
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కన్నబాబు, కొడాలినాని, పేర్నినాని, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి , పార్థసారధి, మల్లాది విష్ణు, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రధానం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment