TG: ఐఏఎస్‌లను రిలీవ్‌ చేసిన ప్రభుత్వం | Telangana Government Relieved Four Ias Officers | Sakshi
Sakshi News home page

TG: నలుగురు ఐఏఎస్‌లను రిలీవ్‌ చేసిన ప్రభుత్వం.. కొత్త వారికి బాధ్యతలు

Published Wed, Oct 16 2024 8:26 PM | Last Updated on Wed, Oct 16 2024 8:36 PM

Telangana Government Relieved Four Ias Officers

సాక్షి,హైదరాబాద్‌:‌ కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్‌, వాణి ప్రసాద్‌, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం(అక్టోబర్‌ 16) సాయంత్రం రిలీవ్‌ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మెయిల్‌ ద్వారా రిపోర్ట్‌ చేయనున్నారు. 

ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్‌, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్‌ అయిన నలుగురు ఐఏఎస్‌ల స్థానంలో ఇన్‌ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖక్రిస్టినా, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌కు క్రిస్టినా, జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఇలంబర్తిలను ప్రభుత్వం నియమించింది.

ఇదీ చదవండి: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు చుక్కెదురు 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement