
యశవంతపుర: ఐఏఎస్ రోహిణి సింధూరి దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఐపీఎస్ అధికారి రూపకు కోర్టులో ముందస్తు బెయిల్ దొరికింది. రూప ఫేసుబుక్లో ఐఏఎస్ రోహిణి సింధూరిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని రూపపై ఐఏఎస్ రోహిణి సింధూరి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రూప బెంగళూరు 24వ ఎసీఎంఎం కోర్టులో మంగళవారం హాజరై బెయిల్ తీసుకున్నారు.