-
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. — BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024 -
‘‘జేడీఎస్తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు. -
Bengaluru: డీకే శివకుమార్పై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
బెంగళూరు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల నియమావళి)ను ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలోని డీకే శివకుమార్ ఆఫీసును పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ‘విధాన సౌధలోని తన ఆఫీసును కాంగ్రెస్ ఆఫీసులా డీకే శివకుమార్ భావిస్తున్నారు. శనివారం(మార్చ్ 30) ఆయన తన విధాన సౌధ ఆఫీసులో నజ్మా నజీర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పూర్తిగా ఉల్లంఘించడమే’ అని డీకే శివకుమార్పై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్కుమార్ తెలిపారు. ఈ విషయంలో డీకే శివకుమార్పై కఠిన చర్యలు తీసుకుని గట్టి సందేశం పంపాలని ఎన్నికల కమిషన్ను ఈ సందర్భంగా సురేష్ కుమార్ కోరారు. ఇదీ చదవండి.. ఇండియా ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన -
ఇది బీజేపీ పొలిటికల్ గేమ్!.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా నీటి సంక్షోభం ఏర్పడింది. కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. ఈ తరుణంలో బెంగళూరులో నీటి ఎద్దడి లేదని ఉప ముఖ్యమంత్రి 'డీకే శివకుమార్' కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి సంక్షోభం లేదు. దాదాపు 7000 బోర్వెల్లు ఎండిపోయినప్పటికీ.. నీటి కొరత ఉండకూడదని తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాం. నీటి వనరులను గుర్తించాం.. నీటి సరఫరా జరిగేలా చూస్తామని డీకే శివకుమార్ అన్నారు. నీటి కొరత రాకుండా ఉండటానికి నగరంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, నిర్వహణ కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేదించారు. తాగునీరు, రోజువారీ పనుల కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడిన నివాసితుల కోసం.. జిల్లా యంత్రాంగం ప్రైవేట్ ట్యాంకర్లకు రేట్లను ఫిక్స్ చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'పొలిటికల్ గేమ్' ఆడుతోందని డీకే శివకుమార్ నిందించారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఉన్నప్పటికీ పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రహస్యంగా విడుదల చేస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రామనగర జిల్లాలోని కనకపుర తాలూకాలోని మేకేదాటు వద్ద కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 'వాక్ ఫర్ మేకేదాటు ప్రాజెక్ట్' నిర్వహించింది తానేనని శివకుమార్ బీజేపీ నేతలకు గుర్తు చేయాలని కోరారు. ఆ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూసేందుకే పాదయాత్ర నిర్వహించిన విషయం కూడా గుర్తు చేశారు. మేకేదాటు ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్రానికి అనుమతి వచ్చేలా చూడాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులను ఆయన కోరారు. -
డీకే శివకుమార్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్!.. డీకే శివకుమార్తో మల్లారెడ్డి మంతనాలు
సాక్షి, బెంగుళూరు: మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్తో మంతనాలు జరిపారు. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్లోకి వెళ్లడం లేదంటూ, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే హఠాత్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్ -
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్లోకి వెళ్లి టాయ్లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం సిద్ధరామయ్య, మంత్రులకు బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు. ‘సినిమా ట్రైలర్పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే, కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము. మీకు పంపిన మెయిల్ స్క్రీన్షాట్లను అప్లోడ్ చేస్తాం. మా నెక్ట్స్ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్లో పేర్కొన్నారు. -
Bengaluru: బెదిరింపులకు భయపడం: డీకే శివకుమార్
బెంగళూరు: తన తమ్ముడు డీకే సురేష్ను కాల్చి చంపాలని బీఏపీ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. డీకే సురేష్ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటివి తాము గతంలో చాలా చూశామన్నారు. వాటన్నింటని సెటిల్ చేశామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్ మాట్లాడుతూ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాలయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చెబుతానన్నారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకే సురేష్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు. కాగా, డీకే సురేష్ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్ఐఆర్లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ముగిసిన 17వ లోక్సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా -
రోజుకో మలుపు తిరుగుతున్న డీకే శివకుమార్ సీబీఐ కేసు
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని సీఎం సిధ్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉపసంహరించుకోవడం చెల్లదని సీబీఐ తాజాగా హై కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. సీబీఐ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. ఈ విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే సీబీఐకి హైకోర్టులో తమ ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా, డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వం సమ్మతి ఉపసంహరించుకోవడం అనైతికం అని ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్లు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం సిధ్దరామయ్య ఏ మాత్రం వెరవడం లేదు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం రాకముందే డీకే శివకుమార్ కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వం సమ్మతి ఇచ్చిందని, ఇది చెల్లనందునే తాము సమ్మతి ఉపసంహరించుకున్నామని సిధ్ద రామయ్య సమర్ధించుకుంటున్నారు. అయితే డీకే కేసులో సమ్మతి ఇచ్చిన మాజీ సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఒకసారి సమ్మతి ఇచ్చి విచారణ ప్రారంభం అయిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య క్షమించరాని నేరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇదీచదవండి..రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్కు ఆహ్వానం -
బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా బయటపడిన కాంగ్రెస్-టిడిపి బంధం
-
DK Shivakumar Meets CBN Photos: పవన్.. మళ్లీ కరివేపాకయ్యాడుగా! (ఫొటో స్టోరీ)
-
అందుకేనట బాబు రహస్య మంతనాలు!
అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్థితి.. చచ్చిన తెలుగుదేశాన్ని లేపి.. మళ్ళీ నాగినీ డాన్స్ అందించడానికి అయన ఎన్ని విధాలా నాగస్వరం ఊదుతున్నా అయన బుగ్గలు నెప్పెడుతున్నాయి తప్ప పాము లేవడం లేదు.. దీంతో కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ను వాడుకుని పార్టీకి బలం చేకూరుద్దామని ప్రయత్నించారు. అబ్బే.. కుదరలేదు. గజ్జి తగ్గడానికి మందు రాస్తే ఆ గజ్జి చేతికి అంటుకుంది తప్ప గజ్జి మానలేదు. చంద్రబాబుతో అంటకాగిన కొద్దీ పవన్ కళ్యాణ్ బలహీనం అయ్యాడు కానీ టీడీపీకి లాభం రాలేదు... పైగా కాపులు ఇప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కలిపి జాయింటుగా టార్గెట్ చేసి తిడుతున్నారు. దీంతో ఆ పీకే అచ్చిరాలేదని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK ) ను తెచ్చారు. రోగిలో చలనం లేనపుడు, అవయవాలన్నీ చచ్చుబడిపోయినపుడు ఎంత పెద్ద డాక్టర్ మాత్రం ఏమి చేస్తాడు.... ఆయన కూడా చెక్ చేసి.. కష్టం. ఇంకొన్నాళ్లే బతుకుతాడు.. దగ్గరోళ్ళు ఉంటె పిలుచుకోండి.. కడసారి చూపులు చూసుకోండి అని చెప్పేసినట్లు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేశాడు. దీంతో. ఇక చంద్రబాబుకు మిగిలింది దింపుడు కల్లం ఆశ మాత్రమే మిగిలింది.. దీంతో ఇప్పుడు తాజాగా మంచి సక్సెస్ రికార్డ్తో దూసుకుపోతున్న కర్ణాటక కాంగ్రస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. Chance encounter between #TDP chief and #AndhraPradesh former CM #ChandrababuNaidu and KPCC chief and #Karnataka Deputy CM, #DKShivakumar at HAL airport Bengaluru, DK was heading for the Congress formation day in Nagpur, while #Chandrababu to attend a party meeting in city. pic.twitter.com/fG9umaE7md — Surya Reddy (@jsuryareddy) December 28, 2023 కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించడం దగ్గర్నుంచి తెలంగాణాలో అసలు రేసులోనే లేని కాంగ్రెసును అధికార పీఠం ఎక్కించిన ఎపిసోడ్ తాలూకు క్రెడిట్ మొత్తం డీకే శివకుమార్ కు దక్కింది. దీంతో ఆయన్ను ప్రసన్నం చేసుకుని కొన్ని ఎత్తులు.. పొత్తులు.. జిత్తులను ప్లాన్ చేసే నిమిత్తము ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. అటు ఎన్నికల సమయం ముంచుకొస్తోంది.. ఎటు చూసినా కారుచీకటి. గెలిచే సీట్ ఎక్కడా కానరావడం లేదు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం కుప్పంలో పోటీకి భయపడి రెండోచోట పోటీ చేస్తారని అంటున్నారు. అంటే టీడీపీ శిబిరం బయటకు బిల్డప్పులు బాగానే కొడుతున్నా లోలోన ఓటమి భయం వెన్నాడుతోంది. దీంతో అటు లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి తయారవుతున్నారు. ఇక జగన్ కాదని వదిలేసిన వంశీ, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలాంటి వాళ్ళే ఇప్పుడు బాబుకు దిక్కవుతున్నారు. దీంతో దిక్కుతోచని అయన ఏకంగా కాంగ్రెస్ నాయకులతోనే పొత్తులగురించి చర్చించే స్థాయికి దిగిపోయారు.. వాస్తవానికి 2019లో కూడా ఎన్డీయేను వదిలేసి కాంగ్రెస్ కూటమిలో చేరి దేశమంతా తిరిగి ప్రచారం చేసినా కాంగ్రెస్ బతికిబట్టగట్టలేదు సరికగా తాను వంద తిట్లు తిట్టినా మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సైతం చంద్రబాబు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. -సిమ్మాదిరప్పన్న -
TS:ఖర్గేతో డీకే శివకుమార్ కీలక భేటీ... సీఎం ఫైనల్ అయ్యే ఛాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసలంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఉత్తమ్, భట్టిలతో జరిగిన సమావేశ వివరాలపై డీకే ఏఐసీసీ చీఫ్కు నివేదిక అందించారు. సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకేఎస్ మీడయాతో మాట్లాడారు. ‘తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ చెప్పారు. అంతకముందు హైదరాబాద్ నుంచి ఇవాళే ఢిల్లీకి వచ్చిన భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిలతో డీకే శివకుమార్, ఠాక్రేలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై వారిరువురి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా, ఉదయం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలోగా సీఎం ఎంపిక ఉంటుందనేదానిపై క్లారిటీ ఇచ్చారు. సాయంత్రంలోగా సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్కు తెర! -
ఇంకా కొలిక్కిరాని తెలంగాణ సీఎం ఎంపిక
-
TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? కొత్త మంత్రులు ఎవరనేదానిపై ఉత్కంఠకు ఇవాళ తెరపడే ఛాన్సుంది. పార్లమెంట్లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు. కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్లు డీకేఎస్తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్కుమార్రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్కు తెర! -
TS: సీల్డ్ కవర్తో హైదరాబాద్కు డీకే శివకుమార్ !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం డీకేఎస్తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్తో మధ్యాహ్నమే హైదరాబాద్ బయలుదేరనున్నారు. డీకే శివకుమార్ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఎల్లా హోటల్కు వెళ్లి వారతో సమావేశమవుతారు. అక్కడ సీల్డ్ కవర్లో ఉన్న సీఎం పేరును ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యమైన పోర్ట్ఫోలియోలకు మంత్రులెవరనేది కూడా వెల్లడిస్తారు. మొత్తానికి సీఎం పదవి చేపట్టనుందెవరనేది సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందనేదానిపై పేరు ప్రకటించిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్సుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ సాధించిన విషయం తెలిసిందే. లెజిస్లేచర్ పార్టీ లీడర్ (సీఎల్పీ) నేతను ఎన్నుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సోమవారం సమావేశమయ్యారు. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి పంపించారు. తర్వాత డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు. ఇదీచదవండి..గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి వరించేదెవరిని... -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్ను కలసి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్భవన్కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
సీఎం ఎవరనేది అప్పుడే తేలుస్తాం: డీకే శివకుమార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాతమన్నారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. హోటల్ నుంచి గవర్నర్ను కలవడానికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ థాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్కుమార్ రెడ్డి వెళ్లారు. సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా.. లేదంటే నిర్ణయం మళ్లీ వాయిదా పడుతుందా అనేదానిపై క్లారిటీ లేదు. -
డీకే శివకుమార్ ఫస్ట్ రియాక్షన్
-
గెలుపు దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్తో రెడీగా డీకే శివకుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మరోవైపు.. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక, బీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలు పలుచోట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. రిసోర్టు రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. ఇక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్లాన్ రచిస్తున్నారు. ట్రబుల్ షూటర్ డీకే.. శనివారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్కు చేరుకొని ఎన్నికల ఫలితాలను విక్షిస్తున్నారు. #WATCH | On being asked if party MLAs will be shifted to Bengaluru as buses stationed outside Hyderabad's Taj Krishna, Congress leader & Karnataka minister Rahim Khan says, "If that situation comes, then party high command will decide." pic.twitter.com/nrAXP5MgQr — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతలు తాజ్కృష్ణలో రూమ్స్ను బుక్ చేసుకున్నారు. దాదాపు 100 గదులను రిజ్వర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను తాజ్కృష్ణకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా హస్తం పార్టీ ముందస్తుగానే ప్లాన్ చేసింది. Telangana | Luxury buses have been stationed at Hyderabad's Taj Krishna. pic.twitter.com/1hJsAsfJrd — ANI (@ANI) December 3, 2023 -
డీకే శివకుమార్ బిగ్ స్కెచ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిఫ్ట్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎగ్జిట్పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తమ పార్టీ తరపున గెలిచే ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫలితాల్లో పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ అలాకాని పక్షంలో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్నే వేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొందరు సీఎం కేసీఆర్కు టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు నడపడంలో దిట్ట అయిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను రంగంలోకి దిగారు. కౌంటింగ్కు ఒక రోజు ముందే శనివారం సాయంత్రమే డీకే సహా ఆరుగురు కర్ణాటక మంత్రులు హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాకు రావాలని డీకే అండ్ కో ఇప్పటికే అభ్యర్థులను కోరినట్లు తెలిసింది. అభ్యర్థులతో డీకే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచాం. ఫలితాల వెల్లడి తర్వాత గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో డీకే బ్యాచ్ బెంగళూరు షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా,శనివారం ఉదయం తెలంగాణఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలు కూడా గెలవబోయే కాంగ్రెస్ అభ్యర్థుల విషయమై ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తమ పార్టీ చీఫ్ పోలింగ్ ఏజెంట్కే ఎమ్మెల్యేల గెలుపు ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. దీనినిబట్టి పోటీచేసిన అభ్యర్థులు లోకల్గా అందుబాటులో ఉండరని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఓ జాతీయ టీవీ ఛానల్తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఇప్పటికే మా అభ్యర్థుల్లో కొంత మందికి టచ్లోకి వచ్చారని చెప్పారు. అయితే ఈసారి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం అంత ఈజీ కాదని డీకే స్పష్టం చేశారు.2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..తెలంగాణ ఎన్నికలు 2023.. నేటి సమగ్ర సమాచారం -
డీకే శివకుమార్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్ 28 లోకల్ క్లైమేట్ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్ దుబాయ్ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు దుబాయ్లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది. డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది. అయితే డీకే దుబాయ్ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్ నెంబర్ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్కు 2019 అక్టోబర్ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్పైనే ఉన్నారు. ఇదీచదవండి..వర్షంలో శరద్పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే.. -
డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. డీకే కేసులో సీబీఐ విచారణ జరిపేందుకు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి(కన్సెంట్) అక్రమమని చెప్పారు. తాము ఆ అనుమతిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. ‘సాధారణంగా సీబీఐ కేసుల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్, మంత్రులకు గవర్నర్ విచారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీకే కేసులో కేలం గవర్నర్ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్ పర్మిషన్ ఇవ్వలేదు. డీకే ఎమ్మెల్యే కూడా. ఆయనపై సీబీఐ విచారణజరపాలంటే స్పీకర్ అనుమతి కావాలి. స్పీకర్ అనుమతివ్వనందున సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అక్రమం’ అని సిద్ధరామయ్య తెలిపారు. ‘అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం మాత్రం అనుమతి ఉపసంహరిస్తుంది. ఆ అనుమతి కేవలం అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు ఇచ్చింది’ అని సిద్ధరామయ్య అన్నారు. 2013 నుంచి2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకుగాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది. పబ్లిక్ సర్వెంట్లను విచారించాలంటే సీబీఐకి ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. తాను మంత్రిగా ఉన్నప్పటి అక్రమాస్తుల కేసులో కేవలం గవర్నర్ మాత్రమే కన్సెంట్ ఇచ్చారని, స్పీకర్ కన్సెంట్ ఇవ్వలేదని పేర్కొంటూ కేసు విచారణను కొట్టి వేయాలని డీకే ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. ఇదీచదవండి..చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ -
ఎన్నికలు కరెంట్ పైనే..
హుస్నాబాద్/చిగురుమామిడి/ అక్కన్నపేట/కోహెడ: కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న మన తెలంగాణకు వచ్చి మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లొల్లి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లకి కరెంట్పై ఎంత అవగాహన ఉందో డీకే మాటలను బట్డి అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కాంగెస్ నేతలు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్కు వచ్చి మంచి ముచ్చట చెప్పారని హరీశ్ వ్యాఖ్యానించారు. బోర్ బావుల వద్ద మోటార్లు బిగించిన రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇచ్చామని, తెలంగాణలో మీటర్లు బిగించడం లేదని, అందుకే రూ.35వేల కోట్ల రూపాయల నిధులను ఆపామని ఆమె చెప్పారని వివరించారు. బోరు బావుల వద్ద మీటర్లు బిగించమని కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్కు రూ.35వేల కోట్ల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69లక్షల మంది రైతులే ముఖ్యమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. కర్ణాటకలో ప్రజలు అవస్థలు పడుతున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్కుమార్, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోల్తా పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మనకు కూడా 6 గ్యారంటీలని వస్తున్నారని, వారి మాటలు విని ఆగం కావద్దని హెచ్చరించారు. అక్కడి ప్రభుత్వం అన్ని ధరలు పెంచడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నీతి లేని కాంగ్రెస్ను నమ్మొద్దని హెచ్చరించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
డ్రాపౌట్స్ నివారణకు చర్యలు
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఓటు ప్రజాస్వామ్యానికి బలం
అమలాభట్టలో న్యాయ సచేతన శిబిరం
మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నలుగురు బీజేడీ ఎమ్మెల్యేలకు అనర్హత తాఖీదులు
భక్తులకు పండ్లు వితరణ
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement