వ్యక్తి అనుమానాస్పద మృతి | A person Suspicious Death | Sakshi

వ్యక్తి అనుమానాస్పద మృతి

Dec 5 2015 9:37 AM | Updated on Sep 3 2017 1:33 PM

వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో శనివారం ఉదయం వెలుగుచూసింది.

వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బోయ రామన్న(40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో రాత్రి పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు ఉన్న చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement