తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ | IAS Offiecrs Trasferred in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

Oct 31 2025 6:53 PM | Updated on Oct 31 2025 7:32 PM

IAS Offiecrs Trasferred in Telangana

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో ఎనిమిదిమంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సబ్యసాచి ఘోష్.. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా బదిలీ అయ్యారు.. ఈయనే వెల్ఫేర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతారు.

  • మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్.. వెల్ఫేర్ విభాగం కార్యదర్శి, గిరిజన సంక్షేమ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

  •  మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా ఉన్న ఇలంబర్తి..  ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.  

  •  బీసీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీధర్.. జీడీఏ పొలిటికల్ శాఖ కార్యదర్శిగా  బాధ్యతలు అప్పగించింది. 

  • హార్టికల్చర్ & సిరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న షేక్ యస్మీన్ బాషా.. ఆయిల్‌ ఫెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

  • మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా రామకృష్ణ రావు కొనసాగుతారు

  • జితేందర్ రెడ్డి ఎస్సీ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌గా బదిలీ  అయ్యారు.

  • మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న సైదులు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement