవీన్ కుమార్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని ప్రస్తుతం ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేయించారు. తన ఇల్లుని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని, ఐపీఎస్ అధికారి నవీన్పై భన్వర్లాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. భన్వర్లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదాస్పదంగా మారిన ఇంటిని నవీన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. చదవండి: హైదరాబాద్: రిటైర్డ్ IASకు ప్రజెంట్ IPS టోకరా! కేసు వివరాలు ఏంటంటే.? IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్లో భన్వర్లాల్కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్లాల్ జూబ్లిహిల్స్లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు? 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ. పోలీసులు ఏం చేశారు? భన్వర్లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్లో ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు.గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి. -
భారీగా ఐఏఎస్ బదిలీలు
-
IAS Smita Sabharwal : ట్రెండింగ్లో మరో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. రేర్ ఫొటోలు
-
IAS Amrapali Kata: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
సినిమాలపై ఆసక్తి.. ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసిన తెలుగోడు
ఐఏఎస్.. ఐపీఎస్ కావాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ లక్షల మందిలో అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఎంతో కష్టపడి ఐఏఎస్ ఉద్యోగం కొట్టాడు. తనకు పోస్టింగ్ వేసిన చోట సమర్థవంతంగా పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు. కానీ కొన్నేళ్లకు తానే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఇంతకీ ఆయన మరెవరో కాదు, పాపారావు బియ్యాల. ఈ తెలుగోడి పేరు మీరు వినే ఉంటారు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. మధ్యలోనే ఆగిపోయిన పీహెచ్డీ పాపారావు బియ్యాల.. వరంగల్లో 1954వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి కిషన్ రావు స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి అనసూయా దేవి గృహిణి. వరంగల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పాపారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పట్టా అందుకున్నాడు. పీహెచ్డీ కోసం న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అంతలోనే ఐఏఎస్ పరీక్ష రాయడం, అందులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పీహెచ్డీ మధ్యలోనే ఆపేశాడు. 1982లో ఐఏఎస్ సాధించిన ఇతడు కీలక హోదాల్లో విధులు నిర్వహించాడు. సేవల్లోనూ మేటి అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్గా, తర్వాత ఆ రాష్ట్ర హోం సెక్రటరీగా సేవలందించాడు. జోర్హాట్ జిల్లా డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు తీవ్రవాదులకు వ్యతిరేకంగా జిల్లాస్థాయిలో పోలీసు, సైనిక బలగాలను సమన్వయం చేశాడు. 1992లో నదీకోత వల్ల ఇళ్లు కొట్టుకుపోయిన దాదాపు 500 కుటుంబాలకు కొత్త గ్రామాన్ని సృష్టించేందుకు సాయపడ్డాడు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐదేళ్లపాటు పనిచేశాడు. డ్రగ్స్ రహిత క్రీడలను ప్రోత్సహించడం కోసం 'క్లీన్ స్పోర్ట్స్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేశాడు. ఉన్నట్లుండి 2005లో ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాడు. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు ఆ తర్వాత 2014-19వరకు తెలంగాణ ప్రభుత్వానికి పాలసీ అడ్వైజర్గా కొనసాగాడు. అయితే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే 1996లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో 3 నెలల కోర్సు చేశాడు. 1998లో 'విల్లింగ్ టు సాక్రిఫైస్' అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం తీశాడు. ఈ మూవీ 2000వ సంవత్సరంలో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సంతోషంతో వెంటనే సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మ్యూజిక్ స్కూల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. శ్రియ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మే 12న విడుదలవగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. మరి నెక్స్ట్ ఆయన ఎటువంటి సినిమాతో ముందుకు వస్తాడో చూడాలి! చదవండి: పార్టీలో స్టెప్పులేసిన చిరంజీవి.. 68 ఏళ్ల వయసులో ఆ స్వాగ్ ఏంటి బాసూ.. -
సీఎం నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీకి.. కేబినెట్ హోదా
భువనేశ్వర్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తున్న వీకే పాండియాన్ ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. సీఎం పట్నాయక్కు సన్నిహితుడిగా పాండియన్ పేరు తెచ్చుకున్నారు. అయితే అధికార పార్టీ ప్రయోజనాల కోసం తన ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో ఇటీవల తరుచూ వివాదాల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన పాండియన్.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి 190 సమావేశాలు నిర్వహించారు. దీంతో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేడీ పార్టీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని విమర్శలు గుప్పించాయి పాండియన్ రాజీనామా కాంగ్రెస్కే మేలు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా పాండియన్ స్వచ్ఛంద విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పని ఇంతకముందే చేయాల్సి ఉండేదని, ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేక తిరిగి సొంత రాష్ట్రానికి వస్తారో తెలియదని.. అయితే బీజేడీలో చేరితే మాత్రం ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్కు ఎంతో సహాయం చేసిన వారవుతారని అన్నారు. రాజకీయాల కోసమే రాజీనామా తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టేందుకే పాండియన్ రాజీనామా చేసినట్లు బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాఝీ మండిపడ్డారు. ఇప్పుడు తాను బ్యూరోక్రాట్ ముసుగుతో కాకుండా బహిరంగంగా రాజకీయాలు చేయగలడని, ఒడిశా ప్రజలు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన పాండియన్ ఒడిశా కేడర్కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ కొరుతూ పాండియన్ ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాయగా.. సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ర్యాంకు హోదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒకరోజు తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంఇ 5టీ(ట్రాన్స్ఫౄర్మేషనల్ ఇనిషియేటివ్), ‘నబిన్ ఒడిశా’ పథకానికి చైర్మన్గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది పకల్పించినట్లుద సమాచారం. దీంతో పాండియన్ నేరుగా ముఖ్యమంత్రి కింద పని చేయనున్నారు. -
ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. కాగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందాయి. అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. అంతేగాక ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమావేవంలో పలువురు అధికారుల పనితీరుపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికారుల పనితీరు, సంబంధిత ఇన్పుట్లను అంచనా వేసిన తర్వాత సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం అయిదు గంటల వరకు ప్యానెల్ లిస్ట్ పంపాలని ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఎస్ను ఆదేశించింది. తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ర్పరాజ్ అహ్మద్ , కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవిని కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. -
సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే
ఉత్తర్ప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై మక్కువతో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారం అయిన ఢిల్లీ క్రైమ్ సీజన్- 2లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. గ్లామర్లో సినీతారలకు ఏ మాత్రం తగ్గడు. ఓటీటీలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ, ర్యాంప్ల మీద మోడల్గా దర్పం ఒలకబోస్తూ, కలెక్టర్ స్థాయి అధికారిగా ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో కొనసాగారు. (IASగా సస్పెండ్ కావటానికి కారణమైన ఫోటో ఇదే) 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా భాద్యతలు తీసుకున్నాక సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తానే ఎన్నికల పరిశీలకుడినని చెబుతూ ఒక ఫోటో తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇదీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దం. దీంతో అతన్ని ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించి సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం అయింది. అభిషేక్ సతీమణి శక్తి నాగ్పాల్ కూడా ఐఏఎస్ అధికారి కావడం విశేషం. యమునా నగర్ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నది. (అభిషేక్ సతీమణి శక్తి నాగ్పాల్ IAS) కొవిడ్ మహమ్మారి సమయంలో అభిషేక్ పరిపూర్ణ సమాజ సేవకుడిగా మారారు. ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చారు ఇలా ఎన్నో మంచిపనులు ఆయన చేశారు. ఈ సినిమాతో గుర్తింపు అభిషేక్ సింగ్ తొలిసారిగా నటించిన ఈ షాట్ ఫిలిం పేరు ‘చార్ పండ్రా’. ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టీ సిరీస్ రూపొందించింది. ఈ పాటలో అభిషేక్ రొమాంటిక్ సైడ్ని అద్భుత్వంఘౠ ప్రదర్శించాడు. అంతేగాక ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడని చెప్పుకొవచ్చు. అందుకు కారణం ఈ సాంగ్ తన నిజ జీవితంలోని సంఘటనలను బేస్ చేసుకుని తీసినట్లు ఆయన చెప్పారు. ఐఏఎస్ అధికారి అయినప్పటికీ నటుడిగా అద్భుత ప్రదర్శనను కనబరిచిన అభిషేక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్ ట్రెండింగ్ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అభిషేక్కు ఇన్స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. -
ఇన్స్టాలో స్మితా సబర్వాల్ సందడి.. వీడియో వైరల్
సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారిని స్మిత సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ నెటిజన్లతో నిత్యం టచ్లో ఉంటారు స్మిత సబర్వాల్. ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలి, ఫ్రెండ్స్తో సరదాగా గడిపేస్తుంటారు. ఈ మేరకు తన పర్సనల్ లైఫ్కు సంబంధించిన స్వీట్ మూమెంట్స్ని కూడా ఆమె అభిమానులతో సోషల్మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రీల్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మరింది. దీంతో నెటిజన్లు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2001 బ్యాచ్కు చెందిన స్మిత సబర్వాల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి తన పనితీరుతో ఎంతో గుర్తింపు పొందారు. తెలంగాణ సీఎంవో అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా కలెక్టర్గా మరింత పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by 𝐏𝐫𝐚𝐭𝐢𝐜𝐡𝐞𝐞 𝐌𝐨𝐡𝐚𝐩𝐚𝐭𝐫𝐚 (@praticheemohapatra) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) -
ఇదిగో సారూ... నా మేక టికెటు
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. -
తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి?
మన దేశానికి తొలి ఒలింపిక్ పతకం ఎవరు సాధించిపెట్టారు? మన దేశానికి మొదటి క్రికెట్ ప్రపంచకప్ను అందించిన జట్టుకు కెప్టెన్ ఎవరు? దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? మొదటి ప్రధాన మంత్రి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం తెలిసేవుంటుంది. కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన మొదటి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా ఏళ్లముందు సత్యేంద్రనాథ్ ఠాగూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నాటిరోజుల్లో బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలిస్తున్నారు. వారు భారతీయులను చాలా ఏళ్లపాటు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించలేదు. అయితే సత్యేంద్ర ఠాగూర్ తన అపార ప్రతిభతో ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 17వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి, ఇక్కడ పాలన ప్రారంభించారు. అప్పట్లో వారి ప్రభుత్వం ఉండేది. సమస్తం వారి నియంత్రణలో ఉండేది. చాలా ఏళ్లపాటు బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో భారతీయులు పనిచేసేందుకు వీలు కల్పించలేదు. 1832లో మొదటిసారిగా మున్సిఫ్, సదర్ అమీన్ పదవులకు భారతీయులు ఎన్నికయ్యేందుకు అనుమతించారు. తరువాత డిప్యూటీ మేజిస్ట్రేట్, కలెక్టర్ పదవులకు పోటీపడేందుకు భారతీయలను అనుమతించారు. కానీ 1860ల వరకు భారతీయులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కాలేదు. 1861లో ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇండియన్ సివిల్ సర్వీస్ స్థాపితమయ్యింది. ఫలితంగా భారతీయులను సివిల్ సర్వీసెస్ పరీక్షకు అనుమతించారు. అయితే ఈ పరీక్షకు హాజరుకావడం భారతీయులకు అంత సులభం కాలేదు. ఈ పరీక్షలకు హాజరు కావడానికి లండన్కు వెళ్లవలసి వచ్చేది. పాఠ్యాంశాలు గ్రీక్, లాటిన్ భాషలలో ఉండేవి. గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లుగా ఉండేది. 1842 జూన్లో జన్మించిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడ్మిషన్ పొంది తన ప్రతిభచాటారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదం పొందిన తరువాత సత్యేంద్రనాథ్ ఠాగూర్ తన స్నేహితుడు మోనోమోహన్ ఘోష్తో కలిసి ఈ పరీక్షకు వెళ్లాలని భావించారు. ఇద్దరూ లండన్ వెళ్లి పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. అయితే ఘోష్ ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. సత్యేంద్ర ఠాగూర్ (1863లో) ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని, 1864లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను తొలుత బాంబే ప్రెసిడెన్సీలో నియమితులయ్యారు. తరువాత అహ్మదాబాద్లో అసిస్టెంట్ కలెక్టర్/మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు. సత్యేంద్ర ఈ పదవిలో 30 సంవత్సరాల పాటు ఉన్నారు. 1896లో మహారాష్ట్రలోని సతారా నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణ 1922లో ప్రారంభమైంది. అప్పుడు దానిని ఇండియన్ ఇంపీరియల్ సర్వీసెస్ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని సివిల్ సర్వీసెస్గా మార్చారు. ఇది కూడా చదవండి: ‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత? -
మన ఇల్లే... ఒక పాఠశాల ప్రయోగశాల
ఒక వైపు వృత్తి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ స్కూల్ పిల్లలకు అవసరమైన సలహాలు, టిప్స్ను సోషల్ మీడియా ద్వారా అందిస్తోంది ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్. తాజాగా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ మార్గంలో సైన్స్ సూత్రాలను అర్థం చేయించే టిప్స్ను షేర్ చేసింది. పిల్లలకు భూభ్రమణం గురించి వివరించడానికి హ్యూమన్ సన్డయల్ ఎలా తయారు చేయాలి, ‘సింక్ అండ్ ఫ్లోట్ ఎక్స్పెరిమెంట్’ను వివరించడానికి నారింజలు, నీళ్లను ఎలా ఉపయోగించాలి... అనేవి ఇందులో ఉన్నాయి. ‘ఐఐటీ దిల్లీలో ఇంజినీరింగ్ చదువుకున్నాను. డిగ్రీ కంటే శాస్త్రీయ దృష్టి, విశ్లేషణ ముఖ్యం’ అంటుంది దివ్య మిట్టల్. ‘సూపర్ కలెక్షన్. ఫన్–టు–డూ. మీ పిల్లలు అదృష్టవంతులు. మీరు ఇచ్చిన టిప్స్ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఐఏఎస్ అధికారులపై కేసు
-
రూ. 13,000 టికెట్టుకి రూ. 20 రీఫండ్ - ఐఏఎస్ ఆఫీసర్ షాక్!
ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 -
ఐఏఎస్ ఆకాశ్పై భార్య వందన ఫిర్యాదు
కర్ణాటక: భర్త, అతని కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ మహిళ బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త ఆషామాషా వ్యక్తి కాదు, ఓ ఐఏఎస్ అధికారి. అప్పట్లో సివిల్స్లో దేశంలో వంద లోపు ర్యాంకు తెచ్చుకుని మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఏం లాభం.. భార్యను వేధించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. కొడగు జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ఆకాశ్ శంకర్పై ఆయన భార్య డాక్టర్ వందన ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘనంగా పెళ్లి చేసినా.. రిటైర్డు ఐపీఎస్ టీఆర్ సురేశ్ కుమార్తె డాక్టర్ వందనకు గత ఏడాది జూన్లో ఆకాశ్ శంకర్కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో బాగా కట్న కానుకలు సమర్పించారు. కానీ మళ్లీ డబ్బు బంగారం , విలువైన కానుకలు తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు వందన గత మార్చిలో ఆరోపించారు. అప్పటినుంచి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. హేళనగా ప్రచారం ఇటీవల ఆకాశ్ శంకర్ సోదరుడు వికాస్ శంకర్, ఆతని భార్య చేతన, ఐసిరి శివకుమార్ అనేవారు వందన గురించి హేళనగా మాట్లాడి ఆ వీడియోలను ఆమె స్నేహితులకు పంపారు. ట్రాఫికింగ్ ఆఫ్ ఖాకీస్ డాటర్, ట్రాఫికర్ డాక్టర్ వందన అని తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వందన కుంటుబం గురించి ఇంటర్నెట్లో అగౌరవంగా రాతలు రాసినట్లు ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
'అసహజ శృంగారం కోసం వేధిస్తున్నాడు' ఐఏఎస్ అధికారిపై ఆమె ఫిర్యాదు!
ఛత్తీస్గఢ్: గృహ హింసకు పాల్పడుతున్నాడని ఓ ఐఏఎస్ అధికారిపై అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకురావాలని, అసహజ శృంగారం చేయాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2014 తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ ఘా. 2021లో బాధితురాలితో బిహార్లోని దర్భాంగ జిల్లాలో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య పోలీసులను ఆశ్రయించింది. అసహజ శృంగారం, కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు కోర్బా జిల్లాలో ఆయనపై గృహ హింస కేసు నమోదైంది. ఇదీ చదవండి: ఇతర మతస్థుడితో కుమార్తె పెళ్లి.. పిండ ప్రదానం చేసిన తల్లిదండ్రులు -
విద్యార్థి 35 శాతం మార్కులకే సంబరాల్లో కుటుంబం..వీడియో వైరల్
మహారాష్ట్ర: పరీక్షల్లో తప్పితే జీవితంలో తప్పినట్లు భావిస్తుంటారు కొందరు పిల్లలు. ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు.. పేపర్లలో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్య వార్తలను సాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా 35 శాతం మార్కులతో పాస్ అయిన ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు వేడుక చేశారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో విద్యాశాఖ పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. తక్కువ మార్కులు సాధించినందుకు తిట్టకుండా తమ కుమారునికి ఆ కుటుంబం సంబరాలు చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాను కామెంట్ చేశారు. కింది స్థాయిల్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ జీవితంలో తాము సాధించిన గొప్ప విజయాలను పంచుకున్నారు. मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए. लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 8, 2023 ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్
యశవంతపుర: ఐఏఎస్ రోహిణి సింధూరి దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఐపీఎస్ అధికారి రూపకు కోర్టులో ముందస్తు బెయిల్ దొరికింది. రూప ఫేసుబుక్లో ఐఏఎస్ రోహిణి సింధూరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని రూపపై ఐఏఎస్ రోహిణి సింధూరి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రూప బెంగళూరు 24వ ఎసీఎంఎం కోర్టులో మంగళవారం హాజరై బెయిల్ తీసుకున్నారు. -
టార్గెట్ ఐఏఎస్ మలర్ వెళి
సాక్షి, చైన్నె: ధర్మపురి కలెక్టర్గా ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారి మలర్ వెళి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి స్వతంత్రంగా వ్యవహరించి రూ. 1.36 కోట్ల నిధులను పక్కదారి పట్టించినట్టు డెరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ (డీవీఏసీ) విచారణలో తేలింది. దీంతో ఆమెతో పాటు సన్నిహితంగా కాంట్రాక్టర్లు ఇరువురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం చైన్నె, ధర్మపురి, విల్లుపురం, పుదుకోట్టైలో ఆ ముగ్గురికి చెందిన 10 చోట్ల విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. వివరాలు.. 2018–20 మధ్య ధర్మపురి జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారి మలర్ వెళి పనిచేశారు. ఈ కాలంలో ఆ జిల్లాల్లోని 251 పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఆస్తి, నీరు, వర్తకం తదితర పన్నుల వసూళ్లకు గాను ప్రభుత్వం తరపున లక్షా 25 వేల పుస్తకాలను ముద్రించారు. అయితే దీన్ని టెండర్ల ద్వారా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించి.. తనకు కావాల్సిన వ్యక్తులైన క్రెసెంట్ తాహీర్ హుస్సేన్, నాగా ట్రేడర్స్ వీరయ్య పళణి వేల్కు పనులను ఏకపక్షంగా అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక మొత్తాలను వారికి ముట్ట చెప్పినట్లు గణాంకాల్లో తేలాయి. ఫలితంగా ప్రభుత్వ సొమ్ము రూ.1.36 కోట్లు ఈ పనుల కారణంగా దుర్వినియోగమైనట్లు తెలిసింది. దీంతో ధర్మపురి, సేలం విజిలెన్స్ డీఎస్పీ కృష్ణరాజన్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. కేసు నమోదు ప్రస్తుతం ఐఏఎస్ అధికారి మలర్ వెళి సైన్స్ సిటీ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు తాహీర్ హుస్సేన్, వీరయ్య పళణి వేల్పై సోమవారం సాయంత్రం డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. మంగళవారం ఉదయం మలర్ వెళితోపాటు తాహీర్ హుస్సేన్, వీరయ్య పళణి వేల్లకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు. చైన్నె విరుగంబాక్కంలోని మలర్ వెళి నివాసంలో డీఎస్పీ కృష్ణరాజన్ బృందం సోదాల్లో నిమగ్నమైంది. చైన్నెలోని క్రెసెంట్, నాగా ట్రేడర్స్ కార్యాలయాల్లోను, విల్లుపురం, ధర్మపురి, పుదుకోట్టైలోనూ తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 10 చోట్ల డీవీఏసీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్గా
తనను చదివించేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని ఆ యువకుడు మరువలేదు. ఉన్నత స్థానానికి చేరి మాతృమూర్తి కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి చదివాడు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలో సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పట్టుదల ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏదీ లేదని చెబుతున్న ఆ యువకుడు మరెవరో కాదు.. అసిస్టెంట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్కుమార్. వృత్తి శిక్షణలో భాగంగా ఆత్మకూరు వచ్చిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. మాది పార్వతీపురం. నాన్న బాబురావు ఆర్మీలో పని చేసి రిటైర్డయ్యారు. అమ్మ స్వర్ణలత ఏఎన్ఎం. అన్నయ్య ప్రదీప్. ప్రస్తుతం మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నేను ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు పార్వతీపురంలో, 8 నుంచి 10 వరకూ మహారాష్ట్రలోని నాసిక్లో చదివా. వైజాగ్లో డిప్లొమా చేశా. హైదరాబాదులోని వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 2017లో ఇంజినీరింగ్ పూర్తి చేశా. అమ్మ కష్టమే చదివించింది.. నేను ఆరో తరగతి చదివేటప్పుడు రోడ్డు ప్రమాదంలో నాన్న బాబురావు మరణించారు. మా కోసం అమ్మ ఆ దుఃఖాన్ని దిగమింగి నన్ను, అన్నయ్యను కష్టపడి చదివించింది. తనకు వచ్చే జీతంతోనే మాకు ఏ లోటూ తెలియకుండా పెంచింది. అందుకే అమ్మ కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా కష్టపడి చదివా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. అనుకున్నది సాధించి ఐఏఎస్గా ఎంపికై అమ్మకు కానుక అందించా. మార్కుల కోసం చదవొద్దు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మనపై ఉన్న నమ్మకమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అనుకున్నది సాధించడానికి మూడు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడ్డా. నేను మార్కుల కోసం ఎప్పుడూ చదవలేదు, చదివింది అర్థం అయేటప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. చాలా మంది డబ్బు ఉంటేనే సివిల్స్కు చదవగలం, రాయగలం అనుకుంటారు. కానీ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినే. కష్టపడి చదివా. మనం అనుకున్నది సాధించడానికి స్పష్టమైన లక్ష్యం ఉంటే చాలు. ఆయన ప్రేరణతోనే సివిల్స్కు.. పార్వతీపురం మన్యం జిల్లాలోని మన్యం ఐటీడీఏ పీఓగా కొంతకాలం క్రితం ఐఏఎస్ లక్ష్మీష పనిచేశారు. పార్వతీపురం సమీపంలోని ఓ కొండపై కొన్ని గ్రామాలు ఉండేవి. సరైన వైద్య సదుపాయాలు లేక అక్కడి ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. మహిళలు గర్భం ధరిస్తే ప్రసవం కోసం కొండ మీద నుంచి అవస్థలు పడుతూ కిందకు తీసుకురావాల్సి వచ్చేది. అలా తీసుకొచ్చాక చాలా సార్లు ఆ మహిళనో లేదా పుట్టిన బిడ్డో చనిపోయేవారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఐఏఎస్ లక్ష్మీష హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ప్రసవానికి మూడు నెలలు ఉందనగానే సదరు మహిళను తీసుకువచ్చి అక్కడ ఉంచి.. వారితో యోగా సాధన చేయించడంతో పాటు మంచి ఆహారం అందించేవారు. దీంతో ప్రసవం తర్వాత తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేవారు. ఎందుకో తెలియదు ఒకసారి లక్ష్మీష గురించి మా అమ్మ నాకు చెప్పింది. ఒక ఐఏఎస్ తలచుకుంటే సమాజంలో ఎంతో మార్పు తీసుకురావొచ్చని వివరించింది. దీంతో నేనూ ఐఏఎస్ కావాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి దేశస్థాయిలో సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించారు. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చన్న విషయం ఆయన విజయంతో నాకు బోధపడింది. నెగెటివ్గా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు.. చాలా మంది విద్యార్థులు పదో తరగతిలో తప్పామనో, ఇంటర్ ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా చేయడం చాలా తప్పు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. నెగెటివ్గా మాట్లాడే వారిని పట్టించుకోవద్దు. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నేను మూడో ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యా. మొదటి రెండు సార్లు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని సులువుగా గట్టెక్కా. జిల్లావాసులు చాలా మంచివారు.. అనంతపురంలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నా. జిల్లా ప్రజలు చాలా మంచి వారు. ఎలాంటి కల్మషం లేని మనుషులు. ఆత్మీయంగా పలకరిస్తారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎటుచూసినా పండ్ల తోటలు ఉండటం. -
మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు.. ఐఆర్ఎస్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన మహిళలపై జరుగుతున్న అరాచకాలను కట్టడి చేయలేకపోతున్నారు. పాఠశాలల్లో, బస్సుల్లో, కార్యాలయాల్లో వారిపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారికి కూడా ఈ వేధింపులు బెడద తప్పలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐఆర్ఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో మహమ్మారి సమయంలో కోవిడ్ సపోర్ట్ గ్రూప్తో కలిసి పనిచేస్తున్నప్పుడు నిందితుడు ఆమెతో టచ్లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి బాధితురాలితో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించేవాడు.. అయితే ఆమె మాత్రం దానిని నిరాకరిస్తూనే వచ్చింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని ఆమెకు మెసేజ్లు పంపుతూ వేధించేవాడు. ఒక్కోసారి ఆమెను కలిసేందుకు మహిళ పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి ఇబ్బంది పెట్టేవాడని మహిళా అధికారి తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్ బర్త్డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని.. -
దోషిగా తేలితే నన్ను ఊరి తీయండి: ఆనంద్ మోహన్ సింగ్
పాట్నా: ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో పద్నాలుగేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఆనంద్ మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తాను దోషిగా తేలితే ఉరికి సైతం సిద్ధమేనంటూ వ్యాఖ్యానించాడాయన. బిహార్ అరారియాలో ఈ మాజీ ఎంపీ కమ్ గ్యాంగ్స్టర్ మాట్లాడుతూ.. కృష్ణయ్య హత్య కేసులో తాను నిర్దోషినంటూ ప్రకటించాడు. ఈ దేశం ఎవరి సొత్తూ కాదు. నేను చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతాను. అందుకే 15 ఏళ్లకుపైగా శిక్ష అనుభవించా. ఒకవేళ నేను గనుక దోషి అని తేల్చితే.. ఉరిశిక్షకైనా సిద్దం అంటూ ప్రకటించాడు ఆనంద్ మోహన్ సింగ్. -
మెహ్రీన్తో బ్రేకప్.. ఐఏఎస్ ఆఫీసర్తో భవ్య భిష్ణోయ్ ఎంగేజ్మెంట్
హీరోయిన్ మెహ్రీన్కు ఈమధ్య పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. ఎఫ్-3 సక్సెస్ సాధించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్గా బరువు తగ్గి బాగా నాజుగ్గా తయారైంది ఈ భామ. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నా చేతిలో సరైన అవకాశాలు లేవు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్తో పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 మార్చిలో మెహరీన్-భవ్య భిష్ణోయ్ నిశ్చితార్థం జైపూర్లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్దిరోజులేక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు. మెహ్రీన్ హీరోయిన్గా కంటిన్యూ చేస్తుంటే, 2022లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్లో బీజేపీ తరపున పోటీ చేసిన భవ్య భిష్ణోయ్ ప్రస్తుతం హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పరి భిష్ణోయ్తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Couldn’t think of a more special place to ask you possibly the most important question of my life… where it all began… and where it begins for us… pic.twitter.com/qWSssP6ljt — Bhavya Bishnoi (@bbhavyabishnoi) May 5, 2023 -
భర్తను చంపిన వ్యక్తి విడుదల.. సుప్రీంకోర్టుకు ఐఏఎస్ అధికారి భార్య
న్యూఢిల్లీ: 1994లో దారుణ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య సతీమణి ఉమ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఉరిశిక్షకు బదులు యావజ్జీక కారాగార శిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉండాలని, కానీ బిహార్ ప్రభుత్వం నిబంధలనలు మార్చి విడుదల చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈమె ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను 1994లో బిహార్లో మూకదాడి చేసి దారుణంగా హత్య చేశారు. వీరికి ఆనంద్ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కేసులో న్యాయస్థానం అతడ్ని దోషిగా తేల్చి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు నిబంధలను మార్చింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన వారిని కూడా విడుదల చేసేలా సవరణలు చేసింది. దీంతో 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మోహన్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈయన విడుదలను ప్రతిపక్షాలు సహా ఐఏఎస్ అధికారులు సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. బిహార్ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోలేదు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్స్టర్కు పదేళ్ల జైలు శిక్ష -
ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది. నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఐతే దాని ప్లేస్లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. (చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి) -
గ్యాంగ్స్టర్ ఆనంద్ విడుదల.. మోదీకి ఐఏఎస్ కుటుంబీకుల కన్నీటి వేడుకోలు
పాట్నా: బిహార్ గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 29 ఏళ్ల క్రితంఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ.. తాజాగా బయటకొచ్చారు. ఏలాంటి హడావిడీ లేకుండా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన్ను రిలీజ్ చేశారు అధికారులు. కాగా తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థం కోసం 15 రోజుల పెరోల్పై ఇటీవలే బయటికొచ్చిన ఆనంద్ మోహన్.. పెరోల్ ముగించుకొని నిన్ననే పోలీసులకు సరెండర్ అయ్యారు. అంతలోనే విడుదలై బయటకు రావడం గమనార్హం. కాగా ఆనంద్ మోహన్ విడుదలను ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమా వ్యతిరేకించారు. తన భర్త చనిపోవడానికి కారణమైన నిందితుడిని ఎందుకు విడుదల చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లనాటి ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తోందని వాపోయారు. ఇలా క్రిమినల్స్ను విడుదల చేస్తే రాజకీయ నాయకుల అండ చూసుకుని మరింత మంది రెచ్చిపోతారని తెలిపారు నేరస్థులకు ప్రభుత్వం మద్దతు తెలపడం సరికాదని, బిహార్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ మేరకు నంద్ మోహన్ విడుదల ఆపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఏఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. చదవండి: స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రధానికి కన్నీటి వేడుకోలు ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని కృష్ణయ్య కుమార్తె పద్మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ప్రధాని మోదీని నేను వేడుకుంటున్నాను. దయచేసి ఆనంద్లాంటి వ్యక్తులను తిరిగి సమాజంలో తిరగనివ్వద్దు. దీనిపై పోరాడే శక్తి మాకు లేదు. అలాంటి గ్యాంగ్స్టర్లు, మాఫియాలు బీహార్లో లేదా మరే రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా సంచరించకుండా చట్టం తీసుకురావాలి. మా నాన్న గురించి తెలియకపోతే బీహార్ ప్రజలను అడగండి. 29 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కూడా ప్రజలు దీనిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిర్ణయాన్ని పునరాలోచించండి. మాకు ఇది తగిన న్యాయం కాదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ఐఏఎస్ అధికారి కృష్ణయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే. ఆయన స్వస్థలం మహబూబ్నగర్. కృష్ణయ్య మృతి తర్వాత ఆయన భార్య హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం నిహారిక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుండగా.. పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఇటీవల నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ జైలు మన్యువల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నీతీష్ సర్కారు రూల్స్ మార్చడంతో.. గత 15 ఏళ్లుగా జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమమైనట్లు అయ్యింది. అనుకున్నట్లుగానే యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 27 మంది ఖైదీల విడుదలకు ఈనెల 24న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో ఆనంద్ మోహన్ పేరు కూడా ఉండటం తీవ్ర దుమారానికి తెరలేపింది. గ్యాంగ్స్టర్ కోసమే నీతీశ్ జైలు నిబంధనలు మార్చేశారంటూ విపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా.. దేశంలోని ఐఏఎస్లు సైతం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ఈ వ్యవహారం పెద్ద రాజకీయ వివాదంగా మారింది. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమిత్షాపై కాంగ్రెస్ సీరియస్