ఐఏఎస్‌ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ క్షమాపణలు | Pakistan Remark: BJP MLC Ravi Kumar Apology IAS Fouzia Taranum | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ రవి క్షమాపణలు

May 27 2025 2:14 PM | Updated on May 27 2025 3:20 PM

Pakistan Remark: BJP MLC Ravi Kumar Apology IAS Fouzia Taranum

బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్‌ రవికుమార్‌ ఐఏఎస్‌ అధికారిణి ఫౌజియా తరణమ్‌(Fouzia Taranum)కు క్షమాపణలు చెప్పారు. ఆమె పాకిస్తాన్‌ నుంచి వచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అక్కడ. అయితే.. 

తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్య చేయలేదంటూ మంగళవారం ఆయన క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో ేనేను భావోద్వేగంలో ఉన్నా. మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా అని ఎన్డీటీవీతో ఎన్‌ రవికుమార్‌(N Ravikumar) అన్నారు.

అసలేం జరిగిందంటే..
బీజేపీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి(Chalavadi Narayanaswamy)  ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే(ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ..  ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్‌ హౌజ్‌ వద్ద నిరసనలు తెలిపారు. అయితే.. 

అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్‌‌ ఫౌజియా తరణమ్‌ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్‌ పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు.ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్‌ ఇక్కడ ఐఏఎస్‌ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్‌ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్‌ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్‌ వ్యాఖ్యానించారు.

మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్‌లో ఫిర్యాదు నమోదుకాగా.. రవికుమార్‌పై కేసు ఫైల్‌ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్‌ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, రవికుమార్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆరా తీస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement