objectionable comments
-
వైఎస్ జగన్ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్కు మండలి లైవ్ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం. -
మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం
లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారాంటూ బుధవారం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారాయన.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మహా కుంభమేళాను మృత్యు కుంభమేళాగా అభివర్ణించిన విషయం తెలిసిందే. కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వం(UP Government) ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలే గుప్పించారామె. అయితే ఆమె వ్యాఖ్యలపై అసెంబ్లీలోసీఎం యోగి ఇవాళ స్పందించారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 56 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిరాధారమైన ఆరోపణలతో ఆమె వాళ్లందరి విశ్వాసాలతో ఆటాడుకున్నారు అని సీఎం యోగి మండిపడ్డారు. జనవరి చివర్లో ప్రయాగ్రాజ్ కుంభమేళా ఘాట్ల వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు, వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చి మృత్యువాత చెందిన వాళ్లకు అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించారాయన. ఈ క్రమంలో.. దీదీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.#WATCH | Lucknow: In the UP assembly, CM Yogi Adityanath says, "While we are participating in the discussion here, at that time more than 56.25 crore devotees have already taken their holy dip in Prayagraj... When we make any baseless allegations or snow fake videos against… pic.twitter.com/VYNnzPn4w1— ANI (@ANI) February 19, 2025కుంభమేళా మృతులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. కానీ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి?. ఈ కుంభమేళాలో దేశం.. ప్రపంచమే పాల్గొంటోంది. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవాల్సిన పనేముంది? అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. యోగి మాత్రమే కాదు పలువురు బీజేపీ నేతలు కూడా మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ మాట్లాడుతూ.. మత విశ్వాసాలు లేనివాళ్లే అలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తారంటూ మండిపడ్డారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా దీదీపై విరుచుకుపడుతున్నాయి. దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ..మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. దీదీ వ్యాఖ్యలకు ఓ అనూహ్య మద్దతు లభించింది. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ 46వ శంకారాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి(సద్గురు) మమత వ్యాఖ్యలతో ఏకీభవించారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది నిర్వహణ లోపం కాకుంటే మరేమిటి?. మహా కుంభమేళా రాబోతోందని మీకు తెలియదా?. అలాంటప్పుడు మీరు చేసే ఏర్పాట్లు ఇవేనా? అంటూ యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన.#WATCH | Bemetara, Chhattisgarh: On West Bengal CM Mamata Banerjee's 'Mrityu Kumbh' remark, Jagadguru Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, "... There was a traffic jam of 300 kilometres, if this is not mismanagement then what is it? People had to walk… pic.twitter.com/pxDXWI5og7— ANI (@ANI) February 19, 2025 -
అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్ను ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్ తరఫు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.బీర్బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్తో రణవీర్ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్ఫారమ్లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్ రైనా, ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలకు నోటీసులు జారీ చేసింది. -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్గాంధీపై బీహార్లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్కు వెళ్లి రాహుల్గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
కన్నీరు పెట్టిన ఆతిశీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిధూరి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని ఆతిశీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: On BJP leader Ramesh Bidhuri's reported objectionable statement regarding her, Delhi CM Atishi says, " I want to tell Ramesh Bidhuri, my father was a teacher throughout his life, he has taught thousands of children coming from poor and lower-middle-class families,… pic.twitter.com/ojQr3w0gVW— ANI (@ANI) January 6, 2025 ఇదీ చదవండి: ఢిల్లీలో మేం సహకరించకుండా ఉండి ఉంటే..! -
మహిళలపై మంత్రి సవిత అభ్యంతరకర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఇవాళ ఏపీ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.జగన్మోహన్రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాంతిచకపోవడంతో మండలిని వాయిదా వేశారాయన. ఇదిలా ఉంటే.. నిన్న ఇదే మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సమయంలో హజ్ యాత్రను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి. -
జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలేబొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారుకార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదుదమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుందిప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతబొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాంపవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారుస్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారుడైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్ సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు -
మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు
అనకాపల్లి, సాక్షి: ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే రోజూ పనిగా పెట్టుకున్నారు. పైగా అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఓ అధికార ఎమ్మెల్యే మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కేటీఆర్ కామెంట్స్పై మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్, సాక్షి: ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్.. త్వరలో కేటీఆర్కు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.మరోవైపు.. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత హీనంగా మాట్లాడారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా? అని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్కు గౌరవం లేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని చెప్పారు. అదే సమయంలో.. రవాణా మంత్రి పొన్నం సైతం కేటీఆర్పై రాష్ట, జాతీయ మహిళా కమిషన్లు కేసు నమోదు చేయాలంటూ కోరారు. -
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. -
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్ప్రదేశ్లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్స్టా అకౌంట్ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్చైర్లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బండారు.. మీ ఇంట్లో ఆడపడుచులు లేరా?: ఎంపీ నవనీత్ కౌర్
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తోంది మహిళా లోకం. ఈ క్రమంలో మాజీ నటికి మద్దతుగా పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ(అమరావతి నియోజకవర్గం), మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం రోజా అండగా నిలిచారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారుపై ఆమె ఆగ్రహం వెల్లగక్కారు. ‘‘బండారు.. అసలు సిగ్గు ఉందా?. మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా?. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారు. నీకు రాజకీయాలు ముఖ్యమా?.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా?.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి’’ అని నవనీత్ కౌర్ ఫైర్ అయ్యారు. ఒక ఎంపీగా, నటిగా, మహిళగా నేను ఏపీ మంత్రి రోజాకు అండగా ఉంటా. నేనే కాదు.. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటుందని నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘‘రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్ హీరోల సరసన నటించారు. ఆమెను ఇంతలా కించపర్చడం సరికాదు. రాజకీయాల్లో ఇంతలా దిగజారి మాట్లాడటమూ మంచిది కాద’’ని నవనీత్ కౌర్ హితవు పలికారు. ఇప్పటికే సీనియర్ నటులు కుష్బూ సుందర్, రాధికా శరత్కుమార్ రోజాకు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు నవనీత్ కౌర్ రాణా సైతం మద్దతుగా నిలిచారు. pic.twitter.com/QqzVrG5V5t — Navnit Ravi Rana (@navneetravirana) October 7, 2023 -
టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం
సాక్షి, చెన్నై: టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారామె. రోజాపై బండారు వ్యాఖ్యలు దారుణం. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు అని అన్నారామె. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారామె. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
గుంటూరు పీఎస్లో బండారు.. ఓవరాక్షన్ చేస్తోన్న పచ్చ బ్యాచ్
సాక్షి, విశాఖపట్న/గుంటూరు: ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. గుంటూరు జైలుకు తరలించే టైంలో.. ఆఖరికి ఇవాళ పీఎస్ బయట టీడీపీ శ్రేణులు చేసిన ఓవరాక్షన్ మామూలుగా లేదు. అంతేకాదు పోలీసులు ఆయన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నట్లు పచ్చ మీడియా వరుస కథనాలతో నానా రభస చేస్తోంది. సోమవారం రాత్రి వెన్నెలపాలెంలో ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు శతవిధాల యత్నించాయి. ఆపై ఆయన్ని గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఆపై ఈ(మంగళవారం) ఉదయం నుంచే ఆయన్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులో బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. విచారణ కోసం స్టేషన్కు తరలించారు. అంతకు ముందు మంత్రి రోజాను ఉద్దేశించి జుగుప్సాకరంగా మాట్లాడిన బండారును అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం డీజీపీని కోరారు. ఇదీ చదవండి: బండారు వ్యాఖ్యలపై రోజా రియాక్షన్ ఇది ఇక ఆయన్ని నగరంపాలెం పీఎస్ తరలించారనే సమాచారంతో పీఎస్ వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నా.. పట్టించుకోకుండా అతి చేష్టలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు బందోబస్తులో ఉన్న పోలీసులపై టీడీపీ నేతలు చిందులు తొక్కుతున్నారు. ‘‘మా గవర్నమెంట్ వచ్చాక ఏం చేస్తామో చూడు.. నీ అంతు చూస్తా’’ అంటూ వెస్ట్ డీఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు బెదిరించిన దృశ్యాలు కనిపించాయి. -
‘రాజకీయాల నుంచే కాదు.. దేశ బహిష్కరణ చేయాలి’
సాక్షి, గుంటూరు: చరిత్రలో చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యయం అయితే.. ఆ పాలనలో పేదలకు ఇల్లు అనేది ఒక కలగానే ఉండిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేయడానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. కోపం, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు సజ్జల. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. 2014-19 మధ్య రాష్ట్రంలో పేదలకు ఎక్కడైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. నిజంగా ఇస్తే ఎవరికి ఇచ్చారో బయట పెట్టగలరా?. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం. కనీసం టిట్కో ఇళ్లలో కూడా 16 గజాలు ఇవ్వలేదు. అందులో కూడా కాంట్రాక్టర్లకు అధిక రేట్లుకు ఇచ్చి.. వారి నుండి కిట్ బ్యాగులు తీసుకున్నారు. ఇప్పుడేమో సెంటు స్థలంలో మురికివాడలు అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అని సజ్జల మండిపడ్డారు. చక్కని రోడ్లు, మంచినీరు, కరెంటు అన్నీ కల్పిస్తుంటే మురికివాడలు అంటారా?. స్థానిక ఎమ్మెల్యేలు ఆ పేదలకు సామాజిక బాధ్యతగా సిమెంట్, ఇసుక, కంకర లాంటివి తక్కువ రేటుకు ఇప్పిస్తున్నారు. జగన్ కట్టించిన టిట్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని సజ్జల అన్నారు. ముందస్తు ఎన్నికలనే తప్పుడు ప్రచారం చేసుకుని పార్టీని బతికించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని, చంద్రబాబు బలవంతుడు అవుతాడని భావించినప్పుడే తాము ముందస్తుకు వెళ్తామని.. కానీ, అలాంటిదేం లేనప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏంటని సజ్జల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబుది దింపుడుకల్లం ఆశ. లోకేష్ ఎదగలేదనీ, పార్టీ బతకదని చంద్రబాబుకు పూర్తిగా అర్థం అయ్యింది. అందుకే ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారు’’ అని సజ్జల అన్నారు. -
బండి సంజయ్పై మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గుర్రుగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర మహిళ కమిషన్. ఈ క్రమంలో తాజాగా నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్.. డీజీపీని వ్యక్తిగత విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది కూడా. ఇక ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. బండి సంజయ్కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. -
రామోజీలో నురగలు కక్కుతోన్న విద్వేషం.. గంజాయి మత్తు రాతలెందుకు?
ఈనాడు అధినేత రామోజీరావు తెగబడుతున్నారు. చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్క అన్నారంటే ఆయనలోని అహంకారం, విద్వేషం ఏ రకంగా నురగలు కక్కుతోంది ఇట్టే తెలిసిపోతుంది. గత కొన్నాళ్లుగా ఆయన ఎపి ప్రభుత్వంపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన అప్రకటిత అధర్మయుద్దం చేస్తున్నారు. ఎన్ని దారుణాలు చేసి అయినా, ఎన్ని అసత్యాలు రాసి అయినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు తాలిబన్ల రాజ్యం అని సంపాదకీయం రాస్తారు. మరో రోజు వైసిపి వలంటీర్లు అని మరో దిక్కుమాలిన ఎడిటోరియల్ రాస్తారు. దురహంకారం పరాకాష్టకు తాజాగా అమ్మకానికి అమరావతి అంటూ అద్వాన్నమైన సంపాదకీయం రాశారు. ఈనాడు రిపోర్టర్లు రాసే అబద్దాలు, అర్దసత్యాలతో ఆయన సంతృప్తి చెందక, స్వయంగా రంగంలో దిగుతున్నారని అనుకోవాలి. అందువల్లే వృద్దాప్యంలో ఉండి కూడా ఆయన ఉచ్ఛనీచాలు మర్చిపోతున్నారు. ఏభై శాతం పైగా ఓటర్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, 151 సీట్లతో అసాధారణ విజయం సాధించిన ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్క అన్నారంటే ఎంత దురహంకారం ఉండాలి. ఆయన రాసిన సంపాదకీయాలు నాసి రకంగా ఉండడమే కాదు.. ఎవరైనా గంజాయి తాగితేకాని అలా రాయలేరన్న చందంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. ముఖ్యమంత్రి జగన్ను గంజాయి మొక్క అనడం ద్వారా రామోజీరావు రాక్షసానందం పొంది ఉండవచ్చు. కాని అదే సమయంలో ఆయన జర్నలిజంలో ఒక గంజాయి తోట పెంచుతున్నారని, ఆ తోటలో ఈనాడును ఒక పెద్ద గంజాయి మొక్కగా తయారు చేసి, చిన్న గంజాయి మొక్కలతోటి ఇలాంటి చెత్త సంపాదకీయాలు రాయిస్తున్నారని ఎవరైనా అనుకుంటే తప్పేం ఉంటుంది. విలువలు, ప్రమాణాలకు పాతరేసి జనాన్ని మోసం చేయడానికి, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోయడానికి ఆయన పడరాని పాట్లు పడుతున్నారని తెలుసుకోవడం కష్టం కాదు. ఈ ప్రశ్నలకు బదులేది రామోజీ అమరావతి ప్రాంతంలో ఎక్కడో ఒక చోట 14 ఎకరాల భూమిని అదికారులు అమ్మకానికి పెట్టారట. అంతే! రామోజీలో దురహంకారంతో కూడిన ఆవేశం బుసలు కొట్టింది. ఇప్పటికే ఆంద్ర ప్రదేశ్ పాలిట కాలనాగు మాదిరి తయారైన ఆయన ఎక్కడా ఒక అభివృద్ది జరగడానికి వీలు లేకుండా అడ్డుపడుతున్నారు. రాజధానికి సంబంధించి హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందట. శాసనసభకు చట్టం చేసే హక్కు లేదని చెబితే ఈయనకు చారిత్రాత్మకంగా కనిపించింది. అనుకున్నట్లు అమరావతి రాజధాని సాకారమైతే అది కామధేనువు అయ్యేదట. అచ్చంగా తెలుగుదేశం నేత మాదిరే రాశారు తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడే సందేహం వస్తుంది. రామోజీకి , ఆయన మనుషులకు ఇది కామధేనువుగా మారి ఉండేదేమో! నిజంగానే అంత సీన్ ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు తాత్కాలిక భవనాలు నిర్మించారు? ఎందుకు శాశ్వత భవనాలు కట్టలేదు? అసలు ఒక ప్రధాన రహదారిని అయినా పూర్తి చేయలేదే? చివరికి తాను ఉండే కరకట్ట రోడ్డును కూడా అభివృద్ది చేయలేదే? రాజధాని కట్టడానికి లక్షతొమ్మిది వేల కోట్లు కావాలని కేంద్రానికి ఎందుకు చంద్రబాబు లేఖ రాశారు? చంద్రబాబు, రామోజీరావులు ఇప్పుడు చెబుతున్నట్లు అది స్వయం సిద్దమైనది అయితే అప్పుడు కేంద్రాన్ని ఎందుకు డబ్బు అడిగారు. కేంద్రం తాము ఇవ్వలేమని తేల్చేసింది కదా? అది సెల్ఫ్ పైనాన్సింగ్ అంటే భూములు అమ్మి సంపాదిస్తామని ఆనాడే చెప్పారు కదా? ప్రస్తుతం ఏదైనా చిన్న పనికి భూమి అమ్మబోతే ఎందుకు రామోజీ అడ్డుపడుతున్నారు? అదేదో న్యూయార్క్ లోని ఒక పత్రిక భవిష్యత్తు నగరాలలో ఇది ఒకటి అని రాసిందట. అంతే ఈనాడు, మరికొన్ని టిడిపి పత్రికలు బట్టలు చించుకున్నాయి. అంటే ఒక బొమ్మ గీసి ఇదే భవిష్యనగరం అని అనుకొమ్మంటే జనం పిచ్చివాళ్లా? ఎపి ప్రజల మొత్తం పన్నుల డబ్బును అమరావతిలో ఖర్చు చేస్తే కొన్ని వందల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితే పడి ఉండవచ్చు. కాని కోట్లాది మంది పేదలకు జరిగే మేలు ఏమిటి? అసలు ఆ నగరం నిర్మాణానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? దేశంలో కొత్త నగరం ఏదైనా ఆ స్థాయిలో నిర్మించారా. గుజరాత్, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో ఎంత వ్యయంతో కొత్త రాజధానులు కట్టారో రామోజీకి తెలియదా? ఈనాడు అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా ముక్కారు పంటలు పండే భూములను రైతులు స్వచ్చందంగా ఇచ్చారట. అసలు మూడు పంటలు పండే భూములను ఇలా రాజధాని పేరుతో ప్రభుత్వం తీసుకోవచ్చా? ఆ రోజుల్లో భూములు ఇవ్వడానికి ఇష్టపడనివారిపై ఎన్నిరకాల వేధింపులు జరిగాయో తెలియదా? అవును గంజాయి తాగి సంపాదకీయాలు రాసేవారికి అవేవి కనిపించవు కదా! టిడిపి ప్రభుత్వమే ఆనాడు పంటలను దగ్దంచేయడానికి పూనుకుందన్న ఆరోపణలు అవాస్తవమా? ఉండవల్లి,పెనుమాక వంటి గ్రామాల రైతులు ఎన్ని బాధలు పడింది వీరు గుర్తించరా? ఇవేమి జరగకపోతే ఆనాడు జనసేన అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ గ్రామాలలో పర్యటించి వారికి అనుకూలంగా మాట్లాడారు? మూడు పంటలు పండే భూములను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కితే ఈనాడు గంజాయి మత్తులో మునిగితేలిందా? ఒకప్పుడు శ్రీసిటీ పరిశ్రమల స్థాపనకోసం పెద్దగా పంటలు పండని భూములను సేకరిస్తే అమ్మో .. వ్యవసాయ భూములు తీసుకుంటారా? అని రాసిన ఈనాడు పత్రిక, రాజధానికోసం మూడు పంటలు పండే భూములు తీసుకోవడం సమర్ధనీయమని అంటోంది. పైగా ఆసాములు ఉదారంగా భూములు ఇచ్చారట. అదేమిటి? మంచి ప్యాకేజీతో పాటు ఏటా ఎకరాకు ఏభైవేల రూపాయల కౌలును కాణీ ఖర్చు లేకుండా తీసుకుంటున్నారు కదా? అభివృద్ది చేసిన ప్లాట్లు తీసుకుంటే అది ఉదారం అవుతుందా? ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు, రైతులు పాదయాత్ర చేస్తుంటే వైసిపి మందలు దాడులు చేశాయట. ఏమి రాతలో చూడండి. గుడివాడ వెళ్లి కొందరు మహిళలు కారు ఎక్కి మరీ తొడలు కొట్టారే? వారి ఆస్తులు పెరిగితే రాష్ట్రం బాగుపడినట్లా రామచంద్రపురం వద్ద రైతులను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఐడి కార్డులు చూపాలని అడిగితే పట్టుమని పది మంది లేకుండాపోయారే? నిజంగా రైతులు అయితే తమ యాత్ర కొనసాగించేవారు కదా? ఎవరు అడ్డుకుంటారు? రాజధాని గ్రామాలలో అప్రజాస్వామిక రాజ్యం నడుస్తోందట. అది నిజమే అయితే రైతుల పేరుతో అక్కడ నిత్యం ధర్నాలు ఎలా చేయగలుగుతారు? జగన్ సర్కార్ కు ఎలాంటి శిక్ష వేస్తారో ప్రజలే నిర్ణయిస్తారట. అమ్మ ఒడి పేరుతో, స్కూళ్లలో నాడు-నేడు పేరుతో విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్న జగన్ కు ప్రజలు శిక్ష వేయాలట. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, చేయూత స్కీమ్, చేనేత నేస్తం, కాపు నేస్తం, అనేక స్కీములు అమలు చేస్తూ, మరో వైపు పరిశ్రమల రంగంలో విశేష అభివృద్దికి కృషి చేస్తున్న జగన్ కు శిక్ష వేయాలని గంజాయి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? రామోజీ, చంద్రబాబు వంటివారు కేవలం తమ ఆస్తుల విలువ పెరిగితే రాష్ట్రం బాగుపడినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదలను ఆదుకునే స్కీములు అమలు చేస్తే రాష్ట్రం విధ్వంసం అయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగానే రామోజీ దుష్టచతుష్టయంలో ఒకరిగా రుజువు చేసుకుంటున్నారు. అంతేకాదు జగన్ చెబుతున్నట్లు.. వచ్చేది పేదలు, పెత్తందార్ల మద్య యుద్దమే. రామోజీ ఒక పెత్తందారు అయితే, జగన్ పేదల తరపున ప్రతినిధిగా పోరాడుతున్నారు. పెత్తందార్లు ఎల్లవేళలా గెలవలేరని చరిత్ర చెబుతోంది. గంజాయి మత్తులో ఉన్నవారికి ఆ విషయం తెలియడానికి ఇంకా సమయం పడుతుంది కదా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
Pawan Khera: విమానం నుంచి దించేసి మరీ అరెస్ట్!
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇవాళ పెద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. గురువారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రాయ్పూర్(ఛత్తీస్గఢ్) బయల్దేరిన ఆయన్ని.. సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు అసోం పోలీసులు. విమానం నుంచి దించేసి మరీ.. రెండు గంటల పాటు ఆగి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. రాయ్పూర్లో జరగబోయే ఏఐసీసీ ప్లీనరీ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన అసోం పోలీసులు.. ఆయన్ని విమానం నుంచి దించేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సీనియర్లు అడ్డుకునే యత్నం కూడా చేశారు. ఆపై రెండు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ చూపించి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ.. సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ నేతలు విమానం టేకాఫ్ కానివ్వకుండా అడ్డుకుంటూ నిరసనకు దిగారు. బోర్డింగ్ పాస్ ఉన్న అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు తీసుకెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత పోలీసులు వచ్చి మీ బ్యాగేజీతో సమస్య అని చెప్పారు. కానీ, నేను ఒక హ్యాండ్ బ్యాగ్తో మాత్రమే బయల్దేరాను. అందుకే అనుమానం వచ్చింది. ఆపై వాళ్లు మీరు విమానంలో ప్రయాణించలేరు. డీసీపీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు అంటూ చెప్పారు. చాలా సేపు ఎదురుచూసినా ఆయన రాలేదు అని ఖేరా తెలిపారు. చివరకు పోలీసులు ఆయన్ని వ్యాన్ ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. मुझे कहा गया कि आपके सामान को लेकर कुछ समस्या है, जबकि मेरे पास केवल एक हैंडबैग है। जब फ्लाइट से नीचे आया तो बताया गया कि आप नहीं जा सकते हैं। फिर कहा गया- आपसे DCP मिलेंगे। मैं काफी देर से इंतजार कर रहा हूं। नियम, कानून और कारणों का कुछ अता-पता नहीं है। : @Pawankhera जी pic.twitter.com/637WUlBDpJ — Congress (@INCIndia) February 23, 2023 ఇక ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ కేసీ వేణుగోపాల్(అరెస్ట్ సమయంలో ఆయన కూడా పవన్ వెంట ఉన్నారు) ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం గూండా రాజ్యంగా వ్యవహరిస్తోందని, పవన్ఖేరాను బలవంతంగా నోరు మూయించే సిగ్గుమాలిన చర్యకు దిగిందని విమర్శించారాయన. అలాగే.. పార్టీ మొత్తం పవన్కు అండగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు ఇది సుదీర్ఘ పోరాటమని, దేనికైనా సిద్ధమంటూ పవన్ ఖేరా ప్రకటించారు. ఆ కామెంట్తో మొదలు.. ఇదిలా ఉంటే.. పవన్ ఖేరా తాజాగా ఓ ప్రెస్మీట్లో హిండెన్బర్గ్-అదానీ అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో.. పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ)లపై అభ్యంతరం లేనప్పుడు.. నరేంద్ర గౌతమ్ దాస్.. క్షమించాలి..(పక్కనే ఉన్న ఓ నేతను అడిగి మరీ) దామోదర్దాస్ మోదీ ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆపై ‘పేరేమో దామోదర్దాస్, పని మాత్రం గౌతమ్దాస్(అదానీని ఉద్దేశిస్తూ..) కోసం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ప్రధాని మోదీ తండ్రి ప్రస్తావన తెచ్చి మరీ పవన్ ఖేరా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. పవన్ ఖేరాతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణలు తెలియజేయాలని బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించింది. మరోవైపు ఆయనపై పలువురు బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. Make no mistake- pathetic remarks by courtier Pawan Khera on PM’s father have blessings of the top levels of Congress, which is full of entitlement and disdain against a person of humble origins being PM. India will not forget or forgive these horrible remarks of Congressmen. — Himanta Biswa Sarma (@himantabiswa) February 20, 2023 -
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!!
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!! -
ఆయన వెరీ డేంజర్: కేంద్రమంత్రి జైశంకర్
ఢిల్లీ: మెల్బోర్న్ హంగేరియన్-అమెరికన్ బిలియనీర్, ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై 92 ఏళ్ల సోరస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారాయన. నిన్న(శుక్రవారం) మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సోరస్కు వయసైపోయింది. ఆయనవి మూర్ఖమైన అభిప్రాయాలు అని జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో కూర్చుని ప్రపంచం మొత్తం ఎలా పని చేయాలో తానే నిర్ణయించాలని సోరస్ అనుకుంటున్నారు. ఆయన వయసైపోయిన వ్యక్తి. ధనికుడు. నచ్చిన అంశాలపై తన అభిప్రాయాలను చెప్తుంటాడు. అంతకు మించి ఆయనొక ప్రమాదకరమైన వ్యక్తి అని జైశంకర్ అభివర్ణించారు. తనకు నచ్చిన వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే అది మంచిదని సోరస్ భావిస్తాడు. అదే ఫలితం మరోలా వస్తే గనుక.. ప్రజాస్వామ్యంలో తప్పులు వెతుకుతాడు అంటూ జైశంకర్, సోరస్ గురించి వ్యాఖ్యానించారు. వలసవాదం నుంచి వెలుగులోకి వచ్చిన భారత్కు.. బయటి నుంచి జోక్యాలతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో బాగా తెలుసని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బ్రౌన్తో చర్చ సందర్భంగా.. జైశంకర్ పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. PM మోదీ ప్రజాస్వామ్యవాది కాదని, ముస్లింలపై హింసను ప్రేరేపించడం వల్లే ఆయన స్థాయి పెరిగిందంటూ సోరస్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి. హిండెన్బర్గ్-అదానీ వ్యవహారంపైనా విదేశీ పెట్టుబడిదారులకు, భారత్లోని విపక్షాలకు మోదీ సమాధానం చెప్పాల్సిందని సోరస్, మ్యూనిచ్(జర్మనీ) సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సోరస్ గురించి తెలుసా? ఆయనో ఆర్థిక నేరగాడు! -
Mahua Moitra: సారీనా? నేనెందుకు చెప్పాలి?
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పేదే లే అంటున్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో.. మెహువా లేచినిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై పెను దుమారమే రేగింది. బీజేపీ ఎంపీలు ఆమె వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అయితే వివరణాత్మక క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్పై ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. యాపిల్ను యాపిల్ అనే అన్నాను. అందులో తప్పేం ఉంది. నేను ఏదైతే అన్నానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని బుధవారం పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారామె. సారీనా? ఎందుకు చెప్పాలి?. గతంలో ఇదే పెద్దమనిషి(రమేశ్ బిదూరిని ఉద్దేశించి) రైతులను వ్యభిచార గృహాల నిర్వాకులని వ్యాఖ్యానించాడు. అది పార్లమెంట్ రికార్డుల్లోనూ ఉంది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను. Mahua Moitra using cuss word like “harami” in Parliament And Brut won’t show this 😀 pic.twitter.com/y8gMNXTR3i — Rishi Bagree (@rishibagree) February 7, 2023 బీజేపీకి చెందిన గౌరవనీయులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారూ రాజ్యసభలో.. డాక్టర్ శాంతనూ సేన్ను ఉద్దేశించి అభ్యంతరకర పదం వాడారు. అయినా పార్లమెంట్లో ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్తేం కాదు కదా. ఒక మహిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. మంచిగా తిరిగి ఇవ్వడానికి నేను పురుషుడినే కావాలా ఏంటి?. అయినా.. బీజేపీ వాళ్లు పార్లమెంటరీ మర్యాదలు బోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారామె. ఇదిలా ఉంటే మెహువా వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ హేమా మాలిని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుకను అదుపులో ఉంచుకోవాలని. భావోద్వేగంలో ఏది పడితే అది మాట్లాడొద్దని.. పార్లమెంట్లో సభ్యులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని హేమమాలిని వ్యాఖ్యానించారు. -
అన్స్టాపబుల్గా ఏమైనా చేసుకోండి, కానీ.. ఈ కామెంట్లు అవసరమా బాలయ్యా?
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, జనసేన అధినేత, మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్అ న్స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కాని మధ్యలో ప్రజలను ఉద్దేశించి , లేదా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగులు చేసేవారి గురించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ప్రత్యేకించి బాలకృష్ణ ఊరకుక్కల భాష వాడడం దారుణం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఎవరైనా మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అట. అసలు ఊరకుక్కలు ఏమి చేస్తాయో ఆయనకు తెలుసా! వావి వరసలతో నిమిత్తం లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడతాయని, రోడ్లపై ఇష్టారీతిలో సంచరిస్తాయని ఊరకుక్కలు అంటారు. ఏ రంగంలో ఎవరు ఇలా వ్యవహరిస్తారో ఇలాంటి చెత్త పనులు ఎక్కువగా చేస్తారో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనకు సభ్యత అడ్డువస్తుంది. కాని అలాంటి వాటితో నిమిత్తం లేని వారు ఏమైనా మాట్లాడగలరు. గతంలో ఇదే బాలకృష్ణ ఏమన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి. లేక... చేయాలి అని అన్నారు. ఆక్షేపణీయపు భాష వాడడం ఇష్టం లేక డాట్ లు పెట్టాల్సి వచ్చింది. ఆడపిల్లల తండ్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంతేకాదు .. సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న నృత్యాలు, అబ్జెక్షనబుల్ సన్నివేశాలు ఎన్ని కనిపిస్తుంటాయో, వాటిపై అప్పుడప్పుడు మహిళా సంఘాలు ఎందుకు ఆందోళనలు చేస్తుంటాయో.. ఇవేవి ప్రజలకు తెలియవా? కేవలం మూడు పెళ్లిళ్లు అని ప్రస్తావిస్తేనే ఊరకుక్కలతో సమానం అయితే పైన చెప్పినవాటిని ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసేవారిని ఏమనవలసి వస్తుంది. తన ఇంటిలోనే ఇద్దరిపై కాల్పులు జరిపినవారిని ఏమనాలి? సినిమాలతో పాటు రాజకీయాలలో ఉన్నవారు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారి అభిమానులు కూడా ఇలాగే తయారవ్వరా? సడన్ గా బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ పై రాజకీయ అవసరాల రీత్యా అభిమానం ఏర్పడవచ్చు. అంతకుముందు జనసేనవారిని ఉద్దేశించి అలగాజనం అని, మరొకటి అని అన్నా, పవన్ కళ్యాణ్ పెద్దగా ఫీల్ కాకపోతే అది ఆయన ఇష్టం. కాని ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అంటే మాత్రం కచ్చితంగా చాలామంది బాదపడతారు. దానిపై అదే స్థాయిలో స్పందిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయట. పవన్ కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేస్తే జనం ఒప్పేసుకోవాలా! ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినా చిత్రంగానే ఉంటాయి. అసలు ఇలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేయవచ్చు. అయినా వారిద్దరూ కావాలని మాట్లాడుకున్నారు. తద్వారా అదేదో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు.. అది చాలా చిన్న విషయం అన్నట్లుగా వీరి సంభాషణ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు చెబుతుంటారు. వాటిలో నిజం ఉందో లేదో ఎవరికి అర్ధం కాదు. ఈసారి ఏకంగా ఆయన బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానని, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నా అని ఆయన చెప్పారు. కాని, మూడు సార్లు పెళ్లి జరిగింది తనకేనా అనిపిస్తుందట. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండ లేదని ఆయన అంటూ పెళ్లిళ్లకు కారణాలు చెప్పారు. కాని ఇక్కడ కూడా ఆయన నిజం చెప్పలేకపోయారు. ఆయన యోగి అవుతాననుకున్నది నిజమా? కాదా అన్నది మనకు అనవసరం. ఒక పెళ్లి చేసుకుని మరో మహిళతో సహజీవనం చేశారన్నది ఆయనపై కొందరు చేసే అబియోగం. అది వాస్తవమా? కాదా? అన్నదానిపై ఆయన క్లారిటీ ఇస్తే ఆయనలోని నిజాయితీ ప్రజలకు కాకపోయినా, అభిమానులకు అయినా అర్దం అయ్యేది. విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు. ఆయన అన్నది అంతవరకు వాస్తవమే. కాని అలా చేయలేదన్నది ఆయన ప్రత్యర్ధులు చేసే ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ కొందరు విశిష్ట వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, అంబేద్కర్, పూలె, తరిమెల నాగిరెడ్డి, రామ్ మనోహర్ లోహియా వంటివారు రచించిన పుస్తకాలు చదివానని అంటారు. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపై ఆధారపడతారట. అసలు వారు రాసిననాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు సంబంధం ఉందా? 2009లో ప్రజారాజ్యం, 2014 లో జనసేనను స్థాపించి టిడిపి, బిజెపిలకు మద్దతు ఇవ్వడం, 2019లో బిఎస్పి, వామపక్షాలతో కలిసి పోటీచేయడం, తదుపరి బిజెపివారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకోవడం. వీటన్నిటిలో ఆ ప్రముఖుల పుస్తకాలతో ఏమి సంబంధం. పాపం.. ఆ మహనీయులు జీవించి ఉంటే ఎంత క్షోభ పడేవారో! ఏదో ఒకటి చెప్పి తానేదో గొప్ప చదువరిని అని ప్రొజెక్టు చేసుకోవడం తప్ప మరొకటి కాదు. సిపిఐ సీనియర్ నేత చంద్రశేఖర్ టీవీలలో ఒక వ్యాఖ్య చేసేవారు. పవన్ కళ్యాణ్ ఎనభైవేల పుస్తకాలు చదవలేదని, వాటి అట్టలను మాత్రమే చూసి ఉంటారని పేర్కొన్నారు. మరి ఎవరు కరెక్టో వారే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువు వంటివారని, ఆయనతో ఆయా అంశాలతో చర్చిస్తానని అన్నారు. ఏమి చర్చిస్తారో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ ఆయన రాసిచ్చే డైలాగులనే సభలలో వాడుతుంటారని అంతా చెబుతుంటారు. కొంతలో కొంత ఇదైనా నిజం చెప్పినందుకు సంతోషించాలి. ఇలాంటి అన్ స్టాపబుల్ కార్యక్రమాలతో ఒటిటికి ఏమైనా లాభం కొంత ఉండవచ్చేమో కాని, రాజకీయంగా ప్రయోజనం అంతంతమాత్రమే అని చెప్పాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
వివాదంలో చిక్కుకున్న ప్రముఖ రచయిత.. ఎస్పీకి ఫిర్యాదు
సినీ రచయిత అనంత శ్రీరామ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సదరు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం ఇప్పటికే నిషేదించగా భట్రాజులను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆ కులస్తులు మండిపడుతున్నారు. నిషేధిత పదాన్ని ఉపయోగించినందున అనంత శ్రీరామ్పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అనంత శ్రీరామ్ సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. -
Telangana: మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు తెలియజేశారు. మెడికల్ విద్యార్థులకు ఓరియెంటేషన్ డే సందర్భంగా తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయన ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు. తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ కోడలు కిట్టీ పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేదని, అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు తన మెడికల్ ఇనిస్టిట్యూట్కు ఎండీ అయ్యిందని, మీరు(విద్యార్థులను ఉద్దేశించి..) కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి కాలేజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో.. ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రసంగంలో ఏదో ఫ్లోలో అలా మాట్లాడానని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు ఆయన వీడియోలో వెల్లడించారు. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారంటూ విద్యార్థులకు హితబోధ చేసే సమయంలో చామకూర మల్లారెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. -
ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్మస్క్పై తీవ్ర విమర్శలు చేశాడు అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్(45). తాజాగా వెస్ట్ ట్విటర్ అకౌంట్పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ బాస్ ఎలన్ మస్క్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు వెస్ట్. అమెరికన్ ర్యాపర్ యే అలియాస్ కాన్యే వెస్ట్ ఎలన్ మస్క్పై దారుణమైన పోస్ట్ చేశాడు. ఎలన్ మస్క్లో ప్రవహించే సగం రక్తం చైనాదేనా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. ‘‘ఎలన్ సగం చైనీస్ అని నేను మాత్రమే అనుకుంటున్నానా?.. అతని చిన్నప్పటి ఫొటోలు ఎవరైనా చూశారా? ఒక చైనీస్ మేధావిని తీసుకొచ్చి.. అతనితో దక్షిణాఫ్రికా సూపర్ మోడల్తో కలయిక జరిపించారు. అలా ఎలన్ మస్క్ పుట్టుకొచ్చాడు అంటూ తీవ్ర కామెంట్లు చేశాడు. నేను ఒక్క ఎలన్ అనే అంటున్నా. ఎందుకంటే.. బహుశా వాళ్లు పది నుంచి 30 మంది ఎలన్ మస్క్లను పుట్టించాలని అనుకున్నారేమో!. కానీ, అతను(మస్క్) మొదటి జన్యు సంకరజాతిగా చిక్కున్నాడు అంటూ తీవ్రంగా పోస్ట్ చేశాడు కాన్యే వెస్ట్. అయితే ఈ ర్యాపర్ పైత్యం ఇక్కడితోనే ఆగలేదు. సరే ఒబామా.. గురించి మరచిపోకూడదు. చర్చిలో నీచ పదాలను ఉపయోగించినందుకు నన్ను క్షమించండి. కానీ, ఒబామా అనే పదానికి ఇంకా నాకు మరో పదం లేదంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశాడు. 22సార్లు గ్రామీ అవార్డులు గెల్చుకున్న కాన్యే వెస్ట్.. ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియన్ పార్ట్నర్(మాజీ)గా కూడా సుపరిచితుడే. అయితే.. హింసను ప్రేరేపించే కంటెంట్ను పోస్ట్ చేశాడనే కారణంతో ట్విటర్ అకౌంట్ను ట్విటర్ బ్యాన్ చేసింది. ఈ మధ్య కాలంలో ఇలా జరగడం ఇది రెండోసారి. తాజా సస్పెన్షన్పై మస్క్ స్పందిస్తూ.. తానెంతో ప్రయత్నించినా ఈ చర్యను ఆపలేకపోయానంటూ పశ్చాత్తాపం సైతం వ్యక్తం చేశాడు. వెస్ట్ విషయంలో ఎలన్ మస్క్ ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. తాజా బ్యాన్ తర్వాత మస్క్పై ఇలా తీవ్ర వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు వెస్ట్. View this post on Instagram A post shared by Ye (@kanyewest) -
రామ్దేవ్ అసభ్యకరమైన కామెంట్లు.. సారీ చెప్పాల్సిందే!
ఢిల్లీ: యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రామ్దేవ్ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల రామ్దేవ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు పలువురు. ఈ తరుణంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ రాందేవ్పై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య(అమృతా ఫడ్నవిస్ పక్కనే ఉన్నారు ఆ టైంలో) ఎదుట స్వామి రామ్దేవ్.. మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి కూడా. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం బాధించబడింది. కాబట్టి, దేశానికి రామ్దేవ్ క్షమాపణలు చెప్పాలి అని స్వాతి మలివాల్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్దేవ్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసనలు చేసింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నేతలు. మరోవైపు సీపీఐ నారాయణ, రామ్దేవ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. యోగా పేరుతో నటిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని రామ్దేవ్పై మండిపడ్డారు. అలా మొదలైంది.. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన కార్యక్రమంలో రామ్దేవ్ ప్రసంగిస్తూ.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్, సూట్స్లో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం మొదలైంది. శివసేన థాక్రే వర్గ నేత సంజయ్ రౌత్, బాబా రామ్దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారంటూ అమృతా ఫడ్నవిస్ను సైతం ప్రశ్నించారాయన. महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7 — Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022 సంబంధిత వార్త: మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు.. -
‘రాష్ట్రపతిపై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’.. ఆ మంత్రిపై టీఎంసీ ఫైర్
కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో విపక్షాలు అధికార టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. ఆయన తీరు బాధ్యతారాహిత్యమేనని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతిని సాకెత్ గోఖలే ట్వీట్ చేశారు. ‘ఇది బాధ్యతారాహిత్యంగా చేసిన కామెంట్. ఆ వ్యాఖ్యలతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. మేము భారత రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నాం. మేము ఆమెను, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తాం.’ అని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి సాకెత్ గోఖలే. Statement: This is an irresponsible comment & does NOT represent the views of @AITCofficial. We are extremely proud of the President of India & hold her & her office in the highest regard. https://t.co/v571435Snv — Saket Gokhale (@SaketGokhale) November 12, 2022 మంత్రి క్షమాపణలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన క్రమంలో క్షమాపణలు చెప్పారు టీఎంసీ మంత్రి అఖిల్ గిరి. ‘రాష్ట్రపతిని నేను చాలా గౌరవిస్తాను. సువేందు అధికారికి సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించా. ఎవరి పేరును చెప్పలేదు. ఆయన అఖిల్ గిరి చాలా అంద వికారంగా ఉంటారని చెప్పారు. నేను ఒక మంత్రిని. నాగురించే ఏదైనా చెడుగా చెబితే.. అది రాజ్యాంగానికే అవమానం. నేను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ, ఎవరి పేరు చెప్పలేదు. దీనిని భారత రాష్ట్రపతి అవమానంగా భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా. నేను చెప్పినదానికి పశ్చాతాపపడుతున్నా.’ అని పేర్కొన్నారు మంత్రి అఖిల్ గిరి. I respect President. I mentioned the post&made a comparison to respond to Suvendu Adhikari,I didn't take any name. He had said Akhil Giri looks bad in his appearance. I'm a min,took oath to office. If something is said against me, it's an insult to Constitution: WB Min Akhil Giri pic.twitter.com/9w1oY2BuZA — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్ -
రాష్ట్రపతి ముర్ముపై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు! వైరల్
కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నందిగ్రామ్లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యాయి. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది. ‘‘ఆయన(బీజేపీ నేత సువేందు అధికారి).. నేను (అఖిల్ గిరి) చూడడానికి బాగోలేను అన్నాడు. మరి ఆయనెంత అందంగా ఉన్నాడు?. ఒకరిని అప్పీయరెన్స్ బట్టి అలా నిర్ణయించకూడదు. అంతెందుకు మనం మన రాష్ట్రపతి కుర్చీకి గౌరవం ఇస్తాం. మరి ఆ రాష్ట్రపతి చూడానికి ఎలా ఉంటారు?’’ అని అఖిల్ గిరి అక్కడ ఉన్న కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లు ఈలలు, చప్పట్లతో అఖిల్ను మరింత ప్రొత్సహించారు. President Droupadi Murmu, hails from the Tribal community. Akhil Giri, TMC Minister of Correctional Homes made objectionable comments about her in the presence of Shashi Panja, another minister from the women’s welfare department Mamata Banerjee and TMC are anti-tribal. pic.twitter.com/vJNiZ7nBLM — BJP Bengal (@BJP4Bengal) November 11, 2022 ఇక టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని విమర్శించింది. మరో మంత్రి.. అదీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా సమక్షంలో అఖిల్ గిరి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ హైలెట్ చేసింది. Akhil Giri, minister in Mamata Banerjee’s cabinet, insults the President, says, “We don't care about looks. But how does your President look?" Mamata Banerjee has always been anti-Tribals, didn’t support President Murmu for the office and now this. Shameful level of discourse… pic.twitter.com/DwixV4I9Iw — Amit Malviya (@amitmalviya) November 11, 2022 బీజేపీ నేత అమిత్ మాలవియా.. టీఎంసీ నేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ కేబినెట్లోని అఖిల్ గిరి.. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారు. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముర్ముకు మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇలా అవమానించడాన్ని ప్రొత్సహిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారాయన. BJP MP Saumitra Khan writes to National Commission for Women (NCW), requesting them to "immediately arrest" Akhil Giri and take appropriate action against him and "try to dismiss him from the MLA post also" over his objectionable remark on President Droupadi Murmu. https://t.co/DJqIQ6uTFt pic.twitter.com/K4HnVBtHrT — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎంట్రీతో మారిన హిమాచల్ సీన్ -
పవన్.. ఇదేనా నీ ఆదర్శం?: భూమన
సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రమైన నేరంతో సమానమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం.. నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు పవన్ చేసిన దురుసు వ్యాఖ్యలపై భూమన స్పందించారు. ‘‘చెప్పుతో కొడతా.. గొంతు పిసికి చంపుతా’’ అని పవన్ అనడం హత్యానేరంతో సమానమని మండిపడ్డారు భూమన. చెగువేరా, చలం ఆదర్శమని చెప్పే పవన్.. ఇలాగేనా మాట్లాడేదని, అసలు పవన్ తన జనసేన క్యాడర్ ఏం సందేశం ఇస్తున్నాడని భూమన అసహనం వ్యక్తం చేశారు. పవన్ టీడీపీతో అంటకాగుతున్నాడని, తద్వారా సంస్కార హీనుడిగా మారిపోయాడని భూమన పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, మూడు రాజధానులకు లభిస్తున్న ప్రజామద్దతును ఓర్వలేకనే కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. పవన్ ప్రసంగం.. అనంతరం చంద్రబాబుతో భేటీ పరిణామంపై స్పందిస్తూ.. పవన్ నగ్నత్వం ఏంటో నిన్నటి పరిణామం ద్వారా బయటపడిందన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్య ద్రోహిగా పవన్ నిలిచిపోవడం ఖాయమని భూమన జోస్యం పలికారు భూమన. -
హిందువుగా ఉన్నంత వరకూ.. రాజా వ్యాఖ్యల దుమారం
చెన్నై: ‘‘హిందువుగా ఉన్నంత వరకూ నువ్వు దళితునివే. అంటరానివాడివే. శూద్రునివే. శూద్రునిగా ఉన్నంతకాలం నువ్వు ఓ వేశ్య సంతానమే’’అంటూ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం చెన్నైలో పార్టీ భేటీలో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలో ఎంతమంది వేశ్య సంతానంగా, అంటరానివారిగా మిగిలిపోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలపై గొంతెత్తినప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని బద్దలుకొట్టే ఆయుధంగా మారగలం’’అంటూ పిలుపునిచ్చారు. ‘‘శూద్రులంటే హిందువులు కారా? వారిని మను స్మృతి తీవ్రంగా అవమానించింది. వారికి విద్య, ఉద్యోగ, సమానావకాశాలను, ఆలయాల్లోకి ప్రవేశాలను నిషేధించింది’ అంటూ రాజా ప్రసంగించినట్టుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ద్రవిడ ఉద్యమం 90 శాతం మంది హిందువులకు బాసటగా నిలిచిందంటూ అనంతరం రాజా ఓ ట్వీట్ కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. Who are Sudras? Are they not Hindus? Why they have been insulted in Manusmrithi denied equality, education, employment and Temple entry. Dravidian Movement as saviour of 90% Hindus questioned and redressed these, cannot be anti-Hindus. — A RAJA (@dmk_raja) September 13, 2022 ఇదీ చదవండి: బీజేపీ బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోం -
రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట బెయిల్ వచ్చినా, రెండోసారి మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాని బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఎందుకని? హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదంగా మారి భారతీయ జనతా పార్టీ వేటుకు గురయ్యారు. మరోవైపు మొదటిసారి జరిగిన పొరపాటును సరిచేసుకుని పీడీ యాక్ట్ పెట్టి మరీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్న రాజాసింగ్ను ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనపై గతంలోనే ఉన్న రౌడీ షీట్ ఆధారంగా బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకుల నుంచి పెద్దగా స్పందన కానరావడంలేదు. ప్రవక్త మీద వివాదాస్పద కామెంట్స్ చేసిన జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను కూడా పార్టీ సస్పెండ్ చేశారు కమలనాథులు. ఇప్పుడు మునావర్ కామెడీ షో తో రాజాసింగ్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. దీంతో అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు రాజాసింగ్ను పార్టీ సస్పెండ్ చేసింది. సాధారణంగా ఏవైనా ఆందోళనలు చేసినపుడు అరెస్టులు జరిగితే పార్టీ నేతలు వెంటనే రంగ ప్రవేశం చేసి ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తారు. అయితే రాజాసింగ్ విషయంలో మాత్రం బీజేపీ ఆయన్ను పూర్తిగా వదిలించుకున్నట్లుగా కనిపిస్తోంది. తొలినుంచీ పార్టీ నాయకులతో విభేదిస్తూ.. పార్టీ విధానాలకు భిన్నంగా నడుచుకునే రాజాసింగ్ అంటే పలువురు నేతలు కోపంగానే ఉంటారనేది అందరికీ తెలిసిందే. రాజాసింగ్ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆలోచనతోనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు ఎమ్మెల్యే మీద ఆగ్రహంతో ఉన్నపుడు మనకెందుకులే అనుకున్న రాష్ట్ర నాయకులు కూడా రాజాసింగ్ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన్ను దూరంగా ఉంచితేనే ప్రస్తుతానికి పార్టీకి మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. కాని తనకు పార్టీ కంటే ధర్మమే ముఖ్యమంటున్నారాయన. పార్టీ అధిష్టానానికి తాను సంపూర్ణంగా వివరిస్తూ త్వరలో లేఖ రాస్తానని చెప్పుకుంటున్నారు రాజాసింగ్. కాగా, బీజేపీ క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్ భార్య మెయిల్ చేశారు. రేపటితో(సెప్టెంబర్2) రాజాసింగ్కు పార్టీ ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ భార్య.. బీజేపీ క్రమశిక్షణ కమిటీకి మెయిల్ చేశారు. రాజాసింగ్ జైలు ఉండటంతో మరికొంత సమయం ఇవ్వాలని మెయిల్లో పార్టీ క్రమశిక్షణా కమిటీని కోరినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్ చేసిన బీజేపీ.. ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్: MIM నేత కషఫ్పై పీడీయాక్ట్
-
హైదరాబాద్లో మరో నేతపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్:సోషల్మీడియాలో తన వీడియోల ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న ఓల్డ్ మలక్పేటకు చెందిన యువకుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాదర్ఘాట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఓల్డ్మలక్పేటకు చెందిన అబ్దాహు ఖాద్రీ అలియాస్ కసఫ్ తన ట్విట్టర్ ఖాతాలో తరచూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతికి భంగం కలిగించేలా పోస్ట్లు పెట్టేవాడు. ఈనెల 22, 23న బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అతను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడి చర్యల వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసు వాహనాలపై, వేటు వ్యక్తుల వాహనాలపై పలువురు దాడులు జరిగాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కసఫ్పై గతంలోనూ నగరంలోని మీర్చౌక్, చాదరఘాట్, సీసీఎస్లో కేసులు ఉన్నట్లు తెలిపారు. అతడి విద్వేష పూరిత, రెచ్చగొట్టే వీడియోలు, నినాదాలు ప్రజల భద్రతపై ప్రభావాన్ని చూపిస్తాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళవారం చాదర్ఘాట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతడిని అదుపులోకి తీసుకుని చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. కసఫ్ గతంలో ఎంఐఎం సోషల్మీడియా కన్వీనర్గా పని చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు పెడుతున్న కారణంగా పార్టీ అతడిని దూరంగా పెట్టినట్లు తెలిసిందని ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. -
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొఘల్పురాలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్ను అరెస్ట్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్ కుటుంబమే లక్ష్యం?! -
Nupur Sharma: నూపుర్ శర్మకు భారీ ఊరట
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్కు సానుకూలంగా స్పందించింది. ఆమెపై దాఖలైన అన్ని కేసులన్నింటిని కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్ఎస్వో యూనిట్కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను బుధవారం ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సైతం నూపుర్ శర్మకు ఇస్తున్నట్లు తెలిపింది. తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని, అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నూపుర్ శర్మ.. సుప్రీంలో వినతి పిటిషన్ వేసింది. కాబట్టి, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది. గతంలో ఇదే బెంచ్.. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి. ఆమెవి అహంకారపూరిత వ్యాఖ్యలు’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది కూడా. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్ఎస్వో) అనేది ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం. ద్వారకాలో దీని ఆఫీస్ ఉంది. ప్రధానమైన కేసులతో పాటు సున్నితమైన అంశాలను ఇది పరిశీలిస్తుంటుంది. ఇదీ చదవండి: మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి-నూపుర్ -
నోరు జారా.. క్షమించండి: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు అద్దంకి దయాకర్. శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్పై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడాయన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్పై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు పలువురు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో.. వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్ నోటీసు ఇచ్చారు. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటా అని అద్దంకి దయాకర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సీనియర్ నేత మల్లు రవి సైతం అద్దంకి క్షమాపణలపై స్పందించారు. కాంగ్రెస్ సోషల్ జస్టిస్ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వాఖ్యల పై చర్చ జరిగింది. అద్దంకి చేసిన వాఖ్యలు ప్రజల్లో తప్పుడు చర్చకు దారి తీశాయి. వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని నిర్ణయించాం. షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి అద్దంకి సిద్దంగా ఉన్నారు అని మల్లు రవి తెలిపారు. ఇదీ చదవండి: టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్! -
బాబూ.. తిట్టేశాం! చంద్రబాబుకు చెప్పుకున్న తిరుపతి టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ నేతలకు ఎడతెగని చిక్కొచ్చి పడింది. వరుస ఓటములను పక్కనపెడితే పార్టీ అధినేత చంద్రబాబు పెట్టే క్లాసుల టార్చర్కి ఒక్కో నేతకి నరాలు తెగిపోతున్నాయి. దీంతో బాబును సంతృప్తి పరిచేందుకు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని నిస్పృహలో బండబూతులు తిట్టేస్తున్నారు. తీరా తాము తిట్టిన తిట్లు.. ఆ రెండు పేపర్లు, ఆ టీవీల్లో వచ్చేలా చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. వచ్చిన తర్వాత ఆ కటింగ్లు, క్లిప్పింగ్లు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించి ‘బాబు గారికి చూపించండి... ఎవరెవరు ఎట్లా మాట్లాడారో చూడమనండి’ అని చెప్పుకుని బరువు దించుకుంటున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఇంతకూ టీడీపీ నేతలకొచ్చిన బాధేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా పూర్తిగా తెలియాలంటే కాస్త ఈ కథనం చదవండి. సాక్షి ప్రతినిధి, తిరుపతి : కళ్లారా అభివృద్ధి కనిపిస్తుంటే కాదని ఎవరైనా అనగలరా.. ? తమ హయాంలో ఎన్నడూ జరగని అభివృద్ధి, తిరుపతి ప్రగతి ఇప్పుడు కళ్లకు కట్టినట్టు చూస్తూ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గానీ.. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని గానీ ఏమైనా మాట్లాడగలరా? నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఎక్కువసార్లు ప్రాతినిథ్యం వహించామని గొప్పగా చెప్పుకునే టీడీపీ నేతలకు.. ఇదిగో అప్పట్లో తిరుపతికి ఇది చేశాం అని ప్రకటించుకునే పరిస్థితి ఉందా?.. అస్సలు లేదనే వాస్తవం వారికి బాగా తెలుసు. ఈ విషయం కాసేపు పక్కన పెట్టి మూడేళ్లలో వైఎస్సార్సీపీ హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్ధిని ఒకింత పరిశీలిద్దాం. ► టీడీపీ హయాం చివర్లో శంకుస్థాపన చేసి వదిలేసిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇప్పటికే 80 శాతం పనులు పూర్తిచేసింది. కోవిడ్ ఆటంకాలు తెచ్చినా, తొలిదశ ఫ్లెఓవర్ను ఆర్నెల్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. 2023 తొలినాళ్లకు పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఆరు కిలోమీటర్ల ఫ్లెఓవర్ను అందుబాటులోకి తేనుంది. ► దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అన్నమయ్యమార్గ్, డాక్టర్ వైఎస్సార్ మార్గ్ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. ► కొత్తగా మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందులో గొల్లగానిగుంట రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ► అదేవిధంగా ప్రజలు దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న కొర్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► మునుపెన్నడూ లేని విధంగా రూ.164 కోట్లతో తిరుపతి శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించారు. ► ప్రకాశం పార్కు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ► ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వినాయక్సాగర్ అభివృద్ధి కొలిక్కి వచ్చింది. ► మటన్ మార్కెట్, కూరగాయల మార్కెట్ల వికేంద్రీకరణ, శ్మశానవాటికల ఆధునికీకరణ, గొల్లవాని గుంట క్రికెట్ స్టేడియం, మూడు మోడల్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం, మరో మూడు నిర్మాణ దశలో, వైఎస్సార్ మార్గ్లో మోడ్రన్ స్కూలు నిర్మాణం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో.. ఇవన్నీ కూడా కేవలం తిరుపతి నగర పరిధిలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి చొరవతో మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి పనులు.. ఇక నగరంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తిరుపతి చెంత పారిశ్రామిక అభివృద్ధి... ఇలా చెప్పుకుంటే కొదవే లేదు. అందుకే విపక్షాలు పోటీకి దూరం మునుపెన్నడూ ఎరుగని రీతిలో తిరునగరి ప్రగతి బాటలో పయనిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. పోనీ టీడీపీ అధినేత చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా అబద్ధాలు ఆడదామని అనుకుంటే చైతన్యవంతులైన తిరుపతి ప్రజలు చూస్తూ ఊరుకోరు. అది తెలిసిన టీడీపీ నేతలు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క వార్డు టీడీపీ సొంతమైంది. ఈ పరిస్థితుల్లోనే ఇటీవల జరిగిన టౌన్ బ్యాంక్ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు. కానీ అధినేత బాబు ఒత్తిడి మేరకు చోటామోటా నేతలు రంగంలోకి దిగి డిపాజిట్లు కోల్పోయారు. బాబు ఒత్తిడి భరించలేక శ్రుతి తప్పి మాట్లాడుతున్న టీడీపీ నేతలు అయితే చంద్రబాబు క్లాస్లు, ఒత్తిడి భరించలేని టీడీపీ నేతలు టౌన్ బ్యాంక్ ఎన్నికల ఓటమి తర్వాత తమ నోళ్లకు పనిచెప్పారు. నోటికొచ్చినట్టు పేట్రేగిపోతున్నారు. తమకు అనుకూల మీడియాలో ఆ వార్తలు రాయించుకుని చంద్రబాబుకు పంపించుకుని ‘సార్.. ప్రభుత్వాన్ని తిట్టేశాం.. భూమనను విమర్శించాం..’ అని చెప్పుకుంటున్నారు. దీనివల్ల బాబు వద్ద మార్కులు పొందడం ఏమో గానీ తిరుపతి ప్రజల్లో మాత్రం పచ్చనేతలు బాగా పలుచనవుతున్నారనేది మాత్రం వాస్తవం. మూడేళ్లలో ఇంటింటా సంక్షేమ వెలుగులు మూడేళ్లలో తిరుపతిలో పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయి. దీనికి తోడు ఎమ్మెల్యే భూమన నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితో మమేకమయ్యారు. నగరంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోనే కాదు.. వేడుకల్లోనూ వారిని భాగస్వామ్యం చేశారు. తొలిసారి తిరుపతి నగరం పుట్టిన రోజు వేడుకలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. తిరుపతి వేదికగా జరిగిన జాతీయ కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది తిరుపతి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా జరిపారు. -
MLA Rema: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!
తిరువనంతపురం: అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. మహిళా ఎమ్మెల్యేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కేరళ అసెంబ్లీ అట్టుడుకి పోతోంది. సభకు క్షమాపణలు చెప్పి.. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కార్యకలాపాలకు అడ్డుతగులుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్. అయినా ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు. కేరళ అసెంబ్లీని మహిళలను వేధించే కౌరవ సభగా మార్చొద్దంటూ వేడుకున్నారు ప్రతిపక్ష నేత ఎం సతీశన్. ప్రోగ్రెసివ్ స్టేట్గా చెప్పుకునే కేరళలో.. విధవత్వాన్ని ఆమె తలరాతగా నిర్ధారించే స్థితికి రావడం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారాయన. గత వారం పోలీస్ శాఖ నిధుల విజ్ఞప్తుల విషయంలో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా.. ఎమ్మెల్యే కేకే రేమాను రెచ్చగొట్టేలా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మణి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఒక గొప్పావిడ సీఎం పినరయి విజయ్కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఆమె తన భర్తను పొగొట్టుకుని విధవ అయ్యింది. అది ఆమె తలరాత. మేమేం దానికి బాధ్యులం కాదు’’ అంటూ ఎమ్మెల్యే మణి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సభ ఒక్కసారిగా భగ్గుమంది. మణి వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తూ సభ కార్యాకలాపాలను అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. ‘‘మణిని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని కోరాం. ఆపై సీఎం పినరయి విజయన్ను జోక్యం చేసుకోమని అడిగాం. ఈ రెండూ చేయలేదు. ఇది నియమసభ. దీన్నొక మహిళలను వేధించే దుర్యోధనులు, దుశ్వాసనులకు నెలవైన కౌరవ సభగా మార్చొద్దు’’ అంటూ ఎమ్మెల్యే సతీశన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మణి వ్యాఖ్యలను పరిశీలిస్తామని డిప్యూటీ స్పీకర్ చిట్టాయమ్ గోపకుమార్ హామీ ఇవ్వడంతో ప్రతిపక్షం కాస్త శాంతించింది. అయితే సోమవారం మహిళా కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా.. మణి ముఖాన్ని చింపాజీ కటౌట్తో ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసింది. కేరళ కాంగ్రెస్ ఈ చర్యను సమర్థించుకుంది. ఇక తన భర్తను చంపినా.. ఇంకా పగతో రగిలిపోతూనే ఉన్నారంటూ ఎమ్మెల్యే రేమా సైతం మణి కామెంట్లపై మండిపడ్డారు. కొన్నేళ్ల కిందట.. సీపీఐ(ఎం) రెబల్ టీపీ చంద్రశేఖరన్ను పార్టీ వెలివేసింది. ఆ తర్వాత రెవల్యూషనరీ మార్కిస్ట్ పార్టీని(RMPI) స్థాపించారు. ఆయన 2012 మే 4వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో సీపీఎం యాక్టివిస్టులను అరెస్ట్ చేసి శిక్షించారు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలను చూసుకుంటూ.. సీపీఐ(ఎం)పై, సీఎం విజయన్పైనా వీలుచిక్కినప్పుడల్లా విరుకుపడుతున్నారు కేకే రేమా. ప్రస్తుతం ఆమె వడకారా నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
భగత్ సింగ్పై వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీగఢ్: భగత్ సింగ్పై వివాదాస్పద కామెంట్ చేశాడు పంజాబ్ ఎంపీ ఒకరు. సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీ స్థానానికి ఈమధ్యే ఎన్నికైన సిమ్రన్జిత్ సింగ్ మాన్(77) భగత్ సింగ్ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. సిమ్రన్జిత్ సింగ్ మాన్.. శిరోమణి అకాళీ దళ్(అమృత్సర్) చీఫ్ కూడా. ‘‘భగత్ సింగ్ యువకుడైన ఓ ఇంగ్లీష్ అధికారిని చంపాడు.సిక్కు కానిస్టేబుల్ ఛన్నన్ సింగ్నూ హతమార్చాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఇప్పుడు చెప్పండి.. భగత్ సింగ్ ఉగ్రవాదా? కాదా?’’ అంటూ కామెంట్లు చేశాడు. ఖలిస్థానీ అనుకూల వ్యాఖ్యలు చేసే క్రమంలో.. ఇలా కామెంట్లు చేశాడు ఆయన. అయితే భగత్ సింగ్పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. స్వాతంత్ర్య సమరయోధుడు, వీరుడైన భగత్సింగ్ను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని ఆప్ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎంపీ వ్యాఖ్యలను హేయనీయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మనోభావాలు దెబ్బతీసేలా, ఒక వీరుడ్ని అగౌరవపరిచేలా మాట్లాడినందుకు సిమ్రన్జిత్ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. పంజాబ్ రాజకీయాల్లో ఈయన వివాదాలకు కేరాఫ్. తాజాగా ఎంపీగా గెలిచిన వెంటనే ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. Shameful that some call him a terrorist. Shaheed-e-Azam Bhagat Singh is a hero, a patriot, a revolutionary and a true son of the soil. INQUILAB ZINDABAD! pic.twitter.com/7mpTalt3g1 — Raghav Chadha (@raghav_chadha) July 15, 2022 -
ఆమెను వదిలే ప్రసక్తే లేదు.. దీదీ ఆగ్రహం
కోల్కతా: ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్పూర్లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారామె. ఇదిలా ఉంటే.. మంగళవారం అసన్సోల్లో జరిగిన పార్టీ సమావేశంలో పేరు ప్రస్తావించకుండానే బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై దీదీ మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీది మొత్తం తప్పుడు, ఫేక్ ప్రచారం నడిపిస్తోందంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘నేను సోషల్ నెట్వర్క్లకు అనుకూలం. నిజాలు మాట్లాడే వారి పక్షాన నేను ఉంటా. కానీ, బీజేపీ సోషల్ నెట్వర్క్ మొత్తం ఫేక్మయం. మోసం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ సోషల్ మీడియా దిట్ట. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోనూ అబద్ధాలాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఓ నేతను(నూపుర్ను ఉద్దేశించి).. కనీసం అరెస్ట్ కూడా చేయనివ్వడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోంది. వాళ్లు చంపితే.. ఎవరూ మాట్లాడొద్దు. అదే వేరే ఎవరైనా మాట్లాడితే చాలూ.. హంతకులైపోతారా?. జుబేర్(ఆల్ట్ న్యూస్) ఏం చేశాడు? తీస్తా ఏం చేశారు?.. మీ దగ్గర ఉన్న వ్యక్తుల పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు మతాన్ని కించపరుస్తున్నా.. గట్టి భద్రత ఇస్తున్నారు. మేం అలా కాదు. ఆమెకు సమన్లు ఇచ్చాం. అసలు వదిలే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని తీరతాం అంటూ మండిపడ్డారు ఆమె. మొహమ్మద్ ప్రవక్త గురించి వ్యాఖ్యలతో నూపుర్ శర్మ.. విమర్శలు, కేసులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి కూడా. జూన్ 20వ తేదీన ఆమె కోల్కతా పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే దాడులు జరుగుతాయేమోననే భయంతో ఆమె బయటకు రావడం లేదు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా.. కోల్కతా పోలీసుల సమన్లకు మెయిల్ ద్వారా స్పందించారు ఆమె. తనకు ప్రాణ భయం ఉందంటూ నాలుగు వారాల గడువు కోరింది నూపుర్ శర్మ. Violence and extremism are UNACCEPTABLE, no matter what! I STRONGLY CONDEMN what happened in Udaipur. As law takes its own course of action, I urge everyone to maintain peace. — Mamata Banerjee (@MamataOfficial) June 29, 2022 -
ఇంతకీ నూపుర్ శర్మ ఇప్పుడు ఎక్కడ?
ఓ టీవీ షో డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. అవుతోంది కూడా. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగానూ బీజేపీ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. బీజేపీ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు తన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా తెలియజేసింది. అయినా వివాదం చల్లారడంలేదు. నూపుర్ శర్మ పేరు ప్రతీరోజూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. మరి.. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ప్రవక్తపై కామెంట్ల తర్వాత.. చంపేస్తామంటూ బెదిరింపులు, వేధింపులు ఆమెకు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఆమె పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కొన్ని ఉగ్రసంస్థలు సైతం ఆమెపై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఈ తరుణంలో.. ఢిల్లీ పోలీసులు ఆమెకు భారీ భద్రతను అందించారు. కుటుంబంతో పాటు నూపుర్ బలమైన సెక్యూరిటీ నడుమ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మే 26వ తేదీన జ్ఞానవాపి మసీద్ వ్యవహారంపై టీవీ చర్చ సందర్భంగా ఆమె.. ప్రవక్త వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఇస్లాం వర్గాల అభ్యంతరాలతో దుమారం చెలరేగింది. అప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు. బీజేపీ అగ్రశ్రేణి నేతలకు వివరణ ఇచ్చేందుకు యత్నించినా.. సానుకూల స్పందన లభించలేదు. దీంతో ఆమె కొంతమంది నేతలతో ఫోన్ ద్వారా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆపై మీడియాకు సైతం అంతగా అందుబాటులోకి రాని నూపుర్.. సోషల్ మీడియా ద్వారానూ సదరు వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. కానీ, సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ.. పోస్టులు చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందునా.. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నూపుర్ కుటుంబ భద్రతను సవాల్గా తీసుకుంటున్నారు. నూపుర్ శర్మ(37) ఢిల్లీలోని పుట్టి, పెరిగారు. సివిల్స్ సర్వెంట్స్ నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది. బీఏ, ఎల్ఎల్బీ, లండన్ యూనివర్సిటీలో మాస్టర్ లా చేశారామె. ఏబీవీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆమె(ప్రెసిడెంట్గానూ 8 ఏళ్లు పని చేశారు).. విద్యార్థి దశలోనే టీవీ డిబేట్ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. చివరకు.. బీజేపీ నేతగా ఉన్న టైంలోనే టీవీ డిబేట్ ద్వారానే ఆమె వివాదంలోనూ చిక్కుకోవడం గమనార్హం. అయితే ఈ కష్టకాలంలో బీజేపీ ఆమెకు అండగా నిలబడడం లేదంటూ.. #ShameOnBJP #IsupportNupurSharma హ్యాష్ట్యాగులూ ఈమధ్యకాలంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మరోవైపు కొన్ని ఇస్లాం సంఘాలు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ పిలుపు ఇస్తున్నా.. మరికొన్ని వర్గాలు మాత్రం చల్లారడం లేదు. -
Nupur Sharma: నూపుర్ శర్మ అంతుచూస్తాం
ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఉగ్రవాద సంస్థ ముజాహుద్దీన్ గజ్వాతుల్ హింద్ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ: ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ తాజాగా నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది ఆ ఉగ్ర సంస్థ. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేసింది ఎంజీహెచ్. నూపుర్ శర్మ తొలుత అవమానించింది. ఆ తర్వాత క్షమాపణలు చెబుతోంది. ఇదంతా బీజేపీ చేస్తున్న మాయాజాలం. చాణక్యనీతిని ప్రయోగిస్తూ ప్రజలను బుట్టలో వేసుకుంటోంది. ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. బీజేపీ నేతలు క్రమం తప్పకుండా ఇస్లాం వ్యతిరేక ప్రకటనలు ఇస్తున్నారు. ఆరెస్సెస్, రామ్ సేన, భజరంగ్ దళ్, శివ సేనలు.. వరుసగా ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగలు చేస్తున్నాయి అంటూ ఆ టెలిగ్రామ్ ప్రకటనలో ఉంది. కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది. గట్టి భద్రత ఇదిలా ఉంటేనూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి గట్టి భద్రత కల్పించారు ఢిల్లీ పోలీసులు. వ్యాఖ్యల తర్వాత ఎదురువుతున్న వేధింపులు, బెదిరింపులపై ఆమెను పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు స్పందించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఈ వ్యవహారానికి వీలైనంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. అందుకే నూపుర్ మీద తక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ వెంటనే ఆమె క్షమాపణలు తెలియజేశారు కూడా. అయితే.. అప్పటికే ఇస్లాం దేశాలు సదరు వ్యాఖ్యలపై తీవ్ర ఖండన మొదలుపెట్టాయి. భారత్లోని కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార పక్ష నేతల ఇస్లాం వ్యతిరేక విధానాలపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. చదవండి: భారతీయ ఉత్పత్తులు మాకొద్దు! -
విమర్శలు-సమన్లు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది. మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
క్షమాపణలు చెప్పిన వ్లాదిమిర్ పుతిన్
జెరూసలేం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై కామెంట్లు చేసే తరుణంలో.. హిట్లర్లోనూ యూదుల రక్తం ఉందంటూ రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ క్షమాపణలు తెలియజేసినట్లు తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ మధ్య ఓ ఇటలీ మీడియా హౌజ్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అడాల్ఫ్ హిట్లర్లోనూ బహుశా యూదుల రక్తం ఉండొచ్చని వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఉక్రెయిన్ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్రోవ్కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు. సెర్గీ లావ్రోవ్ కానీ, హిట్లర్లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని చాలా దేశాల అధినేతలు, ప్రతినిధులు ఖండించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ లావ్రోవ్ వ్యాఖ్యల్ని క్షమించరానివంటూ మండిపడింది. ఈ తరుణంలో.. ఇజ్రాయెల్లోని రష్యా రాయబారిని పిలిపించుకుని మరీ.. సదరు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. పరిణామాలు మరీ వేడెక్కడంతో పుతిన్ ఫోన్లో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలి బెన్నెట్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ ప్రధానితో పుతిన్ (పాత ఫొటో) ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణల్ని ప్రధాని నఫ్టాలి బెన్నెట్ స్వీకరించారు. యూదులు, హోలోకాస్ట్ జ్ఞాపకం పట్ల రష్యా వైఖరిని తెలియజేశారాయన అంటూ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే క్రెమ్లిన్ వర్గాలు మాత్రం.. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ మాత్రమే జరిగినట్లు ప్రకటన విడుదల చేసింది అంతే. చదవండి: రష్యా ఆటలు మా గడ్డపై సాగవ్! -
క్షమించరాని వ్యాఖ్యలు.. రష్యా విదేశాంగ మంత్రిపై ఫైర్
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్లర్లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్ సహా పలుదేశాల అధినేతలు, ప్రతినిధులు లావ్రోవ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇటలీకి చెందిన ఓ మీడియా సంస్థ తాజాగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్రోవ్కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు. కానీ, హిట్లర్లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఒక ప్రకటనలో.. లావ్రోవ్ వ్యాఖ్యలు క్షమించరానివి. చారిత్రక తప్పిదం. ఇలాంటి అబద్ధాలు చరిత్రలో భయంకరమైన నేరాలకు యూదులనే నిందిచడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. హోలోకాస్ట్ యూదులు తమను తాము చంపుకోలేదని స్పష్టం చేశారాయన. ఇక ఈ వ్యాఖ్యలపై రష్యా రాయబారిని పిలిపించి.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఆదేశించింది. మరోవైపు నిరాధారమైనవని వరల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్ యాద్ వాషెమ్ ఖండించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ను డీ మిలిటరైజ్, డీ నాజిఫై చేయడమే తమ లక్ష్యమని ఇదివరకే రష్యా ప్రకటించింది. కానీ, ఈ క్రమంలో ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు లావ్రోవ్. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఇజ్రాయెల్ మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఒకవైపు కీవ్-మాస్కో మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతూనే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలను కొనసాగిస్తోంది. అయితే లావ్రోవ్ హిట్లర్-యూదుల రక్తం వ్యాఖ్యలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఇదిలా ఉండగా.. రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభ్యంతరం వ్యక్తం చేశాడు. లావ్రోవ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, ఆమోదయోగ్యం కానీ రీతిలో ఉన్నాయంటూ మండిపడ్డారు. చదవండి: ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు -
అరెస్ట్ చేయడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా.. కంగనా సంచలన పోస్ట్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొవచ్చు. తన తీరు, వివాదస్పద వ్యాఖ్యలతో తరచు ఆమె వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా. అంతేకాదు ఆమె పోలీసు కేసు కూడా నమోదైంది. ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఆనందంలో మునితేలుతుంటే కంగనా వారిపై చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. చదవండి: పార్టీలో డ్యాన్స్తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. రైతులను ఉద్దేశిస్తూ ఆమె ‘దీన్ని ఖలిస్థానీ ఉద్యమం’ అంటారంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆమెసౌ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ షేర్ చేసింది. చదవండి: షాకింగ్ లుక్లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని గతంలోని ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘మరొక రోజు మరో ఎఫ్ఐఆర్. ఒకవేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..ఇంటి దగ్గర నా మూడ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా సున్నితమైన రైతుల అంశంలో కంగనా చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తులకు తనదైన శైలిలో వ్యంగ్యంగా సమాధానమిచ్చింది కంగనా. మరి దీనిపై ఎవరూ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కంగనా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఇక కంగనా తీరుపై ఎప్పటిలాగే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన తీరుపై మండిపడుతున్నారు. చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం -
సిక్కులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. నటి కంగనాపై కేసు నమోదు
ముంబై: సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై పోలీసు కేసు నమోదైంది. సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై తన పోస్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. చదవండి: నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె -
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్
రాయ్పూర్: ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్టయ్యారు. తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి తాజాగా మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్. చదవండి: తండ్రిపై కేసు నమోదును సమర్ధించిన ముఖ్యమంత్రి బ్రాహ్మణులు విదేశీయులని, వారిని బహిష్కరించాలని ఇటీవల నంద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, బ్రాహ్మాణులను గ్రామాల్లోకి రానివ్వొద్దని చెప్పినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజధాని రాయ్పూర్లోని డీడీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సంస్థ పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఉన్నాయని చెబుతూ వాటి సాక్ష్యాలు కూడా అందించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ సమాజం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు నంద్ కుమార్ను తాజాగా అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచారు. 15 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది. తండ్రిపై కేసు నమోదు కావడంపై ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ స్పందించారు. ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను’ అని పేర్కొన్నాడు. ‘మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్ పేర్కొన్నారు. ‘చట్టం కన్నా ఎవరూ ఎక్కువ కాదు’ అని స్పష్టం చేశారు. చదవండి: జైలు మరుగుదొడ్డిలో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి -
తీవ్ర దుమారం.. క్షమాపణలు చెప్పిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన సెక్సియెస్ట్ కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు. లంక, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే సందర్భంగా.. కామెంటేటర్గా వ్యవహరించిన దినేశ్ చేసిన ‘బ్యాట్లు- పక్కవాళ్ల భార్య’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. తప్పుడు ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయలేదు. కావాలని చేసిన కామెంట్లు ఎంతమాత్రం కావు. కానీ, తప్పు జరిగిపోయింది. అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఈ విషయంపై నా తల్లి, భార్య కూడా నన్ను తిట్టారు. సారీ.. ఇంకోసారి తప్పు జరగదు’ అంటూ ఆదివారం ఒక సందేశం విడుదల చేశాడు దినేశ్ కార్తీక్. కాగా, 36 ఏళ్ల ఈ బ్యాట్స్మన్ కమ్ వికెటకీపర్ భారత్ తరపున 94 వన్డేలు, 32 టీ20లు, 26 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్గా మారిన దినేశ్.. అందులోనూ అదరగొడుతుండడం విశేషం. ‘ప్లేయర్స్ తమ బ్యాట్స్ కంటే అవతలి వాళ్ల బ్యాట్స్ను ఎక్కువగా ఇష్టపడతారని, అవి పక్కవాళ్ల భార్యల్లాంటివేనని. ఆకర్షణనీయంగా ఉంటాయని, అందుకే ఆకర్షితులు అవుతార’ని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దినేశ్ కార్తీక్. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 -
ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం
సాక్షి, గద్వాల: ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు. అధికారుల తిట్ల పురాణాన్ని పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వీడియో తీసి బయటపెట్టడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా గొడవపడటంపై జనం మండిపడుతున్నారు. పైఅధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘దానికోసం ఓ రాత్రి గడిపేందుకైనా సిద్ధపడతారు’
వాషింగ్టన్ : మహిళా రిపోర్టర్లపై ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత జెస్సీ వాటర్స్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన సమాచారం రాబట్టేందు వారు ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్యానించాడు. సోర్స్తో ఓ రాత్రి గడిపేందుకు సిద్ధపడతారని ఫాక్స్ న్యూస్ టాక్ షో ‘ది పైవ్’లో చెప్పుకొచ్చాడు. సినిమాలు, టీవీ షోల్లో చూపుతున్నట్టు నిజ జీవితంలో కూడా అలాంటి పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. తమ సంస్థలో అలీ వాట్కిన్స్ అనే మహిళా రిపోర్టర్ ఇలాంటి పని చేసే నాలుగేళ్లపాటు పొలిటికల్ వార్తల్ని అందరి కన్నా ముందుగా.. గొప్పగా ఇచ్చేదని తెలిపాడు. ఇక అట్లాంటా-జర్నల్ కాన్స్టిట్యూషన్ రిపోర్టర్ కేథీ ష్రగ్స్ జీవితం ఆధారంగా రిచర్డ్ జువెల్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రహస్య సమాచారం కోసం కేథీ ష్రగ్స్ సెక్స్ వ్యాపారం చేసిందనేది కథాంశం. వివాదాస్పద కథాంశంతో వార్తల్లో నిలిచిన రిచర్డ్ జువెల్ సినిమా వాటర్స్ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలోనూ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వాటర్స్ తాజా ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై అమెరికన్ టెలివిజన్ వ్యాఖ్యాత ఎస్సీ కప్ ట్విటర్ వేదికగా స్పందించాడు. నిరాధార, నిందారోపణలు చేస్తున్న వాటర్స్ వ్యాఖ్యలు చండాలంగా ఉన్నాయని మండిపడ్డాడు. సొంత సంస్థ మహిళా ఉద్యోగులను అవమాన పరిచిన వాటర్స్ తరపున ఫాక్స్ న్యూస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. -
కొంపముంచిన ఫేస్బుక్ వీడియో.. నటిపై కేసు
జైపూర్: నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకుగాను బాలీవుడ్ టీవీ నటి పాయల్ రోహత్గి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గత నెల 21న పాయల్ రోహత్గి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తల్లిదండ్రులతో పాటు ఆయన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో చర్మేశ్ శర్మ అనే ఓ కాంగ్రెస్ కార్యకర్త పాయల్ రోహత్గి మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. ‘పాయల్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీ లాల్ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక లాల్బహుదూర్ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విదేశాలు, మన దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునేలా ఈ వీడియో ఉంది. పాయల్ మాజీ ప్రధానులను అవమానించడమే కాక దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు. టీవీ రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. 2008లో బిగ్బాస్ షోలో కూడా పాల్గొన్నది. -
క్షమాపణ చెప్పిన ఆజంఖాన్
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ ఆజంఖాన్ వెనక్కి తగ్గారు. సోమవారం ఆయన బీజేపీ ఎంపీ రమాదేవికి సభలో క్షమాపణలు చెప్పారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే అలవాటు తనకుందని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. రమాదేవికి క్షమాపణ చెప్పాలని ఎంపీ ఖాన్ను కోరారు. అందుకే వెంటనే ఖాన్ లేచి..‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. సభా మర్యాదలు నాకు తెలుసు. నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే, క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. అయతే, ఆయన మాటలు తమకు వినిపించక అర్థం కాలేదని, మళ్లీ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. ఖాన్ పక్కనే ఉన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ లేచి, ఆయన క్షమాపణ చెప్పారని, అందుకు తానే హామీ’ అని తెలిపారు. అయితే, మళ్లీ క్షమాపణ చెప్పాలని ఖాన్ను స్పీకర్ కోరారు. దీంతో ఆయన.. రమాదేవి తనకు సోదరి లాంటి వారు. స్పీకర్ మాట కాదని నేనేమీ మాట్లాడలేను. నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యుణ్ని’ అని అన్నారు. అనంతరం ఎంపీ రమాదేవి మాట్లాడుతూ.. ‘ఆజంఖాన్ వ్యాఖ్యలతో యావద్దేశం బాధపడింది. అలాంటి మాటలను వినేందుకు నేను ఈ సభకు రాలేదు’ అని ఆవేదనతో పేర్కొన్నారు. ఆజంఖాన్ సభలోను, వెలుపల కూడా గతంలో పలు మార్లు మహిళలపై అవమానకరంగా మాట్లాడారని, ఆయన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. గురువారం సభలో ట్రిపుల్తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ ఉన్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
హోం మంత్రిపై అభ్యంతరకర పోస్టింగ్లు; వ్యక్తి అరెస్ట్
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టిన వ్యక్తిని గుంటూరు పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ సబ్డివిజన్ డీఎస్పీ జె.కులశేఖర్ తెలిపిన మేరకు.. రామ్మహారాజ్ అనే ఫేస్బుక్ అకౌంట్తో హోం మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టింగ్లు వచ్చాయి. పోస్టింగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దారం అశోక్కుమార్ పట్టాభిపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ కులశేఖర్ విశాఖ జిల్లా రోగుగుంట మండలం ఎం.కొత్తపట్నంకు చెందిన సర్వశుద్ధి రాము ఆ పోస్టింగ్లు పెట్టినట్లు దర్యాప్తులో ధృవీకరించారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్లతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. -
తప్పు చేశాం.. క్షమించండి..!
న్యూఢిల్లీ : దళితులు, నిమ్న కులస్తులపై మంగళవారం అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ యువతి తీవ్ర విమర్శల నేపథ్యంలో క్షమాపణలు కోరారు. రిజర్వేషన్ల కారణంగా తక్కువ జాతివారు తమ తలపై వచ్చి కూర్చుంటున్నారని, దళితుల వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదంటూ ఆమె అసభ్యంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలను తిడుతూ తన మిత్రుడితో కలసి వీడియో చిత్రీకరించి వాట్సాప్లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. తీవ్ర విమర్శలు రావడంతో వారిరువురు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఈమేరకు మరో వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆవేదనతో అలా మట్లాడానని యువతి చెప్పుకొచ్చారు. దయచేసి తనపై అసభ్యకర కామెంట్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఏ మతాన్ని, కులాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆ అసభ్యకర వీడియో బదులుగా.. తాజా వీడియోను షేర్ చేయండని కోరారు. (చదవండి : వైరల్ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!) -
దళితులపై మండిపడిన యువతి
-
వైరల్ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!
న్యూఢిల్లీ : పీడిత ప్రజల బాగుకోసం స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సమాజంలో అంతరాలు పెంచాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 69 ఏళ్ల గణతంత్ర భారతంలో రిజర్వేషన్లు ఇంకా అవసరమా అని కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదంటున్నారు. అయితే, నేటి ఆధునిక కాలంలోనూ మనదేశంలో కులం గోడలు బలంగా నిలబడడానికి రిజర్వేషన్లే కారణమంటూ ఓ యువతి బూతు పురాణం అందుకుంది. దళితులపై అసభ్యకర రీతిలో విరుచుకుపడింది. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని కావడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని చెప్పుకొచ్చింది. రిజర్వేషన్ల పుణ్యమానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు తక్కువ మార్కులకే ఉద్యోగాలు తన్నుకు పోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంటు కొలువు దక్కాలంటే.. ఆ.....(అసభ్య పదజాలం) కులంలో పుట్టాలా..? అని ప్రశ్నించింది. మార్కులు సరిగా రాకున్నా.. రిజర్వేషన్ల ఫలితంగా.. ఆ.... (అసభ్య పదజాలం) కులస్తులు తమ తలపై (టాప్ పొజిషన్) కూర్చుకుంటున్నారని మండిపడింది. రాజకీయంగా తనకు ప్రధాని మోదీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. 40 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వీడియో చివర్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పైనా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : దళితులపై మండిపడిన యువతి -
‘ముస్లింలకు తిండి దండగ.. వారు పాలిచ్చే గోవులు కాదు’
దిస్పూర్ : సార్వత్రిక ఎన్నికల వేళ అస్సాం బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్ ముస్లిం వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారు పాలిచ్చే గోవులు కాదని, అలాంటప్పుడు తిండి దండగే కదా అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ముస్లింగ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఫకాన్పై చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రతిపక్ష నేత దేవవ్రత సైకియా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ముస్లిం ఓట్లతో పనిలేదన్న బీజేపీ ఎమ్మెల్యే.. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేయదని కూడా అన్నారని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఎమ్మెల్యే ఫకాన్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. ‘90 శాతం ముస్లింలు మాకు ఓటేయరు. అందుకనే అస్సామీ సామెతను ఉటంకిస్తూ ముస్లిం ఓటర్ల గురించి అలా మాట్లాడాను. పాలు ఇవ్వని గోవులకు తిండి దండగా అనేది నా అభిప్రాయం. వారి ఓట్లతో తమకు అవసరం లేదు. ముస్లిలం ఓట్లతో మా గెలుపోటములు డిసైడ్ కావు. ఎందుకంటే 90 శాతం హిందువులు మా పార్టీకి ఓటేస్తారు. అందుకే అలా మాట్లాడాను. అంతేగాని నేను ఎవరినీ ఎవరితో ఎవరికతో పోల్చలేదు’ అని ఫకాన్ చెప్పుకొచ్చారు. కాగా, ఫుకాన్ అభ్యంతరకర వ్యాఖ్యలపై గత నాలుగు రోజులుగా దుమారం రేగుతున్నా బీజేపీ ఇంతవరకూ స్పందించలేదు. -
మహిళల ఓట్లు నాకే
రాంపూర్: సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్’ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించకపోవడాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. ఈ అంశంలో అఖిలేశ్ మౌనం వహించడంతో ఇప్పుడు మహిళలు ఆ పార్టీకి దూరం అయ్యారనీ, ఇక స్త్రీలంతా తనకే ఓటు వేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్లో ఎస్పీ తరఫున ఆజంఖాన్, బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తుండటం తెలిసిందే. అఖిలేశ్ సమక్షంలోనే ఆజం ఖాన్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా అఖిలేశ్ ఏమీ అనలేదనీ, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఆజంఖాన్ లాంటిదేనని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే అభద్రతా భావంతోనే ఆజంఖాన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఉంటాడని జయప్రద పేర్కొన్నారు. ఆంజఖాన్ వ్యాఖ్యలు చేయడం చిన్న అంశమంటూ అఖిలేశ్ భార్య డింపుల్ అనడం పట్ల జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశం మొత్తం తనవైపు ఉంటే డింపుల్, జయా బచ్చన్, షబానా అజ్మీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్ ప్రచారం చేయకుండా 72 గంటలపాటు నిషేధించిన ఎన్నికల సంఘానికి, అలాగే ఈ అంశంపై స్పందించి ఆజంఖాన్కు నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్కు జయప్రద ధన్యవాదాలు తెలిపారు. అన్నా అని పిలిచి తప్పు చేశా.. ఆజంఖాన్ను అన్నా అని పిలిచి తాను తప్పు చేశానని జయప్రద అన్నారు. ఖాన్ పైకి కనిపించేంతటి మంచి మనిషి కాదనీ, లోపల ఇంకో మనిషి ఉన్నాడని ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడన్నారు. ఆజంఖాన్ను అన్నా అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని జయప్రద అన్నారు. ఖాన్ వ్యాఖ్యలతో రాంపూర్ మహిళలంతా తన పక్షాన నిలవనున్నారనీ, ఇప్పుడు పోటీలో ఉన్నది జయప్రద కాదు, ప్రజలేనని ఆమె అభివర్ణించారు. రాంపూర్ లోక్సభ స్థానానికి జయప్రద 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్తో ఏర్పడిన విభేదాల కారణంగా అమర్సింగ్తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం రాంపూర్లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తనకు మద్దతు తెలపకపోవడంపై జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇది మా నాన్న వద్దనుకున్న శాలువా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై చిందులు తొక్కుతున్న బీజేపీ నేతలు బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. యూపీ బీజేపీ చీఫ్ ఎంఎన్ పాండే ఆ జాబితాలో చేరారు. మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఎస్పీ-బీఎస్పీ పొత్తు సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాయావతికి శాలువా కప్పుతున్న వీడియో అది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఉన్నప్పుడు ఇది మా నాన్న కప్పుకునేవారు. కానీ, 1995 గెస్ట్హౌజ్ ఘటన తర్వాత ఆయన తన ఒంటి మీది నుంచి ఈ శాలువా తీసేశారు. మళ్లీ మీకు కప్పుతున్నా.. అని అఖిలేష్ మనసులో అనుకుంటున్నట్టుగా వీడియో కింద రాసుకొచ్చాడు’ అని పాండే ఉటంకించారు. కాగా, పాండే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిగా రాజకీయాలు చేస్తే వీళ్లదేం పోయిందంటూ బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. కాగా, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో 38-38 చొప్పున పోటీ చేస్తామని ఎస్పీ-బీఎస్పీ ప్రకటించాయి. -
ప్రియాంకపై స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్ యత్నిస్తోందని, బైపోలార్ డిజార్డర్తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్ఛార్జ్గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల మరికొందరు బీజేపీ నేతలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించగా.. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మరో నేత కైలాష్ విజయ్వర్జియా.. ‘కాంగ్రెస్లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవులు కట్టబెట్టారు. చాకొలేట్ ఫేస్లతో వచ్చే లోక్సభ ఎన్నికలను ఎదుర్కొందామని కాంగ్రెస్ నేతలు కలలుగంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్మెంట్కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్ డిజార్డర్గా పిలుస్తారు. -
‘ముందు పెళ్లి చేసుకుని ఆ పని చెయ్’
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాహుల్ కౌగిలింత’ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. తనని చూస్తే ఎక్కడ కౌగిలించుకుంటానో అని భయంతో బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత దుబే.. రాహుల్ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. (‘లోఫర్లే అలా చేస్తారు’), (అదో రకం షాక్) ‘మేం ఆయన్ని ఎందుకు కౌలిగించుకోవాలి?. పైగా స్వలింగసంపర్కానికి సంబంధించి సెక్షన్ 377ను ఇంకా రద్దు కాలేదు కదా. ఈ సమయంలో రాహుల్ను కౌగిలించుకుంటే మా భార్యలు మాకు ఖచ్ఛితంగా విడాకులు ఇస్తారు. అయితే రాహుల్కి ఓ సలహా. ఆయన గనుక ముందు వివాహం చేసుకుంటే మంచిది. అప్పుడు నిరభ్యరంతంగా కౌగిలించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అయితే దుబే చేసిన ‘తేడా వ్యాఖ్యల’పై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గొడ్డా(జార్ఖండ్)లోని నిశికాంత్ ఇంటి బయట ధర్నాకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను
-
‘పేదల రక్తానికి మరిగిన పులి చంద్రబాబు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం వీధిరౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని, పేదవాడి రక్తానికి మరిగిన పులి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. విశాఖలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల పట్ల సీఎం ప్రవర్తించిన తీరుకు రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. క్షురకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధర్మంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ.. ధర్మ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. బరితెగించి ఇసుక అమ్ముతున్నారని, దొంగల ప్రభుత్వం ఇదని ఆరోపించారు. మోదీ లేకపోతే చంద్రబాబు జీరో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు జీరో అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. విధానపరమైన నిర్ణయాల వల్లే కశ్మీర్లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీయే బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలపై మండల స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. -
నాయిబ్రాహ్మణులకు బాబు క్షమాపణలు చెప్పాలి
-
చంద్రబాబు తీరుతో విస్తుపోయా!
సాక్షి, రాజమహేంద్రవరం: కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ట్విటర్లో స్పందించారు. విస్తుపోయా!... ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబుగారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో... ‘దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం’ అని నాయీ బ్రాహ్మణ వర్గానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 June 2018 -
హద్దు మీరాను.. సారీ ఇవాంక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ యాంకర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. కమెడియన్ కమ్ టీవీ హోస్ట్ సమంత బీ, ‘ఫుల్ ఫ్రొంటల్’ అనే షోలో ఇవాంకపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అది దుమారం రేపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, మరోవైపు వైట్హౌజ్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాంకకు సారీ చెప్పేశారు. ‘ఇవాంక ట్రంప్, ఆ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు నా క్షమాపణలు. ఆమెపై గత రాత్రి నేను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. అనవసరంగా మాట్లాడాను. హద్దులు మీరాను. అందుకు చింతిస్తున్నా. ఇవాంక నన్ను మన్నించండి’ అని ఓ ప్రకటనలో సమంత తెలిపారు. తన ట్విటర్లో ఆమె ట్వీట్ కూడా చేశారు. కాగా, ఈ మధ్యే ఇవాంక తన చిన్న కొడుకుతో దిగిన ఓ ఫోటోను ట్వీట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో 1500 మంది వలసవాద చిన్నారులు అదృశ్యం అయ్యారన్న నివేదిక ఒకటి వెలువడింది. బుధవారం తన టీవీ షోలో సమంత బీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... యూఎస్ ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ వలసవాదుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. తన తండ్రికి(ట్రంప్) సలహాలు ఇవ్వాలంటూ ఇవాంకకు సూచిస్తూ కొడుకుతో ఉన్న ఫోటో ప్రస్తావనకు తెచ్చి మరీ సమంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితి మీకు వస్తే తెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. దీనిపై వైట్హౌజ్ ప్రెస్ కార్యదర్శి సారా హుక్కాబీ సాండర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సమంత చేసిన వ్యాఖ్యలు సరైంది కాదని పేర్కొన్నారు. మరోవైపు పలువురిని నుంచి విమర్శలు రావటంతో సమంత క్షమాపణలు చెప్పారు. మరోవైపు టీబీఎస్ నెట్వర్క్ ఆ కార్యక్రమం తాలూకూ వీడియోలను తొలగిస్తున్నట్లు చెబుతూ వైట్హౌజ్ కార్యాలయాన్ని క్షమాపణలు కోరింది. -
తప్పు నాదే.. క్షమించండి: సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. జనక్పూర్ పర్యటనలో లక్షలాది మంది భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారని ఆమె ఓ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో ఆమె స్పందించారు. ‘ఇది నా తప్పే. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’ అని సోమవారం ఆమె తన ట్విటర్లో పేర్కొన్నారు. అంతేకాదు తాను మాట్లాడిన మాటల తాలూకు వీడియోనూ ఆమె పోస్ట్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆమె ప్రధానిపై ప్రశంసలు గుప్పించారు. ‘అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ మొదలు.. నేపాల్లోని జనక్పూర్ వరకు లక్షలాది మంది భారతీయులను కలుసుకుని, వారిని ఉద్దేశించి మన ప్రధాని మోదీ ప్రసంగించారు’ అని సుష్మా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు సుష్మాపై సెటైర్లు కూడా పేల్చారు. ‘విదేశాంగశాఖ మంత్రి గారి దృష్టిలో జనక్పూర్లో మొత్తం భారతీయులే కనిపిస్తున్నారు కాబోలు, మేడమ్.. మోదీగారిని ప్రసన్నం చేసుకునేందుకు అంతలా యత్నించాలా?, సుష్మాజీ వాళ్లు నేపాలీలు.. భారతీయులు కారు’ అంటూ కామెంట్లు చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై నేపాల్ ఎంపీ గగన్ అసహనం వ్యక్తం చేశారు. ఇది తమ దేశ(నేపాల్) సార్వభౌమత్వాన్ని తీసిపడేసినట్లు ఉందంటూ గగన్ ఓ ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె క్షమాపణలు చెప్పారు. This was a mistake on my part. I sincerely apologise for this. pic.twitter.com/S1CpLv8uu0 — Sushma Swaraj (@SushmaSwaraj) 28 May 2018 -
ఎక్స్పోజింగ్ ఆపండి.. ఇంటర్నెట్ వద్దు
లక్నో: అత్యాచారాలపై యూపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యువతులు సరైన దుస్తులు వేసుకోకపోవటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రామ్శంకర్ విద్యార్థి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రామ్శంకర్ విద్యార్థి సోమవారం బల్లియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ హాజరైన స్టూడెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ‘అమ్మాయిలు మీ బట్టల విషయంలో శ్రద్ధ తీసుకోండి. అందుకే మీపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్స్పోజింగ్ చేయటం ఆపండి. నిండైన దుస్తులు ధరించండి. మైనర్లకు సెల్ఫోన్లు ఎందుకో అర్థం కావటం లేదు. తల్లిదండ్రులు వారి నుంచి ఫోన్లను లాక్కోండి. నన్ను అడిగితే సెల్ఫోన్లు మొత్తానికే బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరతా. ఎందుకంటే ఫోన్ల ద్వారానే పోర్న్కు జనాలు అలవాటు పడిపోతున్నారు. ఆ ఉద్వేగంలో అత్యాచారాలకు పాల్పడుతున్నారు’ అని విద్యార్థి ప్రసంగించారు. అశ్లీలత తగ్గాలంటే అమ్మాయిల పట్ల అబ్బాయిలకు గౌరవ భావం పెరగాలి. అంటే వారి బంధాలు పవిత్రంగా ఉండాలి. అందుకే వారి మధ్య అన్నచెల్లెల బంధం నెలకొనాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తర్వాత ఆయన మీడియాకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. కాగా, అత్యాచారాలపై గతంలోనూ మరికొందరు నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలయ్యారు. ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్కు మద్ధతు ఇచ్చే కమ్రంలో మరో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలు పెరగిపోవటానికి తల్లిదండ్రలే కారణమని, పిల్లలను పట్టించుకోకపోవటం మూలంగానే ఇష్టమొచ్చినట్లు గాలికి తిరుగుతున్నారని సురేంద్ర వ్యాఖ్యానించారు. అమ్మాయిలను కాకుండా, పిల్లల తల్లులను ఎవరైనా రేప్ చేస్తారా? అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు. గతేడాది కర్ణాటక హోం మంత్రిగా ఉన్న కేజీ జార్జి గ్యాంగ్ రేప్కు సరికొత్త భాష్యం చెప్పారు. ఇద్దరు కలిసి చేస్తే అది సామూహిక అత్యాచారం అవదని, కనీసం నలుగురైదుగురు చేస్తేనే అది గ్యాంగ్ రేప్ కిందకు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక ఛండీగఢ్ లైంగిక వేధింపుల ఘటనపై స్పందించిన బీజేపీ డిప్యూటీ చీఫ్ రామ్వీర్ భట్టి.. అర్ధరాత్రిలో అమ్మాయిలకు రోడ్ల మీద ఏం పని? ఇంట్లో మూస్కోని కూర్చోకుండా.. అందుకే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. -
అశ్లీలత తగ్గాలంటే అమ్మాయిల పట్ల గౌరవం పెరగాలి
-
కర్ణాటక గవర్నర్పై తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలతో అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. యెడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయం ప్రకటించగానే అసెంబ్లీలో మొదలైన సందడి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విధేయతలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సరికొత్త రికార్డు సృష్టించారు. రెండు వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని యత్నించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని, పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పైగా ప్రొటెం స్పీకర్గా బీజేపీకే చెందిన వ్యక్తిని నియమించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఆయన శతవిధాల ప్రయత్నించారు. బహుశా ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ వాలా అని పేరు పెట్టుకోవాలేమో. ఎందుకంటే ఆయన కంటే విశ్వాసం, విధేయతను ప్రదర్శించేవారు ఉండరనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అలవాటేనని మహారాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ విభాగం నేత అమిత్ మాలవియా తెలిపారు. -
కన్యత్వం కోల్పోతే తప్పేంటి?
సాక్షి, చెన్నై: బోల్డ్గా ఫీలవుతూ సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు ఒక్కోసారి వాళ్లను చిక్కులో పడేస్తుంటాయి. యువ హీరోయిన్ యాషిక ఆనంద్(19) ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పెళ్లికి ముందే అమ్మాయిలు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదని ఆమె వ్యాఖ్యానించటంతో విమర్శలు మొదలయ్యాయి. అడల్ట్ హర్రర్ కామెడీగా తెరకెక్కిన ‘ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ప్రమోషన్లో భాగంగా ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఈ చిత్ర హీరోయిన్ యాషిక పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘పెళ్లికి ముందు అమ్మాయిలు తప్పు చేయటం సరైందేనా?’ అన్న ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ... ‘అందులో పెద్ద సందేహం ఏముంది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. అందులో తప్పు కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్లది’ అని వ్యాఖ్యానించారు. తానూ పోర్న్ వీడియోలు చూస్తానని, ఓసారి ఇంట్లో తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిపోయానని, అయినా వాళ్లు తనని ఏం అనలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక కొందరు ఆమెను సోషల్ మీడియాలో మియా ఖలీపాతో పోల్చటంపై స్పందిస్తూ అడల్ట్ చిత్రం చేసినంత మాత్రం అలా కామెంట్లు చేయటం సరికాదన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె నోటి వెంట కొన్ని బూతు డైలాగులు, అడల్ట్ జోకులు పేలాయి. దీంతో యషికపై విమర్శలు మొదలయ్యాయి. సోమవారం కొన్ని మహిళా సంఘాలు యాషిక ఇంటర్వ్యూపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నైలో సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద ధర్నా నిర్వహించాయి. మరోవైపు కోలీవుడ్ సీనియర్ నటీనటులు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ కార్తీక్, యాషిక, వైభవి శాండిల్య, వీజే షారా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జయకుమార్ దర్శకత్వం వహించారు. కన్యగా చనిపోయిన ఓ యువతి దెయ్యంగా మారి, ఓ బంగ్లాకు వచ్చే యువకులతో రొమాన్స్ చేయటమే ఈ చిత్ర ఇతివృత్తం. హాలీవుడ్ చిత్రం హ్యాండ్ జాబ్ క్యాబిన్ ఆధారంగా ఇది తెరకెక్కింది. -
వర్ల రామయ్యకు అహంకారం పెరిగింది..
సాక్షి, గుంటూరు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ ... వర్ల రామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రావెల కిషోర్...గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వర్ల రామయ్య పిల్లలు ఫోన్ వాడరా?
సాక్షి, విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత ప్రవర్తన, అభ్యంతరకర వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వర్ల తీరును ఆక్షేపించారు. (చదవండి: నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్) ‘‘మచిలీపట్నం బస్టాండ్లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వర్ల రామయ్య.. తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారు. పక్కనున్న టీడీపీ నాయకులు ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టారు. ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి.. నీ కులమేంటని ప్రశ్నించారు. ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని తిట్టిపోశారు. ఏం? వర్ల రామయ్యగారి పిల్లలు ఫోన్లు వాడరా? పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అసలు కులం అడగటం ఏం సంస్కృతి? ఆయన అనాల్సిన మాటలేనా అవి!’’ అని ఎంపీ వరప్రసాద్ వాపోయారు. యథా బాబు.. తథా రామయ్య: గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
దళిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య
-
నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య కులం పేరుతో దూషించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ ఘటన గురువారం కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ అవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ తనిఖీ నిమిత్తం వచ్చిన వర్ల రామయ్య అక్కడ ఆగిఉన్న బస్సు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఓ యువకుడు బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ఫోన్లో పాటలు వింటున్నాడు. తనను చూసి సీటులో నుంచి లేవలేదని అనుకున్నారో ఏమో.. ఇయర్ ఫోన్స్ లాక్కుని తన చెవికి పెట్టుకున్నారు. అనంతరం తన నోటికి పనిచెప్పారు. రాయలేని విధంగా దుర్భాషలాడారు. ‘‘నీకు ఫోన్ ఎందుకురా? ఎస్సీనా నువ్వు?.. మాలా? మాదిగా?’’ అని నిలదీశారు. తాను మాదిగనని ఆ యువకుడు బదులివ్వగా.. వర్ల మరింత రెచ్చిపోయారు. ‘‘మాదిగ (నా.. కొ..) అస్సలు చదవరు. బాగుపడరు’’.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. ‘‘మీ నాన్న, మీ అమ్మ ఏం పనిచేస్తారు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని లక్షలు ఉన్నాయి బ్యాంకులో?’’ అంటూ అసంబద్ధ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఆర్టీసీ అధికారులుఅవాక్కయ్యారు. ఆర్టీసీ అధికారుల పనితీరు, బస్టాండ్లో సౌకర్యాలపై తనిఖీ చేయాల్సి వర్ల రామయ్యకు ప్రయాణికులను దుర్భాషలాడాల్సి అవసరం ఏంటని విమర్శలు వ్యక్తమయ్యాయి. కులం పేరుతో దూషించడం దుర్మార్గం మచిలీపట్నం బస్టాండ్లో దళితులను, ప్రయాణికులను అవమానపరుస్తూ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడటం సిగ్గుచేటని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. మాదిగోళ్లకు చదువు సంధ్యలు ఉండవు.. వీరికి సెల్ఫోన్లు కావాలి అని మాట్లాడటం ఆయన స్థాయికి తగదన్నారు. దళిత కులంలో పుట్టి అదే దళితులను అవమానపరుస్తూ రామయ్య మాట్లాడటం దుర్మార్గమని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మార్కెటింగ్ శాఖ మంత్రి తదితరులు సైతం దళితులను కించపరిచేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. మార్చి నాటికి అంబేడ్కర్ స్మృతివనం ఇదిలా ఉంటే.. అమరావతిలో 2019 మార్చి నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని, ఇప్పటికే ఆ బాధ్యతను ఏపీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీకి అప్పగించామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతివనం ప్రాజెక్టును రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించిన డిజైన్ సైతం ఖరారు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా పాల్గొన్నారు. -
రిపోర్టర్లు, యాంకర్లపై అభ్యంతర వ్యాఖ్యలు
చెన్నై: మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్న ఓ పోస్ట్ను తమిళనాడు బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్ గురువారం తన ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘చదువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కన్నా మీడియాలోనే లైంగికవేధింపులు ఎక్కువ. పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవ్వరూ రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లు కాలేరు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి సుబ్రమణియన్ను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేయిని ఫినాయిల్తో కడుక్కోవాలి. తమిళనాడులో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతిలో చిక్కుకున్న మీడియా తిరోగమిస్తోంది. ఇక్కడి మీడియా ప్రతినిధులు దిగజారిన, అసహ్యమైన, సభ్యతలేని జీవులు’ అని ఉన్న పోస్ట్ను షేర్ చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శేఖర్ వెంటనే క్షమాపణలు కోరారు. చదవకుండానే పోస్టును షేర్చేశానన్నారు. -
మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఊరుకోం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం తీసుకున్న వారికి అవకాశాలిప్పిస్తామని ‘మా’ హామీ ఇవ్వదు. వృద్ధ కళాకారులకు పెన్షన్, సభ్యులందరికీ రూ.2 లక్షల బీమాతో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలకు మధ్య ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుంది. అంతేకానీ, ‘మా’ అవకాశాలు ఇప్పించాలనడం కరెక్ట్ కాదు’’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పవన్ కల్యాణ్పై నటి శ్రీరెడ్డితో పాటు మరికొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటి గురించి బుధవారం నాగబాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. టీవీ ఇండస్ట్రీలోనూ ఉంది. కాకపోతే అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఇండస్ట్రీలో 10 శాతం మంది అలాంటి వెధవలున్నారు. 90 శాతం మంది మంచివాళ్లు ఉన్నారు. వాళ్లను కూడా నిందించడం కరెక్ట్ కాదు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరైనా వేధిస్తే ‘చెప్పు తీసుకుని కొట్టండి. ఆ హక్కు మీకు ఉంటుంది’. బయట మాట్లాడుతున్నవారికంటే మాకూ మహిళలంటే చాలా గౌరవం ఉంది. ఇండస్ట్రీమీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతుర్ని ఇండస్ట్రీలో పెడతా? ‘క్యాష్’ కమిటీకి మేము రెడీ. లైంగిక వేధింపులకు పాల్పడే కోఆర్డినేటర్లపై నిర్మాతలకు ధైర్యంగా ఫిర్యాదు చేయండి. షూటింగ్ స్పాట్లో జూనియర్ ఆర్టిస్టులకు కనీస సౌకర్యాలు కల్పించేలా నిర్మాతలందరితో మాట్లాడతాం. ఇండస్ట్రీలో ఇతర భాషలవారు పని చేయకూడదనడం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే. ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. తెలుగమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వమని నిర్మాతలను, దర్శకుల్ని ‘మా’ కోరుతోంది. కానీ వారిపై ఒత్తిడి చేసే హక్కు లేదు. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది దర్శక–నిర్మాతల ఇష్టం. మీడియా కూడా టీఆర్పీల కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడాలి. అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయమని పవన్ అనడంలో తప్పేముంది? ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే కల్యాణ్ ఏం చేస్తాడు? ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. మేం బలవంతులం. మాకు భరించే శక్తి ఉంది. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు. ఇకపై మెగా ఫ్యామిలీని అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకునేదిలేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించడం మంచిది’’ అన్నారు. -
యోగిపై చెప్పుల దాడి.. సారీ!
సాక్షి, బెంగళూర్ : ఉన్నావ్ రేప్ కేసుపై స్పందించే క్రమంలో కర్ణాటక పీసీసీ కార్యాధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో అడుగుపెడితే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్పై చెప్పులతో దాడి చేయాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ ఉదయం ఓ జాతీయ మీడియాతో దినేశ్ మాట్లాడుతూ.. ‘ఆదిత్యానాథ్ భారత రాజకీయాల్లో ఓ మచ్చ. ముఖ్యమంత్రిగా ఆయన అనర్హుడు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే అకృత్యానికి పాల్పడి దొరికిపోయాడు. ప్రభుత్వం పరువుపోయింది. సంస్కారం ఉంటే ఆదిత్యానాథ్ తన పదవికి రాజీనామా చేయాలి’ అని ఆయన తెలిపారు. అయితే కొనసాగింపులో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన కర్ణాటకలో అడుగుపెడితే ఆయనను చెప్పులతో కొట్టండి. మన ప్రాంతంలో అతన్ని అడుగు పెట్టనివ్వొద్దని కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. యోగి.. నువ్వు మా రాష్ట్రానికి ప్రచారానికి రావొద్దు. వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నువ్వు సాధువులా ప్రవర్తించటం లేదు. రోజు రోజుకీ నీ పాపాలు పెరిగిపోతున్నాయి. నువ్వొ మోసగాడివి. దేశ ప్రజలు కూడా అతన్ని యోగి అని సంభోదించకండి. అతన్ని నకిలీ (ధోంగి) అని పిలవండి అంటూ గుండూ రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు కర్ణాటకలో.. అటు యూపీలో కర్ణాటకలో బీజేపీ నిరసన ప్రదర్శనలకు దిగింది. యోగికి క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో కూడా చిన్నపాటి ఉద్యమాన్ని నడిపింది. దీంతో దినేశ్ మళ్లీ స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చెస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కర్ణాటక బీజేపీ విభాగం మాత్రం తగ్గలేదు. గుండూ రావ్కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్కు బీజేపీ నేత రవికుమార్ ఫిర్యాదు చేశారు.