officers
-
Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫిబ్రవరి 15న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. అదేవిధంగా దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మూడు నూతన విధానాలను అనుసరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.ఇవే ఆ మూడు విధానాలు1. హోల్డింగ్ ఏరియాను ఏర్పాటురైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 60 ప్రధాన రైల్వేస్టేషన్లలో హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో రైలు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు వచ్చే వరకూ వేచివుండాల్సివుంటుంది. రైలు వచ్చిన తరువాతనే ప్రయాణికులంతా క్రమపద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యవస్థను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ స్టేషన్, లక్నో, వారణాసి, మొగల్సరాయ్, కాన్పూర్, ఝాన్సీ, పట్నా, ముంబై, సూరత్, బెంగళూరు, హౌరా తదితర స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.2. ప్రయాణికులకు అవగాహనరైల్వేస్టేషన్లలో ముందుజాగ్రత్త చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులెవరూ మెట్లపై కూర్చోకూడదని విజ్ఞపి చేయనున్నారు. పలువురు ప్రయాణికులు మెట్లపై కూర్చోవడం వలన ఆ మెట్లపై ఎక్కేవారికి, దిగేవారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన దరిమిలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.3 సూచనలు, సలహాల స్వీకరణవివిధ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు ఆరు నెలలపాటు ప్రత్యేక అవగాహనా ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు, ప్లాట్ఫారాల వద్ద పనిచేసే సిబ్బంది, స్టాల్స్ నిర్వహిస్తున్న దుకాణదారులకు రైల్వే అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అలాగే వారి నుంచి రద్దీ నియంత్రణకు అవసరమైన సలహాలను కూడా స్వీకరించనున్నారు. ఇది కూడా చదవండి: ‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’ -
ఓవర్ యాక్షన్ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు
సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన ఫలితం.. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డారు. అక్రమ కేసులు పెట్టిన ఇద్దరు ఖాకీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరినీ వ్యక్తిగతంగా సంజాయిషీ కోరింది. బోసా రమణ అనే వ్యక్తి విషయంలో పోలీసు అధికారులు.. హైకోర్టు అదేశాలను బేఖాతరు చేశారు. రమణని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదు.మరో కేసు ఉందంటూ పోలీసులు ఇచ్చాపురం తీసుకెళ్లారు. తమ ఆదేశాలను ధిక్కరించటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సీఐలు వెంకటేశ్వర్లు, చెన్నంనాయుడులకు నోటీసులు జారీ చేయాలని రెండు జిల్లాల జిల్లా జడ్జీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీఐలు ప్రభుత్వ లాయర్ను వినియోగించుకోకుండా వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన
సాక్షి,హన్మకొండజిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. జాతర సందర్భంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయ గెస్ట్హౌజ్ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ మోకాళ్లపై నిలబడి తన అసహనాన్ని వెల్లడించారు. కాగా,హైదరాబాద్ ఇంఛార్జ్గా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గతేడాది హైదరాబాద్లో బోనాల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అధికారులపై అలిగి గుడిలోనే బైఠాయించారు.తనకు, జీహెచ్ఎంసీ మేయర్కు ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై తన నిరసనను తెలిపారు. అనంతరం అధికారులు బుజ్జగించిన తర్వాత పొన్నం అలకవీడడం గమనార్హం. సొంత హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ జాతరలోనూ తాజాగా పొన్నం అధికారులపై బహిరంగంగానే తన అసహనాన్ని తెలపడం చర్చనీయాంశమైంది. -
విజయవాడలో 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన నగరపాలక సంస్థ
-
పూణె మెట్రో స్టేషన్లో మంటలు
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. पुणे के मेट्रो स्टेशन में लगी आगमहाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024ఇది కూడా చదవండి: పిరమిడ్పై పక్షుల వేట -
TG: ఐఏఎస్లను రిలీవ్ చేసిన ప్రభుత్వం
సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం(అక్టోబర్ 16) సాయంత్రం రిలీవ్ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయనున్నారు. ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్ల స్థానంలో ఇన్ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖక్రిస్టినా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కు క్రిస్టినా, జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్గా ఇలంబర్తిలను ప్రభుత్వం నియమించింది.ఇదీ చదవండి: ఐఏఎస్లకు తెలంగాణ హైకోర్టు చుక్కెదురు -
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. ఇద్దరు మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగివస్తారు. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించారు. సముద్రాల పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా వీరు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేరళలోని కాలికట్లో జన్మించిన దిల్నా 2014లో, పుదుచ్చేరికి చెందిన రూపా 2017లో ఇండియన్ నేవీలో చేరారు. (చదవండి: భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..) -
చేనేత సొసైటీల్లో ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికల కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 21న షెడ్యూల్ విడుదల చేసి, డిసెంబర్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏ సొసైటీల పరిధిలో ఎంత మంది సభ్యులున్నారన్న వివరాలతో కూడిన జాబితాలను చేనేత జౌళి శాఖ సేకరిస్తోంది. ఆ జాబితాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలను అధికారులు ఖరారు చేస్తారు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితా ఖరారు, బోగస్ సొసైటీల వ్యవహారం వంటి అనేక సమస్యలు ఎన్నికలకు అవరోధంగా మారాయి. మరోవైపు వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలు సైతం నిర్వహించాలనే ప్రతిపాదన ఉండటంతో చేనేత సొసైటీ ఎన్నికలు ముందు వెనుక అయ్యే అవకాశం ఉందని చేనేత జౌళి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు జాబితాల కసరత్తు పూర్తి చేసి ఎన్నికలను మరో రెండు నెలల తర్వాత నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉందని, ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆ అధికారి చెప్పారు.ఎన్నికలు నిర్వహిస్తారనే సంకేతాలతో చేనేత సొసైటీ ఎన్నికల బరిలో దిగి పదవులు దక్కించుకునేందుకు పలువురు సమాయత్తమవుతున్నారు. తమ సొసైటీల పరిధిలో సభ్యుల జాబితాలు, వాటిలో మార్పులు, సభ్యులను చేరి్పంచడం వంటి చర్యలు చేపట్టారు. మరోపక్క కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే ప్రత్యేకంగా చేనేత సొసైటీ ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు. పేరుకే సొసైటీలు.. యాక్టివ్గా ఉన్నవి కొన్నే అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 960 చేనేత సొసైటీలు ఉన్నాయి. వాటిలో 200కు పైగా బోగస్వే. మిగతా వాటిలో 600కు పైగా సొసైటీలు రికార్డుల్లోనే ఉన్నాయి తప్ప కార్యకలాపాలు ఏమీ లేవు. వాస్తవంగా నిత్యం కార్యకలాపాలు సాగిస్తూ యాక్టివ్గా ఉండే సొసైటీలు 100 నుంచి 150 మాత్రమే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర రాయితీల కోసం మాస్టర్ వీవర్స్, చేనేత రంగంలో బడా వ్యాపారులు వారి వద్ద పనిచేసే వారిని, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి సొసైటీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఏకంగా పదుల సంఖ్యలో బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సొసైటీలను తప్పించి, వ్యవస్థను ప్రక్షాళన చేశాకే ఎన్నికలు జరిపాలని అసలైన సొసైటీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.సొసైటీ నుంచి ఆప్కో వరకు ఎన్నికలు ఇలా.. ప్రతి సొసైటీకి తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వారిలో ఇద్దరు మహిళా డైరెక్టర్లు కచి్చతంగా ఉండాలి. తొమ్మిది మంది డైరెక్టర్లు వారిలో ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ప్రతి జిల్లా పరిధిలోని సొసైటీల అధ్యక్షులందరూ కలిసి ఒక ఆప్కో డైరెక్టర్ను ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల ఆప్కో డైరెక్టర్లు వారిలో ఒకరిని ఆప్కో చైర్మన్గా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపికయ్యే ఆప్కో చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. అదే ప్రభుత్వమే నామినేట్ చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి పదవిని పొడిగించాలి. చేనేత సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసే వారి బ్యాంకు రుణాల కిస్తీల చెల్లింపులు మూడు నెలలకు మించి పెండింగ్లో ఉండకూడదు. -
పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
న్యూ మేనాగురి: పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్దువార్ డివిజన్లోని న్యూ మేనాగురి స్టేషన్లో ఒక గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన దరిమిలా ఈ మార్గంలో వెళ్లే రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇది ఐదు లైన్లతో కూడిన స్టేషన్ అని, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.గూడ్సు రైలు పట్టాలు తప్పిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు(మంగళవారం) ఉదయం 6:20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అలీపుర్దూర్ డివిజన్ డీఆర్ఎం అమర్జీత్ గౌతమ్ తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. కాగా గత నెలలో కూడా పశ్చిమ బెంగాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాడు ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్లోని కుమేదర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్జీపీ నుంచి కతిహార్ వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. #WATCH | 5 wagons of an empty goods train derailed at New Maynaguri station in Alipurduar division. Trains have been diverted through alternate routes and movement has not been affected. Senior officers including DRM Alipurduar have moved to the site. Restoration work is going… pic.twitter.com/6GKv0otIAB— ANI (@ANI) September 24, 2024ఇది కూడా చదవండి: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి -
బీహార్లో వెయ్యి దాటిన డెంగ్యూ కేసులు
పట్నా: బీహార్లో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తూ, అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పట్నా జిల్లాలో గత 10 రోజుల్లో డెంగ్యూ కారణంగా మొత్తం ఏడుగురు మృతిచెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా మృతి చెందిన యువకుని వివరాలిలా ఉన్నాయి.పాలిగంజ్లోని సిగౌరి పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల సంజీత్ కుమార్ కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో పీఎంసీహెచ్లోని డెంగ్యూ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత 24 గంటల్లో ఒక్క పట్నా జిల్లాలోనే కొత్తగా 18 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. పట్నా జిల్లాలో ఇప్పటివరకు 538 మంది డెంగ్యూతో బాధపడుతున్న రోగులను గురించారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ సంఖ్య వెయ్యి దాటింది. బీహార్లోని 11 జిల్లాలు డెంగ్యూ బారిన పడ్డాయి. డెంగ్యూ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్నా తర్వాత గయలో అత్యధికంగా 70 డెంగ్యూ కేసులు నమోదయ్యయి. -
పిఠాపురంలో కొత్త లొల్లి..
-
President Droupadi Murmu: మీరే సంధానకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సూచించారు. రాజ్భవన్లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్ను ప్రోత్సహించాలని కోరారు. -
రిటైర్డ్ ఐపీఎస్ ల గుప్పిట్లో పొలిసు శాఖ
-
కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలే లక్ష్యంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ముకుతాడు వేసింది. అధికారుల దుందుడుకు చర్యలను అడ్డుకునే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అతిక్రమణలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ప్రజల భద్రతకు ప్రమాదకారిగా మారినప్పుడు మాత్రమే కూల్చివేతలు చేపట్టవచ్చని, అయితే అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు అధికారులు ఎంత మాత్రం భవనాల కూల్చివేతలకు దిగరాదని హైకోర్టు ఆదేశించింది. అధికారులు తమ విచక్షణ, అధికారాన్ని వినియోగించే సమయంలో నిష్పాక్షికంగా, వాస్తవ దృక్పథంతో చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ కార్యాలయాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం తమకున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ వైఎస్సార్సీపీ వర్గాలు సంబంధిత అధికారుల వద్ద ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. చట్ట ప్రకారం వ్యవహరించేందుకు వీలుగా నేటి నుంచి రెండు వారాల్లోపు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు, అదనపు డాక్యుమెంట్లు, వివరణ, అదనపు వివరణలను అధికారులకు సమర్పించవచ్చని పేర్కొంది. రెండు వారాల గడువు ముగిసిన తరువాత వైఎస్సార్ సీపీ సమర్పించిన ఆధారాలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. వైఎస్సార్సీపీ వాదనను కూడా వినాలని ఆదేశించింది. అంతేకాకుండా రికార్డులు, సంబంధిత భవనాలను పరిశీలించిన తరువాతే పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పింది. ప్రతి దశలోనూ వైఎస్సార్సీపీ వాదనలు వినాలని, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా వారి వాదనను వినాల్సిందేనని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు వైఎస్సార్ సీపీ కార్యాలయాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం తీర్పు వెలువరించారు.కూల్చివేతల నోటీసులపై పిటిషన్లు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాల కూల్చివేత నిమిత్తం పురపాలక శాఖ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులు, ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ, పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కూల్చివేతలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.నిర్మాణ సమయంలో అధికారులు సందర్శించలేదు..‘రాష్ట్ర విధానంలో భాగంగా అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీ కార్యాలయాల నిర్మాణం నిమిత్తం భూముల కేటాయింపు జరిగింది. భూములను స్వాధీనం కూడా చేశారు. ఆ ఖాళీ స్థలాలకు ఆస్తి పన్నులు కూడా చెల్లించారు. భవన నిర్మాణాలకు అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. కొన్ని చోట్ల బిల్డింగ్ పర్మిట్లు కూడా వచ్చాయి. అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అధికారులు ఎప్పుడూ నిర్మాణ సమయంలో భవనాలను సందర్శించ లేదు. ఇప్పుడు అత్రికమణలు ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత కూల్చివేతల కోసం నోటీసులు జారీ చేశారు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలుభవన నిర్మాణాల్లో ఎలాంటి అతిక్రమణలు లేవని, చట్ట నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టామన్న వైఎస్సార్ సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం పెనాల్టీ విధించి నిర్మాణాలను క్రమబద్ధీకరించే అధికారం కమిషనర్లకు ఉందన్న వాదనను కూడా పరిగణలోకి తీసుకున్నారు. భవనాల కూల్చివేత వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదని, తమకు మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, అధికారులు ప్రస్తావించిన అతిక్రమణలు సైతం సరిచేసేందుకు అవకాశం ఉన్నవేనన్న వాదనను కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. -
బీహార్లో కూలిన మరో వంతెన
బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అరారియాలో ఓ వంతెన కూలిపోయిన ఘటన మరువక ముందే సివాన్లోని దారుండా బ్లాక్లోని రామ్గర్హాలోని గండక్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడం కలకలం రేపుతోంది.పాతేడీ బజార్- దరౌండా బ్లాక్లను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే అరారియాలో ఓ వంతెన కూలిపోయింది. ఆ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా సివాన్లోని కాలువకు వంతెనకు ఒకే పిల్లర్ ఉండగా అది కూడా కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోయింది.ఈ వంతెన నిర్మించి ఏడాది కూడా గడవకముందే కూలిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
‘బాబు.. అధికారులను అవమానించడం సమంజసమేనా?’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడే తప్పులు చేయడం ఆరంభించినట్లు అనిపిస్తుంది. వయసు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఈసారి అందరి అభిమానాన్ని చూరగొనేలా ప్రభుత్వాన్ని నడిపితే మంచి పేరు వస్తుంది. టీడీపీ కొద్ది రోజుల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనుసరించిన వైఖరి కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి.కౌంటింగ్లో టీడీపీ గెలుస్తోందన్న సంకేతం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులకు పైగా పార్టీ శ్రేణులు, గూండాలు విరుచుకుపడ్డ వైనం, చెలరేగిన హింసాకాండ చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అయినా ఆయన దానిని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఆయన ధోరణి గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకు చావండి.. వైఎస్సార్సీపీ వారిని చంపితే చంపండి అన్న రీతిలో ఉదాసీనంగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. వెంటనే అదుపు చేయాలని చంద్రబాబు ఆదేశించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సంప్రదాయం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా వచ్చి ఆయనను కలుస్తారు. కానీ గతంలో తనను ఆయా స్కామ్లలో అరెస్టు చేసిన కొందరు అధికారులను తన ఇంటివైపు రానివ్వలేదు. సచివాలయంలో చంద్రబాబు పదవీబాధ్యతలు తీసుకున్న తదుపరి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల పట్ల ఆయన చాలా కఠిన వైఖరి అవలంబించారు. ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది ఆయన భావన కావచ్చు. వారి నిర్ణయాల వల్ల టీడీపీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. అయినా తనకు అధికారం వచ్చిన తర్వాత దానిని పట్టించుకోకుండా పాలన సాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాకాకుండా పాత విషయాలను గుర్తులో ఉంచుకుని అధికారులను వేధించాలని, అవమానించాలని చంద్రబాబు వంటి సీనియర్ నేత తలపెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు.సీనియర్ అధికారులను కిందిస్థాయి సిబ్బందితో చెప్పించి వెనక్కి పంపించడం, పుష్పగుచ్చం ఇవ్వడానికి చొరవ తీసుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా నిరోధించడం వంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఒక పక్క గత ప్రభుత్వం వ్యవస్థలను ద్వంసం చేసిందని చెబుతూ, ఇప్పుడు అంతకు మించి విద్వంసం చేసేలా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఇతర అధికారులపై కూడా పడుతుంది. కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఎక్కువ సందర్భాలలో పనిచేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా అంతే. చంద్రబాబు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ అధికారి అయినా వెళతారా? ఆ ఆదేశాలు సరికాదని సంబంధిత అధికారి భావించినా, దానిని ఫైల్ మీద రాస్తారేమో కానీ, అంతిమంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినవలసి ఉంటుంది. దీనిని విస్మరించి చంద్రబాబు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.పని అప్పగించి సరిగా నెరవేర్చకపోతే అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే అదో పద్దతి. అలాకాకుండా వారు కనిపించగానే అవమానించే రీతిలో వ్యవహరిస్తే మిగిలిన ఆఫీసర్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో గుర్తించాలి. ఒకవేళ వారు గత ప్రభుత్వ టైమ్లో ఏదైనా తప్పు చేశారని అనుకుంటే వారిపై విచారణకు ఆదేశించి చర్య తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్. కానీ అందరి మధ్యలో వారిపట్ల అమానవీయంగా చికాకు పడితే అది తప్పుడు సంకేతం పంపుతుంది. ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కక్ష కట్టి అవమానించారన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన సెలవుపై వెళ్లారు. గతంలో ఆయన లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షించారు. లోకేష్ వద్ద పనిచేశారు కనుక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారా? లేదే! అదే జవహర్ రెడ్డిపై వీరికి ఎందుకో కోపం వచ్చింది.ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీచర్లతో గట్టిగా పనిచేయించే యత్నంలో కొంత విమర్శకు కూడా గురి అయ్యారు. టీచర్ల సంఘాలు ఆయనపై కక్ష కట్టాయి. ఇందులో ఆయన తప్పులు ఏమున్నాయో తెలియదు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సన్నిహితంగా మెలిగారన్న కారణంగా ప్రవీణ్ ప్రకాశ్ పట్ల అసహనంగా ఉండడం సరైనదేనా అనే చర్చ వస్తుంది.మరో సీనియర్ అధికారి అజయ్ జైన్ పై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటులో జైన్ ప్రముఖ పాత్ర వహించారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగుడుతారన్న భావన ఉంది. 2014లో చంద్రబాబు పాలన టైమ్ లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని విస్మరించి ఆయనపై కూడా ద్వేషం పెట్టుకోవడం సరికాదు. మరో అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చం తీసుకు వస్తే ఆమె వైపు చూడడానికి కూడా సుముఖత కనబరచలేదట. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే.అలాగే సునీల్ కుమార్, రఘురామిరెడ్డి , పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మరికొందరు అధికారులతో కూడా అలాగే వ్యవహరించారట. ఏ అధికారి అయినా సంబంధిత ప్రభుత్వం ఏమి చెబితే దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఆ ప్రభుత్వ విధానాలతోనే వెళతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి ఆదేశాలను పాటిస్తారు. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఒకవేళ ఆ అధికారులపై సరైన అభిప్రాయం లేకపోతే వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వరు. విశేషం ఏమిటంటే ఆయా ముఖ్యమంత్రులు తమకు మొదట ఇష్టం లేరన్న అధికారులు తదుపరికాలంలో వారికి సన్నిహితులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు వద్ద పనిచేసిన ఒక సీనియర్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆయన కంపెనీలలో సీఈఓ ఉద్యోగంలో చేరారు. అంటే వారి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే కదా! మరో పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ అంతరంగిక వ్యవహారాలలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. మరి దానిని ఏమంటారు. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టి, ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. ఆయన అధికారంలో ఉంటే అధికారులంతా సచ్చీలురుగా ఉన్నట్లు, లేకుంటే పాడైపోయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అదే పంధా అనుసరిస్తున్నట్లుగా ఉంది.ఇంకోరకంగా చూస్తే వారివల్లే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, తత్పఫలితంగా తాను అధికారంలోకి వచ్చానని ఆయన సంతోషించవచ్చు కదా! అలాకాకుండా కక్ష కట్టడం ఏమిటి! గత ప్రభుత్వంపై ప్రజలలో కసి ఏర్పడడానికి గత ఐదేళ్లలో జరిగిన విద్వంసకర పాలన అని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ లకు పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. బాగానే ఉంది. మరి 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన తర్వాత టీడీపీకి 23 సీట్లే ఎందుకు వచ్చాయి? అంతకుముందు 2004 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అధికారుల శైలి వల్ల అని ఆయన చెబుతారా! అప్పట్లో కూడా ప్రజలలో అలాంటి అభిప్రాయం ఏర్పడినట్లా?ఉన్నతాధికారులు అప్పుడు కూడా తప్పుగానే ప్రవర్తించినట్లేనా అనే ప్రశ్నకు జవాబు దొరకదు.ఏది ఏమైనా అధికారులను బెదిరించడానికి ఇలా చేస్తున్నారా? లేక వారిపై ఏదైనా చర్య తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియదు. కానీ ఇది ఒక చెడు సంప్రదాయం అవుతుందని చెప్పక తప్పదు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా చంద్రబాబు అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారట. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దాలనే ఆయన కొనసాగిస్తున్నారని అనుకోవాలి. అది నిజమే అయితే ఆయన శాసనసభలో ఈ చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి కదా! పైగా హైకోర్టులో నిలిచిపోయి ఉన్న చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు.కేంద్రం పంపిన ఈ నమూనా చట్టంపై జనంలో అవవగాహన కలిగించకుండా గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనానికి బాగానే వాడుకున్నారని చెప్పాలి. నైపుణ్య గణన అంటూ మరో ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దానిని ఎలా ఆచరణలోకి తీసుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇలా చంద్రబాబు తాను మారానని, ఎవరిపై కక్ష పూననని అంటూనే సీనియర్ అధికారులను అవమానించడంపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలిసినా, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, తమకు తిరుగులేదని ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం మనబోటి సామాన్యులకు కష్టమేనేమో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంకు అధికారుల కాఠిన్యం
-
ఢిల్లీ: 12కు స్పష్టత.. 4కు తుది ఫలితం?
ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్లు మొదలు కానున్నాయి.ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర బ్యాలెట్ పేపర్లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో 100కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు. మే 25న ఢిల్లీలో జరిగిన లోక్సభ పోలింగ్లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
చార్ధామ్ యాత్ర: 15 రోజుల్లో రూ. 200 కోట్ల వ్యాపారం
చార్ధామ్ యాత్రకు తరలివస్తున్న భక్తులు గత సీజన్తో పోలిస్తే అధికంగా ఉన్నారు. దీంతో హోటళ్లు, దాబాలు, ట్రావెల్స్కు సంబంధించిన వ్యాపారులు గడచిన 15 రోజుల్లో మంచి వ్యాపారం సాగించారు. ఇప్పటి వరకు చార్ధామ్ యాత్ర కారణంగా రూ.200 కోట్లకు పైగా టర్నోవర్ జరిగినట్లు అంచనా. భక్తుల సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటిందని సమాచారం.డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ బన్షీధర్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఈసారి చార్ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు తరలివస్తున్నారు. దీంతో ధామ్లలో ఒత్తిడి పెరిగినా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చాయన్నారు. చార్ధామ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం గంగోత్రి వ్యాలీలో 400, యమునోత్రి వ్యాలీలో 300 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి బద్రీనాథ్, రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథ్ మధ్య 850 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి.గత ఏడాది ఏప్రిల్ 22న సీజన్ ప్రారంభమైనప్పుడు మొదట్లో తక్కువ మంది యాత్రికులు వచ్చారు. అయితే ఈసారి సీజన్ ఆలస్యంగా ప్రారంభమవడంతో రద్దీ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. చార్ధామ్లో గత 15 రోజుల్లో హోటళ్లు, దాబాలు, హోమ్స్టేల ద్వారా దాదాపు రూ.80 కోట్లు, దుకాణదారుల నుంచి రూ.20 కోట్లు, గైడ్ల ద్వారా రూ.30 కోట్లు, ప్రయాణాల ద్వారా రూ.40 కోట్లు, రూ.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. కాగా చార్ధామ్లో యాత్ర నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్తగా ఇద్దరు యాత్రా మేజిస్ట్రేట్లను నియమించింది. ఈ మేజిస్ట్రేట్లు మే 26 నుంచి జూన్ 6 వరకు విధులు నిర్వహించనున్నారు. -
ఓటింగ్ను బహిష్కరించిన గ్రామస్తులు
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఈరోజు(సోమవారం) ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనా యూపీలోని ఒక గ్రామంలో ఇప్పుటికీ ఒక్క ఒటు కూడా పడలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీలోని కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామంలోని కూడలి వద్ద ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. అయితే ఓటరు కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటర్ల కోసం వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా ఓటు వేయలేదు.గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, దీనిపై ఇంత వరకు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదపలేదని వారు మీడియా ముందు వాపోయారు. అందుకే తాము ఓటింగ్ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామపెద్ద వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని, రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తున్నదన్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకోడానికి రైల్వే లైన్ దాటి వెళుతున్నారన్నారు.తాము ఇక్కడి రైల్వేలైన్పై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరగా హామీ ఇచ్చి, దానిని విస్మరించారన్నారు. గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం బయటే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిని ఒప్పుంచేందుకు ప్రయత్నించినా , వారు తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. -
ఎన్నికల శిక్షణకు డుమ్మా.. 70 మంది అధికారులపై చర్యలు!
ఎన్నికల శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గతంలోనే వెల్లడించించింది. అయితే దీనిని పెడచెవిన పెట్టిన కొందరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. ఈ ఉదంతం యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రిసైడింగ్, పోలింగ్ శిక్షణకు హాజరుకాని 70 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం నిర్వహించే ఈ శిక్షణ.. ఓటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ శిక్షణకు హాజరు తప్పనిసరి అని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశారు. ఈ శిక్షణ సమయంలో ఓటింగ్ రోజున తలెత్తే సమస్యల పరిష్కారానికి అనేక వ్యూహాలను తెలియజేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్సింగ్నగర్కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్కుమార్ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అధికారుల ప్రక్షాళన మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను కమిషనర్ టర్మినెట్ చేశారు. 45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో 37 మంది తమ విధుల నుంచి వైదొలిగారు. అక్రమాలకు పాల్పడిన 14 మంది అధికారులను విధుల నుంచి కమిషనర్ తొలగించారు. తప్పులు చేస్తున్న పలువురు అధికారులకు రోనాల్డ్ రోస్ మెమోలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కాగా, అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగినషన్ బయోమెట్రిక్ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. -
TS: గొర్రెల పంపిణీ స్కాం.. పరారీలో కీలక నిందితులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాంలో ఇద్దరు కీలక నిందితులు విదేశాలకు పరారైనట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు పారిపోయిన నిందితులు ఫిర్యాదు దారులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
TS: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
TS: రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిన వెంటనే సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాసం -
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య!
అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠితుడైనప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ఈనెలలో రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీనితోపాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్కు అనుసంధానించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
పోలింగ్లో గందరగోళం.. పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు మాయం!
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి. కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభించేముందు పాక్ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కాగా ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
జైలులో ఖైదీ బర్త్డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 760 కరోనా కేసులు!
కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారతదేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారితమయ్యింది. జేఎన్-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కు చేరింది. కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్లో 17 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్గా ధ్యాన్చంద్ర విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్గా టీఎస్ చేతన్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్గా జె. శివ శ్రీనివాస్ తిరుపతి జాయింట్ కలెక్టర్గా శుభం బన్సాల్ విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవోగా మాధవన్ మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్గా ఎస్ఎస్ శోభిక సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్గా కె.కార్తీక్ పాడేరు సబ్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి పెనుకొండ సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ కందురకూరు సబ్ కలెక్టర్గా గొబ్బిల విద్యాధరి తెనాలి సబ్కలెక్టర్గా ప్రకార్ జైన్ మార్కాపురం సబ్ కలెక్టర్గా రాహుల్ మీనా ఆదోని సబ్ కలెక్టర్గా శివ్ నారాయణ్ వర్మ రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఎస్.ప్రశాంత్కుమార్లు నియమితులయ్యారు. -
చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
మెట్రో రెయిలింగ్పై మహిళ హైడ్రామా..
ఏదో ఒక కారణంతో ఢిల్లీ మెట్రో తరచూ ముఖ్యాంశాలలో నిలుస్తుంటుంది. కొందరు మెట్రోలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా మెట్రోలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఉదంతం మెట్రో అధికారులకు చిక్కులను తెచ్చిపెట్టింది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్లో ఒక మహిళ ఎలివేటెడ్ ట్రాక్ దాటి, రెయిలింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమించిన కొందరు ప్రయాణికులు మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అతి కష్టం మీద ఆ మహిళను కాపాడారు. #Delhi- Girl was jumping from the track of metro station.. police saved her. #delhimetro #delhigirls #DelhiGovernment #Delhi #METRO4D #Metro pic.twitter.com/eFwJ6yNhAH — Arun Gangwar (@AG_Journalist) December 12, 2023 ఈ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ పట్టుకుని ఎలివేటెడ్ మెట్రో ట్రాక్ పక్కన నిలబడి కనిపించింది. ఆమె ట్రాక్ పరిమితిని దాటి, రెయిలింగ్ పైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. షాదీపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎలివేటెడ్ ట్రాక్పై నుంచి దూకుతానంటూ ఆ మహిళ బెదిరించింది. ఆమెను కాపాడేందుకు అధికారుల బృందం ఫుట్పాత్ మీదుగా ట్రాక్ వైపు వెళ్లి ఆమెను రక్షించింది. కాగా ఆ మహిళ ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: శరద్ పవార్కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది. ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! -
ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..
ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది. లింగంపల్లి- వికారాబాద్- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్- బీదర్ సెక్షన్, మన్మాడ్- ముద్ఖేడ్ ధోనే- గుంతకల్ సెక్షన్కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్-బర్బణీ సెక్షన్కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది. ‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్’ అనేది రైలు డ్రైవర్కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా.. -
CM Jagan Review On Cyclone: తుపానుపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు అధికారులతో సమీక్ష జరిపారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మరోమారు సమీక్ష చేస్తానని ఆయన తెలిపారు. పొలాల్లో, కలాల్లో ఉన్న ధాన్యం తడిపోకుండా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం.. తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. చదవండి: ముంచుకొస్తున్న మిచాంగ్ -
ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది. ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్లు, టూత్పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి -
ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్కు ఎడతెగని ఆటంకాలు!
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 17 రోజులు దాటుతున్నా విముక్తి లభించలేదు. వారిని చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొదట డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి తెచ్చిన యంత్రం చెడిపోయింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణం కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మెషిన్ చెడిపోవడంతో ప్రస్తుతం మాన్యువల్ డ్రిల్లింగ్ జరుగుతోంది. 86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 మీటర్ల మేరకు తవ్వగలిగారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన డ్రిల్లింగ్ మిషన్ బ్లేడ్లు.. బాధిత కార్మికులున్న ప్రదేశానికి 12 మీటర్ల ముందుగానే విరిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ను మధ్యలోనే ఆపివేసి, బ్లేడ్లను తొలగించాల్సివచ్చింది. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్కు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల రెస్క్యూకు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సంఘటనా స్థలానికి వచ్చారు. సొరంగంలో వర్టికల్ డ్రిల్లింగ్ శరవేగంగా జరుగుతోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు 36 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. కార్మికులలో నిరాశానిస్పృహలు నెలకొన్న దృష్ట్యా, ఐదుగురు వైద్యుల బృందం సంఘటనా స్థలంలో ఉంటోంది. వారు సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని, వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూస్తున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు త్వరగా బయటకు రావాలని కాంక్షిస్తూ స్థానికులు సొరంగం దగ్గర హోమాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం! -
‘సొరంగ బాధితులు బయటకు రావాలంటే మరి కొన్ని వారాలు నిరీక్షించాల్సిందే(
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు రావాలంటే క్రిస్మస్ వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డిఎంఎ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్కు చాలా సమయం పట్టవచ్చని అన్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి బాధిత కార్మికులను బయటకు తీసుకురాగలుగుతామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్ డ్రిల్లింగ్లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గుతుంది. అంతర్జాతీయ నిపుణుడు డిక్స్.. ఆగర్ యంత్రం పగిలిపోయిందని చెప్పడంతో సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించిన అనంతరం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం -
బయటివారితో మాట్లాడుతున్న సొరంగంలోని బాధితులు
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దానిలో వారంతా సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు. సొరంగంలోని కార్మికులతో బయట ఉన్న వారి బంధువులు మాట్లాడుతున్నారు. బుధవారం ఆ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిలో ఒక కార్మికుడు మొబైల్ ఛార్జర్ను లోపలికి పంపించాలని కోరాడు. సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులలో పుష్కర్ సింగ్ యేరీ ఒకరు. అతని సోదరుడు విక్రమ్ సింగ్ యేరీ తాను పుష్కర్తో మాట్లాడినట్లు మీడియాకు తెలిపారు. తన సోదరుడు.. తాను బాగున్నానని, మమ్మల్ని ఇంటికి వెళ్లాలని చెప్పాడని తెలిపారు. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారపదార్థాలను, ఇతర వస్తువులను అందించడానికి ఆరు అంగుళాల వెడల్పు గల పైపును లోపలికి పంపారు. ఈ ఆరు అంగుళాల ‘లైఫ్లైన్’ అందించకముందు కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్ను నాలుగు అంగుళాల పైపు ద్వారా సరఫరా చేశారు. కాగా తాజాగా లోనికి పంపిన విశాలమైన పైప్లైన్తో మెరుగైన కమ్యూనికేషన్ అందడంతో పాటు ఆహార పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో పంపేందుకు అవకాశం కలిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు ప్రదీప్ కిస్కు క్షేమ సమాచారాన్ని అతని బంధువు సునీతా హెంబ్రామ్ తెలుసుకున్నారు. అతను బాగున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. కాగా కొత్త పైపు సొరంగంలోకి పంపడం వలన కార్మికులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం అయ్యింది. ఇప్పుడు వారి గొంతు స్పష్టంగా వినిపిస్తున్నదని సొరంగం బయట ఉన్నవారు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించిన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగంలోని ఒక భాగం నవంబర్ 12న కూలిపోయింది. ఈ సమయంలో 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు VIDEO | "He said -'I am good. You people go home. I will come.' Fruits and other food items were sent through the pipe. He has asked for a mobile charger," says Vikram Singh Yeri, brother of Pushkar Singh Yeri, one of the workers who is stuck inside the collapsed Silkyara… pic.twitter.com/LKS66h5FCy — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అమెరికన్ ఆగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో ఆరు పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు. పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A — ANI (@ANI) November 21, 2023 -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్ను ముందుకు పోనిచ్చారు. -
రెగ్యులర్ అధికారులు లేక.. గాడితప్పుతున్న పాలన..!
బెజ్జూర్: మండలంలో ఇన్చార్జీల పాలన కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం నియమించిన ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో ఇక్కడ పని చేయలేకపోతున్నారని దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలో తహసీల్దార్, పశువైద్యాధికారి, టీజీబీ మేనేజర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్ అధికారులు లేక ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. మండలానికి వచ్చేందుకు విముఖత.. మండలంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో మండల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి గత ఆగస్టు 8న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమించిన అధికారి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా తహసీల్దార్లను బెజ్జూర్కు వెళ్లాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో నెలరోజుల నుంచి డెప్యూటీ తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు ఇన్చార్జి తహసీల్దార్గా వ్యవహరిస్తున్నారు. పశు వైద్యాధికారి లేక ఇబ్బందులు.. మండల కేంద్రంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పాడి పోషకులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడంతో పెంచికల్పేట పశువైద్యాధికారి రాకేశ్ను ఇన్చార్జీగా నియమించారు. ఆయ న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో గాలికుంటు వ్యాధి, సీజనల్ వ్యాధులతో పశువులు అల్లాడిపోతున్నాయని పేర్కొంటున్నారు. రైతులకు అందని బ్యాంక్ సేవలు బెజ్జూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మూడు నెలల క్రితం అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నారు. మేనేజర్ను ఉన్నతాధికారులు బదిలీ చేయగా.. పెంచికల్పేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్ను ఇక్కడ ఇన్చార్జి మేనేజర్గా నియమించారు. రెగ్యులర్ మేనేజర్ కావడంతో రైతులకు రుణాల రెన్యూవల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్చార్జి మేనేజర్ కావడంతో సకాలంలో సేవలు అందడం లేదని బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు. విద్యార్థులకు తప్పని తిప్పలు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కుంటలమానేపల్లి ప్రధానోపాధ్యాయుడు ఇక్కడ ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. సదరు ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ విద్యా బోధన చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని, అయితే ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటామని కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధమని నిలదీస్తున్నారాయన. శుక్రవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన.. కోర్టు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా?. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. అయినా నేను ప్రజల మనిషిని నాకు సెక్యూరిటితో పనిలేదు. నేను సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? అని ప్రశ్నించారు. తనని ఓడించడానికే కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించిన రేవంత్రెడ్డి.. సెక్యూరిటీ విషయంలో భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యమని, వాళ్లే తన సెక్యూరిటీ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ అలా చెప్పగలదా? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్క పర్సెంట్ మైనార్టీలకు కూడా దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు. మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా? అలాంటి వాళ్లనే అనేది.. అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే నేను అనేది. రియల్ బూమ్ నాటకం పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు? అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ మండిపడ్డారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారు. కోకాపేట, బుద్వేల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదు. కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసెందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అని విమర్శలు గుప్పించారు రేవంత్. నేనైనా అప్లై చేసుకోవాల్సిందే! ఎన్నికల సమయం వచ్చినప్పుడు పొత్తుల గూర్చి ఏఐసీసీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అది నేనైనా సరే అప్లై చేసుకోవాల్సిందే. ఒకరు ఒకటి కన్నా ఎక్కువ అఫ్లికేషన్లు పెట్టుకోవచ్చు అని రేవంత్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాయదుర్గం మెట్రో భూమి తాకట్టు -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. పోలీసులను అరేయ్.. ఓరేయ్ అంటూ..
సాక్షి, అనంతపురం: తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ అధికారులు, పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరుపులు, కేకలతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అరేయ్.. ఓరేయ్ అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఒక్కొక్కరి అంతుచూస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను ఉనికి కోల్పోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు చవకబారు రాజకీయాలు చేస్తున్నారు. గత నెల ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జేసీ ప్రభాకర్రెడ్డి ఏకంగా కలెక్టర్పైనే దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్మెన్ను తోసేసి నానా రభస సృష్టించారు. చదవండి: టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి -
ముగ్గురు అధికారుల సస్పెన్షన్
ఒడిశా: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి మజ్జిగుడ పంచాయతీలోని ఉపొరొసొజ్జ గ్రామంలో సోమవారం కల్వర్టు సెంట్రింగ్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం అందుకు సంబంధించి రూరల్ డవలప్మెంట్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రదీప్ కుమార్ మహంతి, అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్ మండల్, జూనియర్ ఇంజినీర్ వెంకటరమణ ముదిలిలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సంజయ్ సింహ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలయ్యాయని, సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు కల్వర్టు కూలిన ఘటనలో సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ తెలియజేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్పై ఇప్పటికే కేసు నమోదయ్యిందని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలి బాధితులకు నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బిజయ్ కుమార్ గొమాంగొ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి ఆయన చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటువంటి తరహా ఘటనలు పునరావృతమవ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నా, తగిన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. -
‘ఈ ‘డర్టీ పాస్పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఎయిర్పోర్టు కౌంటర్లో.. బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్పోర్ట్’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్పోర్ట్’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్ ఎయిర్పోర్టు కౌంటర్లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్పోర్ట్ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది. 7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో.. ఎయిర్పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్పోర్ట్ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది. ‘నన్ను ఎగతాళి చేశారు’ ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్పోర్ట్ డ్యామేజ్ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్పోర్ట్ తిరగి ఇవ్వబోమని తెలిపారు. పాస్పోర్ట్ తిరిగి ఇవ్వబోమంటూ.. ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్పోర్ట్ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్పోర్ట్ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు. ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
హైదరాబాద్ లో GST ఆఫీసర్ల కిడ్నాప్ కేసులో టీడీపీ నేత ముజీబ్
-
నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా.. దిశా యాప్ ద్వారా బాలిక ఫిర్యాదు
సాక్షి,ఏలూరు టౌన్: తనకు చదువుకోవాలని ఉన్నా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ బాలిక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన బాలికకు ఈనెల 8వ తేదీన వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పినా పెద్దలు వినకపోవడంతో.. ఆమె ఆదివారం ఉదయం 9.37 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన దిశ సిబ్బంది సమీపంలోని తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకన్న, సిబ్బందితో కలిసి 10 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకొని.. ఆమెను విచారించారు. ‘ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలని ఉంది. నా చదువు పూర్తయ్యాక మా అమ్మ, నాన్న చెప్పినట్లే చేస్తా’ అని ఆ బాలిక పోలీసులతో పాటు తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆమె చదువును మధ్యలోనే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బాలికకు పెళ్లి చేయడం నేరమని వివరించారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆమెను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలిక సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు, దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్ -
సివిల్ సర్వీస్ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) ద్వారా నియమితులైన అధికారుల్లో చాలామంది బందిపోట్లే అంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడి దొంగకు అయినా శిక్ష పడుతుందేమో గానీ మినరల్ మాఫియాను నడుపుతున్న అధికారులను అస్సలు టచ్ చేయలేం అన్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లాలో బలియాపాల్లోని ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒడిశా ఎంపీ, గిరిజన వ్యవహారాలు, జలశక్తి సహాయ మంత్రి బిశేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తాను ఢిల్లీలో ఉండగా సివిల్ సర్వీస్ కార్యాలయం తన నివాసం వెనకాలే ఉండేదని, దానిపట్ల ఎంతో గౌరవం ఉండేదన్నారు. అప్పట్లో తనకు ఆ సర్వీస్ ద్వారా నియమితులైన వారందరూ అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులని, ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారనే భావన ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తన ఆలోచన మారిందన్నారు. అక్కడ నుంచి వచ్చిన వారిలో చాలామందిని బందిపోటు దొంగలుగా భావిస్తున్నానని చెప్పారు. అలా అని నూటికి నూరు శాతం అందరూ అలానే ఉన్నారని చెప్పడం లేదు. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారని నొక్కి చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతికత లేకపోవటం వల్లే ఇలాంటి చదువుకున్న వ్యక్తుల అవినీతిని సమాజం భరించాల్సి వస్తోందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: జంషెడ్డ్పూర్లో ఘర్షణ..రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) -
ఆ సబ్జెక్టు వరకు పాస్ చేసేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ఉట్నూర్ కేంద్రంలో సోమవారం మాయమైన పదో తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ సబ్జెక్టు వరకూ వారిని పాస్ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు టెన్త్ పరీక్ష సందర్భంగా ఉట్నూర్ కేంద్రంగా ప్రైవేటు విద్యార్థులు (సప్లిమెంటరీ) 9 మంది పరీక్ష రాశారు. ఆ పేపర్లను ముందే నిర్ణయించిన ప్రకారం వాల్యూయేషన్ కేంద్రానికి తరలించాల్సి ఉంది. వీటిని దగ్గర్లోని పోస్టాఫీసుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయాయి. దీన్ని గుర్తించిన విద్యాశాఖాధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. జవాబు పత్రాలు మాయమైన ఘటనకు విద్యార్థులను బాధ్యులను చేయడం సరికాదని భావించి, ఆ సబ్జెక్టు వరకు పాస్ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. -
‘సారూ.. బడిలో మంచినీళ్లు లెవ్వు’
సాక్షి,జగిత్యాల టౌన్: ‘సారూ మా బడిలో తాగేందుకు మంచినీళ్లు లెవ్వు. మూత్రశాలలు పనిచేయడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నం. మీరైనా జోక్యం చేసుకోండి’ అని ఆరో తరగతి విద్యార్థి ప్రజావాణి ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన రాజమల్లు కుమారుడు పి.విశ్వాంక్ ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. తమ పాఠశాలలో మూత్రశాలలు శిథిలమయ్యాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఒకటి, రెంటికి బడి సమీపంలోని పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్లోకి వెళ్తున్నామని, అక్కడ నిర్వాహకులు పైసలు వసూలు చేస్తున్నారని తెలిపాడు. తమతోపాటు ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి అని వివరించాడు. అసలే పేదోళ్లమని, తాముపైసలు చెల్లించలేకపోతున్నామని వాపోయాడు. ప్రస్తుతం ఎండాకాలమని, దాహంతో తపి స్తున్నామన్నాడు. ప్రజావాణి ద్వారా జిల్లా సంక్షేమాధికారి నరేశ్కు వినతిపత్రం అందజేశాడు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు
-
తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్ నికోలస్, కోరం అశోక్ రెడ్డి, బడుగు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు. ఏడుగురు ఐపీఎస్ల బదిలీ మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే! -
పోలవరానికి పీపీఏ బృందం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో శివ్నందకుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈలు రాజేశ్కుమార్, వెంకటసుబ్బయ్య, డైరెక్టర్ దేవేందర్రావు ఈ బృందంలో ఉన్నారు. పీపీఏ సీఈవోగా శివ్నందకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుండడం ఇదే తొలి సారి. గురువారం పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పీపీఏ బృందం పరిశీలిస్తుంది. శుక్రవారం ఏలూరు జిల్లాలో తాడ్వాయి, కృష్ణునిపాలెం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలను పరిశీలించి, నిర్వాసితులతో సమావేశమవుతుంది. ఆ తర్వాత ఈ సీజన్లో చేయాల్సిన పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అధికారులతో పీపీఏ బృందం సమీక్ష సమావేశం నిర్వహించనుంది. -
అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్టాప్పై హైడ్రామా.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్ ల్యాప్టాప్ వదిలివెళ్లారు. రత్నాకర్ను బోయిన్పల్లి పీఎస్కు మంత్రి మల్లా రెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్టాప్ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్టాప్ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్టాప్ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్టాప్ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్టాప్ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ను కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్టాప్ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్లోనే ల్యాప్టాప్ ఉంది. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
Hyderabad: సుశి ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారుల సోదాలు
-
హైదరాబాద్లోని కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: సుశి ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్-12లో కార్యాలయంతో పాటు హైదరాబాద్లో పలు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సుశి ఇన్ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్రెడ్డి – ప్రభాకర్రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్డివిజన్లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
నా శాఖలో అందరూ దొంగలే.. బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్..
పాట్నా: ఆర్జేడీ నేత, బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్.. అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాఖలోని అధికారులంతా దొంగలే అన్నారు. వ్యవసాయ శాఖలో ఒక్క విభాగం కూడా అవినీతి రహితంగా లేదని ఆరోపించారు. ఇక ఈ శాఖకు మంత్రి అయినందుకు తాను దొంగల ముఠాకు నాయకుడ్ని అని వాఖ్యానించారు. అంతేకాదు తనపై ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పారు. సీడ్ కార్పొరేషన్ అందించే విత్తనాలను ఓ ఒక్క రైతు కూడా ఊపయోగించడం లేదని మంత్రి అన్నారు. అయినా సీడ్ కార్పొరేషన్ రూ.150-200 కోట్లను తీసుకుంటోందన్నారు. కైమూర్లో సోమవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఆయన మాత్రం తన వ్యాఖ్యల్లో ఒక్క పదం కూడా వెనక్కితీసుకోనని స్పష్టం చేశారు. తాను మాట్లాడింది వాస్తవమన్నారు. తనపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని, వాళ్లకోసమే పోరాడుతానని అన్నారు. #WATCH | There is not a single wing of our (agriculture) dept that does not commit acts of theft. As I am the in-charge of the department, I become their Sardar (chief)...There are many more people above me: Bihar Agriculture Min S Singh, in Kaimur (12.09) (Source: Viral video) pic.twitter.com/p6mNVRgr60 — ANI (@ANI) September 13, 2022 అంతేకాదు ప్రజలు తన దిష్టిబొమ్మలను దహనం చేయాలని మంత్రి సూచించారు. అప్పుడే రైతులు తనపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకుంటానని చెప్పారు. లేకపోతే అన్నీ సవ్యంగానే ఉన్నాయని పొరపడే అవకాశముందని పేర్కొన్నారు. బిహార్లో కొత్తగా ఎర్పాటైన మహాఘట్బంధన్ ప్రభుత్వంపై కూడా సుధాకర్ సింగ్ స్పందించారు. ప్రభుత్వం కొత్తదే, కానీ పనితీరు మాత్రం పాతగానే ఉందని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ పని ఖతం.. వాళ్లను సీరియస్గా తీసుకోవద్దు.. -
జూనియర్ లైన్మెన్ పేపర్ లీక్.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ జూనియర్ లైన్మెన్ పేపర్ లీక్పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీక్లో ఐదుగురు విద్యుత్ అధికారులు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ అత్యవసర భేటీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17,2022 న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు మంది ఉద్యోగుల ప్రమేయంతో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తేలింది. మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, సపావత్ శ్రీనివాస్, కేతావత్ దస్రు, షైక్ సాజన్, మంగళగిరి సైదులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. -
Adilabad District: ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
ఇచ్చోడ(బోథ్): అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడే జిల్లాలో ఆదిలాబాద్ మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి రైతులకు ఆధునిక వ్యవసాయం, పంటల మార్పిడి, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, సాగులో మెలకువలు, సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. డీఏవో కూడా ఇన్చార్జీనే.. ఆదిలాబాద్లో పనిచేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి డిప్యూటేషన్పై మెదక్ జిల్లాకు వెళ్లింది. ఆమె స్థానంలో ప్రభుత్వం మళ్లీ డీఏవోను నియమించలేదు. దీంతో ఆదిలాబాద్ ఏడీఏ, మార్క్ఫెడ్ డీఎంగా అదనపు బాధ్యతలు చూస్తున్న పుల్లయ్యను ఇన్చార్జి డీఏవోగా నియమించారు. కొత్త మండలాలకు మంజూరు కాని పోస్టులు ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో సిరికొండ, గాదిగూడ, భీంపూర్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలను నియమించిన ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించడం మరిచింది. దీంతో ఆరు మండలాలకు ఆరేళ్లుగా ఇన్చార్జి వ్యవసాయ అధికారులే కొనసాగుతున్నారు. 18 మండలాలకు 11 మందే ఏవోలు జిల్లాలోని 18 మండలాల్లో కేవలం 11 మంది ఏవోలే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగితా ఏడు మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా రెగ్యులర్ ఏవోలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని బేల, ఇంద్రవెల్లి, తలమడుగు, సిరికొండ, భీంపూర్, మావల, గాదిగూడ మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. బేల మండల ఏవోగా పనిచేసిన రమేశ్ను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేయగా, ఏడాది కాలంగా బోథ్ ఏవో విశ్వామిత్ర బేల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. తలమడుగు ఏవో రమణను సర్వీసు నుంచి తొలగించడంతో నార్నూర్–2 ఏవో మహేందర్ తలమడుగు ఏవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి ఏవో కైలాస్ నాలుగేళ్ల కిత్రం ఇచ్చోడకు బదిలీపై రావడంతో ఉట్నూర్ ఏవో గణేశ్ ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన గాదిగూడకు టెక్నికల్ ఏవో జాడి దివ్య, సిరికొండకు ఇచ్చోడ ఏవో కైలాస్, భీంపూర్కు తాంసి ఏవో రవీందర్, మావలకు ఆదిలాబాద్ అర్బన్ ఏవో రవీందర్ ఇన్చార్జి ఏవోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నార్నూర్, జైనథ్ మండలాలకు ఇద్దరు ఏవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. (క్లిక్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?) ప్రభుత్వానికి నివేదించాం కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం ఏవోలను నియమించలేదు. దీంతో పాత మండలాల ఏవోలకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొన్ని మండలాల్లో ఏవోలు బదిలీపై వెళ్లడంతో అక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. – పుల్లయ్య, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
ఆఫీసులోనే హవ్వ.. ప్రజాప్రతినిధి, ఉద్యోగిని సరసాలు
సాక్షి, బెంగళూరు: మంచి నడవడికతో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని దారి తప్పారు. ఆఫీసులోనే సరసాలకు దిగిన వైనాన్ని సీసీ కెమెరాలు బట్టబయలు చేశాయి. వారి ప్రేమపురాణం చూసి అందరూ హవ్వ అని నివ్వెరపోయారు. వివరాలు.. తుమకూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన మాదుస్వామి స్వగ్రామమైన చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ ఆఫీసులో ఈ తతంగం జరిగింది. మహిళా ఉద్యోగినితో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ప్రేమాయణం నెరుపుతున్నాడు. ఆఫీసులో ఇతరులు లేని సమయంలో ముద్దుమురిపాలకు దిగారు. అయితే అక్కడే సీసీ కెమెరాలున్నసంగతిని వారు మరిచిపోయారు. ఎవరో సీసీ ఫుటేజీలను చూసి లీక్ చేయడంతో అంతటా వ్యాప్తి చెందాయి. ఫుటేజీపై ఉన్న తేదీలను బట్టి మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. -
ఉస్మానియాలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం
అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్పేషెంట్ బ్లాకు, ఆర్ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. (చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!) -
ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీకి వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విధులకు గైర్హాజరయినా ప్రతి నెలా ఠంచనుగా వేతనం ఖాతాలో వేశారు. పేకాటలో దొరికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... చర్యలు తీసుకోకుండా అండగా నిలుస్తున్నారు. సగటు ఉద్యోగి ఏ చిన్న తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు... బాలాజీకి అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్కు డుమ్మా కొట్టి హాజరుతో సంబంధం లేకుండా జీతం.. వయోజన విద్య పెనుకొండ డివిజన్ సూపర్వైజర్గా పనిచేసే బాలాజీ డిప్యుటేషన్పై ఆరేళ్ల క్రితం బాలకృష్ణ పీఏగా నియమితులయ్యారు. అయినప్పటికీ అతను ప్రతి నెలా బాలకృష్ణ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు హాజరుపట్టిక, టూర్గైడ్ను విధిగా వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. కానీ రెండేళ్లుగా టూర్గైడ్, హాజరు పట్టిక పంపకపోయినా వయోజన విద్యాశాఖ అధికారులు ప్రతి నెలా బాలాజీకి జీతం మంజూరు చేశారు. పేకాట ఆడినా చర్యలు శూన్యం.. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ బాలాజీ టీడీపీ నాయకుడిలా వ్యవహరించేవారు. టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ పంపేవాడు. అయినప్పటికీ అతనిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 20న గౌరీబిదనూరులో పేకాట ఆడుతూ పట్టుబడగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండ్కు పంపగా.. అతను బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ... బాలాజీని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ వయోజన విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ పీఏగా రిలీవ్ చేసి వయోజన విద్యాశాఖకు సరెండర్ చేశారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు బాలాజీని సస్పెండ్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భోజనం చేస్తుంటే కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారని... పేకాట ఆడలేదని తప్పుడు నివేదికను వయోజన విద్యాశాఖ డైరెక్టర్కు పంపి.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, మభ్యపెట్టి చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వయోజన విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. -
నిర్లక్ష్యం చేస్తే ఎండలో నిలబెడతా: వనపర్తి కలెక్టర్
సాక్షి,వనపర్తి: ‘ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేసిన అధికారులను ఎండలో నిలబెట్టేందుకు వెనుకాడబోం..’ అంటూ కలెక్టర్ షేక్యాస్మిబాషా మండిపడ్డారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ‘ప్రజావాణి’లో అడిషనల్ కలెక్టర్ ఆశిష్సంగ్వాన్తో కలిసి ఆమె మొత్తం 20అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే సమస్యపై అర్జీదారులు రెండోసారి రాకుండా పరిష్కరించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఉదయం 11 గంటలలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. హెచ్హెచ్పీపై కలెక్టర్ ఆగ్రహం వేరే వారి విద్యుత్ లైన్ను తమ పొలంలో వేయటంతో ఇటీవల షార్ట్ సర్క్యూట్ అయిందని కలెక్టర్కు గోపాల్పేట మండలం ధర్మాతండాకు చెందిన నార్యానాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది ఎకరాల్లోని మామిడితోటలో కొన్ని చెట్లు కాలిపోయాయన్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. విద్యుత్ అధికారులను ఎప్పుడు అడిగినా.. ‘కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉందంటూ..’ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు చెప్పారు. కలెక్టరేట్ నుంచి ఎవరు ఒత్తిడి తెచ్చారని గట్టిగా అడిగితే ధరణి ఆపరేటర్ (హ్యాండ్ హోల్డింగ్ పర్సన్) అనడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను ఎవరికీ ఫోన్ చేయలేదని హెచ్హెచ్పీ చెప్పుకొచ్చారు. ఇక జిల్లా కేంద్రంలో 8సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. కొందరు నాయకులు ఉపాధ్యాయ భవన్ స్థలంలో షాపులు నిర్మించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. ∙ -
ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, ఐఏఎస్ అధికారి జి.వీరపాండియన్లకు హైకోర్టు ఒక్కొక్కరికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అరుణ్కుమార్, వీరపాండియన్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావడంతో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా శిక్ష, జరిమానా అమలును ఆరువారాలు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించే సమయానికి పూనం మాలకొండయ్య హాజరుగాకపోవడంతో ఆమెకు విధించిన శిక్షను నిలుపుదల చేయలేదు. మే 13వ తేదీలోపు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు లొంగిపోవాలని పూనం మాలకొండయ్యను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై పూనం మాలకొండయ్య అత్యవసరంగా సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును తదుపరి విచారణ వరకు నిలుపుదల చేసింది. కర్నూలు జిల్లా సెలక్షన్ కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలుచేస్తూ ఎన్.ఎం.ఎస్.గౌడ్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గౌడ్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్ను జస్టిస్ దేవానంద్ విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసిన తరువాతనే కోర్టు ఆదేశాలను అమలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలుచేసే పరిస్థితి లేకపోతే, గడువు పెంచాలని కోరుతూ అఫిడవిట్ వేయవచ్చని, అధికారులు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలుచేసే సదుద్దేశం అధికారుల్లో కనిపించడం లేదన్నారు. అధికారులది ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనంటూ ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
వీఆర్ఏలు ఇక ఊళ్లకు
సాక్షి, నెట్వర్క్: ‘కారు కడుగుడు, బట్టలు ఉతుకుడు’శీర్షికన వీఆర్ఏల బానిస బతుకులపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం ఉన్నతస్థాయి యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక వీఆర్ఏలకు సర్వీస్ రూల్స్, డ్యూటీ చార్ట్ లేకపోవటంతో ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు ఆడ, మగ తేడా లేకుండా వీఆర్ఏలకు ఆర్డర్లీ పనులు చెబుతున్న తీరును ఫొటోలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో పలు జిల్లాల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీఆర్ఏలు ఎవరినీ రెవెన్యూయేతర పనుల్లో ఉపయోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రా ల్లో అనధికార విధుల్లో కొనసాగుతున్న వీఆర్ఏలు శుక్రవారం నుండి తమ సొంత గ్రామాల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిర్మల్, జగిత్యాల, నాగర్కర్నూల్ తదితర జిల్లాల అధికారుల నుంచి ఈ మేరకు ఆదేశాలు వీఆర్ఏలకు అందినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వీఆర్ఏ, వీఆర్వోలు సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం హాజరుకావాలని ఆదేశిస్తూ నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. మాజీ వీఆర్వో, వీఆర్ఏలు కార్యాలయాల్లో సమయపాలన పాటించాలని, మాన్యువల్ రిజిస్టర్ను నిర్వహిం చాలని సూచించారు. మరికొందరిని జిల్లాలోని ప్రభుత్వ ఇసుక వాహనం, ఇసుక రీచుల వద్ద విధులు నిర్వర్తించేలా సమన్వయం చేసుకోవా లని ఆర్డీవో, తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. తాజా ఆదేశాలతో జిల్లాలో ఇలా ఆర్డర్లీ పనులు చేస్తున్న వీఆర్ఏల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘సాక్షి’కి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యలు చెప్పుకుంటాం.. సమయం ఇవ్వండి తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గానూ తమ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్లు ఈ మేరకు తాము పంపిన విజ్ఞాపన పత్రాన్ని పత్రికలకు విడుదల చేశారు. -
ఇప్పుడే ‘ఎన్నికల’ బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా పోలీసుశాఖలో బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా అధికారుల ప్రొఫైల్స్ను ఇంటెలిజెన్స్ విభాగం వడపోస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇటు నేతలకు ఇబ్బందిలేకుండా, అటు ఎన్నికల కోడ్ సందర్భంగా ఈసీ వేటు పడకుండా ఉండేలా అధికారుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండేళ్లపాటు వారిని కదిపే అవసరం రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ చీఫ్ చాలా ముఖ్యమైన అధికారి. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతల కదలికలు వంటి విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో వారే కీలకం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ చీఫ్ను మా ర్చాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత అధికారిస్థానంలో రాజధానిలోని కీలక కమిషనరేట్కు బా«ధ్యులుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ను నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ కమిషనర్ల మార్పు కూడా.. కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట సహా కీలకచోట్ల పోలీస్ కమిషనర్లను మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. పదోన్నతులు పొందడం, లాంగ్ స్టాండింగ్, వివాదాస్పద అంశాలు వంటి కారణాల రీత్యా సంబంధిత అధికారులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, గద్వాల ఎస్పీలతోపాటు వరం గల్, పెద్దపల్లిలోని డీసీపీలను మార్చనున్నట్టు తెలిసింది. ఆయా కమిషనరేట్లలో శాంతిభద్రతల విభాగంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులను మార్చే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అటాచ్డ్ అధికారులకు జూన్లో.. రాష్ట్రంలో 20 మందికిపైగా పదోన్నతి పొంది వెయిటింగ్, అటాచ్మెంట్, లుక్ ఆఫ్టర్ ఆదేశాలతో ఉన్న ఐపీఎస్ అధికారులకు జూన్ తొలి వారంలో పోస్టిం గ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జోన్లు, అదనపు సీపీలు, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీ, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖ తదతర విభాగాల అధికారులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. వీరిలో కొందరిని కమిషనర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇన్స్పెక్టర్లకూ సిఫార్సులు! జిల్లాలతోపాటు కమిషనరేట్లలో పనిచేస్తున్న ఎస్హెచ్వోలు (ఇన్స్పెక్టర్లు), సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ లు సైతం ఎన్నికలే లక్ష్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్లను ఇప్పటినుంచే ఎంచుకుని పోస్టింగ్ ఇప్పించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇలా సిఫార్సుల కోసం ఇతర జిల్లా లేదా ఇతర రేంజ్ పరిధిలో పనిచేసిన వారిని ఎంచుకోవాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఎలక్షన్ కమిషన్ కొందరు అధికారులను బదిలీ చేసింది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. స్థానికత, వివాదాలు, పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫార్సులు చేయాలని సూచనలు వచ్చినట్టు సమాచారం. వచ్చే నెలాఖరు నాటికి కసరత్తు పూర్తిచేసి జూన్లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత రాష్ట్రంలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు భారీగా ఉంటాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆరు నెలలుగా బదిలీ కోసం నేతల చుట్టూ తిరుగుతున్న డీఎస్పీ/ఏసీపీలకు జూన్ మొదటివారంలో మోక్షం కలుగుతుందని తెలిసింది. డీఎస్పీ పోస్టింగ్ విష యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పోలీస్శాఖలో చర్చ జరుగు తోంది. ఆయా జిల్లాల్లో ఎక్కువకాలం పనిచేయనివారు, వివాదాలు లేని అధికారులకే సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పోస్టింగ్ల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సులపై ఇంటెలిజెన్స్లో అధికారులు పరిశీలన చేస్తారని, సంబంధిత అధికారి పూర్తి ప్రొఫైల్ను పరిశీలించాకే పోస్టింగ్కు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. -
బోడుప్పల్ అంటే.. బాబోయ్ మాకొద్దంటున్న అధికారులు!
సాక్షి,బోడుప్పల్(హైదరాబాద్): బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గత కొంత కాలంగా అధికారులు లేకుండా పాలన కొనసాగుతుంది. ఇక్కడ పని చేసే అధికారులు కొంత మంది ఇష్టం లేక వెళ్లి పోవడం, మరి కొంత మంది సెలవులపై వెళ్లడంతో కిందస్థాయి సిబ్బందిచే పాలన కొనసాగిస్తున్నారు. అధికారులపై విపరీతమైన ఒత్తిడి, పనిభారంతో పాటు వేధింపులు ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ఏ అధికారి ఇష్ట పడడం లేదు. దీంతో ఇప్పటికే కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మేనేజర్, హరితహారం ఇన్చార్జ్ లేకుండానే తూతూ మంత్రంగా పాలన కొనసాగిస్తున్నారు. పాలనాధ్యక్షుడైన మేయర్కు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్కు ప్రజా పాలనపై పట్టు లేకపోవడం, ఇతర విషయాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించిపోతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్పై పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకపోగా, మరి కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. కమిషనర్ కూడా సెలవులపై వెళ్లడంతో నగర పాలక సంస్థలో పాలన అటకెక్కింది. సమన్వయ లోపం కారణమా? ► బోడుప్పల్ కమిషనర్, మేయర్కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో గత కొంత కాలంగా వారు ఎడ,పెడ మొఖంగా ఉన్నారు. దీంతో పాటు పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సెలవులపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ పదవీకాలం ముగిసింది. అనంతరం ఆయననే మళ్లీ అవుట్ సోర్సింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా తీసుకున్నారు. ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత ఇక్కడ చేయలేనని వెళ్లిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొంది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్లో అవార్డులు పొందిన బోడుప్పల్ నేడు చెత్త విషయంలో మురికి కూపంగా మారింది. ఇక్కడ పని చేసిన మేనేజర్ మరో చోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆర్ఓను ఇన్చార్జ్ మేనేజర్గా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా వస్తారు.. అలా వెళ్తారు.. ► మున్సిపాలిటీకి కీలకమైన విభాగం టౌన్ప్లానింగ్. ఇక్కడ గతంలో నల్గొండలో పనిచేసే ఓ ఏసీపీ అధికారి డిప్యూటేషన్పై మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు అక్కడ పని చేశారు. ఓ మంత్రి సహకారం మేయర్, కొంత మంది కార్పొరేటర్లు భవన నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆయన తన డిప్యూటేషన్ను రద్దు చేయించుకుని నల్గొండలోనే ఉండి పోయారు. ఆయన తరువాత మరో టీపీఓ డిప్యూటేషన్పై వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఇమడ లేక వెళ్లిపోయారు. ప్రస్తుతం అధికారి లేకుండానే టౌన్ ప్లానింగ్ విభాగం కొనసాగుతోంది. కిందిస్థాయి అధికారులతోనే.. ► ప్రతి సంవత్సరం హరితహారం కోసం బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ, మొక్కల పంపిణీ, పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పెరటి తోటల పంపకం, మొక్కలకు నీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, నిర్వహణ కోసం పదవీ విరమణ పొందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ను నెలకు రూ. 50 వేలు ఇచ్చి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన సదరు అధికారి సైతం పని చేయలేమని వెళ్లిపోయారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే అందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగం మినహా ఇస్తే మిగతా విభాగాలు కింద స్థాయి అధికారులు, సిబ్బందిచే నడుపుతున్నారు. దీంతో పాలన అంతా స్తంభించి పోయి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్సింగ్.. వైరల్ -
ప్చ్.. వీళ్లింతే.!
ఆహార తనిఖీ ప్రత్యేక బృందం తమ తనిఖీలింతేనని మరోసారి చాటుకుంది. మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక బృందం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంది. ఇప్పటికే జిల్లాలో సదరు విభాగం ఖాళీలతో కునారిల్లుతుండగా.. ప్రత్యేక తనిఖీ బృందం నామమాత్రంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయగా జిల్లాలో జరిగిన తనిఖీలు మాత్రం తూతూమంత్రంగా ముగించడం విడ్డూరం. మీడియాకు సమాచారమివ్వకుండా మొత్తానికి అయ్యిందనిపించారు. – కరీంనగర్ అర్బన్ మొక్కుబడిగా శాంపిళ్ల సేకరణ ఆయిల్ ట్రేడర్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలు, కేఫ్లు, కూల్డ్రింక్ షాపులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర నిత్యావసర సరుకుల కల్తీకి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. కానీ.. జిల్లా కేంద్రంలో జరిగిన తనిఖీలు మాత్రం నవ్విపోదురు గాక.. అన్నట్లు సాగింది. ప్రత్యేక బృందం మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వాహనంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు వాహనం జాడే లేకపోవడం విచిత్రం. మొక్కుబడిగా పలు దుకాణాలను తనిఖీ చేసినట్లు చేసి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. 15 రోజుల అనంతరం సదరు ఫలితాలు రానుండగా అప్పుడు కేసులు నమోదు చేయనున్నారు. కల్తీరాయుళ్ల వైపు కన్నెత్తని అధికారులు కాగా.. తనిఖీలు ఒకరిద్దరి కనుసన్నలో సాగినట్లు తెలుస్తోంది. ప్రకాశంగంజ్లోని పలువురు వ్యాపారులు, బొమ్మకల్, తీగలగుట్టపల్లి, అల్గునూరు, కోతిరాంపూర్, పద్మనగర్, విద్యానగర్, రేకుర్తి పలు ప్రాంతాల్లో కల్తీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. సన్ఫ్లయిర్ ఆయిల్కు కొరత ఏర్పడటంతో పెద్ద ఎత్తున సూపరోలిన్ ఆయిల్ కలుపుతున్నారు. లీటరు నూనెపై అదనంగా రూ.70–80 వరకు లాభం పొందుతున్నారు. ఇంత జరుగుతుంటే ప్రత్యేక టీమ్ మాత్రం తనిఖీలు చేశామన్నట్లు చేసి చేతులు దులుపుకున్నారు. సూపరోలిన్ ఆయిల్ అంటే పామాయిల్ బ్లెండింగ్ చేసి పామోలిన్ తయారు చేస్తారు. దీన్ని మరింత రిఫైన్ చేస్తే సూపరోలిన్ ఆ యిల్ వస్తుంది. ఇది చూడ్డానికి వాటర్ లాగే ఉంటుంది. సన్ఫ్లవర్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. పైగా అందులో కలిపినా ఎం తేడా కనిపించదు. విజృంభిస్తున్న కల్తీ మాఫియా శివారు ప్రాంతాల్లో గోడౌన్లను కేంద్రంగా చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. పామాయిల్, తవుడు నూనెలను కలుపుతూ వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేయడంలేదు. జిల్లా కేంద్రం జనాభా 3 లక్షలకు పైమాటే. జిల్లా జనాభా 10 లక్షలు కాగా.. ఆహార తనిఖీలో అన్ని పోస్టులూ ఖాళీగా ఉండటం ఆందోళనకర పరిణామం. అసలు తనిఖీలే లేవ్ ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెలలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ► గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యముంటుంది. ► ఆరు నెలలుగా అధికారే లేక కార్యాలయం వెలవెలబోతోంది. ► ఉన్న పోస్టులన్నీ ఖాళీయే కాగా ఇన్చార్జి అధికారితో నెట్టుకొస్తున్నారు. ► ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక క్లర్క్, ఇద్దరు అటెండర్లు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంది. ► అయితే 1985లో అప్పటి జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయగా నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికి అదే విధానం కొనసాగడం విడ్డూరం. పోనీ అప్పటి మంజూరు పోస్టుల ప్రకారం అధికారులూ లేరు ► దీంతో ఆహార తనిఖీ ప్రక్రియ అటకెక్కడంతో కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో రాజ్యమేలుతోంది. ► ఇన్చార్జి పాలనతో ఎప్పుడొస్తారో.. ఎప్పుడుంటారో తెలియని పరిస్థితి. ► ఫిర్యాదు చేసినా ఆహార తనిఖీ అధికారులు పట్టించుకోని క్రమంలో రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ నంబర్ 9100105795 చదవండి: మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో.. -
మధురై జైల్లో మాయ.. అసలేం జరిగిందంటే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై సెంట్రల్ జైల్లో చోటుచేసుకున్న భారీ గోల్మాల్ బట్టబయలైంది. ఖైదీల కష్టాన్ని కొందరు అధికారులు కూడబలుక్కుని కాజేశారు. బూటకపు లెక్కలు చూపి, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి రూ.100 కోట్లను స్వాహా చేసినట్లు తేలడంతో ప్రభుత్వ గణాంకాల విభాగం విచారణ చేపట్టింది. డాక్యుమెంట్ల పునఃపరిశీన మొదలు కావడంతో జైలు అధికారుల్లో గుబులు మొదలైంది. నేపథ్యం ఇదీ.. మధురై సెంట్రల్ జైల్లో వెయ్యిమందికి పైగా శిక్ష, విచారణ ఖైదీలున్నారు. ఖైదీల ప్రయోజనాల కోసం వైద్యపరమైన బ్యాండేజ్, ఫైళ్ల తయారీ సహా పలు వృత్తులకు ఖైదీలతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తున్నాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, న్యాయస్థానాలకు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు రాసి రూ.100 కోట్లు కాజేసినట్లు గత ఏడాది ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. 2016–21 మధ్య కాలంలో ఈ కుంభకోణం చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా 2019 జూన్ నుంచి 2021 జూన్ మధ్యకాలంలో మాత్రమే రూ.30 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆడిట్ కూడా జరగడంతో ఈ గోల్మాల్లో ఉన్నతాధికారులకు కూడా వాటా వెళ్లినట్లు తెలుసుకున్నారు. 2019 జూలైలో జైలు నుంచి రెండు సైజుల్లో పదివేల కాగితపు కవర్లు, 250 ఫైళ్లు పొందినట్లు మ«ధురై జిల్లా కోర్టుల్లో రికార్డుల్లో నమోదై ఉంది. అయితే జైలు రికార్డుల్లో మాత్రం రెండు లక్షల కవర్లు సరఫరా చేసినట్లు ఉంది. ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు భారీఎత్తున ఉత్పత్తులను సరఫరా చేసినట్లు బూటకపు లెక్కలు రాసుకున్నట్లు గణాంకాల విభాగం అధికారులు గత ఏడాది జరిపిన విచారణలో గుర్తించారు. దీంతో కంగారుపడిన జైలు అధికారులు జైల్లోని రికార్డుల్లో లెక్కలను తారుమారు చేస్తూ.. ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ అవినీతి వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించాల్సిందిగా ఖైదీల హక్కుల సంఘం సంచాలకులు పుహళేంది మద్రాసు హైకోర్టులో గత ఏడాది నవంబర్లో ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్) వేశారు. అయితే తగిన ఆ«ధారాలు లేకుండా పిల్ను స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. మధురై సెంట్రల్ జైల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు సమాచార హక్కుచట్టం కింద డాక్యుమెంట్లు పొందినట్లు పిటిషనర్ కోర్టుకు చెప్పుకున్నారు. పూర్తి ఆధారాలతో కొత్తగా మరో పిల్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ పిటిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు సవివరమైన ఆధారాలతో పుహళేంది మరోసారి పిల్ వేశారు. ఈ కుంభకోణంలో అప్పటి మధురై జైలు సూపరింటెండెంట్, డీఐజీల పాత్ర ఉన్నందున రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, జైళ్లశాఖ డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్లో పేర్కొన్నారు. ఈ కారణం చేత ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ పిల్ను ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి భరత చక్రవర్తితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా పిటిషనర్కు సూచించింది. తాము జారీ చేసిన ఉత్తర్వులు ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని కూడా తమ ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ముమ్మరంగా పరిశీలన ఫోర్జరీకి గురైన డాక్యుమెంట్లను గణాంకాల విభాగం అధికారులు జవహర్, శ్రీధర్ తదితరులు మధురై జైల్లో తిష్టవేసి పునఃపరిశీలన చేస్తున్నారు. గోల్మాల్ను కప్పిపుచ్చుకునేందుకు డాక్యుమెంట్లలో దిద్దుడుకు పాల్పడిన విషయం పునఃపరిశీలనలో తేలింది. ఏ మూల నుంచి ఎలాంటి ముప్పు మూడుతుందోనని జైలు అధికారులు కంగారుపడుతున్నారు. -
20 రోజులు.. 22 లక్షలు వృధా.. ఇలా కూడా పని చేస్తారా!
గత ఆరేళ్లుగా వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడి చివరకు వారి సమస్యలను హైదరాబాద్ ఎంపీకి విన్నవించగా ఆయన చొరవతో డ్రైనేజీ పైప్లైన్ను నిర్మించారు. కానీ పూర్తయిన 20 రోజులకే దాన్ని తొలగించి నూతనంగా బాక్స్ టైప్ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతో 20 రోజుల కోసం లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,రాజేంద్రనగర్(హైదరాబాద్): ఫోర్ట్వ్యూ కాలనీ గూండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు, డ్రైనేజీ నీటి కోసం జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు రూ.7.40కోట్లతో బాక్స్ టైప్ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరద, డ్రైనేజీ నీటి కారణంగా కాలనీలోని దాదాపు 350 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చొరవతో.. ► గత ఆరేళ్లుగా సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ తిరిగారు. వర్షం కురిసిన ప్రతి సారి ఈ కాలనీలో డ్రైనేజీ, వరద నీరు చొచ్చుకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మూడు నెలల క్రితం ఈ సమస్యపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిసిన ఫోర్ట్వ్యూ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తమ సమస్యను వివరించారు. స్పందించిన ఆయన రూ. 22 లక్షలతో డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించగా 20 రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. ఎగువ నీటితోనే ఇబ్బంది.. ► కాలనీకి సంబంధించిన నీరు కాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరే ఈ బస్తీకి ప్రధాన సమస్యగా మారింది. ఈ పైపులైన్ నిర్మించి 20 రోజులు పూర్తి కావస్తున్న సమయంలో ప్రాజెక్టు అధికారులు పైపులైన్ను తొలగించి డ్రైయిన్ బాక్స్ కాలువను నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయంతో.. ► ఫోర్ట్వ్యూ కాలనీ రహదారులు 40 అడుగుల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం ఓ పక్క నుంచి డ్రైనేజీ పైపులైన్ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డ్రైనేజీ పైపులైన్ ఓ వైపు నుంచే బాక్స్ టైప్ డ్రైనేజీ బాక్స్ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 5 అడుగుల డ్రైయిన్ బాక్స్ కోసం స్థలం ఉందని అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రజాధనం వృధా అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పైపులైన్ పక్కనుంచే బాక్స్ టైప్ డ్రైనేజీని నిర్మించాలని వారు కోరుతున్నారు. సమస్య తిరిగి పునరావృతం.. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ పంత్తో పాటు అధికారులందరిని కలిసి సమస్యను వివరిస్తున్నాం. ప్రస్తుతం నిర్మించిన డ్రైనేజీ పైపులై¯Œ ను తొలగించకుండా బాక్స్ టైప్ నాలాను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా వినతిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పైపులైన్ను తొలగిస్తే సమస్య తిరిగి పునరావృతం అవుతుంది. – ఫోర్ట్వ్యూ కాలనీ అధ్యక్షుడు షాహేద్ పీర్ రూ.22 లక్షల ప్రజాధనం వృధా.. కాలనీలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దక్షిణ మండల జోనల్ కమిషనర్తో పాటు స్థానిక జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో రూ. 22 లక్షల ప్రజాధనం వృధా అవుతుంది. ఉన్నతాధి కారులు ఈ విషయంలో వెంటనే స్పందించాలి. – సుజాత్ఖాన్, ఫోర్ట్వ్యూ కాలనీ -
అధికారుల ఓవరాక్షన్.. ఇంటి పన్న కట్టలేదని తలుపులు, కుర్చీలు తీసుకెళ్లి..
సాక్షి,మేడిపల్లి(హైదరాబాద్): ఇంటి పన్ను కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ వీధి నంబరు–8లోని మురళి అపార్టుమెంట్లోని ఓ ప్లాట్లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు. సదరు ప్లాట్ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయమై ప్లాట్ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్ట లేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్ కలెక్టర్లు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణారావు, పీర్జాదిగూడ కమిషనర్ చదవండి: Hyderabad: డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా అధికారులు.. ఇదేం తీరు..! -
జరిగిందంతా తూచ్.. ఈ కేసు కథ కంచికి చేరినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రెవెన్యూశాఖను కుదిపేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాల కేసు అటకెక్కినట్లేనా? ఈ కేసులో సుమారు నెల రోజులపాటు విచారణ జరిపి సమర్పించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్లేనా? విచారణలో పలువురిపై చర్యలకు రాష్ట్రస్థాయి అధికారులు చేసిన సిఫారసులు ‘షోకాజ్’లతో సరిపుచ్చారా?... అంటే రెవెన్యూ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది. పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొందరు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. చెక్కుల పంపిణీ కోసం భారీగా వసూళ్లకు పాల్పడిన పలువురిపై సీరియస్గా స్పందించిన ఉన్నతాధికారులు మొదట చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికల ఆధారంగా షోకాజ్లు జారీ చేసి కీలక పోస్టుల నుంచి తప్పించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగా.. ఇవే కేసుల్లో తప్పించబడిన పలువురికి మళ్లీ పోస్టింగ్లు ఇస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. విజిలెన్స్ నివేదికలు అటకెక్కినట్లేనా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించడం, అర్హులనుంచి వసూళ్లకు పాల్పడ్డారన్న వివాదంలో రాష్ట్రవ్యాప్తంగా 55 మంది తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులుంటే.. ఉమ్మడి వరంగల్ నుంచి 16 మంది వరకు వివిధ స్థాయి అధికారులు ఉన్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన వాటికి బాధ్యులుగా అప్పటి తహసీల్దార్ రాజును, మరో ఇద్దరిని జనవరి 24న అక్కడి నుంచి తప్పించారు. పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయాలపైన ఇచ్చిన నివేదికల ప్రకారం అందరికీ షోకాజ్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇంకా విచారణ జరుగుతున్న సమయంలో పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేసిన రాజును రెండు నెలలైనా కాకముందే శాయంపేట తహసీల్దార్గా బదిలీ చేశారు. శాయంపేట తహసీల్దార్ కార్యాలయంపైనా స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారిస్తుండగా, అక్కడి తహసీల్దార్ పోరిక హరికృష్ణను బదిలీ చేయడం ఇప్పుడు రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లలో అదుపుతప్పిన అవినీతిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ స్వయంగా క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దింపారు. దీంతో ధర్మసాగర్, శాయంపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు పరకాల, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, మహబూబాబాద్, గూడూ రు, కేసముద్రం, మహబూబాబాద్ తదితర తహసీల్దారు కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ములుగులో రెవెన్యూ సిబ్బందికి తోడు కంప్యూటర్ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు దళారులు కలిసి అక్రమాలకు పాల్పడినట్లుగా 2021 డిసెంబర్లో నిఘావర్గాలు వెల్లడించిన నివేదిక ఆధారంగా జనవరిలో చర్యలు ప్రారంభించారు. ఇంకా విచారణ పూర్తికాకపోగా, మరికొందరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో చర్యల్లో భాగంగా లూప్లైన్లకు పంపిన వారికి మళ్లీ పోస్టింగ్లు ఇస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి అక్రమాల కథ కంచికి చేరినట్లేనన్న చర్చ జోరందుకుంది. -
బోరిస్ జాన్సన్ సన్నిహితుల రాజీనామా
లండన్: పార్టీగేట్ కుంభకోణం బ్రిటిన్ను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు సన్నిహితులైన నలుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు బోరిస్ జాన్సన్ వారితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పాలసీ చీఫ్ మునిరా మీర్జా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ రోసెన్ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రెటరీ మార్టిన్ రేనాల్డ్, కమ్యూనికేషన్ డైరెక్టర్ జాక్ డోయెల్ తాజాగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్(యూకే) అంతటా కఠినమైన ఆంక్షలు అమలవుతున్న సమయంలో ప్రధానమంత్రి అధికార నివాసమైన డౌనింగ్ స్ట్రీట్లో విచ్చలవిడిగా విందులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
బల్దియా విద్యుత్ విభాగంలో.. అవినీతి చీకట్లు
సాక్షి, హైదరాబాద్: వంద శాతం ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశామని, బల్దియాకు రూ.428 కోట్లు ఆదా అయిందని జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం గొప్పలు చెబుతోంది. కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం ఉన్నాయి. వందశాతం వెలుగులు రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. బల్దియాకు వివిధ మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదుల్లో విద్యుత్ దీపాలవే అధికం. అయినా విద్యుత్ ఇంజినీర్లు పనులు సరిగా చేయరు. చాలామంది రోజూ ఆఫీసుకు కూడా రారు. ఒక్కరోజు ఆఫీసుకొస్తే.. తిరిగి ఇళ్లకు వెళ్లేముందు నాలుగైదు ఫిర్యాదులకు సంబంధించిన ఫొటోలను తీసుకొని.. వారం మొత్తం ఆ పనుల్లో నిమగ్నమైనట్లు మాయ చేస్తారు. రోజూ అటెండెన్స్ ఉండదు. బయోమెట్రిక్ అసలే ఉండదు. వచ్చిన రోజే అన్ని సంతకాలూ చేసుకుంటారు. ఇదేమని అడిగే వారికి ‘ఫీల్డ్లో’ అనే సమాధానం రెడీగా ఉంటుంది. వారి పైస్థాయిలోని వారూ ఆమ్యామ్యాలతో పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. లంచాలతోనే ఎంట్రీ.. ►బల్దియాలో ప్రవేశించేందుకు మొదలయ్యే లంచాల పర్వం ఏటా కొనసాగింపులకు, ఇతరత్రా సందర్భాల్లో సాగుతుంది. సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని, చేయి తడిపితే పని ఈజీగా అవుతుంది. ఇది ఒకవైపు దృశ్యం కాగా, బల్దియాలో ఎల్ఈడీ పథకం నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు అనుకూలంగా వ్యవహరిస్తూ, వారికి మేలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ►ఈఈఎస్ఎల్ పేరుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా.. గ్రేటర్లో సబ్లీజుకు న డిపిస్తున్నట్లు సమాచారం. నిబంధనల మేరకు 98 శాతం వెలుగులుంటేనే వారికి బిల్లులు చెల్లించాలి. కానీ.. ఆ మేరకు వీధుల్లో వెలుగులు లేకున్నా ‘సిమ్యులేషన్ల’తో బురిడీ కొట్టిస్తారు. డ్యాష్బోర్డులో వెలుగుతున్నట్లు చూపిస్తారు. అందుకుగాను అందాల్సిన వారికి ముడుపులు ఆందుతాయనే ఆరోపణలున్నాయి. ►ఇటీవల మరో కొత్త ఎత్తుగడ నేర్చుకున్నారు. ఉన్న లైట్లన్నీ వెలగవు. 98 శాతంగా చూపేందుకు కనెక్టెడ్, ఆన్, ఆఫ్ల పేరిట.. ఆన్ అయిన వాటిల్లోని శాతాన్ని పరిగణనలోకి తీసుకొని నిధుల చెల్లింపులు జరిగేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ అన్ని లైట్లు కనెక్ట్ కాకున్నా పట్టించుకునే వారే లేరు. వాస్తవ పరిస్థితుల్ని బట్టి ఆటోమేటిక్గా ఆన్, ఆఫ్లు కావాల్సి ఉన్నా ఆ ప్రక్రియ సాగడం లేదు. పట్టపగలే వెలిగేవి.. రాత్రుళ్లు వెలగనివి ఎన్నో. ►ఎక్కడికక్కడ అవసరమైనన్ని డెడికేటెడ్ లాడర్స్ లేవు. విద్యుత్విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లు పనిచేయాల్సి ఉండగా, మెకానికల్, టెలికామ్ విభాగాల వారు కూడా విధులు నిర్వహించడం బల్దియాలోనే సాధ్యం. మెకానికల్ వారికి భారీ జీతాలు చెల్లించేందుకు ఆడిట్ విభాగం నిరాకరించినా.. కొనసాగిస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ►ఇక ఆయా ఉత్సవాలు.. తదితర సందర్భాల్లో ఏర్పాటు చేసే టెంపరరీ లైట్ల పేరిట మరో దందా. స్ట్రీట్లైట్ పోల్స్కే టెంపరరీ లైట్లు వేయాల్సిన అవసరం ఎందుకొస్తుందో అడిగే వారుండరు. టెండరులో పేర్కొన్న దానికంటే 60 శాతం లెస్గా వేసినా.. కాంట్రాక్టరు లాభపడుతున్నారంటే.. లైట్లు వేస్తారో , కాగితాల్లోనే చూపుతారో ఊహించుకోవచ్చు. కొన్ని విభాగాల్లోని వారు చేసే పనులే రూ.10లక్షల విలువ చేయకున్నా.. వేతనాల పేరిట ఏటా రూ.12 లక్షలకుపైగా చెల్లిస్తారు. ఇలా.. జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగంలో బయటకు కనిపించని చీకటి దృశ్యాలెన్నో! ఎన్నెన్నో!!. -
టూరిజం డే, అల్లూరి జయంతి.. ఛాన్స్ దొరికితే చాలు దోచేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటక శాఖ ఖజానాను ఖాళీ చేసే పనిలో టూరిజం రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నిమగ్నమైపోయింది. దొరికిందే తడవుగా.. ఏ చిన్న అవకాశం దొరికినా తమదైన శైలిలో దోపిడీకి తెరతీస్తున్నారు. టూరిజం సీఈవో నోటమాట పేరుతో నిధుల్ని తమ ఖాతాల్లోకి పంపించేసుకుంటున్నారు. టూరిజం డే.. అల్లూరి జయంతి.. కాదేదీ కాసుల వర్షానికి అనర్హం అన్న రీతిలో కలెక్టర్కు పంపించకుండానే బిల్లులతో ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. 2021 ఆగస్ట్ 27న వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో పర్యాటక దినోత్సవం నిర్వహించారు. వరల్డ్ టూరిజం డేకు గతంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు చేసేవారు. ప్రభుత్వం కూడా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈసారి కోవిడ్ కారణంగా ఇన్డోర్లోనే చేపట్టారు. కానీ.. ఏకంగా రూ.8 లక్షల వరకూ బిల్లులు పెట్టారు. కొందరు కళాకారులకు రూ.19 వేలు ఇచ్చి.. రూ.40 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నృత్య కళాకారులకు రూ.30 వేలు ఇచ్చి.. రూ.40 వేలు బిల్లు వేశారనీ.. మిగిలిన వారికీ అదేరీతిలో గోరంత ఇచ్చి.. కొండంత బిల్లు లాగేసుకున్నారనే విమర్శలొస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవానికి గతేడాది రూ.1.20 లక్షలు ఖర్చు చేయగా.. ఈసారి మాత్రం రూ.2.75 లక్షలు చేశారు. గతేడాది చేసిన మాదిరిగానే ఈసారీ నిర్వహించారు. కానీ.. ఒకే ఒక్క తేడా.. వర్షం పడుతుందని వాటర్ ప్రూఫ్ టెంట్ వేశారు. దానికే అదనంగా లాగేశారని కొందరు టూరిజం సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ.. టూరిజం ఖజానా ఖాళీ చేసేందుకు టూరిజం ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రెడీగా ఉంటున్నారని పర్యాటక శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిమాట చాలంట! ప్రతి జిల్లా పర్యాటక శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అకౌంట్ ఉంటుంది. దీనిని ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్యాటక అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. కానీ విశాఖ జిల్లాలో మాత్రం రెండేళ్ల క్రితం నుంచి వేరే అధికారి పర్యవేక్షణలో ఉంది. రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది ఇటీవల కొన్ని పనులకు సంబంధించి టూరిజం సీఈవో (నోటిమాట) ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఇటీవలే రూ. 1.50 లక్షలు వివిధ పనులకు డ్రా చేసుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖకు సంబంధించిన ప్రతి ప్రధాన బిల్లుని జిల్లా కలెక్టర్కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఫైల్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించకుండానే నడిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టూరిజం సీఈవో సత్యనారాయణని ప్రశ్నించగా.. ఈ బిల్లు విషయం తన దృష్టికి వచ్చిందనీ.. దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. -
నాన్కేడర్ నుంచి ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పోలీస్ శాఖలో నాన్కేడర్ ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులకు ఐపీఎస్ హోదా దక్కింది. 20 మంది అధికారులకు ఐపీఎస్ పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2007లో గ్రూ ప్–1లో డీఎస్పీలుగా చేరిన అధికారులతోపా టు ఎస్ఐగా కేరీర్ ప్రారంభించి నాన్కేడర్ ఎస్పీలుగా ఉన్న వారికీ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి కల్పించింది. రాష్ట్రానికి కేడర్ అలాట్మెంట్లో భాగంగా ఇచ్చిన ప్రమోషన్ కోటాలో ఖాళీగా ఉన్న 23 ఐపీఎస్ పోస్టులకు సంబంధించి ఈ నెల 11న సెలెక్షన్ కమిటీ స మావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి 23 మంది పేర్లను ప్రతిపాదించగా ముగ్గురిపై క్రమశిక్షణ చర్య లు పెండింగ్లో ఉండటంతో కమిటీ వారి పేర్లను పెండింగ్లో పెట్టింది. దీంతో మిగిలిన 20 మంది నాన్కేడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా పదోన్నతి కల్పిస్తూ ఆమోదముద్ర వేసింది. యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ ఈనెల 17న జాబితాను కేంద్ర సిబ్బంది, వ్యవహారాల విభాగంతోపాటు కేంద్ర హోంశాఖకు పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జాబితాను ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోన్నతి పొందిన అధికారులు 2016 సంవత్సరం జాబితాలో ఎన్.కోటిరెడ్డి, ఎల్.సుబ్బారాయుడు, కె.నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాస్రావు, టి.శ్రీనివాస్రావు, టి.అన్నపూర్ణ, పీవీ పద్మజ, జానకీ ధరావత్, 2017 జాబితాలో పి.యాదగిరి, 2018 కోటా కింద కేఆర్ నాగరాజు, ఎం.నారాయణ, 2019 జాబితాలో వి.తిరుపతి, ఎస్.రాజేంద్రప్రసాద్, డి.ఉదయ్కుమార్ రెడ్డి, కె.సురేష్కుమార్, 2020 జాబితాలో బి.అనురాధ, సి.అనసూయ, షేక్ సలీమా, ఆర్.గిరిధర్, సీహెచ్ ప్రవీణ్కుమార్ ఐపీఎస్ పదోన్నతి పొందారు. క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉండటం వల్ల జానకీ షర్మిల, వై.సాయిశేఖర్, వి.భాస్కర్రావు పదోన్నతి రాకుండా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇంటిగ్రెటి సర్టిఫికెట్ తీసుకొని యూపీఎస్సీకి సమర్పిస్తే వీరికి కూడా పదోన్నతులు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఐదేళ్ల పోరాటంతో ఫలితం.. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సీనియారిటీ జాబితా వివాదంతో కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి ఐదేళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ప్రతీ ఏటా ఖాళీల భర్తీకి హోంశాఖ ప్యానల్ నోటిఫికేషన్ ఇస్తూ వచ్చినా సీనియారిటీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పదోన్నతి ఆలస్యమైంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల చొరవతో ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లోనే సీనియారిటీ సమస్యను పరిష్కరించడంతో 2016 నుంచి పెండింగ్లో ఉన్న ప్యానల్ పదోన్నతులను యూపీఎస్సీ, కేంద్ర హోంశాఖ ఒకేసారి క్లియర్ చేశాయి. -
గుజరాత్ తీరంలో రూ.400 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్ తీరంలో సోమవారం భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్తో వెళ్తున్న పాకిస్తాన్కు ఫిషింగ్ బోటును గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ డిఫెన్స్ పిఆర్ఓ ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్తో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో.. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలో హెరాయిన్ను తరలిస్తున్నారని గుర్తించి అధికారులు వాటిని సీజ్ చేశారు. డ్రగ్స్ను తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పడవను గుజరాత్లోని కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చదవండి: 16 కిలోల బంగారు, అరకిలో వజ్రాలు చోరీ.. అనుమానాస్పద ప్రాంతంలో.. -
GHMC: హవ్వ.. ఇదేం పాలన?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని కోటిమందికి వివిధ రకాల సేవలందించాల్సిన బల్దియాలో ఉన్నతాధికారుల నిష్క్రియాపరత్వంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యుటేషన్ల నుంచి వివిధ అంశాల్లో పట్టింపు లేకపోవడంతో కొందరు ఆడింది ఆటగా సాగుతోంది. డిప్యుటేషన్లు ముగిసినా బల్దియా నుంచి వెళ్లని వారితోపాటు.. ఎవరు ఎక్కడ ఏంచేసినా చెల్లుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. బాధ్యతల వికేంద్రీకరణ పేరిట జోన్ల అధికారులకు పూర్తిస్థాయి అధికారాలివ్వడంతో అధికార వికేంద్రీకరణ బదులు అవినీతి వికేంద్రీకరణ జరుగుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో మహిళలను వేధించేవారి ఆగడాలకు అడ్డేలేకుండాపోయింది. జాయింట్ కమిషనర్ల పోస్టుల పేరిట కొందరిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారు. అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా మాతృశాఖకు వెళ్లకుండా.. పొడిగింపును కమిషనర్ అడ్డుకున్నా.. మరోమార్గంలో తిష్టవేసేందుకు కొందరు అధికారులు పావులు కదుపుతున్నారు. ఇలా.. చెబుతూపోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. కదలరు.. వదలరు.. ► ఇటీవల ఒకరి డిప్యుటేషన్ అయిదేళ్ల కాలం ముగిసిపోయింది. తిరిగి పొడిగింపునకు ప్రయత్నించారు. కమిషనర్ నిక్కచ్చిగానే ససేమిరా కాదన్నారు. కానీ.. మరో మార్గంలో జీహెచ్ఎంసీలోనే మరో విభాగం నుంచి సదరు అధికారి డిప్యుటేషన్ కోసం ఒక అడిషనల్ కమిషనర్, విభాగాధిపతి, మరికొందరు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారంటే ఏమనుకోవాలి? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. సదరు పోస్టులో మరొకరిని అప్పటికే ప్రభుత్వం నియమించడంతో ఆ అంకానికి తాత్కాలికంగా తెరపడినా.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ► మరో విభాగంలోని ఓ అధికారి అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. పై పెచ్చు పొడిగింపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. కేవలం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఫైల్ కదలదు. వీరు కదలరు. అయినా పట్టించుకున్నవారే లేరు. సారు.. చాలా బిజీ.. ► ఇక దోమల విభాగం తీరే ప్రత్యేకం. ఫాగింగ్ మెషిన్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మస్కూట్స్ పేరిట జరుగుతున్న దోపిడీకి అంతేలేకుండాపోయింది. ఈ విభాగంలో ‘కలెక్షన్’ చేసి పెట్టేవారికి రెండు జోన్ల బాధ్యతలు అప్పగిస్తుంటారనేది అంతా తెలిసిన విషయమే. ► ఇక జోనల్స్థాయిలోని అధికారులు జోన్లను తమ రాజ్యాలుగా భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవ కోసం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే.. వారు ఎవరికీ ఫోన్లు ఎత్తరు. ‘సారు చాలా బిజీ’ అనే అర్థంలో స్వీయ సందేశంతో ఆటోమేటిక్ మెసేజ్లు మాత్రం వెళ్తాయి. ► ఇక వీరి పర్యవేక్షణలో పనిచేసే వారు సైతం తామూ తక్కువేమీ తీసిపోలేదన్నట్లు..డిప్యూటీ కమిషనర్లయినా, వైద్యాధికారులైనా, ఇంజినీర్లయినా, మరొకరయినా సరే జోన్లు, సర్కిళ్లలో ఉండరు. ప్రజలెవరైనా తమ సమస్యల కోసం అక్కడకు వెళ్తే సీట్లలో ఉండరు. ఫీల్డ్ అంటారు. లేకుంటే హెడ్డాఫీసుకు వెళ్లారంటారు. కానీ ఎక్కడా ఉండరు. మరి ఎక్కడుంటారో తెలియదు. జోనల్ పెద్దసారుకు అనుకూలంగా ఉంటే చాలు.. ఎక్కడున్నా పనిచేసినట్లే. గదిలో కునుకు తీస్తున్నా బాగా పనిచేసినట్లే లెక్క. పైవారితో ‘లెక్క’ సరిగ్గా ఉంటే అంతా భేషే! ► వికేంద్రీకరణ పేరిట అధికారాలతోపాటు జీతాలు, బిల్లుల చెల్లింపులు, తదితరమైనవన్నీ జోన్లలోనే జరుగుతున్నాయి. పనుల తనిఖీలు, పర్యవేక్షణలు చేసే పెద్దసారుతో సవ్యంగా ఉంటే చాలు. ప్రధాన కార్యాలయం అలంకార ప్రాయం. బల్దియా బాస్ నామ్కే వాస్తే అన్న అభిప్రాయం బలంగా నెలకొంది. గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు.. ► కొంతకాలం క్రితం ఓ డిప్యూటీ కమిషనర్ మహిళలతో కలిసిన ఫొటోలు వైరల్ కావడంతో అతడికి స్థానచలనం కలిగించారు. డిప్యూటీ కమిషనర్ కాస్తా జాయింట్ కమిషనర్గా మారారు. అంతే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్.. మహిళా కంప్యూటర్ ఆపరేటర్ను వేధిస్తున్న విషయం తెలిసినా.. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. పైగా తప్పుచేసిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మేయర్ను కలిసి గోడు వెళ్లబోసుకుంటే కానీ విషయం బయటకు రాలేదు. ఏళ్లకేళ్లుగా పొడిగింపు.. ► బల్దియాలోకి ఒకసారి వస్తే.. పాతుకుపోతారనే ప్రచారం ఉంది. లక్ష డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు అవసరమని దాదాపు 250 మంది ఇంజినీర్లను ఔట్సోర్సింగ్పై తీసుకున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పది శాతం పనుల కోసం మళ్లీ అంతమంది పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో చాలామంది బల్దియాలోని వారికి ఏదో రకంగా దగ్గరివారే. అందుకే పని చేయకున్నా, పని లేకున్నా జీతం వస్తోంది. అలా ఏళ్లకేళ్లు పొడిగింపునిస్తుంటారు. ► కమిషనర్ స్వీయనిర్ణయాలు తీసుకోక, బల్దియాలో పాత కాపులైన ఒకరిద్దరు అధికారులు చెప్పిందే వేదమన్నట్లు నడుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సచివాలయం స్థాయిలోని ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రులకు వారు దగ్గరవడమే కారణమని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
తెలంగాణ: ఉద్యోగుల విభజనలో సీనియారిటీనే లెక్క
ఉద్యోగుల విభజనలో కీలక నిబంధనలివీ.. ► కొత్త జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లకు మంజూరు చేసిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయి. ► రాష్ట్రంలో వేర్వేరు ఉమ్మడి జిల్లాల్లోని ప్రాంతాలతో 8 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ జిల్లాల ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాలతోపాటు ప్రాంతాలు కలిసిన పొరుగు జిల్లాల్లో ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ► అవసరమైన ఉద్యోగుల (వర్కింగ్ స్ట్రెంత్) దామాషా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. ► దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వితంతువులకు ప్రాధాన్యత ►ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాకే భార్యాభర్తల (స్పౌజ్ కేటగిరీ) బదిలీలు చేపడతారు. ► ఏ ఉద్యోగిని ఎక్కడైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టం చేసింది. సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలు, జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులంతా.. కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత నమూనాలో తమ ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొంటూ.. సంబంధిశాఖ జిల్లాధిపతి (జిల్లా కేడర్), విభాగాధిపతి (జోనల్), శాఖ కార్యదర్శి (మల్టీ జోనల్)కు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా దరఖాస్తు చేసుకోకుంటే.. సంబంధిత అధికారులే నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తారని స్పష్టం చేసింది. ఎక్కడైనా పోస్టుల లభ్యతకు మించి ప్రాథమ్యాలు ఉంటే.. ఉద్యోగుల సీనియా రిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం.. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల కేడర్లను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా పునర్విభజిస్తూ ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’ను రాష్ట్రపతి జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోనల్ కేడర్లకు పోస్టుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్) విభజన ఇప్పటికే పూర్తయింది. వాటికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ప్రాథమ్యాలను పరిశీలించి కేటాయింపులు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ►పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లా/జోనల్/మల్లీ జోనల్ పోస్టుల సంఖ్యను విభజించారు. అదే నిష్పత్తిలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతి లోకల్ కేడర్కు వర్కింగ్ స్ట్రెంత్ను కేటాయించాయి. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల జాబితాలను శాఖల అధిపతులు రూపొందిస్తారు. కేటాయింపుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సెలవులు, సస్పెన్షన్, శిక్షణ, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. కేటాయింపుల అనంతరం వారు కొత్త లోకల్ కేడర్లలో సెలవులు, సస్పెన్షన్, డిప్యుటేషన్, శిక్షణ, ఫారిన్ సర్వీస్లో కొనసాగుతున్నట్టు పరిగణిస్తారు. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ఇలా.. ► ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో అన్నిపోస్టులకు.. సదరు ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులందరినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి కొత్త జిల్లాలు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రాంతాల కలయికతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి పాత జిల్లాల ఉద్యోగులకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలతోపాటు, ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతం కలిసిన కొత్త జిల్లాల్లోనూ అవకాశం కల్పిస్తారు. జోనల్ కేడర్ కేటాయింపులు ఇలా.. ► కొత్త జోనల్/మల్టీజోనల్ కేడర్లకు ఖరారైన ఉద్యోగుల సంఖ్యకు లోబడి.. పాత జోనల్ కేడర్లోని ఉద్యోగులందరినీ కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 1–4 జోన్లకు (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులు మినహాయించి), జోన్–5లోని జనగామ జిల్లాలో ఉన్న పోస్టుల్లో కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత జోన్–6 కేడర్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 5, 6, 7 జోన్లకు (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి), జోన్–2లోని నిజామాబాద్ జిల్లాకు, జోన్–3లోని కామారెడ్డి, మెదక్ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. మల్టీ జోన్ పోస్టులు ఇలా... ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–1 (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రాంతం మినహాయించి)కు, మల్టీజోన్–2లోని జనగామ జిల్లాలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 6వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–2 (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి)కు, మల్టీ జోన్–1లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► రాష్ట్రపతి పాత ఉత్తర్వులు వర్తించని కొన్ని పోస్టులను కొత్త ఉత్తర్వుల్లో మల్టీజోనల్ పోస్టులుగా విభజించారు. అలాంటి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులు, పాత మల్టీజోన్ కేడర్ ఉద్యోగులను ఏదైనా ఒక కొత్త మల్టీజోన్కు కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా.. కొన్ని ప్రత్యేక అంశాల మేరకు సీనియారిటీతో సంబంధం లేకుండా కొత్త లోకల్ కేడర్లకు కేటాయింపులు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీల కింద కేటాయింపు పొందడానికి ఉద్యోగులు తగిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ► 70శాతం, ఆపై వైకల్యంగల వారు, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతువులు ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తారు. ► మనోవైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పోస్టింగ్ ఇస్తారు. ► కేన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ/కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వారిని.. ఇదే క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ►ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్లో వారికి స్థానం కల్పిస్తారు. ► కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ► ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్లో వారికి స్థానం కల్పిస్తారు. ►కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. -
తిరుపతి, తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుపతిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులో వీస్తున్నాయి. తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో అధికారులు వాహన దారులను, స్థానికులను అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా పయనించి, గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, మధ్య చెన్నై సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం కుడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో.. భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం చిత్తూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నెల్లూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం పంపించామని తెలియజేశారు. శనివారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మౌలానా అబుల్ కలాం ఆజాద్కు సీఎం జగన్ నివాళి -
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపతినిధులకు మంత్రి కేటీఆర్ వార్నిగ్
-
దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..
డోన్ టౌన్: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పోచా ప్రభాకర్రెడ్డి క్లినిక్ ఎదురుగా ఉన్న సిండికేట్ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవీ చదవండి: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
అందీ అందకుండా... అమ్మా నాన్నా పిలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అమ్మా..నాన్నా.. అనేది ఓ మధురమైన పిలుపు. అలా పిలిపించుకునేందుకు ప్రతిఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ కొందరికి ఆ ఆశ నెరవేరడం లేదు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా అనేక జంటలు ఆ పిలుపునకు దూరం అవుతున్నాయి. పిల్లల కోసం తాపత్రయ పడుతూ ఆధునిక వైద్య విధానాలను అనుసరిస్తూ ప్రయత్నిస్తున్నా, కొందరికి ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలోనే అమ్మా, నాన్నలుగా అయ్యేందుకు, వృద్ధాప్యంలో అవసరమైన ఆసరా కోసం.. కొంద రు దత్తత బాట పడుతున్నారు. అయితే శిశు గృహ కేంద్రాల్లో పిల్లలు తక్కువగా ఉండటం, దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో పిల్లల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అమ్మా, నాన్నా అని పిలిపించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి ఈ పరిస్థితి ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో సులువుగా దత్తత దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించేందుకు గతంలో తక్కువ సమయం పట్టేదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతు న్న సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గతంలో జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులను బట్టి జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో ఉన్న పిల్లలను దత్తతకు ఇచ్చేవారు. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రాష్ట్రం యూనిట్గా దత్తత ప్రక్రియను ఆన్లైన్ చేసింది. ఇందుకోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్సు అథారిటీ (కారా), స్టేట్ అడాప్షన్ రిసోర్సు అథారిటీలను (సారా) ఏర్పాటు చేసింది. దత్తత తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సీరియల్ నంబర్ ప్రకారం, అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి అవకాశం ఇస్తారు. ఆరో గ్యవంతమైన పిల్లలను మాత్రమే దత్తతకు ఇస్తారు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమ యం పడుతోంది. ఈలోగా పిల్లలు పెద్ద వారు అవుతుండటంతో దత్తత తీసుకునేందుకు కొంతమంది నిరాకరిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. అబ్బాయే కావాలి.. దత్తత కోసం వచ్చే దరఖాస్తుల్లో అబ్బాయిలు కావాలనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో 122 మంది పిల్లలు ఉంటే.. 683 మంది జంటలు తమకు పిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులో అబ్బాయి కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 372 మంది కాగా.. అమ్మాయిలు కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 288 మంది ఉన్నారు. ఎవరైనా పర్వాలేదని అన్నవారు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు. తగ్గిపోతున్న పిల్లల సంఖ్య ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన చైతన్యం, ప్రభుత్వ నిబంధనల కారణంగా శిశు గృహ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. గతంలో అప్పుడే పుట్టిన బిడ్డను కూడా తీసుకునేవారు. వారికి డబ్బా పాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదు. కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో నిబంధనల్లో మార్పులు చేశారు. పుట్టిన బిడ్డను పోషించలేని పరిస్థితుల్లో దత్తత ఇద్దామనుకున్నప్పుడు, తల్లి బిడ్డకు మూడు నెలలపాటు పాలు ఇవ్వాలని, అప్పుడే బిడ్డను తీసుకుంటామనే నిబంధన విధించారు. దీంతో మూడు నెలలు పాలు ఇవ్వడం వల్ల బిడ్డపై ప్రేమ పెరిగిన కొందరు మనసు మార్చుకుంటున్నారు. వారిని శిశు గృహ కేంద్రాలకు ఇవ్వడం లేదు. ఇక మారుమూల అటవీ ప్రాంతాల్లో అనాగరికత కారణంగా పిల్లలను కన్నా.. సాకలేక, పోషించలేక వదిలేసే ఘటనలు గతంలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో వారిలో పెరిగిన అవగాహన, ప్రభుత్వాలు తీసుకువచ్చిన చైతన్యం కారణంగా శిశు గృహాలకు ఇచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. 25 మందిని అనాథలుగా చేసిన కరోనా.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 25 మంది పిల్లలు కరోనా కారణంగా అనాథలుగా మారా రు. కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయినవారు కొందరైతే, గతంలో వేరే కారణాలతో తల్లి లేదా తండ్రి చనిపోయి.. కరోనా సమయంలో మిగిలినవారు చనిపోవడంతో మరికొందరు అనాథలుగా మారారు. ఇలాంటి పిల్లలు నల్లగొండలో ఆరుగురు, నిజామాబాద్లో 9 మంది, ఖమ్మంలో 10 మంది, మెదక్ జిల్లాలో నలుగురు ఉన్నారు. అయితే వీరెవరూ శిశు గృహ కేంద్రాల్లో లేరు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో వారి బంధువుల ఇళ్లల్లోనే పెరుగుతున్నారు. వారి నిర్వహణ కోసం ఒక్కో శిశువుకు నెలకు రూ.2 వేల చొప్పున శిశు సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం అందిస్తోంది. పిల్లలు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఉన్న పిల్లల సంఖ్య కంటే వారికోసం వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో దత్తతిచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతోంది. గతంలో జిల్లా స్థాయిలోనే ఉండటం వల్ల త్వరగా ముగిసేది. ఇప్పుడు రాష్ట్రం యూనిట్గా ఆన్లైన్ కావడంతో ఆలస్యం అవుతోంది. – గణేశ్, బాలల పరిరక్షణ జిల్లా అధికారి, నల్లగొండ 18 నెలలు పట్టింది పాపను దత్తత తీసుకోవాలనుకుని ఆన్లైన్లో రిజిస్టర్ చేశాం. తర్వాత ప్రక్రియ అంతా ముగిసి పాపను తీసుకోవడానికి 18 నెలల సమయం పట్టింది. రెండేళ్ల లోపు పాప కావాలని అడిగాం. 5 నెలల శిశువును ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. – ఖమ్మం నగరానికి చెందిన ఓ జంట 15 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో మాకు వివాహమై 15 ఏళ్లు గడిచింది. అయినా పిల్లలు కాలేదు. దీంతో దత్తత తీసుకునేందుకు ‘కారా’లో దరఖాస్తు చేసుకున్నా. అదృçష్టంకొద్దీ అమ్మాయి లభించింది. పిల్లలు లేరనే బాధ తప్పింది. – శ్రీనివాస్, వరంగల్ మాకు ఏడాదిలో పాప లభించింది సంతానం లేకపోవడంతో 2015లో రెండేళ్ల లోపు పాప కావాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. ఏడాది సమయం తర్వాత ఐదు నెలల పాప లభించింది. – శ్రీనివాస్, సరస్వతి, నిజామాబాద్ -
బతికుండగానే చంపేశారు..
బెల్లంపల్లి(మంచిర్యాల): అధికారుల తప్పిదంతో మండల కేంద్రానికి చెందిన గజెల్లి భూదేవి అనే పండు వృద్ధురాలు పదినెలలుగా ఆసరా పింఛన్ దూరమైంది. ఏళ్లుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ పింఛన్పై ఆధారపడిన ఆమెకు ఆకస్మాత్తుగా పింఛన్ నిలిపివేశారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే.. రికార్డుల్లో నువ్వు చనిపోయావని ఉందని, అందుకే తొలగించామని అధికారులు పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక పది నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ ఆసరా కోసం అధికారుల కాళ్లావేళ్లా పడుతోంది. రెండుసార్లు కలెక్టర్ను కలిసినా ఫ లితం లేదని వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. దా దాపు 25 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా.. కుమార్తెలకు వివాహం చేసి పంపించింది. కుమారులు లేకపోవడంతో రూ.200 పింఛన్ ఉన్నప్పటి నుంచి వాటిపైనే ఆధారపడి ఒంటరిగా ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ పునరుద్ధరించడంతోపాటు పదినెలల నగదు ఇప్పించాలని వేడుకుంటుంది. దొంగిలించిన బైక్పైనే దర్జాగా చక్కర్లు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో బైక్ను దొంగలించి దానిపైనే చక్కర్లు కొడుతున్న దొంగల ఫొటోను మంచిర్యాల పోలీసులు సోషల్మీడియాలో పోస్టుచేయగా శుక్రవారం వైరల్గా మారాయి. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రామకృష్ణాపూర్కు చెందిన పులి సంతోష్ బైక్ను ఆగస్టు 31న జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర టాకీస్ వద్ద దొంగిలించారు. బైక్ యజమాని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బైక్ దొంగిలించిన వ్యక్తులను పట్టుకునేందుకు వారి ఫొటోను సోషల్మీడియాలో పోస్టు చేశారు. నిందితులను గుర్తు పట్టిన వారు 9440795042, 9440908844 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! -
పరిస్థితి ఆందోళనకరం.. వారిలో 75 శాతం రక్తహీనత
ములుగు(వరంగల్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో 75 శాతం మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్ సమస్య) ఉండడం ఆందోళనకరమని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, కలెక్టర్లతో ములుగు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ క్రిస్టియానా జñడ్ ఛోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పీహెచ్సీ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వెల్నెస్ సెంటర్, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణులకు 75శాతం హిమోగ్లోబిన్ సమస్య ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 2,309, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,348, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,897, ఖమ్మంలో 4,431 మంది తీవ్ర పోషణలోపానికి గురైన పిల్లలు ఉండడం బాధాకరమన్నారు. ఆయా ఐటీడీఏల పరిధిలో మూడు లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే మూడు నెలల్లో పరిస్థితిలో మార్పు రావాలని, ఐసీడీఎస్, వైద్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహా రాలను అందిస్తున్నా.. ఎక్కడ లోపం ఏర్పడుతుందో అర్థం కావడం లేదన్నారు. లక్షమంది చిన్నారులకు 84 మంది మృత్యువాత పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెల్నెస్ సెంటర్లలో పాముకాటు, కుక్కకాటు ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకుల ఏర్పాటు.. వచ్చే ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. కేరళ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ కిట్, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలను బలోపేతం చేశారన్నారు. కేరళలో ప్రతి గ్రామపంచాయతీలు పోటీపడి పోషకాహారాన్ని అందించడాన్ని గమనించి సీఎం కేసీఆర్కు నివేదిక అందించామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని 8 నెలలపాటు రెండో వంతు పోషకాహారాన్ని అందిస్తామన్నారు. విజయవంతం అయితే అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. 37శాతమే ముర్రుపాలు తాగిస్తున్నారు... రాష్ట్రంలో ప్రసవం అయ్యాక కేవలం 37శాతం మంది మాత్రమే పిల్లలకు ముర్రుపాలు తాగిస్తున్నారని, ఇది ఆందోళన కరమైన విషయమని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గిరి పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందిస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ గ్రోత్మానిటరింగ్ డ్రైవ్ ద్వారా తక్కువ బరువుతో, పౌష్టికాహార లోపంతో గుర్తించిన పిల్లలు ములుగు జిల్లాలో 16శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.5శాతం, ఖమ్మం జిల్లాలో 6.2శాతం ఉన్నారని తెలిపారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాడ్వాయి అంగన్వాడీ కేంద్రంలో 100శాతం చిన్నారులు సరైన బరువుతో ఆరోగ్యవంతంగా పెరిగేలా పౌష్టికాహారం అందించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్షి్మని అధికారులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనిరుధ్, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీఓలు గౌతమ్ పోత్రు, బ్రవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, భూపాలపల్లి అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య, పీహెచ్సీ వైద్యాధికారి నిఖిత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, భూపాలపల్లి సంక్షేమ అధికారి శామ్యూల్, డీఆర్డీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష -
ఆస్తి జానెడు.. పన్ను బారెడు
ఈ ఫొటోలోని మహిళ బుర్జుగడ్డతండా వాసి లక్ష్మి.. ఈమె ఇంటికి సంబంధించి గత ఏడాది రూ.899 ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది రూ.5,371 ఆస్తి పన్ను చెల్లించాలని ఐదు రోజుల కిందట పంచాయతీ నుంచి నోటీసులు వచ్చాయి. ఒకే సారి ఆస్తి పన్ను ఇష్టానుసారంగా పెంచితే ఎలా..? వ్యవసాయం చేసుకునే మేము ఇంత ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు.. రెండు తండాల్లోని అందరికీ ఎదురవుతోన్న సమస్య. అధికారుల అత్యుత్యాహం.. పాలకుల అనాలోచిత చర్యలతో తండా ప్రజలకు ఆస్తి పన్ను భారంగా మారింది. ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి ఐదు వంతులకు పెంచడంతో గిరిజనులు ఆందోళనకు చెందుతున్నారు. మండల పరిధిలోని పెద్దషాపూర్తండా పంచాయతీ, అనుబంధ గ్రామం బుర్జుగడ్డతండాలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులను భారీగా పెంచేశారు. గతేడాది రూ.5,32,264 ఉండగా.. ఈ ఏడాదికి రూ.9,01,351 డిమాండ్ నమోదు చేసి ఇంటి యజమానులకు వారం రోజుల నుంచి డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న స్థానికులు పన్ను మొత్తాన్ని చూసి షాక్ తింటున్నారు. పంచాయతీ పరిధిలోని రెండు తండాల్లో 312ఇళ్లు ఉండగా.. సుమారు 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో చాలా వరకు వ్యవసాయం, రోజూ కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది వరకు రూ.1000 ఉన్న ఆస్తి పన్ను ఇప్పుడు ఏకంగా రూ.5వేలు దాటిపోయింది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు వసూలు చేయరని, గిరిజన తండాల్లో రూ.వేలకు వేలు ఆస్తి పన్నులకు డిమాండ్ నోటీసులు పంపించడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్ను మదింపు విధానం ఆస్తి పన్ను మదింపును పంచాయతీ పాలక వర్గం తీర్మాణం మేరకు ధర నిర్ణయించాల్సి ఉంటుంది. ఖాళీ స్థలానికి చదరపు గజం, నిర్మాణానికి చదరపు అడుగుల మేరకు కొలతలు తీసుకుని పన్ను మదింపు చేయాలి. గజానికి రూ.1500 చొప్పున వంద గజాల ఖాళీ స్థలం విలువ రూ.1,50,000 అవుతుంది. ఇందులో ఆర్సీసీ ఇంటి నిర్మాణం ఉంటే 900 చదరపు అడుగుల విస్తీర్ణం అవుతుంది. దీంతో ఇంటి విలువ చదరపు అడుగుకు రూ.1250గా లెక్కిస్తే రూ.11,25,000గా నిర్ధారించాలి. ఖాళీ స్థలం, నిర్మాణం విలువలను కూడితే మొత్తం రూ.12,75,000 ఆస్థి విలువ అవుతుంది. దీనికి రూ.0.12 పైసల నుంచి ఒక రూపాయి వరకు ఆస్తి పన్ను మదింపు చేయవచ్చు. రూ.0.12 పైసలుగా వంద గజాల ఇంటికి ఆస్తి పన్ను రూ.1530లు కాగా.. దీనికి 8 శాతం గ్రంథాలయం ఫీజు రూ.122 జత చేసి ఆస్తి పన్ను మదింపు చేపట్టాలి. ఏళ్ల నాటి ఇళ్లకు కొత్తగా మదింపు కొత్తగా నిర్మించే ఇళ్లకు పైన సూచించిన విధంగా ఆస్తి పన్ను మదింపు చేయాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు గ్రామాల్లో ఆస్తి పన్ను తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రతి ఏటా ఐదు శాతం పెంచుతూ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం సుమారు 20ఏళ్ల కిందట నిర్మించిన ఇళ్లకు కొత్తగా అసెస్మెంట్ చేస్తూ ఆస్తి పన్ను మదింపు చేశారు. పైగా ఇటీవల నిర్మించిన ఇళ్ల కంటే కూడా ఏళ్ల నాటి ఇళ్లకు ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. చదవండి: Radhe Shyam Shooting: గండికోటలో ‘రాధేశ్యామ్’ షూటింగ్.. ఫోటోలు వైరల్ ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను.. -
ఏపీ పోలీస్ అధికారులకు కేంద్ర పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది. ఈ పురస్కారం దక్కిన వారిలో 15 మంది సీబీఐకి చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, కేరళ, రాజస్థాన్ నుంచి 9 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్ (10), తమిళనాడు (8), బిహార్ (7), తెలంగాణ (5), గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులుండటం విశేషం. -
నిధులు వెనక్కు పంపడం ఇష్టం లేక.. రూ.69 లక్షలు జేబుల్లోకి
సాక్షి, దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కరోనా కాలంలో తలుపులే తెరవని పాఠశాలో కంప్యూటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని రూ.69 లక్షలు గోల్మాల్ చేశారు. దేవనహళ్లి తాలూకా అణ్ణేశ్వర గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ స్కాం జరిగింది. రూ.69 లక్షలు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు కొనుగోలు చేసి జీపీ ఆఫీసుతో పాటు తమ పరిధిలోని పాఠశాలలకు ఏర్పాటు చేశామని అధికారులు లెక్కలు రాశారు. అయితే ఎక్కడా సీసీ కెమెరాలు, కంప్యూటర్లు కనిపించడంలేదు. పీడీఓ ఇనాందార్ను ఇదేమని ప్రశ్నిస్తే నిధులు వెనక్కు పంపించడం ఇష్టం లేకే లెక్కలు రాశామని సమర్థించుకుంటున్నారు. -
16వ నంబర్ గేట్ వద్ద సాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరమ్మతులు
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
జీఎస్టీ ఎగవేతదారులను పట్టేద్దాం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు దృష్టిసారించారు. సమాచార మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, ఆదాయ నష్టానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ(వాణిజ్యం, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నేతృత్వంలోని రాష్ట్ర అధికారులు, విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నరేష్ నేతృత్వంలోని కేంద్ర అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు తరుచూ సమావేశమవుతూ సమాచారం మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు రజత్భార్గవ చెప్పారు. ఇరు విభాగాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా జీఎస్టీ ఆదాయానికి నకిలీ ఇన్వాయిస్లతో భారీగా గండి కొడుతున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లయిమ్లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డీజీజీఐ, ఏపీఎస్డీఆర్ఐ వంటి వాటి సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని విశ్లేషించనున్నారు. సమావేశంలో రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, వైజాగ్ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్ పాల్గొన్నారు. -
అధికారుల పై సీఎం వైఎస్ జగన్ సీరియస్
-
అధికారుల తీరుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్
-
వైద్యాధికారుల డెకాయ్ ఆపరేషన్.. ఆస్పత్రి యజమాని అరెస్ట్
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): కామారెడ్డిలోని శ్రీరామ్నగర్ కాలనీలో గల కౌసల్య ఆస్పత్రి యజమాని సిద్దిరాములును పోలీసులు గురువారం ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తుండగా, ఈ నెల 15న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యం లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన వైద్యశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 312, 420,23 ప్రకారం ఆస్పత్రిపై పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆస్పత్రి నిర్వాహకుడు నడిపి సిద్దిరాములును గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో మధుసూదన్ తెలిపారు. వైద్యఅర్హత, అనుమతులు లేకుండానే ఆస్పత్రి నిర్వహించడంతో పాటు అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నందుకు గాను అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
అధికారులను అనవసరంగా కోర్టులకు పిలవొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వాధికారులను కోర్టులకు పిలుస్తున్న కొన్ని హైకోర్టుల తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదని, అత్యంత తీవ్రమైన పదాలతో ఖండించాల్సిన అంశమని ఉద్ఘాటించింది. ప్రభుత్వాధికారులను అనవసరంగా కోర్టులకు పిలవవద్దని ఈ సందర్భంగా హితవు చెప్పింది. మేం పిలిచాం కనక ఆగమేఘాలపై రావాల్సిందే అన్నట్లు కొన్ని కోర్టులు వ్యవహరిస్తున్నాయని... తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిపై ఒత్తిడి తెస్తున్నాయని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఓ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని అలహాబాద్ హైకోర్టు ఆదేశించటంపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘అధికారులు తక్షణం హాజరు కావాలంటూ హుకుం జారీ చేయటం... తద్వారా వారిపై ఒత్తిడి పెంచటమనే ప్రక్రియ కొన్ని హైకోర్టులకు అలవాటైపోయింది. కొన్ని న్యాయస్థానాలు తమకు నచ్చినట్టుగా అధికారులు పనిచేయాలనే ఉద్దేశంతో వారిని ఒత్తిడి చేస్తున్నాయి. న్యాయవ్యవస్థకు– కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండే అధికారపు అధీన రేఖను దాటాలని చూస్తున్నాయి’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వారి విధులు వారికున్నాయ్... కార్యనిర్వాహక వ్యవస్థలోని ప్రభుత్వాధికారులు పాలనలో ప్రధాన భాగంగా వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘అధికారుల చర్యలైనా, నిర్ణయాలైనా వారి సొంత ప్రయోజనాల కోసం కాదు. ప్రజాధనానికి జవాబుదారు కనక వ్యవస్థ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఒకవేళ న్యాయసమీక్షలో అవి నిలబడవనుకుంటే ఆ నిర్ణయాలను కొట్టేసే పరిస్థితి హైకోర్టులకు ఎటూ ఉంటుంది. అంతేకానీ వాటికోసం అధికారులను పదేపదే పిలవటం హర్షణీయం కాదు. ఈ తీరును ఖండించి తీరాలి’’ అని బెంచ్ స్పష్టంచేసింది. జడ్జిలు తమ పరిధి తెలుసుకోవాలి... ఈ సందర్భంగా అరావళి గోల్ఫ్క్లబ్ వెర్సస్ చంద్రహాస్ మధ్య నడిచిన కేసును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘‘న్యాయమూర్తులు వినయ విధేయతలతో మెలగాలి. వాళ్లేమీ చక్రవర్తులు కారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడింటికీ ఎవరి పరిధులు వారికున్నాయి. ఒకరి అధికారాల్లోకి మరొకరు చొచ్చుకురావాలనుకోవటం సరికాదు. అలాచేస్తే రాజ్యాంగ సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితం అనుభవించాల్సి వస్తుంది’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. అధికారులకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయని, అనవసరంగా కోర్టులకు పిలవటం వల్ల అవన్నీ ఆలస్యమవుతాయని, పైపెచ్చు సదరు అధికారిపై అదనపు భారం పడుతుంది కనక ఆ పనులు మరింత ఆలస్యమవుతాయని కోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా కిందికోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. మీ గౌరవమేమీ పెరగదు... ‘‘కోర్టులకు ప్రభుత్వాధికారుల్ని అనవసరంగా పిలవవద్దని మరోసారి చెబుతున్నాం. వాళ్లనలా పిలవటం వల్ల మీ గౌరవమేమీ పెరిగిపోదు. కోర్టుల పట్ల గౌరవాన్ని సంపాదించుకోవాలి తప్ప ఆపాదించుకోకూడదు. ఒక అధికారి కోర్టుకు వచ్చాడంటే తన అవసరం ఉన్న మరో పని ఆగిపోతుందని గమనించండి. కొన్నిసార్లు కోర్టు పిలుపుల కోసం అధికారులు దూరాభారాలు ప్రయాణించాల్సి వస్తోంది. కాబట్టి అధికారుల్ని పిలవటమనేది ప్రజాహితానికి వ్యతిరేకం. పోనీ కోర్టు తీర్పులేమైనా నిర్ణీత సమయంలో వస్తాయా అంటే అలాంటి పరిస్థితేమీ లేదు. ఎంత ఆలస్యమవుతుందో చెప్పలేం. అధికారులు రాకున్నా... దాన్ని మించిన కలం కోర్టుల చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించండి. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కోర్టు పేర్కొన్న అంశాలకు ప్రభుత్వం తరఫున హాజరయ్యే న్యాయవాది సమాధానమివ్వలేదనుకోండి... ఆ సందేహాన్ని ఉత్తర్వుల్లో రాయండి. ప్రభుత్వమో, ప్రభుత్వాధికారో దానికి జవాబివ్వటానికి తగిన సమయమివ్వండి’’ అని బెంచ్ స్పష్టంగా నిర్దేశించింది. ఆలోచన లేకుండా, తరచుగా, క్యాజువల్గా అధికారులను కోర్టులకు పిలవటాన్ని ఎంతమాత్రం హర్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. -
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సీఎం కేసీఆర్ ఒకింత అసహనానికి గురవడంతో.. అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సిరిసిల్లలో సీఎం ఆదివారం తన పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ కాగా, వేద మంత్రాల మధ్య లబ్ధిదారులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి.. కత్తెర అందుబాటులో లేకపోవడంతో కాసేపు కత్తెర కోసం సీఎం వేచి చూశారు. కత్తెర లేకపోవడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేతితో రిబ్బన్ను పీకి పడేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహంలోకి అడుగుపెట్టారు. -
బాల్య వివాహం.. కౌన్సెలింగ్ ఇస్తుండగా జంట పరార్..
సాక్షి, తొర్రూరు(వరంగల్ రూరల్) : బాల్య వివాహం జరగగా, జంటకు కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో పారిపోయిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన మైనార్టీ తీరని బాలికతో అదే తండాకు చెందిన బాలుడికి వివాహం జరిగింది. ఈ మేరకు చైల్డ్లైన్ ప్రతినిధులు, పోలీసులు వెళ్లి బాల్య వివాహం వల్ల భవిష్యత్లో వచ్చే నష్టాలపై వివరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పటికే తప్పు జరిగినందున, సరైన వయస్సు వచ్చిన తర్వాతనే వారిద్దరు కలిసి ఉండేలా చూడాలని సూచించారు. ఇలా కౌన్సెలింగ్ ఇస్తుండగానే వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. చదవండి: మోదీ ‘మన్ కీ బాత్’కి వరంగల్ చాయ్వాలా -
విధులకు డుమ్మా కొట్టి.. విందులో చిందులు
కొండపాక(గజ్వేల్): పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది. జిల్లాలోని 22 మండలాల పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొండపాక శివారులోని ఓ మామిడి తోటలో సమావేశమై విందులు చేసుకుంటూ చిందులు వేశారు. ఈ వ్యవహారం కాస్తా టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీరియస్ అయ్యారు. కొండపాక ఎంపీడీఓ రాజేశ్ను కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నర్సింగరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చదవండి: Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు! -
అను‘మతి’లేని పనులు.. పెళ్లిళ్ల పేరుతో..
అమ్మానాన్నలను కోల్పోయిన చిన్నారుల కళ్లలో భయం ఇంకా పోలేదు. కన్నపేగులను పోగొట్టుకున్న వృద్ధుల కంట నీటి ధార ఇంకా ఆగలేదు. పగిలిన గాజులు, తెగిన తాళిబొట్లు ఊరి పొలిమేరలు దాటి పోలేదు. దాపురించిన ఆపత్కాలం అయిపోలేదు. కేసులు తగ్గినా ప్రమాదం తగ్గలేదు. ఇలాంటి సమయంలో వేడుకలు సరికావని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఇంటిలో పెళ్లి మరొక ఇంటిలో చావుకు వేదిక కాకూడదని విన్నవిస్తున్నారు. మన వినోదం ఇంకొకరికి విషాదం పంచకూడదని హెచ్చరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వైద్య సిబ్బంది రాత్రీపగలు సేవలు అందిస్తున్నారు. అందరి కృషితో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జిల్లాలో కొందరు మంచి ముహూర్తాల పేరిట వందలాదిగా గుమిగూడుతూ శుభ కార్యాలు చేసుకుంటున్నారు. ఇలాంటివి వద్దని వారిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటివి ఆగకపోతే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడుకలకు హాజరైన వారు సూపర్ స్ప్రైడర్లుగా కోవిడ్ను వ్యాప్తి చేస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. అనుమతించిన వారి కంటే ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరిపైన రూ. 1000 అపరాధ రుసుం విధిస్తున్నారు. తగ్గుతున్నవి కేసులే.. ప్రమాదం కాదు జిల్లాలో రోజుకి 2,500కిపైగా కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడవి 231కి చేరాయి. ఇది మంచి పరిణామమే. అయితే కేసులు తగ్గుతున్నాయన్న ధీమాతో జిల్లాలో పలుచోట్ల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యక్రమాలు చేపడుతున్నారు. వందలాది మంది హాజరై కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్పీ, డీఎస్పీలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు ఎక్కడికక్కడ పెళ్లిళ్లు జరుగుతున్న చోటకు వెళ్లి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. నిబంధనలకు మించి ఎక్కడ ఎక్కువ మంది హాజరయ్యారో అక్కడ సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అక్కడికక్కడే అపరాధ రుసుం విధిస్తున్నారు. జిల్లాలో నమోదైన కేసులివి.. ► పాతపట్నంలో నిబంధనలకు మించి 200మంది అదనంగా హాజరయ్యారని పెళ్లి నిర్వాహకులపై రూ. 2లక్షల అపరాధ రుసుం విధించారు. ► ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో నిబంధనలు ఉల్లంఘించి వివాహం జరిపిన ఒక కుటుంబానికి రూ.10వేలు ఫైన్ వేశారు. ► మర్రికొత్తవలసలో నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసిన వారికి రూ. 20వేలు అపరాధ రుసుం విధించారు. ► చేపనపేట గ్రామంలో రూ. 5వేలు అపరాధ రుసుం వేశారు. ► బూర్జ మండలంలో కూడా ఒక కుటుంబంపై రూ. 10వేలు అపరాధ రుసుం విధించారు. ► సోంపేట మండలం బెంకిలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వివాహం జరిపించిన ఇద్దరికి రూ. 20వేలు ఫైన్ విధించారు. ► సోంపేట మండలంలోని జింకిభద్రలో ఒకరికి రూ. 20వేలు అపరాధ రుసుం విధించారు. ► ఎల్ఎన్పేట మండలం వాడవలస, శ్యామలాపురం ఆర్అండ్ఆర్ కాలనీలో రెండు కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఫైన్ వేశారు. ► ఇచ్ఛాపురం మండలం రత్తకన్న గ్రామంలో నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసేందుకు సిద్ధమైన ఓ కుటుంబంపై రూ.25వేలు అపరాధ రుసుం విధించారు. ► నరసన్నపేట మండలం చెన్నాపురం పంచాయతీ గొనబుపేటలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పెళ్లి నిర్వాహకులపై రూ. 15వేలు జరిమానా విధించారు. ► నరసన్నపేట మండలం శివరాంపురంలో ఒక కుటుంబంపై రూ. 20వేలు ఫైన్ వేశారు. ► సీతంపేట మండలం పూతికవలస పంచాయతీ ఈతమానుగుడలో నిబంధనలకు విరుద్ధంగా దైవప్రార్థనలు చేసిన వారికి రూ.లక్ష అపరాధ రుసుం విధించారు. చర్యలు తప్పవు కోవిడ్ కట్టడికి అధికారులంతా కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన వారి కంటే ఎక్కువ మందితో శుభ కార్యాలు నిర్వహిస్తున్నారు. ఇది సరికాదు. కోవిడ్ వ్యాప్తికి ఇవి కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీరియస్గా చర్యలు తీసుకుంటున్నాం. ఎంతటి వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. – జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం -
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో శుక్రవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. కరోనా చికిత్సకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. చదవండి: ఆనందయ్య మందు నేనూ ఇస్తా.. యువకుడి పోస్ట్ -
నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు..
శాంతిపురం(చిత్తూరు జిల్లా): ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నాయకులు గూండాగిరి ప్రదర్శించారు. వారిని బెదిరించి తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే యత్నంలో భాగంగా భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన శాంతిపురం మండలంలో బుధవారం కలకలం రేపింది. ఉపాధిహామీ ఏపీఓ అశోక్రెడ్డి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు జనార్దనరెడ్డి ఉపాధిహామీ పనుల కింద అక్రమంగా బిల్లులు పెట్టాడు. వీటిని తిరస్కరించడంతో రెచ్చిపోయాడు. శాంతిపురం ఉపాధి హామీ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఏపీఓ అశోక్రెడ్డిపై ఆయన సోదరుడు రాజశేఖరరెడ్డితో కలిసి దౌర్జన్యం చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన గుంజార్లపల్లె ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారెడ్డిని విచక్షణా రహితంగా కొట్టి బట్టలు చింపేశాడు. సిబ్బంది ఆత్మరక్షణ కోసం ఆఫీసు లోపల గడియ పెట్టుకున్నా రాద్దాంతం చేసి, తలుపులు తీయించారు. ఫోన్లు చేసి తమ పార్టీ శ్రేణులను పిలిపించుకుని కార్యాలయంలోని కంప్యూటర్ మానిటర్, ప్రింటర్, కాట్రేజ్లు, రెండు కుర్చీలను ధ్వంసం చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన టీడీపీ శ్రేణులు కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై బైఠాయించారు. దాడికి గురైన ఏపీఓ, ఫీల్డు అసిస్టెంట్లను ఎంపీడీఓ చిన్నరెడ్డెయ్య కారులో పోలీసు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయడంతో వారినీ అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే దుర్భాషలాడుతూ కారుపై దాడికి యత్నించారు. కుప్పం రూరల్ సీఐ యతీంద్ర, రాళ్లబూదుగూరు ఎస్ఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి, వారిని తరలించారు. అధికారుల ఫిర్యాదుకు కౌంటరుగా టీడీపీ నాయకులు కూడా తమపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొందరు తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు: కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరసగా రెండో ఏడాది జలాశయాలకు పుష్కలంగా నీరు వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎంతో సంతోషంగా రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కూడా దిగుబడి సాధించారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. అధికారుల సమన్వయ లోపం వల్ల రైతులు ఆందోళనకు దిగారని తెలిపారు. (చదవండి: సీఎం జగన్ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని) రైతులపై కేసులు పెట్టడం సరికాదని, వెంటనే కేసులు ఎత్తివేయాలని కోరారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న దళారులు, మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ధాన్యం రంగు మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలను అధికారులు అర్థం చేసుకుని స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గడువును పెంచే విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: శాఖ బాబుది.. సంతకం చినబాబుది) -
నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ రెండో సర్వసభ్య సమావేశానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ సర్వసభ్య శనివారం నిర్వహించనున్నారు. గతంలో రెండు సార్లు సమావేశం జరిగినా వాటిలో ఒకటి మొదటి బడ్జెట్ అమోదం కోసం నిర్వహించగా, రెండోది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నిర్వహించారు. కోవిడ్–19 నేపథ్యంలో గత కొద్ది నెలలుగా సమావేశం నిర్వహించలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు మేయర్ సునీల్రావు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. అభివృద్ధిపైనే ప్రధాన చర్చ.. నగరపాలక సంస్థ సమావేశంలో 60 డివిజన్లలో జరుగుతున్న, కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలను అధికారులు కార్పొరేటర్లు అందించారు. నగరంలో సుమారు రూ.70 కోట్ల విలువచేజే పనులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపేందుకు అజెండాలో చేర్చారు. వీటిలో చాలా వరకు ఆమోదం పొందనున్నాయి. హరితహారం, పట్టణప్రగతి కోసం సీఎం ప్రత్యేక నిధులు ఖర్చు చేసేందుకు సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. ఇంటిగ్రెటేడ్ కూరగాయాల మార్కెట్ కోసం రూ.14 కోట్లు, 35 ఓపెన్ జిమ్ల కోసం రూ.4 కోట్లు, శ్మశానవాటికల కోసం రూ.కోటి, మిగిలిపోయిన పార్క్ల అభివృద్ధికి రూ.4 కోట్లు, ఆధునిక టాయిలెట్ల నిర్మాణానిక రూ.2 కోట్లు, శివారు ప్రాంతాల తాగునీరు, డ్రెయినేజీ పనులకు రూ.5 కోట్లు, వివిధ డివిజన్లలో రూ.36 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, మున్సిపల్ భవనం ఆధునికీకరణ పనుల కోసం రూ.2 కోట్లతోపాటు అభివృద్ధి పనుల కోసం అయా డివిజన్ల కార్పొరేటర్లు ఇచ్చిన నివేదిక అధారంగా పలు పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు.. మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తమ అజెండాతో సమావేశానికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల కార్పొరేషన్ అధి కారులపై వచ్చిన ఆరోపణలు, అవినీతిపై నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ఆరోపణలు తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా పూర్తి వివరాలు సిద్ధం చేసుకుంది. అయితే అధికారులపై అవినీతి ఆరోపణలపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. -
హలో.. మేము ఏసీబీ!
కర్నూలు (టౌన్): ‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ.. విజయవాడ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అవినీతి కార్యకలాపాల చిట్టా మా వద్ద ఉంది. మీపై ఫిర్యాదులొస్తున్నాయి. కేసులు నమోదు చేయాల్సి ఉంటుందం’టూ ఫోన్లలో బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్న ముఠాలో అరుగురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, కర్నూలు టౌన్ ఇన్చార్జ్ డీఎస్పీ వెంకటరామయ్య బుధవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు. వెలుగులోకి వచ్చిందిలా... కర్నూలు నగరంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేసే ఓ అధికారికి ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై సదరు అధికారి కర్నూలు 2 వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ మహేశ్వరరెడ్డి ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టుకున్నారిలా.. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల ఫోన్ కాల్స్, ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. వాటి ఆధారంగా నిఘా పెట్టి కర్ణాటక రాష్ట్రం హోసూరు వద్ద ఇద్దరిని, అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద నలుగురిని ఫోన్ కాల్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు జయకృష్ణ (ఏ–1), ఉదయ్కుమార్ (ఏ–8) కోసం ప్రత్యేక బృందాలçను నియమించామని పోలీసు అధికారులు వెల్లడించారు. కీలక శాఖల అధికారులే టార్గెట్ ముఠా సభ్యులు రాష్ట్రంలో కీలక శాఖల అధికారులను టార్గెట్ చేశారు. మైనింగ్శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, ఫ్యాక్టరీలు, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. దాదాపు 70 నుంచి 80 మంది అధికారులను బెదిరించారు. వైజాగ్, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలోని కొందరు అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కాగా ఇప్పటి వరకు నిందితులు బెదిరింపుల ద్వారా అధికారుల నుంచి రూ. 14.34 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందన కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఛేదించిన కర్నూలు టూటౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ సునీల్కుమార్, పోలీసు సిబ్బంది మహీంద్ర, ప్రియకుమార్, రవిలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ముఠాలో అందరూ పాత నేరస్తులే ఏసీబీ పేరు చెప్పి అధికారుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిన వారంతా పాత నేరస్తులే. వివిధ కేసుల్లో పట్టుబడి జైలుకెళ్లారు. అక్కడ ఒకరినొకరు పరిచయం పెంచుకుని జత కట్టారు. బెయిల్పై బయటికి వచ్చిన తరువాత బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఇందుకు కర్ణాటకలో 6 సిమ్ కార్డులు తెప్పించుకుని అందులో 3 సిమ్ కార్డుల ద్వారా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఠాలో అత్యధికంగా రేప్కేసుల్లో పట్టుబడిన నిందితులే ఉన్నారు. పట్టుబడిన వారిలో ఏ–1 గా ఉన్న జయకృష్ణ అనంతపురం 3 వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయ్యాడు. రెడ్డిపల్లి జిల్లా జైలులో శిక్ష అనుభవించాడు. అలాగే ఏ–2 తమిటిగొల్ల గంగాధర్ కదిరి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికను రేప్ చేసిన కేసులో పట్టుబడ్డాడు. ఏ–3 జోలదరాశి సాల్మన్ రాజు కణేకల్లు పోలీసు స్టేషన్లో బాలికను రేప్ చేసిన కేసులో నిందితుడు. ఏ–4 బొడ్డు సాయికుమార్ బత్తల పల్లి పోలీసు స్టేషన్లో అమ్మాయి కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యాడు. ఏ–5 నారాయణస్వామి హిందూపురం 2 వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికను రేప్ చేసిన కేసులో జైల్ కెళ్లాడు. ఏ–6 హోసురు నారాయణప్ప గోవిందరాజులు అనంతపురం 3 వ పట్టణ పోలీసు స్టేషన్లో 354 కేసులో అరెస్టు అయ్యాడు. ఏ–7 హోసూరు గ్రామానికి చెందిన హేమంత్కుమార్, ఏ–8 ఉదయ్కుమార్ ఇతర నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించారు. రెడ్డి పల్లి జిల్లా జైలులో ఉన్న సమయంలో ఏ1 నిందితుడు జయకృష్ణతో మిగతా నిందితులకు పరిచయం ఏర్పడింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని వారంతా నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు. -
మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్!
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ప్రణాళికాబద్ధ్దమైన పట్టణాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీల్లో ‘వార్డు ఆఫీసర్ల’ను నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ప్రగతిభవన్లో శుక్రవారం కేటీఆర్ అధ్యక్షతన పురపాలక శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. పురపాలక శాఖ పరిధిలో 2,298 ఖాళీలను భర్తీ చేసేందుకు తుది నిర్ణయం తీసుకోవడంతో పాటు పోస్టుల భర్తీకి ముందు సంబంధిత పోస్టులు, ఉద్యోగులను రేషనలైజ్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీ ద్వారా పౌర సేవలతోపాటు పట్టణ ప్రగతి కూడా మరింత వేగవంతం అవుతుందన్నారు. ‘ప్రతీ వార్డుకు ఒక అధికారిని నియమించడం దేశంలోనే తొలిసారి. పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం వార్డు ఆఫీసర్ల నియామకంతో సాధ్యమవుతుంది’అని మంత్రి చెప్పారు. పురపాలక శాఖ, ప్రజలకు మధ్య వారధిలా వార్డు అధికారులు పనిచేస్తారని తెలిపారు. ఇక ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు.. పురపాలక శాఖ ఇంజనీరింగ్ పనుల్లో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. వీరికి సహాయకులుగా ఇద్దరు లేదా ముగ్గురు ఎస్ఈలు కూడా ఉండాలనే ప్రతిపాదనను ఆమోదించామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పారదర్శక విధానంలో భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే పౌర సేవలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేందుకు మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీ అంశంపై గతంలో ఆరు పర్యాయాలు అంతర్గత సమావేశాలు నిర్వహించగా, శుక్రవారం జరిగిన సుదీర్ఘ బేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. -
పాక్లో భారతీయ అధికారుల అరెస్ట్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారత హై కమిషన్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు అదృశ్యమైన ఘటన సోమవారం కలకలం రేపింది. అధికారిక విధుల్లో భాగంగా సోమవారం ఉదయం కారులో బయటకు వెళ్లిన వారిద్దరు గమ్యస్థానానికి చేరుకోలేదు. కారులో వేగంగా వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టి, తీవ్రంగా గాయపర్చడంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. దాంతో, భారత్ ఘాటుగా స్పందించింది. న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ చీఫ్ను పిలిపించి, తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు అధికారుల భద్రత బాధ్యత పాక్దేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, సోమవారం సాయంత్రం ఆ ఇద్దరు అధికారులను పాక్ విడిచిపెట్టింది. వారిద్దరు అక్కడి భారత హై కమిషన్కు చేరుకున్నారని భారత ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. హిట్ అండ్ రన్! ఇస్లామాబాద్లోని ఎంబసీ రోడ్లో ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టిందని, ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని జియో న్యూస్ ప్రకటించింది. పారిపోయేందుకు ప్రయత్నించిన కారులోని వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారని వెల్లడించింది. ఆ తరువాత, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత హై కమిషన్లో అధికారులని తేలిందని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పేర్కొంది. కారులో అతివేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయి ఫుట్పాత్పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టారంది. ఆ ఇద్దరు అధికారులు సిల్వదాస్ పౌల్, దావము బ్రహములుగా గుర్తించారని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విదేశాంగ అధికారులకు సమాచారమిచ్చారని తెలిపింది. అయితే, ఈ యాక్సిడెంట్కు సంబంధించి పాకిస్తాన్ అధికారులు కానీ, స్థానిక భారతీయ హై కమిషన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, అంతకుముందు, భారతీయ అధికారులను అరెస్ట్ చేయడంపై న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ చీఫ్ను పిలిపించిన విదేశాంగ శాఖ.. ఆయనకు తీవ్ర నిరసన తెలిపింది. ఆ అధికారులను ఇంటరాగేషన్ పేరుతో వేధించవద్దని, వారి భద్రత బాధ్యత పాక్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఆ ఇద్దరు అధికారులతో పాటు, వారు ఉపయోగించిన కారును వెంటనే హై కమిషన్కు అప్పగించాలని స్పష్టం చేసింది. గూఢచర్యం ఆరోపణలపై భారత్లోని పాక్ హై కమిషన్ అధికారులు ఆబిద్ హుస్సేన్, మొహ్మద్ తాహిర్లను ఇండియా నుంచి పంపించివేసిన రెండు వారాల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇండియన్ నుంచి ఆర్మీ దళాల కదలికలపై రహస్య సమాచారం తీసుకుంటూ వారిద్దరూ దొరికిపోయారని భారత్ ఆరోపించింది. అప్పటినుంచి, పాక్లోని భారతీయ హై కమిషన్ చీఫ్ గౌరవ్ అహ్లువాలియా సహా పలువురు అధికారులకు పాకిస్తాన్ ఏజెన్సీల నుంచి పలుమార్లు వేధింపులు ఎదురవుతూ వచ్చాయి. -
విశాఖలో అధికారుల అప్రమత్తం
-
ఇసుక పాలసీ అధికారులపై ఆగ్రహించిన డిప్యూటీ సీఎం!
సాక్షి, తూర్పు గోదావరి: ఉచిత ఇసుక పాలసీ అమలు అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన మంత్రుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతోపాటు, పినిపే విశ్వరూప్, కలెక్టర్ మొరళీధర్రెడ్డిలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, దీనిని అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలు శాఖల అధికారులపై పిల్లి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. -
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వారికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న మొత్తం ఆరుగురు అధికారులకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మద్యంతర బెయిల్పై ఉన్నవీరికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ సింధు శ్రీ, మాజీ ఓఎస్డి ప్రదీప్ కుమార్ బగ్గా, ఎఫ్ఐపీబీ మాజీ డైరెక్టర్ ప్రబోధ్ సక్సేనాకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎఫ్పీబీ యూనిట్ మాజీ సెక్షన్ ఆఫీసర్ అజీత్ కుమార్ డండుంగ్, అప్పటి అండర్ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్, మాజీ జాయింట్ సెక్రటరీ (ఫారిన్ ట్రేడ్) డిఇఓ అనుప్ కె పూజారీలకు కూడా కోర్టు ఉపశమనం ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ .2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అలాగే సాక్ష్యాలను దెబ్బతీయవద్దని కూడా స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్లో అవకతవకలు జరిగాయని రూ .305 కోట్ల విదేశీ నిధులను ముట్టాయని ఆరోపిస్తూ 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ఇప్పటికే బెయిల్పై ఉన్నారు. ఈకేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా నిందితుడుగా ఉన్నారు. -
కలెక్టర్ చెప్పినా.. కాదు పొమ్మంటున్నారు
సాక్షి, వరంగల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో డీఆర్డీఓ అధికారుల తీరు. 100 శాతం మానసిక వైకల్యంతో ఉన్న బాలికను చేతులపై మోసుకుని తల్లిదండ్రులు డిసెంబర్ 23న కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచ్చారు. ఏడాదిగా పింఛన్ రావడంలేదని, కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులతో మాట్లాడి పెండింగ్ పింఛన్ వెంటనే ఇవ్వడంతో పాటు ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు సరేనని చెప్పిన అధికారులు.. నెల రోజులు దాటినా పట్టించుకున్న పాపానపోలేదు. ఇదిగో.. అదిగో అంటూ దాటవేస్తున్నారు. ఇది ఒక బాలిక సమస్యే కాదు. జిల్లాలో అనేక మంది దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ అర్బన్: ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందని కొప్పుల గణేష్ కూతురు వర్షిణి నూరు శాతం మానసిక దివ్యాంగురాలు. ఇందుకు సబంధించి అన్ని రకాల పత్రాలు, సదరం సర్టిఫికెట్ ఉండగా గతంలో ఆసరా పింఛన్ అందేది. పెన్షన్ 2019 జనవరి నుంచి ఆగిపోవడంతో పలుమార్లు కలెక్టరేట్ గ్రీవెన్స్కు, డీఆర్డీఓ కార్యాలయంలో వినతులు అందజేసినా ఫలి తం కానరాలేదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. త్వరలో పరిష్కరిస్తామని నాన్చుతున్నా రు. డీఆర్డీఓ అధికారుల మాటలతో విసిగిన వర్షిణి తలిదండ్రులు డిసెంబర్ 23న కదల్లేని స్థితిలో ఉన్న తమ కుమార్తెను ప్రజావాణికి తీసుకుని వచ్చి నేరుగా కలెక్టర్ పాటిల్ను కలిశారు. ఆమె దీనస్థితికి చలించిపోయిన ఆయన.. ఇంత కాలం ఏం చేస్తున్నారంటూ డీఆర్డీఓ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కూడా పెన్షన్ అందకపోతే ఎలా అని ప్రశ్నించారు. కలెక్టర్ ప్రత్యేక నిధినుంచి బకాయిలు బాలిక వర్షిణి దీన స్థితితో తక్షణం స్పందించిన కలెక్టర్ పాటిల్.. తన ప్రత్యేక నిధి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఏడాది బకాయిలు ఇవ్వాలని ఆదేశించారు. బాధితుల బ్యాంక్ అకౌంట్, ఇతర వివరాలు తీసుకుని ఫైల్ తనకు పంపించాలని సూచించారు. పెండింగ్ బకాయిలు రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయ ని.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా పెన్షన్ అందుతుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇది జరిగి నెల దాటిపోయినా ఇప్పటివరకు ఒక్క పైసా అందలేదు. దీంతో బాధితులు మళ్లీ సోమవారం(నేడు) గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనలో భాగంగా..
న్యూఢిల్లీ: రైల్వే బోర్డులో సమర్థతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బోర్డు అధికారుల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించింది. డైరెక్టర్, ఆ పై స్థాయికి చెందిన 50 మంది అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పరిపాలన అనే ప్రధాని ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ అధికారుల సేవలను గరిష్టంగా వినియోగించుకునేందుకు వారిని వివిధ జోన్లకు బదిలీ చేశాం’ అని రైల్వే ఉన్నతాధికారి చెప్పారు. బోర్డులో అవసరమైన మేరకే సిబ్బంది ఉండాలన్నది నాటి ప్రధాని వాజ్పేయి ఆలోచన. బోర్డును పునర్వ్యవస్థీకరించాలని 2015లో డెబ్రాయ్ కమిటీ సిఫారసు చేసింది. రైల్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసిన తొలి అడుగే రైల్వే బోర్డులో సిబ్బందిని తగ్గించడమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
అధికారులపై ఉత్తమ్ పద్మావతి ఆగ్రం
-
పగులుతున్న పాపాల పుట్ట
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలతో పాటు కార్యాలయాల్లోనే అధికారులు, ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. టీడీపీ ఘోర ఓటమి పాలైంది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పారదర్శక పాలనకు చర్యలు చేపట్టారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టిన అధికారులు ఆయా కార్యాలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దీంతో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యాంగుల శాఖ ఏడీ లంచావతారం.. రెండు నెలల క్రితం వికలాంగుల శాఖలో అవినీతి లుకలుకలు బయటకు వచ్చాయి. ఆ శాఖ ఇన్చార్జ్ ఏడీగా పనిచేసిన బి.సింగయ్య ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుని నుంచి లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికే ఆయన మూడు శాఖలకు ఇన్చార్జ్గా ఉంటూ గత ప్రభుత్వం అండతో అందిన కాడికి దోచేశారు. స్వచ్ఛంద సంస్థల నుంచి లక్షల రూపాయలను లంచాల రూపంలో వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన్ను విధుల నుంచి పక్కన పెట్టి, వేరే జిల్లాకు బదిలీ చేశారు. డీఆర్డీఏ–వెలుగులో సీసీల చేతివాటం: జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ), వెలుగు సంస్థలో పనిచేస్తూ పొదుపు మహిళల నిధుల స్వాహాకు పాల్పడిన ఇద్దరు సీసీల (కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు)పై ఆ శాఖ పీడీ జి.నరసింహులు వేటు వేశారు. వీరిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసుకు ఆదేశించారు. ఈవీ సుచంద్రరావు గతంలో దొనకొండ మండలం అరివేముల క్లస్టర్ సీసీగా పనిచేసే సమయంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు, స్త్రీనిధి సొమ్ము , గ్రామ ఆర్గనైజేషన్ నుంచి రూ.13.90 లక్షల నిధులను తన భార్య, తన బంధువుల ఖాతాలకు మళ్లించుకున్నాడు. ముందుగానే పథకం వేసుకున్న సీసీ సుచేంద్రరావు స్థానిక గ్రామ సమైక్య సంఘ సభ్యులను ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, స్త్రీనిధి రుణాల కోసమని నమ్మించి వారి నుంచి ముందుగానే అదనపు చెక్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం నమ్మకంగా పెద్దగుడిపాడు గ్రామ సమాఖ్య సంఘం, గంగదేవి పల్లి గ్రామసమాఖ్య సంఘం, బేతేల్పురం గ్రామ సమాఖ్య సంఘం ఇలా పలు సంఘాల నుంచి పొదుపు మహిళల సొమ్మును నమ్మకంగా స్వాహా చేశాడు. అనంతరం ఇటీవల జరిగిన బదిలీలలో సీఎస్పురం మండలానికి బదిలీపై వెల్లారు. ఈయన స్థానంలో వచ్చిన సీసీ (కమ్యూనిటి కో–ఆర్డినేటర్)పాపారావు బాధ్యతలు చేపట్టారు. తరువాత కార్యాలయంలో రికార్డులు పరిశీలించడంతో నిధుల స్వాహా విషయం వెలుగు చూసింది. గతంలో పనిచేసిన సీసీ సుచేంద్రరరావు చేతివాటం బయటపడి చర్చనీయాంశమైంది. విషయం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి రావడంతో ఆయన మార్కాపురం వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్తో విచారణ చేయించారు. విచారణలో నిధులు స్వాహా వాస్తవమని తేలింది. అవినీతికి పాల్పడిన వెలుగు సీసీపై సస్పెండ్ వేటు వేయడంతో పాటు క్రిమినల్ కేసుకు ఆదేశించారు. స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే కొండపి మండలం అనకర్ల పూడి క్లస్టర్ (సీసీ)పని చేస్తున్న వి.కోటేశ్వరమ్మ గతంలో ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు సీసీగా పనిచేసేవారు. ఆ సమయంలో (ఇందిర ఎస్హెచ్గ్రూపు)కు సంబంధించిన సభ్యురాలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నతిపథకం కింద తప్పెట సుశీలమ్మ భర్త నాగేశ్వరరావుకు 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలు మంజూరు చేశారు. అయితే ఇందిరా గ్రూపుపై తయారు చేసిన రూ.50 వేల చెక్ను సంబంధిత సభ్యురాలికి ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డులో గ్రౌండింగ్ (నివేదిక) చూపించారు. ఈ విషయం కూడా ఇటీవల నిర్వహించిన విచారణలో వెలుగు చూసింది. దీనిపై విచారించిన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వాస్తవం తేలడంతో ఆమెపై కూడా సస్పెండ్ వేటు పడింది. బీసీ కార్పొరేషన్లో రూ.50.10 లక్షలు స్వాహా తాజాగా వెలుగులోకి... గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన ఎ.నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన బదిలీపై వెళ్లిన తరువాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈడీ కె.నాగముని కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తున్న సమయంలో గత ఈడీ బాగోతం బయటకు వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఆదరణ–2 పథకంను ప్రవేశపెట్టింది. ఈ ఆదరణ పథకంలో బీసీలకు వివిధ పనిముట్లను రాయితీ కింద అందించేందుకు చర్యలు చేపట్టింది. వృత్తిని బట్టి ఇస్త్రీ పెట్టెలు, సన్నాయి, మేళం, నాయిబ్రాహ్మణులకు కుర్చీలు, మత్స్యకారులకు పడవలు, ఇంకా చేతి పనిముట్లను అందిస్తున్నారు. బీసీల ఓట్ల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఆదరణ పథకం కింద విడుదల చేశారు. అయితే యూనిట్కు లబ్ధిదారుల తమ వాటా ధనంగా చెల్లించిన సొమ్ము మొత్తాన్ని ఈడీ నాగేశ్వరరావు, కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసినట్లు ఇటీవల అధికారుల విచారణలో తేలింది. బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు ఒక్కడే డైరెక్ట్గా నగదు డ్రా చేయకుండా కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నాడు. మొత్తం రూ.50 లక్షలకు పైగా నిధులను దొడ్డిదారిన మింగేసేందుకు వ్యూహం పన్నాడు. ఇందుకు కార్యాలయ ఏఈవో ఎ.శ్రీనివాసరావు పేరు మీద రూ.8.05,000, జూనియర్ అసిస్టెంట్ వై.ఏడుకొండలు పేరు మీద రూ.12,23,500, వి.రాజేష్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరుమీద రూ.8,40,000, బి.వై.కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరు మీద రూ.5,50,000, మరో ఇద్దరు ఇతరుల పేరుమీద రూ.1,24,500, ఇంకొక వ్యక్తి పేరుమీద రూ.95,000, డీబీసీడబ్ల్యూవో కార్యాలయానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ పివి.ఆంజనేయులు పేరుమీద రూ.45,000, తన (ఈడీ) పేరు మీద రూ.10,87, 500 లక్షల వరకు చెక్కుల రూపంలో బ్యాంకు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో తేల్చారు. మొత్తం రూ.50,10,500 లక్షలను ఈడీ నాగేశ్వరరావు డ్రా చేశారు. డ్రా చేసిన నగదును కొంత ఆయా ఉద్యోగులకు ఇచ్చి మిగతా సొమ్ము ఈడీ నాగేశ్వరరావే స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు. వీరితో పాటు కార్యాలయంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించిన మహిళా సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు కార్యాలయ సబార్టినేట్ కూడా ఉన్నారు. వీరందరూ ఈడీ నాగేశ్వరరావు అవినీతి అక్రమాలకు సహకరించారన్న అభియోగం విచారణలో తేలింది. దీంతో మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం.రామారావు ఉత్తరుŠువ్ల జారీ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీపై కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్లిన ఈడీ నాగేశ్వరరావును కూడా సస్పెండ్ చేశారు. డ్వామాలోని వాటర్షెడ్ పథకంలో అవినీతిపై ఏపీడీపై వేటు.. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో గత ఐదేళ్ల కాలంలో అడ్డుఅదుపు లేని అవినీతి జరిగింది. అధికార పార్టీ అండతో అటు రాజకీయ నాయకులు, ఇటు కార్యాలయంలోని అధికారులు ఎవరికి వారే తమ పలుకుబడితో చేతివాటం ప్రదర్శించారు. గుట్టు చప్పుడు కాకుండా లక్షల్లో ప్రజా ధనం లూటీ చేశారు. అందులో ఇటీవల ఒకటి వెలుగు చూసింది. చీమకుర్తి మండలం సండ్రపాటు వాటర్ షెడ్ పథకంలో రూ.2.86 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో తేలింది. ఈ విషయాన్ని తమ పలుకుబడితో బయటకు రానీయకుండా కార్యాలయానికే పరిమితం చేశారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి సం బంధిత ఫైల్ని రానీయకుండా దాచిపెట్టారు. అనంతరం ఆయన ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శీనారెడ్డి ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పాత పీడీ హయాంలో మరుగున పెట్టిన ఫైల్ ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్ టేబుల్పైకి వచ్చింది. ఆయన పరిశీలించిన అనంతరం నిధుల స్వాహాకు బాధ్యులైన వారిపై చర్యలకు కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శీనారెడ్డి ఏపీడీ భవానిని సస్పెండ్ చేశారు. ఈ అవినీతి 2016–17 ఆర్ధిక సంవత్సరంలో చీమకుర్తి మండలం సండ్రపాడు వాటర్ షెడ్ పథకం (డబ్ల్యూసీసీ) ఇన్చార్జ్ ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం జరిగింది. అప్పట్లో ఈమె అద్దంకి క్లస్టర్ ఏపీడీగా విధులు నిర్వహిస్తూనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) పథకం అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడు పోస్టులకు విధులు నిర్వర్తించారు. వెలుగులోకి రాని అక్రమాలు ఎన్నో... గత ప్రభుత్వం హయాంలో అటు రాజకీయ నాయకులు నీరు–చెట్టు పేరుతో అనేక కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచేశారు. ఈ అవినీతిలో అప్పటి జిల్లా అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. తమ వాటా ధనం తీసుకునే ప్రతి ఫైల్ని అడ్డగోలుగా నడిపారన్నది జగమెరిగిన సత్యం. కొన్ని అభివృద్ధి పనులు చేయకుండా అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు పంచుకున్నవి ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తే అవినీతి డొంక అంతా కదిలి, వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ కు అధికారులు ప్రజెంటేషన్
-
అన్నివేళల్లో అందుబాటులో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చేందుకు గ్రూపు–1 అధికారులు అన్నివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడానికి అధికారులు కృషి చేయాలని.. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో సానుభూతిని ప్రదర్శించాలన్నారు. బంగారు తెలం గాణ సాధనకు ఇది అత్యావశ్యకమని చెప్పారు. శుక్ర వారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో రాష్ట్ర గ్రూపు–1 సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాధికారులు ప్రజానుకూలంగా ఉండరనే భావన సమాజంలో ఉందని.. దానిని దూరం చేసేందుకు అధికారులు తమ విధి నిర్వహణలో ప్రజలతో మరింత మమేకమై పని చేయాలని సూచించారు. అన్ని వర్గాలకు సేవ చేయాలి.. బలమైన సామాజిక మాధ్యమాలు, శక్తివంతమైన పౌర సమాజం, జాగరూకతతో కూడిన ప్రజలున్న ప్రస్తుత పారదర్శక ప్రపంచంలో వ్యక్తిగత సామర్థ్యం, నిబద్ధత, ఇతర అంశాలు మరింత మెరుగుపర్చుకోవడం ద్వారా ప్రజానుకూల అధికారులుగా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగులు, పేదలకు సేవ చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించా రు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా అధికారులు ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా ఎదిగేందుకు కావాల్సిన అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. విధులకే పరిమితమవ్వొద్దు.. అధికారులు కేవలం తమ విధులకే పరిమితం కాకూడదని గవర్నర్ చెప్పారు. రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందేందుకు అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలన్నారు. స్వాగతోపన్యాసం చేసిన ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ బీపీ ఆచార్య మాట్లాడుతూ కొత్తగా గ్రూప్–1 సర్వీసుల్లో చేరిన అధికారులు రాష్ట్రాభివృద్ధికి తమను తాము పునరంకితం చేసుకునేలా ఫౌండేషన్ కోర్సును నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులకు గవర్నర్ సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన డీఎస్సీ నూకల ఉదయ్రెడ్డికి, రాతపరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన డీపీవో పేరిక జయసుధకు ఆయన జ్ఞాపికలు అందజేశారు. అలాగే యువ అధికారుల హౌస్ జర్నల్ సొసైటీ రూపొందించిన ‘సవ్వడి’జర్నల్ను, ఐఏఎస్ అధికారిణి రజనీ శేఖరీ సిబాల్ రచించిన ‘ఫ్రాగ్రెంట్ వర్డ్స్’పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. -
బీఎస్ఎన్ఎల్ అధికారులకు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో తమ అధికారులు ఎకానమీ విమానాల్లో ప్రయాణించాలని కోరింది. ఈ మేరకు కంపెనీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య ఖర్చులను మరింత తగ్గించే చర్య, ప్రభుత్వ-టెలికాం మేజర్ బిఎస్ఎన్ఎల్ తన అధికారులందరినీ కార్యాలయ ఉత్తర్వు ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలలో ఎకానమీ క్లాస్ ద్వారా మాత్రమే ప్రయాణించాలని కోరింది. సంస్థ ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో సంస్థ అధికారులందరూ ఇప్పుడు విమానప్రయాణాల్లో ఎకానమీ క్లాస్ (దేశీయ, అంతర్జాతీయ)ను ఎంచుకోవాలని బీఎస్ఎన్ఎల్కోరింది. జూలై 26 నాటి ఉత్తర్వుల ప్రకారం బీఎస్ఎన్ఎల్ అధికారిక పర్యటనలను తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలిపింది. అయితే, బీఎస్ఎన్ఎల్ సీఎండీ ముందస్తు అనుమతితో, అధికారులు వ్యాపార అవసరాల విషయంలో ఉన్నత తరగతిలో ప్రయాణించవచ్చని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థ 2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ .4,793 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కాగా డేటా-సెంట్రిక్ టెలికాం మార్కెట్లో మొబైల్ విభాగంలో తీవ్రమైన పోటీ, అధిక సిబ్బంది ఖర్చు , కొన్ని ప్రదేశాల్లో తప్ప 4 జి సేవలు లేకపోవడం బిఎస్ఎన్ఎల్ నష్టాలకు ప్రధాన కారణాల ని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటుకు చెప్పారు. ఆయన పార్లమెంటుకు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, 2018-19లో రూ .14,202 కోట్లకు పెరగనుందని అంచనా. -
వీరింతే.... మారని అధికారులు
సాక్షి, తుని: ప్రభుత్వం మారినా అధికారుల్లో ఉదాసీనత కొనసాగుతోంది. ప్రజలకు మంచి పాలన అందించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను పరిగెత్తుస్తున్నారు. ఇందులో భాగంగానే 10 రోజల క్రితం తుని శాసనసభ్యుడు, విప్ దాడిశెట్టి రాజా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం బాగుండాలని, పందులు కనిపించకూడదని అధికారులకు సూచనలు చేశారు. రెండు రోజల పాటు అధికారులు హడావుడి చేశారు. పందులను పట్టి తరలించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు షరా మామూలే. పట్టణంలో ఎక్కడ చూసినా పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యర్థాలు గుట్టలుగా ఉన్నాయి. మార్కండ్రాజుపేటలో ఇళ్ల మధ్యలో చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాలు ఉండడంతో పందులు వాటిలో సంచరిస్తున్నాయి. సొంత ఇల్లు ఉన్నా వాసన భరించలేక పోతున్నామని పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకు వచ్చారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా పారిశుద్ధ్యం నిర్వహణ బాగానే ఉందని, పరిశీలించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన పాలన అందించాలన్న లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వలన నెరవేరడం లేదు. -
రాష్ట్రంలో భారీగా ఏసీబీ దాడులు
సాక్షి, బెంగళూరు : కర్నాటకలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెగా దాడులకు దిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా పీడబ్యూడీ, ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జ్యుయాలజీ విభాగాలకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ధార్వాడ్, బెళగావి, ధండేలి, జోయిడా చిత్ర దుర్గ తదితర ప్రాంతాలలోని ఉన్నత అధికారుల ఇళ్లలో భారీగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో వివిధ పత్రాలను, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కర్నాటక యూనివర్శిటీ ప్రొఫెసర్ మహదేవప్ప, మైన్స్ అండ్ జ్యుయాలజీ అధికారి ఉదయ్ డి చబ్బీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి ఇళ్లలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ సంపాదన ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి వుంది. K'taka: Anti-Corruption Bureau is conducting searches at premises of a Professor in Karnataka University, an official of Dept Of Mines & Geology, Mangaluru & an Asst Executive Engineer of PWD in Joida, Uttara Kannada. Raids on at Dharwad, Belagavi, Dandeli & two more locations. — ANI (@ANI) June 12, 2019 -
ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరశైలిపై అధికారుల హర్షం
-
సీఎం జగన్ వ్యవహరశైలి పై అధికారుల హర్షం
-
మున్సిపల్ స్థలంపై కన్ను!
సాక్షి, అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ వారు వివిధ సంఘాలకు సుమారు 6వేల గజాల స్థలాలు దారదత్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.10కోట్లపై మాటే. పట్టణ నడ్డిబొడ్డున ఉన్న స్థలాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల రూపేణ పంచాయతీకి కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది. అచ్చంపేటలో గజం ధర రూ.7వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోంది. వందలు, వేలలో ఉన్న పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించే మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోరు. రియల్ వ్యాపారుల నుంచి పంచాయతీకి రావాల్సిన రూ.లక్షల ఆదాయ వనరులను తుంగలో తొక్కేస్తున్నారు. మేజర్ గ్రామంచాయతీ సమయంలో పట్టణంలో వెంచర్లు చేసినా.. 10శాతం స్థలంతో పాటు వెడల్పు రోడ్లు చేశారు. మున్సిపాలిటీగా అపగ్రేడ్ తర్వాత మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీ, మున్సిపాలిటీగా ఆప్గ్రేడ్ అయినా ఇంతవరకు ఒక వెంచర్లో కూడా స్థలం ఇవ్వలేదంటే ఎంత ఉదాసీనంతో వ్యరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్ల వెలిశాయి. వెంచర్లలో ఎక్కువశాతం కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. వివిధ సర్వే నంబర్లలో.. సర్వే నంబరు 292ఇలో 208 గజాల స్థలాన్ని టైలరింగ్ అసోషియేషన్కు కేటాయించారు. 309, 310 సర్వే నంబరులో 1040 గజాలు వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ, 311/62లో 560 గజాలు రెడ్డిసేవా సమితి, 281లో 244 గజాలు అంబేద్కర్ సంఘం, 305/8, 307లో 282 గజాలు రైస్ మిల్లర్స్ అసోషియేషన్, 24/అ, 24/ఆలో 644 గజాలు కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్ అసోషియేషన్కు కేటాయించారు. అలాగే 305, 307లో 282 గజాలు ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరమ్మ విద్యాలయం, 302అ, 303ఆ2లో 264 గజాలు రిక్రియేషన్ క్లబ్, 26, 27, 77/లో 605 గజాలు బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం, 26అ, 26ఆ, 13లో 813 గజాలు మాల మహానాడు, 303ఇ, 303అలో 223 గజాలు వస్త్ర వ్యాపార సంఘం, 308, 309లో 312 గజాలు శాలివాహన సంఘం 301/6లో492 గజాలు బాబు జగ్జీవన్రావ్ సంక్షేమ సంఘం, సర్వేనెంబరు 33లో మదురానగర్లో 2,100 గజాల స్థలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పంచాయతీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇవి కొన్ని మాత్రమే. స్థలాల కేటాయింపులు ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కేటాయించిన వాటిలో కూడా చాలా వరకు భవన నిర్మాణాలు జరగలేదు. ఆయా సంఘాలు ఆస్థలాలను అద్దెకు ఇచ్చుకుంటున్నాయి. స్థలాలు కేటాయించేది ఎవరు? పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను సంఘాలు, ఇతరులకు కేటాయించాలంటే తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు పంపించాలి. అనుమతి కోసం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించి కేబినెట్ నిర్ణయం తర్వాత కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు జరిగాయి.ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేటికీ అచ్చంపేట మున్సిపల్ అధికారులకు తెలియదంటే అతిశయోక్తి. ప్రజా అవసరాలు అక్కరల్లేదా? పట్టణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పాట్లు చేసే రియల్ వెంచర్లు వ్యాపారులు 10 శాతం భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. దీని మున్పిపాలిటీ ప్రజా అవసరాలకు వినియోగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు ఇతర అవసరాలకు ఈ స్థలం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. -
ఎన్నికల కమిషన్ ఆదేశాలు భేఖాతర్
సాక్షి, ఎమ్మిగనూరురూరల్: దివంగత నేతల విగ్రహాలకు ఈ ఎన్నికల కోడ్ నుంచి మినహాంపును ఎన్నికల కమిషన్ ఇచ్చింది. విగ్రహాలకు ముసుగులు వేయరాదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఎమ్మిగనూరు అధికారులు భేఖాతర్ చేస్తున్నారు. పార్లపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ముసుగు తొలగించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి వేసిన ముసుగును మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే పార్లపల్లి గ్రామంలో మాత్రం విగ్రహానికి తొడిగిన ముసుగు తొలగించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించి విగ్రహానికి వేసిన ముసుగు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వీటికి వర్తించదా..? ఎమ్మిగనూరు రూరల్: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించరాదు. ఉంటే వాటిని తొలగించాలి. అయితే, ప్రభుత్వాసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలకు సబంధించిన పోస్టురుతో పాటు తల్లీబిడ్డ వ్యాన్కు సీఎం చంద్రబాబు బొమ్మలు దర్శనమిస్తున్నాయి. రోడ్డుపై వ్యాన్ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి కోడ్ అమలు పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
శుభ్రతపై నిర్లక్ష్యమేల?
ధన్వాడ: వ్యక్తిగత పరిశుభ్రతను పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో వాస్ (వాటర్ శానిటేషన్ హైజిన్) పథకాన్ని ప్రవేశ పెట్టినా అది చాలా పాఠశాలలో అమలు కావడం లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని భావించిన ప్రభుత్వం పాఠశాలలో వాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే నిబంధనలున్నాయి. ఇందుకు అవసరమైన సబ్బులను ఆయా పాఠశాలల నిధుల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలలో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షకులు సైతం ఉదాసీనత చూపుతుండడంతో ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుల బాధ్యత.. ఉపాధ్యాయులకు ప్రతీ నెల నిర్వహిస్తున్న సముదాయ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చి వాస్ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలను అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు దీనిపై పూర్తి అవగహన కల్పించి వారు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారికి అందుబాటులో సబ్బులు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులు పేట్టలను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించాలి. భోజనం సమయంలో పరిశుభ్రతకు సబ్బులను ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకు రాజీవ్ విద్యా మిషన్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.15వేలు సమకూరుస్తుంది. నిరాశే మిగిలింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాస్ పథకం కొంతవరకైనా మార్పు తెస్తోందని ఆశించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగిలింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిందే మొదలు మధ్యాహ్న భోజనం చేసే వరకు మట్టితో సంబంధాలు ఉన్నా వాటినే వాడుతుంటారు. చాలా పాఠశాలలో బెంచీలు లేక నేలపైనే కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులు మల, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చాలా పాఠశాలల్లో నీటి కొరత కారణంగా వీటికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో హడావుడిగా చేతుల పరిశుభ్రతను పెద్దగా పట్టించుకోవడంలేదు. ధన్వాడ మండలంలో మొత్తం 48 పాఠశాలలు ఉండగా ఇందులో 6500 విద్యార్థులు చదువుకుంటున్నారు. అమలుపై దృష్టి సారిస్తాం ప్రభుత్వ పాఠశాలలో ‘వాస్’ పథకం అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. ప్రతి సమావేశంలో ఉపాధ్యాయులకు వాస్పై సూచనలు అందిస్తున్నాం – సంగీత, ఎంఈఓ, ధన్వాడ -
ఎన్నికల కసరత్తు
నిజామాబాద్: జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో ఈ పక్రియ కొనసాగుతోంది. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామాల ఏర్పాటుతో అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను మార్పులు, చేర్పులు చేశారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిషత్ అధికారులు కొద్ది రోజులుగా ఈ పక్రియను చేపడుతున్నారు. స్థానాల ఖరారుతో.. నిజామాబాద్ జిల్లాలో 25 మండలాలకు గాను 299 ఎంపీటీసీ స్థానాలు, 25 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకు 236 ఎంపీటీసీ, 22 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. స్థానాల మార్పునకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ చేపట్టిన అనంతరం ఇటీవలే తుది జాబితా విడుదల చేశారు. స్థానాలు ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. నేటి నుంచి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా మండలాలలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు చేపట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనంతరం ఓటర్ల లిస్టు తయారీపై దృష్టి పెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 36 జెడ్పీటీసీలు ఉండగా, ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాలు కలిపి 47 జెడ్పీటీసీ స్థానాలు అయ్యాయి. జెడ్పీల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి ఎన్నికలు నిర్వహిస్తే వేరువేరుగా జెడ్పీటీసీ స్థానాలు కొనసాగుతాయి. నిజామాబాద్ జిల్లాలో పాత మండలాలు 19 ఉండగా కొత్తగా మరో ఆరు ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో పాత మండలాలు 17 ఉండగా కొత్తవి ఏడు ఏర్పడ్డాయి. ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి జిల్లాలో 36 మండలాలకు 583 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాల విభజన, మున్సిపాలిటీలో గ్రామాలు విలీనం కావడంతో కామారెడ్డిలో ఏడు, నిజామాబాద్లో 13 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఆ గ్రామాల్లో ఎన్నికలు లేనట్లేనా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఎన్నికలు లేనట్లే కనబడుతుంది. నిజామాబాద్ మండలం ముబారక్నగర్, గూపన్పల్లి, సారంగపూర్, మాక్లూర్ మండలం బోర్గాం(కె), మానిక్భండార్, కాలూరు, ఖానాపూర్ గ్రామాలు నిజామాబాద్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. బోధన్ మున్సిపాలిటీలో శ్రీనివాసనగర్, ఆచన్పల్లి గ్రామాలు విలీనమయ్యాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీల్లో టేక్రియల్, అడ్లూరు, రాంమేశ్వరపల్లి, దేవున్పల్లి, లింగంపూర్, సారంపల్లి, పాతరాజంపేట గ్రామాలు విలీనమయ్యాయి. ఈ గ్రామాల్లో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. కానీ ఆయా గ్రామస్తలు మున్సిపాలిటీల్లో విలీనం చేయవద్దని కోర్టు స్టే తీసుకవచ్చారు. కోర్టులో వ్యవహరం ఉండడంతో అధికారులు ఈ గ్రామాలను పక్కనబెట్టారు. -
సీబీఐలో మరో నలుగురిపై వేటు
న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఊళ్లు తిరిగే ఉద్యోగానికి రూ.72 లక్షల జీతం
పొద్దస్తమానూ ఆఫీసులో చేసినపనే చేస్తూ బోరు కొడుతోందా?...జీవితాంతం ఇల్లూ..పిల్లలే తప్ప మరో యావ లేక విసుగనిపిస్తోందా?..ఈ ఝంఝాటాలన్నీ వదిలేసి హాయిగా తిరిగేస్తూ బతకాలనిపిస్తోందా...అయితే, ఈ ఉద్యోగం మీ కోసమే. ఇది మాములు ఉద్యోగాల్లాంటిది కాదు! ఆఫీసు టైమింగ్సు, రూల్సు వంటివేమీ ఉండవు. మీరు చేయాల్సిందల్లా మీ బాస్తో కలసి విహార యాత్రలకు వెళ్లడం, మంచి మంచి ఫొటోలు తీయడం. దీనికి మీకొచ్చే జీతం ఎంతో తెలుసా... నెలకు రూ.72 లక్షలు! మీకు ఫొటోలు తీయడం బాగా వస్తే, ప్రయాణాలు చేయడం ఇష్టమయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. బ్రిటన్కు చెందిన ధనిక కుటుంబం ఒకటి ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. వారికి ప్రపంచ వ్యాప్తంగా హాలిడే హోంలు, రిసార్టులున్నాయి. మీరు చేయాల్సింది వారి వెంట తిరగడం. పర్యటనకు సంబంధించి అద్భుతమైన ఫోటోలు తీయడం. మీ విషయాలన్నీ వాళ్లే చూసుకుంటారు. ఒకే ఒక ఇబ్బంది.. ఈ ఉద్యోగంలో ఏడాదికి నెల రోజులు సెలవు కూడా ఇస్తారండోయ్. అయితే వాళ్ల టూర్లకు అడ్డం కాకుండా సెలవు తీసుకోవచ్చు. 2019, ఫిబ్రవరి నుంచి ఈ ఉద్యోగం మొదలవుతుంది. ఉద్యోగంలో ఓ ఇబ్బందేమిటంటే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం ఉండదు. ‘ఆ..దాందేముంది..నెలకి లక్షలకు లక్షలకు వస్తోంటే..కుటుంబంతో ఏదోలా మేనేజ్ చేసుకోవచ్చు’అంటారా...ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే పెర్ఫోకల్ సైట్కి వెళ్లి దరఖాస్తు పడేయండి. -
ప్రత్యేకం...పాలమూరు!
సాక్షి, మహబూబ్నగర్ న్యూటౌన్ : రానున్న ఎన్నికలకు సంబంధించి ఓ పక్క అధికారులు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.. మరోపక్క గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించకుండా జిల్లా అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల కంటే జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ నియోజకవర్గంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ ప్రాంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారాలు, ఖర్చుల నమోదుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించకుండా చూసేందుకు నిశిత పరిశీలన చేస్తుండడం గమనార్హం. ఖర్చులు దాటుతున్నాయ్... గ్రామాలు, మండల కేంద్రాల్లో పోలిస్తే సహజంగానే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంత నియోజకవర్గమైన మహబూబ్నగర్లో పోటీకి దిగిన అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు శాయశక్తులా ప్రదర్శిస్తున్నారు. వాహనాల ద్వారా హోరాహోరీ ప్రచారం, రోడ్డుషోలు, పెద్దసైజులో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు లేఖలు పంపిస్తూ ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. దీంతో మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఇక్కడ పోటీకి దిగిన వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏమేం చేస్తున్నారు? మహబూబ్నగర్ అభ్యర్థుల వ్యవహారంపై జిల్లా అధికారులే కాకుండా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేకంగా నియమితులైన అధికారులు సైతం ప్రత్కేక దృష్టి సారించారు. ఒక్కో అభ్యర్థి ప్రచారాన్ని పరిశీలిచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు సమాచారం. ఇటీవల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన సమావేశంలోనూ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రోస్ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పనితీరులో మార్పు రావాలని, ఖర్చుల నమోదును పెద్దగా పట్టించుకోవడం లేనట్లు తెలుస్తోందని మందలించారు. అలాగే, అర్బన్ ప్రాంతంలో ఐదుగురు కాకుండా ర్యాలీలుగా వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇకనైనా 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని, ఫ్లయింగ్ స్కాడ్ బృందం మహబూబ్నగర్లో ప్రచార శైలిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ మేరకు పరిశీలకులు, ఫ్లయింగ్ స్కాడ్, ఎస్ఎస్టీ బృందాలు నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారశైలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై దృష్టి కేంద్రీకరించారు. కాగా, నియోజకవర్గంలో హన్వాడ, మహబూబ్నగర్ రూరల్ మండలం, మహబూబ్నగర్ అర్బన్ మండలాలు ఉన్నాయి. సమస్యాత్మకం 93... మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొత్తం 263 పోలింగ్ కేంద్రాలు 131 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. మహబూబ్నగర్ రూరల్ మండలంలో 27 పోలింగ్ కేందాలు, హన్వాడ మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్క మహబూబ్నగర్ అర్బన్ మండలంలోనే 193 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో93 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలపై పోలింగ్ సందర్భంగా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కాగా, మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పట్టణ ఓటర్లే లక్ష్యం మహబూబ్నగర్ రూరల్ మండలం, హన్వాడ మండలాల్లో ఓటర్ల కంటే మహబూబ్నగర్ పట్టణ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రూరల్ మండలంలో 23,038 మంది, హన్వాడ మండలంలో 36,331 మంది ఓటర్లు ఉండగా.. అర్బన్ మండలంలో ఈ సంఖ్య 1,53,482గా నమోదైంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు పట్టణ ఓటర్లపైనే దృష్టి సారించారు. ఏ వీధి చూసినా మైకుల మోతలు, ఇంటింటి ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఎలాగైనా పట్టణ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఎవరికి వారు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ సమీపిస్తుండడంతో అటు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. ఇటు అధికారుల బృందాలు సైతం నిఘా తీవ్రం చేశారు. -
పాదగయ క్షేత్రంలో ప్రహరీను కూల్చిన ఆధికారులు
-
రికార్డుల్లోనే రికవరీ!
ముత్తారం(మంథని): గ్రామీణ ప్రాంతంలోని కూలీల వలసలను అరికట్టడం కోసం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వీర్యం అవుతోంది. ఈ పథకం ద్వారా చేపట్టిన అభివద్ధి పనుల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలను నియంత్రించడం కోసం నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి విధించిన రికవరీలు అధికారుల రికార్డులకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి జిల్లాలోని 11 మండలాల్లో ఇప్పటి వరకు 10 విడతలు సామాజిక తనిఖీ నిర్వహించారు. వివిధ విడతలుగా నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అరకొరగా విధించిన రికవరీలను ఇప్పటి వరకు సంబధిత అధికారులు పూర్తి స్థాయిలో వసూలు చేయలేకపోయారనే విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సామాజిక తనిఖీల్లో విధించిన రికవరీల నుంచి0 రూ.1,17,57,621లు మాత్రమే రికవరీ చేశారు. సామాజిక తనిఖీల్లో విధించిన రికవరీల్లో ఇంకా మిగిలిన 28.87 శాతానికి గాను రూ.47,71,222లు రికవరీ చేయాల్సి ఉంది. అయితే జిల్లాలోని ముత్తారం మండలంలో అత్యధికంగా 87.97శాతం రికవరీ చేయగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లి మండలంలో అత్యల్పంగా 47.26శాతం మాత్రమే సంబంధిత అధికారులు రికవరీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. అక్రమాలకు పాల్పడిని సిబ్బంది నుంచి విధించిన రికవరీల డబ్బులను నెలనెలా కొంత డబ్బులు వేతనాల నుంచి రికవరీ చేస్తామని ప్రకటించిన అధికారులు అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమాలకు సంబధించిన రికవరీలు అధికారుల రికార్డులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.. తప్ప కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన డీఆర్డీఏ ప్రేమ్కుమార్ను సాక్షి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. -
విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో అధికారుల ఓవరాక్షన్
-
సాగర్లో చంద్రబాబు పర్యటన: అధికారుల ఆత్యుత్సాహం
-
రాజధానికి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వం కక్ష సాధింపు
-
రాజధానికి భూములు ఇవ్వలేదని..
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా పొలాలకు వెళ్లే వాటర్ పైపులను అధికారులు పగలగొట్టారు. దీనిపై వివరణ అడిగితే.. నిడమర్రు ఈ16 నిర్మాణం కోసమే వాటర్ పైపులు పగలగొట్టామని అధికారులు కాకమ్మకబుర్లు చెబుతున్నారు. కానీ రెండు రోజులుగా నీరు వృథాగా పోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే వాటర్పైపులు పగల కొట్టవద్దంటూ స్థానిక రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వారు అనుకున్న పని చేశారని రైతులు మండిపడ్డారు. తమ పొలాలకు నీరు వచ్చే మార్గం అదొక్కటేనని, ఇప్పుడు అధికారులు ఇలా చేయడంతో పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. పగల కొట్టిన పైపులకు మరమ్మత్తులు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
బీసీ ఫెడరేషన్లలో అయోమయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల (బీసీ) ఫెడరేషన్లలో అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ.. వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత కొరవడింది. మూడేళ్ల తర్వాత ఫెడరేషన్లకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో అధికారులు నూతనోత్సాహంతో పథకాల అమలుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ.. భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ సైతం ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. 11 ఫెడరేషన్లకు 2.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ పూర్తయి మూడున్నర నెలలు కావస్తున్నా అర్హుల ఎంపిక మాత్రం జరగలేదు. వాస్తవానికి ఫెడరేషన్లకు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఖరారైతేనే జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్ణయించే వీలుంటుంది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ 2018–19 వార్షిక సంవత్సరం ప్రారంభమై రెండో త్రైమాసికం ముగుస్తున్నా ఫెడరేషన్ల వార్షిక ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దీంతో లబ్ధి దారుల ఎంపిక ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరిశీలనతో సరి.. బీసీ ఫెడరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రాథమిక కసరత్తులో భాగంగా అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తులను పూరించిన మేరకు స్వయం ఉపాధి యూనిట్ బడ్జెట్ స్థాయిని బట్టి కేటగిరీల వారీగా విభజించారు. అయితే వివిధ ఫెడరేషన్లను నిర్ణయించిన బడ్జెట్లో ఏయే యూనిట్లకు అనుమతి ఇవ్వొచ్చనే అంశంపై స్పష్టత వస్తేనే కేటగిరీల వారీగా లబ్ధిదారులను గుర్తించవచ్చు. కానీ వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం రాకపోవడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలనకే పరిమితమయ్యారు. -
అధికారులా.. మజాకా
పెద్దతిప్పసముద్రం: అధికారుల అలసత్వం కారణంగా వృద్ధాప్య పింఛన్కు అర్హుడైన ఓ పండు ముసలాయనకు చుక్కెదురవుతోంది. వివరాలు..మండలంలోని బూర్లపల్లి పంచాయతీ చల్లావాండ్లపల్లికి చెందిన చల్లా వెంకట్రమణ (72)కు సెంటు భూమి కూడా లేదు. వృద్ధాప్య పింఛన్ కోసం గతంలోనే అర్జీల ద్వారా అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఇతని పేరున ఉన్న రేషన్ కార్డు డబ్ల్యూఏపీ 100400600143 ఆధారంగా ఐడి నంబర్ 110312580 ద్వారా ఆయనకు 2007లోనే పింఛన్ మంజూరైంది. అయితే ఇంత వరకు ఈయనకు నయా పైసా అందుకోలేదు. ఈ విషయంపై బాధితుడు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే ఆయన పేరుతో ఉన్న రేషన్కార్డు ఆదారంతో ఇదే గ్రామానికి చెందిన నచ్చు వెంకటలక్ష్మి అనే మహిళ పింఛన్ సొమ్ము అందుకుంటోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆధార్ కార్డు నంబర్ మార్చి పింఛన్ సొమ్ము అందేలా చేస్తామని అధికారులు నమ్మబలుకుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్లో ఉన్న వివరాలను సవరించి పింఛన్ మంజూరయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏం జరుగుతోంది?
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల దౌర్జన్యం
-
‘లక్ష’ణంగా రాయితీ రుణం
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్ వడివడిగా చర్యలు తీసుకుంటోంది. నిధుల విడుదలలో జాప్యంతో మూడేళ్లుగా రాయితీ పథకాలను అటకెక్కించిన ఆ శాఖ.. తాజాగా 2018–19 సంవత్సరంలో ఏకంగా లక్ష యూనిట్ల మంజూరుకు ఉపక్రమించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్ల ఏర్పాటును వేగిరం చేయనుంది. 2018–19 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్తో పాటు 11 బీసీ ఫెడరేషన్లకు 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న స్వయం ఉపాధి యూనిట్లు 1.45 లక్షలు ఉన్నాయి. తొలివిడతలో భాగంగా చిన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన బీసీ కార్పొరేషన్ ఈ మేరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. నవంబర్లోగా రాయితీ విడుదల.. బీసీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ప్రాధాన్యత క్రమంలో రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలివిడత రూ.లక్ష లోపు ఉన్న యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఉన్న యూనిట్లకు రెండో విడత, రూ.10 లక్షల లోపు ఉన్న యూనిట్లకు మూడో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీ ఇవ్వనుంది. ప్రస్తుతం తొలివిడత కింద లక్ష మందికి రాయితీ రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేస్తోంది. తొలివిడత లక్ష మందికి రాయితీ ఇచ్చేందుకు రూ.750 కోట్లు అవసరం. 2018–19 వార్షిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఫెడరేషన్లకు కేటాయించిన నిధులతో పాటు ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులను వినియోగించుకోనుంది. ప్రస్తుతం లక్ష మందికి రాయితీ ఇవ్వనున్నప్పటికీ.. ఇందులో ఆయా సామాజిక వర్గాల వారీగా ఫెడరేషన్లకు దరఖాస్తులను బదలాయించాలని, దీంతో బీసీ కార్పొరేషన్పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా నవంబర్ నెలాఖరు నాటికి నిర్దేశించిన లక్ష మందికి రాయితీ రుణాలిచ్చి యూనిట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష
హైదరాబాద్ : నగరాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ శ్రీదేవి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మేయర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ‘ ఫోకసింగ్ ఆన్ అర్బన్ తెలంగాణ’ అనే కార్యక్రమం మిషన్ మోడ్లో చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి వరసగా మూడేళ్లపాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీఎం సూచన చేశారు. నగరాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్దంగా జరగాలని కోరారు. అక్రమ లేఅవుట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. లే అవుట్లలో గ్రీన్ లాండ్ కోసం స్థలం తీసినా, తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. హైదరాబాద్లోని గండిపేట, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటి చెరువులను గోదావరి నీటితో నింపాలని, అలాగే మురికి నీరు చెరువుల్లో కలవకుండా చూడాలని సూచించారు. మురికి నీటిని శుభ్రం చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలని తెలిపారు. -
సచివాలయం వద్ద వృద్ధురాలి బైఠాయింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు అవకాశం కల్పించలేదని ఓ వృద్ధురాలు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తాను జీవించి ఉండగానే చనిపోయినట్టు కాగితాలు సృష్టించి తన కుమారులు ఆస్తి రాయించుకున్నారని తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన బత్తినేని నరసమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్థానిక రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా వీఆర్వో సహకరించాడని కన్నీటిపర్యంతమైంది. వీఆర్వో, తన కుమారులు చేసిన మోసంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన పాస్బుస్ కూడా ఇవ్వడం లేదని విలపించింది. తహసీల్దార్ కూడా తన కుమారులకే మద్దతు తెలుపుతున్నారని, పోలీసులను ఆశ్రయించినా నిరాశే ఎదురైందని ఆవేదన చెందింది. ఈ వయసులో తనకు కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేదని, తన కుమారులు రాయించుకున్న 71 సెంట్ల భూమే ఆధారమంటూ వెల్లడించింది. ముఖ్యమంత్రిని కలిసి తన గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు అవకాశం కల్పించలేదని తెలిపింది. సచివాలయం ముందు వృద్ధురాలు బైఠాయించడంతో భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పంపించి వేశారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లోని సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీ ఐల్లోని సీట్లు అన్నింటికి జాయింట్ సీట్ అలకేషన్ అథా రిటీ (జోసా) విద్యార్థులకు కేటాయించింది. ఉమ్మడి ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 25 వరకు ఆప్షన్లకు అవకాశం కల్పించిన జోసా బుధవారం సీట్ల కేటాయింపును ప్రకటించింది. ఇందులో వరంగల్లోని ఎన్ఐటీ, హైదరాబాద్లోని ఐఐటీల్లో ఉన్న సీట్లతోపాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లోని 37 వేల సీట్ల ను విద్యార్థులకు కేటాయించింది. సీట్లు పొందిన వారు ఈ నెల 28 నుంచి జూలై 2 లోగా రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని యాక్సెప్టెన్సీ ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, వరంగల్ ఎన్ఐటీలో రిపోర్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూలై 3న ఉదయం భర్తీ అయిన సీట్లను, ఖాళీగా ఉన్న సీట్లను ప్రకటించనుంది. అదే రోజు సాయంత్రం రెండో దశ సీట్లను కేటాయించనుంది. ఈసారి కౌన్సెలింగ్ను 7 దశల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. మొదటి దశలో వచ్చిన సీటు వద్దనుకుంటే సంబంధిత రిపోర్టింగ్ కేంద్రంలో తెలియజేయాలని అధికారులు వెల్లడించారు. ఆయా విద్యార్థులు మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు లేదని, మొదట ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకొని ఆ తరువాతి దశల్లో సీట్లు కేటాయిస్తారన్నారు. -
అమ్మవారి సన్నిధిలో ఇంత అపచారమా!
ఇంద్రకీలాద్రి/చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలకు తీరని అవమానం జరిగింది. ఓ డార్మిటరీలో దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా ఏర్పాటు చేసి రికార్డ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో దీనిపై సిబ్బందే ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారుల నిర్వాకం చూసి భక్తులంతా అవాక్కవుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్ చేయడం దారుణమంటున్నారు. దీనిపై మహిళాలోకం భగ్గుమంటోంది. అమ్మవారి సన్నిధిలోనే తమకు రక్షణలేక పోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డార్మిటరీలో సీసీ కెమెరా.. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పాడి వీధిలో సీవీ రెడ్డి చారిటీస్ పేరిట కాటేజీ నిర్వహిస్తోంది. ఈ కాటేజీ మెయిన్ హాల్లో లక్ష్మి పేరిట మహిళలకు ప్రత్యేకమైన ఏసీ డార్మిటరీని ఏర్పాటు చేశారు. ఆ డార్మిటరీలో 8 మంచాలు ఉండగా, కొంత ఖాళీ స్థలం కూడా ఉంది. కాటేజీలో వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకొనే సమయంలో మహిళలకు ఏసీ డార్మిటరీని అద్దెకు ఇస్తారు. అక్కడే వారు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. ఆ డార్మిటరీ మొత్తం కనిపించేలా మూడు నెలల కిందట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం కాటేజీలో ఓ వివాహం జరగగా, డార్మిటరీలో పెళ్లి కుమార్తెతో పాటు మరి కొంతమంది ఆమె బంధువులు విశ్రాంతి తీసుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు మిగిలిన మహిళలందరూ అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో మగవారు లగేజీని తీసుకువెళ్లేందుకు డార్మిటరీలోకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ గోడకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను గుర్తించారు. సీసీ కెమెరా పని చేస్తున్నట్లుగా చిన్న లైటు వెలుగుతుండటంతో అనుమానం వచ్చి కాటేజీ కామన్ హాల్లో ఉన్న ఆలయ సిబ్బంది కార్యాలయంలోకి సదరు వ్యక్తులు వెళ్లి చూడగా అక్కడ సీసీ కెమెరా ఫుటేజీ స్పష్టంగా కనిపించింది. దీంతో పెళ్లి వారి బంధువులు ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డింగ్పై నిలదీశారు. బుకాయిస్తున్న అధికారులు.. సీసీ కెమెరాల రికార్డు అంశం విషయం రచ్చకెక్కడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాలు ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈలోగా విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలించగా కార్యాలయంలోని టీవీలో రెండు కెమెరాలు పని చేస్తున్నట్లు విజవల్స్ కనిపించాయి. దీంతో ఆలయ అధికారుల తీరుపై ఇతర భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ఈఈ భాస్కర్ ఘటనా స్థలానికి వచ్చి మహిళల డార్మిటరీలో సీసీ కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఫుటేజీ రికార్డు కావడం లేదని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం పెల్లుబుకుతున్న సమయంలో కెమెరాలను ఆఫ్లైన్లోకి మార్చి వెళ్లిపోయారు. మూడు నెలలుగా ఇదే తీరు... మహిళలు ఉండే కాటేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సరికాదని పలు మార్లు ఇంజనీరింగ్ సిబ్బందిని హెచ్చరించినట్లు సీవీరెడ్డి చారిటీస్ నిర్వహణ చూస్తున్న ఆలయ ఉద్యోగి మేరీ స్వరూప తెలిపారు. కెమెరాలపై ఫిర్యాదులను ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదని, మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని కాటేజీలో పని చేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజవల్స్ బయటకు వస్తే తమ పరిస్థితి ఏంటని మహిళా భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆటలా.. డార్మిటరీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ అధికారులు భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు. డార్మిటరీలో అనుమానితులు ప్రవేశకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. లోపలకు ప్రవేశించే మార్గంలో ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా! లోపల ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటి?. ఇలాంటి ఘటనలు దురదృష్టం దుర్గగుడి పాలనాధికారిగా మహిళ ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జరిగిన దానిని సమర్థించుకునే కన్నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇంత మంది అధికారులు, పాలక మండలి సభ్యులు ఉన్నా ఆలయంలో ఏం జరుగుతోందో భక్తులు చెబితే గాని తెలుసుకోకపోవడం సరికాదు. మహిళలకు రక్షణ లేదు ఆలయాల్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంత వరకు షాపింగ్మాల్స్, హోటల్స్లోనే ఇటువంటి ఘటనలు జరిగినట్లు విన్నాం. ఇప్పుడు ఆలయాల్లోనూ... కాటేజీల్లోనూ ఇదే తంతు అంటే ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? అధికారులు తీరు సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విశ్రాంతి కోసమే డార్మిటరీలు: ఎం.పద్మ, దుర్గగుడి ఈవో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు విశ్రాంతి కోసమే డార్మిటరీలు ఏర్పాటు చేశాం. డార్మిటరీలో బెడ్డు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నాం. కేవలం విశ్రాంతి కోసమే వాటిని వినియోగిస్తున్నాం తప్ప.. దుస్తులు మార్చుకునే స్థలంలా కాదు. మహిళల భద్రత కోసమే డార్మిటరీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.