ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్‌ కక్ష | Chandrababu Naidu Government Harass IAS And IPS Officers Over Not Giving Postings For Months, More Details Inside | Sakshi

ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్‌ కక్ష

Jan 21 2025 10:44 AM | Updated on Jan 21 2025 12:19 PM

Chandrababu Government Harasse Ias And Ips

ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది.

సాక్షి, విజయవాడ: ఏపీలో ఐఏఎస్‌(IAS), ఐపీఎస్‌(IPS)లపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్‌ అధికారి అయిన శ్రీలక్ష్మికి పోస్టింగ్‌కు ఇవ్వ లేదు. చీఫ్‌ సెక్రటరీ  అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్నారు. కనీసం పోస్టింగ్‌ ఇవ్వకుండా మహిళ అధికారిపై కక్ష సాధిస్తున్నారు. ఆల్‌ ఇండియా  టాపర్‌, బీసీ అధికారి ముత్యాల రాజుకు కూడా పోస్టింగ్‌ దక్కలేదు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేశారనే కారణంతోనే ముత్యాలరాజుకు పోస్టింగ్‌ ఇవ్వలేదని సమాచారం. మురళీధర్‌రెడ్డి, మాధవిలత, నీలకంఠరెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్‌ ఇవ్వని ప్రభుత్వం.. ఐపీఎస్‌లు రఘురామిరెడ్డి, విశాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డిలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆంజేయులు, సంజయ్‌, పీవీ సునీల్‌, క్రాంతి రాణా, విశాల్‌ గున్నిలను ప్రభుత్వం వేధిస్తోంది.

	ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు

ఇదీ చదవండి: కాంతి లేని కూటమి పాలన

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement