bjp
-
తీవ్ర ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డి కార్యాలయంపై దాడి
సాక్షి, హుజురాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా హుజురాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్లోని కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆదాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.అసలు గొడవ ఎందుకు..?కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించాయి. -
కరీంనగర్లోని BRS క్యాంప్ కార్యాలయంపై BJP దాడి
-
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడి
-
భగ్గుమన్న బీజేపీ.. పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం!
సాక్షి, కరీంనగర్: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్యాంప్ కార్యాలయం, వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి.బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించింది. దాడిలో కౌశిక్ క్యాంప్ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడితో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కౌశిక్ ఏమన్నారంటే.. కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. గంగుల ఆఫీస్పైనా..మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. -
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
బెంగాల్ లో మళ్లీ హింస.. సువేందు అధికారి పీఏ హత్య
-
బెంగాల్ ట్విస్ట్: దీదీకి సరికొత్త టెన్షన్!
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరో మలుపు తిరిగింది. బీజేపీ రిగ్గింగ్కు పాల్పడి నెగ్గిందంటూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ హత్యకు గురి కావడంతో రాజకీయ దుమారం రేగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రద్దుమమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం!9న పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం దర్యాప్తు ముమ్మరంసువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంఘటనాస్థలి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకిమధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులుకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్ పక్షపాతం లేకుండా విచారణ జరగాలన్న తృణమూల్అందుకే నా పీఏను చంపారు: సువేందునా పీఏ చంద్రనాథ్ రాథ్ హత్యకు కారణాలు ఉన్నాయిఆయన నా కార్యనిర్వాహక సహాయకుడిగా ఉండటమే హత్యకు కారణంభవానీపూర్లో మమతా బెనర్జీని నేను ఓడించడమూ ఓ కారణంనా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తిస్తాను: సువేందుమమతకు కొత్త తలనొప్పి!ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ దీదీ ప్రకటనతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నేటితో బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తిఆటోమేటిక్గా రద్దు కానున్న టీఎంసీ సర్కార్ఈలోపు.. మరో ట్విస్ట్!టీఎంసీ భేటీకి డుమ్మా కొట్టిన 10 మంది కొత్త ఎమ్మెల్యేలుపార్టీలో జోష్ నింపేందుకు భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ80 మందికిగానూ 70 మందే హాజరుచీలిక ఏర్పడిందా అనుమానాలుపార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారంఆ ఊహాగానాలను తోసిపుచ్చిన టీఎంసీ గైర్హాజరుపై ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడితాజా పరిణామాలపై బీజేపీ సైలెన్స్ ఆ పిస్టోల్ అక్రమంగా వచ్చిందే!బెంగాల్లో సంచలనంగా సువేందు అధికారి పీఏ హత్య కేసుసువేందు పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యబుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో కాల్పులు జరిపిన దుండగులుఅక్కడికక్కడే కారులో కుప్పకూలిన చంద్రనాథ్చంద్రనాథ్ రథ్ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా వచ్చిందే!హత్యకు ఆస్ట్రియా మేడ్ తుపాకీ వాడిన దుండగలుతుపాకీని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తింపునిందితులను ట్రేస్ చేసే పనిలో కోల్కతా పోలీసులుమమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలుఈ నెల 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంసీఎం ఎంపిక.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై దృష్టి పెట్టిన బీజేపీటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలుమే 4వ తేదీన వెలువడ్డ బెంగాల్ ఫలితాలుఫలితాల్లో బీజేపీ ఘన విజయంసీఎం పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయని మమతా బెనర్జీదేశ రాజకీయాల్లో.. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేయలేదు!సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చేసిన దీదీఏం చేసుకుంటారో చేస్కోమంటూ తాజాగా మరోసారి సవాల్కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి అంటూ వ్యాఖ్యసీఎంగా ఎవరైనా ప్రమాణం చేస్తే.. ఆ రోజును బ్లాక్డేగా పాటిస్తామని ప్రకటనమరోవైపు.. ఇప్పటికే ముగిసిన బెంగాల్ అసెంబ్లీ గడువురాజ్యాంగం ప్రకారం.. రద్దైన మమతా బెనర్జీ సర్కార్అయినా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానంటున్న మమతా బెనర్జీఎవరీ చంద్రనాథ్?చంద్రనాథ్ రథ్.. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయ సహాయకుడుచంద్రనాథ్ వయసు 41 ఏళ్లు.. స్వస్థలం మేదినిపూర్ జిల్లా చందిపూర్ రహారా రామకృష్ణ మిషన్లో చదివిన చంద్రనాథ్ దాదాపు రెండు దశాబ్దాలు భారత వాయుసేనలో సేవలుఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన.. ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ కొంతకాలం రామకృష్ణ మిషన్లో సేవలందించిన చంద్రనాథ్ ఆపై కార్పొరేట్ రంగంలో పనిచేసి.. అక్కడ నుంచి పొలిటికల్ కన్సల్టెన్సీలో విధులు తృణమూల్ కాంగ్రెస్తో చంద్రనాథ్ కుటుంబానికి అవినాభావ సంబంధంసువేందు అధికారి బీజేపీలో చేరాక.. ఆయన వెంటే చంద్రనాథ్సువేందు కోసం బీజేపీ తరఫున కీలకంగా పని చేసిన చంద్రనాథ్అధికారి సువేందు ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, లాజిస్టిక్స్ వంటి సున్నితమైన పనులను హ్యాండిల్ చేసిన చంద్రనాథ్తాజా విజయంతో.. బీజేపీ చంద్రనాథ్కు కీలక బాధ్యతలు అప్పజెప్తుందనే ఊహాగానాలు ఈలోపే.. చంద్రనాథ్ దారుణ హత్యబెంగాల్ను కుదిపేస్తున్న హత్యారాజకీయాలు ఉత్తర 24 పరగణాలో దారుణ హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందు పీఏ చంద్రనాథ్తన నివాసానికి వెళ్తున్న టైంలో బైక్ మీద వచ్చి కాల్చి చంపిన దుండగులుఅక్కడికక్కడే మృతి చెందిన చంద్రనాథ్.. డ్రైవర్ పరిస్థితి విషమంటీఎంసీపై బీజేపీ ఆరోపణలు.. ఆరోపణలను ఖండించిన టీఎంసీఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసహింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మృతిఈసీ సీరియస్బెంగాల్లో హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. వరుసగా దాడులు, హత్యలుఇప్పటికే పలువురు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులుహత్యకు గురైన పలువురు!బెంగాల్ పోలీస్ శాఖపై ఈసీ ఆగ్రహంశాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని ఆదేశంఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశం #WATCH | North 24 Parganas | On Suvendu Adhikari's PA Chandra shot dead in Madhyamgram, BJP leader Sajal Ghosh says, "He had no enemies and was a cheerful boy. This was destined for him just because he worked for Suvendu... This is Bengal... 5 bullets were shot... I have been… pic.twitter.com/X6rFpnDzyZ— ANI (@ANI) May 6, 2026టీఎంసీ స్పందన ఇదే.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదుచంద్రనాథ్ హత్యను ఖండిస్తున్నాంఆ హత్యతో మాకు సంబంధం లేదుదోషులెవరైనా కఠినంగా శిక్షించాలికోడ్ అమల్లో ఉండగా హింస దురదృష్టకరంచంద్రనాథ్ హత్యపై సీబీఐ విచారణ జరగాలి పీఏ హత్యపై సువేందు రియాక్షన్మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సంచలన ఆరోపణలుఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారి సువేందుపక్కా ప్లాన్తోనే నా పీఏను మత్య చేశారుహత్య వెనుక మమతా మేనల్లుడి ప్రమేయం ఉంది సువేందు పీఏ దారుణ హత్యబీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పీఏ దారుణ హత్యచంద్రనాథ్ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులుమధ్యమ్గ్రామ్లో హత్య చేసిన దుండగులుకారులో వెళ్తుండగా కాల్చివేతనాలుగు రౌండ్ల కాల్పులుఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లి కారులోనే కుప్పకూలిన చంద్రనాథ్కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలూ.. పరిస్థితి విషమంSTORY | Bengal BJP leader Suvendu Adhikari's personal assistant shot deadBJP leader Suvendu Adhikari's personal assistant was shot dead by unidentified assailants in West Bengal's North 24 Parganas district, party sources said. The incident took place at Doharia in Madhyamgram… pic.twitter.com/oMET6SQm8w— Press Trust of India (@PTI_News) May 6, 2026 -
బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి పీఎం మోదీ
-
హైదరాబాద్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్కు తిరిగి వెళ్తారు.ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. -
పంజాబ్లో జంట పేలుళ్లు : 2027 ఎన్నికలకు బీజేపీ ప్లాన్ అంటున్న సీఎం
పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లలో రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్ల ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్లకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సంబంధం ఉందని, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ పన్నుతున్న పన్నాగాల్లో భాగమే ఇవని ఆయన ఆరోపించారు. ప్రజల్లో హింసను, భయాన్ని వ్యాపింపజేసి బీజేపీ ఓట్లు దండుకుంటుంది. కానీ పంజాబ్ ప్రజలు ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటారు, కనుక బీజేపీ ఇలాంటి చర్యల్ని మానుకోవాలని సీఎం హితవు పలికారు. బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే, అక్కడికి వెళ్లి గొడవలు సృష్టించడం పరిపాటి అని మాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ఈ పేలుళ్లను 2027 ఎన్నికలతో ముడిపెట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. నిష్పక్షపాత విచారణ జరగకముందే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు విమర్శించారు. జంట పేలుళ్ల కలకలంమంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బిఎస్ఎఫ్ (BSF) పంజాబ్ ఫ్రాంటియర్స్ ప్రధాన కార్యాలయం వెలుపల పార్క్ చేసిన స్కూటర్లో పేలుడు సంభవించింది. మరో ఘటనలో రాత్రి 10.50 గంటల ప్రాంతంలో అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ ఏరియా సమీపంలో మరో పేలుడు జరిగింది.ఈ పేలుడు ప్రభావం దాదాపు 300 మీటర్ల దూరం వరకు వ్యాపించింది.జలంధర్ బిఎస్ఎఫ్ కార్యాలయం వెలుపల జరిగిన పేలుడుకు ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (KLA) బాధ్యత వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గురుదాస్పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పేలుళ్ల తీవ్రతను, దాని వెనుకున్న కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. -
ఎమ్మెల్యేగా గెలిచిన పని మనిషి
-
టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. మరోవైపు అధికార TMC మాత్రం కేవలం 80 స్థానాలతో సరిపోట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ముఖ్యంగా మమతా బెనర్జీకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్న మహిళానేతలపై ఆయన అనూహ్య విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మరో ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్, సయోని ఘోష్ లాంటి నాయకులు BJPలో చేరినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ జాబితాలో కునాల్ ఘోష్ను కూడా చేర్చారు. మరొక పోస్ట్లో ఆయన ఇలా అన్నారు. "TMC నాయకులారా, మేము ఎన్నికల్లో గెలిచామని మీరు ప్రకటించుకోండి, హరి ఓం." అంటూ వారిని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?కాగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు తరువాత మమత తాను సీఎం పదవికిరాజీనామా చేయనని ప్రకటించారు. అలాగే ఎన్నికల అనంతరం బెంగాల్లో హింసాకాండ చెలరేగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని TMC కార్యాలయాల వద్ద విధ్వంసానికి సంబంధించిన అనేక ఘటనలు హింసకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో హింసను ప్రేరేపించే, విధ్వంసానికి పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బుధవారం తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు కోల్కతాలోని 'న్యూ మార్కెట్' వద్ద బుల్డోజర్లు అంటూ TMC రాజ్యసభ సభ్యురాలు సుష్మిత దేవ్ ఒక వీడియోను పంచుకున్నారు. మాంసం దుకాణాలను, చివరకు పార్టీ కార్యాలయాలను కూడా అవికూల్చివేస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు -
‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చరిత్రాత్మక విజయంతో ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన తదుపరి లక్ష్యాన్ని ఖరారు చేసేసింది. బెంగాల్లో గెలుపు సంబరాలు ముగియక ముందే, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలిత రాష్ట్రమైన పంజాబ్ పై గురిపెట్టింది. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావాన్ని పూరించింది.సంచలనంగా మారిన ‘నెక్స్ట్ పంజాబ్’పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అఖండ విజయం సాధించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తన తదుపరి కార్యాచరణను ప్రపంచానికి ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ వేదికగా బీజేపీ పంజాబ్ శాఖ ‘నెక్స్ట్ పంజాబ్’ (తదుపరి పంజాబ్) అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్కు కమల పుష్పం ఎమోజీని కూడా జతచేసింది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ పోస్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది.గత వ్యూహమే మళ్లీ అమలు..ఈ తరహా సంచలన ప్రకటన బీజేపీకి కొత్తేమీ కాదు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించిన తర్వాత, నవంబర్ 14, 2025న బీజేపీ బెంగాల్ శాఖ కూడా అచ్చం ఇలాగే ట్వీట్ చేసింది. ఆనాడు ‘నెక్స్ట్ వెస్ట్ బెంగాల్’ అంటూ కమలం గుర్తుతో పోస్ట్ చేసి, అనంతరం బెంగాల్ ను కైవసం చేసుకుంది. అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ, వ్యూహాత్మకంగా ఇప్పుడు పంజాబ్ వైపు అడుగులు వేస్తోంది.యూపీ, పంజాబ్లపై బీజేపీ పూర్తి ఫోకస్ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ, అదే జోరును భవిష్యత్తులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన అద్భుత విజయంతో ఉత్సాహంలో ఉన్న కమలనాథులు, వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే తమ పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ఈ రాష్ట్రాల్లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.అధికార ఆప్కు కోలుకోలేని భారీ దెబ్బపంజాబ్లో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఏడాది ఏప్రిల్ లో ఊహించని భారీ షాక్ తగిలింది. ఆప్కు చెందిన ఏడుగురు కీలక రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఏడుగురిలో రాఘవ్ చద్దా సహా ఆరుగురు ఎంపీలు పంజాబ్ నుంచే ఎన్నికైన వారు కావడం గమనార్హం. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా, ఆప్కు కోలుకోలేని రాజకీయ దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.పంజాబ్లో రసవత్తర పోరు ఖాయంఆప్ రాజ్యసభ సభ్యుల వలసతో పంజాబ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో బలోపేతం కావాలని, ఆప్ చేతిలో నుంచి అధికారాన్ని లాక్కోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎంపీల చేరికతో పంజాబ్లో బీజేపీకి అమాంతం బలం పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల సమరం ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.అప్రకటితంగా మొదలైన ఎన్నికల ప్రచారంసోషల్ మీడియాలో వచ్చిన తాజా పోస్ట్ చూస్తుంటే, పంజాబ్లో బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే సాధించిన రాజకీయ ఆకర్షణలను క్షేత్రస్థాయిలో ఓట్లుగా మలచుకునే వ్యూహాలకు ఆ పార్టీ పదును పెడుతోంది. పశ్చిమ బెంగాల్ భారీ విజయం ఇచ్చిన అమితమైన ఆత్మవిశ్వాసంతో, పంజాబ్లో జరగబోయే ఈ అత్యంత కీలకమైన పోరు కోసం కాషాయ దళం సర్వసన్నద్ధంగా బరిలోకి దిగుతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ కోటను కూల్చివేసిన బీజేపీ.. ఇప్పుడు అతని పంజాబ్ కోటను పెకిలించివేయడానికి సిద్ధం అవుతోంది. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా? -
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
రాజీనామా ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
కోల్కతా: పదిహేనేళ్ల తృణమూల్ పరిపాలనా కోటలను ప్రజాతీర్పుతో బద్దలుకొట్టామని బీజేపీ ప్రకటించుకుంటుంటే పూర్తిగా కుట్రతోనే తమను కూలదోశారని టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ నిప్పులుచెరిగారు. పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం తర్వాత మమత తొలిసారిగా మంగళవారం కోల్కతాలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో మేం బీజేపీతో పోరాడలేదు. కాషాయపార్టీ కోసం కష్టపడిన ఎలక్షన్ కమిషన్తో మేం పోరాడాం. ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.అసలు నేను రాజీనామా ఎందుకు చేయాలి? మా ఓట్లను చోరీచేశారు. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయి. దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును అడ్డుకున్నారు. మా పార్టీ నైతికతను దెబ్బతీసేలా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నత్తనడకన కొనసాగించారు. బెంగాల్లో జరిగిన లోపభూయిష్ట ఎన్నికలను నా రాజకీయజీవితంలో ఎన్నడూ చూడలేదు. గత 22 ఏళ్లలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎన్నికలసంఘమే అసలైన విలన్. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఈసీ కలసికట్టుగా ఖూనీ చేశాయి. అక్రమంగా మమ్మల్ని ఓడించే ప్రయత్నంచేశారు. ఎన్నికల సంఘం ద్వారా మమ్మల్ని ఓడించారేమోగానీ వాస్తవానికి నైతిక విజయం మాదే. వీధి పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే. బీజేపీ అరాచకాలను ఎండగడతా’’అని మమత అన్నారు. అంతటా దాడులు, బదిలీలు, పక్షపాతమే ‘‘ఎన్నికల ప్రక్రియ మొదలుకావడానికి ముందు నుంచే బెంగాల్ అంతటా కీలకమైన సమర్థులైన ఉన్నతాధికారులపై ఉద్దేశపూర్వకంగా ఈసీ బదిలీ వేటు వేసింది. వందలమందిని అప్రాధాన్య స్థానాలకు తరమేసింది. మా పార్టీ, మా పార్టీతో సంబంధమున్న సంస్థలపై ఈడీ అధికారులను దాడులతో ఉసిగొల్పింది. పక్షపాతధోరణితో రాజ్యాంగబద్ధ సంస్థల నిబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. మాపై దాడులతో నిర్ఘాంతపోయి విపక్షాల ఇండియాకూటమి నేతలు మాకు ఫోన్లు చేసి సంఘీభావం తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్గాం«దీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సోరెన్ తదితర అగ్రనేతల నుంచి ఫోన్కాల్స్ వచ్చాయి. ఇకపై విపక్షాల ఇండియా కూటమి బలోపేతం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తా’’అని మమత ప్రకటించారు. తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా ‘‘నేను ఒంటరిదాన్ని కాదు. నాకు తోడుగా పార్టీ అండగా ఉంది. తదుపరి కార్యాచరణను త్వరలో వెల్లడిస్తాం. సమష్టిగా నిర్ణయించి ముందుకెళ్తాం. ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) బిల్లు అతిపెద్ద కుట్ర. ఎస్ఐఆర్తో ఏకంగా 90 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత పోరాటంచేసి 32 లక్షల ఓట్లు కలిపేలా చేశాం. తర్వాత కూడా 7 లక్షల ఓట్లను కలిపారు. కానీ ఇది ఎవరికీ తెలీదు. ఫలితాల వెల్లడి తర్వాత టీఎంసీ నేతలపై దాడులు జరిగాయి. 10 మంది సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేస్తా. హింసాత్మక ప్రాంతాలను పర్యటిస్తా’’అని అన్నారు. నన్నూ గెంటేశారు ‘‘ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్రబలగాలు గూండాల్లా వ్యవహరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన నన్ను కూడా నెట్టేశారు. పొట్టపై, వీపుపై నెడుతూ గెంటేశారు. మహిళగా నాతో వాళ్ల అనుచిత ప్రవర్తనతో ఎంతగానో బాధపడ్డా. ఎన్నిసార్లు అభ్యర్థించినా టీఎంసీ ఏజెంట్లను సీఆర్పీఎఫ్ జవాన్లు లోపలికి అనుమతించలేదు. ఫిర్యాదు తీసుకోవాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా? జవాన్లంతా అమ్ముడుపోయారు’’అని మమత ఆరోపించారు. ‘‘పులిలా పోరాడతాం. పోరాటాన్నికొనసాగించి మళ్లీ నూతనోత్తేజంతో పైకిలేస్తాం. అధికార కుర్చిల గురించి మాకు పట్టింపులేదు. మాకు ప్రజలే ముఖ్యం. మా, మాటీ, మనుష్ కు మా వందనాలు. ప్రజాస్వామ్యద్రోహుల కారణంగా మాకు ఓటేయలేకపోయిన వారందరికీ నా క్షమాపణలు’’అని మమత అన్నారు. బెంగాల్కు అమిత్ షా.. అస్సాంకు నడ్డా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతల ఎంపిక ప్రక్రియను పార్టీ అధిష్టానం వేగవంతం చేసింది. ఈ ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర పరిశీలకులను నియమిస్తూ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే బాధ్యతను హోం మంత్రి అమిత్ షాకు అప్పగించారు. ఆయనతో పాటు సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించారు. అదేవిధంగా, అస్సాం శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను పరిశీలకుడిగా అధిష్టానం ఖరారు చేసింది. -
దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!
-
సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
కోల్కతా: బెంగాల్లో నైతిక విజయం తమదేనని అంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్భవన్కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా. ఈసీ బీజేపీ ఏజెంట్గా పనిచేసింది. ఎన్నికలకు రెండురోజుల ముందే టీఎంసీ నేతల్ని అరెస్ట్ చేశారు. బెంగాల్లో మాది ఓటమి కాదు. బీజేపీ చోరీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మా పాలిట విలన్. మేం విలన్లపై పోరాటం చేశాం. కౌంటింగ్ సెంటర్లలో మా ఏజెంట్లను అనుమతించలేదు. SIR ప్రక్రియలో మోదీ, అమిత్ షా తలదూర్చారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడుతాం. సీఆర్పీఎఫ్ బలగాలు మా పాలిట గూండాల్లా మారాయి. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం అలవాటే. మాకు ఇండియా బ్లాక్ మద్దతు ఉంది’ అని స్పష్టం చేశారు. కాగా, నిన్న(సోమవారం) వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200పైగా సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ ప్రభంజనంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది. -
ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్ దిండా.దిండా పూర్వ మిడ్నాపూర్ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ (మనోజ్ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో 78 మ్యాచ్లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. -
భారత రాజకీయాల్లోనే పెను సంచలనం!
పశ్చిమ బెంగాల్.. దశాబ్దాల పాటు వామపక్షాలకు అండగా నిలిచింది. ఆ తర్వాత 'దీదీ' మమతా బెనర్జీని అక్కున చేర్చుకుంది. కానీ, నిన్నటి సోమవారం వెలువడిన ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్రను లిఖించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ, అసాధ్యమనుకున్న బెంగాల్ కోటను బద్ధలు కొట్టింది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని తనదైన శైలిలో మార్చాలనుకుంటున్న బీజేపీకి దక్కిన అతిపెద్ద విజయం.పదేళ్ల క్రితం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ, నేడు 294 స్థానాలకు గాను 208 సీట్లు గెలుచుకోవడం ఒక అద్భుతం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన కుప్పకూలిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ కోల్పోయి దెబ్బతిన్న బీజేపీకి, ఈ విజయం సంజీవనిలా మారింది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి, బెంగాల్ విజయం కిరీటంలో మణి లాంటిది.ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు. ఎన్నికల కంటే ముందే దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం పెను దుమారం రేపింది. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్లను లూటీ చేసింది.. ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని 100కు పైగా సీట్లలో మోసానికి పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా.. మమత ఓటమి ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి గురించి గట్టిగా మాట్లాడే ఒక బలమైన గొంతుక ఇప్పుడు మూగబోయింది. చివరకు తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో కూడా మమత ఓడిపోవడం శోచనీయం. తన పాత మిత్రుడు, ప్రస్తుతం బీజేపీ నేత అయిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఆయనే ఇప్పుడు బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అవినీతి. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు, ఇతర కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని నింపాయి. రెండోది భద్రత. గతేడాది కోల్కతా ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ రేప్, హత్య ఉదంతం దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఆ బాధితురాలి తల్లిని అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా తనవైపు తిప్పుకుంది. దీదీ మంచిదే కానీ, ఆమె పార్టీ అవినీతిమయం.. పరిశ్రమలను తరిమేశారు అన్న సామాన్యుడి మాటలే బెంగాల్లో ప్రతిధ్వనించాయి. సెక్యులరిజం వర్సెస్ హిందూత్వ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా, లౌకికవాదానికి, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న బెంగాల్, ఇప్పుడు హిందూత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. మమత బెంగాలీ సంస్కృతిని రక్షించాలని పిలుపునిచ్చినా, ప్రజలు మాత్రం ఉద్యోగాలు మరియు అభివృద్ధికే ఓటు వేశారు.దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడూ ఒక ఉద్వేగభరితమైన ప్రయోగశాలే. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత శూన్యంగా మారిన ఆ గడ్డపై, ఇప్పుడు 'దళపతి' విజయ్ ఒక ఆశగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఒక రాజకీయ నూతన విదేశీయుడిగా అడుగుపెట్టి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల పునాదులను కదిలించడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ విజయం వెనుక విజయ్ పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. గ్లామర్, అధికారం మధ్య ఆయన నలిగిపోలేదు. అటు ప్రజల ఆకాంక్షలకు, ఇటు తన వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న సన్నని గీతపై నడుస్తూ ఈ ఘనత సాధించారు. సొంత కుటుంబం తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మానసికంగా ఎంతో కుంగదీశాయి. కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తి, పేరు ప్రఖ్యాతుల గొడవలు బహిరంగమైనప్పుడు, శత్రువులు ఆయనను విమర్శించడానికి అస్త్రాలుగా వాడుకున్నారు. కానీ, తన ఇంట్లో రగులుతున్న ఆ వేదనను దిగమింగుకుని, బయట ప్రజల కోసం నిలబడ్డ విజయ్ తీరు చూసి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. ఆయన గెలుపు వెనుక కేవలం స్టార్డమ్ మాత్రమే లేదు, ఒంటరిగా నిలబడి పోరాడిన ఒక వ్యక్తి తాలూకు నిశ్శబ్ద ఆవేదన కూడా ఉంది.ఇక చివరగా, కేరళం,అక్కడ రాజకీయాల గురించి చెప్పాలంటే అది ఎప్పుడూ ఎల్.డి.ఎఫ్, యు.డి.ఎఫ్ మధ్య సాగే హోరాహోరీ పోరాటం. కానీ, ఈసారి దేవుడి సొంత గడ్డపై కమలం పువ్వు వికసించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉన్న కేరళలో, బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం అంటే అది ఒక భావజాల విప్లవమే అని చెప్పాలి. క్రైస్తవ మైనారిటీలతో చేతులు కలుపుతూ, మోదీ గ్యారంటీ ని కేరళంలో ఇంటింటికి తీసుకెళ్లడంలో ఆ పార్టీ సఫలమైంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన భారీ విజయంతో పోలిస్తే కేరళలో వచ్చిన ఓట్ల శాతం అతి తక్కువే కావొచ్చు, కానీ కేరళ ఓటరు మదిలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ముద్ర వేయడం మాత్రం ఆ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. అజేయమైన కోటలుగా భావించిన నియోజకవర్గాల్లో కూడా బిజెపి ఓట్ల శాతం పెరగడం చూస్తుంటే, కేరళలో మార్పు మొదలైందని స్పష్టమవుతోంది.మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక నూతన శకాన్ని ఆవిష్కరించాయి. అజేయమని భావించిన మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడం, అస్సాం నుంచి కేరళ దాకా బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు.. అది దేశంలో మారుతున్న సామాన్యుడి ఆకాంక్షలకు నిదర్శనం. ప్రాంతీయ భావోద్వేగాలు, సంస్కృతి పేరుతో చేసే రాజకీయాల కంటే అభివృద్ధి, భద్రత, అవినీతి రహిత పాలనే ముఖ్యమని ఓటరు తీర్పునిచ్చాడు. అటు తమిళనాడులో విజయ్ వంటి కొత్త తరం నాయకుల రాక, ఇటు బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలు.. వెరసి 2026 నాటి ఈ రాజకీయ చిత్రం దేశ భవిష్యత్తును సరికొత్త తీరాలకు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. పాత వ్యవస్థలు పోయి, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసం పెరిగేలా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ పక్షాలు ఎలా గౌరవిస్తాయో వేచి చూడాలి. -
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ, రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతను మేళవిస్తూ.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ సమాచారం.మోదీ చెప్పినట్లే..మే 9న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్పూర్లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్లో నిర్మిస్తామని అన్నారు.అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభంబెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు (మే 5) ఢిల్లీ నుంచి కోల్కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆమెను కోరనున్నారు.బెంగాలీల మనోభావాలకు పెద్దపీటమే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. బెంగాలీలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ‘పొచిషే బోయిశాఖ్’ (రవీంద్ర జయంతి) రోజున ప్రమాణస్వీకారం చేయడం ద్వారా స్థానికుల మనోభావాలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఠాగూర్ జయంతి బెంగాల్లో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో భాగం. నాలుగున్నర దశాబ్దాల వామపక్ష, టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ రాబోతున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది. -
చరిత్ర సృష్టించకపోగా.. నవ్వుల పాలయ్యారు!
ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!.. పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు. పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన. కట్ చేస్తే.. పూన్జార్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు. 2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!. -
బెంగాల్లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్
పశ్చిమ బెంగాల్లో ఒక సాధారణ మహిళ అనూహ్య విజయం సాధించారు. దీదీ సర్కార్కు ఝలక్ ఇచ్చి బీజేపీ సాధించిన ప్రభంజనంలో గుస్కారాకు చెందిన గృహ కార్మికురాలు కలితా మాఝీ(37) విజయం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. గతంలో గృహ కార్మికురాలిగా పనిచేసిన కలితా మాఝీ, ఆస్గ్రామ్ నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించడం విశేషంగా నిలుస్తోంది.కలితా మాఝీ వంటి సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ ప్రజలకు చేరువయ్యింది. పార్టీ లోతైన సంస్థాగత నిర్మాణం, ఓటర్లను ఆకట్టుకోవడం దీదీ ఇలాకాలో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇంటి పనిమనిషిగా నెలకు రూ.2,500 సంపాదించే కలితా మాఝీ బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా అవతరించారు. తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు వచ్చాయి. ఇది సిండ్రెల్లా స్టోరీ కాదు ఇది కలితా 'హిస్టరీ. పనిమనిషి నుంచి శాసనసభ వరకు ఎదిగిన ఆమె తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తి.ఇదీ చదవండి: బెంగాల్ పోరులో ఒక సెన్సేషన్ కలితా మాఝీకాగా రాష్ట్రంలో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. -
BIG QUESTION: బెంగాలీ గడ్డపై కాషాయ జెండా పెద్దోళ్ళకు షాకిచ్చిన విజయ్
-
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ
గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్జోర్ దళ్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. మహిళా మంత్రి అజంతా నియోగ్ మొదలు పిజూశ్ హజారికా, రనోజ్ పెగూ దాకా హిమంత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి ప్రద్యూత్ బోర్డోలాయ్ సైతం దిస్పూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్ఠాకూర్ గోస్వామి కంటే ప్రద్యూత్ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జొర్హాట్ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో గొగోయ్ ఓడిపోయారు. జాగిరోడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్ హజారికా సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బుబుల్ దాస్పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్ అధ్యక్షుడు అతుల్ బోరా సోమవారం బోకాఖాట్లో రాయ్ జోర్ దళ్ అభ్యర్థి హరిప్రసాద్ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్ అభ్యర్థి రీజౌల్ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) నేత మొహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. సంబరాల్లో మునిగిన శ్రేణులు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్పేయీభవన్) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్మాతాకీ జై అని నినదించారు. పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్ బోరా ఏడుస్తూ చెప్పారు. -
బెంగాల్లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
బెంగాల్ టైగర్ బీజేపీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ‘పరివర్తన్’కే ప్రజ లు ఓటేశారు. మార్పునకు పట్టంగట్టారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. నిజమైన అభివృద్ధి జరగాలంటే ‘డబుల్ ఇంజన్’ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపును గౌరవించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే విజయం కట్టబెట్టారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చా రు. అంగ, కళింగ రాజ్యాలను ఇప్పటికే కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకుంది. తూర్పు భారతదేశంలోని వంగ రా జ్యాన్ని సైతం జయించింది. మొట్టమొదటిసారిగా బెంగాల్లో జయకేతనం ఎగురవేసింది. దీదీ కోట ను బద్దలుకొట్టి బెంగాల్ టైగర్గా అవతరించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 293 స్థానాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఏకంగా 206 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీఎంసీకి కోలుకోలేని నష్టం ప్రాంతాలు, జనాభా స్థితిగతులకు అతీతంగా అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటల్లోకి సైతం బీజేపీ చొచ్చుకెళ్లింది. ప్రభుత్వ పాలన మాత్రమే కాకుండా బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో నిర్మాణాత్మక మార్పును ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ స్థానం మాత్రమే మారింది, ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. 2021లో ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడిపోగా, ప్రస్తుతం భవానీపూర్లో చేదు అనుభవం చవిచూశారు. తృణమూల్ కాంగ్రెస్కు కోలుకోలేని నష్టం జరిగింది. ఆ పార్టీ 81 స్థానాలకే పరిమితమైంది. 100కుపైగాసీట్లను లూటీ చేశారంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. సీపీఎం 1, ఇతరులు మరో మూడు సీట్లు గెల్చుకున్నారు. ఒక నియోజకవర్గంలో ఈనెల 21న రీపోలింగ్ జరుగనుంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ బెంగాల్ చరిత్రలో 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలించబోతోంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావడం గమనార్హం. బెంగాల్లో తమ పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రజా తీర్పును ప్రశంసించారు. రాష్ట్రంలో కమలం వికసించిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ కృషి చేస్తుందని ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి మోదీయే కేంద్రబిందువుగా నిలిచారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బూత్స్థాయి నెట్వర్క్, అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాలను సమన్వయం చేస్తూ ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరించారు. బీజేపీ ఆధిక్యం ఉత్తర బెంగాల్ నుంచి జంగల్మహల్, దక్షిణ బెంగాల్ వరకు, సరిహద్దు జిల్లాల నుంచి పారిశ్రామిక ప్రాంతాల వరకూ విస్తరించింది.రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టించింది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. 2021 నాటి ఎన్నికల్లో 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 45 శాతానికిపైగా ఓట్లు చేజిక్కించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 48 శాతం నుంచి 40.94 శాతానికి పడిపోయింది. బీజేపీకి ఉత్తర బెంగాల్లో గట్టి పట్టుంది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోనూ మంచి ఫలితాలు సాధించింది. రాజధాని కోల్కతా సహా హౌరా, హూగ్లీ జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించింది.బ్రాత్య బసు, మానస్ రంజన్ భూనియా, శశి పంజా, చంద్రిమా భట్టాచార్య సహా 20 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. ఈ తీర్పు బీజేపీకి ఒక కీలక మలుపు. 1990వ దశకం వరకు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న ఆ పార్టీ అధికార పీఠం అధిరోహించే స్థాయికి చేరింది. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఇకపై బీజేపీ పాలనకు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారు. -
అట్టడుగు నుంచి అధికార పీఠానికి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి అధికార స్థానానికి ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకమే. బీజేపీ మాతృసంస్థ అయిన భారతీయ జనసంఘ్ను బెంగాలీ బాబూ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. 1951లో భారతీయ జనసంఘ్ పురుడు పోసుకుంది. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఉనికిలోకి వచ్చింది. 1980వ దశకంలో బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసిరాలేదు. 1982 అసెంబ్లీ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 1.29 లక్షల ఓట్లు వచ్చాయి. సీట్లేవీ రాలేదు. 1984 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీచేసి, 1.01 లక్షల ఓట్లు సాధించింది. 1987లో 57 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగింది. 1.34 లక్షల ఓట్లు దక్కించుకుంది. 1989 లోక్సభ ఎన్నికల్లో 19 సీట్లలో పోటీకి దిగి 5.29 లక్షల ఓట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పరాజయాలు తప్పలేదు. బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న బీజేపీ కోరిక దశాబ్దాలపాటు నెరవేరలేదు. అప్పట్లో వామపక్షాలు అత్యంత బలంగా ఉండడం కాషాయ పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. అయితే, ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ రావడం బీజేపీకి ఊరటనిచ్చింది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ ఏనాడూ నిరాశ చెందలేదు. పట్టుదలతో పోరాడుతూ పైకి ఎదిగింది. ప్రతి ఎన్నికలోనూ పెరిగిన ఓట్ల శాతం 1990వ దశకంలో రామజన్మభూమి ఉద్యమం బెంగాల్లో ఆ పార్టీకి మంచి ఊపునిచ్చింది. 1998లో 14 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ తొలిసారిగా ఒక స్థానాన్ని గెల్చుకుంది. 37.24 వేల ఓట్లు లభించాయి. 1999లో తృణమూల్ కాంగ్రెస్తో జట్టుకట్టి 13 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. 39.28 లక్షల ఓట్లు వచ్చాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో 266 స్థానాల్లో పోటికి దిగింది. సీట్లు రాకున్నా 19.01 లక్షల ఓట్లు సాధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 291 సీట్లలో పోటీచేసి, తొలిసారిగా మూడు స్థానాలు గెల్చుకొని పెను సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి బీజేపీకి ఎదుగుదలకు అడ్డే లేకుండాపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లలో పోటీకి దిగి, 2.89 కోట్ల ఓట్లు సాధించి, 77 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారిగా రెండో అతిపెద్ద పార్టీగా మారింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఐదేళ్లలోనే ఏకంగా అధికార పీఠం దక్కించుకుంది. -
బెంగాల్లో సువర్ణాధ్యాయం మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత సువర్ణాధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హింస, భయం, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికి బెంగాల్ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన చరిత్రాత్మక విజయాలను ఆయన అపూర్వం, అద్వితీయంగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన మార్గదర్శనం సత్తా చాటిందని మోదీ ప్రశంసించారు. ప్రజలే దేవుళ్లు.. బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలకు సైతం కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’కి భారత్ ఎందుకు మాతృభూమిగా ఉందో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచానికి చాటిచెప్పాయన్నారు. గతేడాది బిహార్ ఎన్నికల సమయంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ఎన్డీఏ ప్రభంజనం విస్తరిస్తుందని తాను చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని చెప్పారు. గంగామాతతోపాటు బ్రహ్మపుత్ర, కామాఖ్యా మాతల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందన్నారు. అందుకే అస్సాం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యమైందన్నారు. పుదుచ్చేరిలో గత ఐదేళ్లలో ఎన్డీఏ అమలు చేసిన విజన్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇ చ్చారన్నారు. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ‘నాగరిక్ దేవో భవ’(ప్రజలే దేవుళ్లు) అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. శ్యామాప్రసాద్ కల సాకారం పశ్చిమ బెంగాల్ను భారత్లో అంతర్భాగంగా ఉంచేందుకు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ధారపోశారని మోదీ గుర్తుచేశారు. 1951లో ‘దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి’అన్న ఆశయంతో ఆయన ప్రారంభించిన ప్రస్థానం, నేటి చారిత్రక విజయంతో ఆయన కల సాకారమైందన్నారు. బెంగాల్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, నేటి నుంచి భయం నుంచి విముక్తి పొందిందని ‘బాంగ్లాయ్ పోరిబోర్తన్ హోయే గెచే’(బెంగాల్లో మార్పు వచ్చేసింది) అని నినదించారు. వందేమాతరం 150వ వసంతంలో భరతమాతకు, బంకించంద్ర ఛటర్జీకి, అరవిందుడికీ బెంగాల్ ఓటర్లు చారిత్రక నివాళి అర్పించారన్నారు. ఇకపై అభివృద్ధి, విశ్వాసం, కొత్త ఆశలు బెంగాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారుల ఆటకట్టిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్ భారత్’పథకానికి పచ్చజెండా ఊపుతామని స్పష్టం చేశారు. అంగ్, బంగ్, కలింగ్...ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ సైరన్లు మోగుతూ, అస్థిరత, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో, పశ్చిమాసియా సంక్షోభం వెంటాడుతున్నా.. భారత ప్రజలు మాత్రం స్థిరత్వం కోసం ఓటు వేశారని మోదీ విశ్లేషించారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ఏకతాటిపై నిలబడి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో అంగ్ (బిహార్), బంగ్ (బెంగాల్), కలింగ్ (ఒడిశా) రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, వాణిజ్య మూలస్తంభాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఆసియా ఖండం మొత్తం కళింగ ఓడరేవుల ద్వారా వాణిజ్యం సాగేదని, బెంగాల్ సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. బానిసత్వంలో ఆ స్తంభాలు బలహీనపడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఆ మూడు ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎంచుకోవడం ద్వారా వికసిత భారత్కు బాటలు వేస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.మహిళా వ్యతిరేకులకు గుణపాఠంపార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఆ ఆగ్రహాన్ని రుచి చూశాయన్నారు. మహిళా విరోధిగా ముద్రపడిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి సైతం యూపీలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కేరళలో కమ్యూనిస్టుల పదేళ్ల దుష్పరిపాలనను ప్రజలు తిరస్కరించారని, అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కు కూడా మహిళలు తగిన సమాధానం ఇస్తారన్నారు. నేడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం కేవలం రాజకీయ మార్పు కాదని, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన భారీ మార్పు అని మోదీ విశ్లేషించారు. యావత్ ప్రపంచం, దేశం కమ్యూనిజాన్ని, అడవుల్లో అంతరించిపోతున్న మావోయిజాన్ని తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం అదే భావజాలాన్ని అక్కున చేర్చుకుంటూ విపరీత దిశలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలవి కేవలం విభజన రాజకీయాలైతే, తమవి విశ్వాసం నింపే రాజకీయాలని వ్యాఖ్యానించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.మోదీపై చెక్కుచెదరని విశ్వాసం: నితిన్ నబిన్12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నాయకత్వంపై, మోదీ గ్యారంటీపై ప్రజల్లో నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మభూమి అయిన బెంగాల్ను మోదీ బీజేపీ మయం చేశారని కొనియాడారు. విజయోత్సవ సంబరాల అనంతరం మంగళవారం నుంచే బీజేపీ శ్రేణులు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమవుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభంలో మోదీకి పూలమాల వేసి సత్కరించేందుకు నబిన్ ముందుకు రాగా, ఆ మాలను మోదీ ఆప్యాయంగా తిరిగి నబిన్ మెడలోనే వేసి నాయకుల పట్ల తనకున్న గౌరవాన్ని, నిరాడంబరతను చాటుకున్నారు. -
బీజేపీ పంచతంత్రం
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనను కమలం పార్టీ కూలదోసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పొరపాటని రుజువు చేస్తూ ఊహించని విజయం దక్కించుకుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ‘దీదీ’మమతా బెనర్జీ ఆశయం నెరవేరలేదు. ‘మా, మాటీ, మానుష్’నినాదాన్ని ఈసారి బెంగాలీలు విశ్వసించలేదు. 34 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా సాగిన కమ్యూనిస్టుల పరిపాలనను అంతం చేసి 2011లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ 15 ఏళ్ల తర్వాత పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మహిళలు, ముస్లింలు, వలసదార్లు, హిందూ మతస్థులైన మథువా సామాజికవర్గం, బీజేపీ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాని మోదీ ఏకైక ఆకర్షణగా నిలిచారు. ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. పార్టీకి ఆయనే అతిపెద్ద ఆశాకిరణంగా మారారు. గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని పనిచేశారు. పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. విజయంలో ఆయనకు సింహభాగం వాటా దక్కుతుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు స్ట్రీట్ ఫైటర్ అనే ఇమేజ్తో సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, ఈసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగింపునకు గురికావడం, హిందూ ఓటు బ్యాంకు బీజేపీ వెనుక సంఘటితం కావడం, శాంతి భద్రతలు దిగజారడం వంటివి తృణమూల్ను ఓడించాయి. మహిళలుబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లూ మహిళలే వెన్నుముకగా నిలిచారు. ఆ పార్టీ వరుసగా మూడుసార్లు గెలిచిందంటే మహిళల ఆదరణే ప్రధాన కారణం. వారి సంక్షేమం కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది ‘లక్ష్మీ భండార్’. ఈ పథకం కింద పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. చదువుకొనే బాలికలను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కన్యాశ్రీ పథకాన్ని అమలు చేశారు. కానీ, కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటన టీఎంసీ సర్కార్పై మాయని మచ్చగా మిగిలిపోయింది. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెచ్చుమీరాయి. దీంతో ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. పరిస్థితిని గమనించిన బీజేపీ మహిళలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తామని, వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో మహిళా సంక్షేమ పథకాలు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో బలైపోయిన విద్యార్థిని తల్లిని బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు. ఇవన్నీ బీజేపీ పట్ల మహిళల్లో సానుకూలత పెంచాయి. ముస్లింలుబెంగాల్ జనాభాలో ఏకంగా 27 శాతం ఉన్న ముస్లింలు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదార్లు. 30 శాతం నుంచి 90 శాతం దాకా ముస్లిం జనాభా ఉన్న నియోజవకర్గాలు 146 ఉండగా, 2021లో టీఎంకే 131 స్థానాలు గెల్చుకుంది. గత 15 ఏళ్లుగా మెజార్టీ సీట్లు దక్కించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) వంటి ముస్లింలలో భయాన్ని పెంచాయి. బెంగాల్లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ పరిణామాల వల్ల ముస్లింలు ఈసారి కూడా అండగా నిలవడంతో దీదీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెల్చినట్లు స్పష్టమవుతోంది. మైనార్టీల అండ లేకపోయినా హిందువులు తమకు అనుకూలంగా ఓట్లు సంఘటితం కావడం బీజేపీకి కలిసొచ్చింది. వలసదార్లుబెంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక స్థానికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం పరిపాటి. ఈ వలసదార్లు అత్యంత ప్రభావవంతమైన వర్గంగా మారిపోయారు. చాలాస్థానాల్లో ఫలితా లను నిర్దేశించేది వారేనంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండటానికి, చట్టబద్ధమైన నివాసితులుగా గుర్తింపు పొందడానికి ఓటు వేయడం తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీ వలస కార్మికులు, ఇతర వృత్తి నిపుణులు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. స్థానికంగానే ఉద్యోగా లు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ బీజేపీ ఇవ్వ డం వలసదార్లను ఆకర్శించింది. అందుకే వారు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.మథువాలుదళితులైన మథువాలు హిందువులే. వీరు రాష్ట్ర జనాభాలో 17% దాకా ఉంటారు. బీజేపీకి మద్దతుగా నిలిచారు. పొరుగుదేశాల్లో మత హింసకు గురై శరణార్థులుగా వచ్చిన మథువాలకు భారత పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. బెంగాల్లో అట్టడుగున ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి చేరుకోవడానికి కారణం మథువాల మద్దతే. ప్రస్తుత ఎన్నికల్లోనూ వారు బీజేపీని బలపర్చారు. బీజేపీ యంత్రాంగంబెంగాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాపకిందనీరులా చొచ్చుకొచ్చారు. గత రెండేళ్లుగా ఇంటింటి ప్రచారం, ప్రతి ఓటర్ను కలవడం వంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేశారు. బూత్స్థాయిలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు సైతం తరలిరావడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
విప్లవాల నేల మీద వినూత్న తీర్పు
నాలుగు రాష్ట్రాలు (కేరళం, తమిళ నాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన వేసవి ఎన్నికల్లో తమిళ శాసనసభ ఫలితాలు చాలావరకు అనూహ్యంగా వచ్చాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధారణ మెజారిటీకి సమీపంలోకి రావడం నిజంగా రాజకీయ పండితుల అంచనాలకు అందని విషయం. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పదిహేనేళ్లుగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ను కేంద్రంలో పాలకపక్షం బీజేపీ ఓడించి 200కు పైగా సీట్లు సాధించి తొలిసారి అధికారంలోకి రావడం కూడా అత్యధిక ఎన్నికల విశ్లేషకుల లెక్కలకు చిక్కని వాస్తవం. 1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే)లు ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత జీవించి ఉండగా జరిగిన 2016 ఎన్నికల్లో మాత్రం ఈ సాంప్రదాయం మారింది. 2011 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆమె పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఊహించని సంచలనానికి దారితీశాయి. ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం లేని మూడో పెద్ద రాజకీయ పక్షం టీవీకే 107 సీట్లు గెలుచుకుని తమిళ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. పార్టీ నిర్మాణం, తెలివైన రాజకీయ వ్యూహం, రాజకీయ అనుభవం లేకుండానే విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించడం తమిళ ప్రజల కొత్త ఆలోచనా ధోరణికి అద్దం పడు తోంది. జనాకర్షక పథకాలు, ప్రజలు ఉపయోగించే అనేక వస్తువు లను ఉచితంగా ఇవ్వడం, ఇంకా చాలా సౌకర్యాలు, పథకాల పేరిట సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీలు గుప్పించే తమిళ ఎన్నికల్లో ఇలాంటివి ఏవీ లేకుండా టీవీకే విజయం సాధించడం అంత తేలికగా బయటివారికి అర్థంకాని అంశమే.ద్రవిడ సిద్ధాంత పునాది లేకుండా గెలుపెలా?తమిళనాడులో (పాత పేరు మద్రాస్) 1952 ముందు నుంచీ సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికాయి 1967 శాసనసభ ఎన్నికలు. దశాబ్దాలుగా తమిళ నేలలో ప్రజలను ఆకట్టుకుని వేళ్లూ నిన ద్రవిడ సిద్ధాంతం పునాదిగా (బ్రాహ్మణేత వర్గాల సంక్షేమం, తమిళ భాషకు గౌరవం) ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఈ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ప్రాంతీయపక్షంగా రికార్డు నమోదు చేసుకుంది. సీఎం అణ్ణాదురై నాయకత్వంలో ఎం.కరుణానిధి వంటి పలువురు హేమాహేమీలైన నేతల ఉమ్మడి కృషితో నాడు డీఎంకే విజయం కాంగ్రెస్పై సాధ్యమైంది. అలాగే, డీఎంకే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సినీ నటుల జనాకర్షక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ పార్టీ అన్నాడీఎంకే విజయానికి ఆయన ఆకర్షణేగాక, ద్రవిడ సిద్ధాంత బలం ఉన్న డీఎంకేతో ఆయన దశా బ్దాల అనుబంధం కూడా ఉపయోగపడింది. అయితే, విజయ్ పార్టీ టీవీకేకు ఎంజీఆర్ పార్టీకి ఉన్న నేపథ్యం లేదు. యువతలో విపరీ తమైన ‘క్రేజ్’ ఆయనకు ఉందిగానీ ఎంజీఆర్లా విస్తృత రాజకీయ అనుభవం లేదు. సిద్ధాంతాలు అసలు లేకపోలేదు...2024 అక్టోబర్లో విక్రవండిలో జరిగిన టీవీకే తొలి రాజకీయ మహాసభలో ‘‘బీజేపీ మితవాద పోకడల కారణంగా ఇది టీవీకేకు ‘సైద్ధాంతిక ప్రత్యర్ధి’; డీఎంకే అనుసరించే అవినీతి, వారసత్వ రాజకీయాల వల్ల అది మాకు ‘రాజకీయ శత్రువు’ అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ లెక్కన మతతత్వ వ్యతిరేక ధోరణి, లౌకిక విశ్వాసాల కారణంగా బీజేపీని తన రాజకీయ శత్రువుగా ప్రకటించడం టీవీకే మౌలిక సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వడమే అవుతుంది. అందుకే, ఫలితాలు ప్రకటించిన రోజున డీఎంకే నేతృత్వంలోని తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కాంగ్రెస్తో కొత్తగా కూటమి కట్టడానికి విజయ్ పార్టీ సిద్ధమని ప్రకటించింది. పూర్వ పాలకపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే బదులు కేవలం ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్తో దోస్తీ తన పార్టీకి క్షేమమేగాక, సైద్ధాంతిక అనుకూల అంశమని విజయ్ గుర్తించినట్టు కనిపిస్తోంది. అత్యధిక సర్వేలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా టీవీకే గెలుపునకు కారణాలు ఏమిటనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1977లో ఎంజీఆర్ మొదటిసారి సీఎం అయి నప్పటి నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజకీయ పెత్తనం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఈ రెండు పార్టీల వ్యవస్థ తమిళులకు విసుగు పుట్టించినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్న సూపర్స్టార్ రజనీకాంత్, సొంత పార్టీ పెట్టి బోల్తాపడిన మరో స్టార్ హీరో కమల్హాసన్ అనుభవాలు గమ నించిన తమిళ ప్రజానీకం కొత్త తరం హీరో 51 ఏళ్ల విజయ్ పార్టీ టీవీకేను ఈసారి ఆదరించాలని నిర్ణయించుకున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న యువత, దళితులు పార్టీ పెట్టినప్పటి నుంచీ విజయ్కు అనుకూలంగా మారారు. యువతరంలో విజయ్పై ఉన్న మోజు గట్టి పునాదులు లేని ఆయన పార్టీకి ఏకంగా దాదాపు 110 సీట్లు వచ్చేలా చూడటం రాజకీయ విప్లవం కింద పరిగణించాలి. టీవీకే పుట్టినప్పటి నుంచీ దానికి జనంలో పెరిగిన ఆదరణ చూసిన కాంగ్రెస్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు దానితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఒంటరి పోరుకే సిద్ధం కావడంతో ‘దళపతి’తో ఎన్నికల స్నేహానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు కొద్దిలో మెజారిటీ మార్క్ (మొత్తం 234 సీట్లకుగాను 118) దక్కకపోవడం, ‘సెక్యులరిజం’ అనే సిద్ధాంతం టీవీకేతో చేతులు కలిపే అవకాశం కాంగ్రెస్కు లభించింది. తమిళ ఓటర్లు టీవీకేను ఆదరించడం ద్వారా రెండు పాత ద్రవిడ పార్టీలు మాత్రమే పాలక పక్షాలుగా దిక్కయిన పరిస్థితి నుంచి బయట పడ్డారు.విజయ్ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం (తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ పుట్టుకతో క్రిస్టియన్, తల్లి హిందువు) టీవీకేకు అనుకూల లేదా ప్రతికూల అంశం కాలేదు. రాష్టంలో కులం ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తన కులం తమిళ్ అని ప్రకటించుకోవడం తమిళ జనానికి బాగా నచ్చినట్టుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం పుట్టిన విజయ్ పార్టీకి దాని కొత్తదనం, నాయకుడికి రాజకీయ నేపథ్యం లేకపోవడం సానుకూల అంశా లుగా మారాయి. దాదాపు 8 లక్షల మంది అభిమానులతో టీవీకే మొదటి రాజకీయ మహాసభ జరిగిందంటే జనంలో విజయ్పై ఉన్న తీవ్ర అభిమానం, మోజు మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు అర్థం కాలేదని అనుకోవాలి. నేటి తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు ఉన్న పరిమితులను చెబుతున్నాయి. ఏమైనా విజయ్కు తమిళనాడు ‘దళపతి’ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా తమిళ సోదరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి సామాజిక విప్లవాల వరకూ ఆధునిక భారతంలో ముందుండి నడిచిన బెంగాలీలు, తమిళులు ఎట్టకేలకు తమ పాలకపక్షాలను, పాలకులను మార్చేలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు.కమ్యూనిస్టులకు 34, తృణమూల్కు 15 ఏళ్లు అవకాశం!పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అధికారం వస్తుందని ఎక్కువ సర్వేలు సూచించలేదు. 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని బీజేపీ పశ్చిమ బెంగాల్లో మొదటిసారి గద్దెనెక్కే అవకాశం దక్కించుకోవడం కూడా అత్యధిక మీడియా, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని వాస్తవం. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెల్చుకున్న బీజేపీ 2021లో తన బలాన్ని వంగ శాసనసభలో 77 స్థానాలు పెంచుకోవడం కొత్త రికార్డు. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి మెజారిటీ సీట్లు (294 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 అవసరం) వస్తాయని కొందరు ఎన్నికల పండితులు వేసిన అంచనాలు నిజం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన పార్టీని విజయపథంలో నడిపించారు. బెంగాల్ బెబ్బులిగా పొగడ్తలు అందుకున్నారు. గత 15 ఏళ్లుగా అవాంఛనీయ పోకడలనే తృణమూల్ అప్రకటిత పాలనా విధానంగా ఎంచుకోవడం ‘దీదీ’ పతనానికి దారితీసింది. సీపీఎం, సీపీఐ నాయకత్వంలోని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన (లెఫ్ట్ ఫ్రంట్) సర్కారు 34 సంవత్సరాల పాలనలో బెంగాల్ ప్రజల జీవితాలను పాలక కూటమికి విధే యులైన అసాంఘిక శక్తులే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం తెలిసిన విషయమే. ‘పార్టీ సొసైటీ’గా పిలిచే అవాంఛనీయ ధోర ణిని దశాబ్దపున్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అను సరించింది. అంతేగాక, బెంగాల్లో 30 శాతం వరకూ ఉన్న మైనారిటీలకు మమత పెద్ద పీట వేస్తున్నారనీ, మెజారిటీ మతస్తుల బాగోగులు ఆమెకు పట్ట వనే ప్రచారం బూటకం కాదు, నిజమనీ అత్యధిక బెంగాలీలు నమ్మారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని రేప్, హత్య వంటి కొన్ని ఘటనలు మహిళా సీఎం పాలనలో స్త్రీలకు అసలు రక్షణ లేదనే బీజేపీ ప్రచారానికి బలం ఇచ్చాయి. ‘మార్క్సిస్టుల అరాచక పాలనకు స్వస్తి పలికి సుపరిపాలన అందిస్తాన’ని సీఎం పీఠమెక్కిన మమత ఏలుబడిలో పాలన బాగా దిగజారడం, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవడానికి దోహదం చేశాయి. 2000 నవంబర్ నుంచి 2026 మే వరకూ పాతిక సంవ త్సరాలకు పైగా ఇద్దరే ఇద్దరు సీఎంలు మార్క్సిస్టు బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీలను చూసిన బెంగాలీ జనం పలు కారణాల వల్ల కొత్త ముఖం కావాలని కోరుకున్నారు. వారి ఈ ఆకాంక్ష సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని మెజారిటీ ఈ ఎన్నికల్లో సాధించడానికి ఒక ప్రధాన కారణమైంది. నాంచారయ్య మెరుగుమాలవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి
కోల్కతా: భవానీ పూర్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. మమతాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ సందర్భంగా తన ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు. సర్పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏంజెట్లను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. పార్టీ ఏజెంట్లను అనుమతి ఇస్తామని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వచ్చిన తర్వాత డీవో ఇక్కడ లేరు అని వాపోయారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండవ సీఎంగా మమతా బెనర్జీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. -
'ఆ దారుణాన్ని మర్చిపోలేదు.. ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారు..' హీరో నిఖిల్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ దారుణాలను ప్రజలు ఇంకా మరిచిలేదు.. క్షమించనూ లేదన్నారు. అందుకే మమతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి ఇలాంటి గతే పడుతుందన్నారు. ఆర్జీ కర్ వైద్య కళాశాల బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఈ దారుణంపై తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.కాగా.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆమె ప్రభుత్వంలోనే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. The People of West Bengal did not forget or forgive . They Taught a lesson to the Govt which did not care for the Common Person . Justice for RG KAR Medical college Horror . #RGKAR #Kolkata https://t.co/ydOioIZBdH— Nikhil Siddhartha (@actor_Nikhil) May 4, 2026 -
పవర్ పోయింది.. దీదీ పాలనకు చరమగీతం..
-
5 రాష్ట్రాల ఎన్నికలు : మోదీ మ్యాజిక్..ఆ పది కారణాలు!
2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళం తన హవాను చాటుకుంది. రెండు అద్భుతమైన విజయాలు, ఉత్సాహభరితమైన కమ్ బ్యాక్ వెరసి ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 3-5 స్కోర్లైన్ను కైవసం చేసుకోనుంది. లేడీ టైగర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజాముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, మరీ ముఖ్యంగా కేరళలో పినరయి విజయ్న్తోపాటు ఇతర నేతలకు కూడా ఇవొక గుణ పాఠంగా చెప్పవచ్చు. రాజకీయ ఉద్ధండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ఈ ముగ్గురి నేతృత్వంలోని ఓటమి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ ప్రభావం, హవా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా, కనిపించని ‘మమత’ దాదాపు 50 ఏళ్లుగా టీఎంసీ లేదా వామపక్షాలు మాత్రమే పాలించిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. బలమైన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను గద్దె దించి, తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. వామపక్ష రాష్ట్రం బెంగాల్లో, తమ ఉనికిని విస్తరించుకునే లక్ష్యంతో బయలుదేరిన బీజేపీకి పని చాలా కష్టతరమైంది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుని, రాష్ట్రంలో ఒక నామమాత్రపు పార్టీగా మాత్రమే ఉండేది. ఒక దశాబ్ద కాలంలోనే, బీజేపీ భారత చరిత్రలోనే అత్యంత అద్భుతమైన వృద్ధి పథంలో ఒకటిగా నిలిచింది. బెంగాల్లో రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన మమతా బెనర్జీకి గట్టి దెబ్బ కొట్టింది.చారిత్రాత్మక నాలుగోసారి అధికారం చేపట్టాలని కన్న మమత అభేద్యమైన కంచుకోట, బీజేపీ మాయాజాలం ముఖ్యంగా మోదీ మాయాజాలంతో కూలిపోయింది. అలుపెరుగని మోదీ ర్యాలీలు, ప్రచారం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారిస్తూ, మోదీ చొరబాటు ఆరోపణలపై టీఎంసీని లక్ష్యంగా చేసుకున్నారు. తనదైన శైలిలో దీదీ (మమత)ని ఎగతాళి చేశారు. దీనికి తోడు క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆర్.జి. కార్, సందేశ్ఖాలి వంటి ఘటనలు, ఓటర్లలో నిరాశ, టీఎంసీ 'తోలాబాజీ'పై పెరుగుతున్న ఆగ్రహం వంటివి ఓటర్లు కొనసాగింపు కంటే "పరివర్తన్" (మార్పు)ను ఎంచుకునేలా చేశాయి. 2024లో ఒడిశాను జయించి, గత నెలలో బీహార్లో తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకున్న తర్వాత, తూర్పున బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.కేరళం మార్పుకే పట్టం! దెబ్బకొట్టిన కాంగ్రెస్కేరళంలో కురువృద్ధుడు,ప్రజాదరణనేతగా పాపులర్ పినరయ్ విజయన్కు ఈ సారి ప్రజలు భారీ షాకే ఇచ్చారు. తన ప్రత్యర్థి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)పై తన విశ్వాసాన్ని ప్రకటించారు. దీంతో కేరళం ఇప్పుడు తిరిగి యూడీఎఫ్ చేతుల్లోకి వచ్చింది.అవినీతి ఆరోపణలు, వామపక్షాల స్వరూపమే మారుతోందన్న ఆరోపణలతో సతమతమవుతున్న సీపీఎం, మరో ఐదేళ్లపాటు పాలించే అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలోని 140 స్థానాలకు గాను 100 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది. ఇది దక్షిణాదిలో తన ప్రాముఖ్యతను కాపాడుకోవాలని చూస్తున్న బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాంగ్రెస్ ప్రచారంతోపాటు కేరళలో మార్పు పవనాలు వీచాయి. అస్సాం - పుదుచ్చేరిలో, NDA సునాయాస విజయాలు సాధించి, కీలకమైన ఈశాన్య, దక్షిణ కంచుకోటలలో తన పట్టును సుస్థిరం చేసుకుంది.డీఎంకేకి షాక్, అరంగేట్రంలోనే విజయ్ అదుర్స్ తమిళనాడులో, నటుడు-రాజకీయవేత్త విజయ్ టీవీకే పార్టీ, అరంగేట్రంలో బ్లాక్బస్టర్ అరంగేట్రంతో విప్లవాత్మక విజయం దూసుకుపోతున్నాడు. ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముకగా ఉన్న డీఎంకే , ఏఐఏడీఎంకే అనే రెండు కూటముల ద్విముఖ ద్రావిడ ఆధిపత్యాన్ని బద్దలు చేసింది. విజయ్ స్టార్ పవర్ ,రెండు ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలపై ఓటర్లలో పెరుగుతున్న అసహనం కారణంగా తమిళనాడులో ఆశ్చర్యకరమైన ఆధిక్యాన్ని అందించాయి. 2026లో నిజమైన మార్పును కోరుకుంటూ, ఓటర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలోని పాత మూస ధోరణుల నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టమవుతోంది. తుదిఫలితాలు, తమిళనాడులో ఎన్నికల అనంతర పొత్తులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలకు అసలైన సూపర్స్టార్ విజయేనన్నది స్పష్టం.అస్సాంలో హిమంత హ్యాట్రిక్: రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను దాదాపు 100 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే చిన్నపాటి వాదనను కూడా పూర్తిగా తోసిపుచ్చుతూ, అస్సాంలో తన అత్యంత ఆధిపత్య ప్రదర్శనను కనబరచడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై బీజేపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో హిమంత మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.పుదుచ్చేరిలో కూడా అధికారి బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని చేపట్టనుంది. అయిదోసారి ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.ఇండియా కూటమికి కష్టాలేనా?2024 లోక్సభ ఎన్నికల తర్వాత కొద్దికాలం పాటు ప్రోత్సాహకరంగా పుంజుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలనిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కేవలం ఒక తాత్కాలిక పరిణామం మాత్రమేనని ఎన్డీఏ నిరూపించడంతో, ఇప్పుడు ప్రతిపక్షం మళ్లీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, బీజేపీ అన్ని ప్రత్యర్థి పార్టీలను పాతాళానికి తొక్కేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తోంది. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్లను పక్కన పెట్టడంతో, 2029 లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. -
అస్సాంలో కమలం హ్యాట్రిక్.. ?
అస్సాంలో బీజేపీ హావా కొనసాగుతుంది. రికార్డు స్థాయి విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. మైనార్టీల శాతం అధికంగా ఉన్న రాష్ట్రంలో బంపర్ మోజారిటీ దిశగా సాగుతుంది. అయితే బీజేపీకి ఇంత భారీ విజయం దక్కడం వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ రాజకీయ ఎత్తుగడలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.హిమంత మార్క్ పాలనఅసోంలో ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలను బాగా ఆకర్షించాయి. 'అరుణోదోయ్' ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ప్రభుత్వానికి పెద్దఎత్తున మైలేజ్ ఇచ్చాయి. ఈ పథకం మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసిందిదానితో పాటు స్థానిక అస్సామీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా "భూమిపుత్రులకు రక్షణ" అనే నినాదంతో ఆయన ప్రచారం సాగించారు. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని బలంగా వినిపిస్తూ, స్థానిక అస్సామీ సంస్కృతిని కాపాడతామనే భరోసానివ్వడం స్థానికంగా ఎంతో కలిసివచ్చింది. అయితే సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది.మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ విజయం ఎలా సాధ్యమైంది?హిమంత బిశ్వశర్మ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అస్సాం రాజకీయాల్లో కీలక మార్పు తెచ్చింది. దీనివల్ల మైనార్టీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న స్థానాల సంఖ్య తగ్గింది. ఫలితంగా, స్థానిక అస్సామీ జనాభా ప్రభావం ఉన్న స్థానాల్లో బీజేపీ బలం పెరిగింది. గతంలో కాంగ్రెస్, AIUDF (బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ) కలిసి పోటీ చేసేవి. కానీ ఈసారి విడివిడిగా లేదా బలహీనమైన కూటములతో పోటీ చేయడం వల్ల మైనార్టీ ఓట్లు చీలిపోయి బీజేపీకి మేలు జరిగింది.దానితో పాటు తిరుగుబాటు దారుల సమస్య అధికంగా ఉండడంతో ఆ సమస్య ప్రధానంగా ఎన్నికల ప్రచారం సాగింది.రాష్ట్రంలోని వివిధ హిందూ వర్గాలను (అస్సామీ, బెంగాలీ, గిరిజనులు) బీజేపీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగింది.హిమంత బిశ్వశర్మ నేపథ్యం2015 వరకూ జాతీయ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగిన హిమంత బిశ్వశర్మ హస్తంతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. చేరిన ఏడాదికే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాగా తన ఎత్తులతో 15 ఏళ్లుగా బీజేపీ కూటమిని అధికారంలోకి వచ్చేలా చేశారు. దీంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటకు బీటలు వారింది. అయితే ఆసమయంలో సర్బానంద సోనోవాలా ముఖ్యమంత్రి కాగా అతని క్యాబినెట్లో హిమంత మంత్రిగా పనిచేశారు.అనంతరం 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ సారి కమలనాథులు హిమంతకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హిమంత అభివృద్ధే లక్షంగా సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు నడిపారు. హిమంత నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి సైతం బీజేపీ భారీ మెజారీటీతో అధికారం దిశగా దూసుకుపోతుంది. -
బెంగాల్ లో కాషాయ ప్రభంజనం.. మమతా పాలనకు ఎండ్ కార్డ్?
-
బెంగాల్ లో కమల వికాసం
-
అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి మావే : విజయోత్సాహంలో బీజేపీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి హోరో హోరీగా సాగుతోంది. పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ సోమవారం పార్టీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా బలమైన తీర్పును ప్రజల మద్దతు ప్రతిబింబిస్తోందని శర్మ అన్నారు."బీజేపీకి, ప్రధాని మోడీకి ప్రజలు చూపిస్తున్న ప్రేమ, మద్దతును బట్టి అస్సాం, పశ్చిమ బెంగాల్,పుదుచ్చేరిలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం స్పష్టమవుతోంది. తమిళనాడు, కేరళలో కూడా ఓట్ల వాటా గణనీయంగా పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నా మన్నారు. ఆయన ఏఎన్ఐకి తెలిపారు.భారత ఎన్నికల సంఘం ప్రకారం, పుదుచ్చేరి తొలి ట్రెండ్స్ ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సి) 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయి. 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి) 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) చెరొక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.భారత ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం, పుదుచ్చేరిలో ఉదయం 9.15 గంటల సమయానికి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. 30 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆ పార్టీ రెండు స్థానాల్లో పోటికీ నిలబడింది.నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 75 ఏళ్ల రంగస్వామి మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతుండటం విశేషం. పుదుచ్చేరి ట్రెండ్స్ప్రారంభ గణాంకాల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు 16. ఇది 2021లో NDA ప్రభుత్వం ఏర్పాటుకు సాధించిన సంఖ్యకు సమానం. అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఈ తొలి ట్రెండ్ వెలువడింది. తదుపరి దశల్లో మరింత స్పష్టమైన చిత్రం వెలువడే అవకాశం ఉంది. -
బెంగాల్ లో ఉత్కంఠ.. లీడ్ లో BJP సువేందు అధికారి
-
బెంగాల్లో బీజేపీ ముందంజ!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్లో కాసేపు టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగింది. అయితే ఈ రేసులో టీఎంసీ వెనకబడిపోయింది. బీజేపీ అగ్రనేతలు కౌంటింగ్లో జోరు చూపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలంతా ముందంజలో ఉన్నట్లు సమాచారం. సువేందు అధికారి, నిశిత్ ప్రామాణిక్ (మథాభంగా (SC)), రేఖా పత్రా (హింగల్గంజ్ (SC)), రత్నా దేవనాథ్(పనిహాటి), అనందమయ్ బర్మన్(మాటిగారా–నక్సల్బరి), శిఖా చటర్జీ(డాబ్గ్రామ్–ఫుల్బారి), శంకర్ ఘోష్ (సిలిగురి) అంతా ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే భవానీపూర్లో మాత్రం ఆసక్తికర పోరు నడుస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపు ముందంజలో కొనసాగారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర చీఫ్ సువేందు అధికారి లీడ్లోకి వచ్చారు. నందిగ్రాంలోనూ ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ లీడ్తో బీజేపీ శ్రేణుల్లో సంబురాలకు సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు మమతా వర్సెస్ జనతా అని.. ప్రజల్లో ఆమెపై ఉన్న కోపం విస్పష్టమని బీజేపీ అంటోంది. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు 148 స్థానాలు అవసరం. అయితే ఒక నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాలకుగానూ 147 సీట్లు కైవసం చేసుకుంటే సరిపోతుంది. -
‘ప్రజాశక్తి విజయం సాధించింది’.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీదీ నాలుగోసారి అధికారంలోకి వస్తారా? బీజేపీ టీఎంసీకి చెక్ పెడుతుందా? అనేది తేలిపోనుంది. మొత్తం 294 స్థానాల్లో అధికారం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 148. అయితే ఫాల్తా రీపోలింగ్ నేపథ్యంలో.. ఆ సంఖ్య 293-147గా మారింది.ప్రజాశక్తి విజయం సాధించింది.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ బెంగాల్ ప్రజల ఆకాంక్షలను మేం నెరవేరుస్తాంపశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ప్రజాశక్తి విజయం సాధించింది బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నానుబెంగాల్ ఫలితాలపై స్పందించిన మమత ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హవామెజార్టీ మార్క్ దాటిన కమలంబీజేపీ ఓట్లు దొంగలించింది: మమతా బెనర్జీఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంపై స్పందించిన మమతా బెనర్జీటీఎంసీ శ్రేణులకు కీలక సూచనలు ఈ ఫలితాలు చెంది నిరాశ చెందొద్దుమూడు రౌండ్ల కౌంటింగే జరిగిందికౌంటింగ్ నిలిపివేశారు70 స్థానాల్లో కౌంటింగ్పై ఈసీ అప్డేట్ ఇవ్వడం లేదుతుది ఫలితాల్లో మనదే విజయంతొందరపడి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లొద్దుబీజేపీ ఓట్లు దొంగిలిస్తోందిబెంగాల్లో కమల వికాసంభారీ ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్193 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ97 స్థానాల్లో టీఎంసీకాంగ్రెస్ 1, సీపీఎం 2 స్థానాల్లో ఆధిక్యంబెంగాల్ విజయోత్సవాల్లో మోదీసాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీపశ్చిమ బెంగాల్ సహా అస్సాంలో బీజేపీ క్లీన్స్వీప్ పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లో ఎన్డీయే కూటమి ఘన విజయంవిజయోత్సవాల్లో పాల్గొననున్న మోదీ బెంగాల్లో కమల వికాసంతృణమూల్ చేజారిన పశ్చిమ బెంగాల్విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీఇప్పటికే 150+ స్థానాల్లో స్పష్టంగా కొనసాగుతున్న లీడ్125 స్థానాల ఆధిక్యంలో టీఎంసీలెఫ్ట్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంఇతరులు ఒక స్థానంకాంగ్రెస్ ఆధిక్యం జీరో అనూహ్య విజయ దిశగా బీజేపీబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంముస్లిం ప్రాబల్యం ప్రాంతాల్లో బీజేపీ అధిక్యంముస్లింలో చీలిక ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రాయం.ఈ చీలిక ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్లో స్పష్టంగా.. దక్షిణ బెంగాల్, కూచ్ బెహర్లో మాత్రం టీఎంసీ వైపు మొగ్గునిరాశలో టీఎంసీ శ్రేణులుబెంగాల్ ఎన్నికల్లో ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర నిరాశబోసిపోతున్న టీఎంసీ కార్యాలయం కాళిఘాట్లోని మమత నివాసం వద్ద నిశబ్ద వాతావరణంమెజారిటీ లీడ్లో బీజేపీబెంగాల్లో 150 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం133 స్థానాల ఆధిక్యంలో టీఎంసీకాంగ్రెస్, సీపీఎం తలో మూడు చోట్ల లీడ్నాలుగోసారి సీఎం కావాలన్న మమతా బెనర్జీ ఆశలపై బీజేపీ నీళ్లుబెంగాల్లో కాషాయం జెండా రెపరెపలుసంబురాల్లో బీజేపీ శ్రేణులులీడ్లో ఆర్జీకర్ బాధితురాలి తల్లిఆధిక్యంలో రత్నా దేవనాథ్(54)దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ హత్యాచార ఘటనఈ ఘటన బాధితురాలి తల్లే రత్నా దేవనాథ్ పనిహాతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీఆధిక్యంలో కొనసాగుతున్న రత్నా దేవనాథ్బెంగాల్లో బీజేపీ ఆధిక్యం142 సీట్లలో లీడ్లో బీజేపీ111 సీట్లలో టీఎంసీమూడు చోట్ల కాంగ్రెస్కు ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని సీపీఎంబెంగాల్లో టఫ్ ఫైట్హోరాహోరీగా టీఎంసీ, బీజేపీ మధ్య పోరురెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీమమతా బెనర్జీని దోబూచులాడుతున్న లీడ్కాసేపు దీదీ.. కాసేపు అధికారి సువేందు ఆధిక్యంలో.. భవానీపూర్లో రౌండ్ రౌండ్కీ మారుతున్న సీన్బెంగాల్ కౌంటింగ్లో మారుతున్న సీన్కొనసాగుతున్న ఈవీఎంల ఓటింగ్టీఎంసీ కంటే ఆధిక్యంలో బీజేపీ107 సీట్లలో టీఎంసీ, 127 స్థానాల్లో బీజేపీ లీడ్నాలుగు చోట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ భవానీపూర్లో వెనకంజలో మమతప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్బెంగాల్లో ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్మరో గంటలో ట్రెండ్స్ మొదలయ్యే చాన్స్ఫలితాలపై అప్పుడే రానున్న స్పష్టతటీఎంసీ శ్రేణుల మౌనంవెలువడుతున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపోస్టల్లో బీజేపీకి ఆధిక్యంవెలవెలబోతున్న టీఎంసీ ఆఫీస్కాళీఘాట్ మమతా బెనర్జీ నివాసం వద్దా గంభీర వాతావరణం బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుఆధిక్యంలో బీజేపీ.. 118 స్థానాల్లో లీడ్టీఎంసీ 107రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ఖాతా తెరవని సీపీఎందీదీ వెనకంజ.. బీజేపీ కామెంట్బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలీడ్లో ఆ పార్టీ అగ్రనేతలువెనకంజలో మమతా బెనర్జీఇవి జనతా వర్సెస్ మమతా ఎన్నికలు :బీజేపీమమతా బెనర్జీపై జనాలకు ఉన్న కోపం విస్పష్టం :బీజేపీఆధిక్యంలో.. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంటీఎంసీ 108బీజేపీ 117కాంగ్రెస్ 5సీపీఎం 0ఇతరులు 0అధిర్ రంజన్ వెనుకంజమూడు దశాబ్దాల తర్వాత స్టేట్ పాలిటిక్స్లోకి అధిర్ రంజన్ రీఎంట్రీముర్షీదాబాద్ జిల్లా బరహంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పోటీపోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత వెనకంజలో మమతా బెనర్జీదీదీకి పోస్టల్ బ్యాలెట్లో షాక్వెనకంజలో కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రిఅధికారి సువేందు ముందంజఆసక్తికరంగా భవానీపూర్ పోరుఇటు.. నందిగ్రాంలోనూ ఆధిక్యంలో సువేందుఆధిక్యంలోకి సువేందుభవానీపూర్లో ఆసక్తికరంగా పోరుతొలుత మమతా బెనర్జీకి ఆధిక్యంకాసేపటికే లీడ్లోకి వచ్చిన బీజేపీ అధికారి సువేందుఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అగ్రనేతలు బెంగాల్లో హోరాహోరీపోస్టల్ బ్యాలెట్లో టీఎంసీ ముందంజస్వల్పంగా వెనకబడిన బీజేపీ106 స్థానాల్లో టీఎంసీ, 100 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని కాంగ్రెస్, లెప్ట్ పార్టీమరికాసేపట్లో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ఆధిక్యంలో మమతా బెనర్జీభవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంవెనుకబడిపోయిన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందుగత ఎన్నికల్లో ఇక్కడే దీదీని ఓడించిన సువేందుబీజేపీ అగ్రనేతల ముందంజబెంగాల్ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలుపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో బీజేపీ అగ్రనేతల ముందంజబీజేపీ శ్రేణుల్లో సంబురాలు! పోస్టల్ బ్యాలెట్లో.. ఆసక్తికరంగా పోస్టల్ బ్యాలెట్టీఎంసీ-బీజేపీ హోరాహోరీమరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈవీఎం ఓట్ల లెక్కింపుమూడంచెల భద్రత నడుమ.. బెంగాల్ వ్యాప్తంగా మొదలైన ఓట్ల కౌంటింగ్ భద్రం కోసం మూడంచెల వ్యవస్థప్రశాంతంగా కౌటింగ్ ప్రారంభమైందన్న సిలిగురి కమిషనర్ సయ్యద్ వాకార్ రజా తనిఖీలు ముమ్మరంగా జరుగున్నాయని.. శాంతియుతంగా కౌంటింగ్ కొనసాగేలా చేస్తామని వ్యాఖ్య #WATCH | Siliguri, West Bengal | On the counting of votes, Siliguri Commissioner of Police (CP) Syed Waqar Raza says, "Everything will be done peacefully. All things are in proper order. Frisking is being done here, and there is a 3-tier security system, and we hope that… pic.twitter.com/4fiRZU0kE8— ANI (@ANI) May 4, 2026 ఆ స్థానంలో ఏం జరగనుందో?బెంగాల్లో హాట్ సీట్గా భవానీపూర్మమతా బెనర్జీ వర్సెస్ అధికారి సువేందుగత ఎన్నికల్లో గురువు మమతను ఓడించిన బీజేపీ సువేందుఈసారి తనదే గెలుపని సువేందు ధీమాప్రారంభమైన కౌంటింగ్పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపుమమతా బెనర్జీ సంచలన ఆరోపణలుబెంగాల్ కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలుపలు ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీలు పని చేయడం లేదన్న దీదీస్ట్రాంగ్ రూమ్ల వద్దకు పలు వాహనాలు వచ్చి వెళ్లాయని ఆరోపణఈ చర్యల వెనుక బీజేపీ ఉందని మమతా బెనర్జీ వ్యాఖ్య అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపుఅనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచనమమత సూచనలతో రాత్రంతా స్ట్రాంగ్ రూమ్ల వద్దే పడిగాపులు కాసిన టీఎంసీ శ్రేణులుఅందరి చూపు బెంగాల్ వైపు.. కాసేపట్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంఅందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపుటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం అవుతారా?దీదీ విజయపరంపరకు, ఆధిపత్యానికి బీజేపీ చెక్ పెడుతుందా?ఎస్ఐఆర్(ఓట్ల తొలగింపు ప్రక్రియ) నేపథ్యంలో ఆసక్తికరం కానున్న ఫలితాలుజాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఫలితం కావడంతో ఉత్కంఠకౌంటింగ్ కోసం ఈసీ.. బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ భారీ ఏర్పాటుభారీగా నమోదైన పోలింగ్ శాతం77 ఓటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్75 వేల మంది భద్రతా సిబ్బందిఫాల్తాలో ఈ నెల 21న రీపోలింగ్.. 24 కౌంటింగ్మిగిలిన 293 స్థానాలకు ఇవాళ జరగనున్న కౌంటింగ్ -
దీదీ నాలుగోసారి సీఎం అవుతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ షురూ కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. ఒక్క ఫాల్తా తప్ప అన్ని ఫలితాలు ఇవాళ వెలువడతాయి. ఆ నియోజకవర్గంలో 24న ఉప ఎన్నిక జరగనుంది. మిగిలిన 293 స్థానాల ఓట్ల కౌంటింగ్ కోసం 77 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఫలితాలను అటు ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నుడూలేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడం ఇందుకు మరో కారణం. టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. నాలుగోసారి మమతా బెనర్జీ సీఎం అవుతారా?.. బెంగాల్లో మమతకు బీజేపీ చెక్ పెడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. రెండు గంటల తర్వాత ట్రెండ్స్ వెలువడే చాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ హాల్లో సెల్ఫోన్లు నిషేధించారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా భవానీపూర్లో మమత వర్సెస్ అధికారి సువేందు మధ్య టఫ్ వార్ తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా.. బెంగాల్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. -
బెంగాల్లో ‘స్వీట్ల’ రాజకీయం
‘మోదీశ్రీ’, ‘జాయ్ బంగ్లా’, ‘లాల్ సలాం’... నినాదాలను తలపిస్తున్నాయి కదా! కానీ ఇవన్నీ స్వీట్లు. ఎన్నికల ఫలితాల వేళ.. వివిధ పార్టీల అభ్యర్థుల కోసం బెంగాల్ స్వీట్ల తయారీదారులు పెట్టిన మిఠాయిల పేర్లు. ఓట్ల లెక్కింపు కోసం ఓటర్లు, అభ్యర్థులు ఎదురు చూస్తుంటే.. మిఠాయి తయారీదారులు మాత్రం రాజకీయ, సాంస్కృతిక మేళవింపుతో పార్టీలను ప్రతిబింబించే స్వీట్ల తయారీలో నిమగ్నమయ్యారు. ఆహారం చుట్టూరా ప్రచారం.. ఈసారి పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఆహారం చుట్టూనే తిరిగాయి. నెల రోజులకు పైగా సాగిన ఎన్నికల పోరు చేపలు, జల్మురి వంటి ఆహారం చుట్టే తిరిగింది. చివరికి ఫలితాలు కూడా తినుబండారాలతోనే ముడిపడ్డాయి. అది కూడా బెంగాల్కే ప్రత్యేకమైన స్వీట్లతో. ‘మిఠాయిలు బెంగాల్ సంస్కృతిలో అంతర్భాగం. ప్రతి సందర్భానికీ తగిన మిఠాయిలు ఉంటాయి. అలాంటప్పుడు ఎన్నికలకు ఎందుకు చేయకూడదు?’అని ప్రశ్నిస్తున్నారు మిఠాయి వ్యాపార సంస్థల యజమానులు. స్వీట్లతో ఫలితాలను వేడుకగా మార్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో తాజా రసగుల్లాలు, సందేశ్ల సువాసనతో కోల్కతా అంతా ఘుమఘుమలాడుతోంది. ఇక, ఈ ఎన్నికల అసలు విశేషం ఏంటంటే ఆ మిఠాయిల రంగులు, పేర్లు. పార్టీల రంగు, నినాదాలు, నాయకుల పేర్లు.. పార్టీ రంగులు, చిహ్నాలు, నినాదాలు, నాయకుల పేర్లతో కూడిన ప్రత్యేక స్వీట్లను తయారు చేసే పనిలో పడ్డాయి సంస్థలు. కాషాయ రంగు స్వీట్కు ‘మోదీశ్రీ’అని, ఆకుపచ్చ రంగు మిఠాయిలకు ‘జాయ్ బంగ్లా’అని, గులాబీ, ఎరుపు రంగు వర్ణపు మిఠాయిలకు వామపక్షాల ‘లాల్ సలాం’అని పేర్లు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్కతా వచి్చన ప్రధాని మోదీ కాషాయ రంగు కేసర్ ఫ్లేవర్ ‘సందేశ్’రుచి చూశారు. ఆ స్ఫూర్తితో కాషాయ రంగు సందేశ్కు ‘మోదీశ్రీ’అని పేరు పెట్టారు. ఇక, మరో సందేశ్ను నిమ్మకాయ ఫ్లేవర్తో, ఆకుపచ్చ రంగులో తయారు చేసి తృణమూల్ కాంగ్రెస్ నినాదమైన ‘జోయ్ బంగ్లా’పేరు పెట్టారు. తమ దుకాణాల్లో ప్రధానంగా రసగుల్లా, రాజ్¿ోగ్ రకాలను తయారు చేస్తామని ప్రఖ్యాత కేసీ దాస్, నోబిన్ చంద్ర దాస్ మిఠాయి దుకాణ సంస్థల డైరెక్టర్ ధీమన్ దాస్ అన్నారు. ‘ఆకుపచ్చ, నారింజ, ఎరుపు వెల్వెట్ రసగుల్లాలను తయారు చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు రోజున డిమాండ్, ట్రెండ్ను బట్టి సరఫరా చేస్తాం’అని చెప్పారు. తెల్లరసగుల్లాలను రెడీ చేసుకుని.. రాష్ట్రంలో నెలకొన్న ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ఛాన్సెస్కు అనుగుణంగానే కాషాయం, ఆకుపచ్చ రంగులో రసగుల్లాలు, సందేశ్లను తయారు చేస్తున్నారు. ఫలితాల తరువాతే మిఠాయిలు అవసరమవుతాయి. అప్పుడు వేగంగా స్వీట్లను అందించేందుకు తయారీ సంస్థలు ముందు భారీ సంఖ్యలో తెల్ల రసగుల్లాలను తయారు చేసి పెడుతున్నాయి. రంగు రంగుల చక్కెర సిరప్లను కూడా సిద్ధంగా ఉంచుతున్నాయి. ఓట్ల లెక్కింపు తరువాత గెలవబోయే అభ్యర్థి పార్టీ రంగును బట్టి అవసరమైన రంగులో రసగుల్లాలను ముంచి సరఫరా చేయనున్నారు. బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సందిగ్ధానికి ఇది అద్దం పడుతోంది. – కోల్కతా -
బెంగాల్లో ‘ఎగ్జిట్’ డెమోక్రసీ?
బెంగాల్ను గెలవడానికి బీజేపీ వాళ్లు సర్వశక్తుల్నీ ధారపోశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ చేస్తున్న వాదన అరణ్య రోదనగా మారిపోయింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్వైజర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక తాఖీదును పంపించింది. ఈ తాఖీదు బెంగాల్కు మాత్రమే వర్తిస్తుందట! తృణమూల్ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2023లో ఇటువంటి నిబంధనను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. లెక్కింపు కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగుల్ని నియమించాలన్నది ఆ నిబంధన. ఇది దేశవ్యాప్తంగా అమల్లోనే ఉన్నది. దీనికి అదనంగా ఒక సూపర్వైజర్ను కూడా విధిగా కేంద్ర ఉద్యోగినే నియమించాలని బెంగాల్ కోసం మరో ఆదేశం జారీ అయింది.ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. అక్కడ దానికి ఓదార్పు దొరకలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లింది. శనివారం నాడు సుప్రీంకోర్టు కూడా పిటీషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల సంఘం విధివిధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న యాంత్రిక వైఖరికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్పందించింది. అంతే తప్ప పిటీషనర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని భావించాలి. ఒక నిర్దిష్ట సమయంలో అప్పటి సమాజంలోని ఆధిపత్య శక్తుల భావజాలం ప్రభావం అన్ని వ్యవస్థల మీదా అంతో ఇంతో పడుతుందేమో. అటువంటి సందర్భాల్లో ఆయా వ్యవస్థల్లో సృజనశీలత స్థానాన్ని యాంత్రికత ఆక్రమించవచ్చు. ఆరాధనా మందిరం మారితే దళితుల ఎస్సీ హోదా పోతుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జస్టిస్ కృష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి, హెచ్ఆర్ ఖన్నా, పిఎన్ భగవతి వంటి న్యాయమూర్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు.ఇప్పుడు ప్రణయ్రాయ్ వంటి జర్నలిస్టులు, యోగేంద్ర యాదవ్ వంటి సెఫాలజిస్టులు కూడా గుర్తుకొస్తున్నారు. దేశ మీడియా రంగంలో టీవీ వార్తల శకం ప్రారంభమైన తర్వాత ఆ తొలితరం అందించిన ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత సూపర్ హిట్ అయ్యేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వ్యవస్థలకు లొంగని నిక్కచ్చితనం, కచ్చితత్వం నాటి సెఫాలజీని ముందుకు నడిపించాయి. మీడియా రంగాన్ని ఆధిపత్య శక్తులు తమ ఉక్కు పిడికిట్లోకి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రణయ్రాయ్ వంటి వాళ్లు తాము స్థాపించిన సంస్థల నుంచే నిస్సహాయంగా బయటకు నడవాల్సి వచ్చిన విషాద దృశ్యాలను చూడవలసి వచ్చింది. అయినా, ప్రణయ్రాయ్లోని పాత్రికేయుడు ఓడిపోలేదు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో డెబ్బయ్ ఆరేళ్ల ‘ఆ యువకుడు’ ఒక సాధారణ క్షేత్రస్థాయి రిపోర్టర్ మాదిరిగా సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలకు సోషల్ మీడియాలో వేలాదిమంది జేజేలు పలికారు.మీడియా రంగం విస్తరించింది. టెక్నాలజీ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడంలో మరింత కచ్చితత్వం ఉండే అవకాశాలు ఇప్పుడే ఎక్కువున్నాయి. కానీ ఆధిపత్య శక్తుల ఆదేశాల మేరకు మీడియా సంస్థలు రాజీపడుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఫలితంగా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సక్సెస్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న సర్వే సంస్థల్లో ‘యాక్సిస్ మై ఇండియా’కు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ. ఈ సంస్థ ‘ఇండియా టుడే’తో కలిసి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. బెంగాల్ రెండో దశ పోలింగ్ పూర్తికాగానే అన్ని ఛానెళ్ళు, అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే కూడా యాక్సిస్ మై ఇండియా చేసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దేశంలో ఇంకే సర్వే సంస్థ గానీ, మీడియా సంస్థగానీ ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే అవకాశముందని ప్రకటించి యాక్సిస్ మై ఇండియా సంచలనం సృష్టించింది. ఒక్క బెంగాల్ ఎగ్జిట్ పోల్ను మాత్రం మరుసటి రోజుకు వాయిదా వేశారు.మరుసటి రోజు కూడా ఆశాభంగమే మిగిలింది. బెంగాల్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించబోవడం లేదని సర్వే సంస్థ ఎమ్డీ ప్రదీప్ గుప్తా ప్రకటించారు. ఇదొక అనూహ్యమైన పరిణామం. బెంగాల్పై అస్త్రసన్యాసానికి ఆయన చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇదే అసలు కారణమైతే ముందురోజే ఈ సంగతిని చెప్పి ఉండవచ్చు. తొలిదశ ఎన్నికలు అంతకు వారం రోజుల ముందే జరిగాయి. తొలిదశ జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పి రెండో దశలో చెప్పకుండా ఉన్నారా? తాము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడినందువల్ల ఎవరికీ చిక్కని విధంగా తమిళనాడు నాడి తమకు చిక్కిందని చెప్పుకున్న యాక్సిస్ మై ఇండియా, కీలకమైన బెంగాల్ నాడిని ఎందుకు పట్టుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎవరి ఒత్తిడికో లొంగి ప్రదీప్ గుప్తా బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకుండా దాచారనే అభిప్రాయం బలపడుతున్నది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఒక సంస్థ ఎగ్జిట్ ఫలితాలను ఆపేసినంత మాత్రాన ఆ ‘బలమైన’ పార్టీకి కలిగే లాభం ఏముంటుంది? ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు కౌంటింగ్ రోజు వెలువడే అవకాశముంటుందా?.. ఉంటే, ఎలా సాధ్యం?ఒక్క బెంగాల్కు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లు కూడా కేంద్ర సిబ్బందే ఎందుకు కావాల్సి వచ్చిందో? ఒక్క బెంగాల్ ప్రజల నాడిని పసిగట్టడంలోనే తన అశక్తతను ఆఖరి నిమిషంలో మాత్రమే ప్రదీప్ గుప్తా ఎందుకు వ్యక్తం చేశారో? ఒక్క బెంగాల్లోనే ‘సర్’ కార్యక్రమంతో 91 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయో? తమ పేరు తొలగింపును పునఃపరిశీలించాలని దరఖాస్తులు పెట్టుకున్న లక్షలాది మందిలో కేవలం వెయ్యిమందికి మాత్రమే ఊరట లభించడానికి కారణమేమిటో? ఎన్నికలు ముగిసిన తర్వాతనే మిగిలిన దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పడమేమిటో? ఇటువంటి పలు సందేహాలు తలెత్తడం సహజం. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్లో గెలిచి తీరాల్సిందేనని బీజేపీ చేస్తున్న విశ్వప్రయత్నాల్లో ఇవన్నీ భాగమని తృణమూల్ భావిస్తున్నది. బెంగాల్ గెలుపునకు బీజేపీ ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యాన్ని ఆపాదించుకుంటున్నది. ఇటీవలనే అధికారం చేపట్టిన బిహార్కు తోడు బెంగాల్ను కూడా గెలుచుకుంటే ఆర్యావర్త కాషాయీకరణ పూర్తవుతుంది. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్ గెలుపుతో ఈ చారిత్రక పరిణామం పూర్తవుతుంది. ఇక మిగిలేది దక్షిణాపథమే.కొన్ని వర్తమాన కీలక పరిణామాలు చారిత్రక సందర్భాలను స్ఫురణకు తెస్తాయి. పోలికలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనలు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో భారత్లో ఇంగ్లిష్ పాలనకు తొలి అడుగు పడింది. బెంగాల్లో గెలిస్తే ఆర్యావర్త కాషాయీకరణలో బీజేపీ తుది అడుగు పూర్తవుతుంది. బలీయమైన బెంగాల్ నవాబును ఓడించడానికి ఈస్టిండియా కంపెనీ సేనాని రాబర్ట్ క్లైవ్ మోసపూరితమైన ఎత్తుగడలు వేశాడనీ, అతని సుపీరియర్ ఆయుధ టెక్నాలజీ కూడా అందుకు తోడ్పడిందనీ చరిత్ర చెబుతున్నది. బెంగాల్లో గెలవడానికి బీజేపీ కూడా మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తున్నదని తృణమూల్ ఆరోపిస్తున్నది. ఆరోపణల్లో ఎంతో కొంత నిజముండదని చెప్పలేము. అంతమాత్రాన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేనేళ్లు బెంగాల్ను పవిత్రంగా పరిపాలించిందని కూడా చెప్పలేము. గూండా గ్యాంగులు, అరాచక శక్తులు పాలక పార్టీ నీడలో వ్యవస్థీకృత రూపం దాల్చాయనీ, ఎన్నికల సందర్భాల్లో అవి పార్టీ తరఫున పని చేస్తున్నాయన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.అరాచక శక్తులు రాజకీయ సైన్యంగా పనిచేయడం మమతా బెనర్జీతోనే ప్రారంభం కాలేదు. నక్సల్బరీ అలజడి సద్దుమణుగుతున్న కాలంలో డెబ్బయ్యవ దశకం తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే హయాంలోనే ఈ రౌడీ రాజకీయ ముఠాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అన్నిరకాల వామపక్ష శక్తుల మీద, ముఖ్యంగా సీపీఎం శ్రేణుల మీద దాడులకు ఈ ముఠాలను ప్రేరేపించేవారు. సీపీఎం అగ్రనాయకుడు జ్యోతిబసు మీద కూడా ఆ రోజుల్లో హత్యాప్రయత్నం జరిగింది. ముప్పయ్ నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగిన వామపక్ష కూటమి పాలనలో కూడా రౌడీ ముఠాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే విమర్శ ఉన్నది. కాకపోతే, సమర్ధవంతంగా భూసంస్కరణలు అమలు చేయడం, పాలనా వికేంద్రీకరణ, అవినీతి రాహిత్యం, నాయకత్వ నిరాడంబరత వంటి కారణాల వలన ఈ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. మమతా బెనర్జీ పాలన మళ్లీ సిద్ధార్ధ శంకర్ రే వారసత్వాన్ని స్వీకరించిందనే విమర్శలున్నాయి.మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనంలో ఉన్నది. కాకపోతే బెంగాల్ను గెలవాలనే ‘చారిత్రక కర్తవ్యం’ ఊపులో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, డజన్లకొద్దీ కేంద్ర మంత్రులూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోహరించడం, బెంగాల్పై యుద్ధం మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని మార్చడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘బెంగాలీ అస్మిత’ (బెంగాల్ ఆత్మగౌరవం) ను ముందుకు తోసింది. బెంగాలీ అస్మితపై హిందూ పరిచయ్ (హిందూ భావజాలం)తో దాడి చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ భాషా సంస్కృతులకు బెంగాలీలు, తమిళులు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలిసిన విషయమే. తమ పార్టీ బెంగాలీ బెటాలియన్తోనే మమతపై ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాడి ఉంటే మమత ఖాయంగా ఓడిపోయేదేమో! కానీ వ్యవస్థల మాటున నిలబడి అప్రజాస్వామిక పద్ధతులతో, మోసపూరితమైన ఎత్తుగడలతో బెంగాలీ అస్మితను ఒకవేళ గెలిస్తే, ఇకముందు దేశ భవిష్యత్తు ఎటువంటి దారిలో పయనిస్తుందోనన్నదే ప్రజాస్వామ్య శక్తుల ఆందోళన!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బీజేపీలో చేరినా.. అరెస్ట్ తప్పదా?
రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను పావుగా వాడుకుంటోందని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శ ఒకటి ఉంది. ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్లను బూచిగా చూపించి ప్రతిపక్ష నేతలను లొంగదీసుకుంటోందని ప్రతిపక్షాలు తిట్టిపోస్తుంటాయి. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీ ఇదే తరహాలో తమ గూటికి చేర్చుకుందనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ.. అయితే ఈ జంపింగ్ ఎపిసోడ్లో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆప్ (AAP) నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ అరెస్టు అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార నివాసం నుంచి ఆయన గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఆయన వెనుక ద్వారం నుంచి కారులో బయటకు వెళ్లిపోయినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. పంజాబ్లో ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందుకు ఒకటి అవినీతి సంబంధితమైంది కాగా, మరొకటి మహిళా వేధింపుల కేసుగా తెలుస్తోంది. ఇవి నాన్బెయిలబుల్ కేసులుగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కాగా బీజేపీ లీగల్ సెల్ ఆయనకు సహాయం అందించేందుకు రంగంలోకి దిగింది.ఆప్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే సందీప్పై ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. పంజాబ్ ఆప్ ప్రభుత్వం ప్రతీకారం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ, అకాళీదళ్ విమర్శిస్తుండగా.. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టింది.గత నెలలో ఆప్ రాజ్యసభ సభ్యులలో ఏడుగురు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్జిత్ సహ్నే ఈ లిస్ట్లో ఉన్నారు. మాలివాల్(ఢిల్లీ) తప్ప మిగతా ఆరుగురు పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే.. పార్టీ మారిన వాళ్ల సంఖ్య 2/3 వంతు కావడంతో వీళ్లపై ఫిరాయింపుల యాంటీ-డిఫెక్షన్ చట్టం (Tenth Schedule) వర్తించబోదని.. అనర్హత వేటు పడకపోవచ్చనే నిపుణులు చెబుతున్నారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన సందీప్ పాఠక్.. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా పని చేశారు. ఆప్ పార్టీలో ఆరంభం నుంచి క్రియాశీలకంగా పని చేశారు. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయంలో ఈయన వ్యూహాలే కీలకమయ్యాయి. అదే ఏడాది ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఆప్ తన ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ.. ఇటీవలె బీజేపీలో చేరారు. -
దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొడుతూ బీజేపీ అనూహ్య ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్. సంస్థాగత నైపుణ్యాలకు మారుపేరైన బన్సాల్.. భూపేంద్ర యాదవ్, బిప్లబ్ దేబ్ వంటి హేమాహేమీలతో కలిసి తన సైలెంట్ ఆపరేషన్తో టీఎంసీ అధినేత్రిని ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.క్షేత్రస్థాయిలో ప్రకంపనలు‘భయం వీడండి, నమ్మకం ఉంచండి’ అనే బలమైన నినాదంతో సునీల్ బన్సాల్ బెంగాల్ రణరంగాన్ని సిద్ధం చేశారు. భారీ బహిరంగ సభల కంటే చిన్నపాటి స్ట్రీట్ మీటింగ్స్పైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 12,000 వీధి సభలు నిర్వహించారు. అలాగే, ముఖ్యంగా మహిళలు, ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు లక్షా 65 వేల చిన్న సమావేశాలు ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ..ఈ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యూహంలో భాగంగా ప్రారంభంలో నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకోకుండా, టీఎంసీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వాడుకున్నారు. సుమారు 220 నియోజకవర్గాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేస్తూ 80కి పైగా ప్రెస్ మీట్లు పెట్టారు. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ వ్యూహాత్మక దాడితో ఏకంగా 77 మంది అభ్యర్థులను మార్చుకోవాల్సిన ఒత్తిడి టీఎంసీపై పడింది. ఆ తర్వాత మొదలైన 10 వేల కిలోమీటర్ల ‘పరివర్తన్ యాత్ర’ బీజేపీకి మరింత ఊపునిచ్చింది.బ్రిగేడ్ సభతో బూస్ట్.. భావోద్వేగాల అస్త్రం‘బ్రిగేడ్ మైదానాన్ని గెలిచిన వారే బెంగాల్ను గెలుస్తారు’ అన్న వాదనను నిజం చేస్తూ, ప్రధాని మోదీ సభకు 5 లక్షల మందికి పైగా హాజరుకావడం మమత శిబిరంలో గుబులు రేపింది. ‘మా-మాటి-మానుష్’ పేరుతో జరిగిన అకృత్యాలను గుర్తుచేస్తూ, ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ బాధితుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా బెంగాలీల సెంటిమెంట్ను బీజేపీ బలంగా తాకింది. యువత, మహిళల కోసం ‘యువ కార్డ్’, ‘మాతృశక్తి కార్డ్’ వంటి పథకాలతో నేరుగా వారిని ఆకర్షించారు. మొత్తంగా 640కి పైగా ర్యాలీలతో సునీల్ బన్సాల్ బృందం బెంగాల్ను ముట్టడించి, చరిత్ర సృష్టించే దిశగా బలమైన అడుగులు వేసిందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కాఫీ-టీ కలుస్తాయా?.. తమిళనాడులో ఏం జరగనుంది?
అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి.ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
ఎగ్జిట్ పోల్స్ను తోసిపుచ్చిన మమతా..226 సీట్లు మా వశం!
ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ మే 4న విడుదల కానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై గురువారం ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఢీలా పడ్డ టీఎంసీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోశారు.ఆ వీడియోలో దీదీ మాట్లాడాతూ.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లకు మించి గెలుస్తుంది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, ఫలితాలు దానికి సాక్ష్యం చెబుతాయి’అని అన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. బీజేపీ తరఫున ఎగ్జిట్ పోల్స్లో చూపిన ఆధిక్యం కేవలం మానసిక ఒత్తిడి సృష్టించడానికే అని ఆమె ఆరోపించారు.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకవైపు బీజేపీకి ఆధిక్యం చూపుతున్నప్పటికీ,మమతా బెనర్జీ ధైర్యవంతమైన ప్రకటన మరోవైపు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఫలితాలు వెలువడే వరకు ఈ పోటీ ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. -
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్.. బెంగాల్ వారిదే.. తమిళనాడులో..?
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ టుడేస్ చాణుక్య విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 192 సీట్లను కైవసం చేసుకుంటుందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటమి ఖాయమని పేర్కొంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీకి 48 శాతం ఓటు షేర్తో 192 సీట్లు, టీఎంసీకి 38 శాతం ఓటు షేర్తో 100 సీట్లు, ఇతరులకు 14 శాతం ఓటు షేర్తో 2 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.అదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని టుడేస్ చాణుక్య అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 39 శాతం ఓటు షేర్తో 125 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. విజయ్ పార్టీ 30 శాతం ఓటు షేర్తో 63 స్థానాలు సాధిస్తుందని, మరో 10 స్థానాల్లో ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ అలయన్స్ నిరాశ చెందుతుందని, 27 శాతం ఓటు షేర్తో 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేల్చింది. -
బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ!
రాజకీయాల్లో వారసత్వం సాధారణమే.. అయితే ఈ జాబితాలోని వారు సొంతంగా తమదైన ముద్రను దక్కించుకోవడం అనేది అంత ఈజీగా జరగదు. అయితే పశ్చిమ బెంగాల్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వాడవాడలా అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లునిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, కేవలం ఆ గుర్తింపునకే పరిమితం కాకుండా, పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు అభిషేక్ బెనర్జీ. మేనత్త నీడ నుంచి బయటపడి, బీజేపీకి దీటైన సవాల్ విసురుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సేనాధిపతిగా మారిన అభిషేక్ ప్రయాణం అత్యంత ఆసక్తికరం.నెత్తురోడిన అత్తను చూసిన రెండేళ్ల చిన్నారిఅది 1990వ సంవత్సరం. సీపీఎం కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి, తలకు కట్టుతో మంచంపై ఉన్న మమతా బెనర్జీని చూసి ఆ రెండేళ్ల బాలుడు చలించిపోయాడు. తన అత్తపై ఎందుకు దాడి జరిగిందని ఇంట్లో నినాదాలు చేస్తూ, అప్పటి నుంచే రాజకీయ పరిణతిని కనబరిచాడు. దశాబ్దాల తర్వాత అదే ఫోటోను ఓ సభలో మమత స్వయంగా అతనికి బహుకరించారు. ఆనాటి ఆ చిన్నారే నేటి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ అభిషేక్ బెనర్జీ.23 ఏళ్లకే యూత్ ఐకాన్గా ఎంట్రీపశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్దలు కొట్టి, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2011 సంవత్సరంలోనే అభిషేక్ రాజకీయ అరంగేట్రం జరిగింది. కేవలం 23 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పాత తరం నేతల భావోద్వేగ, పోరాట పద్ధతులకు భిన్నంగా.. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.రికార్డు మెజారిటీలతో తిరుగులేని సత్తా2014లో లోక్సభ బరిలోకి దిగిన అభిషేక్, తన 26వ ఏట డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి గెలిచి, 16వ లోక్సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో 71,000 ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2019లో బీజేపీ హవాలోనూ తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.పార్టీ పగ్గాలు.. ఈడీ, సీబీఐ సవాళ్లుఅంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ ప్రభావం 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడింది. ఆయన తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్లో దూసుకువస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో, పార్టీ జాతీయ ఆశయాలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలంపైగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ) విచారణలను సైతం ధైర్యంగా ఎదుర్కోవాల్సి వచ్చింది.ఓల్డ్ వర్సెస్ న్యూ.. సరికొత్త వ్యూహంగత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్లో సీనియర్లకు, అభిషేక్ నేతృత్వంలోని యువ నాయకత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందనే వార్తలు వచ్చాయి. కానీ, 2026 ఎన్నికల్లో ఈ విభేదాలన్నీ సమసిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు పార్టీలో పక్కా వ్యూహం అమలవుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా కేంద్రంగా పరిపాలనను పర్యవేక్షిస్తూ, ఉత్తర బెంగాల్పై దృష్టి పెడితే.. అభిషేక్ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి దక్షిణ బెంగాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.2026 ఎన్నికలు.. అసలైన అగ్నిపరీక్షఅభిషేక్ బెనర్జీకి 2026 ఎన్నికలు అత్యంత కీలకం. ఇవి పార్టీలో తన స్థానాన్ని, నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎదురైన అగ్నిపరీక్షలాంటివి. డేటా ఆధారిత, యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాలతో, కచ్చితమైన బూత్ స్థాయి మేనేజ్మెంట్తో ఆయన ముందుకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా, బీజేపీ సంస్థాగత బలాన్ని దీటుగా ఢీకొట్టగల శక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీకి తనను తాను అత్యున్నత నేతగా నిరూపించుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశంగా మారాయి.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ బాటలో దుర్గేష్.. న్యాయమూర్తికి షాకింగ్ లేఖ -
ఈ ఎన్నికలతో బీజేపీ పతనం మొదలైంది
-
రెండో దశలోనూ రికార్డ్ స్థాయిలో
కోల్కతా: బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతల హోరాహోరీ ప్రచారపర్వం తర్వాత బుధవారం పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రాత్రి 7.45 గంటలకు అందిన సమాచారం మేరకు రెండో దఫాలో రికార్డ్ స్థాయిలో 92.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసేనాటికి క్యూ వరసల్లో నిల్చున్న వాళ్లకు సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే వీలుంది. తొలి దశలో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొదటి, రెండో దశ పోలింగ్ శాతాలను కలుపుకుంటే సగటును 92.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రచరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2011లో 84.72 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం రెండో దశలో 142 స్థానాలకుగాను బుధవారం 40వేలకుపైగా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 93.78 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని కోల్కతాలో 88.59 శాతం పోలింగ్ నమోదైంది. భవానీపూర్ నుంచి పోటీచేస్తున్న 71 ఏళ్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం నియోజకవర్గంలోని చక్రబేరియా ప్రాంతంలోని 70వ నంబర్ వార్డ్లో పోలింగ్కేంద్రంలో ఓటేసి బయటికొచ్చి కూర్చున్నారు. అదే సమయానికి మమతపై పోటీకి దిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత సువేంధు అధికారి అక్కడికి వచ్చారు. కానీ ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈమెకు ఒక్కరు కూడా ఓటేయబోరు అని సువేంధు వ్యాఖ్యానించారు. పానీహటిలో బీజేపీ మహిళా అభ్యర్థి, ఆర్జీకర్ బోధనాస్పత్రిలో హత్యోదంతంలో బాధిత వైద్యురాలి తల్లి రత్నా దేభ్నాథ్ కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని నిరసనతెలిపారు. బసంతిలో తమ కారును టీఎంసీ గూండాలు అడ్డుకుని డ్రైవర్ను కొట్టారని బీజేపీ అభ్యర్థి బికాశ్ సర్దార్ ఆరోపించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్జవాన్లు గూండాల్లా ప్రవర్తిస్తూ మహిళా ఓటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. హౌరాలోని సథాఛియాలో నాలుగేళ్ల పిల్లాడిని, ఆమె తల్లిని క్యూవరసలో సరిగా నిల్చోలేదని సీఆర్పీఎఫ్ జవాన్లు విచక్షణారహితంగా కొట్టారని టీఎంసీ ఆరోపించింది. -
ఐదింటిలో మేమే గెలుస్తాం!
వారణాసి/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. వచ్చే నెల 4న వెలువడే ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని, దేశ పురోగతి వేగానికి నూతన శక్తిని ఇస్తాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రధాని బుధవారం ఉత్తరప్రదేశ్లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి హర్డోయిలో జరిగిన సభలో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈసారి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, గత ఏడు దశాబ్దాల్లో ఇది కనీసం కలలో కూడా ఊహించని పరిణామం అని చెప్పారు. ప్రజాస్వామ్య వేడుకలో నేడు ఒక ముఖ్యమైన రోజు అని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు బెంగాల్లో మొదటి దశ పోలింగ్లో జరిగినట్లుగానే రెండో దశ పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతోందని మోదీ తెలిపారు. పోలింగ్ బూత్ల ముందు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయని చెప్పారు. తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలనే ప్రజల ఉత్సాహాన్ని ఈ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని స్పష్టంచేశారు. బెంగాల్లో ఈసారి భయానికి తావులేని వాతావరణంలో ప్రజలు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇది దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక శక్తివంతమైన చిహ్నమని వ్యాఖ్యానించారు. హక్కుల పట్ల అవగాహన కలిగి, పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించిందని మోదీ గుర్తుచేశారు. తాజాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అద్భుత విజయం సొంతం చేసుకుందని తెలిపారు. దాదాపు 85 శాతం మున్సిపాల్టీలు, పంచాయతీలు బీజేపీకే దక్కాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖండ విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. విపక్ష సమాజ్వాదీ పార్టీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను దూషించే డీఎంకే వంటి పార్టీలతో చేతులు కలిపిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ ఓటు వేసిందని ఆక్షేపించారు. గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభం ఉత్తరప్రదేశ్లో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్ప్రెస్ రహదారిని ప్రదాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ ఆరు వరుసల అత్యాధునిక రహదారి మీరట్, ప్రయాగ్రాజ్లను అనుసంధానిస్తుంది. ఈ హైస్పీడ్ కారిడార్ ఉత్తరప్రదేశ్ అంతటా అనుసంధానాన్ని గణనీయంగా పెంచుతుందని, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్, వ్యవసాయ మార్కెటింగ్, ప్రాంతీయ సమతుల్యతకు ఊతం ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) మోడల్ కింద గంగా ఎక్స్ప్రెస్వేను నిర్మించారు. ఇందులో 3.2 కిలోమీటర్ల ఎయిర్స్ట్రిప్ కూడా ఉంది. వాయుసేన విమానాలు అత్యవసర సమయాల్లో దిగేందుకు దీనిని నిర్మించారు.వారణాసిలో మోదీ రోడ్ షో ప్రధాని మోదీ బుధవారం ఉదయం తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు పఠించారు. మోదీకి స్థానిక నాయకులు త్రిశూలం, ఢమరుకం, సంప్రదాయ కండువా బహూకరించారు. బాబా విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేయడం, శివ లింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ పౌరుల సుఖ సంతోషాల కోసం విశ్వనాథుడిని ప్రార్థించానని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వద్ద చిన్నారులతో మోదీ సంభాషించారు. -
ముగిసిన ఎన్నికల రణం
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్లో ఎన్నికలుంటాయని గత నెల 16న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది మొదలు అలుముకున్న ఒక రకమైన యుద్ధ వాతావరణం పరిసమాప్తమైంది. పశ్చిమ బెంగాల్లో బుధవారం ముగిసిన రెండో దశ పోలింగ్లో అనుకున్నట్టే భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. సాయంత్రానికల్లా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలవరకూ చూస్తే దాదాపు అన్ని సర్వే సంస్థలూ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం ఖాయమని తెలిపాయి. తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూనే డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది. బెంగాల్లో తృణమూల్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయని సర్వేలు తేల్చాయి. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు. పోలింగ్ వరకూ చూస్తే మిగిలినచోట్ల దాదాపు ప్రశాంతంగానే ముగిసినా పశ్చిమ బెంగాల్ ఎప్పటిలాగే తనదైన ముద్ర మిగిల్చింది. రెండు దశల్లోనూ హింసాత్మక ఘటనలు తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన హింస చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. కావొచ్చు... కానీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దాదాపు రెండున్నర లక్షలమంది బలగాలను మోహరించటం, ముఖ్యంగా రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భద్రతా బలగాలు అతిగా ప్రవర్తించిన తీరు సబబు కాదు. ఒకరి హింసకు మరొకరి హింస ప్రత్యామ్నాయం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఏకంగా 91 లక్షలమంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటం, ఎక్కడెక్కడికో పనుల కోసం వలసపోయినవారు తిరిగొచ్చి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు సంపాదించలేకపోవటం, దాఖలు చేసినవారు సైతం భంగపడటం ఎందరినో కలవరపెట్టింది. చివరకు తొలి దశలో 139 మంది, మలి దశలో 1,468 మంది మాత్రమే న్యాయసమీక్షలో ఓటుహక్కు పొందారు. ఇక ఈసీ వివాదాస్పద పాత్ర సరేసరి. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కోసం తాను తటస్థంగా వ్యవహరించాలన్న సంగతిని అది మరిచింది. ఈ ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్నట్టు వ్యవహరించింది. నిజానికి 2024 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ పోకడలు కనబడ్డాయి. అధికారుల బదిలీలు మొదలుకొని అనేక అంశాల్లో విపక్షం చెప్పినట్టల్లా ఈసీ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బెంగాల్లో అది మరింత బాహాటంగా జరిగింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ఒకరిద్దరు బెదిరింపు ధోర ణిలో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అందులో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’గా మీడియా చెబుతున్న యూపీకి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏ అభ్యర్థి అయినా సక్రమంగా వ్యవహరించకపోతే, డబ్బు పంచుతుంటే లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం అనుమతించిన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బహిరంగ సవాళ్లు దేనికి? ఇది మంచి సందేశాన్ని పంపదు. ఇతరచోట్ల గణనీయమైన విజయాలు సాధిస్తున్నా... బీజేపీకి మాతృసంస్థ అనదగ్గ జనసంఘ్కు నారూ నీరూ పోసిన స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్లో అది సాధించలేకపోతున్నామని మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి ఒక దశలో ఆవేదన వ్యక్తం చేశారంటారు. ఆయన తొలినాళ్లలో ముఖర్జీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనైనా అదెంతవరకూ సాకారమవుతుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారివి. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న ముఖ్యమంత్రి మమతకు దీటుగా నిలబడగల స్థానిక నాయకులు ఇంతవరకూ బీజేపీకి తారసపడలేదు. అందుకే ప్రచార బాధ్యతల్ని స్వయంగా నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మోయాల్సివచ్చింది. అక్కడొచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాలక, విపక్షాల వ్యూహాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపగలవనటంలో సందేహం లేదు. -
అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారం
డిస్పోర్: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్ పోల్స్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలుఏజీపీ 1-2 స్థానాలుసీపీఐ(ఎం) 0-1 స్థానాలుఐఎన్డీ0-2 స్థానాలుఎన్డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్ 11 స్థానాలు పోటీ చేసింది.కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది. -
బెంగాల్లో ఈ సారి జెండా వారిదే.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?
పశ్చిమబెంగాల్లో రికార్డులు బద్దలయ్యాయి. స్వాత్యంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ శాతం జరిగిన ఎన్నికలుగా పశ్చిమబెంగాల్ ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానే వచ్చాయి. చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్టీఎంసీ-130-140బీజేపీ- 150-160 కాంగ్రెస్2-4పీమార్క్ ఎగ్జిట్ పోల్స్TMC 118-138BJP 150-175CONG 2-6దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే పూర్తి వివరాలురాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు.అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది. ఇక్కడ దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది..మైనార్టీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని ప్రెసిడెన్సీ డివిజన్లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పై చేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది. సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజిక వర్గం ‘సర్’ పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు.అని సర్వే చెబుతోంది.రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు.‘సర్’ తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది. టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ జాతీయ వాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఏవరూ లేరు. కాగా స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి. బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది. కాగా ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే చాలా సార్లు ఇవి తారుమారైన సందర్బాలున్నాయి. వాస్తవిక ఫలితాలు మే 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. -
బెంగాల్ పోరులో ఒక సెన్సేషన్ కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ డొమెస్టిక్ వర్కర్ (Domestic Worker) పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇళ్లలో పాచిపని చేస్తూ అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఆమె, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిమిత వనరులతో జీవిస్తున్న లక్షలాది మందికి బెంగాల్ ఎన్నికల్లో కలితా మాఝీ ఎంట్రీ స్ఫూర్తివంతంగా నిలుస్తోంది. నేటికీ ఆమె ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్, లేదా ఎయిర్ కండిషనింగ్ వంటి కనీస సౌకర్యాలు లేవు. అయినప్పటికీ, ఆమె నిరాడంబరత, అవిశ్రాంత పోరాటం ఆమెకు గుర్తింపును, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించిపెట్టాయి. ఒకప్పుడు నలుగురి ఇళ్లలో అలసిపోకుండా పాత్రలు కడిగిన అవే చేతులు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, మార్చడానికి సిద్ధంగా ఉన్నాయిపశ్చిమ బెంగాల్లోని ఔస్గ్రామ్ (Ausgram) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 37 ఏళ్ల కలితా మాఝీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదరికం నుండి వచ్చి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయి నుండి ఎదిగిన నాయకురాలిగా గుర్తించిన బీజేపీ ఆమె రెండోసారి పోటీలో నిలపడం విశేషం. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2026లో కూడా పార్టీ ఆమెపై నమ్మకంతో మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఇంటింటి ప్రచారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఆమెకు భర్త (ప్లంబర్), ఒక కుమారుడు ఉన్నారు.ఆమె పనిచేసే ఇంటి యజమాని ప్రతీలాల్ పాత్ర మాట్లాడుతూ.. "ఆమె మాకు కూతురు లాంటిది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె పనికి వస్తానంది, కానీ మేమే ఆమెను ప్రచారానికి వెళ్లమని పంపించేశాం. ఆమె లేకపోవడంతో ఇంట్లో పనులు చేసుకోవడం మాకు కష్టమవుతోంది, కానీ ఆమె ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాం" అన్నారు. అంతేకాదు ఆమె ప్రచారంలో తలనమునకలై ఉన్నప్పటికీ, ఆమె యజమానులు ఈ నెల జీతాన్ని కూడా ఇస్తామని హామీ ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కుఎవరీ కలితా మాఝీఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన కలితా ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ, నెలకు సుమారు రూ.4,500 సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. కలిత తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో తాను పనిచేసే ఇళ్లలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఇపుడు ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. కలితా కుటుంబ మద్దతు కూడా బాగానే లభిస్తోంది. ఆమె అత్తగారు ఇంటి పనుల్లో సాయం చేస్తుండగా, ఆమె కుమారుడు పార్థ తన తల్లి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కలిత బావ కార్తీక్ బాగ్ 2006లో ఇదే నియోజకవర్గం నుండి సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబంతో వీరికి ఎటువంటి సంబంధం లేదు.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు"నాలాంటి ఒక సామాన్య మహిళ కూడా ఎమ్మెల్యే కాగలదని నిరూపించాలనుకుంటున్నాను. గెలిచిన తర్వాత నాలాంటి పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతాను" అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఆల్ది బెస్ట్ చెబుతున్నారు. కలిత గెలుపు కోసం మే 4 వరకు ఎదురు చూడాల్సిందే. కాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 91.78శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంఓలని అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీదీని ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, షాలు తీవ్రప్రయత్నాలు చేయగా, నాలుగోసారి సీఎం పదవే తనదేనని దీదీ ధీమాగా ఉన్నారు. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఇదీ చదవండి: బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. మమతా బెనర్జీ ఓటమి ఖాయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ చక్రబేరియా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తమైంది.స్థానిక టీఎంసీ నాయకులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ కార్యాలయం బయట కూర్చుని ఉండగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సువేందు అధికారి ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకి ఒక్క ఓటు పడటం లేదని మమతా బెనర్జీ గ్రహించారు’ అని ఆయన ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీ, కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారులను ఉపయోగించి బీజేపీ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ భయపడుతున్నారు. ఆమె పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలను నియమించారు. ఇక్కడ ఈసీ సీఏపీఎఫ్లను మోహరించింది. ఆమెకు ఏమైనా సమస్య ఉంటే వారిని సంప్రదించాలి. కానీ ఆమెతో పాటు 40-50 మందిని ఎందుకు తీసుకువస్తున్నారు?’అని ప్రశ్నించారు.అలాగే, సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ మమతా యాబై, అరవై మంది గూండాలతో తిరుగుతున్నారు. ఆమె ఒక అభ్యర్థి కాబట్టి బూత్లను సందర్శించవచ్చు. కానీ ఈ గూండాగిరి ఎందుకు? నేను కోల్కతా డీఈఓకు ఫిర్యాదు చేశాను. ఈసారి ఎవరినీ బెదిరింపులకు పాల్పడటానికి అనుమతించబోము’అని అన్నారు. ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి. నేను భవానిపూర్లో కనీసం 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను’అని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.ఇక మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నేను చెట్లా, పద్మపుకూర్, చక్రబేరియా ప్రాంతాల్లోని బూత్లను సందర్శించాను. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గూండా రాజ్ ఉందా?’అని ప్రశ్నించారు. -
పోలింగ్ బూత్ లో 'కమలం' గుర్తుపై స్టిక్కర్లు..
-
పార్టీ మార్పు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారాయన. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది.. మోదీని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబం ఇటీవల ప్రధాని మోదీని కలిసింది. అంతకు కొన్నిరోజులు ముందే.. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను పొగుడుతూ కామెంట్లు చేశారు. ఆ వెంటనే ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. దీంతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. తాము మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభించబోయే ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం ప్రధానిని కలిశామని.. బీజేపీ మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలనూ కలిసి ఆహ్వానిస్తామని ప్రీతిరెడ్డి తర్వాత క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తనకు ఇంకా టైం ఉందన్న ఆమె.. బీఆర్ఎస్ అంటే తమ కుటుంబానికి గౌరవం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
బెంగాల్ దంగల్ మోదీకి దీదీకి మధ్య యుద్ధం
-
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్తోనే లోక్సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్ను టేప్తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
బీజేపీ ఎమ్మెల్యే అనుపమకు అఖిలేష్ పరామర్శ
సమాజ్వాదీ పార్టీ అధినేత, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ రాజకీయ ప్రత్యర్థులకు సర్ప్రైజ్ ఇచ్చారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుపమ జైస్వాల్ను పరామర్శించారు. అఖిలేష్ దిష్టిబొమ్మను తగలబెడుతున్న సమయంలోనే ఆమె గాయపడడం గమనార్హం.మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో సమాజ్వాదీ పార్టీ తీరును నిరసిస్తూ శనివారం బహ్రైచ్లో బీజేపీ ‘మహిళా జనాక్రోశ్ మార్చ్’ నిర్వహించింది. అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుపమ ముఖం మీద మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆమెను హుటాహుటినా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముఖంపై 75 శాతం కాలిన గాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెటాండా ఆస్పత్రికి తరలించారు. #BREAKING : Former minister Anupama Jaiswal injured in Bahraich after effigy-burning protest goes wrong. The incident occurred at DM Chauraha, and she has been admitted to the local medical college with burn injuries to her face.#Bahraich #AnupamaJaiswal #Protest… pic.twitter.com/7y53mXmr1c— upuknews (@upuknews1) April 25, 2026మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన అఖిలేష్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. అనుపమ భర్త, కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆయన రాకతో ఆస్పత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైద్యులు అంతా కలిసి ఆయనతో పొటోలు దిగారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదిక Xలో “సమాజంలో విభేదాల మంటలు కాకుండా.. సఖ్యత, శ్రేయస్సు ఉండాలి. రాజకీయాలకు ఒక స్థానం ఉంది. కానీ మానవ సంబంధాలు కూడా అంతే ముఖ్యమైనవి” అని పోస్ట్ చేశారు. జైస్వాల్ భర్త అశోక్ జైస్వాల్ ఈ పరామర్శను ప్రజాస్వామ్య మర్యాదగా అభివర్ణించారు. हम नहीं चाहते हैं कि समाज के बीच आग जले। हम चाहते हैं समाज में सौहार्द की फुहार हो। हमारी सकारात्मक राजनीति की स्वस्थ परंपरा ने हमें यही सिखाया है। इसीलिए हम भाजपा विधायक श्रीमती अनुपमा जायसवाल जी से मिलने गये और उनके शीघ्र स्वास्थ्य लाभ की कामना करके आएं हैं। राजनीति अपनी जगह है… pic.twitter.com/4lfmjx5HoK— Akhilesh Yadav (@yadavakhilesh) April 28, 2026అంతకు ముందు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌధరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, లక్నో మేయర్ సుష్మ ఖర్క్వాల్ తదితరులు కూడా అనుపమను పరామర్శించారు. -
మలి యుద్ధం నేడే
కోల్కతా: దశాబ్దన్నరకాలంగా పశ్చిమబెంగాల్ రాజకీయాలను శాసిస్తూ అధికారపీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృతప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాళీలను మెప్పించానని చెబుతూ ప్రచారంచేసిన దీదీ మాటలు ఓట్లరూపంలో ఏమేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన తొలిదఫా పోలింగ్లో భారీ ఓటింగ్ నమోదుకావడంతో ఇది ప్రభుత్వవ్యతిరేక సరళి అని ఢంకా భజాయించిన బీజేపీ నేతలు అదేఊపుతో దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ విస్తృత ప్రచారంచేశారు.అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలైన కోల్కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది. నేడు పోలింగ్ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ గెలిచాయి. గత ఐదేళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకుంది. అయినాసరే ఈసారి కూడా ఉత్తర 24 పరగణాలు(33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు(31 సీట్లు), హౌరా(16), నదియా(17), హుగ్లీ(18), పూర్బా బర్ధమాన్(16), కోల్కతా(11 సీట్లు) ఈదఫా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారాయి.నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులుకాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,001 పోలింగ్స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన మథువా హిందూ శరణార్థులు, పౌరసత్వ సవరణ చట్టం, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటం వంటివి బీజేపీకి ఈదఫా సానుకూల అంశాలుగా కన్పిస్తున్నాయి. పదేళ్లు పాలించిన 2021లో మమతను మళ్లీ బెంగాళీలు గెలిపించడం తమ పార్టీకి ఇంకా అత్యంత ప్రజాదరణ ఉందని టీఎంసీ ప్రకటించింది. అదేఊపుతో నాలుగోసారి నెగ్గుకురాగలమనే ధీమా పార్టీలో ఎక్కువైంది. అయితే కట్ మనీ, బొగ్గు కుంభకోణం, పథకాల్లో అవినీతి, టీఎంసీ గూండాయిజం, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి ముస్లింల చొరబాట్లు, ఖాళీ ప్రాంతాల ఆక్రమణల అంశాలు ఈసారి టీఎంసీకి వ్యతిరేకతను పెంచేలా కన్పిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు కీలక జిల్లాల్లో చాలా ప్రచారసభల్లో పాల్గొని భారీ స్థాయిలో హామీల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ సైతం టీఎంసీ తరఫున సుడిగాలి పర్యటనలు చేసి మరోమారు తన పార్టీని ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను వేడుకున్నారు. ఎక్కడా అవాంఛనీయఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నడూలేనంతటి భారీ సంఖ్యలో కేంద్రరిజర్వ్ బలగాలను పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మోహరించింది.తొలి దశ ఎన్నికల్లో 93.19 శాతం పోలింగ్ నమోదవడంతో రెండోది, చివరిదైన ఈ దఫాలో ఎంతటి పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కంచుకోట భవానీపూర్ నుంచి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు. బెంగాళీలు, గుజరాతీలు, మార్వాడీలు, జైనులు, సిక్కులు, ముస్లింలు, బిహార్, జార్ఖండ్ శరణార్థులతో నిండిన భవానీపూర్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది. -
ఫిరాయింపులు... ప్రశ్నలు!
ఆప్ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకోవటంతో ఫిరాయింపుల చట్టం ప్రహసనప్రాయమని మరోసారి తేలిపోయింది. బహుశా ఎన్నికల ముంగిట్లోవున్న పంజాబ్లో రేపో మాపో ఆప్ ప్రభుత్వానికీ ఇలాంటి గండం తప్పకపోవచ్చు. ఆప్ పుట్టుక, ఎదుగుదల భిన్నమైనవి. 2011–12 మధ్య దేశంలో హోరెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన కొద్దిమంది రాజకీయేతర నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ఆయన మాదిరే పూర్వాశ్రమంలో ఉన్నతోద్యోగ వర్గంలో, భిన్న సామాజిక రంగాల్లో పనిచేసి కొన్ని ఆదర్శాలు నమ్మి వచ్చినవారు చాలామంది ఉన్నారు. ఆదర్శాల్లో పుట్టి, వైవిధ్యాలతో ఎదిగి, స్వల్పకాలంలోనే మధ్యతరగతిలో పాతుకుపోయిన ఆ పార్టీ అచిరకాలంలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ సారథుల్లో భిన్నాంశాలపై అప్పటికే ఉన్న మౌలిక విభేదాలు పలు నిష్క్రమణలకు దారితీశాయి. శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అడ్మిరల్ రాందాస్ వంటి లబ్ధప్రతిష్టులైనవారిని కీలక పదవులనుంచి తప్పించారు. కొందరు వారికై వారు తప్పుకున్నారు. అటు తర్వాత మధ్యలో అడపా దడపా ఒకరిద్దరు నేతలు నిష్క్రమించినా ఇప్పుడు రాఘవ్ చడ్డా కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఒక సమస్య విషయంలో పార్టీ వైఖరితో ఏకీభావం లేనప్పుడూ, దాని సిద్ధాంతాలు దారితప్పుతున్నాయనుకున్నప్పుడూ బయటకుపోతే ఎవరూ తప్పుబట్టరు. కానీ పెద్ద మాటలు మాట్లాడుతూ, గంభీరమైన ఉపన్యాసాలిస్తూ కాస్తయినా నైతికత పాటించాలన్న స్పృహ లేనివారిని జనం చీదరించుకుంటారు. ఒక సాధారణ గుమాస్తా సంస్థ నుంచి తప్పుకుంటే మూణ్ణెల్ల నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఉంటుంది. లేకుంటే సంస్థలు వాటి పద్ధతిలో అవి చర్య తీసుకుంటాయి. ప్రజానీకం సమస్యల్ని చర్చిస్తూ వారి సంక్షేమానికీ, భద్రతకూ అవసరమైన చట్టాలు తీసుకొచ్చే కర్తవ్యంలో నిమగ్నమై ఉండాల్సినవారికి మాత్రం ఏ నిబంధనా ఉండొద్దా? వారి ప్రవర్తన నలుగురికీ ఆదర్శప్రాయం కావొద్దా?రాజీవ్ గాంధీ హయాంలో 1985లో ఈ ఫిరాయింపుల జాడ్యాన్ని వదిలిస్తామంటూ 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగంలో పదో షెడ్యూల్ చేర్చారు. కానీ అది ఎందుకూ కొరగాకుండా పోయిందని తేలిన చాన్నాళ్ల తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ వచ్చింది. అందులో కేవలం లెజిస్లేచర్ పార్టీలో మూడింట రెండొంతుల మంది తప్పుకుని వేరే పార్టీలో విలీనమైతే సరిపోదనీ, ఆ చీలిక, విలీనం పార్టీ స్థాయిలో కూడా కనబడాలనీ నిర్దేశించింది. దురదృష్టమేమంటే... ఈ ప్రాతిపదికన ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని మన న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు లేవు. ఫిరాయింపు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని సభాధ్యక్షుల దగ్గర ఫిర్యాదులైతే దాఖలవుతున్నాయి. కానీ వాటిపై వేగంగా నిర్ణయం తీసుకున్న ఉదంతాలు లేవు. సుప్రీంకోర్టు గడువు విధించటంతో తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ బీఆర్ఎస్ వినతుల్ని ఆయన తోసిపుచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ లోక్సభలోనూ, ఏపీ అసెంబ్లీలోనూ చేసిన ఫిర్యాదులు తేలకుండానే ఆ సభల పదవీకాలం ముగిసిపోయింది. ఫిరాయించటానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోవటం నేతలకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఏపీలో ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు ఏకంగా అయిదేళ్లకు మించి గడువున్న ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి పోయారు. ఆ తర్వాత వారిలో కొందరు బీజేపీ, టీడీపీల పంచన ‘ఎన్నికయ్యారు’. నైతిక విలువలు లేకపోవటమే పెద్ద అర్హతగా మారిన వర్తమానంలో ఇలాంటి వెర్రిమొర్రి పోకడలు కనబడటం వింతేం కాదు. రాఘవ్ చడ్డా నిష్క్రమించదల్చుకున్నప్పటి నుంచీ మధ్యతరగతి పెను సమస్యలుగా భావించేవాటిని సభలో ప్రస్తావించటం, వాటిల్లో కొత్తేం లేకపోయినా అవి వైరల్ కావటం వెనకున్న సారాంశం చాలామంది గ్రహించకపోలేదు. ఏదేమైనా ఫిరాయింపులకు కళ్లెం పడనంత కాలమూ, ఈ గోడ దూకుళ్లు ఆగనంత కాలమూ మన ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండదు. -
జయంతి శెట్టి ముందు ఎమ్మెల్యే సాష్టాంగ నమస్కారం
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని ఉడుపి జిల్లా బైందూర్ తాలూకా శిరూర్ ప్రభుత్వ పాఠశాల.గతేడాది ఈ పాఠశాల పదోతరగతి ఫలితాల్లో విద్యార్థులు కేవలం 35శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ ఏడాది అదే పాఠశాల విద్యార్థులు 94శాతం ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మొత్తం 53 మంది విద్యార్థులలో 50 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2 మంది డిస్టింక్షన్, 29 మంది ఫస్ట్ క్లాస్ సాధించారు.ఈ ఫలితాల వెనుక ప్రధాన కారణం ఉపాధ్యాయుల కృషి. ముఖ్యంగా వైస్ ప్రిన్సిపాల్, సైన్స్ టీచర్ జయంతి శెట్టి ప్రతిరోజూ సాయంత్రం 5:30 వరకు అదనపు తరగతులు నిర్వహించారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రుల మద్దతు పొందేందుకు ఆమె స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఈ విధంగా పాఠశాల, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి చేసిన ప్రయత్నం ఊహించని విజయాన్ని తీసుకొచ్చింది.విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని గుర్తించిన బైందూర్ ఎమ్మెల్యే గురురాజ్ గంటిహోలే పాఠశాలను సందర్శించారు. ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి, జయంతి శెట్టి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది.గతేడాది బైందూర్ పదోతరగతి పేలవమైన ఫలితాలపై జిల్లా పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఎమ్మెల్యే గురురాజ్ సమీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయులు విద్యార్థుల ఫలితాలు మెరుగుపరచాలని కోరారు. అదే సమయంలో విధుల్లో భాగంగా జయంతి శెట్టి ఈ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆమె కృషి ఫలితంగా విద్యార్థులు ఊహించని విజయాన్ని సాధించారు.కర్ణాటక పదోతరగతి ఫలితాల్లో ఈసారి 94.1శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత సంవత్సరం 80శాతం నుండి ఇది గణనీయమైన పెరుగుదల. అనేక పాఠశాలలు 100శాతం ఫలితాలను సాధించాయి.Recently, this video circulated on WA. It shows a school that improved its Class 10 pass rate from 35% to 94%. The MLA at that time was disappointed with the school’s progress; now, returned and recognised their efforts w/ full respect. This is the school where my mom studied too pic.twitter.com/FgiDzYKrxA— Ar. Namrata S Rao (@nemo_rao) April 28, 2026 -
మరో ఇద్దరు ఎంపీల జంప్?.. ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసిన ప్రతిపక్షం
చండీగఢ్: మాకు ఇప్పుడే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది అంటూ పంజాబ్ ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మజీతియా సోషల్ మీడియాలో ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు. ‘రాష్ట్రంలో మీ పార్టీ పని అయిపోయింది. మొన్న పార్టీ మారిన ఏడుగురే కాదు, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ మారబోతున్నారు. అలెర్ట్ అవ్వండి’ అని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో మరో ఇద్దరు లోక్సభ సభ్యులు కూడా త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీని వీడవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి. తరచూ ఆప్ను వీడే నేతల జాబితా పెరుగుతుండగా, మజీతియా ఈ విషయాన్ని కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అయితే, ఆప్ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.గత వారం యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్ను వీడి బీజేపీలో చేరారు. ఫలితంగా ఆప్ రాజ్యసభలో పార్టీ బలంలో మూడింట రెండు వంతులు కోల్పోయింది. చద్దా తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించగా, ఆప్ మాత్రం ఆయనను ద్రోహిగా అభివర్ణించింది. -
బెంగాల్కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యూపీకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ.. అధికార టీఎంసీ అభ్యర్థికి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.ఆకతాయి పనులొద్దుఫల్టా నియోజకవర్గంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు.. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అజయ్ పాల్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. జహంగీర్ నివాసానికి చేరుకున్న ఆయన, అక్కడ అభ్యర్థి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘జహంగీర్కు స్పష్టంగా చెప్పండి.. ప్రజలను బెదిరించినట్లు మళ్లీ ఫిర్యాదులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడినా, ఓటర్లను వేధించినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.భద్రతపై అనుమానాలు.. ఎస్పీకి నోటీసులుజహంగీర్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది వివరాలను కూడా శర్మ ఆరా తీశారు. అక్కడ 14 మంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉండటాన్ని గమనించిన ఆయన స్థానిక ఎస్పీ నుంచి వివరాలు కోరారు. అయితే, జహంగీర్కు ఉన్న వై-కేటగిరీ భద్రత కింద కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో మంజూరైన దానికంటే అదనంగా నలుగురు పోలీసులను ఎందుకు మోహరించారనే దానిపై వివరణ కోరుతూ శర్మ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భగ్గుమన్న టీఎంసీఈ సంఘటనతో బెంగాల్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. శర్మ చర్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్వాగతిస్తూ.. ‘బెదిరింపుల శకం ముగిసింది, చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని అన్నారు. మరోవైపు టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద ఎన్కౌంటర్లతో పేరుగాంచిన అధికారిని ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నియమించిందని, ఆయన నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని విమర్శించింది.ఇది కూడా చదవండి: Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి -
దక్షిణ కోట ఎవరికి దక్కేను?
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల చదరంగంలో గెలుపు పావులను ఉత్తరబెంగాల్ కొండ ప్రాంతాలు, జంగల్మహల్ అటవీప్రాంతాల్లో కాకుండా దక్షిణబెంగాల్ మైదానప్రాంతాల్లోనే కీలక పార్టీలు మొహరిస్తుంటాయి. ఈసారి కూడా అదే ఆట మొదలైంది. జంట జిల్లాలైన ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో, కోల్కతా, హౌరా ప్రాంతాల్లో గెలుపు అనేది అధికారపీఠానికి రాచబాటగా చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాలపై తృణమూల్కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేయగా ఈసారి జెండా కిందకు దింపి కాషాయజెండా రెపరెపలాడేలా చేస్తామని కమలదళ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఉత్తర 21 పరగణాల జిల్లాలో 33 సీట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 31 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు అనేది అత్యంత కీలకం. కోల్కతా నగర పరిధిలోని 11 సీట్లు, హౌరా నగర పరిధిలోని 16 సీట్లు కూడా కలుపుకుంటే కీలక నియోజకవర్గాల సంఖ్య 91కి పెరుగుతోంది. 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇవి మూడింట ఒకవంతు స్థానాలతో సమానం. అలా ఇవి ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలను యావత్ రాష్ట్రంలోని కీలక జిల్లాలుగా చెబుతుంటారు. పెద్ద ప్రెసిడెన్సీ డివిజన్గా కొనసాగుతున్న కోల్కతా, హౌరా, నదియా, నార్త్, సౌత్ 24 పరగణాల్లో మొత్తంగా 111 సీట్లున్నాయి. వీటిని గెలిస్తే రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అధికారం చక్రం తిప్పొచ్చని అటు టీఎంసీ, ఇటు బీజేపీ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ 111 స్థానాలకుగాను 2021 ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 96 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) ఒకే ఒక్క చోట గెలిచింది. ఇంతటి కీలక దక్షిణబెంగాల్ను గుప్పిటపట్టకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ బలం పుంజుకుంది. ఇక్కడి 21 సెగ్మెంట్లలో బీజేపీ హవా కొనసాగింది. నదియా, ఉత్తర 24 జిల్లాల్లో బీజేపీ, దక్షిణ 24, హౌరా, కోల్కతాల్లో టీఎంసీ సత్తాచాటాయి. ఇక్కడి మెజార్టీ స్థానాల్లో గెలిచి నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. ‘‘ఇక్కడి స్థానాలను పదిలపర్చుకుంటే అధికారం మనదే. ఇవి కేవలం సీట్లు కాదు. మమతా బెనర్జీ రాజకీయ ఎత్తులకు సామాజిక వేదికలు’’అని టీఎంసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘మాకూ ఈ స్థానాలు చాలా ముఖ్యం. నార్త్ 24 పరగణాల జిల్లాలో మతువాలు, శరణార్థుల ఓట్లను కొల్లగొడితే మాకు పని సులువు అవుతుంది’’అని బీజేపీ సీనియర్ నేత చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంతం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండేది. 2006లో సీపీఐ(ఎం) లెఫ్ట్ కూటమి ఏకంగా 72 చోట్ల గెలిచింది. కానీ సచార్ కమిటీ నివేదిక తర్వాత ముస్లింలు లెఫ్ట్పార్టీలకు ముఖంచాటేశారు. సింగూర్–నందిగ్రామ్ ఉద్యమం తర్వాత మమతబెనర్జీ హవా కొనసాగి ఈ ప్రాంతంపై టీఎంసీ పట్టుసాధించింది. ఇప్పుడీ ప్రాంతం మమత ప్రభుత్వానికి రాజకీయ ఇంజిన్గా మారింది. 2008లో దక్షిణ 24 పరగణాలు, పూర్బా మేదినీపూర్ జిల్లా పరిషత్లను గెల్చుకుని టీఎంసీ ఇక్కడ పాగావేసింది. నార్త్ 24 పరగణాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిన శరణార్థులు ఎక్కువ. ఇక్కడి మతువాలు 14 సీట్లలో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్గా ఉన్నారు. వీళ్లందరికీ పౌరసత్వం ఇస్తామని, సీఏఏ అమలుచేస్తామని బీజేపీ చేసిన వాగ్దానాలు పనిచేశాయి. దీంతో 2021లో ఇక్కడి ప్రెసిడెన్సీ డివిజన్లో బీజేపీ గెల్చింది. 2024 లోక్సభ ఎన్నికలవేళ నదియాలోని 11 అసెంబ్లీ, నార్త్ 24 పరగణాల్లో ఎనిమిది సెగ్మెంట్లలో బీజేపీ ఓట్ల శాతం మెరుగుపడింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే అమలుతో సమీకరణాలు మారిపోయే అవకాశముంది.ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 29న జరగబోయే రెండో దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారంతో ముగిసింది. 142 స్థానాలకుగాను ఈసారి 41,001 పోలింగ్ స్టేషన్లలో 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 1,64,35,627 మంది పురుషులుకాగా, 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొదటిదశ మాదిరే రెండో దశ పోలింగ్నుప్రశాంతంగా చేపట్టేలా హింసకు తావులేకుండా 2,321 కంపెనీల కేంద్రబలగాలను ఎన్నికలసంఘం పోలింగ్ స్థానాల్లో మొహరించింది. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్లు సైతం ఆయా ప్రాంతాల్లో పహారాకాస్తున్నాయి. భంగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కంచుకోట భవానీపూర్ నుంచి సీఎం మమతాబెనర్జీ మరోసారి పోటీకి నిలబడ్డారు. మైనార్టీలు అత్యధికంగా ఉండే కోల్కతా పోర్ట్ నియోజకవర్గంలో టీఎంసీ తరఫున ఫిర్హాద్ హకీం, బీజేపీ తరఫున రాకేశ్ సింగ్ నిలబడి పోటీకి రసవత్తరంగా మార్చారు. భాత్పారా, జగత్దల్, బరాక్పూర్, బంగావ్, డమ్డమ్, సందేశ్ఖాలీ, హింగల్గంజ్, రాణాఘాట్ ఉత్తర్, దక్షిణ్, రాశ్బెహారీ, జాదవ్పూŠ, బలేగంజ్ స్థానాల్లో బలమైన నేతలు పోటీపడుతున్నారు. -
బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాను వెళ్లిన ప్రతిచోటా ప్రజల నాడిని గమనించానని, బీజేపీ విజయం ఖాయమని తేలిపోయినట్లు వెల్లడించారు. మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్కు తిరిగి వస్తానని ప్రకటించారు. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. సిండికేట్ రాజ్, రాజకీయ హింస, చొరబాట్లు, ఆర్థిక పతనానికి తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోందని మండిపడ్డారు. తూర్పు భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రగతి దేశ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. తూర్పు ప్రాంతం తన చారిత్రక బలాన్ని, ప్రతిష్టను తిరిగి పొందాలని ఆకాంక్షించారు. మా, మాటీ, మానుష్ ను వదిలేశారు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ అభివృద్ధి తిరుగుముఖం పట్టింది. బెదిరింపులు, దూషణలు, అబద్ధాలకు ఆ పార్టీ పర్యాయపదంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు నన్ను, రాజ్యాంగబద్ధ సంస్థలను, చివరికి సాయుధ దళాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇష్టానుసారంగా దూషించారు. గత 15 ఏళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్న నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేడు వదిలేసింది. మా, మాటీ, మానుష్ను పక్కనపెట్టారు. మహిళలు, రైతులు, యువత కోసం చేసిందేమీ లేదు. ఇది మోదీ గ్యారంటీ కోల్కతాను లండన్లా మారుస్తామని టీఎంసీ హామీ ఇచ్చింది. కానీ, చొరబాటుదార్లకు అడ్డాగా మార్చేసింది. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తాం. భారతదేశ పౌరులకు రక్షణ కల్పిస్తాం. కుల, మతాలకు అతీతంగా భారతీయులకు రక్షణ ఉంటుంది. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పిస్తాం. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. ఇప్పుడు బెంగాల్ వంతు గతంలో భారతదేశం సుసంపన్నంగా ఉన్నప్పుడు.. దానికి అంగ, బంగా, కళింగ(నేటి బిహార్, బెంగాల్ ఒడిశా) అనే మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. ఈ మూలస్తంభాలు బలహీనపడినప్పుడు దేశానికి పెద్ద దెబ్బ తగిలింది. తూర్పు ప్రాంతాల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి అసంపూర్ణం. బిహార్, ఒడిశాలో కమలం వికసించింది. ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చింది. ఇక్కడి పరిస్థితి చూస్తూ ఉంటే కమల వికాసానికి అడ్డే లేదని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్కు సేవ చేయడం, భద్రత కల్పించడం, కాపాడడం నా కర్తవ్యం, బాధ్యత’’అని మోదీ స్పష్టంచేశారు.తీర్థయాత్రలాగ గడిచిందిఆడియో సందేశం, బహిరంగ లేఖ విడుదల చేసిన మోదీ పశ్చిమ బెంగాల్లో ర్యాలీల్లో ప్రసంగించినప్పుడు, రోడ్ షోల్లో పాల్గొన్నప్పుడు తాను ఒక తీర్థయాత్రలో ఉన్నట్లుగా భావించానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారమంతటా కాళీమాత భక్తుల నుండి లభించిన దైవిక శక్తి, ప్రజల ఆశీర్వాదాలు తనకు ఎంతో బలాన్నిచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ఒక ఆడియో సందేశం, బహిరంగ లేఖను విడుదల చేశారు. బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని పునరుద్ఘాటించారు. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకను ప్రజలతో కలిసి జరుపుకుంటానని వివరించారు. తీవ్రమైన ఎండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తనకు ఏమాత్రం అలసట అనిపించలేదని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొనడం తీర్థయాత్రకు వెళ్లిన భావన కలిగించిందని స్పష్టంచేశారు. -
బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్హౌస్లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... అంతా ఆ తానులోని ముక్కలే... ‘బీఆర్ఎస్కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే. వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా... కేసీఆర్ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్చానెల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్హౌజ్లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్లో లేరు. కేసీఆర్కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి. కోర్టు ఏం చెప్పింది..? కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై కేసీఆర్, హరీశ్రావులు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్ రిలీఫ్ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్ సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్ చేయాలా? ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. ఎలిమినేషన్ జరుగుతోంది రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి. ఆ నాలుగు వేటికవే..! దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్ఎస్ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్ది చిల్లర ప్రభుత్వం’అని ధ్వజమెత్తారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు’అని అన్నారు. -
బిల్లు పాస్ అయ్యి ఉంటే అయ్యో.. రాఘవ
-
టవర్లు దిగాల్సిన ఏపీ ‘క్వాంటమ్ టెక్’
ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీ అమలు చేయాలంటే, దాన్ని ప్రభుత్వ శాఖలు పాటించేట్టుగా చేయాలా,‘ప్రైవేట్’గా అయినా ఫర్వాలేదా అనే చర్చకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ ‘కూటమి’తో కలిశాక, ఈ ‘ప్రైవేట్’ ధోరణి మరింత స్పష్టంగా ఉంది. ఏదైనా ఇది ‘ప్రైవేట్’గా ఉందేమీ అనిపిస్తే... అది రాజధానికి కోసం కదా, అని ఎవరికి వారు జవాబు చెప్పుకోవలసి వస్తున్నది. అమరావతిలో ఇండియాలో తొలి ‘క్వాంటమ్ వ్యాలీ’ అన్నప్పుడు... ‘యూజర్లు’ రాష్ట్రంలో లేక దానిపై పెద్దగా చర్చకాలేదు. ఎక్కడైనా ఒక కొత్త ‘టెక్ ఫెసిలిటీ’ వస్తుందంటే, దానిపై స్పందించేది ‘యూజర్ల’ కంటే ముందు ఆ ‘ట్రేడింగ్ కమ్యూనిటీ’. మరి పరిశ్రమ రంగానికి ‘సీఐఐ’ లాగా సాఫ్ట్వేర్ రంగానికి ‘నాస్కామ్’ ఉన్నా దీనిపై దాని స్పందన లేదు. ఏప్రిల్ 14న ఏపీలో జరిగిన ఈ ప్రారంభానికి ఢిల్లీ ఐటీ మంత్రిత్వశాఖ నుంచి ఇద్దరు అధికారులు, చెన్నై ఐఐటీ నుంచి ఒక ప్రొఫెసర్ హాజరయ్యారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఇందులో ఉందని చెబుతున్నా, ‘నాస్కామ్’ ఊసు లేకపోవడంతో ఇది – ప్రైవేట్ యూనివర్సిటీల్లో ‘అకడమిక్స్’కే పరిమితమా అనే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం మంగళగిరి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనూ, గన్నవరం మేధా టవర్స్ హెచ్సీఎల్ టెక్నాలజీస్లోనూ ‘క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్’ ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రారంభానికి నాలుగు రోజులు ముందు సీఎంవో అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, పాత ‘క్లాసికల్ కంప్యూటర్ చేసేవన్నీ ‘క్వాంటమ్ కంప్యూటర్’ చేస్తుందనీ, కానీ ఇది వేగంగా ‘అపరేషన్స్’ పూర్తిచేస్తుందనీ, ఇది వచ్చాక కూడా పాత ‘కంప్యూటింగ్’ విధానం ఉంటుందనీ, కృత్రిమ మేధ, రక్షణ, కమ్యూనికేషన్, మెరుగైన హెల్త్ కేర్ టెక్నాలజీకి ఇది దోహదపడుతుందనీ అన్నారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు అంటే, అదెప్పుడు రావాలని కోరుకునేదే. అయితే, దేశంలోకి దీన్ని తెచ్చే ‘క్రెడిట్’ ముందు ఏపీ తీసుకోవాలి అనుకుంటే, క్షేత్రస్థాయిలో దీని వినియోగం (అప్లికేషన్) విషయంలో కూడా ప్రభుత్వం ముందుగానే కసరత్తు చేయాల్సింది. అప్రమత్తత ఉందా?ఇలా అనడానికి కారణం ఉంది. హెల్త్ కేర్ టెక్నాలజీ అన్నప్పుడు, మనకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వద్ద ‘కిడ్నీ’ రోగుల సమస్య ఉంది. మార్కాపురం వద్ద ‘ఫ్లోరైడ్’ సమస్య ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ‘డేటా’లో తేడాల విషయం తరుచూ కేంద్రం సమీక్షలకు గురవుతూ ఉంది. వీటిని ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ ద్వారా ‘రియల్ టైమ్’లో సరిచేయడానికి సమాంతర ప్రయత్నం జరిగితే, ‘అది పై నుంచి కిందికి’ అనే అనుసరణీయ సూత్రంవర్తించే నిర్ణయం అయ్యుండేది. ఇక్కడే మాట్లాడుకోవలసిన విషయం మరొకటి ఉంది. కొత్త ‘టెక్నాలజీ’ని తీసుకు రావడమంటే, ప్రభుత్వాలు ఎంత అప్రమత్తతతో ఉండాలో గ్రహించే సందర్భం కూడా అనుకోకుండా ఇదే తేదీల్లో సంభవించింది. జరిగింది ఏమిటి? ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) రంగంలో కీలక పరిణామంగా ‘ఆంత్రోపిక్’ తన కొత్త ఏఐ మోడల్ ‘క్లాడ్ మిథోస్ ప్రివ్యూ’ను ఐటీ మార్కెట్లోకి తెచ్చింది. ఇది అత్యంత శక్తిమంతమైన మోడల్ అని ఆ కంపెనీ చెబుతున్నది. అది నిజం కావొచ్చు, అయితే దీని అసాధారణ సామర్థ్యాలు సైబర్ భద్రతా ప్రమాదాలను పెంచే అవకాశముండటంతో, ప్రజలకు దీని విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోడల్ను విడుదల చేయకుండా ‘ఆంత్రోపిక్’ కంపెనీ ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అనే కొత్త ‘ప్రాజెక్టు’ను దీని పనితీరు మదింపు కోసం చేస్తున్నది. భారత ఐటీ రంగ ప్రధాన సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ‘నాస్కామ్’ పరిధిలో పనిచేసే ‘డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సీఈఓ వినాయక్ గాడ్సే దీని గురించి చెబుతూ – ‘సైబర్ దాడులకు ప్రభుత్వ శాఖల ఐటీ సిస్టం తేలికైన లక్ష్యాలు అవుతాయి. ఎందుకంటే, వాటి సెక్యూరిటీ సిస్టం కూడా పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, శాఖల మధ్య విస్తరించి పలు స్థాయుల్లో అది పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు. ఇది జరిగాక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్– ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంక్ చైర్మన్లు, ఎలక్ట్రానిక్స్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖాధికారులతో సమావేశమై ‘ఆంత్రోపిక్’ వల్ల మన బ్యాంకు లావాదేవీలకు వాటిల్లే సమస్య గురించి అప్రమత్తం చేశారు. ఎంతో రీసెర్చి దన్ను ఉండే కేంద్ర మంత్రిత్వశాఖ ఒక కొత్త ‘టెక్నాలజీ’ అమలుపై ఇలా ఆచితూచి అడుగులు వేస్తుంటే; ఏపీ సీఎం అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ కోసం రెండు ‘టవర్లు’ కడతాము అంటున్నారు. రాజధాని అంటే – ఏపీ సీఎం దృష్టిలో అది ప్రజల కోసమా లేక ‘కార్పొరేట్’ ప్రయోజనాల కోసమా అనే చర్చకు దారితీసే చర్యలివి. ఏప్రిల్ 14 అంటే, గతంలో డా‘‘ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఉండేవి. కానీ ఏపీలో అది– ‘వరల్డ్ క్వాంటమ్ డే’ అయింది. వ్యాసకర్త సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల వ్యాఖ్యాత -
షాక్ తగిలిన వెంటనే గుడ్న్యూస్.. నువ్వు కేక భజ్జీ
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని జలంధర్లో ఉన్న హర్భజన్ నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం (ఏప్రిల్ 25) నిరసనలు చేపట్టారు. దీంతో ఆదివారమే కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ భద్రత కల్పించడం గమనార్హం.హర్భజన్ సింగ్ మాజీ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న హర్భజన్ సింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. రాఘవ్ చద్దాతో పాటు బీజేపీలో చేరిన ఆరుగురు సభ్యుల్లో హర్భజన్ ఒకరు. భజ్జీకి ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారు.హర్భజన్కు భద్రత కల్పించాలని కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడగానే పంజాబ్ పోలీసులు ఆయన భద్రతను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుడైన హర్భజన్కు పోలీస్ భద్రతలో 9-10 మంది సిబ్బంది ఉండేవారు. శనివారం ఆ భద్రత తీసివేశారు. ఇప్పుడు జలంధర్లోని ఆయన ఇంటి బయట సీఆర్పీఎఫ్ సిబ్బంది కనిపిస్తున్నారు.శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసనల్లో హర్భజన్ ఇంటి గోడపై ద్రోహి అని స్ప్రే పెయింట్ వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా ఇళ్ల ముందు కూడా ఇలాంటి నిరసనలే జరిగాయి.రాఘవ్ చద్దాతో కలిసి బీజేపీలో చేరినవారిలో సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్జిత్ సహ్నే ఉన్నారు.మరోవైపు, ఇటీవలే రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. ఆయనకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ స్థానం నుంచి ఆప్ తొలగించింది. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శాపూర్వకంగా మాట్లాడలేదని ఆప్ ఆరోపించింది. -
అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకలు
హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని సోమాజిగూడలో జరిగిన అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీనిలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ జయంతిని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ దేశ ప్రజలకి ఆశా జ్యోతి.. అందుకే దేశ వ్యాప్తంగా వారోత్సవాలు జరగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ జయంతిని తూతూ మంత్రంగా జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని వారం రోజుల పాటు ప్రధాని మోదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితినే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తుంది. మనం సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ చరిత్రని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. డూప్లికేట్ గాంధీ కుటుంబ చరిత్రనే ప్రజలకి తెలియాలని కాంగ్రెస్ కుట్ర చేసింది.దేశ విభజన, 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. నెహ్రూ ఆగడాలు, అరాచకాలు తట్టుకోలేక అంబేద్కర్ రాజీనామా చేసి బయటికి వచ్చారు. అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అంబేద్కర్ రాజకీయ చరిత్ర లేకుండా చేసింది కాంగ్రెస్. అప్పట్లో జనసంఘ్ పార్టీ అంబేద్కర్కి ఎంఎల్సీ ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ స్మృతి వనం కట్టలేదు’ అని విమర్శించారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ ఆలోచన విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెన్ను పోటు పొడిచిందో ప్రజలోకి తీసుకెళ్లాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుందో అందరికీ తెలుసు. అసెంబ్లీ, పార్లమెంట్లకు గిరిజనులు, దళితులు, మహిళలని వెళ్ళకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. సీట్లు పెంపు ద్వారా అందరూ లబ్ది పొందేవారు. దక్షిణ భారతదేశంకి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఒకే నిష్పత్తిలో సమాంతరంగా సీట్లు పెంచాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినపుడు ఏ రోజు కూడా బీసీలు గుర్తుకు రాలేదు’ అని మండిపడ్డారు.‘వచ్చే నెల పదోవ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మొదటి సారి హైదరాబాద్కి మోదీ వస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు. వచ్చే నెల 10 వ తేదీ న పెరెడ్ గ్రౌండ్ లో నాలుగు గంటలకు ప్రధాని బహిరంగ సభలో పాల్గొంటారు’అని స్పష్టం చేశారు. -
తెలంగాణకు ప్రధాని మోదీ.. ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 9న తెలంగాణ పర్యటనకు రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రానికి ఆయన వస్తారని వెల్లడించాయి. 9న వరంగల్లో మామునూరు ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్–2ను జాతికి అంకితం చేయడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్ను కూడా జాతికి అంకితం చేసే అవకాశాలున్నాయి.కాగా, మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తూళ్ల వీరేందర్గౌడ్, అశోక్ వేములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అంశాలపై చర్చించినట్టు తెలిపారు. -
నితిన్ నబిన్ (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ
పనంటే పూర్తయ్యేది కాదు. మొదలయ్యేది! ఇది మానవజన్మ సుకృతమా, లేక, మోదీజీ నాయకత్వానికి మాత్రమే పరిమితమైన శ్రమైక జీవన సౌందర్యమా?! ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్. ఆ రోజుతో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలూ పూర్తయినట్లు. ఎన్నికలు ‘పూర్తవడం’ అన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే గానీ, భారతీయ జనతా పార్టీ చీఫ్కి కాదు. పనితో మొదలై, మళ్లీ పనితోనే మొదలయ్యే ఆదీ అంతమూ లేని పదవీ కాలం బీజేపీ అధ్యక్షుడిది. అధ్యక్షుడిదే కాదు, పైనుంచి కింది వరకు పార్టీలోని ప్రతి కార్యకర్తదీ. జనవరిలో నేను జాతీయ అధ్యక్షుడిగా పనిలో పడ్డాక తొలిసారి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలివి. ఉన్నచోట ఉన్నట్లు లేదు. తిన్న చోట తిన్నట్లు లేదు. పనే, నా కాలమూ దూరము, వేగము.మొత్తం 34 రోజులు, 65 రోడ్ షోలు! పశ్చిమ బెంగాల్లో 11 రోజులు, 22 రోడ్ షోలు; అస్సాంలో 9 రోజులు, 18 రోడ్ షోలు; కేరళలో 7 రోజులు; 12 రోడ్ షోలు; తమిళనాడులో 5 రోజులు; 8 రోడ్ షోలు; పుదుచ్చేరిలో 2 రోజులు, 5 రోడ్ షోలు. పనిలో ఉన్నవారికి అలసట ఉండదు. ప్రజల మధ్య ఉన్నవారికి భూమీ, ఆకాశం; బిహార్, ఢిల్లీ ఉండవు. బాలుర్ఘాట్లో ప్రచారం చేస్తున్నప్పుడు బాలకృష్ణుడి చేతి నిండా వెన్న ముద్ద పెట్టినట్లుగా, బెంగాల్ ప్రజలు ప్రతిచోటా నాకు తియ్యటి ‘మిష్టీదోయి’ తినిపించారు. నా గుండె నిండింది కానీ... గొంతు గడ్డ పెరుగు అయింది. 24 పరగణాల జిల్లాలోని నైహతిలో కూడా మిష్టీదోయిని నా నోటికి అందివ్వ బోయిన వారిని ఆత్మీయంగా ప్రతిఘటించి, ‘‘ఈ పెరుగుకు బదులుగా ఒక గ్లాసు మామూలు నీళ్లు ఇవ్వగలరా?’’ అని వేడుకున్నాను. మదురై రోడ్ షోలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం రెండూ కలిసి ఉప్పొంగినట్లుగా జనం! నాలోంచీ భావావేశం ఉబికి వచ్చింది! తమిళంలో ‘‘వణక్కం’’ అంటూ చేతులు జోడించాను. ‘‘ఓ..’’ అంటూ ప్రజా హోరు! ఆ ఉద్వేగంలో పొరపాటున ‘‘భయ్యా..’’ అనేశాను. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ వెంటనే కేరింతలు కొడుతూ నవ్వులు. ‘‘నన్బా’’ అనబోయి అలవాటుగా ‘‘భయ్యా’’ అని అన్నానని తమిళ ప్రజలు నన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ‘‘నా హృదయం బిహార్దే కావచ్చు. అంతకన్నా విశాలమైన సముద్రం మీ హృదయం..’’ అని వారికి ధన్యవాదాలు తెలిపాను. అస్సాంలోని కమల్పుర్ సమీపంలో ఒక ఏనుగు నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో నా కాన్వాయ్ 15 నిముషాలు ఆగిపోవటం నాకొక ఆహ్లాదకరమైన జ్ఞాపకం. ఆ ‘వీఐపీ’ని ఫొటో తియ్యటం కోసం కారు దిగి వెళ్లాను. వన్యప్రాణుల రాజసానికి మోదీజీ ఒక్కరే దీటైనవారు అని ఆ క్షణాలలో నాకు అనిపించింది! ఆయనలో గర్జించే సింహమూ కనిపిస్తుంది, మనసుకు హాయినిచ్చే మయూరమూ పురి విప్పుతుంది. కేరళలో నిమ్మరసం, ఘాటైన మసాలాలు కలిపి తయారు చేసే అక్కడి సంప్రదాయ ‘సులేమానీ’ బ్లాక్ టీని గుటకేయటం కాస్త కష్టంగానే ఉన్నా, అందులో వారు జోడించిన ఆతిథ్య భావన పచ్చని కొబ్బరి చెట్ల వంటి ఆ రాష్ట్ర ప్రజలకు నన్ను కట్టిపడేసింది.పుదుచ్చేరిలో పార్టీ మండల అధ్యక్షులతో అర్ధరాత్రి జరిగిన సమావేశమైతే నాకొక ‘అత్యున్నత’ స్థాయి!! నాలోని జాతీయ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షుడిగా మారిపోయాడు. పనినే మోదీజీగా భావించే వారికి పదవుల పట్టింపులు ఉంటాయా? మే 4న కౌంటింగ్. ఆ రోజున వచ్చేవి ఎన్నికల ఫలితాలు కావు. ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు మోదీజీకి చేతి నిండా కల్పించే పనులు. ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యకర్తల దోసిళ్లలోకి కురిసే బాధ్యతల బంగారు నాణేలు! -
10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఝలక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చద్దాకు భారీ షాక్ తగిలింది. పార్టీకి, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారన్న ఆరోపణల మధ్య చద్దాకు సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై చద్దాను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమేకాదు లక్షలాది మంది అన్ ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఈ పరిణామం సోషల్ మీడియాపై బాగా ప్రభావం చూపించింది.Unfollow Raghav Chadha సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతరాఘవ్ చద్దా రాజకీయ మార్పు వార్త బయటకు రాగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో ఆయనపై విమర్శల వర్షం కురిసింది.ఫాలోవర్ల సంఖ్యగా భారీగా తగ్గిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుండి 1.37 కోట్లకు పడిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో సుమారు 80,000 పైగా ప్రతికూల కామెంట్లు రాగా, ఫేస్బుక్లో వేలమంది యూజర్లు ఆయనను అన్ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు.నెటిజన్లు ఆయనను ఉద్దేశించి “హీరో టు జీరో”, “పంజాబ్ గద్దర్” (పంజాబ్ ద్రోహి), , “అన్ఫాలో రాఘవ్ చద్దా” చద్దా కాదు చడ్డీ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఫలితంగా 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయన్ను అన్ఫాలో చేశారు.సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే, ఇటివలి పరిణామాలు, కేజ్రీవాల్కి లిక్కర్ స్కాంనుంచి ఊరట లభించగానే చద్దాపై చర్యలు, పథకం ప్రకారం ఆరుగురి ఎంపీలతో కలిసి చద్దా పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు మరియు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్ ,అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇది మామూలు వెన్నుపోటు కాదయ్యో..!
ఆపరేషన్ లోటస్ వేళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పైనే బీజేపీ ఎదురు దాడికి దిగింది. కొత్త బంగ్లాకు ఆయన మకాం మార్చడంపై సెటైర్లు వేసింది. తనది సాదాసీదా జీవనం అని చెప్పుకునే కేజ్రీవాల్.. ఛండీగఢ్ బంగ్లా కోసం మాత్రం కోట్లు ఖర్చు చేశారని, అదంతా ప్రజా ధనమేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో ఇటు కేజ్రీవాల్కు బంగ్లా విషయంలో జరిగిన వెన్నుపోటు కూడా చర్చనీయాంశమైంది. లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ బయటకు వచ్చాక సీఎం పదవికి రాజీనామా చేయడంతో అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆనాడు ఆప్(ప్రస్తుత బీజేపీ) రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రముఖ విద్యావేత్త అశోక్ మిట్టల్ కేజ్రీవాల్ కుటుంబాన్ని తన అధికారిక బంగ్లాకు ఆహ్వానించారు. మండీ హౌస్ సమీపంలోని 5 ఫిరోజ్షా రోడ్లోని బంగ్లాలో అప్పటి నుంచి ఆ కుటుంబం ఉంటూ వస్తోంది. అయితే నిన్న(ఏప్రిల్ 24)న లోధీ ఎస్టేట్లోని ప్రభుత్వ బంగ్లాలోకి మారాడు. ఇది కాకుండా ఛండీగఢ్ సెక్టార్లో కేజ్రీవాల్ మరో ప్రభుత్వ బంగ్లాను ఆక్రమించారని.. దానిని షీష్ మహల్ 2 అంటూ ఎగతాళి చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ.కేజ్రీవాల్ను ఢిల్లీ రెహమాన్ డెకాయిత్గా (ధురంధర్ సినిమాలోని ఫేమస్ పాత్ర.. ) అభివర్ణిస్తూ శనివారం పర్వేశ్వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కేజ్రీవాల్ ఒకప్పుడు తనది సాధారణ జీవనం అని చెప్పి ప్రజల మద్దతు పొందారు. ఇప్పుడు విలాసవంతమైన బంగ్లాకు మారడం ఆయన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఆ బంగ్లాను అంత లగ్జరీగా మార్చడానికి డబ్బుల్లేక్కడివి?. అదంతా పంజాబ్ ప్రజల సొమ్ము కదా?.. ఈ విషయంలో దమ్ముంటే వాస్తవాలను బయటపెట్టాలి’’ అని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ క్రమంలో బంగ్లా లోపల అంటూ కొన్ని ఫొటోలను ప్రదర్శించి ‘షీష్ మహల్-2’ అంటూ ఆరోపించారు. #WATCH | दिल्ली: दिल्ली सरकार में मंत्री प्रवेश वर्मा ने कहा, "यह उनके पूरे घर का लेआउट है... जितना दिमाग उन्होंने एक-एक कमरों पर लगाया है, अगर उतना समय वे दिल्ली के कार्यों में लगाते तो शायद आज उनके कार्यकर्ता आम आदमी पार्टी को छोड़कर नहीं जा रहे होते।" pic.twitter.com/dr3ZC0hA0T— ANI_HindiNews (@AHindinews) April 25, 2026నమ్మకస్తుడి వెన్నుపోటుఅశోక్ మిట్టల్ ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) స్థాపకుడు, ఛాన్సలర్ కూడా. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ ఆయన్ని రాజ్యసభకు పంపింది. ఈ నెల మొదట్లో రాఘవ్ చద్దా తీరుతో విసిగిపోయిన ఆప్.. ఆయన్ని తప్పించి అశోక్ మిట్టల్ను రాజ్యసభ ఉపనేతగా నియమించింది. ఇది జరిగిన కొన్నిరోజులకే అశోక్ విద్యాసంస్థలపై ఈడీ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఆప్ ఆ దాడులను ప్రతీకార రాజకీయంగా ఖండించింది. అయితే..ఏడాది పాటు కేజ్రీవాల్ను తన ఇంట్లో ఉంచుకున్న అశోక్ మిట్టల్.. ఆయన బంగ్లా ఖాళీ చేసిన కాసేపటికే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఆయనతో పాటు రాఘవ్ చద్దా, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా బీజేపీలో చేరారు. లోథి ఎస్టేట్లోని ప్రభుత్వ బంగ్లాను ప్రస్తుతం జాతీయ పార్టీ అధినేత హోదా కింద కేజ్రీవాల్కు కేటాయించారు. అయితే బీజేపీ మాత్రం జైలుకు వెళ్లొచ్చిన ఆప్ నేతలంతా ఛండీగఢ్ సెక్టార్లోని ప్రభుత్వ బంగ్లాలను ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సహకారంతో ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తోంది. 2015-2024 మధ్య కేజ్రీవాల్ ఢిల్లీ సిఎంగా ఉన్నప్పుడు నివసించిన సివిల్ లైన్స్ బంగ్లాను బీజేపీ "షీష్ మహల్"గా పిలిచింది. ఈ బంగ్లాలో కోట్ల ప్రజా ధనం వెచ్చించి విలాసవంతమైన సౌకర్యాలను కేజ్రీవాల్ అనుభవించారని ఆరోపించింది. ఇప్పుడు ఆయన వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ ఎన్నికల కోసం ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో షీష్ మహల్2ను తెరపైకి తెచ్చింది. -
30 నిమిషాల డీల్.. ట్రెండింగ్లో పరిణితీ-రాఘవ్ చద్దా జోడి (ఫొటోలు)
-
ఇంకా చాలా సమయం ఉంది..!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకే ఆమె వచ్చారంటూ ఊహాగానాలు సాగాయి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ యూనివర్సిటీ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానం అందించేందుకే వచ్చాన న్నారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్లో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఎంపీ టికెట్ కోసం తాను రాలేదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. మామ మల్లారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన తమలో ఎవరినైనా పోటీ చేయమంటే సిద్ధమని స్పష్టం చేశారు. -
అంగ.. వంగ.. కళింగ..!
కోల్కతా: బెంగాల్లో మొదటి విడత ఓటింగ్ సరళిని చూస్తే ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రాచీన సామ్రాజ్యాలు, ప్రస్తుత తూర్పు భారత రాష్ట్రాలైన అంగ(బిహార్), వంగ(బెంగాల్), కళింగ(ఒడిశా)ల్లో వచ్చే నెలలో ఉండేది బీజేపీ ప్రభుత్వాలేనని ఆయన ప్రకటించారు. కోల్కతాలో శుక్రవారం మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 సీట్లకుగాను బీజేపీ 110పైగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం 92 శాతం మంది ఓట్లేసి ఈసారి సునామీ సృష్టించారు. సీట్లు, మెజారిటీ ఎక్కువగానే ఉండొచ్చు’అంటూ అంచనా వేశారు. -
మలి దశ.. మహా సంగ్రామం!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర భవితవ్యాన్ని, రాబోయే ఐదేళ్ల అధికార పీఠాన్ని శాసించే అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 152 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగియగా..29న మిగిలిన 142 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ బెంగాల్, కోల్కతా, హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో జరగనున్న ఈ పోరును అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి. దశాబ్దన్నర కాలంగా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవాలని దీదీ సైన్యం సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎలాగైనా కోటను బద్దలు కొట్టి తీరాలని కమలనాథులు వ్యూహాలకు పదును పెట్టారు. సమరానికి సై అంటున్న కీలక నియోజకవర్గాలు ఇవే.. : రెండో దశలో అర్బన్, సెమీ–అర్బన్, చారిత్రక ప్రాధాన్యం ఉన్న అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఆయా పార్టీల నైతిక స్థైర్యాన్ని నిర్ణయించనున్నాయి. → సింగూరు (హూగ్లీ జిల్లా): బెంగాల్ రాజకీయాల్లో సింగూరుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టాటా నానో ప్లాంట్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన చారిత్రక పోరాటం టీఎంసీని అధికారంలోకి తెచ్చింది. అయితే, ఇక్కడ ఇప్పుడు పారిశ్రామికీకరణ, ఉపాధి లేమి ప్రధాన సమస్యలుగా మారాయి. ఈసారి ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తుండటంతో, సింగూరులో మళ్లీ సెంటిమెంట్ గెలుస్తుందా లేక అభివృద్ధి నినాదం నెగ్గుతుందా అనేది ఆసక్తికరం. → భవానీపూర్ (కోల్కతా): ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత పట్టున్న వీఐపీ నియోజకవర్గం. ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ఏకపక్షంగా కొనసాగించడం టీఎంసీకి ప్రతిష్టాత్మకం. ఈ స్థానంలో మెజారిటీ తగ్గకుండా చూసుకునే బాధ్యతను టీఎంసీ అగ్రనాయకత్వం భుజాన వేసుకుంది. → డైమండ్ హార్బర్ (దక్షిణ 24 పరగణాలు): మమత మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కంచుకోట ఇది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ ప్రాబల్యాన్ని దెబ్బకొట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. → టోలీగంజ్ (కోల్కతా): టాలీవుడ్ (బెంగాలీ సినిమా) పరిశ్రమకు గుండెకాయ లాంటి ఈ నియోజకవర్గంలో గ్లామర్తో పాటు రాజకీయ వేడి ఎక్కువే. ఇక్కడ సినీ ప్రముఖుల ప్రభావం ఎక్కువ. ఇరు పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. → హౌరా సెంట్రల్, శివపూర్ (హౌరా జిల్లా): పారిశ్రామిక ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో కార్మికులు, మైనార్టీ ఓటర్లు కీలకం. ఇక్కడ మూతపడిన పరిశ్రమలు, మౌలిక సదుపాయాల లేమిని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. → జాదవ్పూర్, కసబ (కోల్కతా పరిసరాలు): విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తుండగా.. ఐటీ, ఉపాధి నినాదంతో, నూతన టెక్ పార్కుల ప్రగతితో టీఎంసీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. టీఎంసీకి కలిసొచ్చే అంశాలు.. సవాళ్లు మమతా సర్కార్కు క్షేత్రస్థాయిలో ఉన్న పటిష్టమైన కేడర్ అతిపెద్ద ఆయుధం. ముఖ్యంగా ‘లక్ష్మీర్ భాండార్’, ’కన్యాశ్రీ’లాంటి మహిళా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఓటు బ్యాంకుగా మారాయి. మహిళా ఓటర్లు ఆ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే, స్థానిక నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు (ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ కుంభకోణం), సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగానే వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకత వారికి ప్రధాన సవాల్. బీజేపీ ఆశలు.. ఆందోళనలు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయడంలో, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సఫలమవుతోంది. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలను ఎండగడుతూ మెజారిటీ వర్గాలను ఏకం చేసే వ్యూహం అమలు చేస్తోంది. అయితే, దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ప్రధాన లోపం. (ఆచార్య శరత్ చంద్ర ముక్తవరం) -
రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి..!
-
ద్రోహం : ఆ ఏడుగుర్ని గుర్తుపెట్టుకుంటాం!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చద్దా రాజీనామా చేయడం సంచలనం రేపింది. వరుసగా ఏడుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు రాఘవ్ చద్దా శుక్రవారం చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది. దీనిపై తొలిసారిగా ఆప్ ఘాటుగా స్పందించింది. పార్టీకి, ప్రజలకు వారు తీరని ద్రోహం చేశారంటూ మండిపడింది.రాఘవ్ చద్దా ప్రకటన తరువాత విలేకరుల సమావేశం నిర్వహించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వారు పార్టీకి, పంజాబ్ ప్రజలకు "ద్రోహం" చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపీగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బీజేపీ పంచన చేరారని విమర్శించారు.'ఆపరేషన్ లోటస్' సిగ్గు చేటుపంజాబ్ ప్రభుత్వంపై 'ఆపరేషన్ లోటస్' అమలు జరుగుతోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆపరేషన్ లోటస్ అమలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ఆపరేషన్ లోటస్ను అమలు చేయడానికి ED, CBI సంస్థలను వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ ద్రోహులను పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.#WATCH | Delhi | AAP MP Sanjay Singh says, "Operation Lotus is being executed on the Punjab Government...ED, CBI is being used to execute this Operation Lotus...The people of Punjab will never forget these 'traitors'..." pic.twitter.com/VXKN4hPbmk— ANI (@ANI) April 24, 2026ఇదీ చదవండి: అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లుపంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని AAP ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు బీజేపీ అడ్డుపడుతోందని సంజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీలో చేరుతున్న ఏడుగురినీ గుర్తుంచుకుంటామనీ, ముఖ్యంగా పంజాబ్ ప్రజలు వారిని ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్ -
ఆప్కు భారీ షాక్.. పంజాబ్లో ఆపరేషన్ కమలం
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ఆప్కు రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మరో నలుగురు పంజాబ్ ఆప్ ఎంపీలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ కమలం కలకలంపంజాబ్లో ఆపరేషన్ కమలం కలకలం రేపుతోంది. మొత్తం ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు. పంజాబ్ నుంచి ఉన్న ఆప్ రాజ్యసభ సభ్యుల్లో అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్ (క్రికెటర్), రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, బల్బీర్ సింగ్ సీచేవాల్, విక్రమ్జీత్ సింగ్ సహ్నేలు ఉండగా వీరంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. కేంద్ర కేబినెట్లోకి రాఘవ్ చద్దాఈ మేరకు ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు అవినీతిపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. ‘నేను నా జీవితంలోని 15 ఏళ్లను అంకితం చేసిన ఆప్ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని. నేను పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను. నాతో పాటు మొత్తం రాజ్యసభలో ఆప్కు చెందిన 10 మంది ఎంపీలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది (ఆంటే ఆరు నుంచి ఏడుగురు ఎంపీలు) బీజేపీలో చేరుతున్నారు’అని ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్ర కేబినెట్లోకి రాఘవ్ చద్దాకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్కు నమ్మిన బంటు అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది.2011లో అర్వింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్తో పాటు పలువురు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. అప్పుడే రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్లో చేరారు. నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్కు నమ్మిన బంటుగా, అనుచరుడిగా కొనసాగారు. కాగా, ఇప్పటివరకూ ఆమ్ ఆద్మీకి రాజ్యసభలో 10 ఎంపీ బలం ఉండగా, పంజాబ్ నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు ఉన్నారు. తాజా రాజీనామాల ఎపిసోడ్తో ఆప్ రాజ్యసభ సభ్యుల సంఖ్య సింగిల్ డిజిట్కి వచ్చేసింది. -
ఢిల్లీ నుంచి బీజేపీని తరిమేస్తా
-
బీజేపీ ఆఫీసుకు అందుకే వచ్చా..!
-
బెంగాల్లో బీజేపీ సునామీ! గెలుపు పై అమిత్ షా ధీమా
-
BJP ఆఫీసులో మల్లారెడ్డి కోడలు
-
బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇది హాట్ చర్చకు దారి తీసింది.ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారనే చర్చ మొదలైంది. ఈ ఊహాగానాల నడుమ శుక్రవారంనాడు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్కు వెళ్లి.. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతూ ప్రచారాలకు ప్రీతిరెడ్డి తెర దించారు. ‘‘మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ఓపెనింగ్కు ప్రధాని మోదీని ఆహ్వానించాం. మోదీని ఆహ్వానించాం కాబట్టే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నాం. బీజేపీనే కాదు.. అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం మొన్న మంత్రి శ్రీధర్బాబును కూడా కలిశాం. నేను బీజేపీలో చేరడం లేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాకు బీఆర్ఎస్ అంటే గౌరవం ఉంది. విద్యావేత్తగా అందరితో కలిసి ఉండడంలో తప్పేముంది? దయచేసి ఈ ప్రచారానికి ఇంతటితో ఆపండి’’ అని అన్నారామె. సాక్షితో చిట్చాట్లో.. ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాంబీజేపీ నేతలను కలిసి ఇదే విషయం తెలియజేశాంబీఆర్ఎస్ నేతలను, కాంగ్రెస్ వాళ్లనూ ఆహ్వానిస్తాం అన్ని పార్టీల నేతలను కలుస్తాంఇప్పుడ రాజకీయాల్లోకి రావాలని లేదుమహిళా రిజర్వేషన్లు వచ్చి ఉంటే బాగుండేదిమల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఆ కథనాలపై ఆయన స్పందించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ను గూగుల్తో కలిసి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ కానుంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. -
ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాతి లక్ష్యం జాతీయ రాజకీయాలేనని ప్రకటించారామె. అయితే అది అధికారం కోసం కాదని.. కేవలం బీజేపీ పతనం కోసమేనని వ్యాఖ్యానించారు.కోల్కతాలో జరిగిన ఎన్నికల సభలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ విజయం తర్వాతే ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా అంటూ మాట్లాడారామె. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తోంది. నేను బెంగాల్లో పుట్టాను.. ఇక్కడే చస్తాను. కానీ, బెంగాల్లో గెలిచాక ఢిల్లీకి తప్పకుండా వెళ్తాను. నాకు కావాల్సింది అధికారం కాదు. బీజేపీ పతనం. ఢిల్లీలోనూ వాళ్లను ఇదే తరహాలో ఎదుర్కొంటాను. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడతానని’’ అని దీదీ వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తుండగా.. బీజేపీ మాత్రం ఆమె ప్రభుత్వంపై అవినీతి, దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల స్పందన కూడా విశేషంగా ఉంది. గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. సుమారు 92 శాతం టర్నౌట్ నమోదైంది. చివరిసారిగా 2011లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా.. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ దారుణ పరాజయం పాలైంది.తాజా భారీ ఓటింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ‘‘మార్పు కోసం ప్రజల సంకల్పం’’గా అభివర్ణించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ విజయానికే సంకేతామని మమతా బెనర్జీ అంటున్నారు. రెండో విడత పోలింగ్ 2026 ఏప్రిల్ 29న జరగనుంది. ఈ విడతలో మిగిలిన 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
చెక్బౌన్స్ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్
సాక్షి, అనంతపురం: చెక్బౌన్స్ కేసులో కర్ణాటక బీజేపీ నేత సురతాని సుమతి అరెస్ట్ అయ్యారు. గురువారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ఒక్క రోజులో పూర్తయ్యే అంశం కాకపోవడంతో రిమాండ్ విధించినట్టు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మాధవి అనే మహిళ ఫిర్యాదు మేరకు సుమతిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 12న అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజాగా అరెస్ట్ తర్వాత రిమాండ్కు పంపింది. అయితే.. సుమతిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 24న అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ‘వాల్మీకి’ నిధుల గోల్మాల్లో సుమతి పాత్ర!కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో రూ.80 కోట్లు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధులను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. దీంతో అప్పటి కర్ణాటక ఎస్టీ సంక్షేమ, క్రీడా శాఖల మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఈ నిధుల అక్రమాల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురి పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేసింది. డొల్ల(షెల్) కంపెనీల ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు పొందడం, సబ్సిడీ తీసుకోవడం, చివరకు కంపెనీ నష్టపోయినట్టు లేదా ప్రమాదం జరిగినట్టు చూపించి రుణాలను ఎగవేయడం వంటి అంశాలపై ఈడీ ఆరా తీసింది. కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారంలోనూ సుమతి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. -
బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’(జన ఆక్రోష్ పాదయాత్ర) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్తోపాటు ’ఇండి’ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్ కొన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గగన్మహల్లోని ఏవీ కాలేజీ వద్ద నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని పాదయాత్రగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మహిళా నేతలు బంగారు శ్రుతి, బండారు విజయలక్ష్మీ, జూటూరు కీర్తిరెడ్డి, ప్రభాగౌడ్, జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు, బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముందుండి నడిచారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించారు. పల్లెపల్లెనా ఎండగట్టాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై అడ్డుకోవడం ఆ పార్టీల మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు , మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాం«దీ, రేవంత్ రెడ్డితోపాటు మిత్రపక్షాల నేతలు స్టాలిన్, అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రేవంత్... మహిళాద్రోహి : బండి సంజయ్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు వారికిచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ను గద్దె దించాలన్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులు: రాంచందర్రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు. -
శంకర్ గౌడ్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) నర్సంపేటలో జరగనున్న శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బండి సంజయ్ హాజరుకానున్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీజేపీ నేతలు కార్మికులకు విజ్ఝప్తి చేశారు -
బీజేపీ అభ్యర్థిపై దాడి కారు ధ్వంసం
-
తరిమి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు పారిపోయిన బీజేపీ అభ్యర్థి
-
ముంబై నడిరోడ్డుపై మంత్రికి చెమటలు పట్టించిన మహిళ
-
అల్లర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని సువేందు హెచ్చరిక
-
హండ్రెడ్స్ ఆర్ వెయిటింగ్
ఒక మహిళ గర్జన ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తోంది. రాజకీయ ర్యాలీలు, నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేసి, స్కూల్ పిల్లలను, అంబులెన్స్ లను, ఆఫీస్కి వెళ్లే వాళ్లను గంటలు గంటలు ఆపేయడం మామూలైపోయిన ఈ రోజుల్లో ఒక నిరసన స్వరం దేశానికి తన బాధ్యతను గుర్తు చేస్తోంది. ‘ఎవరూ మాట్లాడరులే’ అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ఉన్న వారికి ‘సామాన్యులతో పెట్టుకోకు’ అని ఈ ఘటన చెప్పినట్టయ్యింది.అసలేం జరిగింది?ఏప్రిల్ 22, మంగళవారం ముంబైలోని వర్లీలో బిజెపి పార్టీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించింది. దాంతో వర్లీ జంభోరీ మైదాన్ నుంచి డోమ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక స్థానిక మహిళ తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. విసుగెత్తి పోయిన ఆవిడ కారు దిగి, నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో వాగ్వాదానికి దిగింది. ‘గెట్ అవుట్ ఆఫ్ హియర్! మీరు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నారు’ అని నిలదీసింది. ‘వందలమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా’ అని పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపిస్తూ గట్టిగా అరిచింది. పోలీసులు జోక్యం చేసుకోబోతే వాళ్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ‘సీనియర్ ఆఫీసర్స్తోనే మాట్లాడతా’ అని తెగేసి చెప్పింది. మంత్రి మహాజన్ సర్ది చెప్పబోయినా ఆవిడ వినలేదు. వెళ్లి మళ్లీ వచ్చి ‘మీకు అర్థం కాలేదా? వందల మంది వెయిట్ చేస్తున్నారు’ అని మళ్లీ గట్టిగా అడిగింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీఐపీ కల్చర్కి చెక్ పెట్టాలని చాలామంది కోరుతున్నారు. నగరాల్లో అసలే ట్రాఫిక్ జామ్లతో బాధ పడుతున్న జనం ఈ ర్యాలీలు, ప్రదర్శనల వల్ల మరెంత అవస్థ పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. జనం ఆగ్రహం ఇలా కట్టలు తెంచుకోక ముందే పాలనా వ్యవస్థలు మేలుకోవాలి. -
ఏఐసీసీ చీఫ్పై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిన్న ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ చర్చలకు ఉపక్రమించింది. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మోదీ ఓ ఉగ్రవాది!
చెన్నై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీంతో ఖర్గే, కాంగ్రెస్లపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల దుమారానికి తమిళనాడు ఎన్నికల ప్రచారపర్వం వేదికగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పెరియార్ ఈవీ రామస్వామి, సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలను నమ్మే అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు ప్రధాని మోదీ పంచన చేరారు. అన్నాడీఎంకే నేతలు అసలు ఎలాంటి వాళ్లో ఇప్పుడు అందరికీ తెల్సివచ్చింది. అన్నాదురై ఫొటో పట్టుకుని ప్రచారంచేసే అన్నాడీఎంకే నేతలు ఏకంగా మోదీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచి్చంది? మోదీ ఒక ఉగ్రవాది.ఆయనకు సమానత్వం అంటే అస్సలు గిట్టదు. సమానత్వం, న్యాయం అంటే బీజేపీకి సుతరామూ ఇష్టం ఉండదు. అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే నేతలు పొత్తుకు సై అన్నారు. అన్నీ తెల్సి పొత్తుకు సిద్ధపడ్డారంటే వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కంకణం కట్టుకున్నట్టే లెక్క’’అని ఖర్గే అన్నారు. ‘‘ఆరో, ఏడో నంబర్ ఈసీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితాను బీజేపీ తిమ్మినిబమ్మిని చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను మోదీ తన జేబులో వ్యక్తిలా మార్చుకున్నాడు. బీజేపీకి అనుబంధ కార్యాలయంగా ఈసీ తయారైంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదిశలో మోదీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికలప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? అందులోనూ ఎంపికచేసిన వ్యక్తుల మీదనే ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి?’’అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్కు, రాహుల్గాందీకి మధ్య మనస్పర్థలున్నాయనే వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ‘‘వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబైదాకా అన్ని ప్రాంతాల ప్రజలను రాహుల్ కలుపుకొని పోతున్నారు.కాంగ్రెస్, డీఎంకేలు సొంత లక్ష్యాల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తాయికానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉక్కు సంకల్పంతో కలిసి ముందడుగేస్తాయి’’అని ఖర్గే అన్నారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు. ఒకవేళ ఉద్దేశం ఉంటే సీట్లు పెంచిన తర్వాతే ఇస్తామనడం ఏంటి? ఇప్పుడే, 543 సీట్లలోనే 33 శాతం అమలుచేయవచ్చుకదా?’’అని సూటి ప్రశ్నవేశారు. ‘‘జనాభా నియంత్రణను సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మోదీ దక్షిణభారత రాష్ట్రాలకు అన్యాయంచేయాలని కుట్ర పన్నారు’’అని ఆరోపించారు. మండిపడిన బీజేపీమోదీనుద్దేశించి ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘దేశ ప్రధాని పట్ల విపక్ష కాంగ్రెస్ వైఖరి ఏస్థాయిలో ఉందో ఖర్గే మాటలతో స్పష్టమైంది. ఖర్గే పొరపాటున మోదీని ఉగ్రవాది అనలేదు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్గాంధీ సూచనలమేరకే ఉగ్రవాది అని సంబోధించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సాహసించామనే అక్కసుతోనే మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు.ఇలాంటి నేతలు, పార్టీకి ఓటర్లు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. బీజేపీ ఘాటుగా స్పందించడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పడూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కీలక సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. మోదీని ఉగ్రవాది అని నేను నేరుగా అనలేదు. విపక్ష పార్టీలను మోదీ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అర్థంలోనే ఆ పదం ఉపయోగించా’’అని ఖర్గే అన్నారు. -
లెన్స్కార్ట్ వివాదం : బీజేపీ మహిళా నేత హల్చల్
సాక్షి, ముంబై: మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ ఐవేర్ బ్రాండ్ 'లెన్స్కార్ట్' ఆంక్షల వివాదం నేపథ్యంలో ముస్లిం బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ హిందూ సంస్థల సభ్యులతో కలిసి హల్చల్ చేశారు. ముంబైలోని స్టోర్లలో ఒకదానిలోకి ఆమె దూసుకెళ్లారు. తిలకం దిద్ది, స్టోర్ మేనేజర్ మోహ్సిన్ ఖాన్ను హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆంక్షల గురించి ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.తమ ఉద్యోగుల కోసం లెన్స్కార్ట్ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీని ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో బొట్టు (బిందీ), తిలకం ధరించకూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో, హిజాబ్ ధరించడానికి అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో, బీజేపీ నేతనాజియా ఇలాహి ఖాన్, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ముంబైలోని ఒక లెన్స్కార్ట్ స్టోర్లోకి ప్రవేశించారు.మతపరమైన చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పారు. అక్కడి సిబ్బందికి బలవంతంగా తిలకం దిద్ది, చేతులకు కంకణాలు (కాల్వా) కట్టారు. ఇది హిందూ దేశం. లెన్స్కార్ట్ యజమాని క్షమాపణ చెప్పకపోతే స్టోర్లను మూసివేస్తాం లేదంటే బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు.లెన్స్కార్ట్ వివరణసోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత , 'బాయ్కాట్ లెన్స్కార్ట్' తీవ్రం కావడంతో , లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఉద్యోగులు తమ మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను (తిలకం, బిందీ, హిజాబ్, క్రాస్ మొదలైనవి) ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు ప్రకటించినప్పటికీ,హిందూ సంప్రదాయాలను విస్మరిస్తూ ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. Mohsin Khan is the main operator of the Lenskart Shop in Andheri, Mumbai!No Hindu staff member can wear the Tilak!Kalaava!This is strictly prohibited!All Lenskart Shops in India should be banned immediately!Gazwa-e-hind strategy are operational from #lensekart ?… pic.twitter.com/q6bClZvrLL— Nazia Elahi Khan (सनातनी) (@ElahiNazia1) April 19, 2026 -
బీజేపీతోనే మహిళలకు న్యాయం
సాక్షి, చెన్నై: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్షోలో ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై స్టాలిన్ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
మమతా సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయి: ప్రధాని మోదీ
బిష్ణుపూర్: బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్లోని బిష్ణుపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై మమతకు చురకలు అంటించారు. మహిళలు ఎమ్మెల్యేలు కావడం టీఎంసీకి ఇష్టం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్తో కలిసి టీఎంసీ కుట్ర చేసిందన్న మోదీ.. మమతా సర్కార్పై బెంగాల్ ప్రజలు కోపంతో ఉన్నాయన్నారు. మమతా సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారుప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుకున్నారు. 2029 నుండి ఇది అమలు కావాలని బెంగాల్ మహిళలు ఆకాంక్షించారు. మహిళ రిజర్వేషన్లకు మేం కృషి చేశారు. కానీ టీఎంసీ.. కాంగ్రెస్తో కలిసి కుట్ర పన్నింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్టం ఆమోదం పొందకుండా అడ్డుకుంది’’ అని మోదీ మండిపడ్డారు.మమతా సర్కార్ను కనికరం లేని ప్రభుత్వంంగా మోదీ అభివర్ణించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాతావరణం, ఉత్సాహం, ప్రేమ, ఆనందం మమతా ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి చిహ్నాలు. ఇది మా శారదా దేవి నడయాడిన పవిత్ర భూమి, ఇక్కడ ఎంతో మంది మహిళలు హాజరయ్యారు. బీజేపీ అంటేనే మహిళా సాధికారత, రక్షణకు మారుపేరు, అందుకే మహిళలు బీజేపీని ఎక్కువగా దీవిస్తారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర మరింత విస్తరించాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం’’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు. -
బీజేపీ పతనం మొదలైంది
హౌరా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ లక్ష్యంగా టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకోవడంలో విఫలమైన కాషాయ పార్టీ పతనం మొదలైందన్నారు. పార్లమెంట్లో సొంత మెజారిటీ లేని బీజేపీ ఎన్డీయేలోని రెండు పారీ్టల మద్దతుతో మాత్రమే మనుగడ సాగిస్తున్న విషయం శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలతో మరోసారి రుజువైందని విమర్శించారు. సీఎం మమత శనివారం హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను మహిళా రిజర్వేషన్ అంశంతో ముడిపెట్టడమెందుకంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. అసలు కుట్రను బయటపడకుండా దాచేందుకే ఇలాంటి ప్రయత్నం చేసిందంటూ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మోదీజీ, శుక్రవారం నుంచి మీ పతనం ప్రారంభమైంది. లోక్సభలో మీరు ఓడిపోయారు. క్షేత్రస్థాయిలోనూ మీకు ఓటమి తప్పదు. బెంగాల్ ప్రజలు మిమ్మల్ని ఇంటిదారి పట్టిస్తారు’అంటూ హెచ్చరించారు. బీజేపీ కంటే ఎంతో ముందుగానే 1998లోనే మహిళా రిజర్వేషన్ డిమాండ్ను తాను తెరపైకి తెచ్చానన్నారు. బీజేపీ మాత్రం ఇప్పుడు తామే మహిళా రిజర్వేషన్లకు కారణమనే వాదనను ప్రచారం చేసుకుంటోందంటూ మమత ఆరోపించారు. బీజేపీ ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను బలహీనపర్చడానికేనంటూ ఆరోపించారు. ‘దేశాన్ని ముక్కలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. బెంగాల్తోపాటు అన్ని రాష్ట్రాలను విడదీస్తుంది. అందుకే లోక్సభ సీట్లను పెంచేందుకు బీజేపీ ముందుకు వచి్చంది. ఇది చాలా కీలక అంశం అయినందునే మా పార్టీ ఎంపీలంతా శుక్రవారం పార్లమెంట్కు హాజరయ్యారు. బిల్లును ఓడించారు. బెంగాల్ను విభజించేందుకు మేం ఒప్పుకోం’అని మమత స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై బీజేపీ తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ పార్లమెంట్ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు సగం సీట్లను కేటాయించామని చెప్పారు. బిహార్ తాజామాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ నితీశ్ కుమార్ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఎన్నికల్లో నితీశ్ను వాడుకున్న బీజేపీ, అనంతరం ఆయన్ను పక్కనబెట్టిందని ఆరోపించారు. నెలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలు పంచుతున్న దరఖాస్తులను నింపవద్దని సీఎం మమత రాష్ట్ర మహిళలను కోరారు. -
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి
జగిత్యాల: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం ఎంపీ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహిస్తున్న సభాస్థలి ఏర్పాట్లను కేటీఆర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వెనుకేసుకొస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఘాటైన జవాబు ఇచ్చేవారని, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉంటే కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్పై మాట్లాడితే దీటైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదని, దిష్టి»ొమ్మల్లా ఉన్నారని చెప్పారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సీఎం రేవంత్రెడ్డి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుందని, మెజారిటీ లేకున్నా ప్రవేశపెట్టి దేశంలోని మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, ఒకవైపు మహిళాబిల్లుపై కాంగ్రెస్ మద్దతివ్వలేదని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్వర్మ ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్లో మహిళాబిల్లు, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు...కానీ మహిళాబిల్లు విషయంలో సైతం మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఆయన చేరిక ఉత్తర తెలంగాణలో బలం ఇస్తుందని, విలువలతో రాజకీయం చేసే నాయకుడు జీవన్రెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల నుంచి వస్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్నదే వినిపిస్తోందన్నారు. దానికి సంకేతమే బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరిక అన్నారు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతు న్నాయని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డలో నిర్వహిస్తారట...రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో హైబ్రిడ్ ఎమ్మెల్యే అని, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకే తెలియదని సంజయ్కుమార్నుద్దేశించి అన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సైతం అమలు చేయలేదని, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పార్టీ సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. చాలాకాలం క్రితం జగిత్యాలలో సభ నిర్వహించామని, జీవన్రెడ్డి చేరికను అందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచే మళ్లీ పునర్వైభవం సాధించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సంజయ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. -
ఎన్డీయేతో పొత్తు.. కాంగ్రెస్తో గమ్మత్తు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముసుగు రాజకీ యం మరోసారి చర్చనీయాంశమైంది. అవసరానికి తగ్గట్లుగా ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆరితేరిన ఆయన ఇప్పుడు ఎన్డీయేతో పొత్తులో ఉండి తెరచాటున కాంగ్రెస్తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో లోపాయకారీగా మంతనాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, నేతలతో కాంగ్రెస్కు చెందిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు రేవంత్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఓ మంత్రి ఆహ్వానం మేరకు ఎన్డీయే ఇచ్చిన విందుకు రేవంత్రెడ్డి హాజరయ్యారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉంటూనే రేవంత్రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో గుట్టుగా దోస్తీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్తో రహస్య స్నేహం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 2024 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెరచాటున విశ్వప్రయత్నాలు చేసినట్లు బయటపడింది. ఏపీలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. బయటకు మాత్రం ఎన్డీయేతో పొత్టు పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్తో సంబంధాలు నెరిపారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో టీడీపీ మంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం బహిరంగ రహస్యమే. వారు తరచూ ఆయనతో విందు భేటీల్లో పాల్గొంటున్నట్లు బహిరంగ రహస్యం. చంద్రబాబు కూడా రేవంత్కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను కోరిన మీదటే చంద్రబాబు నిలిపివేసినట్లు స్వయంగా రేవంత్రెడ్డి అక్కడి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టే చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అప్పట్లో తేటతెల్లమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఆయన ఎన్డీయేలో ఉండి తెరవెనుక కాంగ్రెస్తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. 2011లో చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబు..మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు కాంగ్రెస్తో రహస్య బంధం కొనసాగించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాత్రి వేళ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన యూపీఏ ప్రభుత్వంతో లోపాయకారీగా పలు వ్యవహారాలు నడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అన్ని విధాలా సహకరించారు. అప్పట్లో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోయేందుకు సహకరించి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. 2011–2013 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తెరచాటున కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజనలోనూ కాంగ్రెస్తో స్నేహం..ఆ సమయంలోనే ఆంధ్రా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరుగుతున్నా చంద్రబాబు కాంగ్రెస్కే అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుని తన అవకాశవాదాన్ని చాటుకున్నారు. ఇక 20014–19 మధ్య కూడా ఎన్డీయేతో పొత్తులో ఉండి కాంగ్రెస్తో రహస్యం బంధాన్ని కొనసాగించారు. 2018లో ఆ ముసుగును తీసేసి ఎన్డీయే నుంచి బయటకొచ్చి యూపీఏతో స్నేహం చేశారు. అదే ఏడాది తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో యూపీఏతో అవగాహన కుదుర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే యూపీఏను వదిలేసి ఎన్డీయేకి జైకొట్టారు...ఇలా తన రాజకీయ అవసరాన్ని బట్టి రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లింది. ఇదే క్రమంలో తాజాగా ఎన్డీయేతో కలిసి ఉంటూనే బీజేపీకి అనుకూలంగా అన్నీ చేస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక మాత్రం కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్, పునర్వీభజన బిల్లులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కేంద్రాన్నో, బీజేపీనో కాంగ్రెస్ ఓడించలేదని, 70 కోట్ల మంది మహిళలను ఓడించిందని చెప్పారు.మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం చూసేందుకే రాహుల్గాందీ, రేవంత్రెడ్డి ఈ బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా చేయడం కొత్తేమీ కాదని, గతంలో ఏడుసార్లు కుట్రలు చేసి మహిళా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. దేవెగౌడ, వాజ్పేయి ప్రభుత్వాల హయాంలో బిల్లు పేపర్లు చించి స్పీకర్, ప్రధానిపై వేశారని, మన్మోహన్సింగ్ హయాంలో మిత్రపక్షాలను ఉసిగొల్పి అడ్డుకునేలా నాటకాలాడారని మండిపడ్డారు. దక్షిణాదికి తీరని ద్రోహం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మొన్నటిదాకా గగ్గోలు పెట్టిన విపక్షాలు, ఇప్పుడు సీట్లు పెంచుకునే అవకాశం వస్తే అడ్డుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కిషన్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా తెలంగాణలో ఎంపీ స్థానాలను 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ స్థానాలను పెంచే ప్రయత్నం చేసిందని అన్నారు.ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చినందుకు రాహుల్గాంధీ 30 కోట్ల మంది దక్షిణాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనికులు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్లను మాయాజాలంగా అభివర్ణించడం ద్వారా 140 కోట్ల మంది ప్రజలను, సైనికులను రాహుల్ అవమానించారన్నారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా చేశారా అని ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్రెడ్డికి లేదన్నారు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీని, తెలంగాణను పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీని లేదా మహిళను సీఎం చేసిందా? అని నిలదీశారు. -
’మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. భారత మహిళల కలలను నాశనం చేశారు. దేశహితమే మాకు ముఖ్యం’ అని తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి‘ అని మోదీ ప్పారు.కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు‘మహిళా రిజర్వేషన్ బిల్లును గర్భంలోనే చంపేశారు. ఈ భ్రూణ హత్యలకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. మహిళా బిల్లును ఓడించి కొట్టిన చప్పట్లు.. మహిళలకు చేసిన గాయాలు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సమాజ్ వాదీ పార్టీ నిజస్వరూపం బయటపడింది.కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని భావించా. కానీ మహిళలకు న్యాయం చేసే అవకాశాన్ని జారవిడుచుకుంది. మిత్రపక్షాలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారమే నియోజకవర్గాలను పెంచాలని ప్రతిపాదించా. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరిగి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవి. కానీ, డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్పై దుష్ప్రచారం చేశారు’ అని మోదీ తెలిపారు. -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్లను వదిలి వెళ్లడం ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్సభలో చేపట్టిన కీలక ఓటింగ్లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
‘ మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’
న్యూఢిల్లీ: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కారణమైన పలు పార్టీల వైఖరికి నిరసనగా ఎన్డీయే ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బిల్లును విపక్షాలే ఓడించాయంటూ నిరసనకు దిగారు. విపక్ష ఎంపీలన దేశం క్షమించదు అంటూ నినాదాలు చేశారు. ‘మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా లోకానికి ఇది చీకటి రోజు అని అన్నారు బీజేపీ మహిళా ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్కు గుణపాఠం తప్పదన్నారు. మరొకవైపు హైదరాబాద్లో బీజేవైఎం నేతలు.. విపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్ను రాహుల్ అడ్డుకోవడంపై మండిపడ్డారు. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. విపక్షాల నిజస్వరూపం మరోసారి బయటపడిందంటూ బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. డీలిమిటేషన్ ముసుగులో మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కాగా, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్సభ వేధికగా జరిగిన ఓటింగ్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. -
BJPకి అగ్ని పరీక్ష, డీలిమిటేషన్ కష్టమే! మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్?
-
సూర్య తేజస్వి వ్యాఖ్యలు.. విజయశాంతి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండుమీద కారం చల్లే విధంగా ఉన్నాయన్నారు.‘‘ఓ వైపు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ తెలంగాణ సెంటిమెంట్ ను కించపరుస్తూ పార్లమెంట్ వేదికగా మాట్లాడటం గర్హనీయం. లోక్సభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాలి. అలా చేసి, ఈ తప్పును సరిదిద్దాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సూర్య తేజస్వి కామెంట్స్ను ఖండించడం మానేసి, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణను సాధించగలరా? అనే విధంగా టీబీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించడం విడ్డూరంగా ఉంది.’’ అంటూ విజయశాంతి మండిపడ్డారు.‘‘నేను, కేసీఆర్ పార్లమెంట్ లోపల బయట తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెబుతారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించడం వల్లే సోనియాగాంధీ పెద్ద మనసుతో రాష్ట్ర విభజనకు అంగీకారించరాన్న విషయం అందరికీ తెలుసు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించకుండా సూర్య తేజస్వి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తోందా లేదా అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాలి’’ అంటూ విజయశాంతి డిమాండ్ చేశారు. -
BJP సెల్ఫ్ గోల్! ఇరుకున పడేసిన తేజస్వి సూర్య
-
చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు
న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. అమిత్ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. -
తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోంది
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై బీజేపీ నేతలు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య .. తెలంగాణ ఏర్పడటాన్ని భారత్ – పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహoకార పూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గురు వారం ఒక ప్రకటనలో కేటీఆర్ పేర్కొ న్నారు. ‘బీజేపీ నాయ కులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, అమర వీరుల త్యాగాలను అవమానించడం అల వాటుగా మార్చుకు న్నారు. స్వయంగా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని తేజస్వీ సూర్య వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందింది’అని కేటీఆర్ పేర్కొన్నారు.బీజేపీ ఎంపీల మౌనం సిగ్గుచేటు: ‘పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు.. తేజస్వీ వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణం. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేక పోయిన వీరు ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్యతో పాటు బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని కేటీఆర్ అన్నారు. -
తేజస్వీ వ్యాఖ్యలను తిప్పికొట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలిసింది. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ, బీజేపీ నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని ఆయన చెప్పారు. గురువారం సీఎం ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని తన అధికారిక నివాసంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్లో రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తేజస్వీ వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రొద్భలంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో ‘తల్లిని చంపి, బిడ్డను బతికించారు’ అంటూ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే... తాజాగా తేజస్వీ విమర్శలకు దోహదం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిలీల్లోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, యెన్నెం శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మాజీమంత్రి బసవరాజు సారయ్య విలేకరులతో మాట్లాడారు. -
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కోమటి రెడ్డి ఫైర్
హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు."తెలంగాణ రాష్ట్రం వందలాది మంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాల ఫలితం. దశాబ్దాల పోరాటం, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో ఆమోదించిన చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రాన్ని, రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది అమరుల త్యాగాలను కించపరచడమే." అని మంత్రి మండిపడ్డారు."భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన రాష్ట్ర విభజనకు తేడా తెలియని వారు పార్లమెంట్లో ఉండటం దురదృష్టకరం. కోట్లాది మంది ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్యపై లోక్ సభ స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్న. రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను, ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం భావ్యం కాదు.""తెలంగాణ సమాజాన్ని కించపరిచిన తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు -
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు హరీష్ రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించమే. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం . బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారు.ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?. ప్రధాని మోడీ కూడా గతం లో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారు. నాడు మోదీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు.తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేల్చేవారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీ లైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు. తెలంగాణ అంటే పోరాట గాథ… త్యాగాల చరిత్ర.. స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదు’అని హెచ్చరించారు. The @BRSparty strongly condemns the highly insensitive and irresponsible remarks made by @Tejasvi_Surya Member of Parliament from the @BJP4India His comparison of the formation of Telangana state with the creation of Pakistan is not only factually incorrect but also deeply…— Harish Rao Thanneeru (@BRSHarish) April 16, 2026 -
సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరిగితే నేనే కేంద్రాన్ని ప్రశ్నిస్తా:ఎంపీ తేజస్వీ
-
డీలిమిటేషన్ దంగల్
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుకు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలకు నడుమ పార్లమెంటులో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు వీలు కల్పించేందుకు ఉద్దేశించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఇందుకు వేదిక కానుంది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు పట్టుదలగా ఉంది. అందుకోసమే గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ మేరకు మహిళా రిజర్వేషన్ల చట్టానికి చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టేలా రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం గురు, శుక్రవారాల్లో బిల్లుపై కీలక చర్చ జరగనుంది. ఇందుకు 18 గంటల సమయం కేటాయించారు. చర్చకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చాక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం రాజ్యసభలో ప్రవేశపెడతారు. 10 గంటల చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ జరగనుంది. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచనున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్ వ్వవస్థీకరణకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ రెండు బిల్లులనూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ప్రవేశపెడతారు. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లు–2026 కూడా సభ ముందుకు రానుంది. దాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంపై గుర్రుగా విపక్షాలు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ గుర్రుగా ఉన్నాయి. తమతో మాటమాత్రం కూడా సంప్రదించకుండా, వివరాలేవీ వెల్లడించకుండా గుట్టుగా వ్యవహరించడం వెనక మతలబు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు డీలిమిటేషన్పైనా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారం అసమంజసంగా పెరిగిపోతుందని, తద్వారా తమకు తీరని నష్టం, అన్యాయం జరుగుతాయని అవి వాదిస్తున్నాయి. దీనిపైనా కేంద్రం వ్యవహార శైలిని విపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. అంతేగాక మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు డీలిమిటేషన్తో ఎందుకు ముడి పెట్టాల్సి వచ్చిందన్నది వాటి ప్రధాన అభ్యంతరం. మహిళా రిజర్వేషన్ల అమలు సాకుతో లోక్సభ స్థానాలను పెంపుకు ఆమోదం పొందేందుకు కేంద్రం ప్రయతి్నస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ విషయంలోమోదీ సర్కారు వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగట్టాలని కూడా భావిస్తున్నాయి. దాంతో సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. దీనికి తోడు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు మోదీ సర్కారుకు విపక్షాల మద్దతు తప్పనిసరి కానుంది! ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై లోతుగా చర్చించాయి. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. విపక్షాలన్నీ డీలిమిటేషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఆయన ప్రకటించారు! ‘‘మేం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోదీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం బిల్లు తెచ్చిన తీరునే వ్యతిరేకిస్తున్నాం’’అన్నారు. సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.గరిష్టంగా 850కి లోక్సభ స్థానాలు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేసేలా 2023లోనే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’పేరుతో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది 2034కు ముందు అమలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అందుకు వీలుగా లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850 దాకా> పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. తుది సంఖ్యను త్వరలో ఏర్పాటయ్యే డీలిమిటేషన్ కమిషన్ నిర్ధారిస్తుంది. దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా జనాభా లెక్కలను, అంటే 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు బిల్లు ముసాయిదాలో వెల్లడించింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా 81వ ఆరి్టకల్కు సవరణలు ప్రతిపాదించింది.అవన్నీ వదంతులే ‘దక్షిణాదికి అన్యాయం’పై కేంద్రం లోక్సభ నియోజకవర్గాల పెంపులో దక్షిణాదికి అన్యా యం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘‘వాస్తవానికి ఆ రాష్ట్రాలకే లబ్ధి చేకూరబోతోంది. సీట్ల పెంపులో దామాషా ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తుండటమే ఇందుకు కారణం’’అని తెలిపాయి. ఈ విషయమై పార్లమెంటులో ప్రధాని స్పష్టత ఇవ్వనున్నట్టు అవి వెల్లడించాయి. దీనిపై వదంతులు ప్రచారం చేయొద్దని సూచించాయి. సవరణ బిల్లు గట్టెక్కేనా? రాజ్యంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. లోక్సభలో మూడు ఖాళీలు పోను ప్రస్తుత సభ్యుల సంఖ్య 540. ఆ లెక్కన మూడింట రెండొంతుల మెజారిటీ 360. అధికార ఎన్డీఏ కూటమికి సభలో ఉన్నది 292 మంది సభ్యులే. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యులు 245. ఒక స్థానం ఖాళీగా ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ 163 కాగా ఎన్డీఏ కూటమికి ఉన్నది 139 సభ్యుల బలమే. కనుక ఉభయ సభల్లోనూ సభ్యులంతా ఓటింగ్కు హాజరయ్యే పక్షంలో బిల్లు ఆమోదానికి అధికార పక్షానికి లోక్సభలో మరో 68 మంది, రాజ్యసభలో 24 మంది ఎంపీలు అవసరం. ఇందుకు విపక్షాల మద్దతు తప్పనిసరి. లోక్సభలో విపక్ష ఇండియా కూటమి బలం 233. మరో 15 మంది చిన్న పార్టీలకు చెందిన/స్వతంత్ర ఎంపీలున్నారు. రాజ్యసభలో ఇండియా కూటమికి 75 మంది, ఇతర విపక్షాలన్నింటికీ కలిపి 30 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో బిల్లు గట్టెక్కడంపై కేంద్రం ధీమా ఏమిటన్నది అంతుపట్టడం లేదు. -
బిహార్కు బీజేపీ సారథ్యం!
మండల్ రాజకీయాలకు పుట్టిల్లుగా మారి, రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పక్షాలకు నిలువనీడ లేకుండా పోయిన బిహార్లో బుధవారం తొలిసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ నాయకుడు సమ్రాట్ చౌధరి నేతృత్వంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం కొన్నేళ్ల క్రితం ఊహించని పరిణామం. అయితే కింగ్మేకర్గా లేదా జూనియర్ భాగస్వామిగా జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వాల్లో కొనసాగుతూ వచ్చిన బీజేపీ... ఎంతో సహనంతో, ఓపికతో సుదీర్ఘకాలం ఈ రోజు కోసం వేచిచూసింది. ఆఖరికి 2020లోనూ, నిరుడు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ)కు మించి స్థానాలొ చ్చినా సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా ఉండిపోయింది. ఎలా ఒప్పించిందో, ఏం చేసిందో... ఆర్నెల్లు కాకుండానే ఆయన్ను రాజ్యసభకు పంపి, ఆ పదవి కైవసం చేసుకుంది. అసలు నిరుడు నవంబర్లో జరిగిన బిహార్ ఎన్నికల సందర్భంలోనే ఈసారి నితీశ్ను సీఎం పదవినుంచి తప్పించి, బీజేపీయే పగ్గాలు చేపడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న ఉద్దేశంతో రెండు పార్టీలూ కొట్టిపారేశాయి. బహుశా తనను తప్పిస్తారని నితీశ్ కూడా ఊహించివుండరు. ఎందుకంటే కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఆయన ఫిబ్రవరిలో బీజేపీ అగ్రనేతలను కలిసి పట్టుబట్టారు. చివరికి తానే ఆ సీటు తీసుకుని, సీఎం పదవి బీజేపీకి అప్పగించాలని నితీశ్ నిర్ణయించటంతో కుమారుడితోపాటు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగారు. పదకొండేళ్లనాడు అప్పటి పార్టీ నేత జితన్రాం మాంఝీని తొమ్మిది నెలలపాటు సీఎం పదవిలో కూర్చోబెట్టడం మినహా దాదాపు 21 ఏళ్లపాటు బిహార్ ఏలికగా నితీశ్ కొనసాగారు. మధ్యలో కూటములు మార్చినా, జనం మాత్రం ఆయన వెనకే దృఢంగా నిలబడ్డారు. మునుపటితో పోలిస్తే పార్టీ అధినేతగా నితీశ్ అంత ఆత్మవిశ్వాసంతో లేరని స్థానిక మీడియా చెబుతూవచ్చింది. ఇది వయసు పైబడటంవల్లనా, పార్టీలోని అంతఃకలహాలా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. మండల్ రాజకీయాలు బలంగా వేళ్లూను కున్న రాష్ట్రాన్ని జాతీయపక్షం చేతుల్లో పెట్టడంపైనా నితీశ్పై విమర్శలొచ్చాయి. కానీ బీజేపీ ఆ రాజకీయాలకు భంగం వాటిల్లకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ తరహాలో బిహార్లో కూడా ఆదినుంచీ సంఘ్ పరివార్ను నమ్ముకున్నవారికే పగ్గాలు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం వాటిని అంగీకరించలేదు. మొదటి నుంచీ పార్టీలో కొనసాగినవారిని కాదని, ఎనిమిదేళ్లనాడు వచ్చిన సమ్రాట్వైపే మొగ్గు చూపటానికి కారణం ఆయన బాగా వెనకబడిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే. బిహార్ ప్రత్యేక పరిస్థితులరీత్యా ఇది తప్పదని అధిష్టానం భావించింది. లాలూ సతీమణి రబ్డీదేవి ప్రభుత్వంలో ఉంటూ 26 యేళ్ల క్రితం బీజేపీ కారణంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న సమ్రాట్... 2018లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయంటారు. కానీ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నా ఎదగటం కష్టమే. తనేంటో నిరూపించుకోవాలి. పార్టీ నాయకత్వానికి నమ్మకం కలిగించాలి. ఆ పని సమ్రాట్ సమర్థవంతంగా చేయబట్టే ఇవాళ సీఎం పదవి అందుకో గలిగారు. యాదవేతర కులాల్లో పట్టు సంపాదించుకోవాలన్న బీజేపీ వ్యూహానికి ఆయన సమర్థత, కులం తోడ్పడ్డాయి.అయితే బిహార్కు సమస్యలు తక్కువేం లేవు. ఇప్పటికీ అది దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ ఎంత గొప్పలుపోయినా బిహార్లో రోడ్లు, ఆరోగ్యరంగం, విద్యారంగం సక్రమంగా లేవు. లాలూ హయాంతో పోలిస్తే మెరుగ్గానే ఉండొచ్చుగానీ... శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదంటారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శకత, జవాబుదారీతనం తన ప్రాముఖ్యతలని ప్రమాణస్వీకారం చేశాక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సమ్రాట్ ప్రకటించటం గమనిస్తే ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో ఆయన సక్రమంగానే గుర్తించారని అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బిహార్ పయనం ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
వారెవ్వా.. అటునుంచి షాక్.. ఇటునుంచి గుడ్న్యూస్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని గంటలకే రాఘవ్ చద్దాకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటరిగీ భద్రత మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యే వరకు తక్షణమే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం రాఘవ్ చద్దా భద్రతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు, రాఘవ్ చద్దా మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య చోటుచేసుకుంది. రాఘవ్ చద్దా భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏప్రిల్ 2న ఆయనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ స్థానం నుంచి తొలగించింది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శాపూర్వకంగా మాట్లాడలేదని ఆరోపించింది. బీజేపీతో టచ్లో రాఘవ్ చద్దా: ఆప్రాఘవ్ చద్దా బీజేపీతో సంప్రదింపులు జరిపారని, ఆయనకు భద్రత ఇవ్వడం ఒక ఒప్పందంలో భాగమని ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. “మా వద్ద ఈ సమాచారం ఉంది, బీజేపీ అగ్రనేతలతో రాఘవ్ సమావేశమై, అతనికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని, రాజ్యసభ ఉపనేతగా అతని స్థానంలో వచ్చిన అశోక్ మిట్టల్పై దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. రాఘవ్ గుర్తుంచుకోవాలి, ఆయనను రాజ్యసభకు వరకు తీసుకెళ్లింది అరవింద్ కేజ్రీవాల్” అని ఆమె తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం ఎందుకు తీసేసింది?రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న విషయంపై ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ, ఆయనకు భద్రతను తొలగించడానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలు అనుమానాలు రేకెత్తించింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాఘవ్ చద్దాను రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగించిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. -
బిహార్ బీజేపీ తొలి సీఎం చదువు, నెట్వర్త్ ఎంతో తెలుసా?
సాక్షి,పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత,సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి బిహార్లో తొలి ముఖ్యమంత్రి ఈయనే కావడం విశేషం. ఆయనతో పాటు, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే నూతన సీఎం సమ్రాట్ చౌదరి ఆస్తులు, విద్యార్హతలపై నెట్టింట ఆసక్తి నెలకొంది.ఆస్తుల వివరాలుసమ్రాట్ చౌదరి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన రూ.9.29 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా, ఆయన సతీమణి మమతా కుమారి రూ.2.01 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. వీరిద్దరి చర, స్థిరాస్తుల మొత్తం విలువ కలిపి మొత్తం రూ.11.31 కోట్లకు పైమాటే. గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయన చరాస్తులు మరియు స్థిరాస్తుల వివరాలను అందించారు. దీని ప్రకారం తారాపూర్ ఎమ్మెల్యే అయిన సమ్రాట్ చౌదరి కుటుంబం వద్ద రూ. 1,71,550 నగదు ఉంది. అఫిడవిట్లో తనకు ఎలాంటి అప్పులు లేవని చౌదరి ప్రకటించారు.pic.twitter.com/Fy8rLbcc6T— Samrat Choudhary (@samrat4bjp) April 15, 2026 ఈ దంపతుల పేరిట బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.27 లక్షలు ఉండగా, ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల విలువైన బంగారం ఉంది. అంతేకాకుండా, వీరి వద్ద రూ.75,000 విలువైన వెండితో పాటు, షేర్లు, బాండ్లు , మ్యూచువల్ ఫండ్లలో రూ.32 లక్షల విలువైన పెట్టుబడులు కూడా ఉన్నాయి. విద్యార్హతలు, వివాదాలుసమ్రాట్ చౌదరి విద్యా అర్హతలు చర్చనీయాంశంగా మారాయి. బిహార్లోని ముంగేర్ జిల్లా, లఖన్పూర్ గ్రామంలో 1968 నవంబర్ 16న జన్మించారు. ఆయన తండ్రి శకునీ చౌదరి కూడా బిహార్లో సీనియర్ నాయకుడు. రికార్డుల ప్రకారం ఆయన తమిళనాడులోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ప్రీ-ఫౌండేషన్ కోర్సు (PFC) పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ఆధారాలు, ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్లు (కొన్నిసార్లు) సాహిత్యంలో డాక్టరేట్ (డి.లిట్.) ఉందని పేర్కొంటుండగా, ప్రశాంత్ కిషోర్ వంటి ప్రతిపక్ష నాయకులు ఆయన పదో తరగతి పరీక్షలోకూడా ఉత్తీర్ణుడు కాలేదని ఆరోపించారు. -
బిహార్ కొత్త సీఎం ఈయనే.. అధికారిక ప్రకటన
పట్నా: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.సామ్రాట్ చౌదరి బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. త్వరలో గవర్నర్ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15న) సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.సామ్రాట్ చౌదరి ఎవరు? సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.సీఎం పదవికి అవసరమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో అనుభవం ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. -
బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!
చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ఓటర్లపై వరాల వర్షం కురిపించింది. చెన్నై వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులు, సామాన్యులే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, ఆర్థిక స్థిరత్వమే మహా మంత్రంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది.మహిళలకే అగ్రపీఠంబీజేపీ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. కుటుంబ యజమానురాళ్లకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ, ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్ఎంఈ లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.జల్లికట్టుకు జైవిద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేరాల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) ఇస్తామని తెలిపింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే అన్నామలై, తమిళసై సౌందరరాజన్ తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 🔴LIVE | பாஜக தாமரை வாக்குறுதி 2026 | தமிழக சட்டமன்றத் தேர்தலுக்கான பாஜகவின் தேர்தல் அறிக்கை வெளியீட்டு விழா#தாமரை_வாக்குறுதி #TNBJPManifesto https://t.co/mHA6ezpAnk— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 14, 2026 -
ఇదిగో ప్రూఫ్.... బాబుని పచ్చి బూతులు తిట్టిన టీడీపీ జనసేన బిజేపీ నేతలు
-
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
బెంగాల్ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత
కోల్కతా: డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్ను మూడు ముక్కలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఒడిశా, బిహార్లలో కలుపుతారే మోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమత మాట్లాడారు. టీఎంసీ నుంచి గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ తనతో రూ.1,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్ కబీర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు. -
బీజేపీ ఎంపీలకు ‘త్రీ-లైన్’ విప్ జారీ
ఢిల్లీ: ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపి (BJP) తన ఎంపీలకు 'త్రీ-లైన్ విప్' జారీ చేసింది. ఈ సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్కు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు.కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ ఈ మూడు రోజుల పాటు సభలోనే ఉండాలని.. ఈ సమయంలో ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.2023 నాటి 'నారీ శక్తి వందన్ అధినియం' ప్రకారం.. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) తర్వాతే అమలు కావాల్సి ఉంది. అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.మరోవైపు, ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా, ఈ చారిత్రాత్మక చట్టంపై అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. -
పశ్చిమ బెంగాల్లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 11) తృణమూల్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. ముర్షిదాబాద్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. -
ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. పొరుగుదేశాల నుంచి చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. వారి కోసం సంక్షేమ పథకాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)కు ఇదొక రోడ్ మ్యాప్ అని ఆయన అభివరి్ణంచారు. అవినీతి, రాజకీయ హింస, చొరబాట్లు, నిరుద్యోగ సమస్యకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రెఫరెండమ్ అని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన ఆక్రమణదారులను, చొరబాటుదార్లను అక్కడి నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. ఆయా భూములకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజా రవాణా సంస్థ వాహనాల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అధికార పార్టీ అవినీతి వ్యవహారాలు, ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి ఐదేళ్లపాటు వయసు సడలింపు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలను పారదర్శకంగా, నైపుణ్యాల ఆధారంగా భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఉద్యోగుల కోసం ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. చేపలు, గుడ్లపై నిషేధం ఉండదు: అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ బిడ్డనే పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే చేపలు, గుడ్లపై నిషేధం విధిస్తారంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నిషేధం ఉండదని స్పష్టంచేశారు.బీజేపీ సంకల్ప పత్రలో కీలకాంశాలు.. → బెంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం చట్టం. → అక్రమ వలసలపై కఠిన చర్యలు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట. → ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా చట్టం. → మహిళలకు ప్రతినెలా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. వారి సాధికారతకు చేయూత. → పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేదాకా నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. → ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం కేంద్ర రేట్లకు అనుగుణంగా మార్పు. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల అమలు. → 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దిగజారిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. → కట్ మనీ(చట్టవిరుద్ధమైన కమిషన్లు/లంచాలు) సంస్కృతికి చరమగీతం. సిండికేట్ వ్యవస్థ అంతం. → ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లోనూ అమలు. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఏర్పాటు. → వరి, బంగాళదుంప, మామిడి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు. పంటలకు గిట్టుబాటు ధరలు. → రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోకి కుర్మాలీ, రాజ్బన్షీ భాషలు. → అత్యున్నత పారిశ్రామిక హబ్గా బెంగాల్ అభివృద్ధి. అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు. → పాత తేయాకు తోటల పునరుద్ధరణ. డార్జీలింగ్ తేయాకుకు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు లభించేలా చర్యలు. జనపనార పరిశ్రమ ఆధునీకరణ. → రాష్ట్రంలో వందేమాతరం మ్యూజియం నిర్మాణం. -
యూపీనుంచి 50వేలమంది, పామునైనా నమ్మొచ్చేమో గానీ : మమత మండిపాటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ల మద్దతుపై నమ్మకం లేక, బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆమె ఆరోపించారు.బీజేపీపై ఘాటు విమర్శలుఅయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 126 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఏప్రిల్ 9, గురువారం నాడు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా అస్సాం ఎన్నికల సరళిపై మమతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ఏ దర్యాప్తు సంస్థా తటస్థంగా లేదని, కాషాయ పార్టీ వాటన్నింటినీ కొనేసిందని ఆరోపించారు. పామునైనా నమ్మవచ్చు కానీ, బీజేపీని మాత్రం నమ్మలేము అంటూ దీదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ నుండి సుమారు 50వేల మందిని రైళ్లలో అస్సాంకు తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులను బదిలీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం డబ్బు, మాదకద్రవ్యాలు, బయటి వ్యక్తులతో ఓటింగ్, లాంటి అక్రమాలకు తెగబడుతోందన్నారు. అయితే తమ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వివాదంపశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పేర్లను తొలగించారని, ఒక వార్తాపత్రిక నివేదిక ప్రకారం, తొలగించిన 90 లక్షల పేర్లలో 60 లక్షలు హిందువులవి, 30 లక్షలు ముస్లింలవి అని కూడా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎన్నడూ నమ్మకూడదని బెనర్జీ అన్నారు. అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి ప్రక్రియలో తొలగించిన 19 లక్షల పేర్లలో 13 లక్షలు హిందువులు, 6 లక్షలు ముస్లింలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో తనను టీఎంసీ అభ్యర్థిగా పరిగణించాలని ఓటర్లను కోరుతూ, "నా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే, అన్ని స్థానాల్లో నేనే అభ్యర్థిని" అని బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనేక షెడ్యూల్డ్ కులాల వారి పేర్లను తొలగించారని, అలాగే తన నియోజకవర్గంలో కూడా ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. అయినా తనకు బెంగాల్ ప్రజలపై నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశిస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల మాంసాహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు.అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ వారిని రక్షించలేని ప్రధాని మోదీ, ఇక్కడ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలకు భద్రత కల్పించిన తర్వాతే మాత్రమే 'సోనార్ బంగ్లా' గురించి మాట్లాడాలన్నారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!) -
పశ్చిమబెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
కోల్కాతా: పశ్చిమబెంగాల్లో మహిళలు, యువత లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పలు వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ హామీలు ఇచ్చింది. ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా అమిత్ షా.. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్నారు.వికసిత్ బెంగాల్ రోడ్మ్యాప్ను మేనిఫెస్టోలో పెట్టాం. పేదలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తామన్న అమిత్ షా.. రైతుల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్లో యూసీసీ అమలు చేస్తామని తెలిపారు.భయం లేని బెంగాల్.. పునర్నిర్మాణమే తమ లక్ష్యం అన్న అమిత్ షా.. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చొరబాటుదారుల ఏరివేత.. 7వ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ చెల్లిపులు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్. రాజకీయ హింస కేసులపై ముమ్మర దర్యాప్తు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూముల కేటాయింపు. ఆవుల స్మగ్లింగ్ నిలిపివేస్తాం. దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు’’ చేస్తామని అమిత్ షా తెలిపారు. -
బెంగాల్ ఎన్నికలు: వీడియో ఎపిసోడ్తో బిగ్ షాక్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నెట్లో వదిలిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్.. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీల ఓట్లను మళ్లించే కుట్ర చేశాడన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ వీడియోను కబీర్ ఖండించినప్పటికీ నష్టం జరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ వీడియోలో హుమాయున్ కబీర్.. బీజేపీ నేతలతో టచ్లో ఉన్నాడని, మైనారిటీ ఓట్లను మళ్లించేందుకు భారీ నిధులు పొందాడని ఉంది. ఏకంగా ప్రధాని కార్యాలయం ఈ కుట్రలో భాగమైందని.. సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో సమన్వయం చేసుకోవాలని పీఎంవో సూచనలు చేసినట్లు ఉంది. అంతేకాదు.. पश्चिम बंगाल चुनाव के बीच हुमायूँ कबीर का सनसनीखेज वीडियोहुमायूँ कबीर ने BJP से 200 करोड़ रुपये की अग्रिम राशि की मांग की।"मुसलमानों को बेवकूफ़ बनाना आसान है, -हुमायूँबाबरी मस्जिद बने न बने लेकिन हमारा काम हो जाएगा- हुमायूँ#humayunkabir #WestBengalAssemblyElection2026 #TMC pic.twitter.com/xlOyKkfDgk— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 9, 2026ముస్లింలను మోసం చేయడం సులభమని.. ఇందుకు బాబ్రీ మసీదు అంశమే ఉదాహరణ అని హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. బెంగాల్ ఓట్లలో ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ నుంచి రూ.200 కోట్లు ముందస్తు నిధులు కబీర్ పొందినట్లు టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. దాదాపు రూ.1000 కోట్లతో ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించిన టీఎంసీ.. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. అయితే హుమాయున్ కబీర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తీసిన వీడియో అని.. 2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తాను టచ్లో లేనని.. ఇది తృణమూల్ నేతల దుష్ప్రచారమని.. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం వెంటనే రాజకీయ ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తాజా వీడియో కలకలం నేపథ్యంలో.. ఆ కూటమిని రద్దు చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్(తెలంగాణ) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రిగా పని చేశారు. బీజేపీలో చేరి అక్కడా కొంత కాలం ఉన్నారు. తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. గత ఏడాది ముర్షీదాబాద్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాబ్రీ మసీదు నమునాతో అక్కడ ఓ మసీదు నిర్మిస్తానని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విమర్శల నేపథ్యంలో.. టీఎంసీ ఆయన్ని బహిష్కరించగా ఏజేయూపీ పేరిట కొత్త పార్టీ స్థాపించాడాయన. తాజా వివాదం ఎన్నికల ముందు మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం.. 294 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
బిహార్ కొత్త సీఎం ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!
పట్నా: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేయనున్నారు.ఏప్రిల్ 14వ తేదీన బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. అనంతరం కొత్త సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతుండడం బిహార్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతారని, రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రభావం తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు.2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి.. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. -
పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
-
కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: శశిథరూర్
తిరువనంతపురం: కేరళలో బీజేపీ భవితవ్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదని అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ఆ పార్టీ అకౌంట్ కూడా ఓపెన్ చేయదు. అసలు ఆ పార్టీ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించబోదు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్-యూడీఎఫ్ మధ్యే ప్రధానంగా ఉండబోతోంది. విజయన్ పాలనలో కనీసం ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. దీనిని మా యూడీఎఫ్ అధికారానికి సంకేతంగా భావిస్తున్నా అని అన్నారాయన. 2011లో తమ ప్రభుత్వానికి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారని.. ఆ సమయంలో తక్కువ మెజారిటీ దక్కిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం భారీ మెజారిటీతో అధికారం కట్టబెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. Thiruvananthapuram, Keralam: Congress MP Shashi Tharoor says, "Last time we had an opportunity to run the government in 2011, the people gave us a very, very narrow majority. This time I'm hoping for a better number, a more comfortable basis for our government to make a real… pic.twitter.com/Fiz3BWtIR4— IANS (@ians_india) April 9, 2026 -
కమలంలో లేఖ కలకలం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతానికి సూచనల పేరిట ప్రధాని మోదీకి కొందరు ఎంపీలు, నేతలు లేఖ రాయడం రాష్ట్ర బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఎంపీలుగా గెలిచాక సంస్థాగతంగా పార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గ స్థాయిల్లో కొందరు నాయకులు, ప్రత్యర్థి, వైరివర్గాలుగా వ్యవహ రించడం, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కొందరు జిల్లాల్లో తమ గ్రూపులకు ప్రాధాన్యతమివ్వడం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా జిల్లాలు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిధిలో తమకు ఎదు రవుతున్న ఇబ్బందులు, తాము స్వేచ్ఛగా వ్యవ హరించకుండా రాజకీయంగా అడ్డుపడుతున్న నేతలు లేదా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో అడ్డంకులు సృష్టించడం, గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పర్యటించకుండా, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తమ తమ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు చేసేందుకు వీలుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులను విరివిగా కేటాయించాలని ఎంపీలు ఈ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. అయితే పనిలో పనిగా రాష్ట్రంలో పార్టీపరిస్థితి, పుంజుకోకపోవడానికి కారణాలు, కొందరు నేతల వ్యవహారశైలి, ఆధిపత్యధోరణి, సర్వం తామే అన్నట్లుగా అన్ని విషయాల్లో కలగజేసుకోవడం తదితర అంశాల గురించి ఇందులో ప్రముఖంగా వివరించినట్లు పార్టీనేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ ఎంపీలు (ఇద్దరు కేంద్రమంత్రులు మినహా) ఈ లేఖ రాయడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించుకుంది. వీరిలో కొందరు ఎంపీలు మాత్రం తమ నియోజకవర్గాలకు సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపునకు సంబంధించి ‘రిప్రంజేటేషన్స్’ఇచ్చామని మాత్రం అంగీకరిస్తున్నారు. ఓ ఎంపీ మాత్రం ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ‘లేఖరాశాం.. అందులో తప్పేముంది?’అంటూ నేరుగానే సమాధానం ఇచ్చారు. లేఖల కల్చర్ లేదు.. కాదు ఉంది..ఇదిలాఉంటే...బుధవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడినపుడు ఈ లేఖ విషయం ప్రస్తావనకు వచ్చింది. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని, ఒక వ్యక్తి మీద ఎప్పుడు పార్టీ నడవదని టీమ్ గా బీజేపీ పని చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలు హేట్ స్పీచ్ కిందకే వస్తాయా? రావా? అన్నది సీఎం రేవంత్ చెప్పాలన్నారు. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పందిస్తూ లేఖలు రాసే సంస్కృతి లేదన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని డా.లక్ష్మణ్ అంటున్నారని, ఆయన బీజేపీ సీనియర్ నేతగా స్వయంగా తన మీదనే లేఖ రాశారన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు, బూతులు తిడుతున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని అర్వింద్ పేర్కొన్నారు. -
కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్ చంద్రశేఖర్!
రాజీవ్ చంద్రశేఖర్. ఇంజనీర్గా మొదలుపెట్టి, వ్యాపారవేత్తగా మారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత. దేన్ని ఎక్కడ ఎలా ముగించాలి, ఎప్పుడు కొత్త మార్గాల్లో అడుగువేయాలనే ఎరుక కలిగిన వ్యక్తి. కేరళ బీజేపీ సారథిగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల పోరాటాన్ని ముందుండి నడుపుతున్నారు. బీజేపీకి అందని రాష్ట్రమైన కేరళలో ఈసారి ఎలాగైనా గెలుపు అందించి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉన్నారు. మోదీ హవాను పసిగట్టి రాజీవ్ 2006లో రాజకీయ రంగప్రవేశం చేశారు. కర్ణాటకలోని అధికార జేడీ(ఎస్), బీజేపీ కూటమి ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పాలనా సంస్కరణలు, జాతీయ భద్రత, సాయుధ దళాల సిబ్బంది, ముఖ్యంగా మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేశారు. 2012, 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దేశ రాజకీయాలు మోదీకి అనుకూలంగా మారుతున్నాయని రాజీవ్ ముందే పసిగట్టారు. 2014కు ముందు నుంచే మోదీని సమరి్థంచడం ప్రారంభించారు. 2020లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 2021లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి అయ్యారు. డిజిటల్ పాలన, డేటా భద్రతా విధానాలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ పాలన, సాంకేతిక విధానాల్లో లోతైన పరిజ్ఞానమున్న పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. 2023లో కేరళ బీజేపీ సారథిగా పగ్గాలందుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ చేతిలో ఓడారు. కేరళ చరిత్రలో బీజేపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం నెమోమ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆసక్తికర నేపథ్యం రాజీవ్ చంద్రశేఖర్ స్వస్థలం కేరళలో త్రిసూర్ జిల్లాలోని దేశమంగళం. 1964లో అహ్మదాబాద్లో మలయాళీ నాయర్ కుటుంబంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ వైమానిక దళంలో ఎయిర్ కొమొడోర్గా పనిచేశారు. దాంతో రాజీవ్ బాల్యం దేశమంతటా భిన్న సంస్కృతుల మధ్య గడిచింది. ఆయన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. స్టార్టప్ల గురించి కనీసం వినని 1981లో ఢిల్లీకి చెందిన ఓ ఐటీ స్టార్టప్లో ఉద్యోగం సంపాదించారు. తండ్రి ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లి ఇలినాయీ వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. ఇంటెల్లో డిజైన్ ఇంజనీర్గా చేసి భారత్కొచ్చారు. బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నంబియార్ కుమార్తె అంజును పెళ్లాడారు. 2005లో జుపిటర్ క్యాపిటల్ అనే పెట్టుబడి సంస్థను స్థాపించారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడే ఏషియానెట్ కమ్యూనికేషన్స్లో 51 శాతం వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో యాంకర్ అర్నాబ్ గోస్వామితో కలిసి రిపబ్లిక్ టీవీని స్థాపించారు.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!జేబులో పెన్సిల్ : ముఖ్య విషయాలు నోట్ చేసుకోవడానికి రాజీవ్ చంద్రశేఖర్ జేబులో నిత్యం పెన్సిల్ ఉంచుకుంటారు. ‘‘ప్రతిదాన్నీ తిరగరాయడం ఆయనకిష్టం. చివరకు చరిత్రను కూడా’’అని విపక్ష నేతలు చమత్కరిస్తుంటారు! ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి – సాక్షి, నేషనల్ డెస్క్ -
పట్టు కోసం ‘దీదీ’.. పక్కా వ్యూహంలో బీజేపీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక సిగలో ప్రధాన కేంద్రంగా నిలిచిన కోల్కతా.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు మరోసారి అత్యంత కీలక యుద్ధభూమిగా మారింది. కోల్కతాలో తన పట్టు నిలుపుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టుదలతో ఉండగా, పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునే పక్కా వ్యూహంతో బీజేపీ బరిలోకి దిగింది. తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఈసారి ఎన్నికల పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉండనుందో స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉన్నప్పటికీ, బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త అర్బన్ వ్యూహాలతో పోరు మరింత ఉత్కంఠ భరితంగా మారనున్నదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.అసలు సిసలు పోరుకోల్కతా నగర పరిధిలో సుమారు 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హై-ప్రొఫైల్ స్థానం ‘భవానీపూర్’. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బీజేపీ కీలక నేత సువేందు అధికారికి మధ్య నేరుగా కురుక్షేత్రం నెలకొంది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ ప్రకారం, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 140 నుంచి 170 స్థానాలను గెలుచుకోవచ్చని, అదే సమయంలో బీజేపీ సైతం బలమైన పోటీనిస్తూ 100 నుంచి 150 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది రసవత్తరమైన పోటీని సూచిస్తున్నది.కోల్కతాలో గట్టి పోటీ..గ్రామీణ బెంగాల్తో పోలిస్తే కోల్కతా నగరంలో అధికార పార్టీకి సవాలు గట్టిగానే ఉండబోతోందని రాష్ట్ర స్థాయి వర్గాలు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను, పాలనాపరమైన లోపాలను, పట్టణ ఓటర్లలో రగులుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ‘ ఈసారి కోల్కతాలో ఏ పార్టీకీ ఏకపక్ష విజయం దక్కదు. టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత పునాది ఉన్నప్పటికీ, నగరంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది’ అని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.బలమైన సానుకూల అంశాలునగరంలో పోటీ తీవ్రంగా మారుతున్నప్పటికీ, అధికార పార్టీకి ఇప్పటికీ పలు బలమైన సానుకూల అంశాలు ఉన్నాయి..గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ఏర్పడిన పటిష్టమైన సంస్థాగత నెట్వర్క్.పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు.ముఖ్యంగా దక్షిణ కోల్కతాలో మమతా బెనర్జీకి ఉన్న వ్యక్తిగత ఆదరణ, ఛరిష్మా.భవానీపూర్, బల్లిగంజ్, ఉత్తర కోల్కతాలోని పలు ప్రాంతాల్లో టీఎంసీ సంస్థాగతంగా అత్యంత బలంగా ఉందని రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయి సమీకరణాలు ఇప్పటికీ ఆ పార్టీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి.వ్యూహం మార్చిన ‘కమలం’మరోవైపు, బీజేపీ కూడా కోల్కతాపై మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే ఆధారపడిన ఆ పార్టీ.. ఇప్పుడు తన పంథా మార్చుకుంది. నగరంలోని మౌలిక సదుపాయాల కొరత, ఉద్యోగాల సృష్టి, పౌర సమస్యలను ఎత్తిచూపుతూ నిర్దిష్ట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ‘మైక్రో-లెవల్’ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కోల్కతాలోని కీలక స్థానాలను గెలుచుకోవడం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకమని బీజేపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణంహోరాహోరీ ప్రచారాలు, వీధి స్థాయి ఘర్షణలు, భవానీపూర్ లాంటి ప్రతిష్టాత్మక పోరుతో కోల్కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ట్రాఫిక్ రద్దీ నుంచి వాయు కాలుష్యం వరకు నగరంలోని పౌర సమస్యలు కూడా ఈసారి ఓటర్ల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పౌర సమాజ సంఘాలు సైతం ఈ పట్టణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.తీర్పు ఎటువైపు?ఒపీనియన్ పోల్స్, గత ఎన్నికల చరిత్ర టీఎంసీకి కాస్త పైచేయి ఇస్తున్నప్పటికీ.. బీజేపీ అనూహ్యంగా బలపడుతుండటంతో ‘సిటీ ఆఫ్ జాయ్’లో ఇకపై వన్సైడ్ వార్ లేనట్టే. పోలింగ్ శాతం, అభ్యర్థుల ఎంపిక, చివరి నిమిషంలో జరిగే ప్రచార సరళి.. ఇవన్నీ కోల్కతాలోని పలు నియోజకవర్గాల్లో మెజారిటీని తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. పార్టీల ఎత్తులు, పైఎత్తులతో కోల్కతా పోరు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.ఇది కూడా చదవండి: ‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో.. -
‘ప్రాంతీయ’ వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ప్రవేశద్వారం అస్సాంలో ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగింది. కంచుకోటను కాపాడుకుని హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంక్షేమం, జాతీయవాద అ్రస్తాలతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ‘ఐక్య’మంత్రం 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ నిలకడగా 25 నుంచి 30 శాతం ఓట్లు సాధించినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రాంతీయ పార్టీల మధ్య చీలడంతో బీజేపీ గెలుపు సునాయాసం అవుతూ వచ్చింది. దాంతో ఈసారి కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఓట్ల విభజనకు అడ్డుకట్ట వేసే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల్లో, గ్రామీణ వర్గాల్లో పట్టున్న అఖిల్ గొగోయ్ సారథ్యంలోని రైజోర్ దళ్, యువతను ప్రభావితం చేయగల లురిన్జ్యోతి గొగోయ్ నేతృత్వంలోని అస్సాం జాతీయ పరిషత్ను తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు సంప్రదాయ, మైనారిటీ ఓటర్లను సంఘటితం చేయడంపై పీసీసీ చీఫ్ నేత గౌరవ్ గొగోయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓట్ల బదిలీపైనే ఆశలు ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో 8 నుంచి 15 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఓటు బ్యాంకును ఈసారి కాంగ్రెస్ కూటమికి పక్కాగా బదిలీ చేసుకోగలిగితే 40 శాతానికి పైగా ఓట్లు రావడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. 60 నుంచి 70 స్థానాలతో విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. కాకపోతే భిన్న సిద్ధాంతాలున్న ప్రాంతీయ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే విభేదాలను పక్కనపెట్టి పార్టీల నేతలంతా ఉమ్మడిగా పని చేసేలా ప్రత్యేక సమన్వయ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ‘హిమంత’కోట పదిలమేనా? గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాం ప్రజలు కమలనాథులకే పట్టం కట్టారు. 2016 ఎన్నికల్లో సొంతంగా 60 స్థానాలు నెగ్గిన బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లోనూ సొంతంగా 60, మిత్రపక్షాలతో కలిసి 75 సీట్లు నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సారథ్యంలో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భావిస్తోంది. మైక్రో మేనేజ్మెంట్, క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య సమన్వయంతో దూసుకెళ్తోంది. భారీ మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. శాంతిభద్రతల పరిరక్షణ కూడా సానుకూలాంశమే. పదునైన హిందూత్వ ఎజెండా, బంగ్లాదేశ్ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలను ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ను హిమంత ఆత్మరక్షణలో పడేశారు.


