teachers day
-
జనవరి 3న మహిళా టీచర్ల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జనవరి 3న అధికారికంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను విద్యాశాఖ బడ్జెట్ నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆ మహనీయురాలి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మహిళలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
World Teachers Day : టీచర్ల హక్కుల సాధనకు గుర్తుగా..
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యా రంగంలో వారి సేవలను అభినందించడం కోసం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఉద్యోగం మాత్రమే చేయరని, వారు చిన్నారులను చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దుతారని ఈరోజు గుర్తుచేస్తుంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 1994లో ప్రారంభమైంది. ఉపాధ్యాయ విద్య- వారి కార్యాలయంలో ప్రమాణాలపై రూపొందించిన సిఫార్సులను యునెస్కోతో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ఆమోదించినందుకు గుర్తుగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల హక్కులు, వారి పని పరిస్థితులు, వారి వృత్తిపరమైన బాధ్యతలను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గుర్తు చేస్తుంది.ప్రతి సంవత్సరం యునెస్కోతో పాటు విద్యా రంగానికి సంబంధించిన సంస్థలు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కోసం ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటాయి. 2024 థీమ్ ‘ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం: విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం’. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, విద్యా నాణ్యత మెరుగుదల, నూతన విద్యా విధానాలపై చర్చిస్తారు. ఇది కూడా చదవండి: ఇంటి భోజనం.. భారం! -
మంచి గురువును ఎంచుకోవడం ఎలా?
-
మనల్ని నడిపించే మార్గదర్శి గురువు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళిమాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు.విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.#TeacherDay pic.twitter.com/M7LwkkTawA— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2024 -
వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్
విశాల విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి.. ఉపాధ్యాయుడుగా పనిచేశారు. చైనాలో అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత కూడా. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తితో విదేశీ పర్యాటకులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్కు సైకిల్ మీద వెళ్లేవాడు.ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్గా కూడా పనిచేశాడు. తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడాని ఇదొక అద్భుత అవకాశంగా భావించారు. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికంటే.. భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు.విద్య & ఉద్యోగంఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో జాక్ 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాసారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా మూడోసారి పరీక్ష రాసి విజయం సాధించారు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు.చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు.ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో ఆంగ్ల అనువాదం, వివరణను అందించడానికి 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించారు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని వచ్చింది. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు.అంతర్జాలం (ఇంటర్నెట్) అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. ఆ సమయంలోనే రూ.1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు.దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్.. జాక్కు చెప్పారు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్సైట్ను ప్రారంభించాలనుకున్నారు.ఇదీ చదవండి: నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానంఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించారు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది.ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం నేటీకి ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..!
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!గురువులకే గురువు..యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.గురువు గొప్పదనం..మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?) -
టాలీవుడ్లో గురుశిష్యులు.. వీరిబంధం చాలా ప్రత్యేకం!
శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్ఫుల్ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు.. నేడు గురువుల దినోత్సవం సందర్భంగా అలా సక్సెస్ సాధించిన కొందరిని గుర్తు చేసుకుందాం.సుకుమార్ మార్క్తన దర్శకత్వంతో పాటు రైటింగ్స్తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. సుకుమార్ లాగే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. తొలి సినిమాలతోనే సూపర్ హిట్స్ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు.తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు.► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన బుచ్చిబాబు సన.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్ ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్గా లాంఛ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.► టాలీవుడ్లో మరో సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడు.► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు.► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే.► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.► ఇండస్ట్రీలో స్టార్ రైటర్గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్కు సపోర్ట్గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్గా పనిచేశారు.చిరంజీవి- విశ్వనాథ్ల బంధంతెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు.ఆర్జీవీకి ఆయనే ప్రత్యేకం..ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జీవీకి చాలా మంది శిష్యులున్నప్పటికీ.. వారిలో ప్రియశిష్యుడు మాత్రం పూరి జగన్నాధ్ మాత్రమే.సంగీతంలో మణిశర్మ..సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్, మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్, హారీశ్జైరాజ్ కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు.దాసరి నారాయణరావు- మోహన్ బాబుటాలీవుడ్లో దాసరినారాయణరావు- మోహన్ బాబుల అనుబంధం మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి కొన్ని సినిమాలలో నటించారు. మోహన్ బాబు ఎప్పుడూ తన గురువును గుర్తు చేసుకుంటారు. వీరిద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గురు, శిష్యులుగా పేరుపొందారు.రాఘవేంద్రరావు- రాజమౌళితెలుగు సినిమాలో ప్రతి విషయాన్ని వీరిద్దరూ చేసుకుంటుంటారు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అయినా కూడా.. తన స్క్రిప్టును మొదట రాఘవేంద్రరావుకు వినిపించాల్సిందేనట. టాలీవుడ్ మరో క్రేజీ గురుశిష్యుల బంధం రాఘవేంద్రరావు- రాజమౌళిదే.త్రివిక్రమ్- పోసాని కృష్ణమురళిగురు, శిష్యుల బంధానికొస్తే తెలుగులో త్రివిక్రమ్- పోసానిది విడదీయరానిబంధం. అందుకే తన గురువైన పోసానికి త్రివిక్రమ్ సినిమాల్లో ప్రత్యేకమైన రోల్స్ ఇస్తున్నారు. అంతకుముందు పోసాని దగ్గర చాలా ఏళ్ల పాటు త్రివిక్రమ్ అసిస్టెంట్గా పనిచేశారు. అందుకే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ప్రతీ సినిమాలోనూ తన గురువైన పోసానికి పాత్ర ఇస్తాడు. -
47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: విద్యా బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించనుంది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు కలిపి మొత్తం 113 మందికి ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది హెచ్ఎంలు, 23 మంది స్కూల్ అసిస్టెంట్లు, 12 మంది ఎస్జీటీలు, ఉన్నత విద్యలో పనిచేస్తున్న 55 మందిఅధ్యాపకులు, ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 11 మంది లెక్చరర్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..ప్రధానోపాధ్యాయులు: టి భాస్కర్ (పాఠశాల/జిల్లా: తెల్లాపూర్, సంగారెడ్డి), మెస నరేందర్ (ఆలూరు, నిజామాబాద్), ఏవీ సత్యవతి–రిటైర్డ్ (నయాబజార్, హైదరాబాద్), ఎస్.కె. తాజ్బాబు (రాయదుర్గ్, రంగారెడ్డి), టి సునీత (కోటకొండ, నారాయణ్పేట్), బి. బాపూరెడ్డి (కుషాయిగూడ, మల్కాజ్గిరి), పి.శంకర్గౌడ్ (యాప్రాల, వనపర్తి), పి. పద్మజ (కసనగోడ, నల్లగొండ), కె.నర్సయ్య (అంకోలి, ఆదిలాబాద్), కె.ఇందుమతి(హసన్పర్తి, హనుమకొండ), డాక్టర్ ప్రభు దయాల్ (రామాపురం, కొత్తగూడెం), జి. రాజన్న (హనుమకొండ).స్కూల్ అసిస్టెంట్లు: కె. నర్సింహులు (ఇబ్రహీంనగర్, మహబూబ్నగర్), కొంక అనురాధ (కొత్తూరు, వరంగల్), కూన రమేశ్ (చిచోలి–బి, నిర్మల్), ముద్దుకృష్ణ (దుబ్బ, నిజామాబాద్), జె. రాజశేఖర్రావు (చిన్నముద్దునూర్, నాగర్కర్నూల్), ఎస్.సురేందర్ (అన్నారం, మంచిర్యాల), సీహెచ్ షర్మిల (అలుబాక, ములుగు), ఎం.రమేశ్ (బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి), జి.రాజయ్య (మొగుళ్ళపల్లి, భూపాలపల్లి), జి.అంజన్కుమార్ (ఎనీ్టపీసీ జ్యోతినగర్, పెద్దపల్లి), కృష్ణకాంత్ నాయక్ (మిర్యాలగూడ, నల్లగొండ), సీహెచ్ గిరిప్రసాద్ (తిమ్మాపురం, సూర్యాపేట), ఎన్.అమరేందర్ రెడ్డి (కొంపల్లి, భూపాలపల్లి), పి.శంకర్గౌడ్ (శివనగర్, సిరిసిల్ల), జి.వెంకటేశ్వర్లు (పెద్దగోపతి, ఖమ్మం), కె.సత్యం(కందానెల్లి, వికారాబాద్), టి.స్వర్ణలత (పాల్వంచ, కామారెడ్డి), వి.రామకృష్ణ(చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి), పి.రూపారాణి (సిరిసినగండ్ల, సిద్దిపేట), ఆర్.కృష్ణప్రసాద్ (నాగ్పూర్, మెదక్), హెచ్.విజయకుమార్ (ముడిమనిక్, సంగారెడ్డి), కె.కృష్ణయ్య(కుత్బుల్లాపూర్, రంగారెడ్డి). ఎస్జీటీలు: జె. శ్రీనివాస్ (అక్కపల్లిగూడ, మంచిర్యాల), వై.వెంకటసురేశ్ కుమార్ (రామంచ, సిద్దిపేట), పి.రఘురామరావు (జీడీపల్లి, నాగర్కర్నూల్), దాసరి శంకర్ (పీచర్ల, నిర్మల్), పల్సి శ్రీనివాస్ (భైంసా, నిర్మల్), కె సుధాకర్ (తిడుగు, జనగాం), డి.కవిత(పెద్ద రాజమూర్, మహబూబ్నగర్), ఎం. క్రాంతికుమార్ (సింగన్నగూడ, సిద్దిపేట), కె. నాగేశ్వరి (పటేల్గూడ, సంగారెడ్డి), దల్లి ఉమాదేవి (ఆర్ఎన్ గుట్ట, భద్రాద్రి కొత్తగూడెం), జి. శ్రీనివాస్ (కీసరగుట్ట, మల్కాజ్గిరి), ఎంఎ అలీమ్ (గద్వాల్, నిజామాబాద్) -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్గా , గ్లోబల్ అఫైర్స్లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్లో ట్రైనర్గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్గా పనిచేశాడట. -
కాలు జారిన సీఎం
-
విద్యపై ఖర్చు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడి
సాక్షి, విశాఖపట్నం: విద్యపై చేస్తున్న ఖర్చు మన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ కుటుంబ సభ్యులేననీ, ప్రతి ఉద్యోగి ప్రభుత్వంలో అంతర్భాగమేనని వారిపై పనిఒత్తిడి తగ్గించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. విశ్వవిద్యాలయాల్లో 3,200 పోస్టుల భర్తీ రాష్ట్రంలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? కేవలం సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యమయ్యాయి. 7 లేదా 8 తేదీల్లో జీతాలు జమచేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ‘నో అడ్మిషన్’ బోర్డులు పెడుతున్నాం. అదేవిధంగా.. ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఎక్కువ స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులే దక్కించుకున్నారు. వీటన్నింటికీ కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇక విద్య మీద ఖర్చుచేసే ప్రతి రూపాయి రాష్ట్రం మీద పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. గత 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాల్లేవు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 3,200 పోస్టులు భర్తీని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తాం. ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుంది.. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు విశాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. సీఎం జగన్ న్యాయం చేయలేకపోతే ఉపాధ్యాయులకు మరెవ్వరూ మేలు చేయలేరు. ఒక రోజు అటు ఇటుగా అందరికీ న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ‘విద్యావ్యవస్థలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి పాఠశాలలను మెరుగుపరచేందుకు అనేక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది’ అన్నారు. ‘ప్రపంచ జ్ఞానం నేర్పే గురువులకు కృతజ్ఞతాభివందనాలు’ ‘బిడ్డ గొప్పగా ఎదిగితే.. ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆనందం.. ఆకాశాన్నంటుతుంది. వందలు.. వేల పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ప్రతి టీచర్కు లభించే సంతోషం, సంతృప్తి ఇంకెంత గొప్పదో మాటల్లో చెప్పలేం. శిక్షణ, క్రమశిక్షణ.. పాఠాలు, జీవిత పాఠాలు.. అక్షరజ్ఞానం, ఆలోచనలు.. ప్రపంచ జ్ఞానం అన్నీ నేర్పే గురుబ్రహ్మలకు, మేథోశక్తులకు ఆదర్శప్రాయులైన మంచి టీచర్లకు, రాష్ట్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు. (విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ సందేశాన్ని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు చదివి వినిపించారు.) రాష్ట్రపతి, ప్రధాని సందేశాలు ఇక గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతిముర్ము సందేశాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి... ప్రధాని మోదీ సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చదివి వినిపించారు. అనంతరంరాష్ట్రవ్యాప్తంగా 11 కేటగిరీల్లో 196 మందికి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ డా.భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, విశాఖ మేయర్ జీహెచ్వీ కుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నాగరాణి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్రం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులకు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023కుగాను ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించారు. ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన అర్చన నూగురి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ భేడోద్కర్లు అవార్డులు అందుకోగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్–ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ అందించే ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీలో హైదరాబాద్ ఎన్ఐఎంఎస్ఎంఈ ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీ నుంచి ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో నెల్లూరుకు చెందిన మేకల భాస్కర్రావు, విశాఖపట్నం శివాజీ పాలెంకు చెందిన మురహరరావు ఉమా గాంధీ, రాయచోటికి చెందిన సెట్టెం ఆంజనేయులు అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పాల్గొన్నారు. -
సానపెడితే పిల్లలు జాతిరత్నాలే!
సాక్షి, హైదరాబాద్: సరైన రీతిలో సానబడితే ప్రతీ విద్యార్థి జాతిరత్నమేనని.. అది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గురుపూజా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, లక్షకుపైగా టీచర్లున్న విద్యా శాఖ ఓ పెద్ద కుటుంబమని.. గురుపూజోత్సవం తమకు ఓ పెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి చదువు నేర్పిన మాస్టార్లు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతార న్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి టీచర్ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మనఊరు మనబడి ఓ విప్లవాత్మక పథకమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కాగా సాంకేతికపరంగా విద్యా రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అధ్యాపకులు అడు గులు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 128 మంది టీచర్లను సత్కరించారు.ఎమ్మెల్సీలు కూర రఘో త్తమరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సురభివాణి, వర్సిటీల వీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సుద్ధాల అశోక్ తేజ రాసిన ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ సాంగ్ విన్నారా?
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా.. మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ఈ మూవీ నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గొప్ప సమాజం రూప కల్పనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అందుకనే వారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు. అలాంటి టీచర్స్కు అంకితమిచ్చేలా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను రూపొందించారు.ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ ఈ పాటకు లిరిక్స్ అందించగా, ప్రముఖ సింగర్ మనో అద్బుతంగా ఆలపించారు. చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచర్స్ వల్లే అది సాధ్యమవుతుంది. అలాంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా మా సినిమాలో ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాట ఉంది. మంచి టీమ్ సపోర్ట్తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ఈ సినిమా’అని అన్నారు. ‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది’అని డైరెక్టర్ అంజిరామ్ అన్నారు. -
విశాఖలో ఘనంగా గురుపూజోత్సవం, పాల్గొన్న మంత్రులు
-
ఈ ఐదుగురు.. స్కూలు టీచర్లు కాదు.. కానీ ఉత్తమ ఉపాధ్యాయులు!
నిరుపేదలకు ఆర్ధిక సహాయం చేయడం, వారికి ఆహారం ఇవ్వడం లాంటివి చాలామంది చేస్తుంటారు. కానీ వీటన్నింకంటే గొప్ప దానం విద్యాదానం. చదువుకునేందుకు తాపత్రయ పడేవారికే విద్యకున్న నిజమైన ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ జ్ఞానాన్ని తమ వద్దే ఉంచుకోవడమే కాకుండా ఇతరులకు పంచే బాధ్యతను కూడా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ పిథోరా: విద్య విలువ తెలుసుకుని.. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన ముఖేష్ పిథోరా పేద, నిస్సహాయస్థితిలో ఉన్న పిల్లల కోసం తన సమయాన్ని, జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు ముఖేష్. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ముఖేష్ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే విద్యను అభ్యసించారు. పలువురు పేద పిల్లలు విద్యను అభ్యసించడానికి తగిన వనరులు లేని కారణంగా విద్యారంగంలో ముందుకు సాగలేకపోతున్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉచిత విద్యను అందించాలని ముఖేష్ నిర్ణయించుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తన వద్దకు వచ్చే పేద, నిస్సహాయ పిల్లలకు విద్యా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వారినుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరు. అరుప్ ముఖర్జీ: సొంత సొమ్ముతో పాఠశాల ట్రాఫిక్ కానిస్టేబుల్ అరూప్ ముఖర్జీ 1999లో కోల్కతా పోలీస్ ఫోర్స్లో చేరారు. తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టారు. తన 6 సంవత్సరాల వయస్సులోనే పాఠశాల ప్రారంభించాలని కలలు కన్నారు. 43 ఏళ్ల అరూప్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన డ్యూటీ చేయడమే కాకుండా, పేద గిరిజన పిల్లలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ముఖర్జీ ఏర్పాటు చేసిన పుంచ నబాదిశ మోడల్ స్కూల్ 126 మంది సబర్ పిల్లలకు వసతి, ఆహారం, ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తుంది. ముఖర్జీ ఈ పాఠశాలను 2011లో నిర్మించారు. కోల్కతాకు 280 కి.మీ దూరంలో ఉన్న పుంచ గ్రామంలోని ఈ పాఠశాలకు రూ.2.5 లక్షల ప్రాథమిక నిధి తన సొంత పొదుపు నుంచి ముఖర్జీ వెచ్చించారు. దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఈ పాఠశాలను నిర్మించారు. అరూప్ తన జీతంలో ప్రతీనెల రూ.20 వేలు స్కూల్ కోసం వెచ్చిస్తున్నారు. వ్యవసాయంతో వచ్చే ఆదాయంతో అతని కుటుంబం బతుకుతోంది. డాక్టర్ భరత్ శరణ్: వైద్యులను తీర్చిదిద్దుతూ.. రాజస్థాన్కు చెందిన డాక్టర్ భరత్ శరణ్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో 11వ తరగతికి చెందిన వెనుకబడిన 25 మంది విద్యార్థులకు, 12వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. డాక్టర్ శరణ్ మీడియాతో మాట్లాడుతూ తాను గత 7 సంవత్సరాలుగా ఈ కోచింగ్సెంటర్ నడుపుతున్నానని తెలిపారు. అతని ఇన్స్టిట్యూట్లో చదివిన 30 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందారు. ఐదుగురు ఎయిమ్స్లో పనిచేస్తున్నారు. కొందరు వెటర్నరీ మెడిసిన్లో ఉన్నారు. మరికొందరు ఆయుర్వేద రంగంలో కొనసాగుతున్నారు. కానిస్టేబుల్ వికాస్ కుమార్: గ్రామంలోని పేద పిల్లలకు.. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తన డ్యూటీకి సమయం కేటాయిస్తూనే, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. 2014 నుంచి తన గ్రామంలోని పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. తనకు 18 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ మహోత్కార్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని, ఇలాంటి పిల్లలకు చదుపు చెప్పించే బాధ్యతను తీసుకున్నానని వికాస్ కుమార్ తెలిపారు. కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్: తన కలను స్టూడెంట్స్ నెరవేరుస్తారని.. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్ తన డ్యూటీ ముగియగానే రోజూ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. జాఫర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న చెట్టుకింద పాఠశాల నడుపుతున్నారు. ఈ పోలీస్ స్కూల్కు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ట్యూషన్ కోసం వస్తుంటారు. నవోదయ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న పిల్లలు కూడా ఈ స్కూల్లో కోచింగ్ తీసుకుంటారు. జాఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్, సివిల్ సర్వీసెస్లో చేరాలనేది అతని కల. కానీ అతని కల నెరవేరలేదు. తాను చదువు నేర్పుతున్న పిల్లల్లో ఎవరో ఒకరు తన కలను నెరవేర్చుకుంటారని జాఫర్ చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ‘డూమ్స్డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా? -
గురువు ‘లఘువు’ కాకూడదు!
‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు. గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత. అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు. చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది. ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం. – బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం (నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం) -
పేదరికపు కష్టాల మధ్య.. విద్యార్థి నుంచి రాష్ట్రపతిగా.. సర్వేపల్లి ప్రస్థానం
పేదరికపు కష్టాల మధ్య,అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు.ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు,ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు.ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు.అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేర్చింది. మహోన్నతమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందించింది. సర్వోత్తమమైన 'భారతరత్న' సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించేలా చేసింది.సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగువాడు,మన భారతీయుడు.ఆయన జన్మదినం 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం'. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు,ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్ట గౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం, క్రమశిక్షణే తన మార్గం,పట్టుదలే తన సోపానం.రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సర్వజ్ఞాన ప్రబోధ.ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. చదువు,అనుభవం రెండూ తన తోడునీడలు.జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని,సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో,తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక,తను గడించిన అనుభవాన్ని,పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు.అందుకే,ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా.. చైనా,పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో,ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గనిర్దేశం చేశారు.ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు.భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు.బోధనలో,పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.ఎంత గొప్పగా మాట్లాడుతారో,అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు.అందుకే ఆయనకు పాఠకుడి హృదయం,ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు,ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో క్లాస్లో 24నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే,సరదా కబుర్లు,ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు.24 నిముషాలకు మించి,ఏ విషయాన్నీమెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోలేదని ఆయన సిద్ధాంతం. కేవలం 21 ఏళ్లకే... మానవ జీవ రసాయన చర్యలు,విద్యా మనస్తత్వశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే,సర్వోన్నత ఉపాధ్యాయుడుగా ఖ్యాతి గడించారు.సర్వజన రంజిక ఉపన్యాసకుడిగా గొప్ప కీర్తినిఐశ్వర్యంగా పొందారు.ఆయన రాసిన'భారతీయ తత్త్వశాస్త్రం'ప్రపంచ పండితులకునిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజ ప్రతిభా భాస్వంతుడికి సాధన మరింత ప్రభను, ప్రభుత్వాన్ని చేకూర్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్,అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ద్వితీయ వైస్ ఛాన్సలర్గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి .హిరేన్ ముఖర్జీ,హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. Rare Footage of our former President of India and World's renowned #philosopher Sarvepalli Radhakrishnan, when he visited Britain in 1963 ! A must watch ! Courtesy BFI & via Social Media #SarvepalliRadhakrishnan #TeachersDay pic.twitter.com/ZdB6GvZmjr — Sonmoni Borah IAS (@sonmonib5) September 6, 2020 ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే.. మేధావుల విలువ తెలిసిన మేధాగ్రణి.దేశ,విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు. భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి.జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక,నేలను శుభ్రం చేసుకొని,భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే?హృదయం ద్రవించినా,జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందభాష్పాలు కురిపిస్తుంది,మెదడును కదిలిస్తుంది,గుండెను మరింత దృఢంగా మారుస్తుంది,కర్తవ్యం వైపు నడిపిస్తుంది.పేదవాడికికొండంత స్ఫూర్తిని అందిస్తుంది.డబ్బు విలువ,దేశం విలువ తెలిసినవాడు కనుక,రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని,మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు. "చదువది ఎంత కలిగిన..రసజ్ఞత ఇంచుక చాలకున్న..ఆ చదువు నిరర్ధకంబు...'' అన్నట్లు,జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం.జీవితాన్ని అర్ధం చేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన.వివేకం,తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతనప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇవాళ(సెప్టెంబర్ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన తన ట్విటర్(ఎక్స్) ద్వారా టీచర్స్ డే సందేశం ఉంచారు. ‘‘భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ.. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో.. ధృడసంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్ చేశారాయన. భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో ధృడసంక… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2023 -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్టేబుల్లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్కి స్కూల్కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్లో ఫ్రెండ్లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్ను అభిమానిస్తారు. -
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
Rameshwar Goud: గురుబోధకుడు
తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్లో మెరికలు కావాలంటే... వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్ టీచర్. ‘మంచి ఇంగ్లిష్ రావాలంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్ గౌడ్. ‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్ గౌడ్ టీచర్స్ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ. శ్రద్ధగా నటించాను! రామేశ్వర్ గౌడ్ సొంతూరు షాద్నగర్ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండేవి. ఐల్ట్స్ (ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను. లెక్చరర్లు ఇంగ్లిష్లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్పోర్టును డ్రాప్ బాక్స్లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్ సర్ సురేందర్ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు. ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్స్టిట్యూట్ ‘విల్ టూ కెన్, ద స్ట్రైడ్’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్స్టిట్యూట్ని అమీర్పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను. వాళ్లకు ఇంగ్లిష్ వచ్చు... కానీ! నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే. ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ‘రియల్ లైఫ్ ఇంగ్లిష్, స్పోకెన్ ఇంగ్లిష్’ అని రెండు పుస్తకాలు రాశాను. గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు! ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్ గౌడ్. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి. మా వాళ్లది ధర్మాగ్రహమే! ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్లు, డిఫెన్స్ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం... అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు. నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్ ‘వీడు లైఫ్ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. – ఎ. రామేశ్వర్ గౌడ్, ఫౌండర్, విల్ టూ కెన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
గురువులకు గౌరవం
సాక్షి, అమరావతి: విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర, జిల్లా, పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గౌరవ పురస్కారాలు అందించింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గురుపూజోత్సవాల బహిష్కరణకు పిలుపునిచ్చినా టీచర్లు ఎక్కడా దానిని పట్టించుకోలేదు. గతంలో కన్నా ఎక్కువ ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై గురువులను సన్మానించారు. గతంలో గురుపూజోత్సవాలకు భిన్నమైన వాతావరణంలో ఈసారి వేడుకలు జరిగాయి. గతంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులకు సరైన గౌరవం దక్కేది కాదు. నేతలు, ఇతరుల ప్రసంగాలకే ఎక్కువ సమయం వెచ్చించే వారు. సీఎం చేతుల మీదుగా నలుగురైదుగురికి అవార్డులు పంపిణీ చేయించి మమ అనిపించేవారు. దీంతో మిగతా వారు నిరాశ, నిస్పృహలకు గురయ్యేవారు. అయితే ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులుగా 180 మందిని ఎంపిక చేయగా.. ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ స్వయంగా మెమెంటో, బెస్ట్ టీచర్ ధ్రువపత్రాన్ని అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో కొంత మంది వీల్ చైర్లో రాగా, సీఎం ఎంతో గౌరవంగా కిందకు వంగి కూర్చొని మరీ వారికి అవార్డులు అందించారు. గురువుల పట్ల సీఎం వినయ విధేయతలు చూపడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ బలగా సుమనకు పురస్కారం అందజేస్తున్న సీఎం జగన్ స్నేహ పూర్వక ప్రభుత్వమిది: మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల స్నేహ పూర్వకంగా ఉండే ప్రభుత్వం ఇది. వారి ప్రయోజనాల పరిరక్షణలో సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. మన పిల్లలను గ్లోబల్ సిటిజెన్గా తీర్చిదిద్దాలనే తపనతో సీఎం విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు–నేడు కింద సుమారు రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో మొదటి విడత దాదాపు 16 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, డిజిటల్ క్లాస్ రూమ్లు, పిల్లలకు బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, తదితర ఎన్నో పథకాలు చేపట్టాం. పాఠశాలలన్నీ దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానిస్తున్నాం. ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యాపక వృత్తిలో ఉన్న వారందరికీ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. పదోన్నతులు కల్పిస్తున్నాం. -
Teachers Day 2022: బంగారు భవిష్యత్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతర పేద పిల్లలకు చదువే ఆస్తి. మన విద్యా విధానం ఆ ఆస్తిగా ఉందా? లేక భారంగా ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం పట్టా మాత్రమే పిల్లల చేతిలో పెట్టేలా మన చదువుల తీరు ఉందా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పరిస్థితులను మార్చి, మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఉండేలా దారి చూపాలనేది మనందరి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే ఈ రంగంలో మార్పులుచేశాం తప్ప.. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడానికి ఎంతమాత్రం కాదు. ఒక మంచి టీచర్ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడు. గ్రామంతో మొదలు పెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకు రాగలుగుతాడు. తన కన్న పిల్లల కోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలందరూ బాగు పడాలని టీచర్ ఆరాట పడతారు. పిల్లలకు కేవలం సబ్జెక్టు మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని కూడా మలుస్తారు. వివేకాన్ని పెంచుతారు. పిల్లల్లోని ప్రతిభను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో జీవించడం నేర్పుతారు. బతకడం ఎలాగో టీచర్ నుంచే నేర్చుకుంటారు. తన కన్నా తన శిష్యులు గొప్ప వాళ్లు కావాలని ఆరాట పడతారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా బాటలు వేసేలా విద్యా రంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ సంస్కరణలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావని, ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినవి కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రభుత్వ టీచర్లకు నష్టం చేయడానికో, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడానికో ఈ చర్యలు తీసుకోలేదని చెప్పారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇప్పటి మన విద్యా విధానంతో పిల్లలకు ప్రయోజనం కలుగుతోందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోలన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ఇవి సత్ఫలితాలు ఇచ్చి పిల్లలు అత్యున్నత స్థాయిలోకి వెళ్లేలా చేయడంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులదే కీలక భూమిక అన్నారు. ఈ దిశగా అందరూ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు. ‘కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాలపాటు చదువులకు దూరంగా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల పిల్లలు వారి మీద రుద్దిన చదువులను వేరే గత్యంతరం లేక చదువుకుంటున్నారు. వాటిని మార్చడంపై మన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అత్యంత ప్రాధాన్యతా రంగంగా విద్యారంగాన్ని గుర్తించడంతో పాటు మూడేళ్ల కాలంలో అనేక అడుగులు ముందుకు వేశాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గురుపూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు గురువులందరికీ వందనం ► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ శిరస్సు వంచి వందనం చేస్తున్నా. ఉపాధ్యాయులు అందరికీ శిఖరం లాంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన రాష్ట్రపతి స్థాయికి ఎదిగి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ► ‘నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ.. మెరుగైన జీవితాన్ని పొందడం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను’ అనేవి స్ఫూర్తిదాయకమైన మాటలు. ఇవి నేను చెప్పడమే కాదు.. ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన గొప్ప నాయకుడు అలెగ్జాండర్ కూడా చెప్పారు. సానపట్టక ముందు వజ్రమైనా రాయి లాగే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే వారు మన ఉపాధ్యాయులు. గురుపూజోత్సవం కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు దేశంలోనే ముందుండాలని.. ► దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా.. మెరుగ్గా ఉండేలా విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మన పిల్లలనూ తీర్చిదిద్దాల్సిన అవసరముంది. అందుకే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా రంగంగా గుర్తించాం. ఈ మూడేళ్లలో అనేక అడుగులు ముందుకు వేశాం. ► నేను ముఖ్యమంత్రి అయ్యాక విద్యా శాఖ మీద చేసిన రివ్యూలు బహుశా మరే శాఖ మీదా చేయలేదు. ఎందుకంటే.. మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాల తలరాతలను మార్చగలిగే ఒక అస్త్రం చదువు మాత్రమే. అందుకే విద్యా రంగంపై అంతగా దృష్టి పెట్టాను. గత ప్రభుత్వంలో మాదిరి విద్యా రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుని, కార్పొరేట్ వర్గాలకు ఈ రంగాన్ని అమ్మేసి.. పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయడానికి ఈ సంస్కరణలు తీసుకురాలేదు. పెద్ద చదువులకు, మంచి చదువులకు.. పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదు అన్న ఉద్దేశంతో తెచ్చిన మార్పులివి. గతంలో మాదిరి కార్పొరేట్ రంగంతో కుమ్మక్కై ఇంగ్లిష్ మీడియం, క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేదలకు దూరంచేసే మార్పులు కావు. ప్రభుత్వ టీచర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేవి కావు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేవి అంతకంటే కావు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ బడికి ఘన వైభవం ► గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యానికి గురైన విద్యా సంస్థలను అభివృద్ధి పరిచి, వాటికి ఘన వైభవం చేకూర్చే తపనతో ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేదలు దశాబ్దాలుగా ఆశించిన ఫలితాల కోసం చేపట్టిన మార్పులు ఇవి. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు తల్లులకు మద్దతుగా ఉండేందుకు తెచ్చిన మార్పులివి. ప్రభుత్వ బడి కార్పొరేట్ బడికన్నా బాగుండాలని చేసిన మార్పులివి. టీచర్లు తమ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలన్న మంచి సంకల్పంతో తీసుకొస్తున్న మార్పులివి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఎలా? లిటరసీని పెంచడం ఎలా? నాణ్యమైన విద్యను అందించడం ఎలా? అను ప్రశ్నలకు సమాధానంగా తీసుకొస్తున్న మార్పులు ఇవి. ► ఉన్నత విద్యలో కనీసంగా 70 శాతం జీఈఆర్ రేషియో ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్నాం. ఇవన్నీ బాగుండాలంటే, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే.. మనం అంతా ఒక్కటిగా ముందుకు సాగితేనే సాధ్యం అవుతుంది. గత ప్రభుత్వంలో కార్పొరేట్కు అందలం ► గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ స్కూళ్లకు, ఆస్పత్రులకు, చివరకు ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వేస్ట్ అన్న రీతిలో వ్యవహారం సాగింది. తుదకు ఉద్యోగులను తీసేసే పరిస్థితిలోకి వెళ్లింది. ► మన ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఎంతో గౌరవిస్తోంది. ఎవరూ అడక్కపోయినా 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచాం. ఎస్జీటీలను ఎస్ఏలుగా, ఎస్ఏలను గ్రేడ్–2 హెడ్మాస్టర్లుగా, హెడ్మాస్టర్లను ఎంఈఓలుగా ప్రమోషన్లు ఇస్తున్నాం. విద్యా రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇవి అవసరం అని భావించి వెనక్కి ముందడుగు వేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నాం. అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్లు, బై లింగువల్ టెక్ట్స్ బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్ అప్గ్రేడేషన్ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్లో మార్పులు.. ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.53 వేల కోట్లు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది. పేదలకు ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను, జీవితంలో వారు నిలదొక్కుకోవడానికి ఉపయోపడే విద్యను ఇవ్వాలన్నది మన విధానం. ఇందులో చదువు చెప్పడం మాత్రమే కాకుండా, శిలలను శిల్పాలుగా చెక్కినట్లు.. వ్యక్తిత్వాన్ని సైతం మలిచే ఉపాధ్యాయులుగా మీ తోడ్పాటు చాలా ముఖ్యం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పెన్షన్ సమస్యకు పరిష్కారం.. ► ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్ విషయం మీద పూర్తి చిత్తశుద్ధితో, వారికి మేలు చేసేలా అడుగులు వేస్తున్నాం. మంచి పరిష్కారం కోసం వెతుకుతున్న ప్రభుత్వం మనదే. ఇప్పుడున్న ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. వారికి మంచి చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ► కానీ ఇప్పుడు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగులకు చేస్తున్న మేలు గురించి, వారి పెన్షన్పై చేస్తున్న కృషికి సంబంధించి ఒక్క వాక్యం కూడా రాయని, చూపని ఎల్లో మీడియా.. ఇప్పుడు మనం పరిష్కారం కోసం చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తోంటే రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. ► వీటన్నింటినీ గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర కలిగిన.. టీచర్లకు, ప్రభుత్వ స్కూళ్లకు ఎన్నడూ లేని గౌరవాన్ని పెంచిన ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండదండలు అందించాలి. -
‘రామోజీ, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు’
సాక్షి, తాడేపల్లి: గురు దేవోభవ అంటూ ప్రతీ ఏటా గురువులని సత్కరించుకునే సంప్రదాయం మనకు ఉంది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఇది టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం వైఎస్ జగన్.. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. టీడీపీ నేతలు ఒక పండుగ లాంటి రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువును అవహేలన చేస్తున్నారు. దీన్ని చూస్తే చంద్రబాబునాయుడు ఎంత దిగజారిపోయాడో స్పష్టమవుతోంది. చంద్రబాబుకి మానవత్వం లేదు.. విలువలు లేవు. సెప్టెంబర్ 5 ఆయన ఇష్టపడే రోజు కాదు. ఆయనకి వెన్నుపోటు పొడిచిన రోజంటే ఇష్టం. ఇలాంటి రాజకీయాలు, చీటింగులు ఆరోజు మాట్లాడుకోవాలి. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ, రాధాకృష్ణలు ఆయన గురువులు. గురువులు అనే పదాన్ని ఈ రకంగా కించపరచడం సబబా?. నీ హయంలో విద్యారంగానికి ఏం చేశావో రెండు ముక్కలు చూపించు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చాము. ఇవన్నీ మేము గర్వంగా చెప్పుకుంటాం.. నువ్వు చెప్పుకోడానికి ఏమన్నా ఉందా?. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం మన కర్మ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది: సీఎం జగన్ -
తననెంతో ఇబ్బంది పెట్టిన కోచ్కు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.. టీచర్స్ డే (సెప్టెంబర్ 5) సందర్భంగా తన క్రికెట్ గురువులకు శుభాకాంక్షలు తెలిపాడు. దాదా ట్విటర్ వేదికగా తన ఇష్ట గురువులను (కోచ్లు) గుర్తు చేసుకుంటూ 'దాదా ఫేవరెట్ టీచర్' అనే ఓ వీడియోను షేర్ చేశాడు. టీచర్స్ డే సందర్భంగా దాదా స్మరించుకున్న వారిలో అతని చిన్ననాటి కోచ్ దివంగత దెబో మిత్రా, తన ఇష్టమైన కోచ్ జాన్ రైట్, టీమిండియా అత్యంత విజయవంతమైన కోచ్ గ్యారీ కిర్స్టన్ అలాగే టీమిండియా వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ ఉన్నారు. వీరందరికీ దాదా టీచర్స్ డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపాడు. Major missing Debo Mitra, John Wright, my favourite one ,Gary Kirsten and Greg. Happy Teachers' Day! There are few moments in life that make you relive your past, here's to my failures & bouncing back. Watch here: https://t.co/xNIlW4EdZa#TeachersDay — Sourav Ganguly (@SGanguly99) September 5, 2022 కాగా, గంగూలీ గుర్తు చేసుకున్న నలుగరు కోచ్ల్లో గ్రెగ్ చాపెల్ పేరును ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. చాపెల్ టీమిండియా కోచ్గా పని చేస్తున్న కాలంలో (2003 ప్రపంచకప్ తర్వాత) దాదాను ఎంతో ఇబ్బందిపెట్టాడు. ఓ దశలో కోచ్ మాటలు విని దాదాను జట్టు నుంచి కూడా తప్పించారు. చాపెల్ కారణంగా టీమిండియాలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆటగాళ్లు రెండు గ్రూపులుగా (గంగూలీ, చాపెల్) విడిపోయి ఆటను గాలికొదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ చాపెల్ పేరును ప్రస్తావిస్తూ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: లంకతో సమరం.. పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! -
కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ
అసంతృప్తి.. అందరిలోనూ ఏదో రకమైన అసంతృప్తి. ఇండియాలో బతికేలేము అంటూ అమెరికా , కెనడా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా కు వలస పోయే వారు ఎంతో మంది . అమెరికాలో ఎన్నో తరాలుగా స్థిరపడిన వారు అమెరికాలో హ్యాపీ లైఫ్ గడపలేము అంటూ డబెట్టి గోల్డెన్ వీసా కనుక్కొని గ్రీస్కు లేదా స్కాండినేవియన్ దేశానికి. అసలు భూమి నివాసయోగ్యం కాదు . త్వరగా మార్స్ పైకి వెళ్ళిపోతే బాగుండు అని మరి కొందరు . అసంతృప్తి.. కలెక్టర్ మొదలు బిల్లబంట్రోతు వరకు .. స్టార్ట్ అప్ మొదలు ఫామిలీ బిజినెస్మేన్ వరకు .. అందరిలో అసంతృప్తి . ఎందుకు ? 1950 లో ప్రపంచ జనాభా 250 కోట్లు. ఇప్పుడు 800 కోట్లు. డెబ్భై సంవత్సరాల్లో మూడు రెట్లకు పైగా పెరిగిన జనాభా ! ఇల్లు కట్టు కోవడానికి పంటలు పండించడానికి భూమి అవసరం. కానీ అప్పుడూ ఇప్పుడూ అదే భూమి. అంటే? పరిమతమైన వనరులు.. అపరిమితంగా పెరిగిపోతున్న డిమాండ్.. తిండి కోసం, నివాసం కోసం.. బతకడం కోసం పోటీ. విపరీతమైన పోటీ. పోటీ తెచ్చే ఒత్తిడి. ఇదీ నేడు సర్వత్రా కనిపించే స్థితి . కానీ శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పుణ్యమా అంటూ జనాభా ఇంతగా పెరిగినా, అందరి అవసరాలూ తీర్చగలిగిన స్థితి లో నేడు మానవాళి ఉంది. ఎనభై ఏళ్ళ క్రితం బెంగాల్ లో కరువు వల్ల ముప్పై లక్షల మంది చనిపోయారు అంటే నమ్మగలరా ? నేటి ప్రపంచం లో ఆకలి చావులు , కరువులు కాటకాలు ఎక్కడో కొన్ని ఆఫ్రికా దేశాలకు పరిమితం . అవసరాలు తీరుతాయి.. మరి కోరికలు..? స్కూటర్ కొన్నాయనకు కారు కావాలి . కారు కొన్నాయనకు లగ్జరీ కారు కావాలి . దాన్ని కొన్నాయనకు ప్రైవేట్ జెట్ కావాలి. ఫ్లాట్ కొన్నాయనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి . అది కొన్నాయనకు విల్లా కావాలి . గేటెడ్ కమ్యూనిటీ కావాలి . అది కొన్నాయనకు డిజైనర్ బంగాళా కావాలి . అది ఉన్నాయనకు సొంత దీవి కావాలి . ఆవసరాలు పరిమితం. గుర్రాలయిన కోరికలు..! కోరికలే మనిషి బాధలకు మూలం అన్నాడు గౌతమ బుద్ధుడు.2500 ఏళ్ళ క్రితమే మనిషి కోరికలకు పగ్గాలు ఉండేవి కావు . ఇప్పుడు గ్లోబల్ సమాజం . కోరికలు ఇప్పుడు గుర్రాలు కావు .. రాకెట్ లు .. సూపర్ సోనిక్ జెట్ లు! నలభై ఏళ్ళ ప్రపంచీకరణ ! అప్పటిదాకా ఏదైనా సామజిక విలువలు మిగిలుంటే దాన్ని తుడిచి పెట్టేసింది ! తనకు రాముడు లాంటి భర్త కావాలనుకొనేది ఒక నాటి స్త్రీ ! అంటే మరో స్త్రీని తలపులోకి కూడా రానివ్వ కూడదు . తనకు సీత లాంటి భార్య కావాలి అనుకునేవాడు ఒకప్పటి యువకుడు . అంటే కష్టాల్లో నష్టాల్లో తనవెంట నిలవాలి . న్యాయం కదా ? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచ . తనకు రష్మిక మందన లాంటి భార్య కావాలి ! సరిపోతుందా ? లేదు వీలైతే మృణాల్ ఠాకూర్ రెండో భార్య గా ! పోనీ అక్కడితో ఓకే ? సన్నీ లియోన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి ! పూనమ్ పాండే షెర్లీన్ .. ఇంకా ఇంకా కావాలి ! వ్యయసాయం చేసే భర్త వద్దు . సిటీ లో ఉద్యోగం చేసేవాడు కావాలి . అక్కడితో హ్యాపీ నా ? పక్కింటాయనకు కారుంది . మనకు లేదు . ఆఫీస్ లో పని చేసే కొలీగ్ కు సిక్స్ ప్యాక్ వుంది . నీకు లేదు . " లైఫ్ ఈజ్ షార్ట్. చేతకానోళ్లే నీతులంటూ ఉపన్యాసాలిస్తారు . ఎంజాయ్ . దానికోసం ఏమైనా చేయొచ్చు . ఆన్లైన్ గేమ్ లో డబ్బు కోసం అమ్మనైనా చంపొచ్చు . పక్కింటి కుర్రాడితో సుఖం కోసం భర్తకు అన్నంలో విషం పెట్టొచ్చు . ఎంజాయ్మెంట్ ముఖ్యం " ఇదీ గ్లోబల్ యుగంలో మిలీనియం యూత్ ఫిలాసఫీ . స్మగ్లర్ లు గూండా లు రౌడీ షీటర్లు నేటి యువత కు ఆదర్శ పురుషులు. తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తన నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాడు . అబ్బే ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికీ కావాలి అని ఎక్కువ శాతం నోరు చప్పరించేసారుట ! తమ కళ్ళకెదుట రాజకీయాల్లో చేరి కోట్లు కూడబెట్టిన వారు వీరికి ఆదర్శం . సంవత్సరం లో వంద కోట్లు కూడబెట్టాలనుకున్నోళ్లకి నెలకు ఇంత జీతం చొప్పున చేసే ఓపిక ఉంటుందా ? జీవితం చిన్నది . నిజమే ! ఆనందంగా బతకాలి. కరెక్ట్ .. కానీ ... ఆనందం అంటే ? వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కోంటోంది నేటి సమాజం. వేలకోట్ల సంపద వున్నా తీవ్ర అనారోగ్యం తో చనిపోయిన రాకేష్ జున్ఝున్వాలా , గోవా బీచ్ లు .. బికిని మోడల్స్ .. క్యాలండర్ గర్ల్స్ విజయ్ మాల్యా .. నేడు లండన్ లో బోడి మల్లయ్య గా మారిన తీరు .. సమకాలీన ప్రపంచం ఎన్ని ఉదారణలను విసిరేసినా నేర్చుకోలేని స్థితికి చేరుకొంది మానవాళి . - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తోందన్నారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదలు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు. అని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిండచమే కాకుండా మోనులో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదవండి: గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్ ఎవరూ అడక్కపోయినా టీచర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాం. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేశాం. ఉద్యోగుల పెన్షన్ల విషయంలోనూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని సీఎం అన్నారు. ‘‘ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు. నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు అవసరమైన అందిస్తున్నాం. పెద్ద చదువులకు పేదరికం అడ్డు రాకూడదు. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వ చర్యలు విద్యను పేదలకు దూరం చేశాయని’’ సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Teachers' Day: ఉపాధ్యాయ వృత్తి నుంచి చట్టసభల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్: వారంతా ఒకప్పటి గురువులు.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి, ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సమాజ మార్గనిర్దేశకులుగా సేవలందించి విద్యార్థుల అభ్యన్నతికి పాటుపడ్డారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆదరణను చూరగొని తరగతి నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నతికి ఏ విధంగా పాటుపడ్డారో ప్రజాప్రతినిధులుగానూ తమను గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా నాటి జ్ఞాపకాలు మరువలేనివని చెబుతున్న పూర్వపు గురువులపై ‘టీచర్స్డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యే, ఎంపీగా.. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు సైతం ఉపాధ్యా య వృత్తి నుంచే రాజకీయాల్లోకి అడుగుపె ట్టారు. 1987లో బోథ్ మండలం మహద్గాంవ్లో తొలిసారి ఐ టీడీఏ ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. అదే మండలం రాజుపల్లి, బజార్హత్నూర్ మండలం కొత్తగూడెం, ఆసిఫాబాద్ మండలం రాయిగూడ, ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్లో 1994 వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో పోటీచేసి పరాజయం పాలై తిరిగి బీజేపీలో చేరి 2019లో ఎంపీగా గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని దాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో.. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 1993లో ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా తిర్యాణి మండలం గొపెరాలో నియామకమయ్యారు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన ఆయన 1999లో నార్నూర్ మండలం చింతగూడ ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన 2004లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ అదె పార్టీ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయుడి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా .. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1986లో ఆదిలాబాద్ మండలం చింతగూడలో స్పెషల్ టీచర్గా నియామకమయ్యారు. 1987లో పదోన్నతి పొంది ముత్యన్పేట పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్లోని కోలాం ఆశ్రమ పాఠశాలలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 1993లో గ్రేడ్–1 హింది పండిట్గా పదోన్నతి పొంది తలమడుగు మండలం ఝరి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఏడేళ్లపాటు పనిచేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2000 సంవత్సరంలో తాంసి మండలం అందర్బంద్కు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసి, ఆదిలాబాద్ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009 వరకు అక్కడే సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని కాంక్షిస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరిన ఆయన 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువులు బావి తరాలకు ఆదర్శమని, బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విద్యారంగంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన రాజకీయాల్లోకి రాక ముందు 1992నుంచి 1994 వరకు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువునందించి మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. 1996లో నెన్నెల మండల జెడ్పీటీసీగా, 2001లో ఎంపీపీగా పనిచేశారు. 2009, 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా ప్రతినిధి అయినప్పటికీ విద్యారంగపై ఆయనకున్న మక్కువను చాటుతూనే ఉంటారు. పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రతిభాపాఠవాలను తెలుసుకుంటారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడుతూ వారితో మమేకమవుతారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి నుంచి క్యాబినెట్ మంత్రిగా గోడం నగేశ్ 1986లో ఎస్జీబీటీగా బజార్హత్నూర్ మండలం విఠల్గూడ ఆశ్రమ పాఠశాలలో నియామకమయ్యారు. బోథ్ మండలం పార్డి–బి యూపీఎస్ హెచ్ఎంగాను సేవలందించారు. 1989లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది బజార్హత్నూర్ మండలం జాతర్ల ఉన్నత పాఠశాలలో నియామకమయ్యారు. 1993లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చేరిన ఆయన 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొంది పార్లమెంట్లోనూ అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన జిల్లా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నేడు(సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు అని సీఎం జగన్ పేర్కొన్నారు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా దేశానికి మొదటి ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ తత్వవేత్త, రాజనీతి శాస్త్రజ్ఞుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. చదవండి: తనికెళ్ల భరణికి ‘లోక్నాయక్’ పురస్కారం తల్లితండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు#TeachersDay — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2022 -
Teachers Day 2022: ఆచార్య దేవోభవ!
ఆయన ఓ తత్వవేత్త.. ఓ రాజనీతిజ్ఞుడు... అన్నింటికీ మించి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. విద్యార్థులంటే ఆయనకు అంతులేని ప్రేమ.. ఆయన అంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం. విద్యార్థుల్ని ఉత్తమపౌరులుగా తీర్చినప్పుడే భవిష్యత్తు భారతం బాగుంటుందని భావించిన ఉత్తమ టీచర్ ఆయన.. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబరు 5 అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజును ఏటా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉన్నతమైన ఆదర్శాలు నెలకొల్పిన ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా సర్వేపల్లికి అందించే నిజమైన నివాళిగా దీనిని అభివర్ణిస్తారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అంటే 1962 సెప్టెంబరు 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. . ► సెప్టెంబరు 5న 1888లో జన్మించిన సర్వేపల్లి ... దేశం గర్వించదగ్గ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లికి విద్యార్థులంటే పంచప్రాణాలు. విద్యార్థులకు కూడా ఆ మాస్టరుగారంటే చెప్పలేంత గౌరవం. అలా విద్యార్థుల ఆదరాభిమానాలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి. ► విలువైన విద్యకు సర్వేపల్లి ప్రతిరూపం. విలువలున్న విద్యను ప్రోత్సహించాలన్నది ఆయన జీవితాశయం. అక్షరాశ్యతలో దేశం దూసుకుపోవాలన్నది ఆయన ఆకాంక్ష. యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో... వారిని సరైన దిశలో పయనించేలా చేయడంలో పాటించిన నిబద్ధతకు గౌరవసూచికంగా ఆయనను గౌరవించుకుంటున్నాం. అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ► మైసూరు, కలకత్తా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేసిన సర్వేపల్లి...ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోనూ తత్వశాస్త్రాన్ని బోధించారు. బెనారస్, ఆంధ్రా యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్గా పనిచేశారు. తత్వశాస్త్రంపై ఎన్నో పుస్తకాలు రాశారు. సాహిత్యంలో 16 సార్లు, శాంతి కేటగిరీలో 11 సార్లు... ఇలా 27 సార్లు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ కోసం సర్వేపల్లి పేరు నామినేట్ కావడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. ► సోవియట్ యూనియన్కు రాయబారిగా కూడా ఆయన పనిచేశారు. అన్నింటికన్నా మిన్నగా దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ...రెండో రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చారు సర్వేపల్లి. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు అందుకున్న భారత రత్నం ఆయన. -బొబ్బిలి శ్రీధరరావు -
విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం
సాక్షి , అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ అవార్డులు సాధించిన 26 పాఠశాలలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. గవర్నర్ టీచర్స్ డే శుభాకాంక్షలు సమసమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మూలస్తంభాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఆయన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడైన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నత విలువల కోసం అహరహం కృషి చేశారని కొనియాడారు. పాశ్చాత్య దేశాలకు భారతీయ తత్వ శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని పరిచయం చేశారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఉపాధ్యాయులకు గర్వకారణమన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మంత్రి బొత్స గురుపూజోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తారని, అటువంటి వారిని గురుపూజోత్సవం రోజు సన్మానించుకోవడం ముదావహమని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. -
‘గురు’తర బాధ్యత
గురువులను గౌరవించడం మన సంప్రదాయం. మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ గురువులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది. ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన కాలంలో మొదలైన గురుకుల సంప్రదాయం, ఒకటి రెండు శతాబ్దాల కిందటి వరకు మన దేశంలో కొనసాగింది. ఆధునిక తెలుగు సాహితీవేత్తలలో సుప్రసిద్ధులైన తిరుపతి వేంకట కవులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు గురుకుల సంప్రదాయంలో చదువుకున్నవారే! అప్పటికి ఆధునిక పాఠశాలలు పుట్టుకొచ్చినా, బ్రిటిష్ హయాంలోనూ పలుచోట్ల గురుకులాలు కొనసాగేవి. ఆధునిక ప్రపంచంలో పరిస్థితులు మారాయి. గురుకులాలు కనుమరుగైపోయి, ఆధునిక విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. పల్లెల్లోని వీధి బడులు మొదలుకొని, పట్టణాలు, నగరాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల వరకు ఆధునిక పద్ధతుల్లోనే విద్యార్థులకు చదువులు చెబుతున్నాయి. గురుకులాల్లో గురుశిష్యుల అనుబంధం బలంగా ఉండేది. ప్రైవేటు విద్యాసంస్థల ధాటి మొదలవనంత కాలం ఉపాధ్యాయు లకు, విద్యార్థులకు మధ్య అనుబంధాలు బాగానే ఉండేవి. ప్రైవేటు విద్యాసంస్థల పుణ్యాన చదువులు అంగడి సరుకుల స్థాయికి చేరుకోవడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నడుమ వినియోగదారుకు, విక్రేతకు నడుమ ఉండే సంబంధానికి మించిన అనుబంధం ఏర్పడే అవకాశాలు దాదాపు మృగ్యంగా మారాయి. ‘నేర్చుకునే శక్తి లోపించిన వాళ్లంతా బోధనలోకి వచ్చేస్తుంటారు’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. మిడిమిడి జ్ఞానులైన కొందరు ఉపాధ్యాయుల గురించి ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రం ఇది. ఇలాంటి బాపతు ఉపాధ్యాయులు ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నారు. గురజాడ వారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఇందుకు ఒక ఉదాహరణ. గిరీశం లాంటి గురువుల శిక్షణలో విద్యార్థులు వెంకటేశం అంతటి మేధావులుగానే తయారవుతారు. ఎనిమిదో తరగతి దాటినా, మాతృభాషలో చిన్న చిన్న వాక్యాలను కూడా ధారాళంగా చదవలేని విద్యార్థులు పాతిక శాతం, కూడికలు తీసివేతల వంటి సామాన్యమైన లెక్కలు కూడా చేయలేని వాళ్లు దాదాపు అరవై శాతం మంది మన దేశంలో ఉన్నట్లు జాతీయ స్థాయి గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా ఎలాంటి గురువుల చలవో ఆలోచించుకోవాలి. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చాక కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ‘ఏం గురువులో ఏం చదువులో’ అనే నిస్పృహ రాదూ! గురువులకు మన సమాజంలో ఒకప్పుడు అత్యున్నత స్థానం ఉండేదనడానికి పురాణాల్లో ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాగని పురాణాల్లో కనిపించే గురువులంతా సచ్ఛీలురని కాదు. అర్జునుడిపై పక్షపాతంతో ఏకలవ్యుడి బొటనవేలిని గురుదక్షిణగా కోరిన ద్రోణాచార్యుల వంటి పక్షపాతబుద్ధులు గురువుల్లో నేటికీ ఉన్నారు. దండోపాయ ధురంధరులైన చండామార్కుల వంటి గురువులకూ నేడు లోటు లేదు. బోధనారంగానికే ఇలాంటి వారు తీరని కళంకాలు. రాజస్థాన్లో ఒక ఉపాధ్యాయుడు నీటికుండను తాకిన పాపానికి తొమ్మిదేళ్ల దళిత బాలుడిని చావగొట్టి పొట్టన పెట్టుకున్నాడు. స్వాతంత్య్ర అమృతోత్సవాలకు ముందురోజే వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఎందరినో కలచివేసింది. ఇలాంటి క్రూర ప్రవృత్తిగల వాళ్లను బోధనా రంగం నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల ఎంపికలో అభ్యర్థుల విద్యార్హతలతో పాటు వారి మానసిక స్థితిగతులనూ పరిగణనలోకి తీసుకోవాలి. నానా స్వభావాలు గల మనుషులు ఉండే సమాజంలో ఉన్న గురువులు కూడా మనుషులే! మామూలు మనుషుల స్వభావాలకు భిన్నంగా గురువులు ఉంటారని ఆశిస్తే, అది అత్యాశే అవుతుంది. అయితే, గురువుల్లో నైతికత, విద్యాప్రావీణ్యం, బోధనానైపుణ్యం, నిష్పాక్షికత వంటి లక్షణాలను సమాజం ఆశిస్తుంది. ఇదివరకటి గురువుల్లో ఈ లక్షణాలు పుష్కలంగానే ఉండేవి. ఇప్పటి కాలంలో బొత్తిగా అరుదైపోయాయి. ‘బోధన అంతరించిపోయిన కళ కాదు, దాని పట్ల గౌరవమే అంతరించిపోయిన సంప్రదాయం’– అమెరికాలో స్థిరపడిన ఫ్రెంచి చరిత్రకారుడు జాక్వెస్ బార్జున్ అభిప్రాయం ఇది. ఝార్ఖండ్లో కొందరు విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేశారంటూ ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టిన సంఘటన కలకలం రేపింది. ఇలాంటి సంఘటనలను గమనిస్తే, బార్జున్ మాటలు నిజమే కదా అనుకోకుండా ఉండలేం. పరిస్థితులు ఎంత మారినా, నిబద్ధతతో చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఇప్పటికీ లేకపోలేదు. అరుదుగా ఉండే అలాంటి ఉపాధ్యాయులతోనే విద్యార్థులు అనుబంధాన్ని పెంచుకుంటారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేస్తున్న రాజేశ్ థప్లియాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. తన బోధనతో విద్యార్థులను అంతగా ఆకట్టుకున్నాడాయన. విద్యార్థులంతా ఆయనను కన్నీళ్లతో వీడ్కోలు పలికిన దృశ్యాలు వార్తలకెక్కాయి. నూటికో కోటికో ఒక్కరుగా ఉండే ఇలాంటి ఉపాధ్యాయులే, బోధనా రంగంపై ఆశలు అడుగంటిపోకుండా కాపాడుతుంటారు. ‘ఉపాధ్యాయుడు తాను బోధించే అంశాన్ని విద్యార్థులకు సులభగ్రాహ్యం చేయాలే తప్ప కేవలం సమాచారాన్ని అందివ్వడానికే పరిమితం కారాదు’ అని అభిప్రాయపడ్డాడు సోవియట్ మానసిక శాస్త్రవేత్త లెవ్ ఎస్. వైగోత్స్కీ. సులభగ్రా హ్యంగా బోధించే ఉపాధ్యాయులను విద్యార్థులు ఎన్నటికీ మరచిపోలేరు. భావితరాలకు బలమైన పునాదులు వేసేది అలాంటి ఉపాధ్యాయులే! వాళ్లను కాపాడుకోవలసిన బాధ్యత సమాజానిదే! -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. -
ఆచార్య దేవో భవ..!
ఒక వ్యక్తి జీవితం మీద ఉపాధ్యాయుని ప్రభావం ఈ బిందువు దగ్గర అంతమైందని ప్రకటించడం దాదాపు అసాధ్యం. మనిషి జీవితాన్ని శాసించేవి, మార్చేవి, ఉత్థానపతనాలకు దోహదపడేవి విద్య, విజ్ఞానం. నేటితరం బాలలకి విద్యలోని శక్తిని పరిచయం చేసేవారే ఉపాధ్యాయులు. అలా వ్యక్తుల జీవితాలనీ, తద్వారా రేపటి సమాజాన్నీ తేజోమయం చేస్తారు గురువులు. లేలేత మనసుల పాలిట నైరూప్యచిత్రాల్లా ఉండే పాఠ్యాంశాలను క్రమంగా సుందరచిత్రాల్లా దర్శించే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. నేర్చుకోవడం, అభ్యసించడం అనేవి జీవితంలో ప్రధానంగా గురుముఖంగానే జరుగుతాయి. నాగరికత ఆరంభం నుంచి ఉన్న గురువుల వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే నాగరికత అనే జ్యోతి ఆరిపోకుండా తన చేతులొడ్డి రక్షించేవారే గురువులు అంటారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ. - డా. గోపరాజు నారాయణరావు మారుతున్న కాలాన్ని బట్టి, అవసరాల మేరకు విద్య కొత్త పుంతలు పడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా కాలంతో పరుగులు పెట్టాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే తరగతిలో పాఠం చెప్పి, హోవ్వర్క్ ఇచ్చి ఇంటికి పంపేవారే కాదు, ఇంటి దగ్గర కూడా విద్యార్థి మెదడు పనిచేసే విధంగా చేయగలిగినవారే. ఇప్పుడు డిజిటల్ టీచర్ ఇవాళ్టి తరగతి గది అంటే రేపటి భారతదేశం. ఆ తరగతి గదికి నాయకుడు ఉపాధ్యాయుడు. విద్యార్థి స్వశక్తి ఏమిటో, అతడిలోని తృష్ణ ఎంతటిదో గుర్తించడం దగ్గర ఉపాధ్యాయుడు విఫలమైతే విద్యార్థి అతడి జీవితంలోనే విఫలమైపోతాడు. ఇలా ఎన్నయినా సంప్రదాయ చింతనతో చెప్పుకోవచ్చు. అలా అని అవి భ్రమలు కూడా కాదు. కానీ ఉపాధ్యాయుడి స్థానంలో వచ్చిన అతి పెద్ద మార్పు 21వ శతాబ్దంలో ఆయన డిజిటల్ టీచర్గా మారడమే. ఈ నేపథ్యంతో డిజిటల్ యుగంలో మారిన ఉపాధ్యాయుని బాధ్యతను ఒక్కసారి పరిశీలించాలి. 21వ శతాబ్దం పెనుమార్పుల వేదిక. నిన్నటి విద్యార్థికీ నేటి విద్యార్థికీ ఎంతో వైరుధ్యం ఉంది. ఇవాళ్టి విద్యార్థి నిన్నటి విద్యార్థి కంటే చాలా పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు, శాస్త్రసాంకేతిక రంగాలలో సంభవించిన విస్ఫోటం వీళ్లకి ఆ అవకాశాలని దోసిళ్ల నిండుగా అందించాయి. ఈ కాలాన్ని శాసిస్తున్నదే సాంకేతిక పరిజ్ఞానం. ఆ క్రమంలోనే ఉపాధ్యాయుడు అన్న వ్యవస్థ కొత్త అర్థాలను సంతరించుకునే పనిలో నిమగ్నమయింది. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయుని స్థానం నేటి ఉపాధ్యాయుని స్థానం ఒక్కటి కానే కావు. ఆ ఉద్యోగం పరిధి, దానికి ఉండవలసిన దృష్టి అంచనాకు అందనంత మార్పుకు లోనయ్యాయి. ఆలోచించే నైపుణ్యం, జీవించే నైపుణ్యాల మీద ఆధారపడి 21వ శతాబ్దంలో విద్య నిర్మితమవుతున్నది. తరగతి గది నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థి, బయటి వ్యవస్థల అవసరాలకు ఆసరా కాగల తీరులోనే ఇవాళ్టి చదువు ఉండాలని చెబుతున్నారు. తరగతిలో నేర్చుకున్నది బయటి ప్రపంచంలో విద్యార్థి బతకడానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత అన్న దృష్టి ఈ పరిణామం నిండా కనిపిస్తుంది. కేవలం బోధకుడు కాదు ఇవాళ్టి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు. ఉద్యోగితా నైపుణ్యాలను పెంచే బాధ్యతతో పాటు విద్యార్థుల మేధావికాసం, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటట్టు చేయడం, సృజనాత్మక దృష్టిని పెంపొందించడం, జీవితాంతం గుర్తుండే విద్యను అందించడం కూడా వారు నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతలుగానే మారాయి. గ్లోబల్ యుగంలో డిజిటల్ ఆధారిత ఉద్యోగితా నైపుణ్యాల సాధనలో విద్యార్థికి నిర్దేశకులుగా ఉండవలసింది ఉపాధ్యాయులే. విద్యార్థుల నైపుణ్యాలు పెంచడానికి తమ నైపుణ్యాలను అవిశ్రాంతంగా పెంపొందించుకోవలసిన యుగంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లేకపోతే ఎదురయ్యే ప్రమాదం తక్కువేమీ కాదు. ఇప్పుడు ఉపాధ్యాయునితో సమంగా విద్యార్థి కూడా పరిజ్ఞానం సంతరించుకో గలుగుతున్నాడు. కారణం ఇంటర్నెట్తో సాహచర్యం. తన నైపుణ్యానికి సృజనను కలిపి ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని అందించాలి. లేకపోతే డిజిటల్ యుగంలోను విద్యాధికులైన నిరుద్యోగులు పెరిగిపోతారు. ఇదే అసలు ప్రమాదం. కోటి మంది ఉపాధ్యాయులు ఎన్సీఈఆర్టీ ఏడో సర్వే, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం (2011–12) దేశంలో 10,31,000 పాఠశాలలు (గుర్తింపు కలిగినవి) ఉన్నాయి. 2019లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 900 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు ఉన్నాయి. ‘నో టీచర్ నో క్లాస్ భారత్లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ప్రకారం ప్రస్తుతం దేశంలో 97 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు (ఈ నివేదిక ప్రకారం మరొక పది లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం). టాటా ట్రస్ట్లలోని ది టీచర్స్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ (టీఈఐ) ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను నిలబెడుతూ, ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ. వీటి ఆధ్వర్యంలో 2018లో స్థాపించిన సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. చిరకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఉపాధ్యాయ ప్రతిభను మెరుగుపరచే పనిని ఈ సంస్థ యునెస్కో సహకారంతో చేపట్టింది. ‘నో టీచర్ నో క్లాస్ భారత్లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ఇది ఇచ్చినదే. మంచి చెడు రెండింటి గురించి బేరీజు వేసుకుని ఈ సంస్థ తన పని సాగిస్తున్నది. 50 శాతం మహిళలతో ఉపాధ్యాయ వృత్తి స్త్రీపురుష నిష్పత్తిని సమంగా నిలబెట్టుకుంటున్నది. గ్రామీణ ప్రాంతం నుంచి యువత, స్త్రీలు ప్రధానంగా ఈ వృత్తిని ఇష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక గౌరవం సాధారణంగానే ఉంది. దేశంలో ఎక్కువ పాఠశాలలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయుడే కేంద్రకంగా పనిచేస్తున్నాయి. వారి నమ్మకాలే బోధనను నిర్దేశిస్తున్నాయని ఆ నివేదిక తేల్చింది. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం పట్ల ఎక్కువ మంది ఉపాధ్యాయులు సానుకూలంగానే ఉన్నారని ఆ నివేదిక చెప్పడం శుభవార్తే! వీరిలో 25 శాతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనీ, 30 శాతం ఈ వృత్తి నుంచి తప్పించదగినవారే ఉన్నారనీ వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటి వరకు ఉపాధ్యాయుల ప్రతిభకు పదును పెట్టే ప్రత్యేక ప్రయత్నమేదీ జరగలేదు. ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారత్ ఈ అంశం మీద ఇక దృష్టి పెట్టక తప్పదు. ప్రోత్సాహమే సగం విద్య విద్యార్థి మరొక యుగానికి చెంది ఉంటాడు. కాబట్టి అతడి మీద మీ యుగపు పరిజ్ఞానం మేరకు పరిధులు విధించవద్దు అంటారు రవీంద్రనాథ్ టాగోర్. నిజమే, విద్యార్థులను ప్రభావితం చేసే శక్తి ఉన్న ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని ఇచ్చే వనరుల మీద పరిమితులు విధించరు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు కూడా. విద్యార్థిని ప్రభావితం చేయడానికి జ్ఞానాన్ని, కొత్త పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించే అవకాశం కల్పిస్తారు. అందుకే ఈ తరం ఉపాధ్యాయుని డిజిటల్ లీడర్గా కూడా చూస్తున్నారు. చేస్తున్న పనిని ఆస్వాదించడం, ఆస్వాదించే తీరులో పనిని తీర్చిదిద్దడం కూడా ఆయనకు తెలుసు. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. దీనితో విద్యార్థులు అలాంటి ఉపాధ్యాయులను మరింత గౌరవిస్తారు. నిజంగా విద్య అంటే పదింట తొమ్మిది వంతులు ప్రోత్సాహమే. నాలుగు ‘సి’లు ఇప్పుడు పోటీతత్వం మరింత పెరిగింది. అదే సమయంలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎంపికలకు కూడా విద్యార్థులకు ఎన్నో కొత్తదారులు ఏర్పడ్డాయి. విద్యార్థి మనస్తత్వాన్ని బట్టి ఆ దారులకు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయునిదే. భవిష్యత్తులో నాలుగు ‘సి’ల మీద విద్యార్థి భవితవ్యం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.. క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ. ఈ పదాలు, వాటి భావనలతో విద్యార్థిని మమేకం చేయవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిదే. వాటి గురించి నిజమైన అవగాహన ఏర్పడితే కాలానికి తగినట్టు పోటీ ప్రపంచంలో నెగ్గడానికి విద్యార్థిలో సంసిద్ధత వస్తుంది. డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న పెద్ద జ్ఞానసాగరం ఇంటర్నెట్. యూట్యూబ్, ట్యుటోరియల్, ఈబుక్ , ముద్రిత పత్రాలు ఇప్పుడు అందుబాటు ఉన్నాయి. నేటి ఉపాధ్యాయుని కర్తవ్యం విద్యార్థి అభిరుచిని బట్టి ఆ నైపుణ్యాలకు వారిని చేరువ చేయాలి. ఉపాధ్యాయుల సామర్థ్యానికి కూడా పరిధులు ఉన్నా, ఆ నైపుణ్యాల దిశగా విద్యార్థిని మళ్లించే వెసులుబాటూ ఉంది. నేర్చుకోవడానికి తగిన వాతావరణంలోకి వారిని తీసుకువెళ్లే నైపుణ్యం ఈ తరం ఉపాధ్యాయులలో ఉండాలి. భావి భారతాన్ని నిర్మించే బాధ్యత ఉన్నవారు మొదట తమను తాము నిర్మించుకోవాలి. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ప్రాథమికోన్నత పాఠశాల కావచ్చు, కళాశాల లేదా విశ్వవిద్యాలయం కావచ్చు. ఉపాధ్యాయుడు ఎక్కడ బోధిస్తున్నా ఆయన ఒక విద్యార్థిని తయారు చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే. నూతన విద్యావిధానం 2020: ఉపాధ్యాయుడు మారుతున్న విద్య, ఉపాధ్యాయ వ్యవస్థలు సమాజంలో పాక్షికంగానే అమలు కావడం సరికాదనే ‘నూతన విద్యావిధానం 2020’ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అంగన్వాడీలలో చదువుకునే బాలలు సహా మన దేశ విద్యార్థి జనాభా 40 కోట్లనీ, వీరందరికీ బోధిస్తున్న 1.5 కోట్ల మంది ఉపాధ్యాయులనీ దృష్టిలో ఉంచుకుని ‘నూతన విద్యావిధానం 2020’ ఆవిర్భవించిందని నివేదిక రూపకల్పనలో భాగస్వామి, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణ చెప్పారు. రెండు కోట్లు డ్రాపౌట్స్ ఉన్నా, 38 కోట్లు ఎప్పుడూ తరగతులలో ఉంటారు. ప్రభుత్వం ఎంత ఆధునిక, విస్తృత విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినా దానిని అమలు చేయవలసింది ఉపాధ్యాయుడే. వచ్చే దశాబ్దం ఉపాధ్యాయ దశాబ్దం కావాలని ఈ నివేదిక లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలో బహుశా ఏ దేశంలోను కనిపించనంత భారతీయ అధ్యాపకశక్తిని సశాస్త్రీయంగా ఉపయోగించుకుంటే ఎంతో మార్పు తేవచ్చునన్న ఆలోచనతో విద్యా విధానం సూచనలు చేసింది. సమగ్ర బోధకుడు అనే భావనను ముందుకు తెచ్చిన ఆ నివేదిక ఉపాధ్యాయులకు నాలుగేళ్ల శిక్షణను సూచించింది. అంతేకాదు, వృత్తి నైపుణ్యం వృద్ధి చేసే ఒక నిరంతర శిక్షణను కూడా కొత్త విద్యా విధానం ముందుకు తెచ్చింది. ఉపాధ్యాయుడిగా జీవించాలి అన్న కోరిక ఉన్నవారే ఆ వృత్తిలోకి రావడం గురించి విద్యా విధానం చర్యలు తీసుకుంది. నేర్చుకుంటూనే నేర్పించాలి. ఇవాళ్టి మరొక పరిణామం కూడా ఉపాధ్యాయుల దృష్టిలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రస్తావన, వినియోగం లేకుండా ఇవాళ విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధం కాలేడు. మొదట ఉపాధ్యాయునికి ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్నెట్ మీద, దానిని అన్వేషించడం మీద ఉపాధ్యాయుని పరిచయం లేకుంటే ఆయన విద్యార్థులకు చెప్పలేరు. విద్యార్థులను సదా ప్రభావితం చేయగలిన ఉపాధ్యాయుడంటే జీవిత కాలం నేర్చుకునే లక్షణం కలిగి ఉంటారు. తాము బోధించే పాఠ్యాంశంలో వచ్చిన మార్పులు, చేర్పుల పట్ల స్పృహ కలిగి ఉంటారు. అంటే వచ్చే దశాబ్దంలో ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో వారు చెప్పగలిగి ఉంటారు. విషయ సేకరణ ఆధారంగా చేసే విద్యార్జన ప్రాధాన్యం తెలిసి ఉండడం 21వ శతాబ్దం ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇప్పుడు నిపుణులు చెబుతున్న అద్భుతమైన ఒక సూత్రం గురించి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడని ఎవరిని చెప్పవచ్చునంటే చదవడం రాయడం చేతకాని వారిని కాదు. నేర్చుకోలేనివారిని, నేర్చుకొనే సంసిద్ధత లేనివారిని, మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉండాలన్న స్పృహ లేనివారినే. నేర్పించడం అనే కళ, శాస్త్రీయతలను మిళితం చేసే బోధనా పద్ధతులను ఇవాళ ఎక్కువ మంది ఉపాధ్యాయులు అలవరచుకుంటున్నారు. ఉపాధ్యాయుడు నేర్పించడాన్ని ప్రేమించాలి. నేర్చుకునేవాళ్లను ప్రేమించాలి. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి ఇంకా ఇష్టపడాలి. వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిండి ఉండే తరగతిలో బోధించే విధానానికి వారు అలవాటు పడాలి. ప్రతి విద్యార్థికి సంబంధించి విద్యావసరాలు, సామర్థ్యాలు, అభిరుచులపైన ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల ఐచ్ఛిక విద్యాభిరుచిని గమనించి సమాజంలో ఉత్పాదకతకు ఉపయోగపడే భాగస్వామిగా మలచడం ఇవాళ ఉపాధ్యాయుల ముందు ఉన్న ప్రథమ కర్తవ్యంగా అవతరించింది. స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీతో తరగతిలో మరింత చురుకుగా ఉండేటట్టు చేయడం, విద్యా సంబంధ కార్యకలాపాలలో చేయూత నివ్వడం ఉపాధ్యాయులు ఇవాళ ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలో చెప్పగలిగితే పిల్లలు మరింత కష్టపడతారు. ఎడ్యుకేటర్ లేదా ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత ఏదీ అంటే సమాజం ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలు పరిష్కరించడానికి ఉపకరించే విద్యా విధాన పద్ధతులను అన్వేషించాలి. మోతాదు మించుతున్నదా? ఇంతకీ విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం మోతాదుకు మించుతున్నదా? ఈ ప్రశ్న వేసుకోక తప్పదు. భారత సామాజిక నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత అవసరం.అందుకు సంబంధించిన భయాలు ఇప్పుడు మొదలయినాయి కూడా. 2030 సంవత్సరానికి, అంటే కేవలం ఎనిమిదేళ్లలోనే గురువు అనే స్థానానికి సాంకేతిక పరిజ్ఞానం పంగనామం పెట్టబోతున్నదన్న భయాలు అవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చైన్ తరగతి గదిని శాసిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ భయాల వెనుక విపరీతంగా ప్రవేశిస్తున్న శాస్త్రసాంకేతిక రంగాలు ఒక్కటే కారణం కాదు. సాంకేతికతకు మోకరిల్లుతున్న నేటి తరాలు కూడా కారణమే. పాలకులు, నేతలు, రాజకీయ సంస్థలు దేశం పురోగమించడం గురించి, ప్రపంచపటంలో దివ్యమైన స్థానం గురించి తమకున్న కల్పనలో విద్య స్థానం ఎక్కడో ఇప్పటికీ చెప్పడం లేదు. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదులలో పడతాయన్న వాస్తవం గుర్తించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. ఇవన్నీ ఉన్నా కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. ఉపాధ్యాయుడికి పరిమితులు ఉన్న మాట నిజం. కానీ ఆయన తరగతిలో బోధించినట్టు, ఆయన కంటే ఎంతో ఎక్కువ ‘డేటా’ కలిగి ఉండే రోబో ఆయనకు ఏనాటికీ ప్రత్యామ్నాయం కాదు, కాలేదు. కాబట్టి 22వ శతాబ్దంలోకి ప్రవేశించినా పాఠ్యాంశాలు మారవచ్చు. పాఠశాలలు, అందులోని తరగతుల రూపురేఖలు అసాధారణంగా ఉండవచ్చు. బోధనా పద్ధతులు మారిపోవచ్చు. బాలలు మరింత చురుకుగా ఉండవచ్చు. కానీ అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అప్పుడే విద్యార్థికి మార్గదర్శనం లభిస్తుంది. గురుస్థానం శాశ్వతం కావాలి. విద్య, విలువలు, ఉపాధ్యాయుడు పిల్లల మేధను విద్యతో ప్రకాశింపచేసే క్రమంలో వాళ్ల హృదయాలను కూడా విద్యతో గుబాళింపచేయడం మరవరాదని దలైలామా అంటారు. ఈ పని కుటుంబంలో జరగాలి. ఆపై ఆ బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలి. పురోగమిస్తున్న సమాజంలో విలువలకు స్థానం లేకుంటే విపరీతాలకు దారి తీస్తుంది. ఒక భావిపౌరుడి ప్రవర్తన అతడికి ఉన్న విలువలను బట్టే నిర్మితమవుతుంది. నీతి నిజాయతీలు, విచక్షణ, సామాజిక సేవ పట్ల అనురక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవం, సామాజిక న్యాయం పట్ల అవగాహన ఇవన్నీ కూడా విలువల నుంచి సంక్రమించేవే. యువత కౌమారమంతా తరగతి గదిలోనే గడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయంలో ఎక్కువ బాధ్యత స్వీకరించాలి. విలువలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడేవే. వీటన్నిటికీ మించినది క్రమశిక్షణ. అది విద్యార్థి జీవితం నుంచి మొదలు కావాలి. అదొక విలువ. గురుశిష్య బంధానికి అడ్డుకట్ట? గురుశిష్య బంధం అనివార్యం. కానీ ఈ బంధం తెగిపోతున్నదా అని ప్రశ్నించుకునే వాతావరణం ప్రస్తుతం కనిపించడం విషాదమే. చాలా కళాశాలలు, కొన్నిచోట్ల పాఠశాలలు కూడా మత్తు మందులకు చేరువ కావడం గురుశిష్య సంబంధం బలహీన పడుతున్నదని చెప్పడానికి ఉపకరించేదే! విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావడం సామాజిక ఉల్లంఘన. శిష్యులను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరోధించలేకపోవడం గురువుల సామాజిక ఉల్లంఘన. ఎన్ని చట్టాలు వచ్చినా ర్యాగింగ్ భూతం లొంగకపోవడం విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా సామాజిక బాధ్యతను మరచిపోయిన ఫలితమే. అదుపు చేయాలని ఉపాధ్యాయులకు, ఒదిగి ఉండాలని విద్యార్థులకు లేకపోతే విపరీత పరిణామాలు తప్పవు. సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదు వెనువెంటనే కాకున్నా, సమీప భవిష్యత్తులో భారత్లో కూడా తరగతి గదిని సాంకేతికత శాసిస్తుంది. కరోనా ఈ అవసరాన్ని కాస్త ముందుకు తెచ్చింది కూడా. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సాంకేతికతను ప్రవేశ పెట్టడం గురించి వస్తున్న ఒత్తిడి కూడా తక్కువగా లేదు. ఎల్కేజీ దగ్గర నుంచి పలకా బలపాలు మాయమవుతున్నాయి. అయితే ఒక ప్రశ్న. సాంకేతికత ఉపాధ్యాయునికి నిజంగానే ప్రత్యామ్నాయం కాగలదా? డిజిటల్ వ్యవస్థ ఎంత విస్తరించినా, బలపడినా అది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాలేదు. నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజంలో విద్యార్థులంతా ఒకే విద్యా ప్రమాణాలు ప్రదర్శించే పరిస్థితిలో లేరు. విద్యార్థులందరి అభిరుచిని ఉపాధ్యాయుడు మాత్రమే గమనించగలడు. గురుశిష్య సంబంధం పాతబడేది కాదు. జీవితానుభవాన్ని, సృజనాత్మక శక్తిని మేళవించి పాఠ్యాంశాలను చెప్పగలిగేది గురువు మాత్రమే. ఉపాధ్యాయుడు తేగలిన మార్పు సాంకేతికతతో సాధ్యంకాదని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఎందుకంటే విద్య అంటే కేవలం కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని సమీకరణల సమ్మేళనం కాదు. అభ్యాసానికి అనుగుణమైన వాతావరణం గురుశిష్య సంబంధం నుంచి జనిస్తుంది. అది యంత్రం ద్వారానో, కంప్యూటర్ తెరతోనో సాధ్యం కాదు. విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచింప చేసేదే విద్య. ఆ పని ఉపాధ్యాయుని ద్వారా జరుగుతుంది. భావి తరాలను విశ్వమానవులుగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు తయారు కావడం అవసరమే. ఆ క్రమంలో కొన్ని భ్రమలలో ఎవరూ కొట్టుకుపోరాదు. డిజిటల్ యుగంలో మనదైన చరిత్ర, మనదైన సాహిత్యం, కళ, సాంస్కృతిక వారసత్వం చిన్నబోయే పరిస్థితి ఏర్పడడం సరికాదు. మన ప్రాంతీయ భాషలకు గ్రహణం పట్టకూడదు. ఆధునిక విద్య, ఆధునిక విద్యారీతులు మత్తులో మళ్లీ వేరొక వ్యవస్థకు మన యుతరం బోయీలు కారాదు. విద్యావిధానం ఆధునికం కావాలి. అదే సమయంలో అందులో మట్టివాసన ఉండాలి. కంప్యూటర్కే, ప్రయోగశాలకే విద్యార్థిని పరిమితం చేయడమూ సరికాదు. విద్యావిధానంలో ఆధునికత సృజనాత్మకతకు, క్రీడాప్రతిభకు ఆస్కారం కల్పించాలి. డిజిటల్ విద్యావిధానానికి ఉపాధి కల్పన పునాదిగా ఉన్నప్పటికి, సామాజిక బాధ్యత పట్ల యువతకు నిరంతర స్పృహ అవసరమన్న విషయమూ గుర్తించాలి. కొత్త విద్యావిధానం విద్యార్థికీ, సమాజానికీ మధ్య అడ్డుగోడ కట్టేది కారాదు. ఎందుకంటే పాఠశాల అనేది సమాజానికి సుదూరంగా ఉండే వ్యవస్థ కాదు. కొత్తయుగంలో కొత్త తప్పిదాలకు చోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోగలరు. ఎందుకంటే పాఠ్యప్రణాళిక రూపకల్పనలో వారి పాత్ర వాస్తవం. డిజిటల్ యుగం పాత సమస్యలను గమనించకుండా సాగితే అది వైఫల్యానికే దారి తీస్తుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అంతరాలు ఒక వాస్తవం. డిజిటల్, శాస్త్రసాంకేతిక వినియోగం అందరికీ సమంగా అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను అందుకు తగినట్టు రూపొందించాలి. డిజిటల్ లీడర్లు ఇటు వైపు చూడకపోతే సమాజంలో పెద్ద అగాధం ఏర్పడుతుంది. విద్యారంగంలో అంతరాలు నిరోధించడానికి కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ప్రయత్నాలు నీరుకారాయన్న విమర్శ ఇప్పటికే ఉంది. ఒకప్పుడు అన్ని వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలకే వెళ్లి చదువుకునేవారు. సమాన అవకాశాలు అన్న సూత్రాన్ని వమ్ము చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చతికిలపడ్డాయి. చదువు ‘కొనడం’ అన్న మాట కూడా ఇప్పుడు వినవలసి వస్తున్నది. చదువు ప్రాథమిక హక్కుగా అవతరించిన తరువాత కూడా అక్షరం గగన కుసుమం కావడం పురోగతికి దోహదం చేసే పరిణామం కాదు. ఉపాధ్యాయులు తాము నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పుతారు. ఆ క్రమంలో సరైన నడత నేర్చుకోమని ఉపాధ్యాయునికి ఎవరో చెప్పే పరిస్థితి రావడం విషాదమే. ఇటీవల వస్తున్న వార్తలు కొందరు ఉపాధ్యాయుల పట్ల అసహనాన్ని పెంచేవిగా ఉన్నాయి. మద్యం సేవించి పర్యవేక్షకునిగా పరీక్ష హాలుకు వచ్చిన వారు, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్టయినవారు ఇంకా తీవ్రమైన అసాంఘిక చర్యలకు ఉపాధ్యాయులు పాల్పడుతున్న సంగతులు బయటపడుతున్నాయి. ఇక విద్యార్థులను తీవ్రంగా దండిస్తున్న సంఘటనలకు అంతేలేదు. బయటి సమాజంలోని బలహీనతలు, ప్రలోభాలకు ఉపాధ్యాయులు లోను కాకుండా చేయడానికి నూతన విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన నాలుగేళ్ల ఉపాధ్యాయ శిక్షణతో సాధ్యం కాగలదని విశ్వసిద్దాం. మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మీద పెరుగుతున్న ఒత్తిడికి విరుగుడుగా ఈ విధానం సాధికారత కల్పించడం ఒక వెసులుబాటు. -
40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఉత్తర్వులు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుపూజ దినోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ, అంకితభావం గల వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరిలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు 10 మంది, స్కూల్ అసిస్టెంట్స్, పీజీటీలు 19 మంది, ఎస్జీటీ, టీజీటీలు 10 మంది, ఒక సీనియర్ లెక్చరర్... మొత్తం 40 మంది ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల విభాగాల్లో చకినాల శ్రీనివాస్(సిరిసిల్ల), బూసా జమునాదేవి (జయశంకర్ భూపాలపల్లి), ఓ చంద్రశేఖర్ (జయశంకర్ భూపాల పల్లి), టి.మురళీకృష్ణమూర్తి (మేడ్చల్) ఎస్.సురేశ్ (నిజామాబాద్), వి.రాజేందర్(ఖమ్మం), వనుపల్లి నిరంజన్ (రంగారెడ్డి), సుర సతీశ్(భువనగిరి), గోపాలసింగ్ తిలావత్ (ఆదిలాబాద్), బి.చలపతిరావు(ఖమ్మం) ఎంపిక. స్కూల్ అసిస్టెంట్లు డి.సత్యప్రకాశ్ (స్టేషన్ ఘన్పూర్), జె.శ్రీనివాస్ (నిర్మల్), పి.ప్రవీణ్కుమార్ (కామారెడ్డి), తేజావత్ మోహన్బాబు (భద్రాద్రి కొత్తగూడెం), ఎ.వెంకన్న (సూర్యాపేట), కన్నం అరుణ(కరీంనగర్), సయ్యద్ షఫీ(ఖమ్మం), డాక్టర్ హజారే శ్రీనివాస్(నిజామాబాద్), కె.రామారావు (సూర్యాపేట), సీహెచ్ కృష్ణ (వరంగల్), కె.మధుకర్ (ఆసిఫాబాద్), ఎ.రాజశేఖర్ శర్మ (సిద్దిపేట), గొల్ల వెంకటేశ్ (జోగుళాంబ గద్వాల్), కె.ధనలక్ష్మి (వరంగల్), కంచర్ల రాజవర్ధన్ రెడ్డి (నల్లగొండ), జి.గిరిజమ్మ (నారాయణపేట), జె.ఎల్లస్వామి (గద్వాల్), సీహెచ్ భరణీకుమార్(యాదాద్రి భువనగిరి), అంబటి శంకర్(రాజన్న సిరిసిల్ల) ఎస్జీటీలు జి.చంద్రశేఖర్(నిర్మల్), ఎం.వెంకట్రెడ్డి( హైదరాబాద్), పశుల ప్రతాప్ (ఆదిలాబాద్), యు.లచ్చిరాం(నల్లగొండ), కె.ప్రవీణ్ (పెద్దపల్లి), అర్చ సుదర్శనం (హన్మకొండ), టి.ఓంకార్ రాధాకృష్ణ (సిద్దిపేట), కదరి అనిత (నల్లగొండ), బి.నర్సయ్య (నిజామాబాద్), సీహెచ్ రాజిరెడ్డి(జగిత్యాల). సీనియర్ లెక్చరర్... డాక్టర్ ఎం.రమాదేవి (ప్రభుత్వ లెక్చరర్, మాసబ్ట్యాంక్, హైదరాబాద్) ప్రత్యేక విభాగం... బి.శంకర్బాబు (సంగారెడ్డి), జె.శ్రీనివాసరెడ్డి(సిద్దిపేట), ఎం.రాంప్రసాద్ (సిద్దిపేట), టి.మధుసూదన్రావు (హైదరాబాద్), వరకల పరమేశ్వర్(రంగారెడ్డి), వై.లిల్లీమేరి (జనగాం), టి.సత్యనారాయణ(సూర్యాపేట), ఎం.వెంకటయ్య (సూర్యాపేట), సత్తులాల్(భద్రాద్రి కొత్తగూడెం), సముద్రాల శ్రీదేవి(సంగారెడ్డి). -
Best Teacher Award: గురు దేవోభవ!
బడి... బిడ్డను విద్యార్థిగా మార్చే అక్షరాల ఒడి. ఆ ఒడిలో పిల్లలు హాయిగా అక్షరాలు దిద్దాలి. భవిష్యత్తును బంగారంగా దిద్దుకోవాలి. బిడ్డల భవిష్యత్తును దిద్దే చేతులకు వందనం. ఉపాధ్యాయ వృత్తికి వందనం. వృత్తికి వన్నె తెచ్చిన గురువులకు వందనం. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అంటే విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఓ గుర్తింపు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకుంటున్న వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్లోని కానూరు ‘జిల్లా పరిషత్ హైస్కూల్’ ఫిజిక్స్ టీచర్ రావి అరుణ. మరొకరు హైదరాబాద్, నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు ఐదవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. సునీతారావు, రావి అరుణ ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘మాది మైసూర్. బాల్యం హైదరాబాద్లోనే. ఐదవ తరగతి వరకు సెయింట్ ఆన్స్లో చదివాను. ఆరవ తరగతి నుంచి చెన్నై. నా బోధన ప్రస్థానం కర్నాటక రాష్ట్రం తుముకూరులోని టీవీఎస్ అకాడమీలో మూడవ తరగతి టీచర్గా మొదలైంది. ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే నేను చదువు చెబుతూ చదువుకున్నాను. ఉద్యోగం చేస్తూ ఎంఏ ఎకనమిక్స్, ఎంఫిల్ పూర్తి చేశాను. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో డిప్లమో, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాను... ఇలా ఏటా స్కూల్ వెకేషన్ని నేను ఏదో ఒక కోర్సుకోసం ప్లాన్ చేసుకునేదాన్ని. నాకిష్టమైన గణితం కోసం చెన్నైలోని రామానుజమ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను. ముప్పై రెండేళ్ల సర్వీస్లో నేను పిల్లలకు ఎన్నో నేర్పించాను, అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకున్నాను. టీచర్ ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదు. నిత్య విద్యార్థిలా రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాల్లో ఉన్న విషయాన్ని చెప్పి పాఠాలు ముగిస్తే సరిపోదు. కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని దైనందిన జీవితానికి అన్వయిస్తూ పాఠం చెప్పాలి. అలాగే ఏ తరగతికి అవసరమైతే ఆ తరగతికి పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నేను థర్డ్ క్లాస్ టీచర్గా చేరినా, అవసరమైనప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి కూడా పాఠాలు చెప్పాను. పన్నెండో తరగతి టీచర్ అయినా సరే ఒకటవ తరగతి టీచర్ లేనప్పుడు ఆ క్లాస్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే పాఠాన్ని సృజనాత్మకంగా చెప్పాలి. పిల్లలకు ఏ పదాలు అర్థం అవుతున్నాయో ఆ పదాల్లో వివరించాలి. వృత్తి పట్ల గౌరవం, విశ్వాసం ఉండాలి. రూల్స్కోసం పని చేసే వృత్తి కాదిది. అవసరమైన విధంగా ఒదిగిపోవాలి. కొంతమంది పిల్లలు డిప్రెషన్కు లోనవుతుంటారు. చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలవుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రుల కంటే ముందు పసిగట్టగలిగింది టీచర్ మాత్రమే. పేరెంట్స్ వచ్చి చెప్పేవరకు టీచర్ గుర్తించని స్థితిలో ఉండకూడదు. అలాంటి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాను నేను. వాళ్లతో విడిగా మాట్లాడి, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి కోసం మెంటార్గా ఒక టీచర్కు బాధ్యత అప్పగించడం ద్వారా ఆ స్టూడెంట్ తిరిగి చదువుమీద మునుపటిలా ధ్యాస పెట్టేవరకు కనిపెట్టి ఉండాలి. అలాంటప్పుడు తల్లిదండ్రులు వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంటారు. టీచర్గా అత్యంత సంతోష పడే క్షణాలవి. గురుశిష్యుల బంధం విద్యార్థులు అమ్మానాన్న తర్వాత ఆదర్శంగా తీసుకునేది టీచర్నే. అందుకే టీచర్ గౌరవప్రదంగా కనిపించాలి. ఆహార్యం, మాటతీరు, నడవడిక... ప్రతి విషయంలోనూ ఆదర్శనీయంగా ఉండాలి. గురుశిష్యుల బంధం ఉన్నతమైంది. స్టాఫ్రూమ్లో ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. విద్యాబోధనకు అవసరమైన చర్చలే ఉండాలి. అలాగే ప్రతి టీచరూ క్లాస్కి వెళ్లే ముందు ఏం చెప్పాలనే విషయం మీద తప్పనిసరిగా హోమ్వర్క్ చేయాలి, పాఠం చెప్పిన తర్వాత సరిగ్గా చెప్పానా లేదా అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇదే ఒక టీచర్గా నా తోటి ఉపాధ్యాయులకు నేను చెప్పగలిగిన మంచిమాట’’ అన్నారు సునీతారావు. పాఠం చెప్పి ఊరుకుంటే చాలదు! ప్రిన్సిపల్గా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కరికులమ్ రూపొందిస్తుంటాను. గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాల్సిన తరం ఇది. ఒకప్పటిలా సిలబస్కే పరిమితమైతే సరిపోదు. క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ముఖ్యం. విలువలు, క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావం, నిజాయితీ వంటివన్నీ వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఏదో ఒకటి ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలకు పరిపూర్ణమైన విద్య అందుతుంది. మా దగ్గర స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే విద్యార్థులకు అవసరమైన సెలవులు ఇవ్వడం, వారి కోసం సాయంత్రం ప్రత్యేక తరగతులు చెప్పించి పరీక్షలు పెట్టడం వంటి మార్పులు చేశాను. టీచర్ అంటే విద్యార్థులకు పాఠం చెప్పడమే కాదు, వారి భవిష్యత్తు కలలకు ఒక రూపం ఇవ్వాలి, ఆ కలల సాకారానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి. – సునీతారావు, ప్రిన్సిపల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, సికింద్రాబాద్ సైన్స్ ఎక్కడో లేదు... ‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్ కావాలనే ఆలోచన కూడా. కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నాలజీస్ మీద íపీహెచ్డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్ లో మరో పీహెచ్డీ చేస్తున్నాను. ప్రత్యామ్నాయం వెతకాలి! సైన్స్ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి. అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్ అలా ఫెయిల్ కారు. దోమలను పారదోలగలిగేది రెడీమేడ్ మస్కిటో రిపెల్లెంట్ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్ ఎడ్యుకేషన్కి వాటర్ వర్క్స్తోపాటు ప్రతి డిపార్ట్మెంట్కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్ సైన్స్ కాంగ్రెస్లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్ ఇన్స్పైర్ మనక్లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం. ఇస్రో సైన్స్ క్విజ్లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్ సిటిజన్ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది. – రావి అరుణ, ఫిజిక్స్ టీచర్, జిల్లా పరిషత్ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నడిపూడి కిషోర్ -
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్!
న్యూఢిల్లీ: గురువులే కీచకలుగా మారి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలను ఎన్నో మనం చూశాం. ప్రస్తుతం ఇదే తరహలో ఒక ఘటన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లితే...రాంపూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న అలోక్ సక్సేనాను అనే ఉపాధ్యాయుడు సివిల్ లైన్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్ను నడుపుతున్నాడు. ఈక్రమంలో ఆ ఉపాధ్యాయుడు తన కూతురు ముఖంపై కేకు పూసి అసభ్యకరంగా ప్రవర్తించడంటూ... ఓ మైనర్ బాలిక తండ్రి అతని పై కేసు పెట్టారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో "నిన్ను ఇప్పుడు ఎవరూ కాపాడతారు"..అంటూ నిందితుడు మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఘటన ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరగడం విచారకరం. -
ఉపాధ్యాయుల చేతుల్లో భావితరం భవిష్యత్తు భద్రం : రాష్ట్రపతి
-
సర్వేపల్లి రాధాకృష్ణన్కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ పాల్గొన్నారు. ‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇవీ చదవండి: సీఎం వైఎస్ జగన్కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్ -
గురు వెన్నెల
-
ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్
Singer Sunitha Emotional: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడి దాదాపు ఏడాది కావస్తోంది. సింగర్గా, నటుడిగా, మూజిక్ డైరెక్టర్గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గతేడాది 2020 సెప్టెంబర్25న కన్నుమూసిన సంగతి తెలిసిందే. భౌతికంగా ఆయన దూరమైనా సంగీత సరిగమల్లో చిరంజీవిలా ఎప్పటికీ నిలిచిపోతారు బాలు. ఆయన దూరమై ఏడాది కావస్తుండటంతో సింగర్ సునీత ఎస్పీబీని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. చదవండి : హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు 'మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది.సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం,బలం,నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా'.. అంటూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నారు. కాగా ఎస్పీబీతో కలిసి సునీత పలు స్టేజ్ షోలలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : 'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా' -
రామాచార్య
-
ఉపాధ్యాయ దినోత్సవం: మొదట చెప్పుకోవాల్సిన గురువు ఆయనే
సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయుల దినోత్సవం అనుకోవటం కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఒకసారి గురువులను అంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గురువులను స్మరించుకోవాలి. మొట్టమొదటగా మనం చెప్పుకోవలసిన, గుర్తు చేసుకోవలసిన గురువు జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ జాతికి భగవద్గీతను బోధించిన గురువు ఆ నల్లనయ్య, ఒక్క భగవద్గీతతో అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. దుష్టసంహారం చేయించాడు. కురు వృద్ధుడైన భీష్మాచార్యుడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగద్గురువు అని సంబోధించాడు. గురువు అంటే తన శిష్యునిలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడని అర్థం. అంతేకాని పాఠాలు చెప్పే ప్రతివారు గురువులు కాదు. విద్యార్థికి మార్గదర్శనం చేసి, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి, ఆ విద్యార్థి ఏ రంగంలో రాణించగలడో గమనించగల శక్తి కలవాడే గురువు అని భీష్ముని మాటలలో వ్యక్తమవుతుంది. అందుకే వయసులో శ్రీకృష్ణుడు భీష్ముడి కంటె చిన్నవాడైనప్పటికీ జగద్గురుత్వం ప్రాప్తించింది. చదవండి: సీఎం వైఎస్ జగన్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు m అదే గౌరవం దక్కిన మరొకరు ఆదిశంకరాచార్యులు. జగద్గురు ఆదిశంకరాచార్య అనే మనం భక్తితో, గౌరవంగా పిలుచుకుంటాం. 32 సంవత్సరాలు మాత్రమే తనువుతో జీవించినా, ఆయన రచనలతో నేటికీ అంటే కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా జీవించాడు శంకరాచార్యుడు. ఆచార్యత్వ గుణాల వల్లే శంకరుడు శంకరాచార్యుడయ్యాడు. జగద్గురువయ్యాడు. భారతజాతికి అనర్ఘరత్నాల వంటి స్తోత్రాలు అందించాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు తిరుగుతూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, శక్తి పీఠాలు స్థాపించి, జ్ఞానతృష్ణ ఉన్నవారికి పరోక్షంగా గురువుగా నిలుస్తున్నాడు శంకరుడు. చదవండి: మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్ మరో జగద్గురువు స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి, ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేసి, గురువుల సందేశాలను యావత్ప్రపంచానికి అందించి, అతి పిన్నవయసులోనే కన్నుమూశాడు వివేకానందుడు. అయితేనేం నేటికీ వివేకానందుడు ఎంతోమందికి గురువుగా పరోక్షంగా జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్నాడు. చెళ్లపిళ్ల కవుల దగ్గర చదువుకున్నామని చెప్పుకోవటం ఒక గర్వం, ఒక ధిషణ, ఒక గౌరవం. అంతటి గురువుల దగ్గర చదువుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన గురువులకు దక్కని గౌరవం తనకు దక్కిందన్నారు. తన వంటి శిష్యులున్న గురువులు మరెవరూ లేరని సగర్వంగా అన్నారు. అదీ గురువుల ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటన. గురువులు అంటే శిష్యుల భుజాల మీద చేతులు వేసుకుని, వారితో సమానంగా అల్లరి పనులు చేయటం కాదు. గురువులు అంటే శిష్యుల దగ్గర డబ్బులు చేబదులు పుచ్చుకుని, వ్యసనాలను తీర్చుకోవటం కాదు. వందే గురు పరంపర గురువు అంటే తన దగ్గర చదువుకునే విద్యార్థిని ప్రేమ వివాహం చేసుకోవటం కాదు. గురువంటే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు. ఉత్తర తన శిష్యురాలు. ఆమెను వివాహం చేసుకోమని విరటుడు కోరితే, అందుకు అర్జునుడు.. అయ్యా, నా దగ్గర చదువుకున్న అమ్మాయి నాకు కూతురితో సమానం. కూతురితో సమానమైన అమ్మాయిని కోడలిగా చేసుకోవచ్చు కనుక నా కుమారుడు అభిమన్యునికిచ్చి వివాహం చేస్తానన్నాడు. అదీ గురువు లక్షణం. చదువురాని గురువులు విద్యార్థులకు చేసే బోధన మీద తెన్నేటి లత ఆ రోజుల్లోనే సంచలన కథ రాశారు. అదే ఎబ్బెచెడె... అంటే ఏ బి సి డి లను ఎలా పలుకుతారో వివరించారు. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో టీచర్లు చుక్ చుక్ రైలు వస్తోంది అనే బాల గేయాన్ని... సుక్కు సుక్కు రైలు వత్తాంది అని చెబుతున్నారు. ఇటువంటి గురువుల వల్ల విద్యార్థులకు గురువుల పట్ల అగౌరవంతో పాటు, విద్య అంటే ఏమిటో తెలియకుండా పోతారు. చదువు చెప్పే గురువులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నిబద్ధత, సత్ప్రవర్తన వంటి మంచి లక్షణాలు ఉండాలి. అటువంటి గురువులు ఉన్ననాడే ఉపాధ్యాయ దినోత్సవానికి అర్థం పరమార్థం కలుగుతుంది. గురుదేవోభవ అనే మాటల అంతరార్థం నిజమవుతుంది. గురువు దేవుడిలా బోధించాలి. దానవుడిలా బోధిస్తే అది దానవత్వాన్ని వృద్ధి చేస్తుందని గుర్తించాలి. - వైజయంతి పురాణపండ -
మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్
లెక్కల టీచరు లీవ్ పెట్టాడని తెలిస్తే పండగ. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పిరియడ్ ఉన్నా పండగే. సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తాడు... కొడతాడా... పాడా... గ్రామర్ చెప్పే ఇంగ్లిష్ మాస్టారు జాలిగా చూడటం తప్ప ఏం చేయగలడు. ఇంట్లో ఒక అమ్మ ఉంటే సోషల్ టీచరు ఇంకో అమ్మ. ఆ రోజులు వేరు. ఆ జ్ఞాపకాలు వేరు. ప్రతి విద్యార్థికి ఏది గుర్తున్నా లేకున్నా జీవితాంతం తమ గురువులు గుర్తుంటారు... ఆ అల్లర్లూ గుర్తుంటాయి. ఇవాళ అవన్నీ గుర్తు చేసుకుని టైమ్ ట్రావెల్ చేయాల్సిందే. కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు. కొందరు టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. కొందరు పిల్లలతో గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పేంత వరకూ గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే క్లాస్రూమ్ వయసుకు దిగిపోతారు. కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు. కొందరు రహస్యం చెప్పినట్టు చెబుతారు. కొందరు నోరే తెరవరు బోర్డు మీద రాయడం తప్ప. కొందరు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన సార్లు, టీచర్లు, మేష్టార్లు... మొత్తంగా గురువులు. వారికి విద్యార్థులు మనసులో సదా ప్రణామం చేసుకుంటారు. కాని వారి ఎదుటే అల్లరి కూడా చేస్తారు. టీచర్లూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఎంత అల్లరి అనుమతించాలో వారికి తెలుసు. ఎంత సరదా క్లాసులో పండాలో తెలుసు. బెత్తం ఫిలాసఫీ ‘దండం దశగుణం భవేత్’ అని టీచర్లు అప్పుడప్పుడు బెత్తం ఆడిస్తూ పిల్లలతో అంటారు. అంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే వంద వికారాలు దారిలోకి వస్తాయని. కొందరు దానిని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్ పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తం టేబుల్ మీద ఉంచుతారుగానీ ఎప్పుడూ వాడరు. కొందరు అసలు బెత్తం ఉండాలనే కోరుకోరు. కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు... ఇంకొందరు చెక్క డెస్టర్ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్పీస్ను ఉండేలు కన్నా షార్ప్గా విసురుతారు. కొందరు తొడబెల్లం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన స్టూడెంట్ని లేపి అతని/ఆమె ద్వారా చెంపలు పగుల గొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తర్వాత? ఆ.. మనికిది మామూలే అని ఇంటర్వెల్లో ఐస్ కొనుక్కోవడానికి విద్యార్థులు పరిగెడతారు. మూడీ... కొందరు టీచర్లు మూడ్ బాగుంటే క్లాసు కేన్సిల్ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చినవాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసురూమ్లోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్.జానకి. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి... ఓహ్. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్ పాడైతే ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా చిర్రుబుర్రుమంటారు. కొందరు ఎవడో ఒకణ్ణి బోర్డ్ మీద ఏదో రాయమని కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవమని క్లాస్ చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి స్థాయి విశ్రాంతి తీసుకుంటారు. గురువులు. వారి చిత్తం. విద్యార్థుల ప్రాప్తం. ఇష్ట/అయిష్ట టీచర్లు స్కూల్లో ప్రతి స్టూడెంట్కు ఇష్ట అయిష్ట టీచర్లు ఉంటారు. క్లవర్లకు లెక్కల సారు ఇష్టం. నాన్ క్లవర్లకు సోషల్ సారు ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పి.టి.సారు ఇష్టం. బొమ్మలు వేసుకునేవారికి డ్రాయింగ్ మాష్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్ పేపర్ వచ్చే పిల్లలకు ఇంగ్లిష్ టీచర్ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన స్టూడెంట్ తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారు ఆ ప్రశ్నలు అడగాల్సిన రోజున సైకిల్ మీద నుంచి కింద పడి స్కూలుకు రాకూడదని మొక్కులు మొక్కే విద్యార్థులు ఎందరో. ఆ మొక్కులన్నీ ఆ యొక్క మాస్టార్లకు అమోఘ సంజీవనులు. సింహస్వప్నం తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరిగెత్తుతాడు. స్కూల్ సార్ కనిపించినా అల్లరిగా తిరిగే స్టూడెంట్ పరిగెత్తుతాడు. తండ్రి తర్వాత తండ్రి మేష్టారు. తల్లి తర్వాత తల్లి టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కాని కనకపోయినా బాగు కోరేవాడే బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులుంటాయి. కాని టీచర్లు అయినవారిలో 90 శాతం మంది టీచరు కావాలని అనుకుని అయినవారు. పిల్లలకు మంచి చెప్పాలని అయినవారు. పిల్లలనే పూల మధ్య వసించడమే వారికి ఇష్టం. విద్యార్థులు పెద్దవారై దేశాలు దాటుతారు. కాని టీచర్లు ఆ స్కూల్లో అదే తరగతిలో అదే సిలబస్ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ ఆ నిచ్చెన దిగి విద్యార్థులందరూ తమ టీచర్లను తలుచుకోవాలి. కాంటాక్ట్ నంబర్ ఉంటే ఫోన్ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దాపున ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువంటే జ్ఞానం. మార్గం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. -
విద్యార్థిని చెక్కే శిల్పి... ఉపాధ్యాయుడు
‘వ్యక్తిత్వాన్ని నిర్మించే, మనోబలాన్ని పెంచే, బుద్ధి వైశాల్యాన్ని విస్తరించే, ఒక మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసే విద్య మనకు కావాలి’ అంటారు స్వామి వివేకానంద. ఒక బలమైన దేశా నికి నిజమైన మూలాధారం ఉపాధ్యా యులే. వారి ప్రయత్నాలే నూతన తరాల భవిష్యత్ను కాంతిమయం చేస్తాయి. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొం టున్న సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను గౌరవంగా స్మరించుకుంటాం. దౌత్యవేత్త, పండితుడు, అన్నింటికీ మించి గొప్ప ఉపాధ్యాయుడు అయిన సర్వేపల్లి, దేశానికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అందరినీ కలుపుకొని పోయేలా సమాజాన్ని మార్చేందుకు విద్య అనేది ముఖ్యమైన సాధనం అని ఆయన భావించారు. టీచర్ అంటే కేవలం తరగతి గదికే పరిమితమైన వారు కాదు. దానికి మించిన పాత్ర వాళ్లు పోషిస్తారు. బోధన అనేది నిరంతర ప్రక్రియ. ఉపాధ్యాయులు చురుగ్గా, సృజన శీలంగా, పట్టు వదలని విక్రమార్కుల్లా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా, కాలానుగుణంగా పాత చింతకాయ భావాలను వదిలేసేలా ఉండాలి. అప్పుడే వాళ్లు అత్యుత్తమమైన మానవ వనరులను సృష్టించగలరు. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను తట్టుకోగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దగలరు. అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినప్పటికీ, కఠినతరమైన పరీ క్షల్లో విజయులైనప్పటికీ కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు చదివినప్పుడు ప్రాణం విలవిల్లాడు తుంది. అందుకే బోధన అనేది కేవలం పిల్లల మెదళ్లలో జ్ఞాన తృష్ణను రగిల్చేదిగా మాత్రమే మిగలరాదు; వారి హృదయాలలో ఒక సానుకూల భావనను నెలకొనేట్టుగా చేయాలి. గూగుల్ ఎన్న టికీ గురువుకు ప్రత్యామ్నాయం కాజాలదు! ఉపాధ్యాయులు విద్యా ప్రపంచంలో వస్తున్న నూతన పరి ణామాలపట్ల వారు ఎరుకతో ఉండాలి. కోవిడ్–19 మహమ్మారి మనకు ఆన్లైన్ బోధన ప్రాధాన్యతను తెలియపర్చింది. అందుకే టీచర్లు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న కొత్త సాధనాలైన కృత్రిమ మేధ, వస్తు అంతర్జాలం, బ్లాక్చైన్ టెక్నాలజీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి వాటిపట్ల సాధికారత కలిగివుండాలి. డిజిటల్ నాలెడ్జ్ బ్యాంకును సృష్టించాలి. మన చిన్నారుల ఐక్యూను విశే షంగా పెంచడం మన లక్ష్యం కావాలి. వచ్చే సమస్యలకు వాళ్లే పరిష్కారాలు ఇవ్వగలిగేట్టు చేయాలి. ఆలోచన, చర్చ, ప్రయోగం అనేవి బోధనా శైలిలో ముఖ్యాంశాలు కావాలి. అప్పుడు మాత్రమే మనం నాయకులను, శాస్త్రవేత్తలను సృష్టించగలం. మెడికల్ సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సైన్స్లాంటి విద్యలోని ప్రతి రంగంలోనూ మనం శీఘ్రగతిన పురోగతి సాధించాం. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాలు ఈ రోజున విద్య గరపడంలో ఎంతో ముందు న్నాయి. అత్యున్నత విద్యా సంస్థల్లో 2019–20 సంవత్సరంలో 3.85 కోట్ల మంది ఉన్నారు. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు. అంటే 11.36 లక్షల పెరుగుదల. పాఠశాల విద్యలో కూడా మనం ఎన్నో రెట్ల స్థిరమైన ప్రగతిని సాధించాం. ఉపాధి ఏర్పరుచుకు నేలా, ఉద్యోగాలు సృష్టించేలా మన విద్యార్థులు, యువతకు స్థిరమైన సాధికారతనిచ్చేలా చేయడంలో మన సామూహిక కృషి, పట్టుదలకు ఈ సంఖ్యలు ఉదాహరణ. మనం గమనించవలసింది నిరుద్యోగిత, పేదరికం, అసమా నతలు, ఆఖరికి వివక్షలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి విద్య అనేది ఆచరణీయ పరిష్కారం. అందుకే సమాజంలోని బల హీన వర్గాలైన ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల చదువుల విషయంలో అదనపు కృషి అవసరం. పేదరికంవల్ల ఈ వర్గాల నుంచి ఎంతోమంది పిల్లలు చదువులు మానుకుంటున్నారు. వాళ్లను మనం పాఠశాలల్లో ఉంచేలా చేయాలి. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛా విలువలతో కూడిన నవ భారతం నిర్మించడంలో, ఆత్మ నిర్భర్ భారత్ స్వప్నాన్ని నెరవేర్చడంలో నూతన విద్యా విధానం–2020 ప్రాము ఖ్యతగల పనిముట్టు కాగలదు. మన విద్యా విధానం ఒకే మూసలో పోసినట్టుండే యంత్రాలను తయారుచేసేట్టుగా కాకుండా, నైపుణ్యం, దూరదృష్టి, హేతువుతో కూడిన బహుముఖ ప్రజ్ఞను అలవర్చేదిగా ఉండాలి. అందుకే నూతన విద్యా విధానం విద్యాసంబంధ కార్యకలాపాలకూ, సాంస్కృతిక, వృత్తి సంబంధ నైపుణ్యాలకూ మధ్య గట్టి గీత గీయడం లేదు. ఆరవ తరగతి నుంచే శిక్షణతో కూడిన వృత్తి సంబంధ విద్య ప్రారంభమ వుతుంది. కనీసం ఐదో తరగతి వరకు వారి మాతృ, ప్రాంతీయ భాషల్లో బోధన ఉంటుంది. ఇరవై ఒకటో శతాబ్దపు విద్యా విధానం సౌలభ్యం, సమత, అందుబాటు, జవాబుదారీతనం అనే మూలసూత్రాల మీద నిర్మితమైంది. ఉపాధ్యాయులు పిల్లలను ఒక మాతృమూర్తిలా సంరక్షిం చాలి. మామూలు ఉపాధ్యాయుడు కేవలం తరగతి గది పాఠా లతో మాత్రమే విద్యార్థితో సంబంధంలో ఉంటాడు. కానీ మంచి ఉపాధ్యాయుడు దానికి మించి పిల్లల మనసుల్లో ముద్రవేయ గలుగుతాడు. మాకు భౌతికశాస్త్రం బోధించిన రామయ్య సర్, తెలుగు బోధించిన శేషాచార్య నాకు ఇప్పటికీ గుర్తున్నారు. వాళ్లు అద్వితీయమైన ఉపాధ్యాయులు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన భావమార్పిడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముఖ్యం కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విలువలు, వ్యక్తిత్వం, పట్టుదల, వినయం కూడా అంతే ముఖ్యం. ఉపా ధ్యాయ వృత్తి గొప్పది. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా బోధన కొనసా గించారు. బోధన అనేది ఉద్యోగం కాదు; ఉత్తమ మానవులను తీర్చిదిద్దే ఒక మతం. మన ఉపాధ్యాయులు ఈ గొప్ప ధర్మాన్ని వ్యాపింపజేసే ప్రవర్తకులు. మీ త్యాగాల వల్ల ఎవరూ విస్మరణకు గురికాని నవభారతం సాకారమయ్యే కొత్త యుగంలోకి ప్రవేశి స్తామని నా విశ్వాసం. ‘ఒక మనిషి వ్యక్తిత్వం, అంతర్వా్యప్తి, భవి ష్యత్ రూపొందించగలిగే బోధన అనేది చాలా పవిత్రమైన వృత్తి’ అన్న అబ్దుల్ కలాం మాటలతో దీన్ని ముగిస్తాను. వ్యాసకర్త:బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ (నేడు ఉపాధ్యాయ దినోత్సవం) -
గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పది అని కొనియాడారు. ‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదువే తరగని ఆస్తి గురువే రూపశిల్పి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.#TeachersDay — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2021 ఇవీ చదవండి: సీఎం వైఎస్ జగన్కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారాలు–2021కు పాఠశాల విద్యా శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. అన్నిరకాల స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, ఐఏఎస్ఈ, డైట్కు చెందిన ప్రిన్సిపాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్) తదితరులకు ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత గ్రేడ్ కలిగిన హెడ్ మాస్టర్లకు కనీసం 15 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఉపాధ్యాయులకు పదేళ్ల బోధనానుభవం ఉండాలి. సాధారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు అవార్డులకు అర్హులు కాదు. కానీ కొన్ని ప్రత్యేకతలున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఏఎస్ఈ, డైట్, సీటీఈఎస్లో పనిచేసే లెక్చరర్లు లేదా సీనియర్ లెక్చరర్లకు కనీసం పదేళ్ల బోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పరిగణనలోకి ‘హరితహారం’.. హరితహారం కార్యక్రమంలో అత్యుత్తమ కృషి సాధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను పరిగణనలోకి తీసుకుంటారు. 2019–21 మధ్య కాలంలో పాఠశాలల్లో చేపట్టిన హరితహారం మొక్కల మనుగడను పరిగణిస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పేర్లను ఖరారు చేస్తాయి. ప్రతి జిల్లా నుంచి ముగ్గురి పేర్లు.. జిల్లా స్థాయి ఎంపిక కమిటీలో కలెక్టర్, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్, మరో జిల్లా స్థాయి అధికారి ఉంటారు. జిల్లా నుంచి ఈ కమిటీ మూడు పేర్లు ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్ ఉంటారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు సిల్వర్ మెడల్ (గోల్డ్ ప్లేటెడ్), శాలువా, రూ.10 వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్ ఇస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను జిల్లా కమిటీలు వచ్చే నెల 10 లోపు రాష్ట్ర కమిటీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయా పేర్ల నుంచి జ్యూరీ కొందరిని ఎంపిక చేసి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను ఖరారు చేస్తుంది. మొత్తంగా వివిధ కేటగిరీల్లో 43 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు. -
సిక్కోలుకు జాతీయ గౌరవం
కాశీబుగ్గ: కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆసపాన మధుబాబు రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో జరగాల్సిన అవార్డు ప్రధానోత్సవం కరోనా కారణంగా ఆన్లైన్కు పరిమితమైంది. జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అ వార్డులు పొందిన మధుబాబు తొలిసారిగా జాతీయ అవార్డును ఆన్లైన్లో అందుకున్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాష బోధన, వీసీఆర్ ప్రజెంటేషన్, మన టీవీ లైవ్ ప్రజెంటేషన్, స్టడీ అవర్స్ నిర్వహణ, నైట్ విజిటింగ్, ఆదివారం ప్రత్యేక తరగతుల నిర్వహణ వంటి అంశాలతో ఆయన ఆకట్టుకున్నారు. సమయం దొరికితే వృధా చేయకుండా విద్యార్థులే సర్వస్వంగా భావించి నిరంతర ఉపాధ్యాయుడిగా, నిత్య విద్యారి్థగా మసలుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడియో కాల్ ద్వారా మధుబాబుకు అభినందనలు తెలిపారు. మధు బాబు మాట్లాడుతూ స్వయంగా వెళ్లలేని పరిస్థితి అయినప్పటికీ వీడియో కాన్ఫరెన్సులో కలిసి మాట్లాడుకోవడం ఆనందాన్ని ఇచ్చిందనన్నారు. -
ఉపాధ్యాయులు దేశానికి దిశా నిర్దేశకులు
సాక్షి, హైదరాబాద్: ‘భావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులను తయారు చేస్తారు’ అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. దేశ, పౌరుల వ్యక్తిగత భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపు దిద్దుకుంటుందని, విద్యార్థులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలను తెలుసుకునేలా ఉపాధ్యాయులు కృషి చేస్తారని ప్రశంసించారు. తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం తన ఉపాధ్యాయులేనని తెలిపారు. నర్సరీ నుంచి వైద్య కళాశాల వరకు ఉపాధ్యాయులే తన చదువు పట్ల శ్రద్ధ వహించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆమె రాజ్భవన్ నుంచి జాతీయ విద్యా విధానం–2020పై వెబినార్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారన్నారు. ఎందరో అభాగ్యులను ఉపాధ్యాయులు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం– 2020తో దేశం మేథోపరంగా సూపర్ పవర్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆమె మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళి అర్పించారు. -
ఈ స్థాయిలో ఉన్నామంటే వారే కారణం
దుబాయ్ : ప్రపంచంలో ప్రతి మనిషికి తనను గైడ్ చేసే గురువు ఏదో ఒక సందర్భంలో తగలడం సహజమే. ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అది సినిమా, క్రీడా ఇలా ఏ రంగమైనా కావొచ్చు.. ఒక నటుడు గాని.. క్రీడాకారుడు కానీ జీవితంలో ఎదుగుతున్నారంటే వారి వెనుక గురువులు కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్.. సచిన్ను ప్రోత్సహించకపోయుంటే.. ఈరోజు మనం ఒక లెజెండరీ క్రికెటర్ను చూసేవాళ్లం కాదేమో.. అలాగే కోహ్లి, ధోని లాంటి ఆణిముత్యాలు భారత క్రీడావనికి పరిచయం కాకపోయుండేవారేమో. సెప్టెంబర్ 5న భారత మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. (చదవండి : కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై నమ్మకం ఉంది) సర్వేపల్లి జయంతిని పురస్కరించుకొని భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు తమ జీవితంలో గురువులు ఎంత ప్రాముఖ్యత వహించారనేది ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. 'మీకందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు ఈ స్థానంలో దృడంగా నిలబడ్డామంటే దానికి కారణం ఉపాధ్యాయులు, క్రికెట్ కోచ్లు. నన్ను ఒక ఆటగాడిగా ప్రోత్సహించిన కోచ్లకు, చిన్ననాటి గురువులకు నా వందనాలు. వీరంతా నా జీవితంలో ఒక స్థంభాల్లా నిలబడి నాకు మార్గనిర్దేశనం చేశారు.' అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఉద్వేగంతో పేర్కొన్నాడు. Happy Teacher's day to all the teachers and coaches who encourage us and stand by us by being our constant pillar of support. ☺️ #HappyTeachersDay — Virat Kohli (@imVkohli) September 5, 2020 టీమిండియా టెస్టు జట్టు ఆటగాడు అజింక్యా రహానే స్పందిస్తూ.. ' నా జీవితంలో ఇప్పటికి నా గురువులు, కోచ్లు, టీమ్మేట్స్, మెంటార్స్, కుటుంబసభ్యులు ఇచ్చే సూచనలు పాటిస్తుంటా. ఇక మీదట కూడా అలాగే కొనసాగుతా.. మీకందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు... నన్ను ప్రోత్సహించిన నా గురువులకు, కోచ్లకు ధన్యవాదాలు.. మనం నేర్చుకుంటాం అన్నంత వరకు గురువులు మనతోనే ఉంటారు. ' అంటూ తెలిపాడు. Everyday I have the quest to learn a little more from my mentors, my game, my teammates, my coaches, my family and everyone around. #HappyTeachersDay to everyone who has ever taught me anything 🙏 Here’s to letting the urge to learn, never die. — Ajinkya Rahane (@ajinkyarahane88) September 5, 2020 మరో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ తన చిన్ననాటి కోచ్ మదన్ శర్మ జీతో ఇటీవలే దిగిన ఫోటో ఒకటి షేర్ చేశాడు. 'ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా చిన్ననాటి కోచ్ మధన్ శర్మ జీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అదంతా ఆయన చలవే. థ్యాంక్యూ.. మధన్ శర్మ జీ.. ' అంటూ రాసుకొచ్చాడు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే వీరంతా దుబాయ్లో తమ జట్టు తరపున ప్రాక్టీస్ ప్రారంభించారు. View this post on Instagram On #TeachersDay, I’d like to thank and appreciate my childhood coach Madan Sharma ji for guiding me and helping me get to where I am today 😊 A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Sep 4, 2020 at 9:31pm PDT -
గురువులకు వందనం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ విద్యా హక్కును అందించాలన్న తమ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్లకు ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భావి పౌరులకు విద్య, విజ్ఞానాన్ని అందించి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. నైతిక విలువలే పునాదులుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేని అన్నారు. ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం’ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: మన ఆచార్యుడు సర్వేపల్లి) -
గురువు.. భవితకు ఆదరువు!
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత మహోన్నత స్థానాన్ని గురువుకు ఇచ్చారు. విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మనం సన్మార్గంలో నడవడంలో వారి పాత్ర కీలకం. భవిష్యత్లో ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలో భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుకున్నాం. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మహనీయుడు. ఈ ఏడాది ఆ వేడుకల రోజు రానే వచ్చింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. తప్పులు సరిచేస్తూ సన్మార్గ బోధన పాఠశాలల్లో విద్యార్థుల తప్పులు సరిచేస్తూ వారిని సన్మార్గంలో నడిచేలా ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల కృషి అంతా ఇంతా కాదు. క్లాసులో అల్లరి చేస్తున్నా ఎంతో ఓపికగా పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెబుతారు. తప్పు చేస్తే తప్పు అని చెప్పి, భవిష్యత్తులో మళ్లీ చేయవద్దని చెప్పే దయాగుణం గురువులది. అంతటి గొప్ప మనసున్న టీచర్లను ఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కరోనాతో వేడుకలు దూరం ఉపాధ్యాయ దినోత్సవం వస్తుందంటే ఏటా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులు తమ గురువులను సన్మానించాలని, వారి ఆశీర్వాదం పొందాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. సెప్టెంబర్ 5న ఆనందంతో వేడుకల్లో పాల్గొంటారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆ సందడి కనుమరుగైంది. పాఠశాలల్లో విద్యాబోధన జరగడం లేదు. విద్యార్థులు ఇళ్లకే పరి మితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ దినో త్సవం జరుపుకునే అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకలు వద్దని ఆదేశాలు వచ్చాయి కోవిడ్–19 నిబంధనలతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప దినాల నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరపవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధన చేస్తున్నాం. పిల్లలు పాఠశాలలకు రావడం లేదు కాబట్టి ఇళ్లవద్ద తల్లిదండ్రులే గురువులుగా వ్యవహరించి, వారి భవిష్యత్తును కాపాడాలి. – బి.డేనియల్, ఎంఈవో, ఉమ్మడి రామగుండం -
గురుదేవోభవ
ఒక రాయికి రూపం పోయాలంటే శిల్పి ఉండాలి, అదే విధంగా ఒక ఉత్తమ పౌరుడుగా రూపొందాలంటే అతడికి గురువు మార్గదర్శనం ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు లేని విద్య నిష్ఫలం అని పెద్దలు అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.. అంటు పాఠశాలల్లో, అదే విధంగా ప్రతీ చోట వారిని మనందరం తలుచుకుంటాం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానంగా మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అంతటి విలువను ఇస్తాం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం... సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రామస్వామి గణితబోధనలో దిట్ట. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా తీసుకునేలా, కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ఈ పాఠశాలను తీర్చిదిద్దాడు. విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలకాలని, ప్రయోగ విధానం రావాలని కోరుకోవడంతో పాటుగా తన పాఠశాలలో ఆచరణలో పెట్టారు. దీంతో ఈ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు అయిన సరే బోధించే విధానం ఇతర పాఠశాలలతో పోల్చితే వేరుగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చాట్ రూపంలో, అదే విధంగా మన నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల మార్పులాగా విద్యార్థులకు సునాయసంగా అర్థమయ్యే రీతిలో నేర్పుతు గణితం అంటే విద్యార్థుల్లో ఉంటే భయాన్ని ఆమడ దూరంలో ప్రాలదోలుతున్నాడు. పాఠశాలలో ప్రతీ విద్యార్థి చదువుతో పాటుగా మానవత ధృక్పదం, సామాజిక పరిజ్ఞానం, పెంచుకునేలా ప్రతి రోజూ కార్యక్రమాలు తన తోటి ఉపాధ్యాయులతో కలిసి ఒక కుంటుంబంలా చేస్తున్నారు. దీంతో ఈ పాఠశాల పేరు నేడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017న సెప్టెంబర్ 5న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును పొందారు. ఈ పాఠశాలలో 1000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందుకు కారణం ప్రధానోపాధ్యాయులు రామస్వామి ప్రత్యేక చొరవే అని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంటున్నారు. సమాజానికి ఉపయోగపడేలా చేస్తాం విద్యార్థులు మొక్కలాంటి వారు. వారిని చిన్ననాటి నుంచి ఏ విధంగా తయారు చేస్తే ఆ విధంగా తయారు అవుతారు. అందువల్ల కేవలం మార్కుల చదువులు మాత్రమే వద్దు, వారికి సమాజం పై అవగాహన ఉండాలి. సమాజానికి ఉపయోగపడే విధంగా మాత్రమే విద్యావిధానం ఉండాలి. బట్టి విద్యతో కేవలం విద్యార్థికి మార్కులు మాత్రమే వస్తాయి, కానీ ఆ విద్యార్థికి సమాజంపై ఎలాంటి అవగాహన మాత్రం ఉండదు. అందువల్ల మానవతా విలువలతో కూడిన విద్యను అందించాలి. – రామస్వామి, ఇందిరానగర్ ఉన్నత పాఠశాల, సిద్దిపేట ⇔ తల్లి దండ్రి గురు దైవం పూజార్హులు, సదా అవనిపైన నాడూ నేడూ గురువు ఆదర్శం కదా. దూర దృష్టి, దృఢ సంకల్పాలకు పునాదులు పోస్తాడు. అందుకే ‘గురుదేవోభవ’ అంటు శ్లాఘిస్తారు. ⇔ ధరణిపై జీవులకు ప్రకృతియే ప్రథమ గురువు అటు నిటు ఎటు గాంచిన విశదమౌను ఈ నిజం మనుగడ కోసం పోరాటం ఇంకెంతో ఎదగాలని ఆరాటం విరించిలా విపంచిలా వినిపిస్తాడు గురువు. ⇔ కఠిన శిలలకు కమనీయ రూపం కల్పించె శిల్పి ధర్మాధర్మం–సత్యాసత్యం–హింసాహింసా– నీతి అవినీతి లంచం వంచనలు, మంచి చెడులను విశ్లేషిస్తాడు అబలల పాలిట ఆకృత్యాలను ఎండగట్టు గురువు. ⇔ గురువు జెప్పిన మాట–గురు తప్పదను వాడుక తరచి చూడగ నిధి చాలా నిజమని గమనించు శ్రద్ధ బూని చదివితే మెప్పులు అశ్రద్ధ జేస్తివా పలు తిప్పలు గొప్ప చదువుతో పదవికెక్కగ జూసి పరవశించు గురువు. ⇔ ఓ నాడు బతకలేనివాడు బడి పంతులన్నారు. ఈనాడు బ్రతుకు నేర్పువాడని సరిదిద్దుకోవలెను విద్యలేని వాడిని వింత పశువన్నారు, పలు విద్యలను నేర్పు నిపుణులగు గురువులున్నారు. వై.దేవదానం, రిటైర్డు హెచ్ఎం, కవి (భావనా తరంగాలు రచయిత) నర్సాపూర్, మెదక్ జిల్లా గురువు బోధనం శ్రీవాణి కటాక్షం గురువు శిక్షణం సర్వజ్ఞాన బీజాక్షరం. వెలుగు వీచికల్ని వేనోళ్ళ గుభాళింప జెసి, ఉన్నత విలువల్ని విద్యార్థులలో ఆకళింప సి, అనుభవైక వేద్యమైన గురు మార్గం అనితర సాధ్యం, అద్వితీయం. అక్షరాలు బాలల ఉజ్వల భవిష్యత్కు ఆక్షౌ హిణులై, ఆశయాలు ఉన్నత సోపానాలై. మార్గాన్ని అనుసరించిన శిష్యులు, గురు కర కమలములచే రూపు దిద్దుకున్న చైతన్య శిల్పులు. జన్మను సన్మార్గం చేయు విధాత జ్ఞాన భిక్ష అందించే ప్రదాత విద్యా సేవకే అంకితమైన ఉన్నత మూర్తి, మార్గనిర్ధేశకత్వానికి గురువు ఒక స్ఫూర్తి. – సముద్రాల శ్రీదేవి,తెలుగు ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్, పటాన్చెరు -
మన ఆచార్యుడు సర్వేపల్లి
‘తరగతి గదిలో దేశ భవిష్యత్ ఉంటుందని’ చాటిన ఆచార్యుడు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్’ మన జిల్లా వాసి కావడం గర్వకారణం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా, తర్వాత రోజుల్లో దేశప్రథమ పౌరుడిగా దేశవిదేశాల్లో ఎంతో కీర్తి గడించారు. రాధాకృష్ణన్కు సింహపురితో ఎనలేని అనుబంధం ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన తన పూర్వీకుల జన్మస్థలి సర్వేపల్లి రుణాన్ని తనకు దక్కిన అవకాశంతో రాష్ట్రపతి హోదాలో తీర్చుకున్నారు. జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు. సాక్షి, నెల్లూరు(బృందావనం): సామాన్య కుటుంబంలో పుట్టి.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఆచార్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పూర్వీకులది వెంకటాచలం మండలం సర్వేపల్లి. సెప్టెంబరు 5, 1888న తెలుగు సంప్రదాయ కుటుంబం సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రాధాకృష్ణన్ తాత అవ్వలు సర్వేపల్లి సీతారామయ్య, కొండమ్మ స్వగ్రామం సర్వేపల్లిని వీడి 19వ శతాబ్దం మొదటలోనే అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తిరుత్తణ్ణిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పూర్వీకులు కరణాలు, మునసుబులుగా వివిధ హోదాల్లో రెవెన్యూ శాఖల్లో పనిచేశారు. ప్రాథమిక విద్య రాధాకృష్ణన్ ఐదేళ్ల వయస్సులోనే తిరుత్తణ్ణిలో పాఠశాల విద్యాభ్యాసం ప్రారంభమైంది. అప్పటి పరిస్థితుల్లో రాధాకృష్ణన్ నాన్నకు తన కుమారుడికి ఇంగ్లిష్ నేర్పించడం ఇష్టం లేదు. దీంతో సంస్కృతం నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే స్నేహితులు, బంధువుల సలహాలతో మిషనరీ స్కూల్లో ఇంగ్లిష్ సాధన జరిగింది. అనంతరం తిరుపతిలోని లూథరన్ మిషన్ హైస్కూ ల్లో సెకండరీ ఎడ్యుకేషన్ను అభ్యసించారు. ఆ తర్వాత వేలూరులోని వర్గీస్ కాలేజీలో ప్రీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ రెండేళ్ల కోర్సును పూర్తి చేశారు. తర్వాత ఫెలో ఆఫ్ ఆర్ట్స్ (ఎఫ్ఏ)లో చేరారు. ఆ కోర్సును అభ్యసిస్తున్నప్పుడే పదిహేనేళ్ల వయస్సులోనే శివకమ్మతో వివాహం జరిగింది. అనంతరం మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్సును పూర్తి చేశారు. 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం మైసూరు విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగానికి అధిపతిగా నియమించింది. అనంతరం కోల్కత్తా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో సుదీర్ఘకాలం బోధనలు చేశారు. నెల్లూరీయుడితో కుమార్తె వివాహం సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పెద్ద కుమార్తె పద్మావతిని ఉత్తమ సంప్రదాయాలు కలిగిన ఎంతో ఉన్నత కుటుంబానికి చెందిన వీఆర్ కళాశాల కమిటీ సభ్యుడిగా ఉన్న మోదవోలు చెంగయ్య పంతులు కుమారుడు మోదవోలు శేషాచలపతికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆయకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఆయన బంధువర్గం ఇప్పటికీ నెల్లూరు, కందుకూరు, మద్రాసు తదితర ప్రాంతాల్లో ఉన్నారు. రాధాకృష్ణన్ మేనత్త నెల్లూరులో ఉన్న పురమందిరం (టౌన్హాల్) వీధిలో నివాసం ఉండేవారు. బెజవాడ గోపాల్రెడ్డికి అభినందన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డిని ఒక వేదికపై సర్వేపల్లి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ సందర్భంగా ఒక చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న తన చిత్రం వద్ద తెలుగులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అంటూ సంతకం చేసి మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. రాష్ట్రపతి హోదాలో కోనేరు బాగు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో సర్వేపల్లిలోని కోనేరును బాగుచేయించారు. మేమంతా ఆయన కుటుంబానికి సంబంధించి ఐదు, ఆరు తరాల వారం. సర్వేపల్లికి తాగునీరు అందించే కోనేరు నాడు పాచిపట్టి పోయింది. బాగు చేసే వారు లేకపోవడంతో నాడు మునసుబుగా విధులు నిర్వహిస్తున్న మా సోదరుడు సర్వేపల్లి సుబ్బారావు కోనేరు దుస్థితిపై రాష్ట్రపతి రాధాకృష్ణన్కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన ఆయన నాడు వెంకటాచలం సమితి అధికారులకు తక్షణమే కోనేరు బాగు చేయించాలని సూచించారు. దీంతో నాడు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులపై చేరుకుని కోనేరు బాగు చేయించి ఆ సమాచారం రాష్ట్రపతికి నివేదించారు. సర్వేపల్లి నుంచి దేశ ఉన్నత పదవిని అధిష్టించిన రాధాకృష్ణన్ విగ్రహాన్ని సర్వేపల్లిలో ప్రతిష్టించి ఆ మహనీయుడికి ఘననివాళి అర్పించాలి. ఇందుకోసం ట్రస్ట్ కృషి చేస్తోంది. – సర్వేపల్లి రామ్మూర్తి, చైర్మన్, సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ -
వారి సేవలు చిరస్మరణీయం: సబితా ఇంద్రా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు మరవలేమని కొనియాడారు. ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి డిజిటల్, ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం అని ఆమె పేర్కొన్నారు. చదవండి: థ్యాంక్యూ టీచర్ -
ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్బుక్స్ తీస్తాను..
చిన్నప్పుడు అమ్మానాన్నలు చేయి పట్టి నడక నేర్పిస్తే.. కాస్త పెద్దయ్యాక అక్షరాలు దిద్దించి.. జ్ఞానమార్గం చూపించి జీవన ప్రదాతలుగా.. మన ఉన్నతికి మార్గదర్శకులుగా నిలిచేవారు గురువులు. ప్రతి మనిషి జీవితంలో వీరి స్థానం అనన్యం.. అసామాన్యం.తప్పటడుగుల్లో.. తప్పుటడుగుల్లోపయనించవద్దని.. నింగికి నిచ్చెలేసి..ఆకాశమే హద్దుగా.. ఆశలు.. ఆశయాలేసరిహద్దుగా మనల్ని తీర్చిదిద్దేది గురువులే. విద్యాబుద్ధులతో పాటు సరైన మార్గాన్నినిర్దేశించేదీ వారే. అలాంటి ఆచార్యులను మనసారా తల్చుకుంటున్నారు కొందరు ప్రముఖులు. నేడు గురువులను స్మరించుకునే రోజు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ మనోగతాలను ఇలా వెలిబుచ్చారు. అమ్మ గుర్తుకు వస్తే కన్నీరే.. మా అమ్మే నా గురువు. ఆమె ఇంగ్లిష్ ప్రొఫెసర్. నేను చదివిన స్కూల్, కాలేజ్ రెండూ ఒకే బిల్డింగ్లో ఉండేవి. ఒకరోజు నేను ఐదు నిమిషాల ఆలస్యంగా క్లాస్కి వెళ్లాను. అప్పుడు మా అమ్మ నన్ను గమనించింది. ఇంటికి వెళ్లాకా మమ్మీ.. సారీ ఫైవ్ మినిట్స్ లేట్గా క్లాస్కి వెళ్లాను అని చెప్పాను. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ‘చూడు నాన్నా.. చిన్నప్పటి నుంచి సమయం విలువ తెలియాలి. జీవితంలో మనకు సమయం ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఇకపై స్కూల్కి లేటుగా వెళ్లొద్దు. టైమ్ కమిట్మెంట్ని ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి అంటూ తన నిమురుతూ చెప్పింది. నా లైఫ్లో నా గురువు, నా ఫ్రెండ్, మార్గదర్శకురాలు అమ్మనే. 2017లో ఆమె చనిపోయారు. ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ చిన్నప్పటి నోట్బుక్స్ బయటకు తీస్తాను. ఆ నోట్బుక్స్లో సమయం (టైమ్) గురించి ఆమె రాసిన కొటేషన్స్ని చదువుకుంటూ స్మరించుకుంటా. – సోనూసూద్, బాలీవుడ్ నటుడు సామాజిక దృక్పథాన్ని నేర్పారు చిన్నప్పటి నుంచి నా ఉత్తమ గురువు అమ్మ శైలజ. ట్యూషన్ లేకుండా ఆమెనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పించారు. ఆదిలాబాద్లోని సెయింట్ పాల్స్ స్కూల్లో చదివేప్పుడు సిస్టర్ (టీచర్) రేణు ఉండేవారు. ఆమె నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. అన్నీ షేర్ చేసుకునేవారు. అంతేకాకుండా చాలా స్ట్రిక్ట్ కూడా. కాలేజీలో లైఫ్లో సెంట్ఆన్స్లో చదివేటప్పుడు లెక్చరర్ డాక్టర్ మాలిని నాకు సామాజిక దృక్పథాన్ని నేర్పించారు. నాతో సోషల్ వర్క్స్ ఎన్నో చేయించారు. తద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఆశ కలిగింది. ఐఏఎస్ అవ్వడానికి కూడా కొంతవరకు మోటివేట్ కాగలిగాను ఆ సోషల్ యాక్టివిటీస్ ద్వారా. వీటితో పాటు గురువులు నేర్పిన సామాజిక దృక్పథం వల్ల బుక్స్, ఆర్టికల్స్ రాశాను. – హరిచందన దాసరి, జోనల్ కమిషనర్ ఓపిక నేర్చుకున్నా.. టీచర్స్కి చాలా ఓపిక ఉంటుంది. స్కూల్లో ఎంత అల్లరి చేసినా కొట్టకుండా, తిట్టకుండా అల్లరి చేయొద్దంటూ ఓపికతో నచ్చచెబుతారు. నేను స్కూల్ ఏజ్ నుంచి ఏంబీఏ వరకు నా గురువుల నుంచి నేర్చుకున్నది అదే. ఎంబీఏలో ఉన్నప్పుడు మోడలింగ్ కెరీర్ని స్టార్ట్ చేశా. అప్పట్లో కాలేజీకి డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పట్లో ఎంబీఏ లెక్చరర్ సుప్రియ మేడం, ప్రిన్సిపాల్ సర్.. నాకు బాగా సపోర్ట్గా నిలిచారు. మోడలింగ్కు వెళ్లే ప్రతిసారీ నాకు పర్మిషన్ ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆరోజుల్లో నన్ను ఇలా ప్రోత్సహించబట్టే నేను ఈరోజు హీరోయిన్ని కాగలిగాను. – ఈషారెబ్బా, హీరోయిన్ అమ్మే నా బెస్ట్ టీచర్ అమ్మ సంగీత వర్మ స్కూల్ ప్రిన్సిపాల్. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. టెన్త్ వరకు అమ్మ సమక్షంలోనే నా చదువు అంతా. ఆమె నుంచి లైఫ్ ఎలా బ్యాలెన్స్గా ఉండాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి. మనం మాట్లాడే తీరు, పద్ధతి అంతా నేర్పించారు. అమ్మ ఓ పక్క పర్సనల్ లైఫ్ మరో పక్క ప్రొఫెషనల్ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా చేయడం చూసి పెద్ద ఫ్యాన్ని కూడా అయ్యాను. నన్ను మా అక్కని ఏ రోజు చదువు విషయం, ఇతర విషయాల్లో బలవంతం పెట్టలేదు. నా ఎడ్వయిజర్. నా మోటివేటర్. నా ఇన్స్పిరేషన్ అమ్మ సంగీత వర్మనే. – రీతూవర్మ, హీరోయిన్ లీడర్ అవుతావన్నారు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాను. వర్షం భారీగా వస్తోంది. ఆ టైంలో కురుస్తున్న భారీ వర్షానికి చాలా భయం వేసింది. కింద పడటంతో దుస్తులన్నీ మురికి అయ్యాయి. అప్పటికే 20 నిమిషాల ఆలస్యమైంది. లోపల తెలియని భయం. స్కూల్లోకి వెళ్లగానే కొండారెడ్డి (హెడ్మాస్టర్) సార్ నన్ను ఎత్తుకుని క్లాస్రూమ్కి తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి చాలా గట్స్ ఉన్నాయి. పెద్దయ్యాక లీడర్ అవుతుందన్నారు. గురువుల నుంచి ఎంతోనేర్చుకున్నాను. – సుమతి ఐపీఎస్ దారి చూపే దీపం చిన్నప్పుడు దిద్దిన అక్షరం.. దిద్దించిన చేయి చిరకాలం మన ప్రవర్తనను దిద్దుతుంటుంది. గురువంటే గతం మాత్రమే కాదు మన వర్తమానం, భవిష్యత్తు కూడా. గురువును గౌరవించడం అంటే మన భూత భవిష్యత్ వర్తమానాలను గౌరవించడం. మన జీవితాన్ని గౌరవించడం. దీనిని గుర్తిస్తున్న నగరవాసులు తమ చిన్నప్పటి రోజులకు ప్రయాణం చేస్తున్నారు. టీచర్లను గుర్తు చేసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. పదిహేనేళ్ల తర్వాత.. టీచర్లను కలిశాం... చదువులు పూర్తయిపోయి, ఎక్కడెక్కడికో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిపోయాం. జీవితాల్లో స్థిరపడిన మా స్నేహితులం అందరం కలిసి ఇటీవలే మేం చదువుకున్న సూర్యాపేట జిల్లా త్రిపురవరం ఉన్నత పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఒక రోజంతా గడిపాం. గత కాలపు స్మృతులను నెమరేసుకుంటూ మేం విద్యార్ధుల్లా మారిపోయి, టీచర్ల చేతిలో మొట్టికాయలు తిన్నాం. తిరిగి వచ్చే ముందు మనసారా టీచర్లను సన్మానించాం. ఆ సమయంలో వారిలో కనిపించిన తృప్తి, ఆనందం మాకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. మమ్మల్ని అందరినీ పేరు పేరునా పిలిచి, మేం ఏం చేస్తున్నామో అడిగి తెలుసుకుని వారు పొందిన సంతోషంమాటల్లో చెప్పలేం. – వి.జయరామ్ శ్రీరామ్ వెంకటేష్కు ఉత్తమ అవార్డు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి (కంట్రోలర్) శ్రీరామ్ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. క్యాంపస్లోని ఇంజినీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్న ఆయన బోధన, పరిశోధనలతో పాటు పలు పాలన పదవుల్లో చేయి తిరిగినవారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ 1997లో ఓయూ అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. -
సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఎందరికో స్ఫూర్తి
-
గురువులకు నా పాదాభివందనాలు
సాక్షి, విజయవాడ : ‘‘గురువులందరికీ వందనాలు. నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతిగా ఎదిగిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ అందరికీ ఆదర్శమని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువుల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపించారని అన్నారు. గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్సార్ పులివెందులలో స్కూల్ను స్థాపించారని తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇప్పటికీ ఆ స్కూలును నడుపుతోందని అన్నారు. గురువు విద్యార్థుల గుండెలపై ముద్ర వేయగలరు అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. గురువు చేసిన పని ఎవరూ చేయలేరన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నది తన లక్ష్యంగా సీఎం జగన్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఎకానమీ లెక్కల ప్రకారం కాలేజీలకు వెళుతున్న విద్యార్థులు మన దేశంలో కేవలం 36 శాతమేనని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పుకు కట్టుబడి ఉన్నామన్నారు. దీనిలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్లో మార్పులు తెస్తామని, ప్రతి స్కూల్ను ఇంగ్లీషు మీడియం చేయాలని తాపత్రయపడుతున్నానన్నారు. ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్కు రావాలనే విధంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ఆయన అవార్డులు అందజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గురుపూజోత్సవంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కన్నబాబు, కొడాలినాని, పేర్నినాని, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి , పార్థసారధి, మల్లాది విష్ణు, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రధానం చేయనుంది. -
గురుపూజోత్సవంలో పాల్గొననున్న సీఎం
-
మళ్లీ టీచర్గానే పుట్టాలి
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః త్రిమూర్తుల అంశతో వెలిగే జ్ఞానజ్వాల గురువు. లోకంలో ప్రతిఫలించే ఈ వెలుగంతా గురువుల నుంచి ప్రజ్వరిల్లుతున్నదే. అక్షరాల్ని దిద్దించడమే కాదు, జీవితాన్ని కూడా పక్కన ఉండి శ్రద్ధగా దిద్దుతారు గురువులు. అలాంటి ఒక గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాంటి వెలుగుల వర్ణాలే ఆయన దిద్దివెళ్లిన విలువలు. నేడు ఆయన జన్మదినం. ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా.. మట్టిలోంచి ఒక గాయనిని మొలకెత్తించిన ‘గురుకోటి’, విశ్వాంతరాళాలపై చిన్నారులకు ఆసక్తి కలిగిస్తున్న ‘గురుకృష్ట’, అత్యుత్తమమైన ఒక టీచర్ని మలిచిన ‘గురుభువనేశ్వర’.. ఈ ముగ్గురు గురువుల, వారి వల్ల కాంతులీనుతున్న మూడు దివ్వెల వెలుగు కిరణాలివి. ‘ఓ సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’– కాళోజీ కొటేషన్ లైబ్రరీలో ఒక వైపు గోడ మీద ఉంది. మరోవైపు ‘టు డే ఏ రీడర్, టుమారో ఏ లీడర్’ అని ఉంది. అది హైదరాబాద్ నగర శివారులో జీడిమెట్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలు. మరొక గోడకు ఉన్న ఫొటోలు తోలుబొమ్మలాటల్లో ఎన్ని రకాలున్నాయో చెప్తున్నాయి. మరో వైపు రకరకాల సంగీత వాయిద్యాలను పలికిస్తున్న వాద్యకారుల ఫొటోలు. బయటి ప్రపంచాన్ని బడి నాలుగు గోడల మధ్య ఉండగానే తెలియచేసే ప్రయత్నం అది. ఇక లైబ్రరీలో ఆరు రౌండ్ టేబుళ్లు, వాటి మీద కథల పుస్తకాలున్నాయి. బీరువాల్లో చక్కగా అమర్చిన మరెన్నో పుస్తకాలు... ఆ బీరువాలకు తాళాలు లేవు. ఈ లైబ్రరీని నిర్వహిస్తున్నది ఆ స్కూలు పిల్లలే. పిల్లలు తమకు కావల్సిన పుస్తకం తీసుకుని, ఓసారి టీచరుకు చూపించి, వాళ్లే రిజిస్టర్లో రాసి ఆ పుస్తకాన్ని ఇంటికి పట్టుకెళ్తారు. చదివి తెచ్చిన తర్వాత బీరువాలో పెట్టి రిజిస్టర్లో తేదీని నమోదు చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే, స్కూలు భవనానికి పక్కనే ఉన్న గదిలో మధ్యాహ్న భోజన పథకంలో వండిన భోజనాన్ని హెడ్ మాస్టర్ పరీక్షిస్తున్నారు. ‘‘ఇంత బిరుసుగా ఉంటే పిల్లలు తినేదెలా? మళ్లీ వండమ్మా’’ అని చెప్పి బయటికొచ్చి ‘‘అన్నం ఉడుకుతోంది. ఓ పది నిమిషాలు ఆగండర్రా’’ అని పిల్లలకు చెప్పి తన గదిలోకి వెళ్లిపోయారు. టీచర్లు బాధ్యతగా ఉండడం వల్లనే, అది పిల్లలకు కూడా అలవడింది. ‘‘మా స్కూల్లో ప్రతిదీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది. టీచర్లందరం ఇంతటి అంకితభావంతోనే పనిచేస్తాం’’ అన్నారు ఆ స్కూల్ ఇంగ్లిష్ టీచర్ ఆశారాణి. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారామె. టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఆశారాణిది శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం, సీతాపురం గ్రామం. తండ్రి అప్పారావు మిలటరీ ఉద్యోగి, తల్లి సరస్వతి గృహిణి. ముగ్గురమ్మాయిల్లో ఆశారాణి పెద్దమ్మాయి. తండ్రి ఉద్యోగరీత్యా జమ్మూ–కశ్మీర్లో ఉండడంతో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం టెక్కలిలో అమ్మమ్మగారింట్లోనే పూర్తయింది. తండ్రికి బెంగళూరు ట్రాన్స్ఫర్ కావడంతో కుటుంబం బెంగళూరుకు మారింది. అక్కడ తెలుగు మీడియం ఉన్న ప్రభుత్వ పాఠశాలను వెతికి మరీ చేర్పించారాయన. ఆ సంగతులను సాక్షితో పంచుకున్నారు ఆశారాణి. ‘‘మొదటగా మా నాన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఫ్రెండ్స్ నీకు మూడు ‘మైనస్’లు అని ఆటపట్టిస్తున్నా, ఆయన మాత్రం తనకు అబ్బాయిలు లేరని ఏనాడూ అసంతృప్తి చెందలేదు. పైగా తన ట్రాన్స్ఫర్లు మా చదువులకు ఇబ్బంది కలిగించకుండా, తెలుగు మీడియం ఉండే విధంగా చూసుకున్నారు. బెంగళూరు తర్వాత ఉద్యోగం పోర్ట్బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవుల రాజధాని)లో. నాకు ప్లస్ టు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. మిలటరీ క్వార్టర్స్లో పెరగడంతో తమిళ, కన్నడ, మలయాళీ, ఉత్తరాది భాషలన్నింటితోనూ పరిచయం ఉండేది. పైగా పెద్ద వాగుడుకాయని కూడా. అలాంటిది కాలేజ్కొచ్చిన తర్వాత గొంతు పెగిలేది కాదు. ఇంగ్లిష్ భయంతో క్లాస్ ఎగ్గొట్టాను ప్లస్ టులో మంచి ర్యాంక్ రావడంతో భువనేశ్వర్లోని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సీటు వచ్చింది. అది బిఏ, బిఈడీ కలిసిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియం. అర్థం చేసుకోగలిగినా సరే, ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని. టీచింగ్ క్లాసులంటే చచ్చేంత భయం వేసేది. కడుపు నొప్పి అని ఒకరోజు, తలనొప్పి అని ఒకరోజు క్లాసులు ఎగ్గొట్టాను కూడా. అలాంటిది నేను ఇంగ్లిష్ టీచర్నయ్యానంటే మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఏడిపిస్తుంటారు. ఆర్మీ స్కూల్లో తొలి ఉద్యోగం నాన్న రిటైరైన తర్వాత మా కుటుంబం హైదరాబాద్కొచ్చింది. నేను ఉస్మానియాలో ఎం.ఎ హిస్టరీలో చేరాను. పీజీ పూర్తయ్యాక ఆర్మీ స్కూల్కి ఇంటర్వ్యూకెళ్లడం ఒక పాఠమే అయింది. ఉద్యోగం వచ్చింది కానీ సెకండ్ క్లాస్ టీచర్గా. నాకు బీఎడ్ ఉంది, పీజీ ఉంది, పెద్దక్లాసు ఇవ్వడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. అయితే ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడం వల్లనే అలా జరిగింది. అయితే అక్కడి పిల్లలతో మాట్లాడి, మాట్లాడి నాకు ఇంగ్లిష్ వచ్చేసింది. తర్వాత 1994లో డిఎస్సి రాసి సెలెక్ట్ అయ్యాను. శంకర్పల్లి మండలంలోని సంకేపల్లిలో పోస్టింగ్. ఐదు తరగతులున్న పాఠశాలకు ఇద్దరే టీచర్లం. తర్వాత రెండేళ్లకు మోఖిలాలోని అప్పర్ ప్రైమరీ స్కూల్కి బదిలీ. అక్కడ పెద్ద క్లాస్లకు ఇంగ్లిష్ చెప్పగలిగిన లాంగ్వేజ్ స్కిల్ ఉన్న వాళ్లలో నేనే బెటర్ అయ్యాను. అలా నా ప్రమేయం లేకుండా ఇంగ్లిష్ టీచర్నయ్యాను. యూనిసెఫ్ ప్రోగ్రామ్లో భాగంగా న్యూయార్క్ నుంచి డాక్టర్ కెరోల్ బెలోమీ మా స్కూలుకి వచ్చారు. ఆమెతో ఇంటరాక్ట్ అయ్యి, ట్రాన్స్లేటర్గా వ్యవహరించడం ఊహించని అవకాశం. ఆ టాస్క్ని విజయవంతంగా చేయగలిగినా సరే... ఎందుకో అసంతృప్తిగా అనిపించేది. దాంతో ఇంగ్లిష్లో ఎం.ఎ చేశాను. ఇంగ్లిష్ ఎం.ఏ ఎన్నో అవకాశాలను నా ముందుకు తెచ్చింది’’ అన్నారు ఆశారాణి. పిల్లలకు ఎల్లలు ఉండకూడదు 2017లో కాలిఫోర్నియాలో ‘టీచింగ్ ఎక్స్లెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్’లో పాల్గొన్నారు ఆశారాణి. ఆరు వారాల పాటు అక్కడి స్కూల్స్ని విజిట్ చేయడం, మన విద్యావిధానంలోకి తీసుకోగలిగిన మంచి విధానాలను గుర్తించడం, మన దేశ కల్చర్ గురించి అక్కడి పిల్లలకు తెలియచేయడం ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొజెక్టర్ ఉండదని తెలుసుకున్న కాలిఫోర్నియా పిల్లలు వాళ్ల దగ్గర అదనంగా ఉన్న ప్రొజెక్టర్ని మనకు బహూకరించారు. ఆశారాణికి ఆ ప్రోగ్రామ్కు హాజరైన ఇరవై దేశాల టీచర్లతో పరిచయం అయింది. ఆ టీచర్ల సహకారంతో కజకిస్తాన్, నేపాల్ దేశాల పిల్లలను స్కైప్లో నేరేడ్మెంట్ స్కూల్ పిల్లలకు పరిచయం చేశారు. ‘‘భాష, ప్రాంతం, దేశం అనే ఎల్లలు లేకుండా పిల్లలు యూనివర్సల్గా పెరగాలి. జ్ఞానం ఎక్కడ ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి పిల్లలే వారధులు కాగలగాలి’’ అన్నారామె. ఆ కాలేజే నడిపించింది ఇంగ్లిష్ టీచర్గా కుత్బుల్లాపూర్, శంకరపల్లిలోని ప్రొద్దుటూరుతోపాటు ఈ స్కూల్లో (జీడిమెట్ల స్కూలు) ఐదేళ్లు చేశాను. 2009 నుంచి 2018 వరకు నేరేడ్మెట్ స్కూల్లో పని చేసి మళ్లీ ఇక్కడికి వచ్చాను. అప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలు పెద్దయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను వచ్చానని తెలిసి స్కూలుకి వచ్చి పలకరిస్తుంటారు. ఒకసారి పనిచేసిన స్కూల్కి మళ్లీ వస్తే స్వీట్ మెమొరీ అవుతుందని వచ్చిన తర్వాతే తెలిసింది. వృత్తికి అంకితమై పోయి, పిల్లలతో మమేకం అవడాన్ని భువనేశ్వర్ కాలేజ్ నేర్పించింది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో టీచర్లలో ఎక్కువ మంది ఆ కాలేజ్ వాళ్లే ఉంటారు. నేను జూనియర్ లెక్చరర్గా వెళ్లకుండా గవర్నమెంట్ స్కూలు పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్నది కూడా మా కాలేజ్ నేర్పించిన సామాజిక బాధ్యతే. మా స్కూళ్లలో చాలామంది పిల్లలకు... తల్లిదండ్రులు హయ్యర్ స్టడీస్ గురించి గైడెన్స్ ఇవ్వగలిగిన స్థితిలో ఉండరు. దాంతో ఆ బాధ్యత కూడా మేమే తీసుకోవాలి. టీచర్ బాధ్యత పిల్లలకు చదువు చెప్పడంతో పూర్తి కాదు, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ల మీద ప్రభావం చూపించాలి. అందుకే నేను ఉపాధ్యాయ వృత్తిని అంతగా ఆరాధిస్తాను.– ఆశారాణి, ఉత్తమ ఉపాధ్యాయిని ఆశారాణికి ఉపాధ్యాయినిగా ఇరవై నాలుగేళ్లు నిండాయి. పిల్లలకు పాఠాలతోపాటు పదిహేడేళ్లు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారామె. 1997లో ఢిల్లీలోని సీసీఆర్టీలో తోలు బొమ్మలతో పాఠాలు చెప్పడంలో శిక్షణ పొందిన ఆశారాణి ప్రైమరీ స్కూలు పిల్లలకు బొమ్మలతో పాఠాలు చెప్పేవారు. ‘‘అంకితభావంతో పని చేస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. టీచర్కి ప్రొఫెషన్ మీదున్న నిబద్ధత పిల్లల ఫలితాల్లో కనిపిస్తుంది. పాఠాలు చెప్పేసి ఉద్యోగం అయిపోయిందనుకోకుండా ఇన్నేసి బాధ్యతలను తలకెత్తుకోవడానికి నేను సింగిల్ కావడం కూడా ఒక కారణం కావచ్చు’’ అన్నారామె నవ్వుతూ.– వాకా మంజులారెడ్డిఫొటోలు: దత్తు గుంటుపల్లి -
వృత్తిని గౌరవించే మహోపాధ్యాయుడు
భారతీయ దార్శినిక చింతనాధోరణులను, సంస్కృతిని పాశ్యాత్య దేశాలకు తనదైన శైలిలో రచనలద్వారా తెలియజేసిన గొప్పరచయిత, విద్యావేత్త, వేదాంతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్గారు. సంస్కృత భాషలోని భవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు (ప్రస్థానత్రయ) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి భారతీయ దర్శనానికి గల విశిష్టతను తాత్విక మూలాలను ఆవిష్కరించి భావవాద కోణంలో భారతీయదర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యాయనం చేసేలా కృషిచేసిన వేదాంతి రాధాకృష్ణన్. ఆయన వల్లనే భారతీయ దర్శనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందనడంలో అతిశయోక్తిలేదు. వారి మేధోసంపత్తిని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీటిలో ముఖ్యమైనవి ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ద ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ఫ్రీడమ్ అండ్ కల్చర్’, ‘మహాత్మాగాంధీ’, ‘గ్రేట్ ఇండియన్’, ‘ది దమ్మపద గౌతమబుద్ద’, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. రాధాకృష్ణన్గారు మనదేశానికి 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1962లో దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆ సందర్భంలో దేశవిదేశాల్లో వున్న తనశిష్యులు శ్రేయోభిలాషులు ఆయనను కలిసి మనసారా అభినందించి తన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఆ సంవత్సరం ఘనంగా జరిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో నాటినుండి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయదినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది. రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణి పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువళ్లూరులో, పాఠశాల, ఉన్నత విద్యను రేణిగుంటలో.. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకొని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన విషయమైన తత్వ శాస్త్రంలో ఎమ్మే పట్టా పొందారు. 1921లో ప్రతిష్ఠాత్మకమైన 5వ కింగ్జార్జ్ ఆచార్యపీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్టించారు. 1929లో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ కాలేజి ప్రిన్సిపల్గా, ఆ పిదప ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యుడుగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి ‘సర్’ బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఆచార్యుడుగా పనిచేసి 1931లో ఆంధ్రాయూనివర్సిటీ వైస్ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1954లోనే దేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైనటువంటి భారతరత్నను అందుకొని 1962లో రాష్ట్రపతిగా ఎన్నికయినప్పుడు.. ‘ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్ కింగ్’ అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు. ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటిని రాధాకృష్ణన్ తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు విద్యావిధానం’ అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహజన్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను వర్సిటీలు సంరక్షించాలి. తద్భిన్నంగా నేడు పలువురు ఉపాధ్యాయులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావాలతో స్వప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఉపాధ్యాయవృత్తి మసకబారుతుంది. బోధన ప్రమాణాలు, విద్యాప్రమాణాలతోపాటు సామాజిక, నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయదినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తు చేయడంలో స్ఫూర్తిదాయకంగా నిలవాలి. (నేడు ఉపాధ్యాయ దినోత్సవం) వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగాచార్యులు, ఓయూ మొబైల్ : 98491 36104 -
రేపు విజయవాడకు సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేపు(సెప్టెంబర్ 5) విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందిస్తారు. రాష్ట్రంలో ఉత్తమ సెవలందించిన గురువులకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రధానం చేయనుంది. -
చిన్న చిన్న పాఠాలు
గురువు అంటే బెత్తం పట్టుకుని బడిలో తారసపడే వ్యక్తి మాత్రమేనా? అభ్యాసంలో చేయి పట్టి నడిపించేవాడు మాత్రమేనా? తప్పులను దండించి సరిదిద్దేవాడు మాత్రమేనా? ఒక్క చదువులో సాయం పట్టేవాడు మాత్రమేనా? దారి పొడవున ఎందరో గురువులు. ఎన్నో మలుపులు. ఎన్నోచోట్ల ఎందరో గురువులు తారసపడి జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అది చిన్న సలహాలా ఆ క్షణానికి అనిపించవచ్చు. కాని అది జీవితానికి సరిపడా గురోపదేశం కూడా కావచ్చు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత హక్కుల కార్యకర్త, కళాకారిణి మాయా యాంజిలో తనకు జీవితంలో గురోపదేశంలా ఉపయోగపడిన సలహా తన నానమ్మ నుంచే అందిందని చెప్పుకుంది. ‘మా నానమ్మ నాతో ఏమందంటే– అమ్మాయ్.. లోకం నిన్ను ఒక దారిలో నిలబెట్టి ముందుకు వెళ్లమంటే... ఆ దారి నీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్? ఆ దారి చూపే గమ్యం ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్? అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళ్లడం కూడా ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్. ఏమీ చేయకు. చప్పున ఆ దారి వొదిలి నీదైన దారిని కనిపెట్టు.. అని చెప్పింది. నేను అలా నా దారిని కనిపెట్టుకున్నాను’ అందామె.టాటా సంస్థల్లో ఒక ముఖ్య అధిపతి, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జంషెడ్ జె.ఇరానీకి తన పదిహేడో సంవత్సరం అతి ముఖ్య ఉపదేశం తండ్రి నుంచే అందింది. విదేశాలలో చదువుకోవడానికి వెళుతున్న జంషెడ్ ఇరానీతో తండ్రి– ‘అబ్బాయ్... ప్రపంచంలో పుట్టే ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఆ పదోవాడికి పని చేసి పెట్టడానికే పుడతారు. కనుక నువ్వు ఆ పదోవాడిగా ఉండటానికే ప్రయత్నించు’ అన్నాడు. అప్పటి వరకూ ఒక లక్ష్యం లేని జంషెడ్ ఆ సలహా విని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే సంపద అంటే ఆర్థిక సంపద మాత్రమే కాదు. ఆత్మిక సంపద కూడా. అలాంటి సంపదను కోల్పోయే సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విలువైన సలహాలు గురోపదేశాలై జీవితాన్ని నడిపిస్తాయి. నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ తన భర్తను కోల్పోయినప్పుడు ఆమెకు ఇద్దరు కుమార్తెలే ఉండటాన, కుమారుడు లేనప్పుడు భర్త ఆస్తి దక్కని చట్టం నాడు ఉనికిలో ఉండటాన, బంధువులు ఆ చట్టాన్ని ప్రస్తావించి తనకు ఏమీ దక్కని పరిస్థితి తెచ్చి పెట్టబోతున్నారని గ్రహించి వారందరి మీద కోపంతో ఆమె అమెరికా వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. అప్పుడు గాంధీజీ ఆమెను పిలిచి ‘నీ లోపల అశాంతి పెట్టుకుని ఎంత దూరం వెళ్లినా ప్రశాంతత పొందలేవు. సామరస్యం వల్లే శాంతి వస్తుంది. ఎవరో మనకు హాని చేస్తారని అనుకుంటాం కాని మనకు మనం తప్ప ఎవరూ హాని చేయలేరు. నువ్వు నీ వారితో సయోధ్య చేసుకో’ అని చెప్పారు. ఆ మాట విన్న విజయలక్ష్మి బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లింది. వాళ్లందరూ ఎంతో రిలీఫ్ పొందారు. ఆమెకు కూడా ఆందోళన వదిలిపోయింది. బంధాలు నిలబడ్డాయి. అంతే కాదు... గుడ్డిగా వెళ్లే దారిలో చిన్న టార్చిలైట్లాగా మిత్రుల నుంచి గురోపదేశం అందుతుంది. నటుడు మనోజ్ బాజ్పాయ్ థియేటర్ ఆర్టిస్ట్గా ఢిల్లీలో సంవత్సరాల తరబడి పని చేశాడు. ఎన్నేళ్లు పని చేసినా నటుడుగా పేరు, గుర్తింపు తప్ప ఆర్థిక ఉన్నతి లేదు. కాని తోటి నటులంతా అలాగే ఉన్నారు కనుక అలా ఉండటమే జీవతం కాబోలు అని అతను అనుకున్నాడు. కాని ‘బాండిట్ క్వీన్’ ఆడిషన్స్ కోసం ఢిల్లీ వెళ్లిన దర్శకుడు శేఖర్ కపూర్ మనోజ్ బాజ్పాయ్ని ఒక పాత్రకు ఎంపిక చేసి ‘జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేని, అద్దె ఇల్లు తప్ప సొంత ఇల్లు లేని ఇలాంటి జీవితంలో ఎన్నాళ్లుంటావ్. సినిమాల్లో నటించు’ అని హితవు పలికాడు. ఆ సలహా అతణ్ణి ఇవాళ ఎక్కడ నిలబెట్టిందో మనకే తెలుసు.+ తెలుగులో వేటూరి సుందరరామ మూర్తికి కూడా పాత్రికేయ వృత్తి మీద, కవిగా జీవనం సాగించం మీద మాత్రమే ఆసక్తి వుండేది. కాని ఆయన విద్వత్తును గమనించిన ఎన్.టి.రామారావు ‘సినిమాలకు పాటలు రాయండి’ సలహా ఇచ్చారు. కాని దానిని వేటూరి పాటించలేదు. రెండు మూడేళ్లు గడిచిపోయాయి. మళ్లీ మద్రాసులో వేటూరి తారసపడ్డారు ఎన్.టి.ఆర్కు. ఆయన తన సలహాను మర్చిపోలేదు. ఈసారి కోపంగా ‘ఎందుకు మా సలహా వినరు. సినిమాలకు రాయండి’ అని హూంకరించారు. అంతేకాదు అవకాశాలు ఇప్పించారు. వేటూరి సుందరరామమూర్తికి ఆ సలహా గురోపదేశంలా పని చేసింది. సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్ ఒకరోజు నటుడు అశోక్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అశోక్ కుమార్తో కూచొని మాట్లాడుతూ ఉంటే లోపలి నుంచి సైగల్ గొంతుతో పాట వినిపిస్తూ ఉంది. అచ్చు సైగల్ గొంతులాగానే. అది విన్న ఎస్.డి.బర్మన్ ‘లోపల పాడుతున్నది ఎవరు?’ అని అశోక్ కుమార్ని అడిగాడు. ‘మా తమ్ముడే’ అని అశోక్ కుమార్ తన తమ్ముడిని పిలిచి ఆయన ముందు నిలబెట్టాడు. అప్పుడు బర్మన్ ‘చూడు.. బాగా పాడుతున్నావు. కాని సైగల్ లాగా పాడుతున్నావు. అనుకరణలో భవిష్యత్తు లేదు. నవ్వు నీలాగా పాడటం నేర్చుకో పైకొస్తావు’ అన్నాడు. ఆ కుర్రాడు ఆ ఉపదేశం పాటించి భవిష్యత్తులో కిశోర్ కుమార్ అయ్యాడు. రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయదినోత్సవం ప్రపంచ కోటీశ్వరుడు వారెన్ బఫెట్ తనకు అందిన అతి గొప్ప గురోపదేశంగా ఒక మిత్రుడు వాక్కు గురించి ప్రస్తావిస్తాడు. బఫెట్ అంటాడు– ‘‘ఒక మిత్రుడు నాతో ఒకసారి అన్నాడు – ‘బఫెట్ నీకు గనక కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజుకు నోరు మూసుకొని ఉండు. మరునాడు కూడా అలాగే అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో’ అని. నా జీవితంలో ఆ సలహాను పాటించి లాభం పొందుతూనే ఉన్నాను’’ అంటాడాయన. ఉర్దూ కవిత్వంలో ‘తరన్నుమ్’ అనేది గాన పద్ధతి. కవిత్వాన్ని పాటలాగా పాడి వినిపిస్తారు. ప్రఖ్యాత కవి కైఫీ ఆజ్మీ ఇంకా తాను అంత ప్రఖ్యాతం కాక మునుపు ఒకసారి హైదరాబాద్లో సరోజిని నాయుడును కలిశారు. ‘ఏదీ నీ కవిత్వం వినిపించు’ అని ఆమె అడిగారు. కైఫీ తన కవిత్వాన్ని తరన్నుమ్ పద్ధతిలో పాడి వినిపించాడు. అది విని సరోజిని నాయుడు ‘కైఫీ... దయచేసి ఇక మీదట ఎవరికీ ఇలా పాడి నీ కవితను వినిపించకు. భావస్పోరకంగా చదువు. చాలు’ అని సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి కైఫీ తన కవితను పాడటం మానేశాడు. ఆయన గొంతే ఆ తర్వాతి కాలంలో కవితా ఉనికి అయ్యింది. పాఠాలు ఇలాంటివే చాలా దొరుకుతూ ఉంటాయి. అవి పాఠాలుగా గ్రహించినప్పుడే మనం ఉత్తమ శిష్యులవుతాము. ఆ తర్వాత గురువులవుతాము. బడి బయట ఎందరో ఉపాధ్యాయులు. వారందరికీ వందనాలు.– సాక్షి ఫ్యామిలీ -
వివాహిత దారుణహత్య
ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికని ఇంటి నుంచి బయల్దేరిన వివాహిత దారుణహత్యకు గురైంది. చున్నీతో గొంతుకు బిగించి.. ఆనక బండరాయితో తలపై మోది అంతమొందించారు. కూడేరు మండలం శివరాంపేట సమీపాన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం మిన్నంటింది. అనంతపురం, కూడేరు: బుక్కపట్నంకు చెందిన విజయలక్ష్మి(22)కి అనంతపురంలోని గణేష్ నగర్కు చెందిన బాలాజీతో మూడేళ్ల క్రితం వివాహమైంది. విజయలక్ష్మి అనంతపురంలోని విజయ పబ్లిక్ స్కూల్లో టీటీసీ కోర్సు చేస్తోంది. బాలాజీ ఏటీఎంలకు నగదును సరఫరా చేసే ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ నెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూల్లో ఫంక్షన్ ఉందని విజయలక్ష్మి ఏడు తులాల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరింది. 11 గంటలకు కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే తాను స్కూల్ వద్ద లేను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం, సెల్ఫోన్ పని చేయకపోవడంతో ఆందోళనకు గురైన భర్త టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి.. కూడేరు మండలం శివరాంపేట వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుట్టలోకి ఓ వ్యక్తి బహిర్భూమికని వెళ్లాడు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో ఏమిటా అని చుట్టుపక్కల వెదికాడు. అక్కడ మహిళ తలపై బండరాయి వేసి ఉండడం గమనించి గ్రామస్తులకు తెలిపి.. పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్, సీఐ ప్రసాద్రావు, ఆత్మకూరు ఎస్ఐ సాగర్లు సిబ్బంది, డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలం చేçరుకుని పరిశీలించారు. మెడకు చున్నీ బిగించి ఉండడం, ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడం, పరిసరాల్లో ఎలాంటి రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించకపోవడం చూస్తే ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మిన్నంటిన రోదనలు విజయలక్ష్మి మృతదేహాన్ని చూసి భర్త, తల్లిదండ్రు లు, అత్తమామలు బోరున విలపించారు. తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని రెండు సంవత్సరాల కుమారుడు అమాయకంగా చూస్తుండిపోవడం అం దరినీ కలచివేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపి వేసి ఉండవచ్చని మృతురాలి తండ్రి చిన్నకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
-
ఉపాధ్యాయులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిర్వహించే పాత్ర అత్యంత స్ఫూర్తి దాయకమైనదని, ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను ప్రతి ఒక్క గురువుకు నమస్కరిస్తున్నానని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఆయన నివాళులర్పించారు. By sculpting young minds, teachers have the power to shape the world. On this Teachers Day, I bow down to each and every teacher, who in their circadian jobs have created greatness. My tributes to Dr Sarvepalli Radhakrishnan. #HappyTeachersDay pic.twitter.com/Pr8UaqFu2i — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2018 -
మిస్సమ్మ మంచి టీచర్ గోవిందం మంచి మాస్టర్
మేకప్ లేని గురువులు బడిలో ఉంటారు.మేకప్ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు.కాని వారి పాఠాల్లో తేడా ఉండదు.వారి ఆదర్శాల్లో తేడా ఉండదు.వారు చూపించే మంచి మార్గంలో తేడా ఉండదు.దైవం కంటే ముందు మనిషి గురువునే తెలుసుకుంటాడు.తల్లిదండ్రుల చేయి తర్వాత గురువు చేయే పట్టుకుంటాడు.మంచి చెప్పాలనుకున్న సినిమాల్లో మంచి గురువు ఎప్పుడూ హిట్టే కొట్టాడు. నూటికి నూరు మార్కులు సాధించాడు. బేడ్ టీచర్స్ వల్ల కొంతమందికి గుడ్ జరుగుతూ ఉంటుంది. ‘మిస్సమ్మ’ సినిమాలో ఆ జమిందారువారి స్కూల్లో అల్లు రామలింగయ్య సరిగ్గా పాఠాలు చెప్పి ఉంటే సావిత్రి అవసరం ఉండేదే కాదు. అతను అస్తమానం పిల్లల చేత ఆయుర్వేదం మందులు నూరిస్తూ, లేహ్యాలకు సాయం పట్టిస్తూ, గుళికలను చుట్టిస్తూ చేయము అని మొరాయిస్తే బెత్తం తిరగేస్తూ నానా బాధలు పెడుతున్నాడనే జమిందారైన ఎస్వీ రంగారావు కొత్త టీచరు కోసం మేనల్లుడైన అక్కినేని చేత పేపరు ప్రకటన ఇప్పిస్తాడు. దానివల్ల మిస్సమ్మగా సావిత్రి ఆమె భర్త ఎమ్.టి.రావుగా ఎన్.టి.ఆర్ ఆ ఊరికి వచ్చి మెల్లగా ఆ ఇంటికి అయినవాళ్లమని గ్రహించి కథను సుఖాంతం చేస్తారు. పనిలో పనిగా పనివాడు దేవయ్య అను రేలంగి కూడా బాగుపడ్డాడనుకోండి. తెలుగు సినిమాల్లో పాపులర్ స్థాయిలో హీరో హీరోయిన్లు టీచర్లు అయ్యింది ‘మిస్సమ్మ’తోనే కావచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తెలుగు సినిమాల్లో టీచర్ల గౌరవం పెంచారు. టీచరు హోదాకు తమ స్టార్డమ్ను కూడా ఇచ్చారు. బడి పంతులు ఎన్.టి.ఆర్ వంటి స్టార్ ‘బడి పంతులు’గా చేయడం ఏమిటి అని ఆ రోజుల్లో మొదట అందరూ వింత పడ్డారు. ఆవేశం కలిగిన హీరో నలుగురినీ చితకబాదే వీరుడు బెత్తం కూడా పట్టకుండా మెత్తగా పాఠాలు చెప్తూ ఎలా మెప్పించగలడు అని కుతూహలం చూపారు. కాని టీచర్ అంటే ఇలా ఉంటాడు అని ఎన్.టి.ఆర్ బడిపంతులులో నిరూపించారు. విద్యార్థులకు ఆయనంటే ఎంత ఇష్టమంటే ఆ రోజులలోనే వారు స్వయం సేవ చేసి కాలిపోయిన ఇంటి స్థానంలో ఆయనకు ఇల్లు కట్టి ఇస్తారు సినిమాలో. ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయుడే విద్యార్థులకు నిజమైన ఆదర్శం. క్లాస్రూమ్లో ఆదర్శం వెల్లివిరిస్తే సంఘంలో ఆదర్శం వెల్లి విరుస్తుంది. భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు... అని అందరూ పాడుకోగలిగింది అప్పుడే. కోడెనాగు క్లాసులో అల్లరి చేస్తే టీచర్ దండిస్తాడు. క్లాసు బయట అల్లరి చేస్తే ఏం చేస్తాడు? ‘కోడెనాగు’ సినిమాలో గురువుగా వేసిన ఆచార్య ఆత్రేయ శిష్యుడైన శోభన్బాబు కోసం ఎన్నెన్ని అవస్థలు పడతాడో ఎన్నెన్ని తాపత్రయాలు అనుభవిస్తాడో చెప్పలేము. కోడెనాగును చూస్తే జనం పూజలు చేయవచ్చు. కాని దానిని వీధుల్లో ఇళ్లలో తిరగనివ్వరు. ముక్కుసూటిగా వెళ్లే శోభన్బాబులాంటి వ్యక్తులకు సంఘంలో చోటు లేదు. అలాంటి వాడికి బాసటగా ఈ సినిమాలోని ఆత్రేయ వంటి గురువు కావలసిందే. ఈ సినిమా క్లయిమాక్స్ ఆ రోజుల్లో ఊహకు అందనిది. శిష్యుడి కోసం గురువు ప్రాణాలు వదులుతాడు. ఆ గురువును వెతుక్కుంటూ శిష్యుడు కూడా తన ప్రియురాలితో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ గురుశిష్యుల అనుబంధం అమరం. విశ్వరూపం సినిమాల్లో టీచర్ ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు. యువ స్టూడెంట్స్కు దారి చూపే మార్గదర్శి అయ్యాడు. దేశంలో డెబ్బయ్యవ దశకం వచ్చినప్పుడు ఫ్యాషన్ కొంచెం శృతి మించింది. విద్యార్థులలో అల్లరి, నిర్బాధ్యత పెరిగాయి. క్లాసులు ఎగ్గొట్టడం, వ్యసనాలకు పాల్పడటం, లెక్చరర్లను ఎదిరించడం... ఈ ధోరణిలో ఉన్న వారిని ఒక దారికి తేవడానికి ‘విశ్వరూపం’ సినిమా ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇందులో లెక్చరర్గా వేసిన ఎన్.టి.ఆర్ను విద్యార్థులు మొదట ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఎంతగా అభిమానిస్తారంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్న ఆయన తన ట్రాన్స్ఫర్ లెటర్ చించి పారేసి మరీ ఆ కాలేజ్లో ఉండిపోతాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చే ప్రభావితులైన స్టూడెంట్స్ ఏకంగా డ్యామ్ కట్టేంత స్థాయిలో ఏకం అవుతారు. విద్యార్థుల శక్తి సంఘ పురోగతికి ఉపయోగించవచ్చని చెప్పిన బెస్ట్ టీచర్ సినిమా ఇది. శంకర శాస్త్రి పాఠాలు చెప్తేనే గురువా... సంగీత పాఠాలు చెప్తే గురువు కాదా? శంకరాభరణంలో శంకరశాస్త్రికి మించిన గురువు లేడు. ఆ గురువుకు శిష్యుడిగా చేరాలంటే తులసికి చాలా శుశ్రూష చేయాల్సి వస్తుంది. వినయం చూపించి మెప్పించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ శిష్యుడిని స్వీకరించాక ‘బ్రోచేవారెవరురా’ అంటూ కీర్తనలేం ఖర్మ ఆ శిష్యుడు నిజంగా యోగ్యుడయ్యాడని తెలిసిన క్షణాన ఆ శంకరశాస్త్రి స్వయంగా తన ముంగాలి మీద ఉన్న గండపెండేరాన్ని తీసి మరీ శిష్యుడికి తొడుగుతాడు. ఏ కళ అయినా గురు ముఖతానే నేర్చుకోవాలి అప్పుడే అబ్బుతుంది రాణిస్తుంది అని చెప్పిన సినిమా ఇది. గురువు నుంచి కళను మాత్రమే కాదు విలువలను అలవర్చుకోవాలి అని రాగం తానం పల్లవులను మన మదిలో కదలాడిస్తూ మరీ చెబుతుంది. ప్రతిఘటన బెత్తం పట్టే టీచరు అవసరమైతే గొడ్డలి పట్టుకోదా? జవాబు పత్రంలో అప్పు ఆన్సర్ రాస్తే సున్నా మార్కులు వేయక తప్పదు. మరి సంఘంలో తప్పు పని చేస్తే ఏం చేయాలి? ‘ప్రతిఘటన’ రౌడీయిజం చేస్తున్న చరణ్రాజ్ తాను సంస్కరించాల్సిన మొదటి బ్యాడ్ స్టూడెంట్ అని లెక్చరర్ పాత్ర వేసిన విజయశాంతి గ్రహిస్తుంది. అతణ్ణి ఎదిరిస్తుంది. నిలువరిస్తుంది. ఎంత ప్రయత్నించినా పనికి రాకపోగా ఇతర స్టూడెంట్లకు హానికరంగా మారినవాణ్ణి డిబార్ చేయక తప్పదు. విజయశాంతి కూడా అదే పని చేస్తుంది. చరణ్రాజ్ను డిబార్ చేస్తుంది. సంఘం నుంచి చేస్తుంది. జీవం నుంచి చేస్తుంది. జీవితం నుంచి చేస్తుంది. అతడి మెడ మీద ఆమె తిప్పిన గొడ్డలే ఒక లెక్చరర్ ఇప్పటి వరకూ సినిమాలలో ఎత్తిన అతి ఉత్తమ బెత్తం అని చెప్పక తప్పదు. ముగ్గురు స్టార్లూ మూడు సినిమాలు హీరో ఎస్.ఐ అంటే ఉత్సాహపడే హీరోలు– హీరో టీచర్ అంటే వేయడానికి అంగీకరించకపోవచ్చు. తెలుగులో పెద్ద హీరోలు చాలామంది గురుస్థానంలో నిలబడ్డానికి ముందుకు వచ్చారు. వెంకటేశ్ ‘సుందరకాండ’లో, చిరంజీవి ‘మాస్టర్’లో, బాలకృష్ణ ‘సింహా’లో చేతిలో టెక్స్›్టబుక్స్ పట్టుకుని బ్లాక్బోర్డు మీద లెసన్స్ రాశారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటి నటులు హాస్యం పుట్టించే లెక్చరర్ పాత్రలు వేస్తున్నప్పుడు ప్రేమికులు తమ ప్రేమను అర్థం చేసుకుని ఎదిగేలా చేయగలిగే మంచి లెక్చరర్ పాత్రలో రావు రమేశ్ ‘కొత్త బంగారులోకం’ సినిమాలో కనిపిస్తాడు. ఓనమాలు ఊరికి నడిబొడ్డు ఎలాగో ఊరిలోని టీచర్ అలాగా. టీచర్ ఊరు విడిస్తే ఏమవుతుంది? ఊరే దారి తప్పుతుంది. ఎవరు ఎంత ఎదిగినా ఎన్ని దూర తీరాలకు చేరినా జన్మభూమికి వస్తూ పోతుండాలని ఊరి మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలని అందుకు ఆ ఊరి టీచరు మూలాధారం కావాలని చెప్పిన సినిమా ‘ఓనమాలు’. ఇందులో టీచర్గా రాజేంద్రప్రసాద్ ఊరి నుంచి చదువుకుని వెళ్లిన విద్యార్థులు తిరిగి ఊరికి రావాల్సిన అవసరాన్ని క్లయిమాక్స్లో చెబుతాడు. సంవత్సరానికి ఒక రోజు ‘మాతృభూమి దినోత్సవం’ పేరుతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలని కోరుతాడు. ఇంగ్లిష్ చదువులు పరాయి సంస్కృతిలో పడి మూలాలు మరిచిపోయినవారి చేత ఓనమాలు దిద్దించిన సినిమా ఇది. గీత గోవిందం నాటి సినిమాలలోనే కాదు నేటి సినిమాలలో కూడా నాటి హీరోలే కాదు నేటి హీరోలు కూడా గురు పరంపరను గురువు సంస్కారాన్ని గురువు ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారు. ‘గీత గోవిందం’ సినిమాలో లెక్చరర్ అయిన విజయ్ దేవరకొండ కూడా తన శిష్యురాలిని దారిలో పెడతాడు. డబ్బునో లేదా అందాన్నో ఎర వేస్తే గురువును దారికి తెచ్చుకోవచ్చు అనుకున్న ఒక విద్యార్థినిని చీవాట్లు పెట్టి ఎప్పటికీ ఆమెకు తానొక వెల్విషర్గా ఉంటానని చెబుతాడు. ఆ అమ్మాయికే కాదు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది అలాంటి గురువు తోడుగా నిలుస్తాడనుకుంటే.సినిమా శక్తిమంతమైన మీడియా. మార్గదర్శిగా నిలిచే పాత్రలను అది ఆ స్థాయిలో చూపించినప్పుడే వాటి ప్రభావం సినిమాలోనూ సంఘంలోనూ గొప్పగా ఉంటుంది. గురుబ్రహ్మ గురుర్వివిష్ణుః అంటూ దైవం కంటే ముందు గురువును నిలబెట్టారు. తల్లిదండ్రుల తర్వాత ఏ మనిషైనా రుణపడేది గురువుకే.అలాంటి గురువుకి నమస్కారం.సినిమా గురువుకు దండాలు. – కె -
చదువుకి వైద్యం
డాక్టర్ అవబోయి టీచర్ అవలేదు అనూరాధ. డాక్టర్ అయ్యాక.. టీచర్ అవ్వాలనుకుని చాక్పీస్తో చదువుకు వైద్యం చేయడానికి బయల్దేరారు. డాక్టర్ అనూరాధ కిశోర్, ఢిల్లీలో మంచి పేరున్న పీడియాట్రీషియన్. పిల్లల డాక్టర్గా పదిహేడేళ్ల అనుభవం ఆమెది. అలాంటి డాక్టరమ్మ ఓ రోజు టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు! ఆ మాట విన్న తోటి డాక్టర్లే కాదు, ఆమె అప్లికేషన్ను పరిశీలించి, ఆమోదించిన అధికారులు కూడా విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఈవిడకిదేం పిచ్చి అని ముఖాన అనలేదన్నమాటే కానీ దాదాపుగా కొంచెం అటూఇటుగా వారందరి అభిప్రాయం ఇదే! చదువే అనారోగ్యమా? ఇంతకీ అనూరాధ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం... పిల్లలు తరచూ అనారోగ్యం పాలు కావడమే. పిల్లలంటే ఆమె పిల్లలు కాదు. ఆమె దగ్గరకు తల్లిదండ్రులు తెస్తున్న పిల్లలు. ఎన్ని పరీక్షలు చేసినా పిల్లల్లో ఫిజికల్గా అనారోగ్యం కనిపించేది కాదు. అయితే ఒత్తిడికి లోనవుతున్న లక్షణాలు కనిపించేవి. మానసికంగానే వారిని ఏదో పీడిస్తున్నట్లుండేది. ఈ వయసులో వాళ్లకు ఇంకేం బరువు బాధ్యతలుంటాయని పీడించటానికి? బహుశా వారిని భయపెడుతున్న భూతం చదువే కావచ్చు, వారు భయపడుతున్న బూచి స్కూలే కావచ్చు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక నొప్పిని వాళ్లే వెతుక్కుంటూ ఉండవచ్చు. ఇవన్నీ తన ఊహాజనితమైన అనుమానాలేనా లేక పూర్తిగా నిజాలా? ఇది తెలియాలంటే స్కూలు ఎలాగుందో తెలుసుకోవాలి? పిల్లల మీద పాఠాల ఒత్తిడి ఎలా ఉంటోందో తెలుసుకోవాలి అనుకున్నారు డాక్టర్ అనూరాధ. ఆమె టీచర్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి వెనుక ఇంత కథ ఉంది. పిల్లలవన్నీ సిక్ లీవులే! కోర్సు అయ్యాక, ఢిల్లీ సమీపంలోని గుర్గ్రామ్లోని ప్రోగ్రెసివ్ స్కూల్లో కిండర్గార్డెన్ టీచర్గా చేరారు అనూరాధ. క్లాస్రూమ్లో అడుగుపెట్టిన తరువాత ఆమెకి ఒక్కో సందేహానికీ సమాధానం దొరికింది. క్లాస్లో పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వాళ్ల అటెండెన్స్ హిస్టరీని, హెల్త్హిస్టరీని పరిశీలించారామె. ఏ క్లాస్లో అయినా చదువులో చురుకైన పిల్లలతోపాటు, రమారమిగా చదివేవాళ్లు, ఒక మోస్తరుగా చదువుతూ బొటాబొటి మార్కులతో గట్టెక్కేవాళ్లు, పాస్మార్కులు తెచ్చుకోవడమూ కష్టమే అనిపించే పిల్లలూ ఉంటారు. చురుగ్గా ఉండే పిల్లలు, యావరేజ్గా చదివేవాళ్లలోనూ అభద్రత కనిపించడం లేదు కానీ అంతకంటే తక్కువ గ్రహింపు శక్తితో ఉన్న పిల్లల్లోనే అటెండెన్స్ తగ్గడం గమనించారామె. స్కూలుకి ఆబ్సెంట్ అయిన కారణాలు ‘అనారోగ్యాలే’ అయి ఉంటున్నాయి! తెలిసింది అడిగితే ఆత్మవిశ్వాసం యావరేజ్ పిల్లల్ని చురుకైన పిల్లలతో కలిపి పాఠాలు చెప్పి వదిలేస్తే కుదరదనుకున్నారామె. అలా చెప్పడం వల్ల చురుకైన పిల్లలు త్వరగా నేర్చుకుంటూ, టీచర్ అడిగిన ప్రశ్నకు టక్కున బదులిస్తూ, తోటి పిల్లల వైపు విజయగర్వంతో చూస్తుంటారు. టీచర్ యావరేజ్ స్టూడెంట్ని ప్రశ్న అడిగినప్పుడు ఆ పిల్లవాడు తనకు సమాధానం తెలియదనే భయంతో బిగుసుకుపోతుంటాడు. తరచూ ఇలా జరుగుతుంటే పిల్లల్లో న్యూనత పెరిగిపోతుంది, ముడుచుకుపోతారు. స్కూలంటేనే భయపడుతూ, మానేయడానికి దారులు వెతుక్కుంటారు. మరే కారణం చెప్పినా అమ్మానాన్నలు ఒప్పుకోరు కాబట్టి పొట్టలో నొప్పి, కాలు నొప్పి వంటి కారణాలు చెప్తారు. మరికొందరిలో పాఠాల ఒత్తిడి, స్కూలు భయంతో జ్వరం వస్తుంటుంది కూడా. అందుకే అలాంటి పిల్లలను ఎక్కువ సేపు ఆటపాటల్లో ఉంచుతున్నారు అనూరాధ. అంతకంటే ఎక్కువగా ఆమె ఒక విషయాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. డల్ స్టూడెంట్స్లో ఎవరు ఏ పాఠాన్ని బాగా నేర్చుకున్నారో గమనించారు. క్లాస్లో వాళ్లను ఆ పాఠాల్లోని ప్రశ్నలే అడిగేవారు. దాంతో ఆ పిల్లల్లో టీచర్ ప్రశ్నలకు తాము కూడా సమాధానం చెప్పగలమని ఆత్మవిశ్వాసం కలిగింది. క్రమంగా స్కూలంటే భయం తగ్గడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కూడా క్లాస్లోనే అనూరాధ క్లాస్లో పిల్లలంతా ఐదేళ్లలోపు వాళ్లే. ఆ వయసు పిల్లలు ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకోకుండా ఉండరు. పిల్లల గాయాలకు అనూరాధ స్వయంగా మందురాసి కట్టు కట్టడాన్ని చూసిన తోటి టీచర్లు... ‘టీచరైనా మీలో డాక్టర్ ఎక్కడికీ పోలేద’ని చమత్కరిస్తుంటారు. అప్పుడామె ‘‘డాక్టర్ వైద్యాన్ని వదిలేయవచ్చేమో కానీ వైద్యం డాక్టర్ని వదిలి వెళ్లదు. స్టెతస్కోపు పక్కన పెట్టి బ్లాక్బోర్డు పక్కన నిలబడగలిగాను, కానీ గాయాన్ని చూసినప్పుడు డాక్టర్ బయటకు వస్తుంది’’ అంటారు. అనూరాధ టీచర్ చేస్తున్న ప్రాక్టీస్ మంచి ఫలితాలనే సాధిస్తోంది. పిల్లలకు చదువు చెప్పడం రాకపోతే పిల్లలు పేషెంట్లవుతారు. చదువు చెప్పే విధానానికే వైద్యం చేస్తే పిల్లలు హాస్పిటల్ ముఖం చూడకుండా పెరుగుతారు. అనూరాధ అధ్యయనంలో తెలిసిన సంగతి ఏమిటంటే... పిల్లలు స్కూలంటే ముఖం చాటేస్తున్నారంటే, లోపం ఉన్నది పిల్లల్లో కాదు. ఆడుతూ పాడుతూ, ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా పాఠాన్ని చెప్పడం తెలియని విద్యావిధానానిదే లోపం. ఆ విధానంలో చదువు చెప్తున్న స్కూళ్లదే అసలైన లోపం. ఆ లోపాన్ని సరిదిద్దడానికి టీచర్లే పూనుకోవాలి. ఐక్యూ వేరైనా ఒకేలా చూడాలి పిల్లలతో గడపడం నాకిష్టం, అందుకే పీడియాట్రీషియన్ కోర్సు చదివాను. ఇన్నేళ్ల పాటు నా దగ్గరకు వచ్చిన పిల్లలు పేషెంట్లు. ఇప్పుడు నాకు రోజూ ఉదయాన్నే పిల్లలు పువ్వుల్లా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. చదువంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, క్లాస్ రూమ్లో పిల్లలందరినీ సమానం చేయగలగడం. నేనదే చేస్తున్నాను. నేను ఈ ఏడాది ఏప్రిల్లో టీచర్గా చేరాను. అప్పటి వరకు తరచూ స్కూలుకి ఆబ్సెంట్ అయిన పిల్లలెవరూ ఇప్పుడలా లేరు. స్కూల్ని ఇష్టపడుతున్నారు. – అనూరాధ – మంజీర -
విమల దేవోభవ
చదువు రావడం వేరు. బాగా రావడం వేరు. చదువు చెప్పడం వేరు, బాగా చెప్పడం వేరు. మంచి చదువు మంచి జీవితాన్ని ఇస్తుంది. అయితే అందరికీ మంచి చదువు అందుతుందా? అందేలా చేశారు విమలా కౌల్. తన చుట్టూ ఉన్న పేద పిల్లల కోసం స్వయంగా ఓ పాఠశాలే ప్రారంభించారు. విమలా కౌల్ పుట్టింది, పెరిగింది ఢిల్లీలో. ఆమె హిస్టరీలో పోస్ట్గ్రాడ్యుయేట్. ధన్బాద్లోని కార్మెల్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పనిచేశారు. రిటైర్మెంట్ తరువాత 1993లో ఢిల్లీకి మారిపోయింది వారి కుటుంబం. ఢిల్లీలోని సరితా విహార్లో ఉండేవారు. రోటరీ క్లబ్లో చురుగ్గా ఉండేవారు విమల, ఆమె భర్త. ఓసారి రోటరీ క్లబ్ సభ్యులు సరితా విహార్కు దగ్గరలో ఉన్న మదన్పూర్ ఖాదర్ గ్రామానికి వెళ్లి పిల్లలకు బిస్కెట్లు, ఇతర తినుబండారాలు పంచుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామంలోని ఓ పెద్దావిడ.. విమలాకౌల్ దగ్గరకు వచ్చి... ‘మీరు పిల్లలకు తినిపిస్తున్నారు మంచిదే, అలాగే వాళ్లకు తమ తిండి తాము సంపాదించుకునేదెలాగో నేర్పించండి’ అన్నది. ఆ పెద్దావిడ మాటలే తనలో ఆలోచనను రేకెత్తించాయంటారు విమలాకౌల్. ‘‘మేము ఏ పిల్లలకైతే తినుబండారాలిచ్చామో వారిని కూర్చోబెట్టి ఎవరు ఏయే క్లాస్లు చదువుతున్నారని అడిగితే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వాళ్లలో సరిగా బడికి పోతున్న వాళ్లు ఒక్కరూ లేరు. వెళ్తున్న వారిలో దాదాపుగా ఎవరికీ తప్పుల్లేకుండా ఒక వాక్యం రాయడం రాదు. ఇంగ్లిష్లోనే కాదు, సొంత భాష హిందీలో రాయడం కూడా రావడం లేదు. వాళ్లకు చదువు చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’’ అంటారు విమల. మన పాఠశాల విద్యావ్యవస్థ నాన్ డిటెన్షన్ సిస్టమ్లో నడుస్తున్నందు వల్ల చదువు వచ్చినా రాకపోయినా హాజరు ఉంటే చాలు వారిని పాస్ చేసి పై తరగతులకు పంపిస్తారు. అలా ఎనిమిది, తొమ్మిదో తరగతుల పిల్లలు కూడా వారి క్లాస్ టెక్ట్స్బుక్ నుంచి ఒక్క లెక్కనూ సరిగ్గా చేయలేకపోవడాన్ని గమనించిన విమలాకౌల్... వారికి ఇంగ్లిష్, గణితం, సోషల్ స్టడీస్, పర్యావరణ శాస్త్రం బోధిస్తున్నారు. ఇందుకోసమే ఒక స్కూల్కూడా ప్రారంభించారు. మొదట చౌపాలిలో ఐదుగురు పిల్లలతో మొదలైంది ఆమె స్కూల్ ‘గుల్దస్త’ గుల్దస్త అంటే పుష్పగుచ్ఛం అని అర్థం. విమలాకౌల్ కోరుకున్నట్లే ఆ స్కూల్లోని పిల్లలు ఆమె శిక్షణలో పూల రెక్కల్లా విచ్చుకున్నారు. మరింత మంది పిల్లలకు చేరువలోకి తేవాలనే ఉద్దేశంతో స్కూల్ని తాము నివసిస్తున్న సరితా విహార్లోకి మార్చారు. కొద్దిరోజుల్లోనే 150 మంది చేరారు. ఇంట్లోనే నడపవచ్చనుకున్న స్కూలుని కాలనీ బయటకు తీసుకెళ్లక తప్పని స్థితి వచ్చింది విమలాకౌల్కి. ఇంతమంది పిల్లల గోల భరించలేకపోతున్నామని ఆరోపించారు ఇరుగుపొరుగు వాళ్లు. ఒకావిడ అయితే ఏకంగా వాళ్ల ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. స్థానిక కమ్యూనిటీ సెంటర్లో పాఠాలు చెప్పాలంటే కమిటీ సభ్యులు ససేమిరా అన్నారు. ఇక చేసేదేమీ లేక కాలనీ పార్కులో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ కూడా అదే సమస్య. ఆ పరిసరాల్లోని ఇళ్లవాళ్ల నుంచి మళ్లీ అభ్యంతరాలు. అలా మూడు పార్కులు మారారు. చివరికి మున్సిపల్ పార్కులో దాదాపుగా పదేళ్లకు పైగా స్కూలు నడిచింది. ఎండలకు, ఢిల్లీ చలికి తగినట్లు ఆయా కాలాల్లో టైమింగ్స్ మారుస్తూ క్లాసులు నిర్వహించేవారు విమలా కౌల్. ఆమె శ్రమ చూసిన మదన్ మోహన్ మాలవ్యా మిషన్ ఎన్జీవో 2011లో స్కూలుని దత్తత తీసుకుంది. అప్పటి నుంచి స్కూలు నాలుగు గదుల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇన్ని కష్టాలు పడుతూ సాగినప్పటికీ ఆమె శిక్షణలో పిల్లలు చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. గుల్దస్తలో చదువుకున్న అరవై మంది విద్యార్థులు ప్రాథమిక విద్య తర్వాత మంచి స్టాండర్డ్ ఉన్న స్కూళ్లలో సీటు తెచ్చుకోగలిగారు. ఆ స్కూళ్లలో క్లాస్ టాపర్లుగా నిలుస్తున్నారు కూడా. తాను నాటిన మొక్క పేదరికం కారణంగా ఎవరి బాల్యమూ వసివాడిపోకూడదని, సరైన మార్గదర్శనం లేకపోవడం కారణంగా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకూడదనేది విమలాకౌల్ ఆకాంక్ష. స్కూలు ప్రారంభించిన తరవాత పదిహేనేళ్లకు అంటే... 2009లో విమలా కౌల్ భర్త హరిమోహన్ కౌల్ మరణించారు. (ఆయన బిట్స్పిలానిలో ఇంజనీరింగ్ చదివి, ఇండియన్స్కూల్ ఆఫ్ ధన్బాద్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైరయ్యారు. స్కూలు నిర్వహణలో విమలా కౌల్కి సహాయంగా ఉండేవారు). అయితే భర్త పోవడం వల్ల తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని కూడా పిల్లలతోనే భర్తీ చేసుకున్నారామె. అప్పటి నుంచి ఆమెలో కొత్త ఆలోచన మొదలైంది. ఎవరు ఉన్నా లేకపోయినా... తాను నాటిన గుల్దస్త మొక్క వాడిపోకూడదు.. అనుకున్నారు. అందుకోసం 2012లో ఎన్జీవో వసుంధరి సొసైటీ ఫర్ సోషల్ యాక్షన్ ప్రారంభించారు. ఇప్పుడు ఆ స్కూలు వసుంధరి– మదన్ మోహన్ మాలవ్యా సంస్థ సంయుక్తంగా నిర్వహణలో ఉంది. ఆత్మీయతే ఆదుకొంది విమలాకౌల్కి ఈ పాతికేళ్లలో స్కూలు నిర్వహణలో ఎదురైన సవాళ్లన్నీ ఒక ఎత్తయితే... 2000 సంవత్సరం మరీ గడ్డుకాలం. తాను వేతనం లేకుండా పని చేస్తుంది, కానీ ఇతర ఖర్చులు తప్పడం లేదు. విద్యార్థులు పెరిగే కొద్దీ టీచర్ల సంఖ్య పెరగక తప్పదు. వారికి వేతనాలివ్వాలి. తన దగ్గరున్న డబ్బు ఖర్చయిపోయింది. దాంతో స్కూలు మూసేయక తప్పదనే నిర్ణయానికి వచ్చారామె. ఇంకా సర్వీస్ చేయాలంటే తాను ఒక్కర్తెగా చెప్పదగినంత మందికి పాఠాలు నేర్పించడం ఒక్కటే తన ముందున్న మార్గం అనుకున్నారామె. స్కూలు మూసేస్తానని ప్రకటించారు కూడా. ఒక మంచి పనికి సమాజంలో ఆదరణ ఉంటుందని నిరూపణ అయిన సమయమది. ఆమె ఆ మాట అన్నారో లేదో వెంటనే... ఆమె స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ముందుకొచ్చారు. స్కూలు మూత పడకుండా విరాళాలతో ఆదుకున్నారు. ఆర్డర్ ఇవ్వకనే ఆహారం వచ్చింది గుల్దస్త్ విద్యార్థుల్లో ఒకమ్మాయి ఇప్పుడు అదే స్కూల్లో టీచర్గా చదువు చెప్తోంది. ఒక కుర్రాడు కంప్యూటర్స్లో డిగ్రీ చేసి అదే స్కూల్లో కంప్యూటర్ కోర్సు నేర్పిస్తున్నాడు. మరో కుర్రాడు మెకానిక్గా మంచి సంపాదనతో స్థిరపడ్డాడు. వీరందరికంటే విమలాకౌల్ను భావోద్వేగానికి గురి చేసిన ఓ స్టూడెంట్ ఉన్నాడు. అతడు చైనీస్ రెస్టారెంట్లో మేనేజర్గా పని చేస్తున్నాడు. ఓ రోజు ఆమె రెస్టారెంట్కెళ్లింది, ఆమె ఆర్డర్ చేసే లోపు ఆహారం వచ్చింది. ‘మా సార్ పంపించారు’ అని ఆమె ముందు పెట్టి వెళ్లిపోయాడు సర్వర్. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ భోజనం పూర్తి చేశారామె. బిల్లు అడిగినప్పుడు ‘మేడమ్ నేను కట్టేశాను’ అంటూ బయటికొచ్చాడో కుర్రాడు. వచ్చీ రాగానే ఆమె పాదాలను తాకి నమస్కరించాడు. అతడు ఒకప్పటి ఆమె స్టూడెంట్. ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకుంటూ.. ‘నేను రిటైరైన తర్వాత సమాజానికి ఏదైనా చేయాలని గ్రామాలు, మురికి వాడల్లో తిరుగుతున్నప్పుడు మదన్పూర్లోని ఒక పెద్దావిడ ‘వాళ్ల తిండి వాళ్లు సంపాదించుకునేటట్లు తయారు చెయ్యి’ అని నాకు చెప్పింది. ఆ మాటల స్ఫూర్తితోనే సరిగ్గా చదువురాని పిల్లలను చేరదీసి చదువు చెప్తున్నాను. నా దగ్గర అక్షరాలు దిద్ది, నీ తిండి నువ్వు సంపాదించుకోవడమే కాకుండా, చదువు చెప్పిన గురువుకి అన్నం పెట్టేటంత పెద్దవాడివయ్యావు’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారామె. తాను నాటిన మొక్క వృక్షమయ్యాక ఆ నీడన సేదదీరుతున్నంత ఆనందం ఆమె కళ్లలో అప్పుడు! వారి జీవితాలు గాడిన పడ్డాయి! ‘‘నేను చదువు చెప్తున్న పిల్లల అభ్యున్నతే నాకు గొప్ప రివార్డు. ఇక ఇతర అవార్డులెందుకు? నా పిల్లలు ఎందరో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లలో ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన పిల్లల్లో చాలామందిలో అసాధారణమైన తెలివితేటలుండేవి. వారికి సరైన మార్గదర్శనం చేస్తే జీవితాలు గాడిన పడతాయని నమ్మాను. వారంతా నేను కోరుకున్నట్లే వికసించారు. పేద పిల్లలకు చదువు చెప్పాలనుకున్న రోజు... ‘ఈ ప్రయత్నంలో ఒక్కరి జీవితమైనా బాగుపడితే నా జన్మ ధన్యమవుతుంద’నుకున్నాను. ఇన్నేళ్లలో ఎంతోమంది పిల్లలకు బాల్యాన్ని ఇవ్వగలిగాను. వారికి భవిష్యత్తు దారి చూపించగలుగుతున్నాను. అదే నాకు సంతోషం’’. – విమలాకౌల్, అవిశ్రాంత ఉపాధ్యాయురాలు వీళ్లందరూ నా పిల్లలే! విమలాకౌల్ వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులేవీ లేకుండా సాగిపోయింది. సమాజం కోసం జీవించాలని, సమాజానికి ఏదైనా చేయాలని మొదలు పెట్టిన ప్రయత్నంలో లెక్కకు మించిన ఆటంకాలు ఎదురయ్యాయి. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే ఆమె విజయరహస్యం. లోకసభ టీవీ, సిఎన్ఎన్ ఐబిఎన్, బీబీసీ చానెళ్లు ఆమె సేవలను పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అవార్డులు కూడా ఇచ్చాయి. ఆమెకు పిల్లల్లేని విషయాన్ని గుర్తు చేసినప్పుడు చిరునవ్వుతో ‘‘వీళ్లంతా నా పిల్లలే కదా’’ అంటారామె క్లాసులోని పిల్లలను చూపిస్తూ. ‘రోజంతా వీరి మధ్యనే సంతోషంగా గడుపుతాను. ఇక నాకు ఎవరూ లేరని ఎందుకనుకుంటారు’ అని తిరిగి ప్రశ్నిస్తారు. – వాకా మంజులారెడ్డి -
భావి భారత విధాతలు
సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగానే కాకుండా స్వపరిపాలనా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం!ఈ సందర్భంగా విజయవాడలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమొరియల్ స్కూల్లో పిల్లల్ని ‘సాక్షి’ కలిసింది! ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లలేక ఈ బంగారాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు! పేదరికం... ఒంటిమీదున్న బట్ట, కడుపులోని ఆకలితో కనబడుతుందేమో కానీ,ఈ పిల్లల కళ్లలో, మాటల్లో మాత్రం మహోన్నతమైన సంపద కనబడుతుంది. దేశానికి, సమాజానికి దిశను ఇవ్వగల నాయకుల్లా కనబడతారు. ఈ పిల్లల మాటలు విన్నాక ఇక వీసమెత్తు సంకోచం కూడా లేదు.. మన దేశ భవిష్యత్ నిజంగా బంగారమే! జైహింద్!! ‘‘అధ్యక్ష్యా..! మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం హామీలు చేశామో.. అన్నీ నెరవేర్చాం అధ్యక్ష్యా! రైతు రుణాలు మాఫీ చేశాం. ఉద్యోగాలు ఇచ్చాం.. అనుకున్న రీతిలో రాజధాని నిర్మాణం పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష్యా..! రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల క్షేమమూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, విద్య, ఉపాధి మీదే దృష్టి పెట్టాం. హోం శాఖ కూడా శాంతి భద్రతలను అద్భుతంగా పరిరక్షిస్తోంది. అన్ని శాఖలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి’’ అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుకుపోతుండగానే..ప్రతిపక్షనేత లేచి.. ‘‘ఏం అభివృద్ధి అధ్యక్ష్యా..! ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది అసలు నిజాలేంటో? రుణాలు మాఫీ కాక.. భారం పెరిగి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష్యా! ఇక.. భూములు ఇచ్చిన రైతులకు ఇంకో ఉపాధి అంటున్నారు.. అసలు సారవంతమైన ఆ నేలలను రాజధాని నిర్మాణం కోసమని కాంక్రీట్మయం చేస్తారా అధ్యక్ష్యా? ఎంత తప్పు! పర్యావరణానికి ఎంత హాని! అభివృద్ధి అంటే ఇదా అధ్యక్ష్యా?’’ అంటూ ముఖ్యమంత్రిని నిలదీశాడు. ‘‘అధ్యక్ష్యా..! ప్రతిపక్షనేతకు లెక్కలతో మా అభివృద్ధిని వివరిస్తాం’’ అంటూ ఆర్థిక మంత్రి ఇంకేదో చెప్పబోతుండగానే.. ప్రతిపక్షంలోని ఓ ఎమ్మేల్యే లేచి.. ‘‘లెక్కలు తెలియంది ఎవరికి అధ్యక్ష్యా! అన్నీ తెలుసు. అన్నీ చూస్తున్నాం..’’ అంటూ ఆర్థికమంత్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ‘‘ఆడవాళ్ల భద్రత కోసం ఇది చేశాం.. వాళ్ల రక్షణ కోసం అది చేశాం.. అంటూ ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రిగణమంతా ఊదరగొడ్తున్నారు అధ్యక్ష్యా! అంత చేస్తుంటే ఇన్ని నేరాలు ఎందుకు నమోదవుతున్నాయి అధ్యక్ష్యా..? మొన్నటికి మొన్న మా ఇంటి సందులోనే ఓ అమ్మాయి మీద దాడి జరిగింది. అంతకుముందు రాజధానిలోనే రెండు కేసులు నమోదయ్యాయి. ఇవి మన ముందు జరిగినవే.. మన వెనక, మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో? అధ్యక్ష్యా..! అధికార పార్టీ వాళ్లు చెప్తున్నదానికి.. బయట జరుగుతున్న దానికి ఏమన్నా పోలిక ఉందా అధ్యక్ష్యా?’’ అంటూ ఇంకో ఎమ్మెల్యే ప్రశ్నించాడు. ‘‘అవును అధ్యక్ష్యా..! ఒక్క భద్రత విషయమే కాదు ... మహిళల ఆరోగ్య విషయాన్నీ అటకెక్కించారు అధికార గణం వారు. రక్తహీనతతో బాధపడ్తున్న స్త్రీల విషయంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అమరావతి నిర్మాణంలో చాలా బిజీగా ఉన్న మన ప్రభుత్వాన్ని కాస్త వీలు చూసుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైపు ఒక్క అడుగు వేయమనండి అధ్యక్ష్యా..! వాటి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది’’ అని ఇంకో ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును వేలెత్తి చూపుతున్నంతలోనే మరో ఎమ్మెల్యే లేచి ‘‘అధ్యక్ష్యా..! మనకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అవుతోంది. అయినా ఏం అభివృద్ధి సాధించాం అధ్యక్ష్యా? ఫ్లై ఓవర్లు, షాపింగ్ కాంప్లెక్స్లా అధ్యక్ష్యా? 70 ఏళ్లకు పూర్వం బాల్య వివాహాల రద్దు కోసం పోట్లాడాం. అయినా రద్దు చేయగలిగామా? లేదు. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష్యా! ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. పదహారేళ్లు నిండకుండానే పిల్లల్ని కని రక్తహీనతకు లోనవుతున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు.దీనికి సంబంధించిన లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష్యా..! మేమూ ఇస్తాం’’ అని ఆయన పూర్తిచేసే లోపే మహిళా ఎమ్మెల్యే నిలబడి.. ‘‘అధ్యక్ష్యా..! బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాం అంటూ అధికార పార్టీ గట్టిగా చెప్తోంది. మన అసెంబ్లీ ముందున్న హోటల్కి వెళ్లి చూడండి.. ఎంత మంది పిల్లలు పనిచేస్తున్నారో? దీనికి మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది అధ్యక్ష్యా? ఎంతో మంది పిల్లలు బడి లేక పాచి పనులు చేసుకుంటూ బాల్యాన్ని ఈడుస్తున్నారు అధ్యక్ష్యా.. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడుంటుంది?’’ అని ప్రశ్నించింది. అధికార పక్షం తలవంచింది! గొడవలు, అరుచుకోవడాలు.. తిట్టుకోవడాలు లేకుండా ఇంత పద్ధతిగా.. హుందాగా ఎలా మారిందబ్బా మన అసెంబ్లీ అని ఆశ్చర్యం వేస్తోంది కదా! ఆవులించినంతలోనే ఆశ్చర్యం ఆవిరయ్యే మాట కూడా చదవండి.. అది నిజమైన అసెంబ్లీ కాదు.. మాక్ అసెంబ్లీ!విజయవాడ, సత్యనారాయణపురంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమోరియల్ హై స్కూల్.. తొమ్మిదో తరగతి ‘బి’ సెక్షన్ పిల్లలు నిర్వహించిన మోడల్ అసెంబ్లీ. అసలు ఇది ఎక్కడ.. ఎలా మొదలైందీ అంటే...సెప్టెంబర్ 5.. తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల దాకా సాగింది. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా.. స్వపరిపాలనా దినోత్సవంగా జరుపుతోంది ప్రభుత్వం. ఆ సందర్భంగా ఈ స్కూల్లోని పిల్లలను కలిసింది ‘సాక్షి ఫన్డే’. ‘‘మీరే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, ఆర్థిక మంత్రి, స్త్రీశిశు సంక్షేమ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ, ఎడ్యుకేషన్ మినిస్టర్... ఇలా పాలనా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే .. మీరేం చేస్తారు?’’ అని ప్రశ్నించాం క్లాస్ అందరినీ. నేటి పిల్లల్లో సామాజిక స్పృహ ఏదీ అని పెదవి విరిచే వాళ్లకు దీటైన సమాధానాలు ఇచ్చారు ఆ పిల్లలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా..‘‘నేను ప్రైమ్మినిస్టర్ అయితే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా. విడిపోతే ఏం బాగాలేదు. అందరం కలిసే ఉండాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోయిందనే కదా.. విడిపోయింది. ఇప్పుడు కలిసిపోయి పాత తప్పులు మళ్లీ జరగకుండా చూస్తా.. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. అంతా సమానంగా డెవలప్ అయ్యేలా చూస్తా’’ అన్నాడు యు. శశి కుమార్ అనే విద్యార్థి. రైతులకే ప్రత్యేకతలు అబ్దుల్ రహీమ్ అనే అబ్బాయి ‘‘నేను ప్రైమ్మినిస్టర్ అయితే రైతులందరూ క్షేమంగా.. హ్యాపీగా ఉండేలా చూస్తా. మనది వ్యవసాయ ఆధారిత దేశం. రైతలు లేనిదే మనం లేము. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తా. వాళ్లకే అన్ని ప్రత్యేకతలిస్తా’’అంటూ చెప్పాడు. షోయబ్ అఖ్తర్ అనే ఇంకో స్టూడెంట్ ‘‘నేను ముఖ్యమంత్రి అయితే కూడా రైతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. వ్యవసాయరంగం ఆధారంగానే అభివృద్ధికి ప్లాన్చేస్తా..’’ అని అంటున్న అతని వాగ్ధాటిని అడ్డుకోవాల్సి వచ్చింది ‘‘అంటే ఎలా?’’ అనే ప్రశ్నతో. ‘‘వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టాలి. ఎగ్జాంపుల్ పత్తి పండిస్తే.. కాటన్ పరిశ్రమ బాగా అభివృద్ధి అయ్యేలా చూస్తా. లోకల్గా ఉన్న వాళ్లకు ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తా. జ్యూట్, ఆయిల్ పరిశ్రమలు వంటివాటిని బాగా డెవలప్ చేస్తా. పర్యావరణాన్నీ కాపాడేలా చర్యలు తీసుకుంటా. అడవులు నరికేయకుండా చట్టాలను స్ట్రిక్ట్గా అమలు చేస్తా. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మొక్కలు నాటిస్తా’’ అని షోయబ్ చెప్పబోతుంటే నౌషీన్ అనే అమ్మాయి ‘‘అవును. నేను కూడా మినిస్టర్ అయితే బాగా మొక్కలు నాటిస్తా. వర్షాలు పడ్డానికి ఎలాంటి వాతావరణం ఉండాలో అలాంటి వాతావరణం నెలకొల్పేలా చూస్తా. సైంటిస్ట్లతో ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలు చేయిస్తా.. ఇప్పుడు కేరళకు వచ్చినటువంటి వరద ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ల సలహాలు తప్పకుండా వింటా’’ అని చెప్పుకొచ్చింది. క్యాస్ట్ లేకుండా చేస్తా.. ‘‘నేను ప్రధానమంత్రి అయితే.. దేశంలో కులం పోయేలా చేస్తా. చదువులో, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూస్తా. కులం వల్లనే మనకు ఇన్ని గొడవలు, ఇబ్బందులు. అవన్నీ పోవాలంటే కులం పోవాలి. డబ్బున్న వాళ్లు, లేని వాళ్లు సమానం కావాలి’’ అని చెప్పాడు జేవీఎస్ శ్రీకాంత్. అందరికీ చదువు.. ఆకతాయిలను పనిలో పెడతా‘‘నేను విమెన్ అండ్ చైల్డ్వెల్ఫేర్ మినిస్టర్ అవుతా. ఆడవాళ్ల సంక్షేమం కోసం పనిచేస్తా. ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే దేశం ఫ్యూచర్ బాగుంటుంది’’ అంది ఆవేశంగా వాణిశ్రీ అనే విద్యార్థిని. ఫణిభూషణ్ అనే అబ్బాయి ‘‘నేను హోం మినిస్టర్ అయితే.. ఆడపిల్లల మీద దాడులు జరగకుండా ఆపుతా. పనీపాట లేకుండా ఎవరూ రోడ్ల మీద తిరగకుండా చూస్తా. ఖాళీగా.. రోడ్ల మీద తిరుగుతూ.. అమ్మాయిలను ఏడిపిస్తూ ఎవరైనా కనపడితే ముందు వాళ్లను జైల్లో పెట్టకుండా పనిలో పెడతా. అయితే వాళ్లకు ఇన్ని గంటలే పని అని కాకుండా.. పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేయిస్తా. అట్లా వాళ్లకు పనిష్మెంట్ ఇస్తా. దాంతో వాళ్ల కాన్సన్ట్రేషన్ పనిమీదకే మళ్లుతుంది’’ అని చెప్పాడు. ట్రాఫిక్ కంట్రోల్చేస్తా.. బాల్య వివాహాలు ఆపుతా ‘‘నేను చీఫ్ మినిస్టర్.. కనీసం మినిస్టర్ అయినా సరే.. ముందు మన రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా. ప్రైవేట్ వాహనాలను రద్దు చేసి గవర్నమెంట్ వెహికిల్సే నడిచేలా చూస్తా. స్టూడెంట్స్తో ట్రాఫిక్ రూల్స్ మీద అందరికీ అవేర్నెస్ క్లాసెస్ ఇప్పిస్తా. అలాగే బాల్య వివాహాలు రద్దు చేస్తా. మా ఇంటి దగ్గర నా ఫ్రెండ్కి పదమూడేళ్లకే పెళ్లి చేశారు. ఒక యేడాది అయ్యేసరికి ఆ అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ పిల్ల ఇప్పుడు వాళ్లమ్మవాళ్లింటికి వచ్చేసింది. చదువు లేదు. ఏదో గుళ్లో పనిచేసుకుంటోంది. ఆ అమ్మాయి లైఫ్ అలా పాడైపోయింది. అది చూసైనా ఆమె పేరెంట్స్ మారాలి కదా! మారకపోగా.. ఇప్పుడు వాళ్ల చెల్లికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ల చెల్లి వయసు ఇప్పుడు పన్నెండేళ్లు. నేను, నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాళ్ల చెల్లికి చెప్పాం.. ‘‘పెళ్లిచేసుకోకు.. చదువుకో’’ అని. కాని వాళ్ల పేరెంట్స్ వినరని పెళ్లికి ఒప్పేసుకుంటోంది. అలాగే నా ఫ్రెండ్కీ చెప్పా.. ‘‘ఇప్పుడన్నా చదువుకో’’ అని. పని చేయకపోతే ఇంట్లో తిడతారు అని భయపడుతోంది. మా ఇంటి దగ్గరే నేను ఇలాంటి పరిస్థితులను చూస్తున్నానంటే దేశం మొత్తం మీద ఇంకా ఎన్ని ఉండొచ్చు? అందుకే ముందు ఆడపిల్లలందరికీ చదువు చెప్పిస్తా. బాల్యవివాహాలు రద్దు చేయిస్తా. దీనికోసం ఉన్న చట్టాలు స్ట్రిక్ట్గా అమలు అయ్యేలా చేస్తా’’ అని చెప్పింది వాణిశ్రీ. లంచం లేకుండా చేస్తా.. పేదలకు ఇల్లు కట్టిస్తా ‘‘నేను ఫైనాన్స్ మినిస్టర్ అవుతా. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా. మన దేశంలో ఇల్లు లేనివాళ్లు ఉండకూడదు. అందరికీ పని కూడా ఇప్పిస్తా. విజిలెన్స్ వాళ్లతో చెప్పి ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో చెక్చేయిస్తా. అవినీతి శాఖ వాళ్లు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండేలా చేస్తా. లంచం అనేదే లేకుండా చేస్తా. లంచం లేకుండా పోతే గవర్నమెంట్ పనులన్నీ కరెక్ట్గా టైమ్ వేస్ట్ కాకుండా జరుగుతాయి’’ హుషారుగా చెప్పాడు మదుసూధన్. ‘‘ఫైనాన్స్ మినిస్టర్కి ఇవన్నీ అధికారాలు ఉండవు తెల్సా? బడ్జెట్ ఒక్కటే నీ పని’’దుర్గా సత్యనారాయణ అనే అబ్బాయి అంటుంటే ‘‘తెలుసు.. కానీ అన్ని శాఖలతో ఫ్రెండ్షిప్ చేసి .. వాళ్ల హెల్ప్ తీసుకుంటా. వాళ్లకు నేను హెల్ప్ చేస్తా’’జవాబిచ్చాడు మధుసూదన్. లిక్కర్, సిగరేట్ బ్యాన్ చేస్తా.. ‘‘నేను ఎక్సైజ్ మినిస్టర్ అయి లిక్కర్, సిగరేట్, డ్రగ్స్ అన్నిటినీ బ్యాన్ చేస్తా. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఏ పనీ చేయడు. ఆంటీ, వాళ్ల పిల్లలు... నా కన్నా చిన్నవాళ్లు వాళ్లు.. పని చేసి డబ్బులు తెస్తారు. గొడవపడి ఆ డబ్బులు లాక్కెళ్లి మళ్లీ తాగుతుంటాడు ఆ అంకుల్. అందుకే వాటన్నిటినీ బ్యాన్ చేస్తా’’ అని కృపాప్రసాద్ అంటున్న మాటలకు పొడిగింపుగా లక్ష్మీపావని మాట్లాడుతూ ‘‘అవును.. వాటిని బ్యాన్ చేయాలి. గుట్కాను కూడా బ్యాన్చేయాలి. ఆరోగ్యానికి హానికరం అని వాటిమీదే ప్రింట్ చేసి మళ్లీ వాటినే అమ్ముతారెందుకు? అంటే ప్రజల హెల్త్ పాడైపోవాలనా? ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే పాలించే ప్రభుత్వం మనది అని పుస్తకాల్లో చెప్తారు. అదే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పాడయ్యే వస్తువులను అమ్ముతోంది ఎందుకు? బ్యాన్ చేయాలి కదా?’’ అంది. ‘‘వాటి మీద వచ్చే ఇన్కమ్తో వెల్ఫేర్ ప్లాన్స్ చేస్తుందట గవర్నమెంట్. అందుకే వాటిని బ్యాన్ చేయరట. కృపాప్రసాద్ నువ్వు ప్రైమ్మినిస్టర్ అయినా వాటిని బ్యాన్ చేయడానికి లేదు’’ చెప్పింది మహాలక్ష్మి. ‘‘ఎందుకు? అప్పుడు టాక్సెస్ బాగా పెంచాలి’’ సలహా ఇచ్చింది గ్రేస్ మేరీ. ‘‘ధరలు పెరిగితే మామూలు వాళ్లకు కూడా ప్రాబ్లమ్స్ తెల్సా?’’ మళ్లీ మహాలక్ష్మి. ‘‘అయితే నేను బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తా. దాంతో పేదవాళ్లకు చాలా చేయొచ్చు కదా లిక్కర్, సిగరేట్లు లేకుండానే’’ వెలుగుతున్న మొహంతో కృపాప్రసాద్. అమ్మాయిలు గోల్డ్మెడల్స్ కొట్టేలా.. ‘‘నేను కబడ్డీ ప్లేయర్ని. నేషనల్స్ ఆడాను. నేను చీఫ్ మినిస్టర్ అయితే.. అమ్మాయిలు స్పోర్ట్స్ బాగా ఆడేలా చూస్తా. వాళ్లు గోల్డ్ మెడల్స్ కొట్టేలా చేస్తా. పేద ఆడపిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తా. కేవలం అమ్మాయిలకే కాదు.. పేదవాళ్లందరూ ఆటల్లో ఫస్ట్ ఉండేలా చేస్తా. స్పోర్ట్స్ కోటాలో వాళ్లందరికీ జాబ్స్ కూడా ఇప్పిస్తా’’ అంది లహరి. స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేస్తా.. ‘‘నేను వెల్ఫేర్ మినిస్టర్ అయితే పిల్లలు చూడని తల్లిదండ్రులందరి కోసం ఓల్డేజ్ హోమ్స్ కట్టిస్తా. ముందు వాళ్లను అందులో ఉంచాక.. వాళ్ల పిల్లను పిలిచి కౌన్సెలింగ్ ఇప్పిస్తా. ఆర్ఫనేజెస్ కూడా కట్టిస్తా’’ అని చెప్పాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను ఏ మినిస్టర్ అయినా ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేయిస్తా. వాటిల్లో వచ్చే బ్లూవేల్ వంటి పిచ్చి గేమ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయిపోయి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలంతా చదువుకునేలా చూస్తా. జాబ్స్లో వాళ్లకు రిజర్వేషన్స్ ఇప్పిస్తా’’ చెప్పింది ఆర్తీ. పావని అనే అమ్మాయి కంటిన్యూ చేస్తూ ‘‘అవును నేను కూడా చీఫ్ మినిస్టర్ అయినా, న్యాయశాఖ మంత్రి అయినా ఆడవాళ్లకు, పేదలకు న్యాయం జరిగేలా చూస్తా. అమ్మాయిలందరూ చదువుకునేలా చేస్తా’’ అని చెప్పింది. ప్రాజెక్ట్లు.. పక్కా ఇళ్లు కట్టిస్తా.. ‘‘నేను ఇరిగేషన్ మినిస్టర్ అయితే.. ముందు ప్రాజెక్ట్లు కట్టిస్తా. వాటర్ వేస్ట్ కాకుండా చూస్తా. ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయితే.. మన దగ్గర ఇళ్లు లేనివాళ్లందరికీ ఇళ్లు కట్టిస్తా. అసలు ఇల్లు లేనివాళ్లు లేకుండా చూస్తా. ఇంకా ఆడపిల్లలు సేఫ్గా ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రతి ఒక్కరు చదువుకునేలా చేస్తా. అమ్మాయిలు, అబ్బాయిలు ఈక్వల్గా ఉండేలా చట్టాలు తెస్తాను. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్స్ ఇప్పిస్తా. నాకు ఒక అక్కయ్య ఉంది. మా పేరెంట్స్కు కూడా చెప్తుంటా..‘‘ నేను, అక్క ఈక్వల్’’ అని. ఇంట్లో పనులకు మా అక్కతో పాటు నేనూ అమ్మకు హెల్ప్ చేస్తుంటా. అట్లాగే దేశంలో అబ్బాయిలందరూ ఇలాగే ఉండేలా చూస్తా’’ అంటాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను కూడా మా ఇంట్లో మా అమ్మకు, చెల్లికి హెల్ప్ చేస్తా. కూరలు తరుగుతాను, గిన్నెలు కడుగుతాను.. అన్ని పనులు చేస్తా’’చెప్పాడు అనిల్.‘‘నేను అగ్రికల్చర్ మినిస్టర్ అవుతా. రైతులందరికీ భూమి ఇస్తా. రుణమాఫీలు చేస్తా. పంటలు పండే నేలను పంటలకే ఉపయోగించేలా చేస్తా. అక్కడ ఫ్యాక్టరీలు.. బిల్డింగ్స్ కట్టకుండా బ్యాన్ చేస్తా’’ కంటిన్యూ చేశాడు అనిల్. మనకు మనమే ఆహార కొరత సృష్టించుకున్నట్టు.. ‘‘అనిల్ చెప్పినట్టు.. పంటలు పండే నేలను పంటలకే ఉంచాలి. దాంట్లో బిల్డింగ్స్ కట్టడం వల్ల ఆ నేలలో పండే పంటనంతా నష్టపోయినట్టే కదా మనం? అలా ఆహార కొరతను మనకు మనమే సృష్టించుకుంటున్నట్టు కదా! దీనివల్ల రైతులకే కాదు మనకూ నష్టమే. అందుకే పంటలు పండే నేలను పంటలకే కేటాయించేలా చూడాలి. నేను చీఫ్ మినిస్టర్ అయితే.. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలనూ డెవలప్చేస్తా. ఏ ఊరికి ఏ ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకత ఇంకా పెరిగేలా చూస్తా. నీటి వసతి అంతగాలేని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టిస్తా. దీనివల్ల అక్కడి ప్రాంతంలోని వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి.పంటనేలా కాలుష్యం కాదు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఏరియా అంతా మొక్కలు నాటించి చిన్నసైజు అడవుల్లా పెంచుతా. దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే వాతావరణ కాలుష్యమూ అంత హానిగా మారదు’’ చెప్పింది హిమబిందు. గవర్నమెంట్ స్కూల్స్.. హాస్పిటల్స్.. ‘‘నేనూ అంతే. చీఫ్ మినిస్టర్ అయితే.. గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ బాగా నడిచేలా చూసుకుంటా. ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ చాలా కాస్టీ›్ల. అందుకే గవర్నమెంట్ వాటినే బాగా నడిపిస్తా. ధరలు పెరగకుండా చూసుకుంటా. డబ్బున్న వాళ్లు కరెక్ట్గా టాక్స్లు కట్టేలా చర్యలు తీసుకుంటా’’ తన అభిప్రాయాన్ని చెప్పింది అనిత. వరకట్నం తీసుకునే వాళ్లను.. ‘‘నేను చీఫ్ మినిస్టర్ అయితే.. ముందు వరకట్నం తీసుకునేవాళ్లను జైల్లో పెడ్తా. బయటకు రాకుండా చూస్తా. అలాగే యాసిడ్ అటాక్స్ చేసేవాళ్లను కూడా జైల్లో పెడ్తా. అమ్మాయిలను ఏడిపించడం ఎంత తప్పో.. స్కూల్లోనే లెసన్స్ చెప్పిస్తా. అమ్మాయిలు బాగా చదువుకునేలా.. వాళ్లను వాళ్లు రక్షించుకునేలా అందరికీ స్కూళ్లల్లో కరాటే క్లాసెస్ ఇప్పిస్తా’’ మనసులో మాట చెప్పాడు నర్సింహ. వీళ్ల అభిప్రాయాలు అన్నీ విన్న తర్వాత.. అసలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎలా నడుస్తుందో తెలుసా అని అడగాలనిపించి.. అడిగాం. ‘‘తెలుసు.. టీవీల్లో చూస్తాం. కాని చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు అసహ్యంగా’’ అని ముక్త కంఠంతో జవాబిచ్చారు అంతా. మరి ఎలా ఉండాలో మీరు చూపిస్తారా? అని అంటే.. అదిగో పైన ఇంట్రడక్షన్లో ఇచ్చాం కదా.. అలా ప్రశాంతంగా అసెంబ్లీని నడిపించి చూపించారు. పిల్ల మాటలు.. పిల్ల చేష్టలు అని కొట్టిపారేయొద్దు. ఈ పిల్లలకు పెద్దల కన్నా గొప్ప పరిశీలన ఉందని.. సమాజాన్ని గమనిస్తూ ఉన్నారని వాళ్ల అభిప్రాయాలతో చెప్పారు! వాళ్ల అభిప్రాయాలకు విలువనిద్దాం. ప్రభుత్వాలు, మనం.. విస్మరించిన చాలా విషయాలను, వివరాలను చక్కగా... సూటిగా.. గుండెకు తగిలేలా చెప్పారు. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని, కూడు, గుడ్డ, నీడ.. ఇంకా అందని ఫలాలేని, మహిళలను గౌరవించాలని, మద్యాన్ని పారించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పథకాలను రూపొందించొద్దని.. బాలలందరికీ బడికి వెళ్లే హక్కుందని.. పర్యావరణ హితాన్ని మరచిపోవద్దనే సత్యాలనూ బోధించారు. పచ్చి గోడ మీద అచ్చులా పడ్డ ఆ బాలవాక్కుని మెదళ్లలో నిక్షిప్తం చేసుకుందాం. కార్యాచరణగా చూపిద్దాం!ఈ భవిష్యత్ పరిపాలనా దక్షులకు వాళ్ల భవిష్యత్ తరాల కోసం ఇంకేవైనా కొత్త పనులు చేసే అవకాశం ఇద్దాం! చర్విత చర్వణాలను ఇప్పటికైనా చరమగీతం పాడదాం! స్వయం పాలనలో ఈ భావి భారత విధాతలు నేర్పుతున్న పాఠం ఇదే! – సరస్వతి రమ -
చెర్రీ పాఠాలు చెబుతున్నాడట..!
-
చెర్రీ పాఠాలు చెబుతున్నాడట..!
రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఉపాసనకు కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అపోలో బాధ్యతలతో పాటే మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను తీసుకున్న ఉపాసన సోషల్ మీడియాలో మెగా అభిమానుల కోసం ఇంట్రస్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మిస్టర్ సి( ఉపాసన చరణ్ ను మిస్టర్ సి అని పిలుస్తుంటుంది) వీడియో ఒకటి పోస్ట్ చేశారు. రామ్ చరణ్ నడిచి వస్తుండగా అతని వెంట నాలుగు కుక్కపిల్లలు వస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన ఉపాసన.. 'మిస్టర్ సి ఆరోగ్యకరమైన జీవితానికి గోల్స్ ఉండాలని చెబుతున్నారు. బద్ధకం అనేది ఓ జీవితంలో ఓ జబ్బు లాంటింది. కాబట్టి ఇక కదలండి' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ తో పాటు సై రా నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చరణ్. MrC teaching us goals fr a healthy life #walkandtalk bng lethargic isnt good. get moving! #ramcharan #sittingisthenewsmoking #teachersday pic.twitter.com/YKjyjcdNSI — Upasana Kamineni (@upasanakonidela) 5 September 2017 -
అవార్డులు అందుకున్న ఉత్తమ అధ్యాపకులు
ఎస్కేయూ/ జేఎన్టీయూ: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన జేఎన్టీయూ ప్రొఫెసర్ ఈ. కేశవరెడ్డి (మేథమేటిక్స్), ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ (మెకానికల్ విభాగం), ఎస్కేయూ ప్రొఫెసర్ దేశాయి సరళాకుమారి (బయో కెమిస్ట్రీ), ప్రొఫెసర్ కే.రాఘవేంద్రరావు ( ఫిజిక్స్)లు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డులు అందజేశారు. -
గురువులు నవ సమాజ నిర్మాతలు
ఉపాధ్యాయ దినోత్సవంలో వక్తలు ఉత్తమ గురువులకు అవార్డుల ప్రదానం అనంతపురం సిటీ: ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్లు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘గురు పూజోత్సవం’ నిర్వహించారు. డీఈఓ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం జరుగుతుందన్నారు. ఓ ఉపాధ్యాయుడు మార్గనిర్దేశం లేకుండా ఏ విద్యార్థీ రాణించలేరన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు ఉన్నత విద్య అందించాలన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన్ని పరిచయం చేస్తూ యువతను టెక్నికల్ కోర్సుల వైపు మళ్లించగలిగితే అనంత కరువు సీమలో సిరులు కురిపించే వారు తయారవుతారన్నారు. ప్రధానంగా 10వ తరగతి ఉత్తీర్ణత విషయంలో ప్రతి ఉపాధ్యాయుడు వంద శాతం విజయం సాధించేలా చూడాలన్నారు. 2018 పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10కి 10 పాయింట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఈసారి కూడా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమానికి ముందు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. ఉత్తమ గురువులకు అవార్డుల ప్రదానం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 56 మందిని అధికారులు ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిలు వారికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో రాయల సీమ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ప్రతాప్రెడ్డి, ఎస్ఎస్ఏ పీఓ సుబ్రమణ్యం, ట్రైనీ కలెక్టర్ వెంకటేశం, అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామినేషన్) గోవిందు నాయక్, ధర్మవరం, అనంతపురం డిప్యూటీ డీఈఓలు ఉమామహేశ్వర్, మల్లికార్జున, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఆయన: నటి
ముంబయి: నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు, ఎన్నో విషయాలు నేర్పించిన గురువులను స్మరించుకుంటూ గౌరవించుకుంటాం. మన నిత్య జీవితంలో గురువుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నది అక్షరసత్యం. బాలీవుడ్ నటి కాజోల్ మాత్రం టీచర్స్డే ను భిన్నంగా జరుపుకున్నారు. గణనాథుడికి టీచర్స్డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్ ఆయనే అంటూ గణనాథునితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. విగ్రహం వద్ద చిరునువ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నటించిన భజరంగీ బాయ్జాన్ లోని సెల్ఫీ లే లే పాటను తన సెల్ఫీ క్యాప్షన్లో కాజోల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే గొప్ప గురువు వినాయకుడంటూ గణేష్ నిమజ్జనం రోజున నటి చేసిన సోషల్ మీడియా పోస్టుపై విపరీతమైన స్పందన వస్తోంది. మన జీవితాంతం గురువు ఎవరైనా ఉన్నారంటే గణనాథుడేనంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు గణేషుడితో నేచురల్ బ్యూటీ, వెరీ నైస్ స్మైల్ అంటూ స్పందిస్తున్నారు. -
ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం
హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల జీవితంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమైందని, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో టీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని సీఎం అన్నారు. -
మార్కెట్లో టీచర్స్ డే ఎఫెక్ట్..!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లలో టీచర్స్ డే ఉత్సాహం నెలకొంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎడ్యుకేషన్ రంగ షేర్లు లైమ్ లైట్లోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా లాభాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్వీ డెనిం అండ్ ఎక్స్పోర్ట్ షేర్లు 5 శాతం కరీర్ పాయింట్ 4 శాతం, ఎంటీఎడ్యుకేర్ 3.69 శాతం, లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు యూరోప్, ఆసియన్ మార్కెట్లు నష్టపోతున్నప్పటికీ దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నాటి భారీ నష్టాలనుంచి ఇవాళ రీ బౌండ్ అయ్యాయి. బ్యాంకింగ్, మీడియా రంగ షేర్ల లాభాల మద్దుతుతో సెన్సెక్స్ ఒక దశలో 100 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకంగా భావించే 9900కి పైన స్థిరంగా కొనసాగుతోంది. -
తెలుగు రాష్ట్రాల టీచర్లకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల టీచర్ లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఉపాధ్యాయులు అందించే సేవలను ఆయన కొనియాడారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయక పాత్రను పోషిస్తారని అన్నారు. వారి సేవలు మరువరానివంటూ వ్యాఖ్యానించారు. -
గురుపరంపరకు వందనం
ఆలోచనం కులము, మతము, జెండర్ ఘర్షణలు జోరుగా రగులుతున్న కాలంలోనే నా గురువులు నాకు కులమత దేశాలకతీతంగా మనిషిని చూడటం నేర్పారు. నేనివాళ గ్లోబల్ సిటిజన్ని అని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన ఈ రోజును భారతదేశం 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవి స్తోంది. ఎంఎన్ రాయ్ మాటల్లో చెప్పాలంటే భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.నా వరకు నాకు అద్భుతమైన గురువుల సాహచర్యం లభించింది. గ్రాడ్యుయేషన్లో ఉన్నపుడు నాకు లెక్చరర్ శోభాదేవిగారు పరిచయమయ్యారు. దొరికిన ప్రతి కాగి తాన్ని చదివేసే నా కాంక్షను ఆమె ఒక దారిలో పెట్టారు. అన్ని అస్తిత్వ చైతన్యాలను నాతో నిశితంగా అధ్యయనం చేయించారు. నేను రాయాలి అనుకున్నపుడు మేడం, ఆమె సహచరుడు సాయి గారు నాకు ఏయే పుస్తకంలో ఏమేం చదవాలో గుర్తు పెట్టి అనేక పుస్తకాలను ఇచ్చి చదివించారు. యూనివర్సిటీకి వచ్చాక నాకు కేకేఆర్ (కేకే రంగనాథాచార్యులు) సర్ పరిచయమయ్యారు. విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఈ మార్క్సిస్టు విమర్శకుని మార్గదర్శకత్వం నేను పయనించే మార్గాన్ని అప్పటినుంచీ ఇప్పటివరకూ జ్ఞాన కాంతులతో నింపుతూ వస్తోంది. నా ఎంఫిల్ పరిశోధనకు గైడ్గా వ్యవహరించి పరిశోధన ఎలా చేయాలో నేర్పించిన గురువు ఆయన. ఎదుటి మనిషిని మాట్లాడనిచ్చే, గౌరవించే సంస్కారాన్ని నేను తననుంచి నేర్చుకున్నాను. ఇంకో గురువు ఎంవీ (ముదిగొండ వీరభద్రయ్య) గారు నాకే కాదు కేసీఆర్ గారికి కూడా గురువు. పాఠం మొదలుపెడితే ప్రపంచాన్ని చూసొచ్చేవాళ్ళం. ఇప్పటికీ ప్రతి వారం నా కాలమ్ చదివి ‘అమ్మాయ్! ఇదిగో ఇక్కడ ఇలా ఉండాలి, ముగింపు ఇలా ఉండాలి’ అని మార్గనిర్దేశం చేస్తారు. పీహెచ్డీకి వచ్చాక నా గురువు పిల్లలమర్రి రాములు గారు. మాతృత్వం కాలాపహరణం చేస్తున్నపుడు మంచి స్నేహితుడిలా నా వెంట నిలిచి నా పీహెచ్డీ పూర్తి చేయించారు. కులం, మతం, జెండర్ ఘర్షణలు జోరుగా రగులుతున్న కాలమిది. ఈ కాలంలోనే నాకు లభించిన ఈ గురువులలో ఒక్కరు కూడా నా కులం వారు కాదు. సగం మంది ఆధిపత్య బ్రాహ్మణ కులాలవారు అయినా వారు నాకు తమది గురువుల కులం అని మాత్రమే సందేశం ఇచ్చారు. ఆ కులానికి విద్యార్ధి సంక్షేమంతో తప్ప ఇతరత్రా అంశాలతో సంబంధం లేదని చెప్పారు. నా గురువులు నాకు కులమత దేశాలకతీతంగా మనిషిని చూడటం నేర్పారు. అయితే అందరు గురువులూ నా గురువులంత ఉదాత్తంగానే ఉన్నారా? లేరని ‘భీమాయణం’ పుస్తక ప్రచురణకర్త ఎస్. ఆనంద్ అంటారు. తమ ప్రొఫెసర్ కులవాది అని తెలుసుకోవడానికి బ్రాహ్మణేతరురాలయిన తన స్నేహితురాలు, తాను పేపర్లు మార్చుకుని అసైన్మెంట్ ఇచ్చినపుడు తనకెప్పుడూ ఎక్కువ మార్కులిచ్చే ప్రొఫెసర్ వేరే పేరుతో సబ్మిట్ చేసిన తన పేపర్కు తక్కువ మార్కులిచ్చాడని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో గురువులు ప్రతిభను కులం వారీగా కూడా కొలుస్తారని చెప్పడానికి ఇది ఒక బ్రాహ్మణుడు చెప్పిన తార్కాణం. మన దేశంలో భర్తీ అయిన విద్యార్థుల్లో 50% మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వారు తన విజన్ మిషన్ డాక్యుమెంట్ లోని సెక్టార్ పేపర్ ఆన్ ఎడ్యుకేషన్లో ‘‘ప్రజాసముదాయానికి నాణ్యమైన విద్య అందిస్తే వారు ‘తక్కువ ఆదాయం ఉచ్చు’ నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు’’ అని రాసుకున్నారు. మన రాష్ట్రంలో 2016–17లో ప్రాథమిక విద్యలో 12.77% డ్రాప్అవుట్ ఉంటే సెకండరీ ఎడ్యుకేషన్లో 20.67% ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం వద్ద కండిషనల్ కాష్ ట్రాన్స్ఫర్స్లాంటి నిర్దిష్ట కార్యాచరణ ఏమీ లేకపోవటం విచారకరం. మీరు ఈ క్లాస్ వరకు మీ పిల్లల్ని స్కూల్కి పంపితే మీకింత డబ్బును ఇస్తాం అంటూ బతకడానికి తమకు తామే పెట్టుబడి అయిన పేద వర్గాల వారికి భరోసా ఇవ్వడం నేడు మన రాష్ట్రంలో అత్యవసరం. ఈ అవసరాన్ని ప్రతిపక్ష నాయకుడు తన నవరత్న పథకాలలో ఒకటిగా ‘అమ్మ ఒడి’ అని ప్రకటించడం ఆశావహమైన వాగ్దానంగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నేత ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు మెస్ బిల్ కోసం కూడా అదనంగా డబ్బు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం విద్యార్ధి భవిష్యత్తుకి భరోసా అనొచ్చు. అదే కాదు కంప్యూటర్ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్న బాబుగారి పాలనలో కంప్యూటర్ వున్న క్లాస్ రూంల శాతం 28.6% మాత్రమే. అదే మహారాష్ట్రలో 55.7% కేరళలో 93.77%. ప్రథమ్ సంస్థ వారి వార్షిక విద్యా నివేదిక (్చట్ఛట) ప్రకారం 2016లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ 2వ తరగతి పాఠాన్ని చదవగలిగిన విద్యార్థులు 52 శాతం మాత్రమే. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన ప్రభుత్వ పాఠశాలల్లో 99.97 శాతం ఉపాధ్యాయులు అన్ని అర్హతలూ కలిగి ఉన్నారు. 2030లోగా ప్రపంచ దేశాలు సాధించాల్సిన మానవ అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన.. ‘నిలకడ కలిగిన అభివృద్ధి లక్ష్యాల’లో విద్యకి సంబంధించినది 4వ నంబర్ గోల్. దీని ప్రకారం అందరికీ సమంగా నాణ్యమైన విద్యని అందించడంతోపాటు జీవితాంతం విద్యని అభ్యసించే అవకాశాలని పెంపొందించాలి. చిత్తశుద్ధి ఉన్న ఉపాధ్యాయులు ఈ అడ్డంకులన్నీ అధిగమించగలరు. అందుకు మన పూర్వ గురుపరంపరే తార్కాణం. (నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
నమస్కారం... గురువుగారూ!
నేడు గురుపూజోత్సవం ►ఆ కుగ్రామంలో ప్రతి ఇంటా ఓ ఉపాధ్యాయుడు ►తొలి ఉపాధ్యాయునిగా పద్మనాభుడు ►ఉపాధ్యాయ వృత్తితో గురువుపాలెంగా ప్రసిద్ధి పొందిన గరువుపాలెం గ్రామం ►చుట్టుపక్కల గ్రామాల యువతకు ఆదర్శంగా మారిన గరువుపాలెం మాస్టారు నమస్కారం... అంటూ ఆ గ్రామంలో నిత్యం వినిపించే గౌరవ పలకరింపులు ఆ కుగ్రామాన్ని గురువులపాలెంగా సంబోధించుకునే స్థాయికి చేర్చింది. గుంటూరు జిల్లాలోని తీరప్రాంతమైన నిజాంపట్నం మండలం గరువుపాలెం పంచాయతీ పరిధిలోని గరువుపాలెం గ్రామంలో సుమారు 180 ఇళ్లల్లో ఇప్పటి వరకు 100 మందికిపైగా ఉపాధ్యాయ వృత్తిలో పునీతులవుతున్నారు. బతకలేక బడిపంతులు అన్న రోజుల నుంచి అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి పదిలం అన్న ఈ రోజుల వరకు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఒక్కొక్క కుటుంబంలో తండ్రి, ఆ తరువాత కొడుకులు, మనుమలు ఉపాధ్యాయ వృత్తిలో రోజులు హుందాగా, నిశ్చింతగా వెళ్లదీస్తున్నారు. ఆగ్రామంలో ఇంటికి ఒకరైనా ఉపాధ్యాయునిగా అవాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పుట్టిన ఆడబిడ్డలు, గ్రామానికి కోడళ్లుగా వచ్చిన వారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అలాగని గ్రామంలో ఉపాధ్యాయులు తప్ప మరెవ్వరూ లేరేమో అనుకుంటే పొరపాటే! ఉపాధ్యాయులతోపాటు పోలీసు శాఖ, రక్షణ శాఖనుంచి ఇంజనీరింగ్, పలు విభాగాల వరకు విధులు నిర్వహిస్తున్నవారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్న వారు ఉండటం ఆగ్రామంలో ఉపాధ్యాయ వృత్తి వేసిన బాటలనే చెప్పాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా మారి పలు గ్రామాల్లోని యువతను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయాన్నీ వదులుకోలేదు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న గ్రామంలో వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా ఉన్నా వ్యవసాయం, దానికి అనుబంధంగా పాడి, పరిశ్రమలను వదులుకోలేదు. వాటిని అభివృద్ధి చేసుకోవటంలో ఆ గ్రామంలోని మహిళల పాత్ర కనిపిస్తుంది. ఉపాధ్యాయులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పనిచేయటంతో గ్రామంలో వ్యవసాయం, పాడిపరిశ్రమలను అభివృద్ధిపథంలో నడిపించారు. దీంతోపాటు ప్రతి ఇంటిలోని యువత ఏదో ఒక ఉద్యోగంలో చేరేవరకు చదువుతో పాటు వ్యవసాయం, పాడిపరిశ్రమలలో కష్టపడేతత్వంతో ముందుకు సాగుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటా ఉద్యోగులు ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువమంది కొనసాగుతుండటంతో గ్రామంలో అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ ఉద్యోగమో, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగే తత్వం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగం రాని పక్షంలో ఏదైనా ప్రయివేటు ఉద్యోగం అయినా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. – గడ్డం వాసు, సాక్షి, రేపల్లె, గుంటూరు జిల్లా ఉపాధ్యాయ వృత్తిలో పద్మనాభుని అడుగులు అనంతం చేశాయి. వ్యవసాయ ప్రధాన వృత్తిగా కొనసాగుతూ అక్షరాస్యత నామమాత్రంగా ఉన్న రోజుల్లో కష్టపడి చదువుకుని 1930 ప్రాంతంలో గరువుపాలెం గ్రామం నుంచి ఉపాధ్యాయ వృతిలోకి బండారు పధ్మనాభుడు అడుగుపెట్టారు. చిన్న గ్రామం నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన పద్మనాభుడు ఆ వృత్తికే వన్నె తెస్తూ ఆ గ్రామస్తుల్లో ఉపాధ్యాయ వృత్తిపట్ల మక్కువను పెంపొందించారు. ఆయన తరువాత ఒక్కొక్కరిగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. తీరప్రాంతంలోని ఓ కుగ్రామాన్ని గురువులపాలెం గ్రామంగా ప్రజల్లోకి తీసువెళ్లిన పధ్మనాభుడు 1984 ఏప్రిల్ 22న మృతి చెందారు. సంతృప్తినిచ్చింది 1957లో వినయాశ్రమంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి బొడ్డువారిపాలెంలోని ఎస్పీఎస్ ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయునిగా అదే సంవత్సరం బాధ్యతలలో అడుగుపెట్టాను. గరువుపాలెం ఎలిమెంటరీ స్కూల్లో 1993లో రిటైర్ అయ్యాను. దీంతో పాటు ఆనందపురంలో మేనేజ్మెంట్ పాఠశాల ప్రారంభించాను. నా ముగ్గురు కుమారుల్లో ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లగా ఒకరు పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు. 36 ఏళ్లపాటు సాగిన ఉపాధ్యాయ వృత్తి జీవితానికి ఎంతో సంతృప్తి నిచ్చింది. మా గ్రామాన్ని గరువుపాలెం అనగానే గరువుపాలెం కాదు గురువులపాలెం అంటూ పెద్దపెద్ద వారు సంబోధించటం ఆనందంగా ఉంటుంది. – గాదె వెంకట రామారావు రిటైర్డ్ ఉపాధ్యాయుడు, గరువుపాలెం జీతం తక్కువైనా... ఉపాధ్యాయునిగా 1948–1986 వరకు 38 సంవత్సరాలు సేవచేశా. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.19 జీతంతో జీవితం ప్రారంభించాను.జీతం తక్కువైనా సమాజంలో గౌరవంతో పాటు ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చే అవకాశం వచ్చింది. నా ముగ్గురు కుమారుల్లో ఇద్దరు ఉపాధ్యాయులే. రిటైర్ అయిన తరువాత గ్రామానికి సర్పంచ్గా, మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని 90 ఏళ్ల వయస్సులో ఎంతో ఆనందంగా చెప్పారు. – బొప్పారాధాకృష్ణమూర్తి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు, గరువుపాలెం, నిజాంపట్నం మండలం అదృష్టంగా భావిస్తున్నాను! గుంటూరులో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 1948లో ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాను. ఆనందపురంతో ప్రారంభించి బొడ్డువారిపాలెం, గురజాల, గాజులవారిపాలెం, అల్లూరివారిపాలెం, కోనఫలం గ్రామాల్లో పనిచేసి అల్లపర్రు గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో 1986లో రిటైర్ అయ్యాను. నాముగ్గురు కుమారుల్లో ఒకరు ఉపాధ్యాయునిగా, ఒకరు కో ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేశారు. ఉపాధ్యాయునిగా ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చటం నా అదృష్టంగా భావిస్తున్నాను. – కొలసాని కృష్ణమూర్తి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, గరువుపాలెం -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
అంకితభావంతో పనిచేసి మార్గదర్శకంగా నిలవాలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మ విద్యారణ్యపురి : ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జి. పద్మ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీ చైర్పర్సన్ పద్మ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండేలా టీచర్లు అంకితభావంతో పనిచేయాలన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలంటే విద్యాప్రమాణాలు పెం పొందించే విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు వ్యక్తిత్వ విలువలు కూడా నేర్పాలని సూచించారు. అదనపు జేసీ తిరుపతిరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా చేశామన్నారు. అవార్డులు వచ్చిన ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై. బాలయ్య మాట్లాడుతూ సమాజంలో గురువులకు గొప్పస్థానం ఉందన్నారు. అనంతరం హన్మకొండ డైట్ కళాశాల అధ్యాపకుడు సీహెచ్ కేశవరావు, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాములవర్తి రామారావుతోపాటు మొత్తం 210 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, డీఈఓ రాజీవ్, పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు కల్పనాదేవి, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, వడుప్సా జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు, జనరల్ సెక్రటరీ దేవేందర్రెడ్డి, పెద్ది వెంకటనారాయణ, కార్పొరేటర్ స్వరూపరాణిరెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులంతా ఉత్తములే
♦ అవార్డులతో గుర్తించాల్సిన అవసరం లేదు ♦ మరింత ప్రోత్సహించేందుకే సన్మానాలు ♦ కష్టపడండి.. ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దండి ♦ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో చైర్పర్సన్ సునీతారెడ్డి ♦ 92 మంది టీచర్లకు పురస్కారాల ప్రదానం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది. అవార్డులు అందుకునే వారే కాదు.. ప్రతి టీచరూ ఉత్తముడే. వారిని మరింత ప్రోత్సహించేందుకు కొందరిని ఎంపిక చేసి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి పురస్కరిస్తున్నాం.’ అని జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. భావిభారత పౌరులు తయారయ్యేది పాఠశాలల్లోనే అని, ప్రతి టీచరు వారి వృత్తికి వందశాతం న్యాయం చేస్తేనే దేశం పురోగమిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. సమస్యలున్నప్పటికీ బోధనపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలపైనా అవగాహన అవసరం.. పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశ బోధనతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని జెడ్పీ చైర్పర్సన్ గుర్తు చేశారు. విద్యార్థులను చైతన్య పరిస్తే క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు వస్తాయన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో మెక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో తీవ్ర కరువున్నందున అక్కడ విరివిగా మొక్కలు నాటాలన్నారు. మధ్యాహ్న భోజన అనంతరం చేతులు కడిగే నీటిని మొక్కలకు మళ్లించే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల విద్యుదాఘాతంతో ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి మరణించడం విద్యాశాఖకు తీరని లోటన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల సౌకర్యం కోసం జిల్లా పరిషత్ నుంచి రూ.3 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని, ఒకేసారి కాకుండా విడతలవారీగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో 92 మంది టీచర్లకు శాలువా, మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గురుదేవోభవ
విజయవాడ(లబ్బీపేట) : రాష్ట్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం బుధవారం ఉత్సాహంగా జరిగింది. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారితో పాటు 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యాలతో పాటు కూచిపూడి, జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ విజయ్ ఇన్ యాక్షన్ అనే పుస్తకం డిజిటల్ వెర్షన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మలేషియా ప్రభుత్వం ఫెమెండోతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ ఇ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి.రత్నకుమారి హుదూద్ తుపాన్పై సంకలనం చేసిన పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ బడ్జెట్లో విద్యకు రూ.21.500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమూ బడ్జెట్లో 10శాతానికి మించి విద్యపై ఖర్చు చేయట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17.5 శాతం నిధులు విద్యకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, మహిళా కమిషనర్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, శాసన మండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రా, సాంకేతిక, ఉన్నత విద్యశాఖల కమిషనర్ డి.ఉదయలక్ష్మి, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, సబ్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గురుపూజోత్సవం
అల్లాదుర్గం : అల్లాదుర్గం మండలంలో గురుపూజోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 5న నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని వినాయక చవితికి సెలవు రావడంతో బుధవారం నిర్వహించాల్సి వచ్చిందని ఎంఈఓ బాలయ్య చెప్పారు. మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు పూల మాలలు వేసి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి పూలమాలలు, శాలువాలు, అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాంగారి ఇందిర నారాయణ, జేడ్పీటీసీ కంచరి మమత, ఎస్ఐ ఎం.డి.గౌస్, ఎంపీడీఓ రత్నమాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రేమ్కుమార్, రాములు, భాస్కర్, నాజర్, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం అనూరాధ, హెచ్ఎం ధనుంజయ్య, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కిష్టయ్య, జానార్ధన్, బిజ్జే సత్యనారాయణ, సాయిలు, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లోటస్పాండ్లో టీచర్స్ డే వేడుకలు
సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గొ ప్ప పండితుడు, తత్వవేత్త అని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. ఉపాధ్యా య లోకానికి ఆయన ఒక దిక్సూచి అన్నా రు. లోటస్పాండ్లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఉపాధ్యా య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో విశిష్ట సేవలందించిన వివిధ జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి నిలువెత్తు అద్దం రాధాక్రిష్ణన్ అని చెప్పారు. ఒక వైపు వినాయక చవితి పర్వదినం, మరో వైపు సర్వేపల్లి పుట్టినరోజు రావటం శుభసూచకమన్నారు. తొలుత సర్వేపల్లి రాధాక్రిష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి, తెలంగా ణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, బి.మోహన్ కుమార్, కొల్లి నిర్మల కుమారి, అరుణ్ కుమార్, భువనం భూషన్, సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, బుర్ర సురేష్ గౌడ్, సిద్ధారెడ్డి, బెంబడి శ్రీనివాస రెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్కారం అందుకున్న ఉపాధ్యాయుల వీరే... ఈదర్ ఆంథోని రెడ్డి(సెంట్ ఆంథోని హైస్కూల్, విద్యానగర్, సంగారెడ్డి), షేక్ మస్తాన్ వలి(ఎస్జీటీ, వెంకటేశ్వరనగర్, బాలానగర్), బోనాల శ్రీనివాస్(జెడ్పీహెచ్ఎస్, సనత్నగర్), జి.రఘునాథ్ రెడ్డి(బాగ్అమీర్ ప్రాథమిక పాఠశాల, బాలనగర్), ఏర్రాడి రామేశ్వరరావు(హెచ్ ఎం, జెడ్పీహెచ్ఎస్, జగద్గిరిగుట్ట), కారు పోతుల వెంకటయ్య (హెచ్ఎం, సీ బీ రాజునగర్ ప్రాథమిక పాఠశాల, బాల నగర్), యాదయ్య (హెచ్ఎం, హఫీజ్పేట్), ఎ.ఎం.ప్రసన్న లక్ష్మి, ఎస్జీటీ, ప్రాథమికపాఠశాల, వెంకటేశ్వనగర్, రం గారెడ్డి), శ్రీనివాస్(హెచ్ఎం, జెడ్పీహెచ్ ఎస్, సంగారెడ్డి)లను పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయ సాయిరెడ్డిలు శాలువతో సత్కరించి, వినాయక ప్రతిమ ఉన్న జ్ఞాపిక అందజేశారు. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు... వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఘనంగా పూజలు ని ర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రామచంద్రశాస్త్రి పూజ అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. -
జీవితంలో అత్యంత దారుణమైన రోజులు అవే..
-
మళ్లీ స్కూల్ రోజులు గుర్తొచ్చాయ్!
స్కూల్లో చదువుకునే రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతాయ్. తమకు విద్యాబుద్ధులు నేర్పి.. సమాజంలో ఒక స్థానం కల్పించిన గురువులంటే చాలామందికి ఎనలేని గౌరవభావం ఉంటుంది. అందుకే టీచర్స్ ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా చాలామంది తమ స్కూల్ రోజులను నెమరువేసుకుంటున్నారు. తమకు నచ్చిన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటారు. వారు పంచిన జ్ఞానం, ఇచ్చిన స్ఫూర్తికి కృతజ్ఞతలు చెప్పుకొంటారు. మన సినీ సెలబ్రిటీలు కూడా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తమ బాల్యంలోని స్కూల్ జ్ఞపకాలను నెమరువేసుకున్నారు. ఉపాధాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'చెంబూర్లోని సెయింట్ ఆంటోనీస్ గర్ల్స్ హై స్కూల్, నా కాలేజీ, యూనివర్సిటీ ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. స్కూల్ రోజుల్లో వేసిన స్కిట్లు, ఆడిన ఆటలు, హాఫ్ డే సెలవులు పంచిన ఆనందాలను నేనిప్పుడు ఎంతోగానో మిస్ అవుతున్నా' అని విద్యాబాలన్ ట్వీట్ చేయగా.. 'నా స్కూల్ రిపోర్ట్ బుక్ను తెరిచి చూసుకోవడానికి ఇదే సరైన రోజు. ఇప్పటికీ నా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చాలా బాగున్నాయి' అంటూ సాజిద్ ఖాన్ పేర్కొన్నారు. 'మీ జీవితం, మీ వైఫల్యాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు, మీకు ఎదురైన అవమానాలు, మీరు సంబరాలు జరుపుకొన్న సందర్భాలు.. ఇవే నిజమైన టీచర్లు' అంటూ 'విక్కీ డోనర్' స్టార్ ఆయుష్మాన్ కురానా ట్వీట్ చేశారు. వీరితోపాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. -
ఈ రాంగోపాల్ వర్మకు ఏమైంది?
తల్లి.. తండ్రి.. గురువు.. ఈ ముగ్గురూ దైవంతో సమానం అంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, మనకు చిన్నతనం నుంచి పాఠాలు బోధించిన గురువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువం. వారిని తలుచుకుంటేనే గౌరవభావం ఉప్పొంగుతుంది. కానీ ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి అంటారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరు అలాగే ఉంది. తాను ఎప్పుడూ నేర్చుకోలేదని.. అందరికీ నేర్పేవాడినని, అందువల్ల తనకు తానే హ్యాపీ టీచర్స్ డే చెప్పుకొంటానని, మిగిలినవాళ్లకు మాత్రం అన్హ్యాపీ టీచర్స్డే అంటూ ట్వీట్ల వర్షం మొదలుపెట్టాడు. పనిలో పనిగా పిల్లలకు ఓ పనికిమాలిన సలహా కూడా ఇచ్చాడు. స్కూల్లో టీచర్లతో సమయం వృథా చేసుకోవద్దని, కేవలం గూగుల్ నుంచే నేర్చుకోవాలని తెలిపాడు. తాను తన టీచర్లందరినీ ద్వేషించేవాడినని, అందుకే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్ల తాను దర్శకుడిని అయ్యానని చెప్పుకొచ్చాడు. తన టీచర్లందరికంటే తానే ఎక్కువ విజయాలు సాధించానని, దాన్నిబట్టి తనకు తన టీచర్లు అందరికంటే ఎక్కువ తెలుసని అర్థమవుతోందని రాంగోపాల్ వర్మ అన్నాడు. టీచర్ల కంటే క్లాసులో గొడవల నుంచే తాను ఎక్కువగా నేర్చుకున్నానని.. వాటిలో తాను తిరగబడే మనస్తత్వం గురించి తెలుసుకుని, దాన్ని శివ, సత్య లాంటి సినిమాల్లో ఉపయోగించానని చెప్పాడు. టీచర్లను ద్వేషించడానికి ప్రధాన కారణం.. వాళ్లు తనను క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమేనని అన్నాడు. స్కూలు, కాలేజిలో కొందరు టీచర్లు తనతో బలవంతంగా చదివించేవాళ్లని, జీవితంలో అత్యంత దారుణమైన రోజులు అవేనని చెప్పాడు. ప్రతిరోజూ స్కూల్లో పాఠాలు అయిపోయిన తర్వాత.. వాళ్లు చెప్పినవి మర్చిపోడానికి రెండు కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని కూడా అన్నాడు. సాధారణంగా తాను విస్కీ తాగనని, కానీ టీచర్స్ విస్కీ మాత్రం ఇష్టమని ముక్తాయించాడు. మరోవైపు ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని..వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్టీయూ సంఘం విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్లో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల టూటౌన్ పీఎస్లోనూ వర్మపై ఏపీ ఎస్టీయూ ఫిర్యాదు చేసింది. I never learnt but I always taught,so I am wishing myself Happy Teacher's Day #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I hated all my teachers nd n that's why I bunked classes nd saw films nd that's why I became filmmaker #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I became more successful than all my teachers and that proves that I knew much more than all my teachers #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 More than from teachers,I learnt from bullies in class who gave my first insights into rebel psychology which I employed in Shiva,Satya etc — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I used to hate my teachers because they used to constantly disrupt me from reading comic books in class #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 The worst days of my life were when I was being forcefully taught by my various teachers at school and college #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 Everyday after I got away from teachers,I used 2 read comics nd fiction novels whole night 2 unlearn what they taught #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 My sincere advise to all youngsters on #UnHappyTeachersDay is to not waste time with teachers and learn only from Google — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I normally don't drink whiskey but I loveeeeee Teacher's Whisky #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 -
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...
- 2016కి 31 మందిని ఎంపిక చేసిన విద్యాశాఖ - 8న అవార్డుల ప్రదానం సాక్షి, హైదరాబాద్: 2016 సంవత్సరానికిగాను రాష్ట్రం లో 31 మంది టీచర్లను పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. అందులో 17 మంది ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లను ఎంపికచేయగా.. మరో 14 మంది టీచర్లు, రిటైర్డ్ టీచర్లను నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ కేటగిరీ కింద ఎంపిక చేసింది. వారందరికి ఈనెల 8న (5న వినాయక చవితి అయినందున) ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహించనున్న టీచర్స్ డే సందర్భంగా అవార్డులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేతుల మీదుగా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కింద ఆయా టీచర్లకు రూ. 10 వేల నగదు అందజేయడంతోపాటు గోల్డ్ కోటెడ్ సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ ఇచ్చి సన్మానించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ తెలిపారు. ఎన్ఎఫ్టీడబ్ల్యూ కింద అవార్డులకు ఎంపికైనవారు 1. వి.గురునాథరావు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), జెడ్పీహెచ్ఎస్ కంబాలపల్లి, వరంగల్ 2. మోహన్రావు, స్కూల్ అసిస్టెంట్ (బయాలాజికల్ సైన్స్), జీహెచ్ఎస్, జుమ్మేరాత్పేట్, ఆదిలాబాద్ 3. పి.ప్రభాకర్రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), జెడ్పీహెచ్ఎస్ ఎంజేపల్లి, ఖమ్మం 4. చికోటి మహేశ్వర్, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ సముద్రాల, కరీంనగర్ 5. జి.ప్రభాకర్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), జెడ్పీహెచ్ఎస్ బినోల, నిజామాబాద్ 6. ఎండీ ఖలీల్ అహ్మద్, స్కూల్ అసిస్టెంట్ (సోషల్), గవర్నమెంట్ హై స్కూల్ (గర్ల్స్), కొన ్హపాలమూర్, మహ బూబ్నగర్ 7. ఖాజా తఖ్వియుద్దీన్, స్కూల్ అసిస్టెంట్ (బయాలాజికల్ సైన్స్), జీహెచ్ఎస్, మౌఝామ్షామి, హైదరాబాద్ 8. కె.దేవేందర్, రిటైర్డ్ హెడ్మాస్టర్, ఎయిడెడ్ హైస్కూల్ సింగరేణి కాలరీస్ కొత్తగూడెం, ఖమ్మం 9. బి.రాధాకృష్ణమూర్తి, ఎస్జీటీ, ఎంపీపీఎస్, కొనిజెర్ల, ఖమ్మం 10. ఆర్.నరేందర్, ఎస్జీటీ, ఎంపీయూపీఎస్, తీగారం, వరంగల్ 11. ఆర్.సతీశ్బాబు, ఎస్జీటీ, ఎంపీపీఎస్ బుర్కపిట్టతండా, నల్లగొండ 12. సయ్యద్ సంధానీ, ఎస్జీటీ, ఎంపీయూపీఎస్, నర్సాపూర్, మెదక్ 13. డి.మోహన్దాస్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎంపీపీఎస్ మల్లారం, కరీంనగర్ 14. కె.పి. జ్యోతి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, జీపీఎస్ తెలుగు మీడియం, నాంపల్లి, హైదరాబాద్ అవార్డు గ్రహీతలు... 1. ఎ. శ్రీనివాస భత్తార్, పీజీ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ జీల్ల చెరువు, ఖమ్మం 2. జి.వెంకటేశ్వర్లు, గ్రేడ్-2 హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ (బీ) నారాయణ్పూర్, నల్లగొండ 3. డి.రామకుమారి, పీజీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ ఉప్పరపల్లి, వరంగల్ 4. టి.అనురాధ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎంపీపీఎస్ వెట్టెం, మహబూబ్నగర్ 5. ఎం.వెంకటేశ్వర్లు నాయక్, స్కూల్ అసిస్టెంట్(సోషల్), జెడ్పీహెచ్ఎస్ వల్లూర్, మహబూబ్నగర్ 6. బి.ఆచయ్య, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎంపీపీఎస్ సత్తుపల్లి, ఖమ్మం 7.ఎస్.మురళి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, పీఎస్ అనాజిపురం, నల్లగొండ 8. శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ (బయలాజికల్ సైన్స్), జెడ్పీహెచ్ఎస్ జగత్పల్లి, మహబూబ్నగర్ 9. కె.రాజమౌళి, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), జెడ్పీహెచ్ఎస్, జన్నారం, ఆదిలాబాద్ 10. మాధురి, స్కూల్ అసిస్టెంట్ (బయాలాజికల్ సైన్స్), జెడ్పీహెచ్ఎస్ మంబాపూర్, రంగారెడ్డి 11. బి.ప్రభాకర్, పీజీటీ (బయాలాజికల్ సైన్స్), బీసీ రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), తునికి, మెదక్ 12. ఎ.శ్రీనివాసరావు, ఎస్జీటీ, ఎస్సీ ఎయిడెడ్ హైస్కూల్, ఇల్లందు, ఖమ్మం 13. సీహెచ్ చలపతి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎంపీపీఎస్ చిన్న పెండ్యాల (ఎస్సీ/బీసీ కాలనీ), వరంగల్ 14. ఎస్.సంతోశ్కుమార్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ ఎం, ఎంపీపీఎస్ అంకోలి, ఆదిలాబాద్ 15. రామచంద్రయ్య, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), జెడ్పీహెచ్ఎస్ వస్పుల్, మహబూబ్నగర్ 16. ఎండీ అన్వర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), గవర్నమెంట్ హైస్కూల్ హన్మకొండ, వరంగల్ 17. జి.రమేశ్రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), జెడ్పీహెచ్ఎస్ కుషాయిగూడ, రంగారెడ్డి -
తల్లీ నిన్ను దలంచి
⇒ మీరు చదవడం, రాయడం వచ్చిన అమ్మాయైతే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు. ⇒ మీరు ఇంగ్లిష్ చదవగలిగిన స్కూల్ గర్ల్ అయితే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు. ⇒ మీరు బాగా చదువుకున్న మహిళ అయితే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు. ⇒ మీరు ఉన్నత హోదాలో ఉన్న ఉమన్ ఎన్నారై అయితే మీరు ఆమెకు రుణపడి ఉన్నారు. నేడు టీచర్స్ డే మహాత్మాగాంధీ దాస్య విముక్తి, స్వామీ వివేకానంద జ్ఞానయోగం... ఆ రెండూ కలిసిన ‘విముక్తి జ్ఞానం’.. సావిత్రీబాయి! ‘స్త్రీలకు వివక్ష నుంచి, దళితులకు అంటరానితనం నుండి, వితంతువులకు దురాచారాల సంకెళ్ల నుంచి విముక్తి కావాలి. విముక్తి.. జ్ఞానం నుంచి, జ్ఞానం.. చదువు నుంచి వస్తుంది’ అని చెప్పేవారు సావిత్రీబాయి. పెళ్లయింది! ‘సావిత్రీబాయి వెడ్స్ జ్యోతీరావు’. గాష్! కొంపలు మునిగిపోవూ ఇలాగంటే! ఏం కాలమది?! ఎయిటీన్ ఫార్టీస్. ‘జ్యోతీరావు వెడ్స్ సావిత్రీబాయి’ అని మాత్రమే అనాలి. అమె ఆయన్ని చేసుకుందనడం మహాపచారం. ఏ ఇంట్లో అయినా , ఏ పందిట్లో అయినా.. ఆయనే ఆమెను చేసుకుంటాడు! అలాగే చేసుకున్నాడు జ్యోతీరావు. చేసుకున్నాక, ఏడడుగులు నడిచాక.. కాదు కాదు.. నేను ముందు, నువ్వు వెనుక కాదు అన్నాడు! నేను బయట, నువ్వు లోపల కాదు అన్నాడు! నాదొక మాట, నీదొక మాట కాదు అన్నాడు. అసలు నువ్వూనేను వేర్వేరు కాదు అన్నాడు. ఆ మాటే.. అతన్ని వేరు కాపురం పెట్టించింది! ‘ఇదిగో అమ్మాయ్.. నువ్వూ వెళ్లిపో’ అత్తగారిల్లు. బిక్కుబిక్కుమంటూ.. తప్పు చేసిన పిల్లలా నిలబడి ఉంది సావిత్రీబాయి. తప్పు చేయలేదని అమెకు తెలుసు. కానీ నిలబడి ఉంది. భర్త ముందూ కాదు, భర్త వెనకా కాదు. భర్త పక్కనే నిలబడి ఉంది. పెద్దగా అరిచేస్తున్నారు గోవిందరావు. సావిత్రీబాయి మామగారు ఆయన. అత్తగారు లేరు. జ్యోతీరావు నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఆమె చనిపోయారు. ‘‘ఇంటి పరువు మంట కలిపితే ఊరుకునేది లేదు’’... అంటున్నారు గోవిందరావు. కొడుకు మీదే ఆయన కోపమంతా. కోపం ఎందుకంటే... కోడలికి చదువు చెప్పిస్తున్నాడని! ఆడపిల్ల చదువుకోవడమే ఆయనకు ఇష్టం లేదు. ఇక పెళ్లయిన ఆడపిల్లను చదివిస్తుంటే ఊరుకుంటాడా? ‘‘ఇంట్లోంచి వెళ్లిపో’’ అన్నారు కొడుకుని. ఆ వెంటనే కోడలి వైపు తిరిగి, ‘‘ఇదిగో అమ్మాయ్... నువ్వీ ఇంట్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. లేదూ, భర్తతోనే కలిసుంటానంటావా... నువ్వూ బైటికి వెళ్లిపోవచ్చు’’ అన్నారు. రెండో ఆలోచన చేయలేదు సావిత్రీబాయి. భర్తతో కలిసి బయటికి వచ్చేసింది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు! భర్తకు 13. ఆడపిల్లలట! వాళ్లకో పంతులమ్మట!! మరో పదేళ్లు గడిచాయి. సావిత్రీబాయి చదువు పూర్తయింది. సావిత్రీబాయే స్వయంగా స్కూలు పెట్టింది! ఆడపిల్లల స్కూలు!! ఫస్ట్ బ్యాచ్లో 9 మంది. పుణెలో, ఆ చుట్టుపక్కల అదొక సంచలనం. ఆడపిల్లలంట! వాళ్లకో పంతులమ్మట! రెండూ విడ్డూరాలే. రెండూ ముక్కు మీద వేళ్లే. సిగ్గూశరం లేదా అని సంప్రదాయం పళ్లు పటపటలాడించింది. అదేం పట్టించుకోలేదు సావిత్రీబాయి. ఆమెకు ఇంకా చాలా పని ఉంది. ఆడపిల్లల చేత ఉద్యోగాలు చేయించాలి. ఆడపిల్లల మెడలో పడబోయే ముసలి తాళిబొట్లను తెంపేయాలి. భర్త చనిపోయిన ఆడపిల్లలకు మళ్లీ పెళ్లి చేయించాలి. అనాధలైన ఆడపిల్లల్ని, అత్యాచారాలకు గర్భిణులైన ఆడపిల్లల్ని చేరదియ్యాలి. ఇంకా... ఆడపిల్లలపై ఆంక్షల్ని, ఆడపిల్లలంటే ఉన్న వివక్షనీ రూపుమాపాలి. ఆడామగ తేడా పాటిస్తున్న సమాజాన్ని, కులం కులం అంటూ కలవరిస్తున్న సమాజాన్ని నిద్రలేపాలి. ఇలా చాలా పనులు! ఒకటొకటీ మొదలు పెట్టారు సావిత్రీబాయి. కష్టాలు కూడా ఒకటొకటిగా మొదలయ్యాయి ఆమెకు. ఎత్తుకుని... హృదయానికి హత్తుకుని... ‘తను చెడిపోయింది కాక, సమాజాన్నీ చెడగొడుతుందా?’.. మొదటి రాయి. ‘ఇంట్లో నెగ్గుకు రాలేనివాళ్లే ఇలా వీధుల్లో పడతారు’ రెండో రాయి. ‘అసలు ఆడదేనా?’.. మూడో రాయి. తర్వాత రాళ్లు, ఆ తర్వాత రాళ్ల వర్షం. ప్రతి రాయికీ చేతులు అడ్డుపెట్టారు సావిత్రీబాయి భర్త జ్యోతీరావు ఫూలే. తనపై పడబోయిన రాయి మిస్ అయి, భర్తకు తగలబోతున్నప్పుడు తనే వెళ్లి ధైర్యంగా అడ్డు నిలిచి భర్తను కాపాడుకున్నారు సావిత్రీబాయి. రాళ్లు విసురుతున్న వారి మీద కోపం రాలేదు ఈ దంపతులకు. దురాచారాల పర్వతాలను ఒక్కొక్కటి గా బీటలు వారుస్తూ, బద్దలు కొడుతూ వస్తున్నప్పుడు రాళ్లొచ్చి మీద పడడంలో ఆశ్చర్యం ఏముందీ అనుకున్నారు. ఈ తప్పొప్పుల తలనొప్పులకు చదువొక్కటే మందు వెయ్యగలదని అనుకున్నారు. సావిత్రీబాయి చదువుల డాక్టర్ అయ్యారు. చదువు చెప్పడం, చదువుకోమని చెప్పడం, సమాజ సేవ చెయ్యడం... పూర్తిగా ఆ మహాయజ్ఞంలో సమిథలా పడిపోయారు సావిత్రీబాయి. పుణెలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు పదేళ్ల చిన్నారిని చేతుల్లోకి ఎత్తుకుని, హృదయానికి హత్తుకుని ప్లేగు సోకి మరణించారు సావిత్రీబాయి. ఆడవాళ్లు నోరెత్తినా... అది బరితెగింపేనా! మహాత్మాగాంధీ దాస్య విముక్తి, స్వామీ వివేకానంద జ్ఞానయోగం... ఆ రెండూ కలిసిన ‘విముక్తి జ్ఞానం’.. సావిత్రీబాయి. స్త్రీలకు వివక్ష నుంచి, దళితులకు అంటరానితనం నుండి, వితంతువులకు దురాచారాల సంకెళ్ల నుంచి విముక్తి కావాలి. విముక్తి జ్ఞానం నుంచి, జ్ఞానం చదువు నుంచి వస్తుందని సావిత్రీబాయి క్లాసులో చెబుతున్నప్పుడు క్లాసు బయటి నుంచి రాళ్లొచ్చి పడ్డాయి! ఏదైనా చెప్పే చొరవ, చేసే ధైర్యం మగాళ్లకే ఉండాలి. ఆడవాళ్లు చెప్పినా, చేసినా అది ‘బరితెగింపు’. ఈ మదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ ఎడ్యుకేషన్, ఈ మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం.. తన కాలంలో ఒక ఒంటరి పోరాట యోధురాలు. భర్త సహాయం ఉంటే ఉండొచ్చు. ‘మహిళ’గా ఆమె ఒంటరి. ఒంటరిగానే, వట్టి చేతులతోనే సంప్రదాయాల చీకటి గది అద్దాలను బద్దలు కొట్టారు. పందొమ్మిదో శతాబ్దపు సూపర్ ఉమన్ సావిత్రీబాయి. బడి తెరుచుకుంది... ఊరు తలుపులు వేసుకుంది ఇంట్లో పశువుల్లాగే ఇంట్లో ఆడవాళ్లు! అలాంటి టైమ్లో సావిత్రీబాయిని చదువు సూపర్ గర్ల్గా మార్చింది. అప్పట్లో రైట్ టు ఎడ్యుకేషన్ బ్రాహ్మల పిల్లలకు మాత్రమే. అందులోనూ మగపిల్లలకు మాత్రమే. అదొక రూల్. రూల్ తప్పితే ఎలాగుంటుందో సావిత్రీబాయికి మొదటి రోజే తెలిసింది. బాలికల కోసం భిదే వాడలో పాఠశాలను తెరిచినప్పుడు.. ఆ ఊళ్లోని తలుపులన్నీ మూసుకుపోయాయి. ఆడపిల్లల్ని బయటికి రానివ్వలేదు. కనీసం స్కూలు వైపు తొంగి చూడనివ్వలేదు. సావిత్రీబాయి ఇంటింటికీ వెళ్లి అడిగారు.. ‘మీ అమ్మాయిని బడికి పంపించండి. భవిష్యత్తు బాగుంటుంది’ అని. ఇళ్లల్లోని ఆడవాళ్లు ఆసక్తిగా కళ్లింత చేసుకుని చూశారు. మగవాళ్లు ఆగ్రహంతో కళ్లెర్ర చేశారు. భిక్షానికి ఇంటి ముందుకు వచ్చిన యాచకురాల్ని కసురుకున్నట్లుగా విసుక్కున్నారు. ‘మనుషులు విడిగా మంచివాళ్లే. కానీ సామాజిక భయం వాళ్లలోని మంచితనాన్ని దాచేస్తుంది’ అని ఫరార్, మిషెల్ పాఠశాలల్లో చదువుకుంది సావిత్రీబాయి. మళ్లీ ఓపిగ్గా ‘యాచన’ మొదలు పెట్టింది. ఆ చేతిలో పుస్తకాలు... ఈ చేతిలో చీర బ్రిటిష్ ఇండియాలో తొలి గర్ల్స్ స్కూల్ మొదలైంది!! కులాలు కలివిడిగా బెంచీల మీద కూర్చున్నాయి. ఆ ఆడపిల్లల కళ్లల్లో ఎంత సంతోషం. ఎంత ఉత్సాహం! ఏదైనా సరే సాధించేలా ఉన్నారు వాళ్లు. సమాజాన్ని మార్చేద్దాం వస్తారా అంటే ‘సై’ అనే లా ఉన్నారు. ఆ స్పార్క్ని గమనించారు సావిత్రీబాయి. పాఠాలు మొదలు పెట్టారు. సంస్కృతి పాఠాలు, సంస్కరణల పాఠాలు. వ్యక్తిత్వ వికాసాల పాఠాలు, వీరోచిత పోరాటాల పాఠాలు. బయటివాళ్లూ ఊరుకోలేదు. ఈ టీచరమ్మ సావిత్రీబాయికి పెద్ద పాఠమే నేర్పాలి అనుకున్నారు. స్కూలుకు వెళ్లడానికి ఇంట్లోంచి రానివ్వకుండా ఆమెను ఇంటి బయట అడ్డుకున్నారు. స్కూలుకు వెళ్లే దారిలో అడ్డుకున్నారు. రాళ్లు విసిరారు. బురద చల్లారు. సావిత్రీబాయి సంకల్పబలం సడలలేదు. చేతిలో పుస్తకాలతో పాటే చేతి సంచిలో ప్రతిరోజూ రెండో చీర ఉండేది. బురద తో చీర పాడైతే మార్చుకోడానికి. చివరికి ఆమె చీర మార్చుకోనవసరం లేకుండా, మనుషులే మారడం మొదలుపెట్టారు! ఆ మార్పు సావిత్రీబాయిలో ఎంత ఉత్సాహాన్ని తెచ్చిందంటే... ఆమె రెండో స్కూలు కూడా తెరిచారు! అది మహిళల కోసం. ఆ తర్వాత కొన్నాళ్లకు మూడో స్కూలూ మొదలైంది. అదీ బాలికలు, మహిళలకే. సరస్వతీ నమస్తుభ్యం ఇవాళ్టి సర్వశిక్షా అభియాన్, రైట్ టు ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్.. 150 ఏళ్ల క్రితమే సావిత్రీబాయి ఆలోచనల్లోంచి ఆచరణలోకి వచ్చాయి. ‘నా జీవితమే నా సందేశం’ అని గాంధీజీ అన్నారు. సావిత్రీబాయి ప్రత్యేకంగా ఇచ్చి వెళ్లని సందేశం ఆమె జీవితం! ఆమె ఫైటర్. కొడుక్కి కట్నం లేకుండా, పురోహితులు లేకుండా, కులం చూసుకోకుండా ధైర్యంగా పెళ్లి చేశారు. పెళ్లికి ముందే కోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు!! ఆ పిల్ల చదువుకోడానికి వీలుగా ఇంటి పనులన్నీ తనే చేసుకున్నారు. ఆమె వారియర్. భర్త చనిపోయినప్పుడు కులమేదో తెలియని దత్తపుత్రుడితో తలకొరివి ఎలా పెట్టిస్తారని పెద్దలు తీర్మానిస్తే... తనే పాడె ముందు నిప్పుల కుండతో నడిచి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు. నేడు టీచర్స్డే. టీచ ర్స్డే అంటే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తొస్తారు. అబ్దుల్ కలామ్ గుర్తొస్తారు. ఇంకా గొప్పగొప్పవాళ్లు గుర్తొస్తారు. వీళ్లందరికన్నా ముందు మనకు గుర్తుకు రావలసింది... సావిత్రీబాయి ఫూలె. ఇంట్లో అమ్మ మన తొలి టీచర్. భరతమాతకే తొలి టీచర్ సావిత్రమ్మ. తల్లీ నీ పాదాలకు ప్రణామం. సావిత్రీబాయి ఫూలె (66) తొలి భారతీయ మహిళా టీచర్, కవయిత్రి జననం : 3 జనవరి 1831 జన్మస్థలం : నైగావ్, సతారా జిల్లా (మహారాష్ట్ర) తల్లిదండ్రులు : లక్ష్మి, ఖాండోజీ నేవ్సే సామాజిక వర్గం : ‘మాలి’ (నిమ్నకులం) భర్త : జ్యోతీరావ్ ఫూలె (వివాహం 1840) సంతానం : యశ్వంత్ (దత్తపుత్రుడు) కృషి చేసిన అంశాలు : స్త్రీవిద్య, కుల నిర్మూలన, లైంగిక వివక్ష సంఘ సంస్కరణ తొలి మహిళా పాఠశాల స్థాపన : 1848 (భిదేవాడ, పుణె) మరణం : 10 మార్చి 1897 అవార్డులు - పురస్కారాలు ►{బిటిష్ ప్రభుత్వం ‘బెస్ట్ టీచర్’ అవార్డుతో గౌరవించింది. ►మహారాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్రమాత’గా (మదర్ ఆఫ్ ది నేషన్) కీర్తించింది. ►సావిత్రీబాయి కవితలు ఆమె మరణానంతరం కావ్య ఫూలే (1934), భావన్ కశి సుబోధ్ రత్నాకర్ (1982) అనే రెండు సంపుటాలుగా వచ్చాయి. కావ్య ఫూలె తొలి ముద్రణ ఆమె జీవించి ఉన్నప్పుడే 1854లో వెలువడింది. ► 1998లో భారత ప్రభుత్వం సావిత్రీబాయి ఫూలె సంస్మరణార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. ► ‘యూనివర్శిటీ ఆఫ్ పుణె’ పేరును భారత ప్రభుత్వం 2015లో ‘సావిత్రీబాయి ఫూలె పుణె యూనివర్శిటీ’గా మార్చింది. ►సావిత్రీబాయికి, ఆమె భర్త జ్యోతీరావు ఫూలెకు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలని మహరాష్ట్ర ఎంపీ గత ఏడాది మార్చిలో పార్లమెంటులో డిమాండు చేశారు. మాధవ్ శింగరాజు -
టీచర్ కాబోతున్న ప్రణబ్
న్యూఢిల్లీ : దేశ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 5న టీచర్ కాబోతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. సెప్టెంబర్ 5న విద్యార్థులకు ప్రణబ్ పాఠాలు చెప్పనున్నట్టు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. అదేరోజు ఢిల్లీలో వివిధ ప్రభుత్వ పాఠశాలల టీచర్లతో ప్రణబ్ సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్కు సమీపంలో ఉన్న ఈ విద్యాలయంలో 11,12 వ తరగతి చదువుతున్న మొత్తం 80 మంది విద్యార్థులు ప్రణబ్ చెప్పబోయే పాఠాలకు హాజరుకానున్నట్టు ప్రకటన విడుదల చేశారు. ఈ ఈవెంట్ను డీడీ న్యూస్, డీడీ భారతీ చానల్స్లో ఉదయం 10.30 గంటల నుంచి ప్రసారం చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ యూట్యూబ్ చానల్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వెబ్కాస్ట్.గవర్నమెంట్.ఇన్/ ప్రెసిడెంట్లో లైవ్గా వెబ్ కాస్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విడుదల చేయబోయే "ఉమాంగ్ 2015" బుక్లెట్ తొలి ప్రతిని ప్రణబ్ అందుకోనున్నారు. -
రేపు గురుపూజ మహోత్సవం
కౌటాల : మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో మంగళవారం గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వాసుల రామస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సుప్రభాతం, 7గంటలకు అఖండజ్యోతి ప్రజ్వలన, 9 గంటలకు గురుపూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మండలంలోని భక్తులందరూ గురుపూజ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. -
నాణ్యమైన విద్యతోనే ప్రజల్లో నమ్మకం!
ఉపాధ్యాయ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 71 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించినపుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం రవీంద్రభారతిలో 71 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. వారికి శాలువా కప్పి, రూ.10వేల నగదు ప్రోత్సాహం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి, బంగారు తెలంగాణ సాధనకు టీచర్లు మార్గదర్శకులు కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించి.. దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తేనే వారికి న్యాయం చేసిన వారు అవుతారన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ తెస్తున్నారన్నారు. నివాస వసతితో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్యను (ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు) సీబీఎస్ఈ సిలబస్తో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 రెసిడెన్షియల్ స్కూళ్ల చొప్పున 1,190 స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కేబీజీవీల్లో చదివే అనాథ పిల్లల బాగోగులను, పదో తరగతి తరువాత వారి ఉన్నత చదువులను ప్రభుత్వమే చూసుకునేలా కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా విధానపర నిర్ణయం తీసుకున్నారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇంటర్మీడియెట్లో ఉచిత విద్యను అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామన్నారు. అనేకమంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, అయితే దాదాపు 8 వేల ఖాళీల్లో విద్యావలంటీర్లను నియమించాలని నిర్ణయించామని, ఈ నెల 21 నాటికి ప్రక్రియ చేపడుతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం (జూన్) నాటికి ఆయా ఖాళీల్లో డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లను నియమిస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్కు మార్గదర్శనం... ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో టీచర్ల పాత్ర కీలకమైందన్నారు. ఉపాధ్యాయులు అందించిన జ్ఞానం, తెలివితేటలతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాగా పనిచేసి ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలను పెంచాలన్నారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ విద్యారంగంలో గతంలోలాగా నిర్లక్ష్యానికి తావులేకుండా కడియం శ్రీహరి చర్యలు చేపడుతున్నారన్నారు.విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం వార్షిక పురస్కార కార్యక్రమంగా కాకుండా భవిష్యత్తు మార్గదర్శనానికి నాంది కావాలన్నారు. కొత్త రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, సుధాకర్రెడ్డి, జనార్ధన్రెడ్డి, ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వాణిప్రసాద్, శైలజారామయ్యార్, అశోక్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులు అందుకున్నారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు అందజేశారు. తెలంగాణ నుంచి అవార్డులు అవార్డులు అందుకున్న వారు: నాగమ్మ(నారాయణ్పేట్, మహబూబ్నగర్), కె.శశికళ (చిప్పకుర్తి,కరీంనగర్), పి.రఘునారాయణ(వరంగల్), డి.వెంకటేశం(ఖమ్మం), మహమ్మద్ రాజ్ మహమ్మద్(శివునిపల్లి, వరంగల్), సి.ప్రకాశ్(నిజామాబాద్),సంపతికుమారి(కొత్తపల్లి, కరీం నగర్), హైదరాబాద్లోని కేంద్ర విద్యాలయ-1(ఉప్పల్)కు చెందిన కె.వి.రామలక్ష్మి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నవారు: జి.శ్రీనివాసులురెడ్డి(జాట్ల కొండూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా), డి.వెంకట శ్రీమన్నారాయణ(గొల్లపూడి, కృష్ణా), వై.శ్రీనివాసరావు(జాలిపూడి, ప.గోదావరి), పి.మోహనరావు(పెరికిపాలెం, ప.గోదావరి, ఆర్.శ్రీనివాసులు(తాటిగుంట్లపాలెం, చిత్తూరు), యు.ఫణీంద్రకుమార్(ఆకునూరు, కృష్ణా), ఎల్.సుబ్రమణ్యం చౌదరి(చిన్నగొట్టిగల్లు, చిత్తూరు), ఐ.సత్యనారాయణ(తుని, తూర్పు గోదావరి), పి.కృష్ణవేణి(నడుపూరు, విశాఖపట్నం). -
టీచర్కు స్వీట్ షాకిచ్చిన రవీనా
అది ముంబైలోని వృద్ధాశ్రమం. శ్రీమతి పార్మర్ అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ అక్కడి వృద్ధులకు సేవ చేస్తుంటారు. టీచర్స్ డే నాడు కూడా ఎప్పటిలా వృద్ధాశ్రమానికి వచ్చారామె. ఇంతలో సడన్గా ఆ వృద్ధాశ్రమం కోలాహలంగా మారింది. విషయం ఏమిటంటే, పార్మర్ను చూడటానికి ఆమె పూర్వ విద్యార్థిని, బాలీవుడ్ కథా నాయిక రవీనా టాండన్ వచ్చారు. ఆమెను చూడగానే స్వీట్ షాక్కు గురయ్యారు పార్మర్. సరిగ్గా పాతికేళ్ల తర్వాత రవీనా తన టీచర్ను కలిసి ఆనాటి స్మృతులను పంచుకున్నారు. ‘‘నా వ్యక్తిత్వ వికాసానికి బంగారు బాట వేసిన పార్మర్ను నా జీవితంలో మర్చిపోలేను. అందుకే కలవడానికి వెళ్లా’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అని అందులో పేర్కొన్నారు. -
'సాక్షి'తో టీచర్స్ డే ఫోటోలు
-
పేరుకే వేడుకలు.. టీచర్ల మాట ఉంటే ఒట్టు!
కేంద్ర సర్కార్, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీచర్స్ డే వేడుకల్లో టీచర్ల మాటే లేదు. ఉపాధ్యాయుల స్థానాన్ని రాష్ట్రపతి అక్రమించేస్తే.. ప్రధాని తన జీవిత రాజకీయ పాఠాలు చెబుతూ కాలం వెళ్లదీశారు. ఉపాధ్యాయుల ప్రాతినిధ్యంపై పిల్లలకు వివరించాల్సింది పోయి, తన ఏడాది పాలన గురించే చెప్పినట్లు కనిపించింది. ఉపాధ్యాయుల గురించి పిల్లలకు మాట్లాడే అవకాశం ఇచ్చారే కానీ, ఒక్క ఉపాధ్యాయుడి పేరూ ప్రస్తావించలేదు. ప్రధాని టీచర్స్ డే వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శన కూడా విద్యా విధానంలో సమస్యలను ప్రతిబింబించలేదు. వేడుకల్లో పాల్గొన్న వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన వారెవ్వరూ కనిపించలేదు. మోడల్ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలనుంచి, అధికంగా ఫలితాలను సాధించిన వారు, అవార్డులు గెలుచుకున్నవారు, ఇంగ్లీషు మాట్లాడగలిగేవారు ఎక్కువగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కూడ వేదికపై గానీ, తెర వెనుక గానీ తమను తాము ప్రదర్శించుకోలేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 'మేక్ ఇన్ ఇండియా' నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. కానీ విద్యారంగంలో ఏదీ మేక్ ఇన్ ఇండియా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యావిధానం నానాటికీ కుంగి పోతోంది. తగిన విద్యార్హతలు లేనివారు కూడా టీచర్లుగా వచ్చేస్తున్నారు. పాఠశాలల్లో పనిచేసే సిబ్బందిని పరిశీలిస్తే బోధనా రంగంలో ఉన్నవారి కంటే ఇతర పోస్టుల్లో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విద్యాధికారుల పర్యవేక్షణా లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవారు ఎలాంటి సామర్థ్యం ఉన్నవారైనా సరిపోతుంది అన్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలు చేయడంలో భాగంగానే ఉపాధ్యాయ వృత్తిని కూడా చూస్తోంది. పరీక్షలు పాసైతే చాలు టీచర్లుగా మారే అవకాశాన్నిస్తోంది. అందుకే బోధనారంగంలో ప్రభుత్వ పరీక్షకు కూడా ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎక్కువైంది. నియామకాల్లో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యావ్యవస్థే కుంటుపడుతోంది. మధ్యప్రదేశ్ లో సాంకేతిక విద్యాశాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఫలితాలు మార్చడంలో బయటపడ్డ కుంభకోణం విద్యావ్యవస్థనే ప్రశ్నిస్తుంది. -
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. -
టీచర్స్డే పై వర్మ కామెంట్
వివాదాల కోసమే వ్యాఖ్యలు చేసే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ మరోసారి తనదైన ట్వీట్ లతో చెలరేగిపోయాడు. గురు పూజోత్సవం సందర్భంగా ఆయన గురువుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఎవరికీ హ్యాపీ టీచర్స్ డే అని చెప్పను, ఎందుకంటే నేను ఒక్క రోజు కూడా నా గురువులతో సంతోషంగా లేను. సక్సెస్ఫుల్ ఇంజనీర్స్, సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు గాని, ఎక్కడైన సక్సెస్ఫుల్ టీచర్స్ ఉన్నారా.? కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమా చేసినట్టుగా ఎవరైనా టీచర్ ఆఫ్ ద ఇయర్ అనే సినిమా చేస్తే అది డిజాస్టర్ ఆఫ్ ద ఇయర్ అవుతుంది' అంటూ కామెంట్ చేశాడు. సినీ రంగంలోనే ఉపాధ్యాయ వృత్తిని తక్కువగా చూపిస్తున్న విషయాన్ని మరిచిపోయిన వర్మ ఇలాంటి కామెంట్స్ చేయటం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. అయితే వర్మ చేస్తున్న రెగ్యులర్ కామెంట్స్ కు అలవాటు పడ్డ రీడర్స్ మాత్రం లైట్ గా తీసుకుంటున్నారు. I cant say 'Happy teachers day' cos there wasn't a single day I was happy with my teachers — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2013 If someone takes off from Karan johar's Student of the year and makes Teacher of the year it will become the Disaster of the year — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2013 -
టీచర్స్ డే వేడుకల ఫొటోలు 'సాక్షి'తో పంచుకోండి
జన్మనిచ్చేది అమ్మ అయితే.. జీవితానికి వెలుగు బాటలు వేసేది ఉపాధ్యాయుడు. తొలి పలుకులు నేర్పేది తల్లిదండ్రులు అయితే.. ప్రగతి దారిన నడిపేది మాత్రం గురువు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ... అని అంటారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా... మీ స్కూల్, లేదా పాఠశాల, కాలేజీలలో గురు పూజోత్సవం జరుపుకున్నారా? అయితే ఆ ఫోటోలను sakshinetduty@gmail.comకి మెయిల్ చేయండి. వాటిని sakshi.com వెబ్ సైట్ లో గ్యాలరీగా పెడతాం. -
గీతా టీచర్ చాక్లెట్లను మరువలేను
మా మంచి మాస్టారు నేను మూడో తరగతి చదువుతుండగా గీతా టీచర్ రోజూ చాక్లెట్లు ఇచ్చేవారు. కల్టెకర్గా బాధ్యతలు చేపట్టాక ఆమె పనిచేస్తున్న పాఠశాలకు వెళితే అప్పుడు కూడా చాక్లెట్లు ఇచ్చి ప్రేమను పంచారు. ఈ తీపి గుర్తులను ఎప్పటికీ మరువలేను. కాకినాడ గాంధీ సెయింట్ థెరిస్సా పాఠశాలలో చదువుతుండగా తెలుగు మాస్టార్లు భాస్కర రామ్మూర్తి, చింతామణి చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నారుు. సైన్స్ మేడమ్ సావిత్రి, ఇంగ్లిష్ టీచర్ సత్యనారాయణ పాఠాలను ఎన్నటికీ మరువలేను. ఇంటర్ చదువుతుండగా లెక్చరర్ రాఘవరావు చదువులో ఎంతో ప్రోత్సహించారు. నేను కలెక్టర్ కావడానికి వీరందరూ కారకులు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఉపాధ్యాయులతో విద్యార్థి అనుబంధం జీవితాంతం ఉంటుంది. జీవితంలో చిరస్థాయిగా ముద్ర వేసేది గురువు ఒక్కరే. గతంలో ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. ప్రస్తుతం సర్వశిక్షా అభియూన్ కారణంగా పాఠశాలలకు వసతులు, సదుపాయూలు కల్పిస్తున్నారు. వీటిని ఉపయోగించుకుని ప్రభుత్వ బడుల్లో చక్కగా చదువుకోవచ్చు. ఉపాధ్యాయులూ వసతులను అందిపుచ్చుకుని నాణ్యమైన విద్యను అందిస్తే ఎందరో కలెక్టర్లు, ఎస్పీలు సర్కారీ బడుల్లో నుంచే వస్తారు. - కలెక్టర్ కె.భాస్కర్ సిస్టర్ జఫ్రిన్ నాకు ఆదర్శం చదువంటే అక్షరాస్యతే. జ్ఞానమే అసలైన చదువు. నేడు గురువులను విద్యార్థులు చులకనగా చూస్తున్నారు. ఇది మారాలి. గురువును దైవంగా భావించాలి. నేను విజయవాడ అటికిన్స్ బాలికల పాఠశాలలో చదువుతున్నప్పుడు సిస్టర్ జఫ్రిన్ ఆదర్శంగా ఉండేవారు. ఆమె పిల్లలపై చూపించే ప్రేమ, కరుణ నన్నెంతో ఆకట్టుకున్నారుు. చిన్నప్పుడే నాలో నాయకత్వ లక్షణాలు గుర్తించి గురువులు ప్రోత్సహించారు. కళాశాల స్థాయిలో సిస్టర్ స్టెల్లా, డిగ్రీ కళాశాలలో సిస్టర్ డాక్టర్ బీనీ, లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీబీ కుమార్, కాంపిటేషన్ పరీక్ష శిక్షణలో కరీం సార్ నా ఉన్నతికి భాగస్వాములయ్యూరు. నా తల్లిదండ్రులే నా మొదటి గురువులు. - కేజీవీ సరిత, ఏలూరు డీఎస్పీ విక్టర్ సార్ ఇంటికొచ్చి మరీ తీసుకువెళ్లేవారు నేను ఎలిమెంటరీ స్కూల్కు వెళ్లే రోజుల్లో పొలాల వెంట తిరుగుతుంటే మా మాస్టారు జార్జి విక్టర్ వెంటాడి మరీ నన్ను పట్టుకుని బడికి తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి స్కూల్కి వెళ్లకపోతే ఇంటికి వచ్చి మరీ తీసుకువెళ్లేవారు. చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చేవారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడ ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసే జార్టి విక్టర్ మాస్టారులాంటి ఉపాధ్యాయులు ఇప్పుడూ కావాలి. హైస్కూల్ స్థాయిలో తెలుగు మాస్టారు వాసుదేవశాస్త్రి అభినయంతో బోధించే విధానం బాగుండేది. బ్రహ్మచారిగా మిగిలిన ఆయన తన ఇంటి వద్దే పిల్లలను ఉంచి చదివించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధ్యాయులు మేల్కొనాలి, సర్కారీ విద్యను కాపాడుకోవాలి. గురువులు స్ఫూర్తినిస్తూ విద్యార్థులకు నైతికతతో కూడిన విద్యను అందించాలి. - డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి బయోలజీ మేడమ్ స్ఫూర్తితోనే.. విజయనగరం జిల్లాలో నేను డిగ్రీ చదువుతుండగా మైక్రో బయోలజీ చెప్పడానికి షర్మిలాబేగం అనే లెక్చరర్ వచ్చేవారు. కేవలం ఆమె పాఠాలు చెప్పి ఊరుకునేవారు కాదు. ఉన్నత లక్ష్యాలను ఎలా ఏర్పరుచుకోవాలి, వాటిని చేరుకోవడానికి ఎలా పరిశ్రమించాలి అనే విషయూలు చెప్పేవారు. ఆమే నాకు స్ఫూర్తి. నేను గ్రూప్స్కు సెలెక్ట్కాక ముందు విశాఖలో మూడేళ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేశా. నేను ఈ రోజు డీఎస్పీ కావడానికి షర్మిల మేడమ్ కారణం. -పి.సౌమ్యలత, డీఎస్పీ, నరసాపురం గురువుల దయతోనే ఈ స్థాయికి గురువుల దయతోనే జిల్లా ఎస్పీ స్థారుుకి ఎదిగాను. నన్ను ప్రభావితం చేసిన వారిలో మొదటి స్థానం అమ్మ మంజు మల్లిక్, నాన్న లక్ష్మీకాంత మల్లిక్కు దక్కుతుంది. పాఠశాల స్థాయిలో ఉండగా కన్నబిడ్డలా భావించి రాంచీలోని పాఠశాలలో అక్షరాలు దిద్దించిన మెనెన్ మేడం, హైస్కూల్లో మ్యాథ్స్ నేర్పించిన సుకుమార్ సార్, రామకృష్ణమఠంలో స్వామి శ్రద్ధానందజీ మహరాజ్, ఐఐటీలో పాల్ సార్, మిశ్రా సార్, దామోదర్ సార్ను ఎన్నటికీ మరిచిపోలేను. నన్ను వారెంతగానో ప్రభావితం చేశారు. అడుగడుగునా ప్రోత్సహిస్తూ మార్గదర్శకులుగా నిలిచారు. వృత్తిపరంగా రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ రాముడు, ఏలూరు డీఐజీ హరికుమార్, అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు, సీఐడీ ఏడీజీ ద్వారకాతిరుమలరావును గురువులుగా భావిస్తున్నా. గురు పూజోత్సవం సందర్భంగా వీరందరినీ స్మరించుకోవడం ఆనందంగా ఉంది. - భాస్కర భూషణ్, జిల్లా ఎస్పీ గురువే మార్గనిర్దేశకుడు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర కీలకంగా ఉంటుంది. గురువులే మన మార్గనిర్దేశకులు. తల్లితండ్రుల తర్వాత ఆ స్థానాన్ని గురువుకు ఇచ్చాం. నిజానికి పిల్లల విషయంలో తల్లితండ్రులతో సమానమైన బాధ్యతను గురువు నిర్వర్తింటారు. నా చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. నేను ఈ స్థితికి రావడానికి చాలామంది ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంది. ప్రతి ఒక్కరూ గురువును పూజించాలి. గురువు సూచించిన మార్గంలో నడవాలి. - డి.పుష్పమణి, ఆర్డీవో, నరసాపురం -
రాజకీయాల్లోకి సమర్థులు రావాలి
పాలిటిక్స్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి మారాలి ♦ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి ♦ పిల్లలపై కెరీర్ లక్ష్యాలను బలవంతంగా రుద్దకూడదు ♦ ఇకపై విద్యార్థులకు క్యారెక్టర్ సర్టిఫికెట్ బదులుగా ఆప్టిట్యూడ్ సర్టిఫికెట్ ♦ 2022 నాటికి అందరికీ నిరంతరాయంగా విద్యుత్ ♦ 'టీచర్స్ డే' కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: 'రాజకీయాలంటే ప్రజలు భయపడుతున్నారు. రాజకీయాలకు అంత చెడ్డపేరు వచ్చింది. రాజకీయాల్లో చేరేవారెవరూ మంచివారు కాదనే అభిప్రాయం ఏర్పడింది. దాంతో మంచివారెవరూ ఈ రంగంలోకి రావడంలేదు. ఈ ధోరణి దేశానికి చేటు చేస్తుంది. ఆ పరిస్థితి మారాలి. రాజకీయాల పట్ల దురభిప్రాయం పోవాలి. అన్ని వర్గాల్లోని మంచి వ్యక్తిత్వం ఉన్న, సమర్థులైనవారు రాజకీయాల్లోకి రావాలి' అని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ముఖ్యమైన అంతర్భాగమని, తెలివైన, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అవసరమని అన్నారు. అలాంటివారు ఎంతమంది రాజకీయాల్లోకి వస్తే.. దేశానికి అంత మంచి జరుగుతుందని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలను, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలంటూ విద్యార్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందువల్లనే ఆ ఉద్యమం అంత శక్తిమంతమైందన్నారు. శనివారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన 800 మంది విద్యార్థులు, 60 మంది ఉపాధ్యాయులతో మానెక్ షా ఆడిటోరియంలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గంటన్నర పైగా వారితో సరదాగా గడిపి, తన వస్త్రధారణ, విద్యార్థి జీవితం తదితరాలపై వారడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. 9 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని పదవి చేపట్టాక విద్యార్థులతో మమేకం కావడం మోదీకి ఇది రెండో సారి. లక్ష్యఛేదనలో విఫలమైతే ఆందోళన చెంది, వెనకడుగు వేయవద్దని ఈ సందర్భంగా మోదీ విద్యార్థులకు సూచించారు. అలాగే, పిల్లల కెరీర్కు సంబంధించి తమ సొంత లక్ష్యాలను పిల్లలపై రుద్దొద్దంటూ తల్లిదండ్రులకు హితవు చెప్పారు. ‘పాఠశాలను వదిలివెళ్లే సమయంలో పిల్లలకు నడవడిక సర్టిఫికెట్లు ఇస్తుంటారు. వాటికి బదులు, వారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆప్టిట్యూడ్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖకు ఆదేశించాను’ అన్నారు. ఆ సర్టిఫికెట్లలో విద్యార్థుల క్రమశిక్షణ, స్నేహపాత్రత మొదలైన వివరాలుంటాయన్నారు. వాటిని 3 నెలలకు ఒకసారి స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల నుంచే సేకరించేలా త్వరలో సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వివరాల ద్వారా విద్యార్థి తన వాస్తవ సామర్ధ్యాన్ని తెలుసుకునే, అవసరమైతే తన నడవడికను మార్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక నాణాన్ని మోదీ విడుదల చేశారు. కళల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 'కళా ఉత్సవ్' వెబ్సైట్ను ప్రారంభించారు. చెంబు ఇస్త్రీ.. చాక్పీస్ పాలిష్..: 'అందరూ అనుకుంటున్నట్లు నా దుస్తులను రూపొందించేందుకు ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ ఎవరూ లేరు. నాకు ప్రత్యేక డ్రెస్ డిజైనర్ ఉన్నారన్నది అపోహ మాత్రమే. సింపుల్గా డ్రెస్ చేసుకోవడం నాకిష్టం' అని మోదీ పేర్కొన్నారు. 'మీ కుర్తా చాలా ఫేమస్ కదా!' అన్న విద్యార్థుల వ్యాఖ్యపై.. ‘గుజరాత్ వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. అందువల్ల కుర్తా, పైజామా ధరించడం అలవాటు చేసుకున్నా. మా కుటుంబానిది చాలా సాధారణ ఆర్థిక నేపథ్యం. నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. పూర్తి చేతుల చొక్కా ఉతకడానికి ఎక్కువ సమయం పడ్తుంది కాబట్టి కుర్తా చేతుల్ని భుజాల వరకు కత్తిరించి, హాఫ్ స్లీవ్స్ కుర్తాగా మార్చుకున్నా. నాకు నీట్గా ఉండటం ఇష్టం. నా దుస్తులను బయట ఇస్త్రీ చేయించుకునేందుకు డబ్బులు ఉండేవి కాదు. అందువల్ల చెంబులో నిప్పులను వేసి, దాంతో ఇస్త్రీ చేసుకునేవాడిని. బూట్లను తెల్లగా చేసుకునేందుకు స్కూల్ నుంచి చాక్పీస్లు తెచ్చుకునేవాడిని' అని నవ్వుతూ అన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయుడి గుర్తింపు.. 'విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర. తల్లి బిడ్డకు ప్రాణం పోస్తుంది. కానీ ఆ బిడ్డకు జీవాన్ని ఇచ్చేది గురువే. పిల్లలు తమ టీచర్ చెప్పేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. విద్యార్థులే ఉపాధ్యాయుడి గుర్తింపు. ఓ డాక్టర్ ఒక ప్రాణం కాపాడితే, ఆ మర్నాడే పేపర్లలో వస్తుంది. కానీ 100 మంది డాక్టర్లను తయారుచేసే గురువుకు ఏ గుర్తింపూ రాదు. గొప్ప డాక్టర్లు, శాస్త్రవేత్తల వెనుక ఓ గొప్ప ఉపాధ్యాయుడి కృషి ఉంటుంది. టీచర్ల కృషిని గుర్తించి, గౌరవించుకునేందుకే టీచర్స్ డే జరుపుకుంటున్నాం. మాజీ రాష్ట్రపతి కలాం తనను ఒక ఉపాధ్యాయుడిగానే సమాజం గుర్తుంచుకోవాలని కోరుకునేవారు' 'ఎవరెస్టు' పూర్ణ ప్రశ్నతో ప్రారంభం నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 10వ తరగతి విదార్థిని, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ వీడియో కాన్ఫరెన్సులో ప్రధానిని అడిగిన ప్రశ్నతో విద్యార్థులతో ఇష్టాగోష్టి ప్రారంభమైంది. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి పూర్ణ గోష్టిలో పాల్గొంది. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరన్న పూర్ణ ప్రశ్నకు.. 'కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా ఊరి లైబ్రరీలో వివేకానంద జీవితం, బోధనలు చదువుకున్నాను. అవి నాపై ప్రభావం చూపాయి. టీచర్లతో సన్నిహితంగా ఉండేవాడిని. మా అమ్మ నన్ను బాగా చూసుకునేవారు. అయినా, ఏ ఒక్క వ్యక్తో మన జీవితాల్ని మార్చేస్తారనుకోవడం సరికాదు. నేర్చుకునే తత్వం ఉండాలి. రైలు ప్రయాణంలోనూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం' అని జవాబిచ్చారు. అంతకుముందు పూర్ణతో.. 'ఎవరెస్టు పర్వతం దిగివచ్చాక నీతో మిత్రులు ఎలా ఉన్నారు? నీవు చాలా గొప్ప పనిచేశావని, గొప్పదానివయ్యావని దూరంగా వెళ్లలేదు కదా? గొప్పవ్యక్తి కావడంలో గొప్ప కష్టం ఉంది' అంటూ చమత్కరించడంతో నవ్వులు పూశాయి. విద్యార్థులతో మోదీ ముఖాముఖిలోని ముఖ్యాంశాలు.. ► వేరువేరు రంగాల్లోని ఉద్ధండులు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు కనీసం వారానికి గంట కేటాయించాలి. లేదా ఏడాదికి 100 గంటలు వారికి కేటాయించేలా చూసుకోవాలి. దాంతో బోధనారంగం సృజనాత్మకమవుతుంది. (రాజకీయ నేతలు మాత్రం ఆ పని చేయొద్దు. ఏదో చెప్పాలనుకుని మరేదో బోధిస్తారంటూ చమత్కరించారు) ► మీకిష్టమైన ఆట ఏదని ఓ విద్యార్థి అడగ్గా..ఆర్థిక వనరులు అంతగా లేని కుటుంబం కావడంతో చిన్నప్పుడు ప్రత్యేకంగా క్రీడలపై దృష్టి పెట్టలేకపోయాను. చెట్లెక్కడం బాగా వచ్చు. బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లినప్పుడు చెరువులో ఈత కొట్టేవాడిని. అయినా, మా రాజకీయ నేతలు బాగా ఆడే ఆట ఏదో మీకు తెలుసుగా. ► తమ భవిష్యత్తును, జీవిత లక్ష్యాలను నిర్ధారించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలి. తాము సాధించలేని కెరీర్ లక్ష్యాలను తల్లిదండ్రులు తమ పిల్లలపై రుద్దవద్దు. దానివల్ల డిగ్రీలు, ఉద్యోగాలకే విద్యార్థుల లక్ష్యం పరిమితమవుతుంది. ► అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపును కాపాడుకోవాలి. యోగాతో వ్యక్తి ఉత్తేజితుడవుతాడు. సంవత్సరం మొత్తం మీద జూన్ 21వ తేదీన పగటి సమయం అత్యధికంగా ఉంటుంది, సూర్యరశ్మి ఎక్కువసేపు ప్రసరిస్తుంది. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాలని నిర్ణయించాం. ► దేశం 75 ఏళ్ల స్వాతంత్య్రవేడుకలు జరుపుకోనున్న 2022 నాటికి అందరికీ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ అందించడం నా స్వప్నం, దాన్నే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం. ప్రస్తుతం దేశంలో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. రానున్న 1000 రోజుల్లో ఆ గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాను. ప్రస్తుతం దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఉంది. 2015-16 నాటికి 1,137 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. ► చాలామంది కవిత్వం రాస్తుంటారు. కవితలు కొందరి కలం నుంచి జాలువారితే, మరి కొందరి కన్నీటి నుంచి వస్తాయి. నా అనుభవాలు, పరిశీలనలనే కాగితంపై పెట్టా. పరిశీలన స్వభావం, ఎక్కువ సమయం ప్రకృతితో కలిసి ఉండడం కవిత్వం రాయడానికి ఉపకరించింది(కవి ఎలా అయ్యారన్న ప్రశ్నకు..) ► వేదిక ఎక్కి ప్రసంగాలు చేసేప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తే ప్రజలు నవ్వితే నవ్వుతారు. ఆందోళన చెందవద్దు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. నోట్ చేసుకునే అలవాటు మంచిది కాదు. కాగితం పట్టుకుని చదివితే కంగారుపడిపోతాం. అవసరమైన విషయాలపై సమగ్రసమాచారాన్ని ముందే చదివి అవగాహన చేసుకోవాలి. విద్యార్ధులు పబ్లిక్ స్పీకింగ్ కోర్సులను అధ్యయనం చేయాలి. యూట్యూబ్లో ప్రసిద్ధ వ్యక్తుల ప్రసంగాలను చూడాలి. -
ఉపాధ్యాయులకు సీఎం శుభాకాంక్షలు
హైదరాబాద్: విద్యార్థులకు విజ్ఞానం, నైతిక విలువలు అందించేందుకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ ఐదును దేశవ్యాప్తంగా ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. -
‘డిటెన్షన్’ సమాజానికి చేటు!
నేడు ఉపాధ్యాయ దినోత్సవం డిటెన్షన్ పద్ధతి ఉపాధ్యాయుడికీ, విద్యార్థికీ ఇద్దరికీ నష్టమే. విద్యార్థి సాధించిన విజయాలను మూల్యాంకన చేయవద్దని నేను అనడంలేదు. కానీ అతన్ని డిటైన్ చేయడం న్యాయం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను ఉపసంహరించుకోండి. పుండు ఒకచోట ఉంటే మందు ఇంకోచోట పెట్టడం మన దేశంలో పరిపాటిగా మారింది. ఇది అనాదిగా మన విద్యా వ్యవస్థకు పట్టిన దౌర్భా గ్యం కూడా. సీబీఎస్ఈ అధికార యంత్రాంగం డిటెన్షన్ పద్ధతిని మర లా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రాల అభిప్రాయాలను కోరారు. డిటెన్షన్ ప్రవేశపెట్టి 10 ఏళ్ల కంటే ఎక్కువే అయింది. అప్పుడు విద్యావేత్తలు హెచ్చరికలు చేశారు. కేవలం డిటెన్షన్ పద్ధతే కాకుండా విద్యార్థి ప్రమాణాలు సాధించాడా? లేదా? కనుక్కొ నేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నాడు చెప్పడం జరి గింది. ఇవాళ విద్యార్థుల్లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే నెపంతో సమస్యను తిరగదోడుతున్నారు. డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతుల విద్యార్థుల్ని చదువు నుంచే కాకుండా పౌర సమాజం నుంచే దూరం చేసే ప్రయత్నం జరుగు తోంది. చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాను చెప్పిన చదువు పిల్లలకు అర్థమవుతోందో, లేదో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. అందువల్ల ఈనాడు ఉపాధ్యాయుడు, విద్యార్థి వీరిద్దరినీ ఎవాల్యుయేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థికి అర్థం కాకపోతే ఉపాధ్యాయుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. విద్యార్థికి అర్థమవడం వ్యక్తిగత విషయం. బోధన మాత్రం సామాజిక ప్రక్రియ. కొన్ని సార్లు సామూహిక ప్రక్రియ వ్యక్తికి ఉపయోగపడకపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాకపోవడానికి కారణం తెలుసుకొని, అది బోధనాపరమైన కారణమా? వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. బోధనాపరమైన కారణాలు ఉంటే ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. తరగతిలో చెప్పిన అంశం విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పే దిశగా ఉపాధ్యాయుడు ఆలోచిస్తే అతనికి కూడా కొన్ని కొత్త బోధనా పద్ధతులు తెలుస్తాయి. అది లాభమే. తప్పులు చేసిన ప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. అర్థం కాని పిల్లవాడే కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరించవచ్చు. విద్యార్థి వ్యక్తిగత కార ణాలు ఏమైనా ఉంటే అతడిని ప్రేమించేందుకు పాలకవర్గం నుంచి ప్రయత్నం జరగాలి. మన సర్కారీ బడులకు వస్తున్న వారిలో చాలా మంది విద్యార్థులు ఫస్ట్ లెర్నర్స్ కాబట్టి వ్యక్తి గతమైన కారణాలు బలమైనవి ఉండవచ్చు. ఇతర దేశాల్లో ఆ కారణాలను కనుక్కొనేందుకు యంత్రాంగాన్ని సృష్టించుకున్నా రు. పాఠశాలల్లో సరైన బోధనా పద్ధతులు, మౌలిక వసతులు కల్పించకుండా, వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైతం చొరవ చూపకుండా కేవలం పిల్లల్ని డిటైన్ చేస్తామనడం సరి కాదు. దేశంలో దారిద్య్రం తాండవిస్తోందని దరిద్రుల్ని చంపుకుం టామా? అలాగే పిల్లవాడికి చదువు రాలేదని చదువు నుంచి దూరం చేస్తామా? చదువంటే కేవలం పుస్తక పరిజ్ఞానమే కాదు. కొందరికి అకడమిక్గా రాకపోవచ్చు. అతను వేరే రంగంలో ప్రతిభాశీలి కావచ్చు. గొప్ప క్రీడాకారుడు కావచ్చు. సంగీత విద్వాంసుడు కావచ్చు. లేకపోతే ఏ చేతివృత్తిలోనో రాణించ వచ్చు. ఈ ప్రయత్నాలేవీ చేయకుండా బడి నుంచి పిల్లల్ని తొల గిస్తామనడం మన వైఫల్యాలను ప్రపంచానికి ఎత్తి చూపడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. గత పదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదు. చివరకు ఏ తరగతికి ఏ విద్యా ప్రమాణాలు కావాలో మనం సూచించ లేదు. పదో తరగతికి వచ్చిన విద్యార్థి తీరుతెన్నులను చూస్తు న్నాం. ఇతర దేశాలలో అయితే ఏ సంవత్సరానికి ఆ సంవ త్సరం విద్యార్థిని సమీక్షిస్తారు. ప్రతి తరగతికి కొన్ని ప్రమాణాలు ఏర్పా టు చేసుకున్నారు. ఆ వారంలో అవి రాకపోతే పాఠశాల తరగ తుల అనంతరం అదనపు సమయాన్ని కేటాయించి దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే విధంగా సెలవుల్లోనూ విద్యా ర్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఇవేమీ లేకుండా కనీసం విద్యార్థి ప్రమాణాల స్థాయిని పెంచేందుకు ప్రయత్నాలు చేయకుండా ఏకంగా డిటెన్షన్ విధానంతోనే విద్యార్థిని శాశ్వ తంగా బడి నుంచి పంపిస్తామనడం సమాజానికి అనర్థం. విద్యా ర్థిని ఒక్కసారి బడి నుంచి తొలగిస్తే అతడు తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. అతడు తర్వాతి జీవితంలో సృష్టించే సంపదను దేశం కోల్పోతుంది. ఈ విధంగా లెక్కవేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు వెళ్లే ప్రమాదం ఉంది. దీనితో సహా తరగతి గది ప్రమాణాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారతా యి. అర్థంకాని పిల్లవాడు కొత్త రీసెర్చ్కు కారణమవుతాడు. మనం ఒక మంచి పుస్తకం నుంచి మరో పుస్తకానికి విషయాన్ని మార్చడమే చదువు అనే భ్రమలలోనే ఉన్నాం. చదువు అంటే లెర్నింగ్. దానిపై పరిశోధనలు నిరంతరం జరగాలి. కాబట్టి డిటెన్షన్ పద్ధతి అటు ఉపాధ్యాయుడికీ, ఇటు విద్యార్థికీ ఇద్దరికీ నష్టమే. విద్యార్థి సాధించిన విజయాలను మూల్యాంకన చేయ వద్దని నేను అనడంలేదు. కానీ అతన్ని డిటైన్ చేయడం న్యాయం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను తక్షణమే ఉపసంహరించుకోండి. పేదపిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఇతర దేశాలలో చేపట్టిన అన్ని ప్రయత్నాల మీద ఇప్పటికైనా పరిశోధన చేయండి. ఇప్పటి వరకు చదువులో ఆసక్తి ప్రదర్శించిన వారి పట్లే ఎక్కువ దృష్టి పెట్టాం. ఇకనైనా వెనుకబడిన కుటుంబాల వారి పిల్లలకు నాణ్య మైన విద్యను అందించే దిశగా దృష్టి సారించండి. బడుగు, బల హీనవర్గాల పిల్లలు బడికి ఎందుకు రాలేకపోతున్నారో తెలుసు కోండి. వ్యక్తిగత కారణాలను సైతం అధ్యయనం చేసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టండి. నైపుణ్యాలు కలిగిన మానవ సంపదను పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయండి. విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరించి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కృషి చేయండి. చుక్కా రామయ్య (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
పాఠశాల విద్యార్థులతో మోదీ
-
టీచర్ అవతారమెత్తిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడిగా మారారు. రాష్ట్రపతి భవన్ శుక్రవారం పాఠశాలగా మారిపోయింది. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయకు చెందిన ఇంటర్ విద్యార్థులకు పాఠం బోధించారు. 'భారత రాజకీయ చరిత్ర' అనే అంశాన్ని పాఠ్యాంశంగా తీసుకున్నారు. అంతకుముందు తన బాల్యాన్ని గుర్తు చేసుకున్న రాష్ట్రపతి తాను ప్రైమరీ పాఠశాలకు వెళ్లే రోజుల్లో కొంత బద్ధకస్తుడినని, సాధారణ విద్యార్థిగా ఉండేవాడినని చెప్పారు. వారానికి మూడు నాలుగు రోజులు స్కూల్కి వెళితే గొప్పే అని అన్నారు. ఇంటికొచ్చిన ప్రతిసారి తాను అంతదూరం(ఐదు కిలో మీటర్లు) స్కూల్కి నడిచి వెళ్లలేనని అంటుండేవాడినని తెలిపారు. అయితే, ఇంటర్, గ్రాడ్యుయేషన్ సమయానికిగానీ తాను క్లాస్లో కుదురుకోలేకపోయానని చెప్పారు. తాము చదువుకునే రోజుల్లో చాపపై కూర్చునే వారిమని అన్నారు. ఇప్పుడు మీకు అలాంటి పరిస్థితులు లేవని చక్కగా చదుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం పాఠ్యాంశంలోకి వెళుతూ భారత దేశ స్వాతంత్ర్యం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయం, రాజ్యాంగంలోకి తీసుకున్న అంశాలు, ఆ అంశాలు కలిగిన దేశాల ప్రస్తావన చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తీరు తెన్నులు కూడా రాష్ట్రపతి విద్యార్థులకు వివరించారు. -
టీచర్ అవతారమెత్తిన రాష్ట్రపతి
-
'ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు'
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. డిజిటల్ ఇండియా గొప్ప ప్రయత్నం, కాని ఇప్పటికీ దేశంలోని చాలా గ్రామాలకు కరెంట్ లేదని ఉత్తరాఖండ్ కు చెందిన భరద్వాజ్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు పై విధంగా మోదీ సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదని మోదీ అన్నారు. ఒకసారి ఉపాధ్యాయుడిగా మారిన వారు జీవితాంతం గురువుగానే ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందన్నారు. తల్లి జన్మనిస్తుంది, గురువు జీవితాన్ని ఇస్తాడని తెలిపారు. ఉపాధ్యాయులను తనను ఎంతగానో ప్రభావితం చేశారని చెప్పారు. గొప్ప వైద్యులైనా, శాస్త్రవేత్తలైనా వారి వెనుక ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. చిన్నతనంలో తాను గ్రంథాలయంలో ఎక్కువసేపు గడిపే వాడినని వెల్లడించారు. రాజకీయ నేతలపై చిన్నచూపు తగదనన్నారు. నిస్వార్థంగా సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోని రావాలని విద్యార్థులకు సూచించారు. -
'ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు'
-
గురుపూజోత్సవాన్ని సార్థకం చేసుకుంటున్నామా?
ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినో త్సవ దినంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగి, ఆ పదవులకే వన్నెతెచ్చారు రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888-ఏప్రిల్ 17, 1975). ఉపాధ్యాయుడిగా విద్యావేత్తగా, దేశాధినేతగా, తత్వవే త్తగా, రచయితగా, వక్తగా బహుముఖ వ్యక్తిత్వం ఆయనది. అం దుకే ఉపాధ్యాయ వర్గానికి ఆయనొక మానవీయ సంకేత మయ్యారు. విద్యాభ్యాసం తరువాత రాధాకృష్ణన్ 1908లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తత్వశాఖలో సహాచార్యులయ్యారు. 1909 నుంచి ప్రధానాచార్యులయ్యారు. భగవద్గీత, బౌద్ధతత్వం, జైనతత్వం, సాంఖ్య యోగ, మీమాంస, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వ్యాఖ్యానాలపై విశేషంగా అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ప్లేటో, కెంట్, బ్రాడ్లీ, బెర్గ్సన్ లాంటి ఉత్తమ పాశ్చాత్య తాత్వికుల వాదనలన్నింటినీ సహేతు కంగా చర్చించి క్రోడీకరించి ‘ద రెయిన్ ఆఫ్ రెలిజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలా సఫీ’ అనే గ్రంథాన్ని రాశారు. అమెరికన్ ప్రొఫెసర్ ‘‘హిన్మాన్’’ ఈ గ్రంథాన్ని ఎంతగానో మెచ్చుకుని రాధాకృష్ణన్ను అమెరికన్ తత్వవేత్త ‘బోసాన్క్వెట్’తో పోల్చారు. అదే అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథమైంది. ‘ది క్వెస్ట్’, ‘ది మోనిస్ట్’, ‘ది మైండ్’, ‘జనరల్ ఆఫ్ ఫిలాసఫీ’, ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్’ లాంటి అంతర్జాతీయ పత్రికల్లో తత్వశాస్త్రంపై వ్యాసాలు రాశారు. తను రాసిన భగవద్గీత వ్యాఖ్యానాన్ని గాంధీజీకి అంకితమిచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలోని ఫిలాసఫీని గ్రంథస్థం చేశారు. ‘‘ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్’’, ‘‘ఇండియన్ ఫిలాసఫీ’’ రచిం చారు. బ్రహ్మసూత్రాలను ఇంగ్లిష్లోకి అనువదించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో పని చేసిన తరువాత 1916లో మైసూరు మహా రాజా కాలేజీలో తత్వశాఖాధ్యక్షులుగా చేరారు. 1921లో కల కత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. కాశీ విశ్వవిద్యాలయానికి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్గా పని చేశారు. కాలేజీ లలోను, యూనివర్సిటీలలోనూ ఆయన పని చేసినంత కాలం విద్యార్థులలో క్రమశిక్షణ, విద్యాలయ వ్యవహారాల్లో సమర్థత కనిపించేది. విద్యార్థు లను రాజకీయాలకు దూరంగా ఉంచేవారు. రష్యాలో భారత రాయబారిగా నియమితులైన రాధాకృష్ణన్ను నాటి రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ సయితం కలుసుకోవడం ప్రత్యేకంగా చెబుతారు. స్టాలిన్ సాధారణంగా రాయబారులను కలుసుకునేవారు కాదని ప్రతీతి. ఇలాంటి అరుదైన గౌరవాలు ఎన్నో ఆయనకు దక్కాయి. స్వయంకృషితో ఎదిగిన అసమాన ప్రతిభావంతుడు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన తత్వవేత్త రాధాకృష్ణన్ జీవితం భారతీయులందరికీ మార్గదర్శకం. (సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం) మొగుళ్ల కృష్ణారెడ్డి రామంతాపూర్, మొబైల్: 97015 47528 -
రాష్ట్రపతి మెడల్ కోసం వెళుతుంటే దొంగతనం
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్... రైల్లో చోరీ బారిన పడ్డారు. గ్వాలియర్ నగరానికి చెందిన సురేఖా సక్సేనా.. ఓ కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆమె రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఎంపిక కావడంతో ఆ అవార్డు తీసుకునేందుకు తన సోదరుడు సురేందర్ సక్సేనాతో కలసి సమతా ఎక్స్ ప్రెస్ ఏసీ టూ టైర్ రైలులో బయలుదేరారు. రైలు మధుర స్టేషన్లో ఆగగానే చాయ్ అంటూ వచ్చిన ఓ వ్యక్తి వారికి చాయ్ పోసినట్లుగా పోసి సడెన్గా ఓ స్ప్రే బాటిల్ తీసి వారిపై ప్రయోగించారు. వారు అతడిని అడ్డుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈలోపే అతడు పారిపోయాడు. అనంతరం చూసుకున్న వారికి ఆమె పర్సు, సోదరుడి గోల్డ్ వాచ్ పోయినట్లు తెలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టీచర్గా రాష్ట్రపతి!
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్కూలు విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. రాష్ట్రపతి ఎస్టేట్లోని రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయలో సెప్టెంబర్ 4న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 వరకూ బోధించేందుకు రాష్ట్రపతి అంగీకరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్, తాను ఇటీవల రాష్ట్రపతిని కలసివిజ్ఞప్తి చేయగా, ఆయన అంగీకరించారన్నారు. ఉపాధ్యాయుల గౌరవార్థం పాఠాలు బోధించాలన్న తమ ప్రభుత్వ ప్రతిపాదన రాష్ట్రపతికి నచ్చిందన్నారు. టీచర్స్ డే రోజున దేశ ప్రథమ పౌరుడు ఇలా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయడం కన్నా మించిన గౌరవం టీచర్లకు ఉండబోదన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వం ‘బీ ఏ టీచర్’ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించనుందన్నారు. -
ఇక ఉత్తమ ఉపాధ్యాయుడికి రూ.50 వేలు
న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు రూపంలో ఇచ్చే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలు చేసింది. గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికైన వారికి రూ.25 వేలు ఇవ్వగా ఇక నుంచి రూ.50వేలు అందించనున్నారు. దీంతోపాటు గతంలో మాదిరిగా ఒక సర్టిఫికెట్ వెండిపతకం ఇస్తారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ బుధవారం లోక్సభలో ప్రకటించింది. ఇది 2014 నుంచి వర్తించనుంది. గతంలో ఈ అవార్డు రూ.10 వేలుగా ఇవ్వగా దానిని 1999లో రూ.25 వేలకు పెంచారు. అప్పటి నుంచి మరోసారి పెంచడం ఇదే తొలిసారి. ప్రతి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా సెప్టెంబర్ 5న ఈ అవార్డును అందిస్తారు. ప్రాథమిక, ప్రాథమికొన్నత, ప్రత్యేక అవసరాలు తీర్చగల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఉత్తమ సేవలను అందించిన వారిని గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. వీరితోపాటు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల్లో బోధించే ఉపాధ్యయులకు సంప్రదాయ బద్ధంగా అవార్డును అందిస్తారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి
నోటిఫికేషన్ రాకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన మంత్రుల విరుద్ధ ప్రకటనతో మరింత గందరగోళం అవనిగడ్డలో వినూత్న నిరసన దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చల్లపల్లి/మచిలీపట్నం : మాటలతో మభ్యపెడుతున్న పాలకులపై డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించిన పాలకులు.. ఇప్పుడు నోరు మెదపకపోవడంపై మండిపడుతున్నారు. సిలబస్లో స్పష్టత కొరవడటం, డీఎస్సీ, టెట్ కలిసి నిర్వహించడం, పోస్టుల వివరాలు వెల్లడించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగానే శనివారం అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డీఎస్సీకి శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పోస్టుల ప్రకటనలో గందరగోళం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరిచుకుని సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మొత్తం 10,603 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కేవలం 7,000 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యా శాఖ గణాంకాలు ద్వారా తెలుస్తోంది. పిల్లలను బట్టే ఉపాధ్యాయులు ఉండేవిధంగా రేషనలైజేషన్ను ప్రకటించి పోస్టులను తగ్గించారని సమాచారం. గతంలో ప్రకటించిన పోస్టుల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎవరికెన్నో వివరించలేదు. వీటిలో ఎస్జీటీ పోస్టులే 7,500 వరకూ ఉన్నట్టు సమాచారం. డీఎస్సీకి పోటీ పడుతున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు, మరో 60వేల మంది డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. సిలబస్, టెట్ల విషయంలోనూ అంతే డీఎస్సీ సిలబస్పైనా ఇంతవరకూ స్పష్టతలేదు. డీఎస్సీ-2012 సిలబస్నే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. పాత సిలబస్ ప్రకారం రెండేళ్లుగా అవనిగడ్డలో 40వేల మందికిపైగా శిక్షణ పొందారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన 10వేల మంది శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాలు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలి వచ్చారు. ఏడాది శిక్షణ పొందేందుకు భోజనం, వసతి, ఫీజులు కలిపి ఒక్కో అభ్యర్థికి రూ.1.50లక్షలు ఖర్చు అవుతుంది. డీఎస్సీలో అంతర్భాంగా టెట్ను కలిపి 180 మార్కులకు పరీక్షలు నిర్వస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే టెట్లో అర్హత సాధించిన 3లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తారా.. లేదా.. అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అందోళనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జాప్యాన్ని నిరసిస్తూ అభ్యర్థులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అవనిగడ్డలో వినూత్న నిరసన తెలియజేశామని, వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే తొలుత జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా, అనంతరం రాజధానిలో ఆందోళనలు చెపడతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి గందరగోళానికి తెరదించాలని అభ్యర్థులు కోరుతున్నారు. జిల్లాలో 379 పోస్టులు జిల్లాలో స్కూలు అసిస్టెంట్ పోస్టులు 104, లాంగ్వేజ్ పండిట్-49, పీఈటీలు-13, ఎస్జీటీలు-213 మొత్తం 379 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రేషనలైజేషన్ ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలకు సర్ధుబాటు చేస్తే జిల్లాలో 30 ఎస్జీటీ పోస్టులే ఖాళీగా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే ఆ పోస్టును ఖాళీగా చూపే అవకాశం లేదు. దీంతో ఎస్జీటీ పోస్టులను అధికంగా చూపేందుకు అవకాశం లేదు. విద్యాశాఖాధికారులు రేషనలైజేషన్ ప్రకారం సంబంధిత ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు బదిలీ చేసినా, ఆ పోస్టులను ఖాళీగా చూపటంతో ఎస్జీటీలను 213 మందిని నియమించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఈ అంశాన్ని గమనించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ జాప్యం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకముందే టీచర్లు అవసరమైన చోట అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించిం ది. జిల్లాలో 271 పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియమిస్తారా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్కు ఆర్టికల్ 371-డి వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. ‘సుప్రీం’ తీర్పు ప్రకారమే నడవాలి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం గతంలో ఎస్జీటీలకు డీఎడ్ అభ్యర్థులను మాత్రమే అనుమతిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించేం దుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తి పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది - మెట్ల గురవయ్య, కంభం, ప్రకాశం జిల్లా మోసం చేశారు.. ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన పాలకులు మోసం చేశారు. పాలకులకు మా సమస్యలు తెలియవా. మా జీవితాలతో ఆటలాడుకోకుండా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. - పి.దావీదు, నూజివీడు పోస్టులను తగ్గించొద్దు మొత్తం 18,500 పోస్టులు ఉంటే గతంలో 10,600 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 7,500 పోస్టులకు మాత్రమే ఆమోదం లభించిందని మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రెం డేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. పోస్టులు తగ్గించకుండా గతంలో ప్రకటించిన పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. - ఎస్.నాగరాజు, చోడవరం, విశాఖ జిల్లా -
మోడీ మాస్టారు!
సంపాదకీయం సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున చాలా పాఠశాలల్లో ‘పిల్లల పిరీయడ్’ ఉంటుంది. పిల్లలే టీచర్ల అవతారమెత్తి తరగతుల్లో ‘పెత్తనం’ చేస్తారు. రోజూ తమతో వారు ఎలా వేగుతున్నారో అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. కానీ, ఈసారి ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్నారు. న్యూఢిల్లీ మానెక్ షా ఆడిటోరియంలో వేయిమంది విద్యార్థులను... దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ను వీక్షిస్తున్న మరిన్ని వేలమందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాళ్లడిగిన ప్రశ్నలకు, సందేహాలకు వారి మాటల్లోనే జవాబులిచ్చారు. ఈ క్రమంలో తానూ చిన్నపిల్లాడిగా మారారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చతురోక్తులతో వారిని అలరించారు. తనలో ఒక మంచి బోధకుడు, ఉపాధ్యాయుడు ఉన్నారని రుజువుచేశారు. ఈ కార్యక్రమమంతా పూర్తయ్యాక అసలిది ఇంత వివాదాస్పదం ఎందుకయిందని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఇందుకు నిందించవలసింది ముందుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖనే! ఆ శాఖనుంచి వివిధ విద్యాసంస్థలకు వెళ్లిన ఉత్తర్వులు, వాటి ఆధారంగా కొన్ని విద్యా సంస్థలు చేసిన హడావుడి అనవసర వివాదానికి అంకురార్పణ చేశాయి. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్కు పాఠశాలలన్నీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఆ కార్యక్రమం పూర్తయ్యాక అందులో ఎన్ని పాఠశాలలు పాల్గొన్నాయో, ఎందరు విద్యార్థులు వీక్షించారో తాము సమీక్షిస్తామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో ఉన్నది. ఈ ఉత్తర్వులు అందుకున్నాక కొన్ని పాఠశాలలు ‘విద్యార్థులందరికీ హాజరు తప్పనిసరి. గైర్హాజరైనవారిపై కఠిన చర్యలుంటాయి’ అంటూ సర్క్యులర్లు జారీచేశాయి. కొందరు గడుసు ప్రిన్సిపాళ్లు సోమవారంనుంచి జరగబోయే పరీక్షల్లో ‘మోడీ ప్రశ్నలు’, వాటికి మార్కులు ఉంటాయని హెచ్చరించారు. ఇంతా జరిగాక ఇక వివాదం రేకెత్తకుండా ఎందుకుంటుంది? నరేంద్ర మోడీ సహజంగానే వాక్పటిమ ఉన్నవారు. వినేవారిని మంత్రముగ్ధుల్ని చేయగల సత్తా ఆయనకుంది. ఆ సంగతి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అందరికీ తెలిసింది. పైగా, మధ్యతరగతి వర్గంలో మోడీపై ఇప్పుడు ప్రత్యేక అభిమానం ఉన్నది. ఆయన ప్రసంగించబోయేది పిల్లలనుద్దేశించే గనుక దాన్ని తమ పిల్లలంతా వినాలని వారు సహజంగానే కోరుకుంటారు. అటువంటప్పుడు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ బెదిరింపు లాంటి ఉత్తర్వులు పంపాల్సిన అవసరమేముంటుంది? నరేంద్ర మోడీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) నేపథ్యం ఉన్నది. అందులో పనిచేసిన అనుభవంవల్ల ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో, అందుకు ఎలా మాట్లాడాలో తెలిసివున్న వ్యక్తి. ఆయన ప్రసంగాలు ఆశువుగా మాట్లాడినట్టు ఉంటాయి తప్ప అందుకోసం ప్రత్యేకించి తర్ఫీదై వచ్చినట్టు ఉండవు. అందువల్లే పిల్లలతో ఆయన ఇట్టే కలిసిపోయారు. నైతిక విలువలు, జాతి నిర్మాణం వంటి గంభీరమైన అంశాలు చెప్పడంతోపాటు వారి స్థాయికి వెళ్లి ఎన్నో విషయాలపై వారిలో ఆలోచన రేకెత్తించారు. బాలికా విద్య గురించి అయినా, విద్యుత్ పొదుపు గురించి అయినా, పర్యావరణం గురించి అయినా ఆయన పిల్లలకు అర్ధమయ్యే భాషలో మాట్లాడారు. ఎప్పుడూ పుస్తకాలకూ, టీవీలకూ, కంప్యూటర్లకూ అతుక్కుపోవద్దని...ఆరుబయటకెళ్లి ఆడుకొని చెమట చిందించాలని సూచించారు. దీపాలు తీసి పున్నమి రాత్రులను ఆస్వాదించమన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నల్లో ఎక్కువ భాగం వారి టీచర్లో, తల్లిదండ్రులో ఎంపికచేసినవి అయివుంటాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ, చివర్లో ‘నాలో మీకేం నచ్చింద’ని మోడీ వేసిన ప్రశ్నకు వారిచ్చిన జవాబు మాత్రం అచ్చంగా వారి సొంతం. తమకు మోడీ చిన్ననాటి అల్లరే నచ్చిందని వారంతా ముక్తకంఠంతో బదులిచ్చారు. పిల్లలు కాదు... పిడుగులనేది అందుకే! మోడీ తన సంభాషణలో ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు. బోధనలో సాంకేతిక సౌకర్యాలు వినియోగించుకోమని వారికి సలహా ఇచ్చారు. దేశంలో విద్యారంగం ప్రాముఖ్యత పెరుగుతుంటే ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నదని చెప్పారు. ఆయనన్నది నిజమే. విద్యారంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. మోడీ కార్యక్రమాన్ని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రేడియోల ద్వారా మాత్రమే వినడం ఇందుకు రుజువు. విద్యాహక్కు చట్టం వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా ఈ రంగం మెరుగుపడలేదు. నిరుడు గుజరాత్, యూపీ, బీహార్లలో అడ్హాక్ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. తగిన అర్హతలున్నాయనుకుంటే నేరుగా ఉపాధ్యాయులుగానే తీసుకోవచ్చును కదా...‘శిక్షా సహాయక్’ల పేరుతో నియమించి అరకొర వేతనాలు ఎందుకిస్తున్నారని నిలదీసింది. అర్ధాకలితో, భవిష్యత్తుపై బెంగతో పనిచేసే టీచర్లనుంచి మెరుగైన విద్యాబోధన ఆశించడం ఎలా సాధ్యమో ప్రభుత్వాలు ఆలోచించాలి. వచ్చే జీతం చాలక ఉపాధ్యాయుల్లో కొందరు రియల్ఎస్టేట్, చిట్ఫండ్ వ్యాపారాలవంటివి చేస్తున్నారని ఆమధ్య ఒక నివేదిక తెలిపింది. ఎన్నో పాఠశాలలు తగిన భవనాలు లేక, ఉన్నా అవి శిథిలావస్థకు చేరుకుని చెట్లకింద కాలక్షేపం చేస్తున్నాయి. ఇక నల్లబల్ల, బెంచీలు వంటివి లేని పాఠశాలలు ఎన్నో! ఎందుకనిపించిందోగానీ... బాలల దినోత్సవం (నవంబర్ 14) నాడు కాకుండా ఉపాధ్యాయ దినోత్సవం రోజున పిల్లలతో మాట్లాడాలని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. బాగుంది. అయితే, ఈ విద్యారంగం సమస్యలన్నిటిపైనా ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించగలిగితే ఆ పిల్లల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. -
సీఎంకు సాదర స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం స్థానిక విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. గుంటూరులో జరిగే టీచర్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చారు. విమానాశ్రయంలో సీఎంకు మంత్రులు రావెల కిషోర్బాబు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, వైస్ చైర్మన్ రమణ, జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం గుంటూరు బయలుదేరి వెళ్లారు. గుంటూరులో కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
లెర్నింగ్పైనా దృష్టిపెట్టండి
గురుపూజోత్సవంలో కలెక్టర్ విజయవాడ : ఉపాధ్యాయులు టీచింగ్పై కాకుండా లెర్నింగ్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు అన్నారు. విద్యారంగంలో కృష్ణా జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయనపై గౌరవానికి నిదర్శనమన్నారు. సమాజం, ప్రభుత్వం కలిసి నిర్వహించేది టీచర్స్ డే ఒక్కటేనని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత సంబంధిత బృందానికి దక్కుతుందని, విఫలమైతే ఇందుకు బాధ్యులను ఒకరిద్దరై నెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. తమ బోధనల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి మన జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ నిధులు కేటాయిస్తోందని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న ప్రగతిని సాధించలేక పోవడం దురుదృష్టకరమన్నారు. ప్రపంచ దేశాలలో విద్యా ప్రమాణాలను ‘పాసా’ విధానాన్ని కొలమానంగా తీసుకుంటారని, దాని ప్రకారం మన దేశం వెనుకబడి ఉందని తెలిపారు. అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ మార్కులే పరమావధిగా విద్యా బోధన చేయటం సరికాదన్నారు. విద్యార్థులలో సామాజిక, నైతిక విలువలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అవార్డులు అందుకుంటున్న ఉపాధ్యాయులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని హితవుపలికారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, రాజీవ్ విద్యా మిషన్ ఇన్చార్జ్ పీవో పుష్పమణి, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్ఎంజే నాయక్, జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రధానితో బ్రేక్ఫాస్ట్ చేశా!
అన్నానగర్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిఏటా సీబీఎస్ఈ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అందించే జాతీయ అవార్డు ఈ సారి నగరానికి చెందిన పీఎస్ సీనియర్(మైలాపూర్) సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీశ్రీనివాసన్ను వరించింది. ఈ మేరకు ఆమె గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మానవ వనరుల విభాగం మంత్రి స్మృతి ఇరానీ తనను స్వయంగా రిసీవ్ చేసుకున్నారని ఆమె ఫోన్ద్వారా నగరంలోని విలేకరులకు తెలిపారు. శుక్రవారం ఉదయం అవార్డుకు ఎంపికైన సీబీఎస్ఈ అధ్యాపకులను ప్రధానమంత్రి మోడీ తనతో అల్పాహార విందుకు ఆహ్వానించారని తెలిపారు. అధ్యాపకురాలినైనందుకు తాను గర్వపడుతున్నానన్నారు. శుక్రవారం స్మృతిఇరానీ చేతుల మీదగా తాను ఈ అవార్డును అందుకున్నట్టు తెలిపారు. తనతో పాటు మరో 50 మంది టీచర్లు అవార్డు అందుకున్నట్టు ఆమె వెల్లడించారు. -
మార్కులు కాదు.. మేధస్సు ముఖ్యం
షాద్నగర్ రూరల్: ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మేధస్సు పెరుగుతుందని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కాదని, మేధస్సు ముఖ్యమని చెప్పారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద జూనియర్ కళాశాల ఆవరణలో ఆవోపా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాంకు కళాశాల విద్యార్థులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెప్పాలనే ఆలోచన, విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. భూమిపై ఉన్న జీవరాశులకు స్పందించే తత్వం మాత్రమే ఉందని, ఆలోచించే శక్తి ఒక్క మానవుడికే ఉంద న్నారు. పూర్వకాలంలో విద్యను ఆభ్యసించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేడు అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. నైజాం కాలంలో ప్రజలను చైతన్యం చేయడానికి సావిత్రిభాయి రహస్యంగా చదువు నేర్పించారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే చదువు ఎంతో ముఖ్యమన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రతి గ్రామంలోని నాయకులు, యువజన సంఘాలు పూర్తిస్థాయిలో సహకరించినపుడే అది సాధ్యమవుతుందన్నారు. మొగిలిగిద్ద ప్రభుత్వ కళాశాలకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని, దీన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం కోదండరాం తన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రుమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మన్న, బండారి రమేష్, పాతూరి వెంకట్రావు, బెజుగం రమేష్, మలిపెద్ది శంకర్, నందకిశోర్, దొంతుపాండు రంగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
నేనో టాస్క్ మాస్టర్ని!
హార్డ్ వర్క్ చేస్తాను.. చేయిస్తాను పిల్లలూ వెన్నెల్లో ఆడుకోండి 2024 వరకు నా ప్రభుత్వానికి ఢోకాలేదు: ప్రధాని మోడీ న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భావి భారత పౌరుల భావనలను అర్థం చేసుకునేందుకు వారిలో ఒకడిగా మారారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. పిల్లల్లో పిల్లాడిలా కలసిపోయారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చలోక్తులు విసురుతూ నవ్వులు పంచారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘మోడీ సర్’గా మారారు. విద్యారంగానికి సంబంధించినంతవరకు బాలికావిద్య తన అత్యంత ప్రాథమ్యాంశమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు బాలికల ఇళ్లకు దగ్గరలో పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరానన్నారు. అన్ని పాఠశాలల్లో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని మానెక్షా ఆడిటోరియంలో ఎంపికచేసిన వెయ్యిమంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని, అనంతరం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని ఇచ్చిన సమాధానాలను దాదాపు అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తానొక టాస్క్ మాస్టర్నని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ‘నేనొక పని రాక్షసుడిని. చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఇతరులతోనూ చేయిస్తాను’ అన్నారు. దేశంలో విద్యారంగ ప్రాముఖ్యత పెరుగుతోందని, అదేసమయంలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని ప్రధాని అన్నారు. అందువల్ల చదువుకున్నవారంతా బోధనను ఒక ఉద్యమంలా చేపట్టి జాతి నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. బోధనలో సాంకేతిక సౌకర్యాల్ని ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలని, అలా చేయకపోతే సామాజిక నేరంగా పరిగణిస్తామని మోడీ హెచ్చరించారు. పాఠ్యపుస్తకాలు, టీవీ, కంప్యూటర్లలో పిల్లల జీవితం నలిగిపోవద్దని, జీవితంలో ఆటపాటలు ఉండాలన్నారు. గూగుల్లో సమాచారం లభిస్తుంది కానీ.. జ్ఞానం లభించదని వ్యాఖ్యానించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు ప్రధాని నివాళులర్పించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మోడీ ప్రసంగ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. కేరళలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని చానెల్లో కూడా ఆ కార్యక్రమం ప్రసారం చేయలేదు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. టీచర్లు కొవ్వొత్తుల్లాంటి వారని, ప్రతిఫలాపేక్ష లేకుండా తాము కాలిపోతూ వెలుగులను వెదజల్లుతారన్నారు. విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి మణిపూర్కు చెందిన ఒక విద్యార్థి తాను ప్రధాని కావాలంటే ఏం చేయాలని అడగ్గా.. .‘నువ్వు తప్పకుండా అవుతావు. ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను పొందిన ఎవరైనా అవుతారు. మరో పదేళ్ల పాటు నా ప్రభుత్వమే ఉంటుంది. అప్పటివరకు నాకు భయంలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కా. నీ ప్రమాణానికి నన్నుపిలువు’ అని నవ్వారు. బాల్యాన్ని కోల్పోకండి. పఠనాభిలాషను పెంచుకోండి. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. నైపుణ్యాలను పెంచుకోండి. వ్యక్తిత్వాన్ని రూపొందించుకోండి. విద్యుత్ పొదుపు, జల సంరక్షణ కూడా దేశసేవయే. మీరు ఇంట్లో చేసే విద్యుత్ పొదుపుతో బిల్లు తగ్గడమే కాదు, ఒక పేదవాడింట్లో దీపం వెలుగుతుంది. దీపాలార్పేసి పున్నమి రాత్రుల్ని ఆస్వాదించండి. {పధాని అవుతానని నేనెన్నడూ అనుకోలేదు. నా కుటుంబ నేపథ్యం అలాంటిది. స్కూల్ లీడర్గా కూడా నేనెన్నడూ పోటీ చేయలేదు. జపాన్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాలను శుభ్రం చేసుకుంటారు. విద్యార్ధి దశలో అల్లరి పనులు చేయని వారుంటారా..? నేనూ చేశా.పెళ్లిలో సన్నాయి వాయించే వ్యక్తి ముందుకు వెళ్లి చింతకాయ చూపించేవాళ్లం. ఆయన నోరూరి వాయించేవాడు కాదు. పక్కపక్కనిల్చున్నవారి దుస్తులను కలిపి పిన్ను కొట్టేవాళ్లం. తల్లి తన పిల్లల్ని చూసినట్లుగా.. ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ఒకేరకంగా చూడాలి. వివక్ష ప్రదర్శించకూడదు.వాతావరణం మారలేదు.. మనమే. మన అలవాట్లు మారాయి. ప్రకృతితో పోరాడుతున్నాం. అందువల్లే మన పర్యావరణం నాశనమైంది. ప్రకృతిని ప్రేమించండి. {పధాని అయిన తరువాత జాగ్రత్తగా ప్రసంగించాల్సి వస్తోంది. నా మాటల వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదు కదా! {పధాని కావడం వల్ల వ్యక్తిగతంగా నాలో ఏ మార్పు లేదు. బాధ్యత మాత్రం పెరిగింది. నన్ను నేను ఇంకా ఆవిష్కరించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు నేనెవరో నేను తెలుసుకోలేకపోయాను.టెక్నాలజీ విద్యార్ధుల వరకు చేరాలి. ఇంటర్నెట్, బ్రాడ్బాండ్ కనెక్టివిటీ ద్వారా కొత్త విషయాలపై అధ్యయనంఅలవాటవుతుంది.ప్రతీ విద్యార్ధి శుభకార్యాలకు టీచరును పిలవాలి. -
అంగరంగ వైభవం
సాక్షి, గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా గుంటూరు వేదికగా శుక్రవారం రాష్ట్ర స్థాయి గురుపూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని 177 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించారు. నిర్ణయించిన సమయాని కంటే ఆలస్యంగా 11.54 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లక్ష్మణరెడ్డి, మునికృష్ణారెడ్డిలను సీఎం ఘనంగా సత్కరించారు.మంత్రి రావెల కిశోర్బాబు గురుపూజోత్సవ వేడుకలు గుంటూరులో నిర్వహి ంచడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలు తీవ్ర సంక్షోభం లో ఉన్నాయని, వాటిని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలని కోరారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ గుం టూరును ఆధునిక దేవాలయాల ఖిల్లాగా అభివర్ణించారు. రాజకీయాల్లో విలువలు నేర్పిన తమ గురువు చంద్రబాబును ఇప్పుడు సన్మానించుకుంటున్నట్టు చెప్పారు. ఆకట్టుకోలేకపోయిన సీఎం ప్రసంగం... ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం సభికులను ఆకట్టుకోలేకపోయింది. విద్యకు సంబంధించిన అంశాల కంటే ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రసంగం మధ్యలోనే కొందరు లేచివెళ్లిపోవడం కనిపించింది. 54 నిమిషాలకు పైగా ప్రసంగించిన సీఎం విద్యార్థులు,టీచర్లలకు ట్యాబ్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఓ దశలో వేదిక వద్దకు కొంత మంది మహిళలు దూసుక వచ్చి వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని నినాదించారు.‘షార్’ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, సాహితీవేత్త గరికపాటి నరసింహరావు ప్రసంగాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. శ్రమించిన అధికారులు.. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. చివరకు చిన్న చిన్న లోటు పాట్లు మినహా కార్యక్రమం యావత్తూ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమ విజయవంతానికి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విశేష కృషిసల్పారు. వారితోపాటు డ్వామా, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు ఢీల్లీరావు, ప్రశాంతి, ఆర్అండ్బీ ఈఈ మహేశ్వరరెడ్డి, ఆర్డీఓలు, అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఐజి సునీల్ కుమార్, రూరల్ ఎస్పీ పీహెచ్డి రామకృష్ణ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లాకు సంబంధించి విద్యా శాఖ అధికారులు సైతం సభను చక్కగా నడిపిం చడంలో తమ వంతు పాత్ర పోషించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులు నీలం సహాని, కె.సునీత, జయలక్ష్మి, ఉషారాణి, అజయ్జైన్,అథర్సిన్హా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రసంగం చాలా బాగుంది!
మోడీ ముచ్చట్లపై సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని నగరంలోని లక్షలాదిమంది విద్యార్థులు విన్నారు. ఈ సందర్భంగా నగరంలోని సుమారు 3 వేల పాఠశాలల విద్యార్థులు టీవీ, రేడియో, ఇంటర్నెట్ ద్వారా ప్రధాని ప్రసంగాన్ని ఆలకించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కొన్ని స్కూళ్లలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రధాని ప్రసంగపాఠం అన్ని పాఠశాలల విద్యార్థులు వినేందుకు వీలుగా ఆయా పాఠశాలల్లో టీవీ, రేడియో, ప్రొజెక్టర్, సెట్అప్ బాక్స్లు, స్క్రీన్లు, జెనరేటర్ తదితర పరికరాలను యాజ మాన్యాలు సమకూర్చుకున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో మొదటి అరగంట విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమం పూర్తయిన తర్వా త పాఠశాలల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ ప్రధాని కార్యక్రమం వినూత్నంగా ఉందని.. తమకు చాలా నచ్చిందని తెలిపారు. తాను ప్రధానిని ఒక ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అవకాశం రాకపోవడంతో కొంచెం బాధగా ఉందని చాందినీచౌక్ ప్రాంతంలోని ప్రభు త్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అక్షత్ శర్మ చెప్పాడు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ సందర్భంగా పీఎంను ప్రశ్న అడిగే అవకాశం దక్కింది. వారి ప్రశ్నలకు మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో ఆయన ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్రపై మాట్లాడారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, ప్రస్తుతం దేశం టీచర్ల కొరతను ఎదుర్కొంటోందని,ఆ పరిస్థి తి మారాలని అన్నారు. కాగా, ఢిల్లీ విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నగరంలో ఉన్న 3 వేల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు పది లక్షల మంది విద్యార్థులు ప్రధాని మోడీ ప్రసంగాన్ని విన్నారని తెలిపారు. వీరిలో చాలామంది విద్యార్థులు ప్రధానితో ముఖాముఖిని బాగుందని చెప్పగా, ప్రధాని మాట్లాడిన హిందీ అర్ధం కాక బోర్ కొట్టిందని మరికొంతమంది చెప్పడం గమనార్హం. ‘విద్యార్థులతో ముఖాముఖి అనగానే ఇది మామూ లు రాజకీయ నాయకుల ప్రసంగంలాగే ఉంటుందిలే అనుకున్నా.. అయితే ప్రధాని తన అనుభవాలను చెప్పడంతో చాలా ఆసక్తిగా విన్నా..’ అని మండీ మార్గ్లోని హర్కోర్ట్ బట్లర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న రోహన్ సింగ్ చెప్పా డు. అయితే అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థి రోహన్ అభిప్రాయంతో విభేదించాడు. ప్రధాని తన ప్రసంగంలో హిందీలోని చాలా క్లిష్టమైన పదాలు వాడారని, దాంతో వినడానికి బోర్ కొట్టిందని వ్యాఖ్యానించాడు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ‘ప్రధాని చెప్పిన సామెతల్లో వాడిన హిందీ పిల్లలకే కాదు కొందరు ఉపాధ్యాయులకు కూడా అర్థం కాని విధంగా ఉంది.. విద్యార్థులతో మాట్లాడేటప్పుడు వారికి అర్థమయ్యే భాషే వాడుంటే బాగుండేది..’ అని అన్నాడు. తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు.. అయితే ఈ కార్యక్రమం తర్వాత విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు ఇళ్లకు పోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం రద్దీ సమయంలో విద్యార్థులకు కావాల్సినన్ని డీటీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. నగరంలో సాధారణంగా, చాలామంది తల్లిదండ్రులు సాయంత్రం కార్యాలయాలనుంచి వస్తూ పిల్లల కోసం స్కూళ్లకు వెళ్లి తమతోపాటు తెచ్చుకుంటారు. అయితే ఈ రోజు పిల్లల కోసం చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న తల్లిదండ్రులు కార్యాలయ పనివేళలకంటే ముందుగానే బయటపడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, కార్యక్రమానికి విద్యార్థులను చేరవేసేందుకు పలు ప్రాంతాల్లో సుమారు 1,000 బస్సులను నడిపిన డీటీసీ, కార్యక్రమం పూర్తయిన తర్వాత వారిని తిరిగి గమ్యస్థానాలకు చేర్చడానికి బస్సులు నడిపేందుకు నిరాకరించింది. ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేయడం తమ వల్లకాదని చేతులెత్తేసింది. కాగా, ప్రధాని కార్యక్రమాన్ని పాఠశాల సమయంలో ఏర్పాటుచేసి ఉంటే బాగుండేదని, అప్పుడు ఇన్ని సమస్యలు ఏర్పడి ఉండేవి కావని ఒక విద్యార్థిని తండ్రి వ్యాఖ్యానించాడు. అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యాశాఖ తీరును తప్పుపట్టాయి. పీఎం ప్రసంగం ప్రసారానికి కావాల్సిన ఏర్పాట్లను తప్పనిసరిగా చేసుకోవాలని, అలా చేసుకోని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని రెండు రోజుల కిందట ఢిల్లీ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
నా పదవికి ఎలాంటి ముప్పు ఉండదు: మోడీ
న్యూఢిల్లీ: భారత దేశానికి ప్రధాన మంత్రి కావాలంటే ఏమి చేయాలి అంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఓ విద్యార్ధి ప్రశ్నించారు. విద్యార్ధి ప్రశ్నకు బిగ్గరగా నవ్వుతూ.. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలు ప్రిపేర్ అవ్వండి. అప్పటి వరకు నా పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. మీలో ఎవరైనా ప్రధానమంత్రి అయితే.. ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వనించండి అంటూ విద్యార్ధులకు మోడీ విజ్క్షప్తి చేశారు. గురు పూజోత్సవం సందర్బంగా ఢిల్లీలోని మానెక్ షా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్ధులతో ముఖాముఖీ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గూగుల్ తో సమాచారం దొరుకుతుంది కాని విజ్క్షానం లభించదు అని అన్నారు. -
వారంలో ఒక్కరోజు అంతా పాఠాలు చెప్పండి: మోడీ
భారతదేశ భావికలలన్నీ మోస్తున్న పిల్లలతో మాట్లాడే అవకాశం లభించినందుకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీ మానెక్షా ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన దేశంలోని 18 లక్షల పాఠశాలల్లో ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ''ఎప్పటికప్పుడు మారుతుండాలి. ఎలా మారాలో అందరూ ఆలోచించాలి. చాలా సమర్థులైన విద్యార్థులు ఎందుకు ఉపాధ్యాయులు కావాలనుకోవడం లేదో అంతా చూడాలి. మంచి టీచర్లకు చాలా డిమాండ్ ఉంది. భారత్ యువదేశం. మన దేశం నుంచి మంచి టీచర్లను ఎగుమతి చేయగలమన్న విశ్వాసం మనం ఇవ్వలేమా? నేను కూడా మంచి ఉపాధ్యాయుడినయ్యి.. దేశానికి సేవ చేయగలనన్న భావన విద్యార్థులలో నెలకొల్పలేమా? సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి మంచి సేవ చేశారు. ఆయన తన జయంతి చేయొద్దని, ఉపాధ్యాయ దినోత్సవం చేయాలని దేశానికి చెప్పారు. గొప్పవాళ్లందరి జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లి, గురువులే ప్రధానపాత్ర పోషిస్తారు. చిన్న గ్రామంలో ఎవరికైనా మంచి గౌరవం ఉందంటే.. అది కేవలం ఉపాధ్యాయుడికే. ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకోలేని విషయాలు కూడా ఉపాధ్యాయులకు చెప్పుకోగలం. టీచర్లంటే విద్యార్థుల పాలిట హీరోలు. మీరు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా.. వారంలో ఒక్క రోజు.. ఒక్క గంట పాటు వెళ్లి ఏదో ఒక పాఠశాలలో పాఠాలు బోధించండి. అన్ని రకాల శక్తులు కలిసి విద్యార్థులకు తమ విజ్ఞనాన్ని అందిస్తే మంచిది. మంచి లక్ష్యాలు ఉంటే.. పరిస్థితులు ఏ ఒక్కరినీ ఆపలేవు. భారతదేశంలో పిల్లలకు కావల్సినంత సామర్థ్యం ఉంది. మీలో ఎంతమందికి ప్రతిరోజూ చెమట పడుతుంది? ఒక్కళ్లకు కూడా లేదు కదూ.. ఆటపాటలు లేకపోతే జీవితం అసంపూర్ణమే. ఈ వయసులో కనీసం రోజుకు నాలుగైదు సార్లు ఒంటినిండా చెమట పట్టాలి. అస్తమాను పుస్తకాలు చదవడం, టీవీలు, కంప్యూటర్లు చూడటం.. ఇదే జీవితం కాదు.. దీనికంటే చాలా ఉంది. తరగతి పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదివేవాళ్లు ఎంతమంది ఉన్నారు? జీవిత చరిత్రలు ఎంతమంది చదువుతారు... ఇది చాలా తక్కువే. ఇప్పుడు పనులన్నీ గూగుల్ గురువే చేస్తారు. ఏ సమస్య ఉన్నా గూగుల్ గురువే చెబుతుంది. అది సరికాదు. గురుముఖతః నేర్చుకుంటే మంచిది'' అని ఆయన చెప్పారు. -
యాపిల్ కంపెనీ మనదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి.. యాపిల్ కంపెనీకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఊ అన్నా.. ఆ అన్నా కూడా ఆయనకు యాపిల్ ఐప్యాడ్లే గుర్తుకొస్తున్నాయి. అవి దేనికి ఉపయోగపడతాయో, ఎందుకు ఉపయోగపడతాయో కూడా ఆలోచించకుండా ఎడాపెడా ఐప్యాడ్లు ఇచ్చేస్తానంటూ చెబుతున్నారు. నిన్న కాక మొన్న రైతులకు ఐప్యాడ్లు ఇస్తానన్న సీఎం.. తాజాగా ఉపాధ్యాయులకు కూడా అదే వరం ప్రకటించేశారు. ఉపాధ్యాయ దినోత్సవం చేయడంలో తనకు తానే సాటి అని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా.. వాటిని కాదనుకుని మరీ గుంటూరులో జరుగుతున్న గురుపూజోత్సవానికి హాజరయ్యానని చెప్పారు. మండలానికో ఉత్తమ ఉపాధ్యాయుడిని, ఉత్తమ విద్యార్థిని ఎంపిక చేస్తామని, విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ కింద ప్రతినెలా స్టైపండ్ ఇస్తామని తెలిపారు. అవన్నీ బాగానే ఉన్నా.. ఉపాధ్యాయులకు, రైతులకు ఐప్యాడ్లు ఎలా ఉపయోగపడతాయన్నది మాత్రం ఇంకా బ్రహ్మపదార్థంగానే ఉంది. -
'సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఎండీగా ఉన్నారు'
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ కు ఎండీగా మన తెలుగువాడు ఉన్నాడని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎండీగా తెలుగువాడైన సత్య నాదెళ్ల ఉండడం మనకెంతో గర్వకారణమని ఆయన అన్నారు. అయితే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో వ్యవరిస్తుండగా ఎండీ అని చంద్రబాబు చెప్పడంతో సభలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు సీఈవోనని చెప్పుకున్న చంద్రబాబు ఆ విషయంలోనే పొరబడడం గమనార్హం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఐటీకి తానెంతో ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. తనవల్లే తెలుగువారు ఐటీ రంగంలో దూసుకుపోతున్నారని చెప్పుకున్నారు. హైదరాబాద్ ను తాను అభివృద్ధి చేయడం వల్లే ఇప్పుడు అక్కడ పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని చెప్పారు. ఏపీలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. -
'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా'
హైదరాబాద్: అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికైనా మొదటి బడి అమ్మ ఒడి అని ఆయన వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గురువులు పెట్టిన అక్షరభిక్ష వల్లే తానీ స్థాయిలో ఉన్నానని అన్నారు. తమను తీర్చిదిద్దిన ఘనత గురువులదే అన్నారు. మృత్యుంజయ శర్మ దగ్గర తాను విద్య నేర్చకున్నానని గుర్తు చేసుకున్నారు. ఫీజు తీసుకోకుండా తనకు ఆయన పాఠాలు చెప్పారన్నారు. 9వ తరగతిలో చంపకమాల పద్యం రాశానని వెల్లడించారు. దేశానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో సేవ చేశారని కేసీఆర్ కొనియాడారు. సర్వేపల్లి ఏకసంధాగ్రహి అని చెప్పారు. గురువులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా'
-
గురువుకు వందనం
అమ్మనాన్నలు వేలు పట్టుకుని నడక నేర్పితే.. గురువు చేయిపట్టుకుని అక్షరాలు దిద్దించడమే గాక నడత నేర్పి బంగరు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి విశిష్ట స్థానం గురువుది. నేడు గురుపూజోత్సవం. బోధనా వృత్తిలో కొనసాగుతూనే సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో తమకంటూ ప్రత్యేక తను సంతరించుకున్నవారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారిలో పలువురి గురించి.. నేడు గురుపూజోత్సవం గురుబ్రహ్మ, గురుర్విష్టు: గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ కడప కల్చరల్ : మన సంస్కృతి వేదకాలం నుంచి గురువుకు విశిష్ఠ స్థానం ఇచ్చింది. తల్లి, తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని గురువుకే దక్కింది. కౌరవ, పాండవుల గురువు ద్రోణాచార్యులు శ్రీకృష్ణ కుచేలుని గురువు సాందీపుడు, స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్యులు, రామానుజా చార్యులకు విశిష్ఠ గురువులుగా పేరుంది. బోధనా వృత్తి నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాధారణ గురువుగా జీవితాన్ని ప్రారంభించారు. తన అసాధారణ మేథస్సుతో భారత రాష్ట్రపతిగా గౌరవం పొందిన ఏపీజే అబ్దుల్ కలాం ఉత్తమ శ్రేణి గురువుగా పేరు గాంచారు. సామాన్య ఉపాధ్యాయుడి నుంచి దేశానికి రెండో రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయి గౌరవం పొంది గురువు స్థానానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కల్పించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబరు 5న గురుపూజోత్సవంగా, ఉపాధ్యాయ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. విశిష్ఠ సేవలందించిన వారిని ఆ రోజున జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఘనంగా సత్కరించి ఆహ్వానిస్తోంది. కేవలం ఉపాధ్యాయునిగా తమ బోధనలతో విద్యార్థులకు జ్ఞాన ప్రదానం చేయడమే గాక, ఇతర రంగాల్లోనూ తమ ప్రతిభను చాటి ఇటు విద్యార్థుల్లో స్పూర్తి నింపడమే గాకుండా అటు ఉపాధ్యాయ లోకానికి కీర్తి కిరీటాలుగా నిలిచిన వారూ జిల్లాలో ఎందరో ఉన్నారు. కవులు, రచయితలు శివతాండవ కర్త, సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శివభారత కర్త గడియారం వేంకట శేషాచార్యులు ఉపాధ్యాయులుగా ఉంటూనే ఉన్నత శ్రేణి కవులుగా వెలిగారు. అవధానం చంద్రశేఖర్శర్మ, మహాకవి భూతపురి సుబ్రమణ్యశర్మ, బ్రౌన్ ఊహా చిత్ర శిల్పి మైనంపాటి సుబ్రమణ్యం, సాహితీవేత్త ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, అవధాని నరాల రామారెడ్డి, సీపీ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాత డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కూడా బోధనా రంగానికి చెందిన వారే. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి బోధనా వృత్తితో పాటు సాహితీ రంగంలో పేరుగడించారు. ప్రస్తుతం కథ, నవలా రంగాల్లో విశేష ప్రతిభ చాటుతున్న సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, వేంపల్లె గంగాధర్, తవ్వా ఓబుల్రెడ్డి ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. ఉర్దూలో ఉర్దూ భాషకు సంబంధించి కడపలో పలువురు కవులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరంతా బోధకులే కావడం విశేషం. వారిలో డాక్టర్ రాహి ఫిదాయి, సత్తార్ఫైజీ, షకీల్ అహ్మద్, హిందీ భాష సేవకుడిగా ఫర్హతుల్లా ఉపాధ్యాయులుగా ఉంటూనే ఆయా రంగాల్లో ప్రతిభ చాటారు. సమాజ సేవలో మరికొందరు ఉపాధ్యాయులు సమాజిక సేవకులుగా ఉపాధ్యాయ లోకానికి గౌరవం తెచ్చిపెట్టారు. శాంతిసంఘం ప్రధాన కార్యదర్శిగా రాజారత్నం ఐజాక్, ఇంటాక్ కన్వీనర్గా పర్యావరణ అభివృద్ధి, జిల్లాలోని వారసత్వ కట్టడాల పరిరక్షకునిగా సిద్దవటం సీతారామయ్య, ఇంటాక్ ప్రస్తుత బాధ్యులు ఎలియాస్రెడ్డి, జిల్లాలో రక్తదాన ఉద్యమకర్త బోగా చిన్నయ్య కూడా బోధనా రంగానికి చెందిన వారే. -
బోధన ఒక వృత్తి కాదు..అదొక జీవన ధర్మం:నరేంద్రమోడీ
జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులతో మోడీ ముచ్చట్లు సాక్షి, న్యూఢిల్లీ: విద్యా బోధన అనేది ఒక వృత్తి కాదని.. ఒక జీవన ధర్మమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. ఉపాధ్యాయులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అవగతం చేసుకుని.. కొత్త తరాన్ని అందుకు అనుగుణంగా సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నుంచి జాతీయ అవార్డులు అందుకోనున్న 350 మంది ఉపాధ్యాయులను ప్రధాని గురువారం కలిసి మాట్లాడారు. ‘‘ఒక సమాజం ప్రగతి సాధించాలంటే ఉపాధ్యాయులు కాలం కన్నా ఎల్లప్పుడూ రెండడుగులు ముందు ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అవగతం చేసుకుని.. కొత్త తరంలో ఆసక్తిని రేకెత్తించటం ద్వారా వారిని తగినవిధంగా సిద్ధం చేయాలి’’ అని ఆయన ఈ సందర్భంగా వారితో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు కూడా విద్యాబోధనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. టీచర్స్డే సందర్భంగా ప్రధాని శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులను కలవనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో వీక్షించేందుకు దేశమంతటా పాఠశాలల్లో విద్యార్థులను సమావేశపరచాలని సూచించారు. -
గత వైభవానికి పునరంకితం
తత్వశాస్త్ర ఆచార్యుడిగా విద్యార్థులను పరవశింపజేసిన అత్యుత్తమ గురువు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయాలి. వృత్తులన్నింటికీ మూలమైనది బోధనావృత్తి, సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, పాలనారంగ ప్రముఖులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, మంత్రులు, ప్రధాన మంత్రులు అందరినీ తీర్చిదిద్దే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒక సందర్భం లో, జాతీయోద్యమ నేత బాలగంగాధర తిలక్ ‘‘నేను ప్రధాని కావాలని కోరుకోవడం లేదు. అవకాశం ఉంటే అధ్యాపకుడిగా కొనసాగాలని అనుకుంటున్నాను. ఎందరో ప్రధానులను తీర్చిదిద్దగల అవకాశం అధ్యాపకుడికి మాత్రమే ఉంటుంది’’ అని చెప్పిన అభిప్రాయం అధ్యాపక వృత్తి ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది. ‘‘ఉపాధ్యాయులు ఉన్నత పదవుల్లో ఉన్న విద్యార్థులను గూర్చి గర్వంతో ఉప్పొంగడం కన్నా తమ నిర్లక్ష్యానికి గురై అగమ్యంగా రోడ్లపై తిరిగే వారిని గూర్చి ఆలోచించి, సంస్కరించే ప్రయత్నం చేయుట కర్తవ్యం’’ అంటారు మదర్ థెరిస్సా. ‘‘ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని గుర్తు చేయవలసిన స్థితి శోచనీయం. వారు తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి న్యాయం చేయాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ ఉపాధ్యాయులు.ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువు. విజ్ఞాన కల్పతరువు. ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుత్తణిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన ఏక సంథాగ్రాహి. మైసూర్ విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (1931-36) బెనారస్ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా (1936-39) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి విద్యావేత్తల ప్రశంసలందుకున్నారు. యూజీసీ చైర్మన్గా భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్నో సంస్కరణాత్మక సూచనలు చేశారు. తత్వవేత్తగా ‘భారతీయ తత్వశాస్త్రం’, ‘ఎతిక్స్ ఆఫ్ వేదాంత’, ‘ఈస్ట్రన్ రెలిజియన్’, ‘వెస్ట్రన్ థాట్’ వంటి గ్రంథాలు వ్రాసి, పాశ్చాత్యుల ప్రశంసలు పొందారు. భారత రాజ్యాం గ పరిషత్ సభ్యులుగా, రష్యా రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా గొప్ప రాజ నీతిజ్ఞులు అనిపించుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి అమేయమైన ప్రతిభతో, అపారమైన మేధస్సుతో భారత రాష్ట్రపతి పదవి అలంకరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉపాధ్యాయ లోకానికే ఆయన గర్వకారణం. అందుకే భారత ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవాన్ని 1962 నుంచి గురుపూజా మహోత్సవంగా నిర్వహిస్తోంది. నేడు విద్యారంగం కలుషితమైపోయిం ది. ఒకనాటి పవిత్రమైన గురుశిష్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. కార్పొరేట్ విద్యా విధానంలో ధనపు గురువులు, మదపు శిష్యులు ఉన్నారు. మనకిప్పుడు గురు బ్రహ్మలు, గురు విష్ణువులు, గురు మహేశ్వరులు లేరు. విద్యాసంస్థల్లో కొట్టే బెల్కు, నెల మొదట్లో వచ్చే జీతపు బిల్లుకు నిరీక్షించే నైజం ఉన్న గురువులే ఉన్నారు. నైతిక విలువలు నశించి, విద్యార్థినులను, సహోపాధ్యాయినులను లైంగిక వేధిం పులకు గురిచేసే కీచకోపాధ్యాయులున్నారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అవగాహన చేసుకోలేక అసహనంతో, కోపంతో అమానుషంగా దండించి, భౌతికంగా గాయపరిచే ఉపాధ్యాయులున్నారు. ఇది విద్యారంగం దురదృష్టం. ఈ సందర్భంలో స్వామి వివేకానంద మాట లు స్మరించుకోవడం సముచితంగా ఉంటుం ది. ‘‘ప్రాథమిక దశలో విద్యార్థులు ఉద్యానవనంలో పూలమొక్కల వంటి వారు. ఉపాధ్యాయులు తోటమాలుల్లా ప్రేమతో వారిని పరిరక్షించాలం’’టారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... ఉపాధ్యాయులు అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు హక్కుల కోసం ఉద్యమించటంతో పాటు ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని, బాధ్యతలను గుర్తించి ఆదర్శంగా పనిచేసేట్లు దిశానిర్దేశం చేయాలి. సాధారణ ఉపాధ్యాయులంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా రూపొందిన నాడే గురుపూజా మహోత్సవాలు సార్థకమౌతాయి. (వ్యాసకర్త రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత) -
గురుబ్రహ్మి
1979... ప. గో. జిల్లా, అత్తిలిలోని ఎస్.వి.ఎస్.ఎస్.ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్... వేసవి సెలవులు పూర్తయి వారం అవుతోంది. అన్ని క్లాసుల్లోనూ స్టూడెంట్స్ పలుచ పలుచగా ఉన్నారు. కానీ, ఒక్క క్లాస్ రూమ్ మాత్రం హౌస్ఫుల్! ఒక తెలుగు లెక్చరర్ పద్యం పాడుతుంటే పిన్డ్రాప్ సెలైన్స్. అదే పద్యాన్ని ఎన్టీఆర్లాగా, ఏయన్నార్లాగా, కృష్ణలాగా మిమిక్రీ చేసి పాడుతుంటే అందరూ ఈలలూ చప్పట్లూ. బట్టీ పట్టకుండానే ఆ పద్యం కంఠతా వచ్చేసింది వాళ్లకు. ఆ లెక్చరర్ స్టయిలే అంత! ఏదైనా కామెడీ మిళాయించే చెబుతారు. చేదు మాత్రకు షుగర్ కోటింగ్ తరహా. లేకపోతే ఓ తెలుగు క్లాస్కి అంత అంటెడెన్సా! ఇలాంటి ఇన్సిడెంట్లు ఆ తెలుగు లెక్చరర్ ఖాతాలో చాలానే ఉంటాయ్. ఇంతకూ ఆ తెలుగు లెక్చరర్ ఎవరో చెప్పనేలేదు కదా. హి ఈజ్ వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం! 30 ఏళ్లుగా తెలుగు తెర నంబర్వన్ కమెడియన్. ఆయన పూర్వాశ్రమంలో తెలుగు లెక్చరర్. సుమారు ఎనిమిదేళ్లు అత్తిలి కాలేజ్లోనే పనిచేశారు. ఆ ఊరితోనూ... ఆ కాలేజ్తోనూ... అక్కడి స్టూడెంట్స్తోనూ... బ్రహ్మానందంకు బోలెడంత అనుబంధం ఉంది. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్లకు ఇప్పటికీ గురువు గుర్తున్నారు. వాళ్లల్లో కొంతమందిని తమ గురువు గురించి అడిగితే... ఆ జ్ఞాపకాల ప్రవాహంలో తడిసి ‘బ్రహ్మానంద’భరితులయ్యారు. ఆయన బోధించిన సవర్ణదీర్ఘ సంధి, చంపకమాల, ఉత్పలమాల... అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి! ‘కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ... అనే పద్యాన్ని ఎన్టీఆర్ అయితే ఎలా పాడతారు... ఏయన్నార్ అయితే ఇంకెలా పాడతారు... కృష్ణ, గుమ్మడి అయితే ఇంకే తీరుగా పాడతారు... ఒకసారి ఊహించుకోండి. మాకైతే ఆ అవసరం రాలేదు. ఎందుకంటే మా గురువుగారు... అదేనండీ బ్రహ్మానందంగారు ఇవన్నీ మాకు క్లాసులో మిమిక్రీ చేసి వినిపించేవారు. అంతేకాదు, ఇందిరాగాంధీ ఎలా మాట్లాడతారో, అచ్చం అలానే దింపేసేవారు. విమానం ల్యాండింగ్ కూడా భలే చేసేవారు. అసలు ఆయన క్లాస్ అంటేనే జోక్స్మయం. అందుకేనేమో మేం జ్వరమొచ్చినా ఆయన క్లాస్కి మాత్రం డుమ్మా కొట్టేవాళ్లం కాదు. ఆయన మిమిక్రీ చేస్తే బ్రహ్మాండం! దానివల్లే ఆయన చుట్టుపక్కల ఊళ్లల్లో పాపులర్ అయిపోయారు. పక్క ఊళ్లలో ఆయన మిమిక్రీ షోస్ చేయడానికి వెళ్తే, నేను ఆయనను నా సైకిల్ మీదే తీసుకెళ్లేవాణ్ణి. అత్తిలి సంత మార్కెట్లో ఎరుకల అమ్మన్నగారి డాబాలో, ఆయన, ఇంకో లెక్చరర్గారు కలిసి అద్దెకుండేవారు. స్టూడెంట్స్ మెస్ నుంచి మేమే క్యారేజీ పంపించేవాళ్లం. నేను ఆయనకు ప్రియాతిప్రియమైన శిష్యుణ్ణి కూడా! నేను మంచి ఒడ్డూ పొడుగూ అని ఎస్.ఐ. ఉద్యోగానికి వెళ్లమన్నారు. వెళ్లాను కానీ ఆఖరి నిమిషంలో ఎంపిక కాలేదు. నేను లెక్చరర్ అయ్యి, ఎమ్ఫిల్, పీహెచ్డీ చేశానంటే అందుకు ఆయనే ప్రేరణ. నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అయినా, అప్పుడప్పుడూ మా గురువుగారి పాఠాలు గుర్తుకొచ్చేసి... ‘ముక్కంటి అంటే... మూడు నేత్రములు కలవాడు’ అని చెబుతుంటాను. ఆయన బోధించిన వ్యాకరణం, సవర్ణదీర్ఘ సంధి లాంటి సూత్రాలు ఛందస్సులో చంపకమాల, ఉత్పలమాల... అన్నీ ఇంకా గుర్తున్నాయి. అంత గొప్ప గురువు ఆయన! - డా. ఎం. సుందర్రావు, అసోసియేట్ ప్రొఫెసర్, కేసీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్, భీమవరం ఏదో ఒక జోక్తో మొదలుపెట్టి, చాలా తెలివిగా పాఠంలోకి దించేసేవారు! అత్తిలి అనగానే అందరికీ బ్రహ్మానందంగారే గుర్తుకొస్తారు. అది ఆయన సొంత ఊరు కాకపోయినా, అత్తిలి గురించే ఆయన ఎక్కువ చెబుతుంటారు. అత్తిలి ఆడపడుచుగా ఈ విషయంలో నేను గర్వపడుతుంటా. నేను ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. ఎప్పుడైనా మేం క్లాస్ ఇంట్రస్ట్ లేదని చెప్పినా, ఏదో ఒక జోక్తో మొదలుపెట్టి, చాలా తెలివిగా పాఠం చెప్పేసేవారు. క్లాసులో ఎంత సరదాగా ఉండేవారో. డిగ్రీ తర్వాత నాకు పెళ్లయి, మధ్యప్రదేశ్ వెళ్లిపోయా. ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చేశాం. ఇంతవరకూ ఆయనను కలవలేదు కానీ, ఇప్పటికీ అప్పటి బ్రహ్మానందంగారు అలానే గుర్తుండిపోయారు. - స్వర్ణలత, గృహిణి, హైదరాబాద్ బోర్ కొట్టకుండా పాఠమెలా చెప్పాలో ఆయనను చూసి నేర్చుకోవాలి! రాజమండ్రిలో ‘అల్లుడా మజాకా’ షూటింగ్ జరుగుతోంది. నేనప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్నా. చిరంజీవిగారు, బ్రహ్మానందంగారు... ఇంకా చాలామంది యాక్టర్లున్నారు. నేను బ్రహ్మానందంగారి దగ్గరకెళ్లి ‘‘నేను మీ అత్తిలి కాలేజ్లో స్టూడెంట్ని’’ అనగానే, గుర్తు పట్టేశారు. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అంతటి గొప్ప నటుడి దగ్గర మేం పాఠాలు నేర్చుకున్నందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాం. పిల్లలకు బోర్ కొట్టకుండా పాఠమెలా చెప్పాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. ‘గురువు’ అనే పదానికి గొప్ప రోల్మోడల్ ఆయన. ఓ చిన్న కాలేజీలో పనిచేసిన ఆయన, ఈ రోజు ప్రపంచం అంతా తెలిసే స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఏ హస్తమూ లేదు. అంతా ఆయన స్వయంకృషే. ‘అహ నా పెళ్ళంట’లో ‘అరగుండు’ పాత్ర చూసి ఎంతగా నవ్వుకున్నామో, లేటెస్ట్గా ‘రేసుగుర్రం’లో ‘కిల్బిల్ పాండే’ చూసీ అలాగే నవ్వుకున్నాం. ఆయన తర్వాత ఎంతోమంది కమెడియన్లు వచ్చారు... వెళ్లారు. కానీ ఆయన ఇప్పటికీ నెంబర్వన్గానే ఉన్నారు. ఈతరం వాళ్లు ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. - అరిటాకుల శ్రీనివాసరావు, పోలీస్ అధికారి, శ్రీకాకుళం నా పెళ్లిలో మిమిక్రీ చేసిఅందర్నీ నవ్వించారు! నేను 1976-79 స్టూడెంట్ని. బాగా గుర్తు... అప్పట్లో ఆయన పట్నాల వెంకటేశ్వర్రావుగారి జ్యూయెలరీ షాపు పక్కనే అద్దెకుండేవాళ్లు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉండేది. ఆరోజుల్లో మా నాన్నగారు కాలేజ్ వైస్ ప్రెసిడెంట్. కానీ సార్ ఆయన్ని కూడా వదిలేవారు కాదు... బాగా అనుకరించేవారు. ఒక్కోసారి నాన్నగారి గొంతుతో నన్ను కంగారు పెట్టేవారు. మాకు కూడా మిమిక్రీ నేర్పుదామని తెగ ట్రై చేశారు కానీ, మా వల్ల కాలేదు. 1984 ఫిబ్రవరి 19న జంగారెడ్డిగూడెం సమీపంలోని ఓ పల్లెటూళ్లో నా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి మా గురువుగారు బ్రహ్మానందంగారు వచ్చారు. నేనడక్కుండానే మిమిక్రీ చేసి, పెళ్లికి వచ్చిన వారందరినీ భలే నవ్వించారు. ఇప్పటికీ ఈ విషయం అందరికీ నేను గర్వంగా చెప్పుకుంటుంటాను. ఆ తర్వాత అదే కాలేజ్లో సీనియర్ అసిస్టెంట్గా చేసి రిటైరయ్యాను. ఇప్పటికీ నేనాయనతో టచ్లో ఉన్నా. మొన్నీమధ్యనే నర్సాపురంలో కలిశా. అంత పెద్ద స్థాయికెదిగినా ఇప్పటికీ ఆయన ‘‘ఏరా పాండూ!’’ అని ప్రేమగా పలకరిస్తుంటారు. అలాంటి గురువులు చాలా అరుదు! - బుద్దాల పాండురంగారావు, సీనియర్ అసిస్టెంట్ (రిటైర్డ్ ), అత్తిలి ఆయన దగ్గర పాఠాలతోపాటు మనుషుల్ని ఎలా డీల్ చెయ్యాలో కూడా తెలుసుకున్నాను! మా నాన్నగారు బందెల శ్రీరామ్మూర్తిగారు 1975లో ఈ కాలేజీ స్థాపించారు. సున్నం ఆంజనేయులు గారిని ప్రిన్సిపాల్గానూ, బ్రహ్మానందం గారిని తెలుగు లెక్చరర్గానూ మా నాన్నగారే అపాయింట్ చేశారు. నేను 1977లో బీకామ్లో చేరా. మామూలుగా తెలుగు క్లాస్ అంటే చాలామందికి బోర్. కానీ మా కాలేజ్లో ఒక్క తెలుగు క్లాస్కే ఫుల్ అటెండెన్స్! దట్ క్రెడిట్ గోస్ టూ బ్రహ్మానందంగారు! అసలాయన తెలుగు పాఠం చెబుతుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. పాఠం మధ్యలో జోక్స్ చెప్తూ, తెలుగు పాఠాన్ని అంత హాస్యస్ఫోరకంగా గుర్తుండిపోయేలా ఎవరూ చెప్పలేరేమో! అందరూ నోళ్లు వెళ్ళబెట్టి పాఠాలు వినడమే తప్ప, ఆవలింతలొచ్చే ప్రసక్తే లేదు. అందుకేనేమో తెలుగులో ఒక్కరు కూడా ఫెయిలయ్యేవారు కాదు. రామాయణ, భారతాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. పాఠ్యాంశంలో లేకపోయినా అప్పుడప్పుడూ వాటి గురించి బోధించేవారు. నాకెప్పుడూ ఆయన సీరియస్గా కనబడినట్టు గుర్తు లేదు. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. స్టూడెంట్స్ని కొట్టడం, తిట్టడం లాంటివి కూడా చేసేవారు కాదు. స్టూడెంట్స్తో చనువుగా ఉండేవారు కానీ, వాళ్లు నిక్నేమ్స్ పెట్టేంత అవకాశం ఇచ్చేవారు కాదు. ఆయన క్లాసు వల్ల పాఠాలతో పాటు, మనుషుల్ని ఎలా డీల్ చేయాలన్న అంశం కూడా మాకు జీవితంలో ఉపయోగపడింది. ఆయన దగ్గర చదువుకున్నవాళ్లు చాలామంది పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు, జడ్జీలు, ఎమ్మార్వోలు, తాసిల్దార్లు అయ్యారు. నేను డిగ్రీ పూర్తయిన రెండేళ్ల తర్వాత అదే కాలేజ్లో సూపరింటెండెంట్గా చేరా. వచ్చే ఏడాది రిటైరవుతున్నా. ఆయన మొదటినుంచీ నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవారు. ఆయన ఎక్కడకు వెళ్లినా వెంట నేనుండాల్సిందే. ఆయన బ్యాచ్లర్గా ఉన్నన్ని రోజులూ మాతో కలిసి సినిమాలకు వచ్చేవారు. తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు... ఇలా ఎక్కడ సినిమా రిలీజైతే అక్కడకు వెళ్లిపోయేవాళ్లం. చుట్టుపక్కల ఊళ్లల్లో మిమిక్రీ షోస్ చేయడానికి వెళ్లినపుడు తోడుగా నన్ను తీసుకెళ్లేవారు. ఆఖరికి తెనాలి దగ్గర ఓ పల్లెటూళ్లో జరిగిన ఆయన పెళ్లిచూపులకు కూడా నన్ను ఆయన వెంట తీసుకెళ్లారు. ఈ కాలేజ్లో పనిచేసిన మా గురూజీ తెలుగువాళ్లంతా గర్వపడే స్థాయికెదిగారు. కానీ ఇంతవరకూ మేం ఆయనను కాలేజ్ తరపున సన్మానించలేకపోయామనే అసంతృప్తి నాలో చాలా ఉంది. మాస్టారూ! త్వరలోనే మీకు గురుదక్షిణ చెల్లించుకుంటాం ! - బందెల సూర్యచంద్రరావు, ఎస్.వి.ఎస్.ఎస్. డిగ్రీ కళాశాల సూపరింటెండెంట్, అత్తిలి -
నాకన్నా చిన్నవాడైనా డేటింగ్ చేస్తా!
పాతికేళ్ల వయసున్న పరిణీతి చోప్రా ఇరవయ్యేళ్ల వయసున్న యువకుడితో డేటింగ్ చేయడానికి రెడీ అంటున్నారు. తమకన్నా వయసులో పెద్దయిన అమ్మాయిలను అబ్బాయిలు డేటింగ్ చేయడం, పెళ్లాడటం కొత్త కాదు. మరి.. వారి బాటలో పరిణీతి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?.. అదే ప్రశ్న ఈ బ్యూటీ ముందుంచితే -‘‘నేను ప్రేమలో పడాలంటే ఆ కుర్రాడు మానసికంగా చాలా దృఢమైనవాడిగా ఉండాలి. నాకు పిరికివాళ్లు నచ్చరు. అమాయకంగా ఉండేవార్ని అస్సలు ప్రేమించను. ఎంతో తెలివిగా, మానసికంగా చాలా పరిణతి ఉన్న అబ్బాయినే ప్రేమిస్తా. అలాంటి అబ్బాయికి ఇరవయ్యేళ్ల వయసే అయినా సరే.. నాకు ప్రాబ్లమ్ లేదు. అతనితో డేటింగ్ చేసేస్తా. ప్రేమ కోసం ఒకర్ని.. డేటింగ్ కోసం మరొకర్ని సెలక్ట్ చేసుకునే అమ్మాయిని కాదు నేను. ఎవర్ని ప్రేమిస్తానో వారితోనే డేటింగ్ చేస్తా. నా మిగతా జీవితం అతనితో గడిపితే బాగుంటుంది అనే నమ్మకం కుదిరితే పెళ్లి కూడా చేసుకుంటా’’ అని చెప్పారు. నేడు గురుపూజా మహోత్సవం. ఈ సందర్భంగా పరిణీతి తన స్కూల్ డేస్ని గుర్తు చేసుకుంటూ -‘‘టీచర్స్ డే అంటే అప్పట్లో నాకో మంచి సెలవులాంటిది. ఆ రోజు కోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టేవాళ్లం. మా స్కూల్లో నేను లీడర్లాంటిదాన్ని. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ నేనే ప్లాన్ చేసేదాన్ని. ఎవరెవరు పాల్గొనాలో నేనే ఎంపిక చేసేదాన్ని. నేను ప్లాన్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ మా టీచర్లందరికీ నచ్చేలా చూసుకునేదాన్ని. మొత్తం రెండు గంటల పాటు వేడుకలు చేసేవాళ్లం. ఆ రెండు గంటల్లో ఆటలూ, పాటలూ, రచనలు చేసేవాళ్లం. అలాగే, మా టీచర్స్ కోసం రుచికరమైన వంటకాలు తయారు చేయడానికి ట్రై చేసేవాళ్లం. మా టీచర్స్ కూడా మా కోసం కొన్ని వంటకాలు తయారు చేసేవాళ్లు. టీచర్స్ డే అంటే నాకు ముఖ్యంగా మా మ్యూజిక్ టీచర్ నిధీ నారంగ్ గురించి చెప్పాలనిపిస్తోంది. సంగీతంలో తనే నాకు గురువు. ఆమెకు ఫీజు కట్టడం మొదలుపెట్టిన తొలి విద్యార్థిని నేనే. ఈ రోజు ప్రత్యేకంగా నా స్కూల్ విశేషాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. -
బడి.. రెడీ!
సాక్షి, న్యూఢిల్లీ: జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. ఆ జన్మకు సార్థకత కల్పించేది మాత్రం ఉపాధ్యాయులే. అటువంటి గురువులను పూజించడం, సన్మానించడం కోసం జరుపుకునే వేడుకే ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఈ వేడుక కోసం న గరంలోని అన్ని పాఠశాలలు సిద్ధమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో గురువులను అలరించేందుకు చిన్నారులు ఇంకారిహార్సల్స్ చేస్తూనే ఉన్నారు. ప్రధాని ప్రసంగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసా రం చేసేందుకు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇందుకోసం కొన్ని పాఠశాలలు పని వేళల్లో మార్పులుచేశాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. సాధారణంగా యేటా టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాలను కూడా కొన్ని స్కూళ్లు రద్దుచేసుకున్నాయి. అన్ని తరగతుల విద్యార్థుల కోసం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయలేని పాఠశాలలు పై తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రధానమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారం చూపించి, కింది తరగతి విద్యార్థులకు మరుసటి రోజు చూపించాలని నిర్ణయించాయి. పదో తరగతి, ఆపై క్లాసుల విద్యార్థులకు శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తామని, ప్రసంగాన్ని రికార్డింగ్ చేసి కింది తరగతుల విద్యార్థులకు శనివారం చూపుతామని ధౌలాకువాలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతిబోస్ చెప్పారు. అన్ని తరగతుల విద్యార్థులకు శుక్రవారం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోయినందువల్ల రెండ్రోజులు ప్రసంగం చూపించే ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. సాధారణంగా నిర్వహించే టీచర్స్ డే కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాల పనివేళలను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు మార్చినట్లు లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఐదో తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని చూపుతామని, ఇందుకోసం 12 తరగతి గదుల్లో ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ ఉషారామ్ చెప్పారు. టీచర్స్ డే వేడుకలను శనివారం జరుపుకోవాలని పాఠశాల నిర్ణయించిందన్నారు. వసంత్కుంజ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈస్ట్ ఆఫ్ కైలాష్లోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పనివేళలను మధ్యాహ్నానికి మార్చాయి. 1000 మంది చిన్నారులతో ప్రధాని ముచ్చట్లుప్రధానమంత్రి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4.45 గంటల వరకు మనేక్షా ఆడిటోరియంలో 1000 మంది విద్యార్థులతో మాట్లాడతారు. ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్షప్రారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లకు దూరదర్శన్, ఇతర ఎడ్యుకేషనల్ చానళ్ల ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తారు. ప్రధానమంత్రి విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశంలోని పలు ప్రాంతాల విద్యార్థులతో ముచ్చటిస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి నగరంలోని మున్సిపల్ పాఠశాలలు కూడా ఏర్పాట్లు చేశాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 750 స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 589 స్కూళ్లు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 550 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లన్నింటిలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం ఏర్పాట్లు జరి గాయి. పలు మున్సిపల్ స్కూళ్లు ఒక రోజు కోసం కేబుల్ కనెక్షన్లు తీసుకున్నా యి. టీవీలు, ప్రొజెక్టర్లు అద్దెకు తెచ్చాయి. రెండు షిఫ్టులలో పనిచేసే స్కూళ్లలో ఉదయం షిఫ్టులో హాజరయ్యే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన డం నుంచి మినహా యింపు ఇచ్చారు. మధ్యాహ్నం షిఫ్టులో హాజరయ్యే విద్యార్థులు, సాధారణ వేళలో పనిచేసే స్కూళ్లలో విద్యార్థులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. -
‘గురు ఉత్సవ్’.. మోడీ ఎజెండా!?
మోడీ ‘టీచర్స్ డే’ ప్రసంగంపై వివాదం - అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని తప్పనిసరి చేయడంపై విమర్శలు - రహస్య ఎజెండా ఉందంటూ ఆరోపణలు - ప్రధాని హిందీ ప్రసంగం దక్షిణాది విద్యార్థులకు అర్థంకాదని వ్యాఖ్యలు సాక్షి నేషనల్ డెస్క్:సాధారణంగా ప్రతీసారి సాదాసీదాగా గడిచే ఉపాధ్యాయ దినోత్సవం ఈ సంవత్సరం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యమా అని ఒక్కసారిగా ముఖ్యమైన వార్తాంశంగా మారింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 5న పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ ఇవ్వనున్న ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న నిర్ణయం విపక్షాల విమర్శలు, స్వపక్షాల సమర్థనల మధ్య పతాక శీర్షికల్లోకి చేరింది. ఆ రోజు ఢిల్లీలోని మానెక్షా ఆడిటోరియంలో విద్యార్ధులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం, అనంతరం ఎంపిక చేసిన 1,000 మంది పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం, ఆ తరువాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వడం కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి 4.45 వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, అందుకనుగుణంగా పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులు కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఇందులో బలవంతమేమీ లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెబుతున్నప్పటికీ.. ఢిల్లీలోని విద్యా శాఖాధికారులకు అందిన ఆదేశాల్లో ఉన్న ‘ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రంగా పరిగణిస్తాం’ అన్న హెచ్చరిక ద్వారా ఈ కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతుంది. మోడీ కార్యక్రమాన్ని విద్యార్ధులంతా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీబీఎస్సీ కూడా తన వెబ్సైట్లో అన్ని పాఠశాలలను కోరింది. దీంతో పాటు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ‘గుజరాత్ మోడల్’: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఆ రాష్ట్రంలోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేవారు. వారితో కలివిడిగా గడిపేవారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. అదే కార్యక్రమాన్ని ప్రధానిగా దేశమంతటా నిర్వహించాలని మోడీ నిర్ణయించారు. నిజానికి ఉపాధ్యాయ దినోత్సవం పేరును అధికారికంగా ‘గురు ఉత్సవ్’గా మార్చాలనుకున్నా వ్యతిరేకత రావడంతో విరమించుకుంది. ‘టీచర్చ్ డే= గురుఉత్సవ్’ అనేది ఎస్సే కాంపిటీషన్ టాపిక్ మాత్రమేనని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు. గురుపూజోత్సవం: ఉపాధ్యాయ దినోత్సవం అనేదిఉపాధ్యాయులను గౌరవించుకునే, పూజిం చుకునే సందర్భం. ప్రధాని ప్రసంగించాలనుకుంటే ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించా లి.. కానీ, విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెట్టాలన్న వాదన వినిపిస్తోంది. ‘పాఠశాలల పనివేళలు మధ్యాహ్నం 3 లోపు ముగుస్తాయి. మోడీ కార్యక్రమాన్ని సాయంత్రం 5 వరకు జరపడం వల్ల విద్యార్థులు అవస్థలు పడతారు’ అని ఒక టీచర్ అన్నారు. మాజీ రాష్ట్రపతి, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5ను టీచర్స్ డే గా జరుపుకుంటున్నారు. ‘చాచా మోడీ’గా మారాలనా? మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చాచా నెహ్రూ తరహాలో ‘చాచా మోడీ’గా మారాలనుకుం టున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. సోషల్ మీడియాలో హిందీని విరివి గా ఉపయోగించాలనటం, పాఠశాలల్లో సంస్కృత వారోత్సవాలు జరపాలన్న ఆదేశాల వెనకున్న అజెండానే దీని వెనక కూడా ఉందంటున్నాయి. ద్రవిడ సంస్కృతిని నాశనం చేయాలన్న కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారంటూ డీఎంకే అధినేత కరుణానిధి ఆరోపిస్తున్నారు. సంస్కృతాన్ని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే కుట్రలో భాగంగానే ప్రభుత్వం టీచర్స్ డేను గురు ఉత్సవ్గా పేరు మార్చాలనుకుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. మా పిల్లలకు హిందీ అర్థం కాదు మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే విషయంలో రాష్ట్రాలు పలు విధాలుగా స్పందిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అనుకూలంగా స్పందిస్తూ.. ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంత ఆసక్తిగా లేవు. ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లపై పాఠశాలలకు ఆదేశాలిచ్చేందుకు సుముఖంగా లేవు. ‘మోడీ హిందీలో ప్రసంగిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోని పిల్లలు హిందీని అర్థం చేసుకోలేరు. ఇక ఆ ప్రసంగానికి అర్థమేముంది?’ అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించా రు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పాఠశాల ల్లో కూడా ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలను అధికారులు చేపట్టారు. రాష్ట్రంలోని విద్యార్థులంతా మోడీ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించిం ది. నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ పరిధిలోని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లను పూర్తిచేశారు. -
డీఎస్సీకి రంగం సిద్ధం
జిల్లాలో 1187 పోస్టులు మైదానంలో 568, ఏజెన్సీలో 619 రేషనలైజేషన్తో తగ్గిన పోస్టులు! సాక్షి, విశాఖపట్నం: ఉపాధ్యాయ నియామకాలకు రంగం సిద్ధమైంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడు డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 1900కు పైగా ఖాళీలు ఉండగా కేవలం 1187 పోస్టుల్ని మా త్రమే డీఎస్సీకి జిల్లా విద్యాశాఖ నోటిఫై చేసిం ది. ఇందులో ఏజెన్సీలోనే ఎక్కువ పోస్టులున్నాయి. మరోవైపు అన్ని కేట గిరీల్లో కలిపి సుమారు 220 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలో సుమారు 750 పోస్టులకు రేషనలైజేషన్ కారణంగా కోత పడింది. దీంతో అభ్యర్థులకు కాస్త నిరాశ కలిగినట్టయింది. ఆ మూడు సబ్జెకులే అధికం : రానున్న డీఎస్సీలో జిల్లాలో గణితం(106), సోషల్(131), హిందీ భాషా పండిత(57) పోస్టులు అధికంగా ఉన్నాయి. బయాలజీ(29), స్కూల్ అసిస్టెంట్ తెలుగు(28), పీఈటీ(28) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మైదాన ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం, తెలుగు భాషా పండిత పోస్టులు ఒక్కటి కూడా లేదు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స, ఫిజికల్ డెరైక్టర్ (పీడీ)పోస్టులు మైదాన, ఏజెన్సీలో ఒక్కటి లేకపోవడం విశేషం. ఎస్జీటీ ఆశావహులకు ఈ డీఎస్సీ ఆశాజనకంగా ఉంది. మైదాన ప్రాంతంలో కంటే ఏజెన్సీలో ఎస్జీటీ పోస్టులు అధికంగా ఉన్నాయి. సుమారు 150 వరకు బ్యాక్లాగ్ పోస్టులని సమాచారం. మైదానంలో అన్ని కేటగిరీల్లో కలిపి మరో 70 పోస్టుల వరకు బ్యాక్లాగ్లో ఉన్నాయి. -
రేపు ఉపాధ్యాయ దినోత్సవం
చెంప ఛెళ్లుమనిపించారు! నా మొదటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ గారు చాలా క్రమశిక్షణగల వ్యక్తి. ‘‘బాగా ఆడుతున్నావు’’ అని ఆయన ఎవరినైనా అనడం చాలా అరుదుగా జరిగేది. నన్ను మాత్రం అప్పుడప్పుడూ ‘హీరో’ అని పిలిచేవారు. ఒకేరోజు నాలుగైదు మ్యాచ్లు ఆడే అవకాశం కలిగించేవారు. తన స్కూటర్పై ముంబాయి నగరమంతా తిప్పేవారు. అలా అని గారాబం చేసేవారు కాదు. చెప్పిన మాట వినలేదని ఒకసారి నా చెంప ఛెళ్లుమనిపించారు కూడా! - సచిన్ టెండూల్కర్ గురూజీ... నల్లటి బోర్డ్ మీద మీరు రాసిన తెల్లటి అక్షరాలు ఇప్పటికీ వెన్నెల వెలుగులు పంచుతూ ఉన్నాయి. - డి. శంకర్, మచిలీపట్నం నువ్వు సాధించగలవు అన్నారు..! నటనలో నా గురువు బెరీ జాన్. ఢిల్లీలో అతడి థియేటర్ గ్రూప్లో పని చేస్తున్నప్పుడు ఆయన పంచిన ఆప్యాయతను ఎప్పటికీ మరవలేను. జాన్ గొప్ప గురువు మాత్రమే కాదు మానవతావాది కూడా. ఆయన నుంచి కేవలం నటనను మాత్రమే కాదు నడవడికను కూడా నేర్చుకున్నాను. ‘‘నేను సినిమాల్లో హీరోగా చేయాలనుకుంటున్నాను’’ అనగానే నా ఫ్రెండ్సందరూ ఎగతాళిగా నవ్వేవాళ్లు. జాన్ మాత్రం ‘‘నువ్వు అనుకున్నది సాధించగలవు’’ అని ధైర్యం ఇచ్చేవారు. - షారుక్ ఖాన్ గురువు అంటే మనతో స్నేహం చేసే దేవుడు! - పి.దేవి, రాయపర్తి అదనపు క్లాసులు తీసుకునేవారు... మా లెక్కల టీచర్ పేరు కె.డి. సింగ్. ఏడు నుంచి పది వరకు గణితం బోధించారు. నేను ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడడం ఆయనకు నచ్చేది కాదు. ‘‘నీకు తిండి పెట్టేది క్రికెట్ కాదు... చదువు మాత్రమే’’ అనేవారు. కొన్నిసార్లు అయితే- ‘‘నువ్వు ఈ ఆటలో పడి చదవడం లేదు. పరీక్షల్లో కచ్చితంగా ఫెయిలవుతావు’’ అని తిట్టేవారు. అంతమాత్రాన... తిట్టడమే పనిగా పెట్టుకోలేదు. నా చదువు గురించి ఒకవైపు ఆందోళన పడుతూనే మరోవైపు రకరకాల సలహాలు ఇచ్చేవారు. నా కోసం ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకునేవారు. కొంతకాలం క్రితం ఆయనను కలిసినప్పుడు- ‘‘నీకు తిండి పెట్టేది క్రికెట్ కాదు. చదువు’’ అనే మాటను గుర్తుకుతెచ్చుకొని నవ్వారు. ఆయనతో మాట్లాడుతున్నంతసేపూ నేను ఏడో తరగతిలో ఉన్నట్లుగానే అనిపించింది. - యం.యస్. ధోని ఒకరోజు- చెట్టు కింద మీరు పాఠం చెబుతున్నప్పుడు ఎప్పుడూ రాని వాన వచ్చింది! వానకు మీ పాఠం నచ్చి మాతో పాటు వింటూ కూర్చుంది!! - యస్. శశి, గుంటూరు -
ఒబామాను మోడీ కాపీ కొడుతున్నారు!
చండీగఢ్:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత ప్రధాని నరేంద్ర మోడీ కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ముచ్చటించనున్ననరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను గుడ్డిగా అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్సింగ్ విమర్శించారు. ఒబామా 2009, సెప్టెంబర్ 8న అమెరికా విద్యార్థులనుద్దేశిమంచి మాట్లాడారని, ఆయన చేసిన ప్రతిదాన్నీ కాపీకొట్టేందుకు మోడీ యత్నిస్తున్నారని ఆరోపించారు. టీచర్స్ డే రోజున(సెప్టెంబర్ 5) ప్రధాని మోడీ ఉపాధ్యాయులను ఉద్దేశించి కాకుండా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనుండటం వింతగా ఉందని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. అన్ని అధికారాలూ అధ్యక్షుడి చేతిలో ఉండే అమెరికాలో మాదిరిగా మోడీ కూడా ప్రధానిలా కాకుండా అధ్యక్షుడిలా సర్వాధికారాలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
5న డీఎస్సీ నోటిఫికేషన్: గంటా
కుప్పం: ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన కొత్త డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీ విద్య, వూనవ వనరుల శాఖ వుంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. సోవువారం చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. డీఎస్సీ ద్వారా 10,500 పోస్టుల భ ర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యా రంగం దశ, దిశ వూర్చేందుకు సెప్టెంబర్ 5న 13 విశ్వవిద్యాలయూల ఉపకులపతులతో ప్రత్యేక సవూవేశం నిర్వహిస్తావున్నారు. ప్రభుత్వ పాఠశాలలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా భవనాలు, వసతులు, వురుగుదొడ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. వూనవ వనరుల శాఖకు సంబంధించి నూతన వెబ్సైట్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. -
సెప్టెంబర్ 5న డీఎస్సీ ప్రకటన: మంత్రి గంటా
సాక్షి, విశాఖపట్నం: ‘‘ఉపాధ్యాయ దినోత్సవం అయిన సెప్టెంబర్ 5న డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తాం. దీనికి సంబంధించి కసరత్తు జరుపుతున్నాం. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలపై అయోమయం ఉన్నందున త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి తేదీలను ఖరారుచేస్తాం అని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా వివరించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఏపీలోని 15 యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. -
దారితప్పుతున్న ‘గురు’ స్థానం!
విజయవాడ సిటీ, న్యూస్లైన్ : ‘గురుబ్రహ్మ.. గురుర్విష్ణు.. గురుదేవో మహేశ్వరః.. గురుసాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవేనమః’. తల్లిదండ్రుల తరువాత గురువుకే ప్రముఖ స్థానం ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో సరిపోల్చారు. గురుపూజోత్సవానికి ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారంటే గురువుకు ఈ దేశంలో, సమాజంలో ఏ స్థాయిలో గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవలి పరిణామాలను చూస్తుంటే గురుశిష్యుల పవిత్రబంధం అపహాస్యమవుతోంది. విద్యావ్యవస్థలో ప్రయివేటు విష సంస్కృతి చొరవడడంతో చదువు‘కొన’డం ప్రారంభమయింది. విజ్ఞానం స్థానంలో వ్యాపారం జోరందుకోవడంతో గురుశిష్యులనే పదానికి అర్థమే మారిపోయిందంటున్నారు విద్యావేత్తలు. కార్పొ‘రేట్’ ఆవరణలో గురువు కాలయముడిగా, కీచకుడిగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గురువుల వద్దకు తమ పిల్లల్ని పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల నగరంలోని పి.బి. సిద్ధార్థ కాలేజీ, ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల, వడ్డేశ్వరం కె.ఎల్. యూనివర్సిటీల్లో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే యాజమాన్యాల వికృత చేష్టలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. సిద్ధార్థ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు అధ్యాపకుడే కారణమన్న ఆరోపణలు మరిచిపోకముందే లయోల కళాశాలలోనూ మరో అధ్యాపకుడు విద్యార్థుల్ని వేధించడం బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాటవినకపోతే మార్కులు కోతే పలు ఎయిడెడ్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధ్యాపకులు డెరైక్టర్లదే హవా. తమ మాట వినకుండా ఎదురుతిరిగితే ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కుల్లో కోత వేస్తారు. తమ చేతిలో ఉన్న ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కులను తగ్గించేసి వేధింపులకు గురిచేస్తారు. చివరికి తమ దారిలోకి తెచ్చుకునే విధంగా కొందరు అధ్యాపకులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటానమస్ విధానం కూడా ఇందుకు దోహదపడుతోందని విద్యావేత్తలు భావిస్తున్నారు. -
గుణ‘పాఠం’ చెబుతాం
చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులు గర్జించారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి ‘మాకు సమైక్యాంధ్ర మాత్రమే కావాలి’ అంటూ డప్పు కొట్టి మరీ నినదించారు. రకరకాల ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ, ఉపాధ్యాయ జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో విభజన నిర్ణయాన్ని ఎండగడుతూ టీచర్లు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో సుమారు 3వేల మంది నల్ల దుస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ వద్ద చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ర్యాలీని ప్రారంభించారు. జిల్లా గెజిటెడ్ అధికారుల జేఏసీ నేతలు, నల్లటి దుస్తులు ధరించిన ఉపాధ్యాయులతో కలిసి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు తెప్పించిన 500 అడుగుల నల్ల వస్త్రాన్ని టీచర్లు ర్యాలీలో పట్టుకొని నిరసన తెలిపారు. విద్యార్థుల కోలాటాలు, పీఈటీలు లెజిమ్స్, ఉపాధ్యాయులు డప్పుతో ర్యాలీలో ముందుకుసాగారు. ‘పంతుళ్ల పంతం... వేర్పాటువాదం అంతం,గురువుల వేదన సమైక్యాంధ్ర సాధన, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కన్నా సమైక్యాంధ్ర ఉద్యమమే మిన్న, సర్వమతం సమైక్యం, విభజన ఆపండి విద్యార్థులను కాపాడండి’ అని ప్లకార్డులు చేతబూని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఓ ఉపాధ్యాయుడు యముడి వేషం వేసి, తాడుతో కేసీఆర్ ప్లకార్డు ధరించి ఉన్న టీచర్ను లాగుతూ ‘రాష్ట్రాన్ని విడదీస్తావా? నిన్ను పైకి తీసుకెళ్లాల్సిందే’ అంటూ అరుస్తూ ర్యాలీలో ముం దుకు సాగాడు. మరికొందరు గాంధీ విగ్రహం వద్ద డ్యా న్సులు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నిరసనకు మద్దతుగా పలు పాఠశాలల విద్యార్థులు గాంధీ విగ్రహం చుట్టూ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో బీ.ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసని, అయితే జిల్లా టీచర్లు అవార్డుల కన్నా సమైక్యాంధ్ర ముఖ్యమని ముందుకు రావడం అభినందనీయమన్నారు. తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పలమనేరు తదితర ప్రాంతా ల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిం చారు. చిత్తూరులో జరిగిన ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల జేఏసీ నేతలు వెంకటసుబ్బారెడ్డి, శేషయ్య, అనిల్కుమార్రెడ్డి, చంద్రమౌళి, వర్మ, జయప్రకాష్, టీచర్స్ జేఏసీ నేతలు గిరిప్రసాద్రెడ్డి, శ్రీరామమూర్తి, రవీంద్రారెడ్డి, రవిరెడ్డి, వెంకటేశ్వర్లు, బాబు, దామోద రం, నరేంద్రకుమార్, మఫిషియల్ అసోసియేషన్ నేత లు పురుషోత్తం, మురళీమోహన్, రవిశేఖర్, ప్రేమ్కుమార్, గోపాల్, సహదేవనాయుడు పాల్గొన్నారు. -
గురువుల మహాదీక్ష
తాడేపల్లిగూడెం, న్యూస్లైన్ : ఒక్కరు కాదు.. ఇద్దరుకాదు.. వందల మంది ఉపాధ్యాయులు ఒక్క చోటికి చేరారు. వారికి తోడుగా వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. అందరూ కలిసి ‘సోలో ఆంధ్రప్రదేశ్’ అని నినదించారు. గురువులకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఉపాధ్యాయులు నివాళులర్పిస్తూ నల్లని జెండాలతో స్వార్థ రాజకీయ నాయకుల వైఖరిని ఎండగడుతూ రిలే నిరసన దీక్షకు కూర్చున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తాడేపల్లిగూడెంలో గురువారం ‘గురువుల మహా దీక్ష’ ద్వారా నిరసన తెలిపారు. స్థానిక కేఎన్ రోడ్డులోని తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు వేసిన 30 షామియానాలలో 1600 మంది ఉపాధ్యాయులు దీక్షలలో పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో వెయ్యి మంది ఉపాధ్యాయులు, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకు చెందిన 600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్షలలో పాల్గొని నిరసన తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా ఉన్న సర్వేపల్లి ఫ్లెక్సీని దీక్షా శిబిరాల వద్ద ఉంచి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం దీక్షలలో పాల్గొన్నారు. గంధం జోన్స్కు చెందిన విద్యార్థులు 20 అడుగుల నల్లని జెండాతో నిరసన ప్రదర్శన, షిర్డిసాయి విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ఎవరి అండదండలు లేకుండా మహోద్యమంగా జరుగుతున్న ఉద్యమం సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అని అన్నారు. విభజన నిర్ణయం ఆగిన తర్వాత ప్రజలు వివిధ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఐటీ ఒక చోట, సినీ పరిశ్రమ ఒక చోట అన్నట్లుగా అభివృద్ధి చెందాలన్నారు. మరో స్వాతంత్య్ర సంగ్రామంలా ఉద్యమం సాగుతుందని జేఏసీ గౌరవాధ్యక్షుడు బుద్దాల రామారావు అన్నారు. దీక్షాపరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట గోపి, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు, యర్రా నవీన్, జేఏసీ నాయకులు మాకా శ్రీనివాసరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, ఫైలు శ్రీనివాసరావు, అపుస్మా నాయకులు గంధ ం సుధాకర్, గురువు హరిబాబు, అత్తింటి సుబ్బరాజు, జంగా బాలాజీ, ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి, గూడెం పరిసర ప్రాంత విద్యాసంస్థల యజమానులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు టీవీ రామకృష్ణ పాల్గొన్నారు. -
‘సర్వేపల్లి’ స్ఫూర్తిగా తాడేపల్లిగూడెంలో ఉపాధ్యాయుల మహాదీక్ష
ఏలూరు, న్యూస్లై న్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వాడీవేడిగా సాగుతోంది. 37వ రోజైన గురువారం కూడా జిల్లాలోని అన్నివర్గాలు ఐక్యంగా గొంతెత్తి సమైక్య గర్జన చేశారుు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా గురు పూజోత్సవాలకు దూరంగా ఉండిపోయూరు. తమకు స్ఫూర్తిప్రదాత అరుున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రతినబూనారు. ఏలూరు నగరంలోని ఫైర్స్టేషన్ సెంటర్లో ఉపాధ్యాయులు ఇందిరాగాంధీ, సోనియా, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పురందేశ్వరి మాస్క్లు ధరించి విభజన ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. నాటిక ద్వారా సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెప్పారు. జిల్లాస్థారుు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు పురస్కారాలను తీసుకోకుండా జెడ్పీ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలో 1,600 మంది ప్రైవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డుపై కిలోమీటరుకు పైగా టెంట్లు వేసి ‘గురువుల మహాదీక్ష’ చేపట్టారు. శ్వేత వస్త్రాలు ధరించి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని విభజన నిర్ణయంపై నిరసన తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు గురువులకు బాసటగా నిలిచారు. జనమంతా ఉద్యమ బాటలోనే... ఏలూరు నగరంలో గురువారం నిర్వహించిన లక్ష గళార్చన శంఖారావంలో వేలాదిమంది ప్రజలు పాల్గొని సమైక్య నినాదాన్ని మారుమోగించారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు రోడ్డుపై గురుపూజోత్సవం నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో మునిసిపల్ ఉద్యోగులు నగర సంకీర్తన చేశారు. పెనుగొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. పోడూరు మండలం వేడంగి, యలమంచిలి మండ లం దొడ్డిపట్ల, కాంభొట్లపాలెం, శిరగాలపల్లి, చించినాడ గ్రామాల్లోనూ వంటావార్పు చేసి నిరసన గళమెత్తారు. పెనుగొండ బంద్ విజయవంతమైంది. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులు, సోనియా, చంద్రబాబు చిత్రపటాలను గాడిదలకు కట్టి ఊరేగించారు. కొయ్యలగూడెంలో పట్టభద్రులు పండ్లు, కూరగాయలు విక్రరుుంచి నిరసన తెలిపారు. తణుకులో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు రిలే దీక్ష చేయగా, న్యాయవాదులు గంగిరెద్దు కళాకారుల వేషధారణలతో విభజన ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. వైద్యులు, ఉపాధ్యాయులు ర్యాలీలు, మానవహారాలు చే శారు. అత్తిలిలో మహిళలు ర్యాలీ చేశారు. కొవ్వూరు ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు మెరకవీధిలోని రాష్ట్ర రహదారిపై మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తాళ్లపూడి మండల ఉపాధ్యాయులు టీచర్స్ డేను బహిష్కరించి దీక్షలు నిర్వహించారు. కొవ్వూరు మండలం నందమూరులో వంటావార్పు జరిగింది. చింతలపూడి లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శన, మానవహారం, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కామవరపుకోటలో ఉపాధ్యాయులు రోడ్డుపైనే విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుట్టాయగూడెం సెంటర్లో మహిళలు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. టి.నరసాపురంలో ఉపాధ్యాయులు చేపట్టిన 48 గంటల మేలుకొలుపు దీక్ష గురువారం ముగిసింది. వైఎస్ జగన్ స్ఫూర్తితో... సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారుు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. ప్రజలు, ఉద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాలను ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, పార్టీ సీఈసీ సభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సందర్శించి సంఘీభావం తెలిపారు. -
ఘనంగా గురుపూజోత్సవం
కోరుకొండ (విజయనగరం రూరల్), న్యూస్లైన్ : కోరుకొండ సైనిక పాఠశాలలో గురుపూజోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధకృష్ణన్ విగ్రహానికి పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ కల్నల్ ఎం.అశోక్బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. దేశానికి ఎంతో మంది శాస్త్రవేత్తలను, మేధావులను అందించడంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేని చెప్పారు. బావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి వ్యాపారమయంగా మారడం బాధకరమని తెలిపారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసినపుడే దేశానికి ఉత్తమ పౌరులు అందుతారన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం పదవీకాలం అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రవీణ్కుమార్, సీనియర్ ఉపాధ్యాయులు సర్వారాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. నవోదయలో... కిల్తంపాలెం (శృంగవరపుకోట రూరల్) : కిల్తంపాలెం జవహార్ నవోదయ విద్యాలయంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.వి.సుబ్బారావు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయులందరూ గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థి సంఘ నాయకుడు అరుణసాయి నేతృత్వంలో విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాలయ సిబ్బందికి, ఉపాధ్యాయులకు వాలీబాల్, క్రికెట్, షాట్పుట్, బ్యాడ్మింటన్ తదితర పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 12వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల అవతారమెత్తి పలు తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి పలువుర్ని ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి విజయనగరం ఆరోగ్యం : ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయాలని ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి.రామకృష్ణారావు అన్నారు. గురువారం కేంద్రాస్పత్రిలో గురుపూజోత్సవం సందర్భంగా గాంధీ బ్లడ్ డోనర్స్క్లబ్ , ఆశ్రయ బ్లడ్ డోనర్స్క్లబ్, జరజాపుపేటకు చెందిన యూత్క్లబ్ వారు సంయుక్తంగానిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తం దానం చేయడమంటే ఆపదలో ఉన్న సాటి మనిషికి రక్తం ఇచ్చి పునర్జన్మ ప్రసాదించగలడన్నారు. ఇప్పటికీ రక్తం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదే విధంగా చదువు, విద్య నేర్పిన గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రాస్పత్రి రక్తనిధి కేంద్రం వైద్యులు సత్యశ్రీనివాస్, గాంధీ బ్లడ్ డోనర్స్క్లబ్ అధ్యక్షుడు అబ్ధుల్వ్రూప్ పాల్గొన్నారు. హైదరాబాద్లో గురువులకు అవార్డు ప్రదానం విజయనగరం కల్చరల్, న్యూస్లైన్ : గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హైదరాబాద్ రవీంద్రభారతీలో అవార్డులు ప్రదానం చేశారు. విద్యాశాఖ మంత్రి పి.పార్థసారథి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మృదంగ అధ్యాపకురాలు మండపాక నాగలక్ష్మికి అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఎ.విక్టర్బాబు, ఎస్జీటీ, పి.ఎస్.ఆర్.పురం, గంట్యాడ మండలం, బొంతలకోటి శంకరరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గంగచోళ్లపెంట, గజపతినగరం మండలం, రిటైర్డు టీచర్ బి.అప్పలస్వామి, ఎంపీపీఈ స్కూల్, పెద్దబంటుపల్లి, గుర్ల మండలం ఉన్నారు.