IAS
-
ఐఏఎస్, ఐపీఎస్ లపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
-
ఐఏఎస్, ఐపీఎస్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం బిగ్ టాస్క్ అన్నారు. కొత్తగా ఐఏఎస్గా వచ్చే వాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.చాలా మందికి కొంత మంది సీనియర్ ఐఏఎస్ల గురించి ఇప్పటికి తెలీదు.. శేషన్ ఐఏఎస్.. ఎన్నికల కమిషన్ ఉందని తట్టి లేపిన గొప్ప వ్యక్తి. రాజకీయ నాయకులను గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియడం లేదు. రాజకీయ నాయకులకు అవగాహన కల్పించే సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి. కొత్తగా సెలెక్ట్ అయిన కొందరు ఐపీఎస్లు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘కొత్త ఐపీఎస్లు యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయితీలు చూసుకోవడం దురదుష్టకరం. ఏసీ రూమ్ నుంచి బయటికి రావడానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇష్ట పడటం లేదు. జనంలోకి రండి అంటే రావడం లేదు. అధికారుల ఆలోచన విధానంంలో మార్పు రావాలి. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్లు వస్తాయి’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్లుగా..
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయింది ఆ కుటుంబం. ఉండేందుకు నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాయి జీవితాలు. ఒక్క రోజులో కథే మారిపోయింది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. అలాంటి గడ్డు పరిస్థితిలో చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతాధికారి కావాలనే ఆలోచన వైపుకే వెళ్లనంతగా జీవితం కటికి చీకటిమయంగా ఉంటుంది. అయితే అంతటి కటిక దారిద్య్రంలో బతికీడుస్తూ కూడా అన్నింటిని ఓర్చుకుని కన్నెరజేసిన ప్రకృతికే సవాలు విసిరారు. కష్టతర సాధ్యమైన హోదాలని అందుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణులై మనిషి సంకల్పానికి ఎలాంటి కష్టమైనా.. తోక ముడిచి తీరాల్సిందేనని చూపించారు. ఇంతకీ ఎవరా అక్కాచెల్లెళ్లు అంటే..తమిళనాడులోని కడలూరు జిల్లాకి చెందిన రైతు కుమార్తెలు ఆ అక్కాచెల్లెళ్లు. వారి పేర్లు సుష్మిత రామనాథన్, ఐశ్వర్య రామనాథన్. ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయం కుటుంబం వారిది. కటిక పేదరికంలో పెరిగారు. కనీస వనురుల లేక అల్లాడిపోయారు. అలాంటి కుటుంబం ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా అల్లకల్లోలమైపోయింది. సరిగ్గా 2004 హిందూ మహాసముద్రం సునామీలో ఇల్లుతో సహా సర్వం కోల్పోయారు. అప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నజీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయాయి. అయితే అక్కాచెల్లెళ్లు అంతటి భరించలేని పరిస్థితుల్లో కూడా చదువుని వదలలేదు. అదే తమ జీవితాలను మార్చే ఆయుధమని పూర్తిగా నమ్మారు. దానికే కట్టుబడి ఇరవురు యూపీఎస్సీకి సన్నద్ధమై అనుకున్నది సాధించారు. మరీ అక్కాచెల్లెళ్ల విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..ఐఏఎస్ ఐశ్వర్య రామనాథన్2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 628వ ర్యాంకు సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ (RAS)కి ఎంపికయ్యింది. కానీ ఆ పోస్టుతో సంతృప్తి చెందని ఐశ్వర్య మరోసారి 2019లో యూపీఎస్సీకి సన్నద్ధమైంది. అప్పుడు మెరుగైన ర్యాంకు సాధించి 22 ఏళ్లకే తమిళనాడు కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్గా నియమితురాలైంది.ఐపీఎస్ సుష్మితా రామనాథన్చెల్లెలు ఐశ్వర్యలా సునాయాసంగా యూపీఎస్సీలో విజయం అందుకోలేకపోయింది. ఏకంగా ఐదు సార్లు విఫలమైంది. చెల్లలు కంటే ఎక్కువ కష్టపడి సివల్స్లో సక్సెస్ అయ్యింది. ఆమె 2022లో ఆరవ ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 528వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందిన ఐపీఎస్ అధికారిణి అయ్యింది. ఆమె ప్రస్తుతం దక్షిణ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. (చదవండి: ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..) -
ఏపీ క్యాడర్పై కక్ష.. నాన్ ఏపీ క్యాడర్పై ఆపేక్ష
సాక్షి, అమరావతి: పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు! ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులకు కక్ష పూరితంగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులను మాత్రం ఏపీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ కూటమి సర్కారు రాగానే 9 మంది ఐపీఎస్లు, ఐదుగురు ఐఏఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కక్షపూరితంగా నలుగురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు రాష్ట్రంలో పాలన వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్లు లేరంటూ జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తోంది. రెడ్బుక్ కుట్రలపై మినహా పాలన వ్యవస్థపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది. రాగానే కక్ష సాధింపు చర్యలు.. గతేడాది జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 15 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ప్రభుత్వ విధానాలను అమలు చేసే అధికారులపై తన అక్కసు చూపడంతో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. దాదాపు ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరికి అప్రాధాన్య పోస్టుల్లో పోస్టింగులు ఇచ్చింది.పలువురికి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా ఇంకా వెయిటింగ్లోనే ఉంచడం చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం. వీరిలో ఐదుగురు ఐఏఎస్లు, ఐదుగురు ఐపీఎస్ అధికారులున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మురళీధర్రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠరెడ్డి, మాధవీలతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్కుమార్, కొల్లి రఘురామ్రెడ్డి, రిషాంత్రెడ్డి, రవిశంకర్రెడ్డి, జాషువాకు పోస్టింగులు ఇవ్వకపోవడం గమనార్హం. పదిమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందుబాటులో ఉన్నా వారి సేవలను వినియోగించుకోకుండా ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులను డిప్యుటేషన్పై పంపాలని కోరడం గమనార్హం. నలుగురు ఐపీఎస్ల సస్పెన్షన్ నలుగురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ చంద్రబాబు సర్కారు రెడ్బుక్ కుట్రకు పరాకాష్ట. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, ఎన్.సంజయ్, టి. కాంతిరాణా, విశాల్ గున్నీను ప్రభుత్వం కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. వలపు వల(హనీ ట్రాప్) విసిరి బడా బాబులను బ్లాక్ మెయిలింగ్ చేయడమే పనిగా పెట్టుకున్న ముంబై మోడల్ కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్గున్నీను సస్పెండ్ చేయడం బాబు సర్కారు కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం. రామోజీ కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను వెలికి తీశారనే కక్షతో ఎన్.సంజయ్పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. ఒకవైపు అందుబాటులో ఉన్న సమర్థులైన ఐపీఎస్ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మరోవైపు ఇతర రాష్ట్రాల అధికారుల కోసం అర్రులు చాస్తుండటం కూటమి సర్కారు దుర్నీతికి నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యుటేషన్ అధికారులే ముద్దు...తమ అక్రమాలకు వత్తాసు పలికేందుకే ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారుల కోసం చంద్రబాబు ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీ య అధికారులను డిప్యుటే షన్పై రప్పించి కీలక స్థానాలు కట్టబెడుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో డిప్యుటేషన్పై రాష్ట్రంలో కీలక పోస్టింగులు నిర్వహించిన యూ ్డపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి గతేడాది చంద్రబాబు సీఎం కాగానే రాష్ట్రంలో వాలిపోయారు. ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్టు కట్టబెట్టారు. అదే తరహాలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్పై వచ్చి ఏపీఎండీసీ ఎండీగా పని చేసిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మరోసారి రప్పించి ఏకంగా టీటీడీ అదనపు ఈవోగా అత్యంత కీలక పోస్టు కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృతి చెందినా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. టీటీడీలో ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా పాగా వేసి అక్రమాలకు తెగబడటం వెనుక కీలక పాత్ర వెంకయ్య చౌదరిదే.అదే రీతిలో తెలంగాణ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడుకు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. ఆయన్ను తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించింది. తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యుడైనప్పటికీ సస్పెండ్ చేయకుండా బదిలీతో సరి పెట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ఇవన్నీ చంద్రబాబు కోటాగా పరిగణించడంతో ఇక తన కోటా కూడా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే ఆయన డిమాండ్ మేరకు కేరళ క్యాడర్కు చెందిన మైలవరపు కృష్ణ తేజను డిప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చి పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా నియమించారు. నలుగురు ఇతర రాష్ట్రాల అధికారులను డిప్యుటేషన్ మీద తెప్పించుకున్నా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదు. ఇతర రాష్ట్రాల క్యాడర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరింత మంది కావాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. టీడీపీ తీరుపట్ల రాష్ట్రానికి చెందిన ఏఐఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను అమలు చేయడమే విద్యుక్త ధర్మంగా భావించే ఏఐఎస్ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరించడం ద్వారా దుష్ట సంప్రదాయానికి పాల్పడుతోందని పేర్కొంటున్నారు. -
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
-
ఐఏఎస్, ఐపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ అధికారి అయిన శ్రీలక్ష్మికి పోస్టింగ్కు ఇవ్వ లేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్నారు. కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా మహిళ అధికారిపై కక్ష సాధిస్తున్నారు. ఆల్ ఇండియా టాపర్, బీసీ అధికారి ముత్యాల రాజుకు కూడా పోస్టింగ్ దక్కలేదు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేశారనే కారణంతోనే ముత్యాలరాజుకు పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. మురళీధర్రెడ్డి, మాధవిలత, నీలకంఠరెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఐపీఎస్లు రఘురామిరెడ్డి, విశాంత్రెడ్డి, రవిశంకర్రెడ్డిలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆంజేయులు, సంజయ్, పీవీ సునీల్, క్రాంతి రాణా, విశాల్ గున్నిలను ప్రభుత్వం వేధిస్తోంది.ఇదీ చదవండి: కాంతి లేని కూటమి పాలన -
లక్షల వేతనాన్ని వద్దునుకుని సివిల్స్కి ప్రిపేరయ్యింది..కట్చేస్తే..!
ఐఏఎస్ అవ్వాలనేది చాలామంది యువత ప్రగాఢమైన కోరిక. కొందరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అసామాన్య ప్రతిభతో ఐఏఎస్ అవ్వుతారు. ఆ క్రమంలో తొలి , రెండు ప్రయత్నాల్లో తడబడి.. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించినవారు ఉన్నారు. అలా ఇలా కాకుండా విదేశాల్లో లక్షల్లో జీతం సంపాదిస్తూ సెటిల్ అయ్యి..కూడా ఐఏస్ అవ్వాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయం. అదికూడా విదేశాల్లోని లగ్జరీ వాతావరణానికి అలవాటు పడ్డవాళ్లు ఇక్కడకు వచ్చి సివిల్స్ ప్రిపేరవ్వడం అంటే అంతా పిచ్చా నీకు అంటారు. బానే ఉన్నావు కదా అనే అవమానకరమైన మాటలు వినిపిస్తాయి. అందులోనూ పెళ్లైన అమ్మాయికైతే ఏంటీ ఆలోచన అని తిట్టిపోస్తారు. కానీ ఈ అమ్మాయి వాటన్నింటిని పక్కన పెట్టి మరీ భర్త అండదండలతో సివిల్స్ ప్రిపేరయ్యింది. మరీ ఐఏఎస్ సాధించిందా అంటే..హర్యానాకు దివ్య మిట్టల్ లండన్ ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్లోని జేపీ మోర్గాన్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసింది. హయిగా లక్షల్లో జీతం తీసుకుంటూ ధర్జాగా గడుపుతుండేది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది. ఎందుకనో ఆ లైఫ్ ఆమె కస్సలు నచ్చలేదు. ఏదో తెలియని అసంతృప్తి దీంతో ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్కి ఎందుకు ప్రిపేరవ్వకూడదు అనుకుంది. కఠినతరమైన ఈ పరీక్షను ఇలాంటి పరిస్థితిలో సాధించి గెలిస్తే ఆ కిక్కే వేరు అనుకుంది. అనుకున్నదే తడువుగా భర్తతో కలిసి స్వదేశానికి వచ్చేసి మరీ 2012లో యూపీఎస్సీ(UPSC)కి ప్రిపేరయ్యింది. అయితే తొలి ప్రయత్నంలో అనుకున్నది సాధించలేకపోయింది. ఐపీఎస్తో సరిపెట్టకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో 2013 లో మళ్ళీ పరీక్ష రాసి 68 వ ర్యాంకు సాధించి ఐఏఎస్(IAS) కలను సాకారం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మిర్జాపూర్, సంత్ కబీర్ నగర్ బస్తీ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేస్తోంది. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ఐఏఎస్కి సిద్ధమయ్యే అభ్యర్థులు ఎల్లప్పడూ తమ లక్ష్యంపై దృష్టి సారించాలి. "చక్కటి ప్రణాళితో ఎలా చదవుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకోసారి విరామం తీసుకుంటే..రిఫ్రెష్గా మరింత బాగా చదవగలుగుతారని సలహాలిస్తోంది." దివ్య. ఇలాంటి కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఏ అభ్యర్థి అయిన ఫోన్కి దూరంగా ఉంటే అన్నుకున్నది సాధించగలుగుతారని అంటోంది. ఇక్కడ దివ్య స్టోరీ కారణాలు చెప్పేవారికి చెంపపెట్టు. అనుకున్నది సాధించాలనుకునేవారు ముందు చూపుతో సాగిపోవాలే గానీ తప్పుచేస్తన్నానా..అనే అనుమానంతో ఊగిసలాడితే ఘన విజయాలను అందుకోలేరు, రికార్డులు సృష్టించలేరు అని ధీమాగా చెబుతోంది దివ్య. ఆమె గెలుపు ఎందరికో స్ఫూర్తిదాయకం.(చదవండి: ప్రపంచంలోనే అత్యల్ప సంతోషకరమైన దేశాలివే..! భారత్ ఏ స్థానంలో ఉందంటే..) -
సికింద్రాబాద్లో పతంగుల సందడి.. కైట్స్ ఎగరేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ (ఫోటోలు)
-
ఒక్క మాట మాట్లాడరు కానీ ఐఏఎస్ కోచింగ్..!
ప్రస్తుత రోజుల్లో కోచింగ్ అంటే ఎంత డబ్బు వెచ్చించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఐఏఎస్లాంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలకు కొచింగ్కి అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో తెలియంది కాదు. కానీ అలాంటి కఠినతరమైన ఐఏఎస్ పోటీ పరీక్షకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే మౌనంగానే కోచింగ్ ఇస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా కోచింగ్ ఇస్తాడు. అందరికీ ఉన్నతోద్యోగాలు చేసే అవకాశం దక్కాలని ఇలా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడట. ఇంతకీ ఎవరా ఆ వింత వ్యక్తి..ఆ వ్యక్తి పేరు దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి. ఎప్పుడూ కాషాయ దుస్తులు ధరించి, పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించే ఈయనను అంతా చాయ్వాలే బాబా (Chai Wale Baba)గా పిలుస్తారు. తన జీవితాన్ని ఐఏఎస్(IAS) కోచింగ్కి అంకితం చేశారు. ఆయన అందరూ ఉన్నతోద్యోగాలు పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారికైనా ఉచితంగానే ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు చాయ్వాలే బాబా . ప్రత్యేకత ఏంటంటే..కోచింగ్ ఇవ్వాలంటే నోరు విప్పాల్సిందే. స్టూడెంట్స్కి అర్థమయ్యేలా విపులంగా విడమర్చి గట్టిగా చెప్పక తప్పదు. అలాంటిది ఈయన నోరు తెరవకుండానే భోధిస్తారు. మౌనవ్రతం పాటిస్తూనే..సైగలతో అభ్యర్థులను గైడ్ చేస్తుంటారు. వాట్సప్ ద్వారా నోట్స్ ఇస్తారు. ఇతరత్రా ఆదేశాలు, మెసేజ్లు కూడా వాట్సప్ ద్వారానే. అయినప్పటికీ.. వేలాది మంది ఆయన దగ్గర మెంటార్షిప్ తీసుకుంటున్నారు. ఏ డౌట్ ఉన్నా సరే, ఆయనకు వాట్సప్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆన్సర్ రిప్లై వస్తుంది.కేవలం 'టీ' మాత్రమేఈ చాయ్వాలా బాబాకు సంబంధించిన మరొక విశేషమేమిటంటే..ఆయన అస్సలు ఎలాంటి ఘనాహారం తినరు. కేవలం రోజుకి పది కప్పుల టీ(చాయ్) మాత్రమే తాగుతారు. అందువల్లే ఆయన్ని చాయ్వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన జీవనశైలి ఇదేనట.ఏ డౌట్ ఉన్నా వెంటనే గైడ్ చేస్తారు..ఆయన శిఘ్యులు తమ గురువు బాబా ఎప్పుడు ఏ సాయం కావాలన్నా..తక్షణమే తమకు గైడెన్స్ ఇస్తారని అంటున్నారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన సైగలు, సంకేతాలు, వాట్సప్ మెసేజ్ల ద్వారానే గైడ్ చేస్తారని చెప్పారు. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేస్తే చాలు, తక్షణమే రిప్లై ఇస్తారని చెబుతున్నారు. ఆఖరికి నోట్స్ కూడా వాట్సప్ ద్వారానే పంపుతారని ఓ శిఘ్యుడు చెబుతున్నాడు.(చదవండి: సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!) -
పూజా ఖేద్కర్కు మరో షాక్.. అరెస్టు తప్పదా?
ఢిల్లీ : వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్కు మరో షాక్ తగిలింది. అధికార దుర్వినియోగంతో పాటు, ఐఏఎస్కు ఎంపిక అయ్యేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. #BREAKING Delhi High Court denies anticipatory bail to former probationer IAS officer Puja Khedkar accused of “misrepresenting and falsifying facts" in her UPSC application. #PujaKhedkar #UPSC pic.twitter.com/mgw3QYhaux— Live Law (@LiveLawIndia) December 23, 2024పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్ర ధరి సింగ్తో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..జస్టిస్ చంద్ర ధరి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. పూజా ఖేద్కర్ ఉద్దేశ పూర్వకంగానే ఐఏఎస్ ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించినట్లు తాము గుర్తించాం. ఆమె కుట్ర పూరితగా చర్యలు ఐఏఎస్కు అనర్హులు. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలు ‘అధికారం కోసమే కాకుండా, దేశం మొత్తాన్ని మోసం చేశారనే దానికి ఉదాహరణ నిలుస్తారు.‘పిటిషనర్ (పూజా ఖేద్కర్) ప్రవర్తన పూర్తిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ పత్రాలు సమర్పించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు భారీ ఎత్తున మోసానికి తెరతీశారు.’ ‘ప్రస్తుతం కేసు దర్యాప్తు, అందుబాటులో ఉన్న రికార్డ్ల ఆధారంగా పూజా ఖేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందేందుకు అనర్హులు. దీంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కుమ్మక్కయ్యే అవకాశం ఉంది’. దీంతో ప్రభుత్వ అధికారులు, సంబంధిత విభాగాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉండననుంది.వివాదాస్పద కేసులో గతంలో పూజా ఖేదర్కర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చిన జస్టిస్ చంద్ర ధరి సింగ్తో కూడిన ఏక సభ్య ధర్మాసనం.. ఈ రోజు విచారణలో ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో పోలీస్ శాఖ పూజా ఖేద్కర్ అరెస్ట్ తప్పదన్న చర్చ మొదలైంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కారు. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్తో అధికారిక ఛాంబర్ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా యూపీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆమె ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ఎంపిక అవ్వడం వరకూ పూజా ఖేద్కర్ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమెపై కోర్టులో కేసు నడుస్తోంది. నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.ఐఏఎస్ సర్వీస్ నుంచి తొలగింపుఇలా వరుస వివాదాల నేపథ్యంలో కేంద్రం పూజా ఖేద్కర్పై విచారణకు ఆదేశించింది. విచారణాలో సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరణఈ వివాదంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు మార్లు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. తాజాగా, సోమవారం సైతం ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్కర్కు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. -
డిప్రెషన్తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!
ఐఏఎస్ సాధించటం చాలామంది యువత కల. అయితే కొందరు మాత్రమే ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదరయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధించగలుగుతారు. అలాంటి కోవకు చెందిందే అలంకృత. డిప్రెషన్ అనేది ఎంత భయానక మానసిక వ్యాధి అనేది తెలిసిందే. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. అలాంటి సమస్యతో పోరాడుతూనే క్లిష్టతరమైన సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యింది. ఈ క్రమంలో ఆమె చేసిన అలుపెరగని పోరాటం అసామాన్యమైనది. వ్యక్తిగతంగా క్షోభను అనుభవిస్తూనే..తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించి అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి చెందిన అలంకృత పాండే ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ నుంచి ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేసింది కూడా. ఇంకా ఏదో సాధించాల్సింది మిగిలిపోయిందన్న ఫీల్తో 2014లో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంది. అయితే ఆ ఏడాదే ఆమె తీవ్రమైన డిప్రెషన్తో మనో వ్యధను అనుభవించింది. తన స్నేహితులు, కుటుంబసభ్యుల మద్దతతుతో అధిగమించే యత్నం చేసింది. అయితే తీవ్రమైన డిప్రెషన్ ప్రభావంతో..ఆ ఏడాది ఫ్రిలిమ్స్కు హాజరు కావడం కూడా మానుకోక తప్పలేదు. అయినప్పటికీ అలంకృత అంతు చూసేంత వరకు తగ్గేదే లే..అంటూ వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక వేసుకుని మరీ కష్టపడి చదివేది. సరిగ్గా 2015లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. తొలి పోస్టింగ్ పశ్చిమబెంగాల్ కేడర్ కేటాయించడంతో అక్కడ నుంచి ఐఎఏస్గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత తన తోటి ఐఏఎస్ అధికారి అన్షుల్ అగర్వాల్ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీహార్లో ఐఏఎస్గా విధుల నిర్వర్తిస్తోంది. ఇక్కడ అలంకృత డిప్రెషన్పై సడలని అలుపెరగని పోరాడటమే ఐఏఎస్ సాధించేలా చేసింది. సడలని స్థిరమైన స్థైర్యంతో కష్టతరమైన సవాళ్లను అధిగమించి అద్భుతాలను సృష్టించొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. సాధించాలన్న దృఢ సంకల్పం ముందు ఎంతటి అనారోగ్య సమస్య అయినా కతం కావాల్సిందే కదూ..!.(చదవండి: బెట్టింగ్ పిచ్చి తగ్గేదెలా?) -
ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుని.. భారత క్రికెట్ క్వీన్గా క్లాసికల్ డాన్సర్(ఫొటోలు)
-
నాగారం ల్యాండ్ కేసు.. మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు..
-
క్యాట్లో ఐఏఎస్ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఇవాళ( సోమవారం) విచారణ జరగింది. స్వాపింగ్, డొమిసిల్ (స్థిర నివాసం) ఆధారంగా తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదన్న ఐఏఎస్ల పిటిషన్పై క్యాట్ విచారణ చేపట్టింది. అయితే ఈరోజు డీఓపీటీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక.. ఎడుగురు ఐఏఎస్ అధికారుల విడిగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ తరుపు న్యాయవాదులు కోరారు. వచ్చే విచారణకు ఏడుగురు ఐఏఎస్ల కేటాయింపుపై విడిగా కౌంటర్లు ఫైల్ చేయాలనీ డీఓపీటీకి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ క్యాట్ 4 వారాలకు వాయిదా వేసింది.గత నెలలో కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ఐఏఎస్ల పిటిషన్పై క్యాట్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ..డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలతో ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాల్లో ఐఏఎస్లు రిపోర్ట్ చేశారు.అయితే తమని డొమిసిల్,స్వాపింగ్ ఆధారంగా కేటాయింపు జరగలేదని, డీవోపీటీ తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏడుగురు ఐఏఎస్లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సీడీఎంఏగా శ్రీదేవి.. హరీశ్కు ఐఅండ్పీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరె క్టర్లు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జాబి తాలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికా రులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని మళ్లీ పుర పాలక శాఖకు పంపారు. ఆమెను కమిషనర్ అండ్ డైరె క్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)గా బదిలీ చేస్తు న్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్పీఆర్) స్పెషల్ కమిషనర్గా ఉన్న ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా, ఐఅండ్పీఆర్ బాధ్యతలను రెవెన్యూ జాయింట్ సెక్ర టరీ ఎస్.హరీశ్కు అప్పగించారు. ఆయనను ఐఅండ్పీఆర్ స్పెషల్ కమిషనర్గా బది లీ చేసినప్పటికీ రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న శశాంకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా నియమితులైన ఎస్.హరీశ్ సోమవారం ఆన్లైన్లో బాధ్యతలు స్వీకరించారు. (వీరితో పాటు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తికి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్రెడ్డికి పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిణి సోని బాలాదేవిని డైరెక్టర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా పునర్నియమించారు. మేడ్చల్–మల్కాజ్గిరి జెడ్పీ సీఈవోగా ఉన్న ఎస్.దిలీప్కుమార్ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. రాజన్న సర్కిల్లో అసిస్టెంట్ కన్జర్వేటర్గా ఉన్న అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్ను వికారాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్వో)గా నియమించారు.) -
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్గా నిలిచిన ఫీట్ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్గా ఇన్స్టాగ్రామ్లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
భూదాన్ భూముల భాగోతం..ఐఏఎస్పై ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: భూదాన్ భూముల భాగోతంపై ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం, ఆయనను ఈడీ అధికారులు బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఈడీ కార్యాలయం నుంచి ఐఏఎస్ అధికారిని బయటకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు సర్వే నెంబర్ 181,182 మహేశ్వరం మండలం నాగారంలోని భూములపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 70ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. భూముల అక్రమ బదిలీ ఆరోపణలు మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. ఇక్కడ రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా అమోయ్ కుమార్ పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను తేల్చేందుకు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇవాళ మూడో రోజు ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. -
ఐఏఎస్ అమోయ్ కుమార్కు బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ ఫుల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు కూడా మరోసారి విచారణకు రావాలని తెలిపింది. మహేశ్వరం మండలం నాగరంలో 42 ఎకరాల భూమి కేటాయింపుపై అమోయ్ కుమార్ను ఈడీ ప్రశ్నిస్తోంది.గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశాడు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ బాగోతం బయటపడింది. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని బోర్డ్ వాదిస్తోంది.ఇక, ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్ను భూదాన్ బోర్డుకి దానం చేశాడు. 2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. దీంతో, ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో ఈడీ.. ఎమ్మార్వో జ్యోతి, ఆర్డీవోను సైతం నేడు విచారించే అవకాశం ఉంది. -
TG: అమోయ్కుమార్ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్కుమార్ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్కుమార్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్కుమార్ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్కుమార్ రంగారెడ్డి కలెక్టర్గా పనిచేశారు. ఆయన కలెక్టర్గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్కుమార్కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
TG: ఐఏఎస్లను రిలీవ్ చేసిన ప్రభుత్వం
సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం(అక్టోబర్ 16) సాయంత్రం రిలీవ్ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయనున్నారు. ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్ల స్థానంలో ఇన్ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖక్రిస్టినా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కు క్రిస్టినా, జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్గా ఇలంబర్తిలను ప్రభుత్వం నియమించింది.ఇదీ చదవండి: ఐఏఎస్లకు తెలంగాణ హైకోర్టు చుక్కెదురు -
ఐఏఎస్ లకు హై కోర్టు షాక్..
-
ఐఏఎస్లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్లకు చుక్కెదురైంది. ఐఏఎస్లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించింది. విచారణలో భాగంగా ఐఏఎస్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఐఏఎస్లో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు.ఐఏఎస్ అధికారుల పిటిషన్పై విచాణ జరిగిందిలావిచారణ సందర్భంగా.. డీపీవోటీ తరపు లాయర్ తెలంగాణ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్రంలో ఉన్న అధికారులంతా అనుభవజ్ఞులు. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే విజ్ఞత వాళ్లకు ఉంది. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే అధికారం కోర్టులకు లేదని అన్నారు.ప్రజా సేవ కోసమే ఐఏఎస్లుప్రజా సేవ కోసమే ఐఏఎస్లు. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలి. ట్రైబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదు. డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు.ఇది లాంగ్ ప్రాసెస్.అధికారులు ముందు రిపోర్ట్ చేయండి’అని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనల్ని వినిపించారు. స్థానిక తను పరిగణలోకి తీసుకోవాలని,ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరారు.తీర్పును వాయిదా వేయాలంటూపండగలు ఉన్నాయి అప్పటివరకు స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు ఇప్పుడు ఏం లేవన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అయితే అందుకు ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని చెప్పగా.. క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరిన హై కోర్ట్ కోరింది. అందుకు ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని ఐఏఎస్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఐఏఎస్లను రిలీవ్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఐఏఎస్ల విజ్ఞప్తిపై హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా.. బుధవారం సాయంత్రంలోగా ఐఏఎస్లు ఏపీలో రిపోర్ట్ చేయాలని, కాబట్టి పూర్తి స్థాయిలో వినాలంటూ పట్టుబట్టడటంతో వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.ముందు ఏపీలో రిపోర్ట్ చేయండిఅటు డీవోపీటీ, ఇటు ఐఏఎస్ల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ..15రోజుల పాటు ఊరట కల్పించాన్న ఐఏఎస్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. ఐఏఎస్లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అనంతరం, ‘ముందు ఏపీలో రిపోర్ట్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత వింటాం. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి’ అని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ తుది తీర్పును వెలువరించింది. 👉చదవండి: ఐఏఎస్లకు క్యాట్ చురకలు -
ఆ ఐదుగురు ఐఏఎస్లకు బిగ్ షాక్
సాక్షి,హైదరాబాద్: డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యున్ల్లో(క్యాట్) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు బిగ్ షాక్ తగిలింది. డీఓపీటీ ఉత్తర్వులను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం సదరు ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది క్యాట్డీఓపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలని, ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్లైన్స్లో ఉందా?’ అని క్యాట్ ప్రశ్నించింది. కాగా రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్రాస్, జి.సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్రాస్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.👉చదవండి: ఐఏఎస్, ఐపీఎస్ల కేడర్ విభజనపై కేంద్రం కీలక ఆదేశాలు -
క్యాట్ పిటిషన్ కహానీ
-
ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత
-
‘మేం ఏపీకి వెళ్లలేం’.. క్యాట్లో ఐఏఎస్ల పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. నలుగురు ఐఏఎస్లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది.తెలంగాణ సీఎస్ శాంతికుమారితో భేటీతెలంగాణ సీఎస్ శాంతికుమారితో ఏపీ కేడర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. గతవారం ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్లు ఎల్లుండి (అక్టోబర్ 16) లోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఏఎస్లు ఇంకా రిలీవ్ కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో డీవోపీటీ ఆదేశాల మేరకు ఎల్లుండి ఏపీలో రిపోర్ట్ చేసే విషయంపై సీఎస్తో అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఏపీకి వెళ్ళబోమని డీవోపీటీకి విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని డీవోపీటీ తిరస్కరించింది. దీంతో ఐఏఎస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. రేపు క్యాట్ విచారణ చేపట్టనుంది. అనంతరం ఐఏఎస్లు,ఐపీఎస్లు ఏపీకి వెళ్తారా? లేదంటే తెలంగాణలోనే కొనసాగుతారా? అనేది తేలనుంది.👉చదవండి: మీరు వెళ్లాల్సిందే -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? (ఫొటోలు)
-
ఆంధ్రాకు వెళ్లాల్సిందే.. ఐఏఎస్, ఐపీఎస్లకు DOPT బిగ్ షాక్
-
సొంత రాష్ట్రాలకు వెళ్లిపోండి.. ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం షాక్
-
మీరు వెళ్లాల్సిందే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్ల కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించినవారు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణకు కేటాయించినా ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సృజన(ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), శివశంకర్ లోతేటి (వైఎస్సార్ జిల్లా కలెక్టర్), సీహెచ్ హరికిరణ్(వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్)లను వెంటనే తెలంగాణకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్ను వెంటనే ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని ఆదేశించింది. ఈ అధికారులను ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ చేస్తూ వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెలియజేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే... రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అలాగే తెలంగాణకు కేటాయించిన కొంతమంది ఐఏఎస్లు.. తమను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరినా అంగీకరించలేదు. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు క్యాట్ను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. గత మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి వారి అభ్యర్థనలు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారుల అభ్యంతరాల పరిశీలనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీపక్ను కేంద్రం నియమించింది. దీపక్ ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను తిరస్కరించింది. కచ్చితంగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
బాబు, పవన్ రాజీనామా చేయాలి మాజీ IAS డిమాండ్..
-
Puja Khedkar: పూజా ఖేద్కర్కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్లో ఖేద్కర్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ సవాల్!
ఢిల్లీ : తన అభ్యర్థిత్వం రద్దు చేసే హక్కు యూపీఎస్సీకి లేదని వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒకసారి ఎంపికై ప్రొబేషనర్గా నియమితులైన తర్వాత, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం లేదన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే ఉందని, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954 సీఎస్ఈ 2022 రూల్స్లోని రూల్ 19 ప్రకారం ప్రొబేషనర్ రూల్స్ ప్రకారం చర్య తీసుకోవచ్చు’అని ఖేద్కర్ పేర్కొన్నారు.పూజా ఖేద్కర్ కేసు ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న పూజా ఖేద్కర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆమె వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీచేసింది.ఆ తర్వాత ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. విచారణలో ఆమె తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలింది. దీంతో పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. -
పూజా ఖేద్కర్ వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వైకల్య ధ్రువీకరణ పత్రాల వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల నియామకం, శిక్షణ, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)విభాగం అప్రమత్తమైంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఆర్ఎస్ అధికారి ఉన్నట్లు సమాచారం.లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికెట్తో పాటు కంటి, మానసిక సంబంధిత సమస్యలపై తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించేందుకు నిర్వహించే వైద్య పరీక్షలకు ఖేద్కర్ ఆరుసార్లు గైర్హాజరవ్వడం వంటి వరుస వివాదాలు ఆమె ఐఏఎస్ అభ్యర్థితత్వం రద్దుకు దారి తీసింది. ట్రైనీ ఐఎస్ఎస్ అధికారిణి చేసిన తప్పుల్ని గుర్తించిన యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది.తదుపరి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్ తప్పదేమోనన్న అనుమానంతో ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించింది. ఈ వరుస పరిణామాలతో ఖేద్కర్ విదేశాలకు పారిపోయినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.Puja Khedkar case: Following the row over #IAS probationer #PujaKhedkar, the Department of Personnel and Training (#DoPT) will now scrtutinise the disability certificates of six other civil servants.https://t.co/F4bXZs7rL9— Business Today (@business_today) August 2, 2024 -
Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
‘మహిళలు ఐఏయస్ కావడం కష్టం’ అనుకునే ఆ రోజుల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏయస్ సాధించింది. ‘ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడనప్పుడు ఆ ఉద్యోగం చేయడం వృథా’ అనుకొని ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అరుణారాయ్. గ్రామీణ మహిళలతో కలిసి పోయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. తాజా విషయానికి వస్తే... తన జ్ఞాపకాలను ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఉద్యమ ప్రయాణం గురించి...మనం పుట్టి, పెరిగిన వాతావరణం ఏదో రకంగా బలమైన ప్రభావం చూపుతుంది. కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే కుటుంబంలో చెన్నైలో పుట్టి పెరిగింది అరుణ. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది.‘మహిళలు ఐఏఎస్కు సెలెక్ట్ కాలేరు’ అని బలంగా అనుకునే కాలంలో తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది. సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. వ్యవస్థీకృతమైన అవినీతికి సంబంధించిన అసంతృప్తి అది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్ఫుట్ కాలేజీ)లో చేరింది. రాజస్థాన్లోని తిలోనియ గ్రామంలో ఉన్న ‘బేర్ఫుట్ కాలేజీ’లో పనిచేయడం అరుణకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాపథంలోకి వచ్చింది.గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం... మొదలైనవి లేని కాలం అది. కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాలేవీ ఎప్పుడూ అరుణకు కష్టంగా అనిపించలేదు. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం అందినప్పటికీ అక్కడికి వెళ్లకపోగా దానికి ప్రత్యామ్నాయంగా రాజస్థాన్లో మహిళా మేళ (మహిళల పండగ) నిర్వహించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు, ఈ స్థానిక సదస్సుకు తేడా ఏమిటంటే... మొదటి దానిలో మధ్యతరగతి, ఆ పై తరగతి విద్యాధికులైన మహిళలే ఎక్కువగా పాల్గొనే సదస్సు. ఇక రెండోది పూర్తిగా గ్రామీణ మహిళలు, శ్రామిక మహిళల కోసం నిర్వహించిన సదస్సు. ఈ తరహా పండగ జరగడం దేశంలో మొదటిసారి.‘మహిళ మేళ’ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక–రాజకీయ చర్చలకు వేదిక అయింది. మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి జరిగిన తొలి బహిరంగ చర్చావేదిక అయింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరుణారాయ్ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడింది. ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిస్ట్గా మరింత క్రియాశీలంగా పనిచేయడం ్రపారంభించింది.స్థూలంగా చెప్పాలంటే... అరుణా రాయ్ అంటే ఒక నామం కాదు. అనేకానేక ఉద్యమాల సమాహారం. సమాజహితాన్ని కోరుకునే వారికి స్ఫూర్తిదాయక ఉత్తేజం.పేద మహిళల కోసం...‘జ్ఞానం యొక్క ఉద్దేశం జ్ఞానం కాదు. కార్యాచరణ’ అంటాడు అరిస్టాటిల్. జ్ఞానం అనేది బుర్రలో భద్రపరుచుకొని మురిసిపోవడానికి కాదు. ఆ జ్ఞాన ఫలాలను ఆచరణలోకి, పదిమంది ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి మారు మూల పల్లెల వరకు జ్ఞానమార్గంలో పయనించిన అరుణా రాయ్ ఆ జ్ఞానాన్ని పేద మహిళల సంక్షేమం, చైతన్యం కోసం వినియోగించింది. ఉద్యోగ, ఉద్యమ జ్ఞాపకాల ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ ఆమె వ్యక్తిగతం కాదు. సామాజికం. ఉద్యమ బాటలో పయనించడానికి ఉపకరించే ఇంధనం. -
కోచింగ్ కోళ్ళఫారాలు
వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు చేయాల్సిన పని చేయకపోతే... విషాదం ఎలా ఉంటుందో చెప్పడానికి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు బేస్మెంట్లో నడుపుతున్న స్టడీ సెంటర్లోకి పైపులు పగిలి నీళ్ళు వెల్లువెత్తినప్పుడు, జలదిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టు కున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. పూర్తిస్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందట. పది పన్నెండు మంది కనిపించట్లేదట. కొద్దిరోజుల క్రితం పొంగిపొర్లిన వర్షపునీటి వీధిలో విద్యుదాఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించినప్పుడే వ్యవస్థ మేల్కొని ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇప్పుడీ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. గమనిస్తే, క్రిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్ళఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు, కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలు, వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్ళు, అధ్వాన్నమైన డ్రైనేజ్ వ్యవస్థ, అవినీతికి పాల్పడి అన్నిటినీ వదిలేసిన అధికార యంత్రాంగం... అలా ఇది సామూహిక వైఫల్యం. సమష్టిగా అందరూ చేసిన పాపం. ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్, యజమానుల లాంటి పెద్ద చేపల్ని వదిలేసి చిరుద్యోగుల అరెస్ట్, ఘటనకు దారి తీసిన కారణాలు – నివారణ చర్యలపై నివేదికకు కేంద్ర హోమ్శాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు లాంటివి చకచకా జరిగాయి. కానీ, పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లితండ్రుల గర్భశోకం తీరుస్తాయా? శనివారం నుంచి విద్యార్థులు బైఠాయించి, శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన హామీనిచ్చి సాంత్వన పరచలేకపోవడం మరో వైఫల్యం.ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్ద ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న టీచర్లు, పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలను చూస్తుంటే వెగటు పుట్టక మానదు. ప్రజలెన్నుకున్న ఢిల్లీ ‘ఆప్’ సర్కార్పై కేంద్రం పనుపున లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన తైనాతీ అధికారుల పెత్తనం ఒక తప్పయితే... క్షేత్రస్థాయిలో లేకున్నా జైలు నుంచే రోజువారీ పాలన సాగిస్తానంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు. శిక్ష, నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు, పరిపాలనకు పడుతోంది.ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. 61 మంది విద్యార్థులు గాయపడ్డారు. అప్పుడూ ఇలాగే జనాగ్రహం పెల్లుబికింది. సదరు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 600 దాకా కోచింగ్ సెంటర్లుంటే, వాటిలో 67కే అనుమతులున్నాయట. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, చేసింది శూన్యం. నిజానికి, 2021 నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్, అలాగే 2016 నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించాయి. అయినా సరే బేస్మెంట్లలో కోచింగ్ కేంద్రాలు, వాటి లైబ్రరీలు, జిమ్లు, షాపులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి పొంచివున్న ప్రమాదాలు అనేకం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసినా, ఈ ఉల్లంఘనలపై అన్నిచోట్లా పాలకులది ఓ గుడ్డిదర్బారే! వాహనాల పార్కింగ్, స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్టవ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా వాడుతూ, వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్న వైనం పట్ల చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నెల క్రితం కూడా సాక్షాత్తూ ఓ విద్యార్థే ఈ సెల్లార్ల నియమోల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ‘‘పెను ప్రమాదం సంభవించవచ్చు’’ అని భవిష్యద్వాణిలా హెచ్చరించారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. తక్కువ వసతులు, కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్ల అత్యాశ తెలియనిది కాదు. సక్సెస్ రేటు, సెలక్టయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనల్లో ఇవ్వరాదని నిబంధనలున్నా, వాటినవి గాలికొదిలేస్తున్న వైనమూ నిత్యం చూస్తున్నదే. తప్పుడు గొప్పలు చెప్పుకొని ఆకర్షించే జిమ్మిక్కులూ తెలిసినవే. వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీటికి అడ్డూ ఆపూ లేదు. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యావ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోలేకున్నా అమాయకుల ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా నిబంధనలతో అదుపు చేయడం పాలకులు తలుచుకుంటే కష్టం కాదు. ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య! తాజా ఘటన పార్లమెంట్లో చర్చ దాకా వెళ్ళడంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజనుకు పైగా చట్టవిరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీలు వేసింది. మరో అరడజను పేరున్న సంస్థల బేస్మెంట్లకు తాళాలు బిగించింది. స్థలాలను ఆక్రమించి, వరద నీటి కాల్వలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగం మొదలుపెట్టింది. నిజానికిది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం. కోచింగ్, దాని అనుబంధ వ్యాపారం కోట్లలో సాగుతూ, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నా, కనీస రక్షణ, వసతులు ప్రభుత్వపరంగా కల్పించలేకపోవడం పాలకుల హ్రస్వదృష్టికి తార్కాణం. పైగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ, వికసిత భారత గాథను లిఖించాలని చూస్తున్న పాలకులకిది శోభనివ్వదు. సరైన పట్టణ ప్రణాళిక లేకుండా కాంక్రీట్ కీకారణ్యాల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనమూ లేదు. ఢిల్లీ ఘటనలు పునరావృతం కాకముందే కేంద్రం, రాష్ట్రాలు నిద్ర లేవాలి. -
ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ భాన్సూరి
-
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
-
యూపీఎస్సీపై మరక తొలగేదెలా?
ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ వివాదం యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపింది. పదవిలో ఉన్నప్పుడే కాకుండా, పదవీ అనంతరం కూడా ఎన్నో అత్యున్నత నియామకాలను సివిల్ సర్వీసెస్ వాళ్లు పొందుతున్నారు. అలాంటప్పుడు ఇందులోకి ఎలాగోలా ప్రవేశించడానికి న్యాయమో, అన్యాయమో ఒక కోటాను వాడుకోవడానికి అవకాశం ఉంది. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది. అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమతించడంలోని హేతుబద్ధతను సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం.ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ చుట్టూ అలుముకున్న వివాదం ఏమిటంటే, ట్రెయినీ ఐఏఎస్గా పుణె కలెక్టరేట్లో నియమితురాలైన ఆమె బంగ్లా, కారు లాంటివి కావాలని అల్లరి చేయడమే! ఇది తెలిసి మన అత్యున్నత శిక్షణా విభాగం అంతా బాగానే ఉందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నేడు అందరి దృష్టీ ఖేడ్కర్ మీద ఉంది. కానీ ఈ ఉదంతంపై త్వరలోనే సిబ్బంది, శిక్షణా విభాగం(డీఓపీటీ) అదనపు కార్యదర్శి నివేదిక వెల్లడించిన తర్వాత, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్వయంగా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ ఉదంతాన్ని ఖేడ్కర్తో ప్రారంభించాలంటే, రెండు వేర్వేరు పేర్లతో వైకల్య ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆమె మనస్సులో ఏముంది అనేది ఆలోచించాలి. ఆమె మొదటి సందర్భంలో ఏ విభాగపు వైకల్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు? కొన్ని మీడియా వార్తలు సూచించినట్లుగా ఆమె వాస్తవానికి మరొకదానికి మారారా లేక మరో వక్రమార్గాన్ని జోడించారా? ఆమె తండ్రి ప్రకటించిన వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, నాన్–క్రీమీలేయర్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ధ్రువీకరణను ఎలా పొందగలిగారు? అక్కడి తహసీల్దార్ కూడా ఖేడ్కర్ తండ్రీ కూతుళ్ల కోరిక మేరకు ఈ సృజనా త్మక రచనలో తన సముచిత వాటాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల (ఆర్పీడబ్ల్యూడీ) చట్టం– 2016, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఒక నిర్దిష్ట విభాగంలో కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లుగా, వైద్యాధికారి ధ్రువీకరించిన వ్యక్తినే ‘బెంచ్మార్క్ వైకల్యం’ ఉన్న వ్యక్తిగా నిర్వచించింది. ‘మానసిక వికలాంగుల’ విభాగంలో ఉపాధి కోసం ఆమోదించబడిన వైకల్యపు కనీస శాతం 35. ఖేడ్కర్ ఉదంతంలో చాలామంది ఆమె 35 శాతం మానసిక వైకల్యం సమీపంలో కూడా లేదనీ, తన కేసును ముందుకు తీసుకు రావడానికి ఆమె ఉదహరించిన రెండు వైకల్యాల్లో ఇది ఒకటనీ హామీపూర్వకంగా చెబుతున్నారు.పూజా ఖేడ్కర్ కేసు సముద్రంలో నీటిబొట్టంతే కావచ్చు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ నిస్సందేహంగా, కొన్ని వందల ఉద్యోగాల కోసం లక్షకుపైబడిన వార్షిక దరఖాస్తుదారులతో తీవ్రాతితీవ్రమైన పోటీతో కూడి ఉంటుంది. అభ్యర్థులు వాస్తవానికి, డబ్బు, సమయం పరంగా భారీగా పెట్టుబడి పెడతారు. సగటున, వారు తమ అమూల్య మైన కాలంలో రెండు–మూడు సంవత్సరాలు కేవలం సన్నాహకాల్లోనే గడుపుతారు. ఉత్తమంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, దానిని సాధించే విషయంలో అత్యంత చురుకైన వారికి కూడా ఎలాంటి హామీ ఉండదు. అటువంటి అత్యున్నత ప్రయోజనాలతో కూడిన వ్యవస్థలో న్యాయమో, అన్యాయమో వైకల్యం సహా వివిధ కోటాలను పోస్టుకు హామీగా ఉపయోగించుకోవడానికి చాలామంది ఆకర్షితులు కావచ్చు. విచారణ పరిధిని విస్తరించడానికి అన్ని వైకల్య కేసులను ఈ దృక్కోణం నుండి చూడటం సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ)కి మంచిది.సివిల్ సర్వీసెస్లోకి ప్రవేశించడానికి అభ్యర్థులు ఎంత దూరమైనా వెళతారు అనేందుకు తగు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది సర్వీసులో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా ప్రతిష్ఠాత్మకమైన, సవాలుతో కూడిన కెరీర్ ఎంపికలను వాగ్దానం చేస్తుంది. చాలామంది మాజీ సివిల్ సర్వెంట్లను ప్రభుత్వం ట్రిబ్యునళ్లు, కమిషన్లు, రెగ్యులేటరీ అథారిటీలు, గవర్నర్ పదవులకు కూడా నియస్తుంటుంది. పలువురు వ్యక్తులు ప్రైవేట్ రంగంలో కూడా అత్యున్నత నియామకాలను అందుకుంటారు. అతి పెద్ద కన్సల్టింగ్ సంస్థలు ఇప్పుడు నయా ట్రెండ్! ప్రభుత్వం లోపల తమ నెట్వర్క్ లను ప్రభావితం చేయాలనే ఆశ వీరికుంటుంది.సర్వీసులో ఉండగానే వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఇరవైల మధ్య నుండి చివరి వరకు మాత్రమే వయస్సు గల ఒక వ్యక్తి తరచుగా చిన్న ఐరోపా దేశాల పరిమాణంలో ఉన్న జిల్లాకు ప్రపంచంలో మరెక్కడైనా నాయకత్వం వహించగలరా?అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమ తించడంలోని హేతుబద్ధతను సిబ్బంది, శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. కీలకమైన మరొక ప్రశ్న ఏమిటంటే యూపీఎస్సీ పరీక్ష సమర్థత గురించి! పునరావృత అభ్యసన, అరగంట ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇవ్వడమే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఉత్తమమైన మార్గమా? సమగ్రత, సహానుభూతి, సాను కూల నాయకత్వం, సమస్య పరిష్కారం వంటి లక్షణాలను అస్సలు అంచనా వేయలేము. డిఫెన్స్ సర్వీసెస్ విషయంలో లాగా కాకుండా, ఇక్కడ యోగ్యతా పరీక్ష లేదు. తత్ఫలితంగా, మన సివిల్ సర్వీసులను నిర్వహించే విషయంలో ప్రస్తుత సందర్భంలో లాగా, మనకు తక్కువ భావోద్వేగాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది.దరఖాస్తుదారులకు ప్రయోజనాలను తగ్గించడానికీ, తద్వారా మోసం, రిగ్గింగ్ అవకాశాలను తగ్గించడానికీ ఒక మార్గం ఏమిటంటే ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించడం. బహుశా సాంకేతికతను ఉపయోగించడం. ప్రతి దశలో మూల్యాంకన ప్రమాణాలు, మార్కింగ్ ప్రమాణాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా పారదర్శకతను పెంచడం అవసరం. తద్వారా సవాళ్లు అధిగమించబడతాయి, పరిష్కరించబడతాయి. వాస్తవానికి, అడ్మినిస్ట్రేటివ్ స్థానాల్లోకి అధిక అర్హత కలిగిన నిపుణులు, డొమైన్ నిపుణుల ప్రవేశం కేవలం పేరును బట్టి ఉండకూడదు. బలమైన పార్శ్వ ప్రవేశ ప్రక్రియ సివిల్ సర్వీసును దాని యధాస్థానంపై నిలిపి ఉంచుతుంది.యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత దేశ సివిల్ సర్వెంట్లు వారి ఉద్యోగాల కోసం శిక్షణ పొందే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ భారీ పాత్రను పోషించాలి.రెండు సంవత్సరాల శిక్షణ ఒక అధికారి భవిష్యత్తుకు, ఆమె/అతను పరిస్థితులతో వ్యవహరించే విధానానికి పునాది వేస్తుంది. పేద గిరిజన రైతు జక్తు గోండ్పై కార్యకర్త హర్‡్ష మందర్ చేసిన కేస్ స్టడీలు నేటికీ చాలామంది మనస్సులలో నిలిచిపోయాయి. పేదరికానికి సంబంధించిన సమస్యలతో వ్యవహరించడంలో ఇవి ఒక తరం అధికారులను ప్రభావితం చేస్తూ వచ్చాయి.విచ్ఛిన్నమైన వ్యవస్థలతో పోరాడటం కంటే మనం వాటిని సరిదిద్దాలి. ఒక ప్రక్రియపై, దాని న్యాయబద్ధతపై మనకు విశ్వాసం ఉంటే, మనం ఫలితాలను ఆమోదించగలము. ఏదైనా వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం. రోజులు గడు స్తున్నకొద్దీ, ఎంపిక ప్రక్రియను మోసగించిన అధికారుల ప్రవేశానికీ, ఇటీవలి నీట్ వైఫల్యానికి దారితీసిన లోపాలకూ మధ్య వింతైన సారూప్యత నొక్కి చెప్పబడుతోంది. ఫలితంగా ఈ దేశవ్యాప్త పరీక్షలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటివి జరగకుండా చేయలేని మన లాంటి విశాల దేశానికి ఇది దురదృష్టకరం. వ్యవస్థను సరిగ్గా అమర్చడంలో, దానిపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో డీఓపీటీ, యూపీఎస్సీ సరిగ్గా వ్యవహరిస్తాయని ఆశిద్దాము.– అశోక్ ఠాకూర్ ‘ కేంద్ర మాజీ విద్యా కార్యదర్శి– ఎస్.ఎస్. మంథా ‘ ‘ఏఐసీటీఈ’ మాజీ చైర్మన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఐఏఎస్ అంటే బాడీతో కాదు బ్రెయిన్ తో పనిచేయాలి..
-
ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు..?
-
వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో చేసిన ఓ పోస్ట్పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.‘స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్గా అప్సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.... స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్/ ఐఎఫ్ఒఎస్తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఒఎస్ లాగే ఐఏఎస్లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. అంతేకానీ సున్నిత స్వభావానికి నా మనసులో చోటు లేదనడం కరెక్ట్ కాదు’ అని తెలిపారు.See a lot of outrage on my timeline. I suppose addressing the elephant in the room gets you that reaction. Would request the Rights Activists to also examine why this quota has still not been implemented in the IPS/ IFoS and certain sectors like defence. My limited point is…— Smita Sabharwal (@SmitaSabharwal) July 22, 2024 -
AP: భారీగా ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కేరళ కేడర్కు చెందిన మైలవరపు కృష్ణతేజను పంచాయతీరాజ్–గ్రామీణీభివృద్ధి శాఖ డైరెక్టర్గా నియమించారు.స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఎంవీ శేషగిరిబాబు, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్గా సీహెచ్ శ్రీధర్బాబును నియమించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీఎండీగా శ్రీధర్బాబుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్ సీఈఓగా జి. వీరపాండియన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా సీహెచ్ హరికిరణణ్ను నియమించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా సీహెచ్ హరికిరణ్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. బదిలీల పూర్తి వివరాలు ఇవీ.. -
పూజా ఖేద్కర్కు UPSC షాక్.. అభ్యర్థిత్వం రద్దు
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) షాకిచ్చింది. నకిలీ దృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ సెలక్షన్ను క్యాన్సిల్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు భవిష్యత్లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనకుండా డీబార్ చేసింది. UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek— ANI (@ANI) July 19, 2024శుక్రవారం (జులై 19) యూపీఎస్సీ కమిషన్ పూజా ఖేద్కర్ వివాదంపై అధికారికంగా స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు.సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫొటోలు,సంతకాలు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్తో పాటు ఇతర వివరాలన్నీ తప్పుడు ధృవీకరణ పత్రాలను అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటిస్తూ మీడియోకు ఓ నోట్ను విడుదల చేసింది.ఆ నోట్లో మోసపూరిత కార్యకాలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్పై అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 నిబంధనల ప్రకారం.. భవిష్యత్లో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా, అభ్యర్ధిత్వాన్ని ప్రకటించకుండా డీబార్ చేసినట్లు పేర్కొంది. పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించడంతో పూజా ఖేద్కర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. -
పూజా ఖేద్కర్ తర్వాత మరో ఐఏఎస్.. వివాదాల్లో బ్యూరోక్రాట్లు!
దేశంలో బ్యూరోక్రాట్స్ నియామకంపై వరుస వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నెలకొంది. ఐఏఎస్ గట్టెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దృష్టిసారించిన ప్రధాని మోదీ కార్యాలయం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.ఈ తరుణంలో తాజాగా మరో మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ సైతం నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాలతో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. Downfall of UPSC has already begun with Pooja Pooja khedkar, followed by this Abhishek Singh.The main guy dancing has cleared UPSC under Locomotor Disability (PwBD-3) category.For those who don't know what is PwBD-3- Cerebral palsy, Leprosy-cured, Dwarfism, Acid attack… pic.twitter.com/osPKbhs2jc— ShoneeKapoor (@ShoneeKapoor) July 13, 2024అభిషేక్ సింగ్ 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. యాక్టింగ్పై మక్కువతో గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఐఏఎస్ అధికారిగా ఉండగానే అతడు వ్యాయామం చేస్తున్న వీడియోలు కొన్ని వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. కదలికలకు సంబంధించి శారీరక వైకల్యం (లోకో మోటర్ డిసెబిలిటీ) ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించడం... ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే అతడికి దివ్యాంగుల కోటా కింద యూపీఎస్సీ నియామకం జరగడం గమనార్హం. పీడబ్ల్యూబీడీ3 అని పిలిచే ఈ కేటగిరి కింద ఆసిడ్ దాడి బాధితులు మొదలుకొని కండరాల కదలికల్లేని సెర్రబెల్ పాల్సీ వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డవారు. మరుగుజ్జులుగా మిగిలిపోయిన వారు వస్తారు. ఈ కోటా కింద ఐఏఎస్ అయిన అభిషేక్ సింగ్ జిమ్లో ఎంచక్కా వ్యాయామాలు చేస్తున్న వీడియోలు బయటపడటంతో యూపీఎస్సీ నియామకాలపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పీడబ్ల్యూబీడీ3 కోటా కిందే ఐఏఎస్లో 94వ ర్యాంక్ను సాధించడంతో చర్చాంశనీయమైంది.రిజర్వేషన్లకు సపోర్ట్ చేశాననేతాను ఐఏఎస్ సాధించడంపై వస్తున్న ఆరోపణలపై అభిషేక్ సింగ్ స్పందించారు. రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.కష్టపడి ఐఏఎస్ సాధించా‘ఇప్పటి వరకు నేను ఎలాంటి విమర్శలు రాలేదు. అయినప్పటికీ నా మద్దతు దారులు అడిగినందుకే ప్రస్తుతం నేను ఐఏఎస్ ఎలా అయ్యారనే ప్రశ్నకు బదులిస్తున్నాను. నేను రిజర్వేషన్లకు సపోర్ట్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించానో అప్పటి నుంచి రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. నేను ఎంతో కష్టపడి, ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాను.రిజర్వేషన్ ద్వారా కాదు’అని ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు. भाई दुनिया भर की कहानी लिख दी बस ये नही बताया की कैसे LD जिसके वजह से आपने दिव्यांग कोटा लगाया और IAS बने वो होते हुए भी जिम में वजन उठा रहे हो? थोड़ा ज्ञान साझा कर दो, डॉक्टर भी अध्यन करके दुसरे मरीजों की मदद कर देंगे। pic.twitter.com/EXnFzFD7Us— Roshan Rai (@RoshanKrRaii) July 13, 2024 టాలెంట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పనిలేదు‘ప్రభుత్వ సహాయం లేకుండా యునైటెడ్ బై బ్లడ్, నో షేమ్ మూవ్మెంట్ వంటి నా కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ చేశాను. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని నేను నమ్ముతున్నాను, ఆ దిశగా కృషి చేస్తాను. మీకు ప్రతిభ ఉందని భావిస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మానేయండి. వ్యాపారం, క్రీడలు లేదా నటనలో రాణించండి’ అని పిలుపునిచ్చారు. పూజా ఖేద్కర్ ఐఏఎస్ పోస్ట్కు ఎసరుట్రైయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ తన చూపు, మానసిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటిని నిర్ధారించడానికి తప్పనిసరి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సింది. కానీ ఆమె హాజరు కాలేదు. ఐఏఎస్లో ఉత్తర్ణీత సాధించారు. కాగా, పూజా ఖేద్కర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో పూజా దోషిగా తేలితే ఆమెను తొలగించే అవకాశం ఉందని సమాచారం. వాస్తవాలను దాచిపెట్టడం, తప్పుగా సూచించడం వంటి ఆరోపణలు నిజమని తేలితే క్రిమినల్ చర్యలు కూడా ఎదుర్కోనున్నారు. -
‘కాళేశ్వరం’పై ఐఏఎస్ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లపై చేపట్టిన విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం బీఆర్కేఆర్ భవన్లోని తమ కార్యాలయంలో పలువురు సీనియర్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లను ప్రశ్నించనుంది. సోమవారం విచారణకు రావాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరైన సోమేశ్కుమార్, ఎస్కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి రజత్కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్లకు సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన చేసిన కమిషన్.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టిందని, ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్లను విచారించనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నిర్మాణ సమయంలో ఉన్నవారిని.. తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరంప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపత్యంలో.. కమిషన్ ఆయనను విచారణకు పిలిచింది. ఎస్కే జోషి రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో సోమేశ్కుమార్ వ్యవహరించడంతో ఆయనను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మిత సబర్వాల్ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యదర్శి హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నేపథ్యంలో.. ఆమెను కమిషన్ విచారించనుంది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్ విచారణకు రమ్మని కోరింది. నేడు కమిషన్కు కె.రఘు ప్రజెంటేషన్ ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. తర్వాత కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను కమిషన్ విచారణకు పిలిచింది. -
కక్ష సాధింపు తీరు.. ఇదెక్కడి పాలన చంద్రబాబు..?
-
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
ముంబై : తన గొంతెమ్మ కోర్కెలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ పరీక్ష గట్కెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా..తాజాగా ఆమెకున్న కోట్లలో విలువ చేసే ఆస్తులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ)నాన్ క్లిమిలేయర్ సర్టిఫికెట్లు మరింత భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.పూజా ఖేడ్కర్ ప్రకటన ప్రకారం.. గత ఏడాది తన ఆస్తులు ఎంతున్నాయనే వివరాల్ని జనవరి1,2024 అప్డేట్ చేసింది. వాటి ఆధారంగా పూజా ఖేడ్కర్కు మహరాష్ట్రలో సొంతంగా ఐదు ప్లాట్లు,రెండు అపార్ట్మెంట్లు ఉండగా..ఆ మొత్తం స్థిరాస్థుల విలువ రూ.22 కోట్లుగా ఉంది.దీంతో పాటు పూణే జిల్లా మహాలుంగేలో రూ.16 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ధడవాలిలో రూ.4 కోట్ల విలువైన రెండు ప్లాట్లు, అహ్మద్నగర్లోని పచుండేలో రూ.25లక్షలు, నందూర్లో రూ.1 కోటి విలువ చేసే ల్యాండ్లు ఉన్నాయి. పచుండే,నందూరులోని ప్లాట్లు ఆమె తల్లి తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం మీద ఆమెకు 22 ఎకరాలకు పైగా భూమి ఉంది.అహ్మద్నగర్,పూణేలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి. అహ్మద్నగర్లోని సవేదిలో రూ.45లక్షలు విలువ చేసే 984 చదరపు అడుగుల ఫ్లాట్, పూణేలోని కోంధ్వాలోని 724 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ.75 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం ఆస్తుల ద్వారా ఖేడ్కర్ 2014-2019 మధ్య ఏడాదికి రూ.42 లక్షలు సంపాదించారు.పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ ప్రకారం ఆమె తండ్రి ఆస్తుల విలువ రూ.40 కోట్లకు పైమాటే.పైగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ఐఏఎస్ పరీక్ష గట్టెక్కేందుకు పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పత్రాలు సమర్పించారు. ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ప్రయోజనం పొందే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లేదా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆమె ఆస్తులు,తల్లిదండ్రుల ఆస్తులు కోట్లలో ఉంటే ఐఏఎస్కు ఎలా ఎంపికయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాగా పూజా ఖేడ్కర్ వ్యవహారం మరింత వివాదం కావడంతో ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను పరీశీలించేందుకు కేంద్రం ఏక సభ్య ప్యానెల్ను ఏర్పాటు చేసింది.రెండు వారాల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. -
ట్రెయినీ ఐఏఎస్ పూజ వ్యవహారంపై పీఎంవో ఆరా
పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మహారాష్ట్ర కేడర్కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్యం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)సర్టిఫికేట్లను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగా.. పూజా ఖేడ్కర్ నియామకం గురించి ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఆరా తీస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.పూజా ఖేడ్కర్ పూణే కలెక్టర్ కార్యాయంలో అధికారిక హోదా కోసం ప్రయత్నించి వార్తల్లో నిలిచారు. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ప్రైవేట్ ఆడి కారును రెడ్ బ్లూ బెకన్ లైట్, వీఐపీ నెంబర్ ప్లేట్ను ఉపయోగించడం, అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఆయన ఛాంబర్ను వినియోగించడంతో వివాదం తలెత్తింది. ఆమె తీరుపై పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేసింది. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా వ్యవహరించనున్నారుఈ క్రమంలో బుధవారం పీఎంవో కార్యాలయం అధికారులు పూజా ఖేడ్కర్ గురించి పూణే కలెక్టర్ సుహాస్ నుంచి నివేదికను కోరడం మరింత చర్చాంశనీయంగా మారింది. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LSBNAA) లో ఆమె గురించి ఆరా తీసింది. ఆమె పూణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేయడంపై నివేదిక కోరింది. పూర్తి నివేదికను ఎల్ఎస్బీఎన్ఏఏ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపనుంది.మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) సుజాత సౌనిక్ ఆమోదం తర్వాత నివేదిక పంపాలని ఎల్ఎస్బీఎన్ఏఏ డిప్యూటీ డైరెక్టర్ శైలేష్ నావల్ సంబంధిత పరిపాలన విభాగానికి విజ్ఞప్తి చేశారు. -
ఐఏఎస్ రోహిణి సింధూరి నా భూమిని కబ్జా చేశారు.. ప్రముఖ సింగర్ ఫిర్యాదు
బెంగళూరు : కర్ణాటక క్యాడర్కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదం చిక్కుకున్నారు. బెంగళూరు శివార్లలోని తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ అధికారిణి, ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్యనటుడు మెహమూద్ అలీ కుమారుడు,గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. వివాదాస్పద ఆస్తి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.తన భూమి కబ్జాకు గురైందని కలెక్టర్ రోహిణి సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.pic.twitter.com/GeUF0N9Y4k— Lucky Ali (@luckyali) June 20, 2024లక్కీ అలీకి, రోహిణి సింధూరి ట్రస్ట్కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం కొనసాగుతుంది. కొన్నేళ్ల క్రితం తన భూమి కబ్జాకు గురవుతుందని, సదరు ఐఏఎస్ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని లక్కీ అలి ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు. వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికి 'ల్యాండ్ మాఫియా' కుట్ర పన్నిందని కూడా ఆయన పేర్కొన్నారు.డిసెంబర్ 2022లో, అలీ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఒక థ్రెడ్లో ట్యాగ్ చేసి, ట్రస్ట్ యాజమాన్యంలోని తన వ్యవసాయ భూమిని రోహిణి సింధూరి, సుధీర్ రెడ్డి,మధు రెడ్డి సహాయంతో ల్యాండ్ మాఫియా అక్రమంగా లాక్కుంటున్నారని తెలిపారు. తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. -
త్వరగా మార్చేద్దాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కీలక స్థానాల్లో తమకు అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐజీలు, డీఐజీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇలా అందరినీ త్వరిత గతిన బదిలీలు చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్కు సన్నితంగా వ్యవహరించిన అధికారులందరినీ గుర్తించాలని, అలాంటి అధికారులు తమకు అవసరం లేదని.. ఎవరెవరు ఏం చేశారో వివరాలు సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో మన కోసం (టీడీపీ) పని చేసిన వారిని గుర్తించాలని, అలాంటి వారు రిటైర్ అయినప్పటికీ మరో రకంగా తెచ్చుకుందామని అన్నట్లు సమాచారం. రాజధాని అమరావతిని త్వరతగతిన అభివృద్ధి చేయడం తమ ప్రథమ లక్ష్యం అని, ఇందుకోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.ఇందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తిరిగి అమలు చేసే విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేసిన ముఖ్య అధికారులను పిలిపిస్తే, తానే స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే గతంలో తాను సీఎంగా ఉండగా తన కార్యాలయంలో పనిచేసిన ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రాజమౌళిని మళ్లీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఇలాంటి మరికొందరు అధికారులతోపాటు రాష్ట్రంలోనే వివిధ శాఖల్లో ఉన్న తమకు అనుకూలమైన వారిని పిలిపించుకుని మాట్లాడి.. వారికి ఏ పోస్టింగులు ఇవ్వాలనే దానిపై సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. వాళ్లను పంపించేద్దాం టీడీపీకి సహకరించని అధికారులను గుర్తించి, వారిని బదిలీ చేయించే విషయంపై కూడా చంద్రబాబు సీఎస్, డీజీపీతో చర్చించినట్లు సమాచారం. వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశారని ఇప్పటికే కొంత మందిని గుర్తించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ముఖ్య అధికారులందరినీ త్వరగా గుర్తిస్తే.. వారిని బదిలీ చేయడం లేక సెంట్రల్ సర్విసులకు వెళ్లి పోండని చెప్పడం.. లేక ఇక్కడే ఉంటే అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేద్దామని వివరించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరెవరు ఎలా పని చేశారో తనకు తెలుసని, అయినప్పటికీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్ల తర్వాతే అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఉపక్రమిద్దామని సీఎం అన్నట్లు తెలిసింది. -
ఐఏఎస్ అధికారుల బదిలీలకు సీఎం చంద్రబాబు కసరత్తు
-
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
-
UPSC: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్కు చెందిన ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు అన్షుల్ భట్ 22వ ర్యాంకు నందల సాయి కిరణ్కు 27 ర్యాంకు మెరుగు కౌశిక్కు 82వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు అక్షయ్ దీపక్ 196 ర్యాంకు భానుశ్రీ 198 ర్యాంకు ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు వెంకటేష్ 467 ర్యాంకు హరిప్రసాద్ రాజు 475వ ర్యాంకు పూల ధనుష్ 480 ర్యాంకు కె. శ్రీనివాసులు 526 ర్యాంకు సాయితేజ 558 ర్యాంకు కిరణ్ సాయింపు 568 ర్యాంకు మర్రిపాటి నాగభరత్ 580 ర్యాంకు పీ. భార్గవ్ 590 ర్యాంకు అర్పిత 639 ర్యాంకు ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు సాక్షి కుమార్ 679 ర్యాంకు రాజ్కుమార్ చౌహన్ 703 ర్యాంకు జి.శ్వేత 711 ర్యాంకు ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు లక్ష్మీ భానోతు 828 ర్యాంకు ఆదా సందీప్ కుమార్ 830 ర్యాంకు జె.రాహుల్ 873 ర్యాంకు హనిత వేములపాటి 887 ర్యాంకు కె.శశికాంత్ 891 ర్యాంకు కెసారపు మీనా 899 ర్యాంకు రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్కు IRS వచ్చే అవకాశం ఉంది. (సయింపు కిరణ్) గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మేయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్ పరీక్షల ఫలితాలను డిసెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. UPSC has announced the final results of the Civil Services Examination. Congratulations to all achievers who have cleared this prestigious milestone! Your hard work and dedication have paid off.#Upsc_final_result#UPSC2024 #upsc#upsc2023 pic.twitter.com/jkj3sCPoSD — आदर्श यादव(Adarsh Yadav) (@AdarshY59491482) April 16, 2024 -
విద్యార్థులు భవిష్యత్తును మార్చే సీఎం మన జగన్..ఐఏఎస్ సురేష్ కుమార్
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
-
బంగారం లాంటి కల..అందమైన జీవితం: ఓ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
జీవితంలో పైకి రావాలని, ఉన్నతోద్యోగాలు సాధించాలని అందరూ కలలు కంటారు. కానీ ఆ కలలను సాధించుకోవడంలో చాలాకొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎదిగి పలువురి ప్రశంసలు పొందడం మాత్రమేకాదు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి వారిలో సృష్టి దేశ్ముఖ్ ఒకరు.సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించిన సృష్టి సక్సెస్ స్టోరీ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల్లో విజయం అంటే మామూలు సంగతి కాదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటారు. అయితే కొన్ని వందల మంది మాత్రమే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IAS అధికారిగా మారతారు. కానీ తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాకు సాధించిడం చాలా అరుదు. సృష్టి UPSC పరీక్షలో ఆలిండియా స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. అంతేకాదు UPSC 2018 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 182 మంది మహిళల్లో టాపర్ కూడా. అప్పటికి ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన సృష్టి దేశ్ముఖ్ గౌడ 1995లో పుట్టింది. చిన్ననాటి నుండి తెలివైన విద్యార్థి. భోపాల్లోని బిహెచ్ఇఎల్లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో 12వ బోర్డు పరీక్షలో 93.4 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని ఆశపడింది. కానీ సీటురాలేదు. చివరికి భోపాల్లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తరువాత తన డ్రీమ్ను పూర్తి చేసుకోవడం కోసం సివిల్స్ పరీక్ష రాసి, విజయం సాధించింది. సృష్టి తండ్రి జయంత్ దేశ్ముఖ్ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి సునీతా దేశ్ముఖ్ టీచర్. సృష్టికి సంగీతం అన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. రోజూ యోగా కూడా చేస్తుంది. మరో ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున బి గౌడను సృష్టి వివాహం చేసుకుంది. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్న సృష్టి , నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠినంగా ఉంటూ సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తున్నారు. -
ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అయితే కిక్ ఏముంటుంది? ఈ సక్సెస్ స్టోరీ తెలిస్తే..!
Govind Jaiswal IAS Sucess Story: పేదరికాన్ని భరించడం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ కష్టంలోంచి, బాధలోంచి పుట్టిన పట్టుదల, చిత్తశుద్ధి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. విజయం సాధించేదాకా నిద్ర పోదు. అలాంటి ఐఏఎస్ స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. యాక్టర్ కొడుకు, యాక్టర్.. కలెక్టర్ సన్ కలెక్టర్ , డాక్టర్ తనయుడు డాక్టర్ అయితే స్టోరీ ఎలా అవుతుంది. రిక్షా నడుపుకునే సాధారణ వ్యక్తి కుమారుడు ఐఏఎస్ అవ్వడంలోనే సక్సెస్ కిక్ ఉంటుంది. కార్మికుడి కొడుకుగా అవమానాల్ని, అవహేళల్ని ఎదుర్కొని ఐఏఎస్గా నిలిచిన స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తుంది. గోవింద్ జైస్వాల్ వారణాసికి చెందినవారు.గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేసేవాడు. అయితే ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు. తన దగ్గర డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. వాటిని అద్దెకు తిప్పేవాడు. ఇంతలో గోవింద్ తల్లి తీవ్ర అనారోగ్యం పాలైంది. వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్నదంతా ఖర్చయిపోయింది.దురదృష్టవశాత్తు 1995లో ఆమె కన్నుమూసింది దీంతో గోవింద్ తండ్రి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎలాగోలా ఆడపిల్లకు పళ్లి చేసాడు. కానీ కొడుకుని చదివించాలన్న పట్టుదలతో నారాయణ స్వయంగా రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు. అయితే తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల ఇంటికి వెళ్లినపుడు వారి తల్లిదండ్రులు గోవింద్ను అవమానించారు. తమ కుమారుడితో ఎప్పుడూ కనిపించొద్దంటూ దురుసుగా ప్రవర్తించారు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా గౌరవంగా బతకాలని నిశ్చయించుకున్నాడు తాను కలెక్టర్ చదువుతానని తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన కష్టమైనా సరే రూ 40వేల వెచ్చించి ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. అక్కడ తన ఖర్చుల కోసం గోవింద్ జైస్వాల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. రాత్రి పగలు కష్టపడి చదివాడు. 2006లో గోవింద్ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో యూపీఎస్సీలో 48వ ర్యాంక్ సంపాదించుకున్నాడు. గోవాలో స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా,ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. జైస్వాల్ భార్య ఐపీఎస్ చందన్ చౌదరి. వీరికి ఒక కుమారుడున్నాడు. 12th ఫెయిల్ స్టోరీలా, మరో బయోపిక్: ఐఏఎస్ అధికారి గోవింద్ జైస్వాల్ జీవితం ఆధారంగా కమల్ చంద్ర దర్శకత్వంలో ‘అబ్ దిల్లీ దుర్ నహీ’ మూవీ కూడా సిద్దమవుతోంది. -
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
-
నాడు జర్నలిస్ట్ నేడు ప్రధాన కార్యదర్శిగా..!
ఐఏఎస్ సాధించడం చాలామంది కల. అందుకోసం ఏళ్లుగా ఓ తపస్సులా కృషి చేస్తారు. తాము అనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించేంత వరకు ప్రయత్నాలు సాగిస్తున్నే ఉంటారు. కానీ రాధ రాటూరి చేసిన సివిల్స్ ప్రయత్నాల్లో ప్రతీ ప్రయత్నం విజయవంతంగా గెలిచి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివరికి ఆమె కోరుక్నుట్లుగా ఐఏఎస్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే.. 1988 బ్యాచ్కు చెందిన ఇండియన్ అడ్మినస్ట్రేటివ సర్వీస్(ఐఏఎస్ ) అధికారి ఉత్తరాఖండ్ తొలి మహిళా కార్యదర్శిగా గత వారమే నియమితులయ్యారు. జనవరి 31తో సుఖ్బీర్ సింగ్ సంధు పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో సీనియర్ అధికారిణి రాధ రాటూరిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆమె భర్త అనిల్ రాట్రూయ్ నవంబర్ 2020లో ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) నుంచి ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక ఆమె తండ్రి కూడా సివిల్ సర్వెంట్గా పనిచేయడం విశేషం. ఆమె ఎడ్యుకేషన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..1985లో ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్లో ఎంఏ చేసింది. అనంతరం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ బొంబాయి ఎడిషన్లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం ఇండియా టు డేలో కూడా జర్నలిస్టుగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువతో సివిల్ సర్వీస్ వైపుకి రావడం జరిగింది. ఐతే తొలి ప్రయత్నంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆపీసర్ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత మరో ప్రయత్నంలో ఐపీఎస్ని కూడా సాధించారు. అక్కడితో ఆగక మూడో ప్రయత్నంలో ఆమె కోరుకున్నట్లుగా ఐఏఎస్లో చేరాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇలా సివిల్స్లో వరుస ప్రయత్నాల్లో ఏదో ఒక క్యాడర్ సాధిస్తూ.. పోయిన వ్యక్తిగా రాధ రాటూరి నిలవడం విశేషం. తొలుత ఆమెను మధ్యప్రదేశ్ కేడర్కు కేటాయించినా.. యూపీ కేడర్కు బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థన మేరకు తొలి పోస్టింగ్ గుజరాత్లోని టెహ్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఐఏఎస్ అధికారిగా కెరియర్ని ప్రారంభించి.. అలా పదేళ్ల పాటు ఉత్తరాఖండ్ ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాధ రాటూరి అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్గా నియమితులయ్యారు. అంతేగాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ పదవిని అలంకరించిన తొలి మహిళగా కూడా రాధ నిలిచారు. (చదవండి: ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!) -
ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!
గృహ హింసను భరించలేక భర్త నుంచి విడిపోయి, ఆర్థిక భారాన్ని, కన్నీటి సాగరానికి ఎదురీది సక్సెస్ను అందుకోవడం మహిళలకు తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియదేమో. అన్ని ప్రతికూలతలను అధిగమించి అచంచల సంకల్పంతో జీవితాలను మార్చుకోవడంలో వారి పట్టుదల, శ్రమ అసాధారణం. అలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళా ఐఏఎస్ అధికారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని మండై గ్రామంలోని గిరిజన కుటుంబంలో పుట్టింది సవిత ప్రధాన్. ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న ఆ కుటుంబంలో సవితకు లభించిన స్కాలర్షిప్ ఆమె చదువుకు ఆధారం. అలా కష్టపడి 10తరగతి పూర్తి చేసి తన గ్రామంలో టెన్త్ చదివిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు 7 కి.మీ దూరంలో కాలేజీలో చేరింది. ఆమె ఫీజు కట్టేందుకు తల్లి పార్ట్ టైం ఉద్యోగం చేసేది. డాక్టర్ కావాలన్న ఆశయంతో సైన్స్ని ఎంచుకుంది. కానీ 16 ఏళ్లు వచ్చాయో లేదో పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. బాగా డబ్బున్న కుటుంబం అన్న ఒకే ఒక్క కారణంతో సవితకు ఇష్టం లేకుండానే ఆమె పెళ్లి జరిగి పోయింది. ఇక్కడే సవిత జీవితం మరో మలుపు తిరిగింది. పెళ్లి తరువాత జీవితం దుర్బరంగా మారిపోయింది. అటు అత్తమామ వేధింపులు, ఇటు భర్త హింస మొదలైంది. కొట్టి చంపేస్తానని బెదిరించేవాడు భర్త. గర్భవతిగా ఉన్నపుడు కూడా తిండి సరిగ్గా పెట్టేవారు. రొట్టెల్ని దాచుకుని దొంగచాటుగా తినేది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇది ఆగలేదు. నరకం చూసింది. ఈ బాధలు తట్టుకోలేక ఇక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకోబోతుండగా కిటికీలోంచి అత్తగారు చూసింది. అయినా ఏమాత్రం జాలి చూపలేదు సరిగదా. మరింత వేధించ సాగింది. దీనికి తోడు రాక్షసుడివగా మారిన భర్త చివరికి తన కుమారుడిని కూడా కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో ధైర్యాన్ని కూడగట్టుకున్న సవిత తన పిల్లల కోసం బ్రతకాలని గట్టిగా భావించింది. కేవలం 2700రూపాయలతో పిల్లలిద్దరితో ఇంటినుంచి బైటపడింది. తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి బ్యూటీ సెలూన్ను మొదలు పెట్టింది. ఇది చాలక పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఇళ్లలో పనిచేసేది.. దొరికిన పని అల్లా చేసేది. ఇది ఇలా సాగుతూండగానే తల్లిదండ్రులు ,తోబుట్టువుల సాయంతో భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బీఏ డిగ్రీ చేసింది. డిగ్రీ చదువుతుండగానే సివిల్ సర్వీసెస్ గురించి తెలిసి వచ్చింది. మంచి జీతం, జీవితం రెండూ ఉంటాయని గ్రహించింది. ఇక అంతే కృషి, సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 24 ఏళ్ల వయస్సులో ఏఐఎస్ సాధించింది. తొలుత చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా ఆ తర్వాత వరుస ప్రమోషన్షను సాధించింది. ప్రస్తుతం, ఆమె గ్వాలియర్ అండ్ చంబల్ ప్రాంతాలకు తొలి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి కూడా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాదు తనలాంటి మహిళలకు, అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చేలా ‘హిమ్మత్ వాలీ లడ్కియాన్’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఏ అమ్మాయి మౌనంగా బాధపడకూడదనేదే ఆమె ఉద్దేశం. తన జీవిత పోరాటాన్నే పాఠంగా బోధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది సవిత. -
బౌద్ధ శిల్పకళ కాలచక్ర మహా మండలంగా విగ్రహ పీఠం
-
ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం చెలరేగుతోంది. ఐపీఎస్ నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సిసిఎస్ పోలీసులకు బన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపణలు చేశారు. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేసిన సిసిఎస్ పోలీసులు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసననగర్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్ ని కూడా మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకొని విచారించనున్నామని తెలిపారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను అరెస్ట్ చేశారు. గతంలో 41ఏ నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ ను విచారించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారి నవీన్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: చింతమనేని సీట్ సిరిగిపోయిందా ? -
విదేశీ ఉద్యోగానికి నో చెప్పింది!
సంకల్పం గట్టిగా ఉంటే.. సక్సెస్ కాళ్ల దగ్గరకు రావాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అంబిక రైనా' (Ambika Raina). ఇంతకీ ఈమె ఎవరు ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్కు చెందిన అంబిక రైనా మంచి శాలరీలు వచ్చే ఉద్యోగాలను సైత వదులుకుని, అనుకున్న విధంగా ఐఏఎస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అంబిక తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ కావడంతో చిన్నప్పటి నుంచే.. క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని నింపారు. తండ్రి ఇండియన్ ఆర్మీ ఉద్యోగి కావడంతో చదువు వివిధ రాష్ట్రాల్లో సాగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని సీఈపీటీ యూనివర్శిటీ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీని పూర్తి చేసి.. ఆ తరువాత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లోని ఒక కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ ఆఫర్తో పాటు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లను కూడా పొందింది. అందివచ్చిన ఉద్యోగాలను సైతం వదులుకుని ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అటువైపుగానే అడుగులు వేసింది. మొదటి రెండు ప్రయత్నాలలో అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకోలేకపోయినప్పటికీ.. పట్టు వదలకు మూడవ సారి ఐఏఎస్ జాబ్ కొట్టేసింది. ఇదీ చదవండి: లీటరు పెట్రోల్ రూ.450 - ఫిబ్రవరి నుంచి అమలు.. ఎక్కడంటే? నిజానికి అబ్రాడ్లో ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరు జీతమే లక్ష్యంగా పని చేస్తారు, మరి కొందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తారు. ఈ విధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ, వాటన్నింటిని వదులుకుని ముందుకు వెళ్ళిపోతారు. -
IAS అధికారి అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు
-
కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. తాజా తీర్పులో.. ఏడేళ్ల కిందటి నాటి క్యాట్ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్, ఐపీఎస్లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది. ‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ
-
ఆంధ్రప్రదేశ్లో 17 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్గా ధ్యాన్చంద్ర విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్గా టీఎస్ చేతన్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్గా జె. శివ శ్రీనివాస్ తిరుపతి జాయింట్ కలెక్టర్గా శుభం బన్సాల్ విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవోగా మాధవన్ మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్గా ఎస్ఎస్ శోభిక సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్గా కె.కార్తీక్ పాడేరు సబ్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి పెనుకొండ సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ కందురకూరు సబ్ కలెక్టర్గా గొబ్బిల విద్యాధరి తెనాలి సబ్కలెక్టర్గా ప్రకార్ జైన్ మార్కాపురం సబ్ కలెక్టర్గా రాహుల్ మీనా ఆదోని సబ్ కలెక్టర్గా శివ్ నారాయణ్ వర్మ రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఎస్.ప్రశాంత్కుమార్లు నియమితులయ్యారు. -
సెంట్రల్ సర్వీసులోకి వెళ్లేందుకు IAS స్మితా సబర్వాల్ దరఖాస్తు
-
తెలంగాణలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు
-
సీఎం ముఖ్యకార్యదర్శిగా వి.శేషాద్రి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా బి. శివధర్రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సొంత జట్టు కూర్పుపై దృష్టి సారించిన రేవంత్రెడ్డి తన తొలి ఎంపికగా ఇద్దరు సమర్థులైన అధికారులనే నియమించుకున్నారు. ఇద్దరు అధికారులూ ఆయా పదవుల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. 1999 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వి.శేషాద్రి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆయనకు రెవెన్యూ వ్యవహారాలు, భూ చట్టాలపై పట్టు ఉంది. 2013 ఆగస్టు 22 నుంచి 2020 ఆగస్టు 22 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో డైరెక్టర్, జాయింట్ సెక్రటరీల హోదాల్లో ఆయన డిప్యుటేషన్పై పనిచేశారు. 2020 సెప్టెంబర్ నుంచి 2022 మే వరకు నాటి సీఎం కేసీఆర్కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమయంలో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ధరణి ప్రాజెక్టు అమలులో కీలకంగా వ్యవహరించారు. 2022 మే నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2009–12 మధ్య చిత్తూరు, రంగారెడ్డి, విశాఖపట్నం కలెక్టర్గా పనిచేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నియమితులైన శివధర్రెడ్డి ప్రస్తుతం రైల్వే, రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా వ్యవహరిస్తున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత కీలకంగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఎస్ఐబీలో డీఐజీగా, నల్లగొండ, నెల్లూరు, గుంటూరులో ఎస్పీగా పలు కీలక పోస్టింగ్లలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పోలీస్శాఖలో శివధర్రెడ్డికి పేరు ఉంది. ఆయనకు రేవంత్రెడ్డి సర్కార్ నిఘా విభాగాధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. -
ఏపీకి వెళ్లాల్సిన IAS, IPSలపై హైకోర్టు ఫైనల్ విచారణ
-
ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లపై హైకోర్టులో తుది విచారణ
సాక్షి, హైదరాబాద్: ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన 12 మంది అధికారులకు సంబంధించిన పిటిషన్పై తుది విచారణ జరుపుతోంది. గతంలో సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఎన్నికలు కమిషన్ వాదిస్తోంది. హైకోర్టులో తుది విచారణ జరుగుతుండటంతో తీర్పు ఎలా వస్తుందన్న దానిపై ఐఏఎస్ఉ, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 376 మంది ఐఏఎస్, 258 మంది ఐపీఎస్, 149 ఐఎఫ్ఎస్ అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు పంపకాలు చేసింది. పునర్విభజన తర్వాత ఏపీకి వెళ్లేందుకు కొంతమంది అధికారులు ఇష్టపడటం లేదు. క్యాట్ తీర్పును అడ్డుపెట్టుకొని తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వాస్తవానికి రూల్ 5(1) ప్రకారం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒప్పంద పత్రం రాసి ఉంటారు. అయితే తెలంగాణలో కొంతమంది అధికారులు ఏపీకి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీకి వెళ్లని ఐఏఎస్ల జాబితాలో హరికిరణ్, అనంతరామ్, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్ లోహితి, ఎస్,ఎస్ రావత్, గుమ్మల శ్రీజన, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాదా్, డిప్యూటేషన్పై సెంట్రల్ బిష్టా ఉన్నారు. ఆమ్రాపాలి, అబిలాష్ బిస్టా డిప్యూటేషన్పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఏపీకి వెళ్లని ఐపీఎస్ల జాబితాలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కూడా ఉన్నారు. చదవండి: నేడు మరోసారి రాష్ట్రానికి అమిత్ షా.. మూడుచోట్ల ప్రసంగం గతంలో హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లారు. అక్కడ జాయిన్ అయి ముందస్తు రాజీనామా చేసి హైదరాబాద్కు వచ్చేశారు. సోమేష్ కుమార్ తీర్పుకు భిన్నంగా అభిషేక్ మహంతి కేసు ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా యువ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కేంద్రం ఏపీకి కేటాయించింది. తనను తెలంగాణ కేడర్కి కేటాయించాలని ఆయన క్యాట్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన పరిపాలన ట్రిబ్యునల్ అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణకు క్యాట్ ఆదేశాలిచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం మహంతిని రిలీవ్ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేసింది. ఈ వ్యవహారంపై మహంతి మరోమారు ట్రిబ్యునల్కి వెళ్లారు. క్యాట్ ఆదేశాలు అమలు చేయలేదంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్పై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ.. అభిషేక్ మహంతికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. చాలాకాలంపాటు పోస్టింగ్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీగా బాధ్యతలు అప్పగించింది. నేడు తుది వాదనల తర్వాత తీర్పు ఎన్నికలలోపు వస్తుందా? రాదా.. ఎన్నికల కమిషన్ హైకోర్టుకు ఎలాంటి వాదనలు వినిపిస్తుందోనని ఆసక్తిగా మారింది. సోమేష్ కుమార్కు తీర్పుఇచ్చేనట్లు తీర్పు వస్తే 12 మంది ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. -
Telangana Assembly Elections: సార్ నుంచి అధ్యక్షా వరకు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగమంటే..ప్రభుత్వ నిర్ణయాలను అమలుపర్చడం, ఉన్నతాధికారి ఆదేశాలను పాటిస్తూ నిర్దేశించిన విధులు నిర్వర్తించడం మాత్రమే. కానీ చట్టసభలో సభ్యుడంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించడంతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల రూపకల్పనలో కీలకమైన ప్రతినిధి. ప్రభుత్వం ముందుకు సాగాలంటే పాలకులు, ఉద్యోగులు ముఖ్యులే. కానీ ఈ రెండు రంగాల్లో అనుభవం గడించిన ఘనులు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన అనుభవంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి విజయం సాధించిన వారు రెండుపదులకు పైబడే ఉన్నారు.అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం. ♦ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన జయప్రకాశ్నారాయణ ఆ తర్వాత లోక్సత్తా పార్టీని స్థాపించి కూకట్పల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ♦ సంక్షేమశాఖలో అధికారిగా పనిచేసిన స్వర్ణకు మారి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. బ్యాంకు అధికారిగా పనిచేసిన అరుణతార ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభల్లో అడుగుపెట్టారు. ♦ రెవెన్యూ శాఖలో పనిచేసిన సినీనటుడు బాబుమోహన్ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. ♦ లెక్చరర్గా ప్రస్థానం ప్రారంభించిన కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కూడా పనిచేశారు. ♦ ఉపాధ్యాయులుగా పనిచేసిన కోవా లక్ష్మి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ♦ రవాణాశాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మాణిక్రావు జహీరాబాద్ నుంచి 2014లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ 2018లో రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఐపీఎస్ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టిన విజయరామారావు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ♦ మరో ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్య కూడా ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. జడ్జి హోదాలో కొనసాగిన మల్యాల రాజయ్య ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో అధికారి బలరాం నాయక్ సైతం ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. ♦ ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిలో పనిచేసిన పి.రాములు, సంజీవరావు, ఎన్నం శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఐపీఎంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసిన స్వామిగౌడ్ గెలుపొంది తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్గా నియమితులయ్యారు. ♦ పురపాలక శాఖలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన వి.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎకైŠస్జ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటేశ్నేత పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్గా పనిచేసిన కె.నాగేశ్వర్ ఎమ్మెల్సీగా, సీతారాంనాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ♦ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేసి రాజయ్య వరంగల్ ఎంపీ గెలుపొందారు. ♦ ఎఫ్సీఐలో అధికారిగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ రామగుండం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఇక ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో నిలిచినప్పటికీ విజయం సాధించని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. -
20 మంది IAS, IPS, నాన్ కేడర్ ఎస్పీలపై EC వేటు
-
ఐఏఎస్ కల నెరవేరక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
కర్ణాటక: సివిల్స్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ కావాలి, సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలి అనుకున్న ఒక యువతి కల ఫలించలేదు. బ్యాంకు ఉద్యోగంతో తృప్తి పడలేక, ఐఏఎస్ కాలేక మనోవ్యథతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండ్య నగరంలో చోటు చేసుకుంది. కావేరి గ్రామీణ బ్యాంక్ ప్రాదేశిక కార్యాలయంలో మేనేజర్గా పనిచేస్తున్న శృతి (30) స్వస్థలం చామరాజనగర జిల్లా కొళ్లేగాల. తండ్రి మల్లప్ప వ్యవసాయం చేసేవాడు. ముందు నుంచి ఆమె చదువులో చురుగ్గా ఉండేది. ఎలాగైనా ఐఏఎస్కు ఎంపిక కావాలని అనుకుంది. కానీ జీవితంలో ఉన్న ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు. తరువాత ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ చూపి ప్రస్తుత ఉద్యోగం సంపాదించింది. మండ్య నగరంలోని వినాయక లేఔట్లోని అద్దె ఇంటిలో ఆదివారం రాత్రి డెత్నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని సమాచారం. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఐఏఎస్ అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్లను, ఇతర ముఖ్య విభాగాల్లోనూ అధికారులను బదిలీ చేయడం జరిగింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, హార్టికల్చర్ మరియు సెరికల్చర్ డైరక్టర్ గా గంధం చంద్రుడు, విలేజ్ వార్డు సెక్రటేరియట్ అదనపు డైరక్టర్ గా ధ్యానచంద్ర లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం