బాల్య వివాహం.. కౌన్సెలింగ్‌ ఇస్తుండగా జంట పరార్‌.. | Police And Child Line Officers Stop Child Marriage In Warangal | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం.. కౌన్సెలింగ్‌ ఇస్తుండగా పరార్‌..

Jun 29 2021 11:56 AM | Updated on Jun 29 2021 12:52 PM

Police And Child Line Officers Stop Child Marriage In Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  తొర్రూరు(వరంగల్‌ రూరల్‌) : బాల్య వివాహం జరగగా, జంటకు కౌన్సెలింగ్‌ ఇచ్చే క్రమంలో పారిపోయిన ఘటన ఇది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన మైనార్టీ తీరని బాలికతో అదే తండాకు చెందిన బాలుడికి వివాహం జరిగింది.

ఈ మేరకు చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు, పోలీసులు వెళ్లి బాల్య వివాహం వల్ల భవిష్యత్‌లో వచ్చే నష్టాలపై వివరిస్తూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే తప్పు జరిగినందున, సరైన వయస్సు వచ్చిన తర్వాతనే వారిద్దరు కలిసి ఉండేలా చూడాలని సూచించారు. ఇలా కౌన్సెలింగ్‌ ఇస్తుండగానే వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. 

చదవండి: మోదీ ‘మన్‌ కీ బాత్‌’కి వరంగల్‌ చాయ్‌వాలా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement