ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి | andhra bank PO looted of rs.5 lakh cash at mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి

Published Fri, Oct 31 2014 9:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి - Sakshi

ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి

ముంబయి : ముంబై రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం దారి దోపిడీ జరిగింది.  ప్రకాశం జిల్లా ఆంధ్రాబ్యాంక్ లో పీవోగా పనిచేస్తున్న సుబ్బారావు దోపిడీకి గురయ్యారు. రైల్వే స్టేషన్ కు వస్తున్న ఆయనను దుండగులు చితకబాది  అయిదు లక్షల నగదును దోచుకు వెళ్లారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా సుబ్బారావు సింగరాయకొండకు చెందినవారు. ఆయన వద్ద దుండగులు నగదుతో పాటు విలువైన వస్తువులు దోచుకు వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ముంబయి రైల్వే పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement