రేపు గురుపూజ మహోత్సవం
Published Mon, Jul 18 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
కౌటాల : మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో మంగళవారం గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వాసుల రామస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సుప్రభాతం, 7గంటలకు అఖండజ్యోతి ప్రజ్వలన, 9 గంటలకు గురుపూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మండలంలోని భక్తులందరూ గురుపూజ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు.
Advertisement
Advertisement