ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ పోలీసులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది.
డోన్ పోలీసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
Feb 10 2017 2:32 PM | Updated on Sep 5 2017 3:23 AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ పోలీసులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్తే.. అకారణంగా దాడి చేశారని.. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తుమని వేధిస్తుండటంతో బాధిత దంపతులు శుక్రవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement