అపుడు స్టార్ యాక్టర్‌.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం! | Meet Child Actress Keerthana Cracks UPSC Exam Now An IAS Officer | Sakshi
Sakshi News home page

అపుడు స్టార్ యాక్టర్‌.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!

Apr 16 2025 4:41 PM | Updated on Apr 16 2025 5:22 PM

Meet Child Actress Keerthana Cracks UPSC Exam Now An IAS Officer

కొంతమంది అనుకోకుండా యాక్టర్లు అవుతారు. మరికొంతమంది డాక్టర్‌ కాబోయి  యాక్టర్లు అవుతారు.  ఇంకొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా  రంగంలో ఎంట్రీ ఇచ్చి,  ఆ  తరువాత   స్టార్‌ హీరోహీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటారు. కానీ సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా  మంచి గుర్తింపును, పేరును తెచ్చుకున్నట్టప్పటికీ,  వేరేరంగంలో పేరు రాణించడం చాలా అరుదు. పలు సినిమాలలో నటించి క్రేజ్‌, ఫామ్‌ను వదిలిపెట్టి, ఇపుడు ఐఏఎస్‌ ఆఫీసర్గా రాణిస్తున్న హెచ్‌సీ కీర్తన  సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

భారతీయ సినిమా మనకు అనేక మంది ప్రఖ్యాత  కళాకారులు అందించింది.  తమకంటూ ఒక పేరును చెక్కుకుని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.  వారి అద్భుతమైన నటనకు  దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో ఒకరు. హెచ్‌సి కీర్తన. ఆమె బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి, అనేక మంది ప్రముఖ తారలతో కలిసి నటించింది.  32 కి పైగా చిత్రాలలో నటించింది. 48 టీవీ షోలలో కనిపించింది.  కర్పూరద గొంబే, గంగా-యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్, హబ్బా, డోరే, సింహాద్రి, పుత్రీ, జననీ, జననీ  ఉన్నాయి.  అనేక సినీపాత్రలతో అపారమైన ప్రజాదరణ పొందింది.  

చదవండి: ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!

అద్భుతమైన  ఫామ్‌ కొనసాగుతున్న సమయంలోనే తన చదువుపై దృష్టి పెట్టడానికి పరిశ్రమను విడిచి పెట్టాలని నిర్ణయించుకుంది.  దేశానికి సేవ చేయడానికి  15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. IAS ఆఫీసర్ కావాలనే తన తండ్రి కల, తన కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించింది.  నటనా జీవితానికి  బై బై  చెప్పేసి  యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యింది. అయితే తన కల  అంత ఈజీగా సాకారం కాలేదు. ఐదుసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన, చివరికి  ఆరో ప్రయత్నంలో  విజయం సొంతం చేసుకుంది. UPSC పరీక్షలో ఆలిండియా లెవెల్ లో ఆరో ప్రయత్నంలో 167వ ర్యాంక్ ను ఆమె సాధించారు. ప్రస్తుతం కీర్తన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తోంది.గతంలో కీర్తన  కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా కూడా సేవలు అందించి ప్రశంసలు అందుకోవడం విశేషం.

ఇదీ చదవండి: మొబైల్‌ పోయిందా డోంట్‌ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement