people
-
నా నియోజకవర్గం, నా ప్రజలు అనుకున్న.. విడదల రజిని ఎమోషనల్
-
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం(Israeli army).. గాజాపై విధ్వంసకర దాడితో విరుచుకుపడింది. ఈ దాడిలో 70 మందికిపైగా ప్రజలు మృతిచెందివుంటారని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం గాజాలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి బుధవారం రాత్రి మొదలై గురువారం ఉదయం వరకు కొనసాగింది.ఈ భకర దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజాకు చెందిన వైద్యులు గురువారం ఈ సమాచారాన్ని మీడియాకు అందించారు. దక్షిణ గాజా పట్టణాలైన ఖాన్ యూనిస్, రఫా, బీట్ లాహియాలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వైద్యులు తెలిపారు. అయితే మొత్తం మరణాల సంఖ్య ఎంత అనేదీ వెల్లడించలేదు. అయితే ఉత్తర, దక్షిణ గాజాలో ఈ తెల్లవారుజామున జరిగిన దాడిలో 70 మందికి పైగా ప్రజలు మృతిచెందినట్లు అల్ జజీరా(Al Jazeera) వెల్లడించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ వారం రోజుల క్రితం విచ్ఛిన్నమైంది. నాటి నుండి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్.. గాజాపై భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా జనం మరణించారు. తమ బందీలను విడుదల చేయనందుకు హమాస్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో హమాస్పై భారీ దాడులు చేయాలంటూ తమ సైన్యాన్ని ఆదేశించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర , దక్షిణ గాజాలో దాడులకు దిగుతోంది. ఇది కూడా చదవండి: Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్ ఆగ్రహం -
అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం
ఓక్లహామా సిటీ (యూఎస్): అమెరికా(America)లో ప్రకృతి ప్రకోపించి 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని రాష్ట్రాలు పెను తుపాను బారినపడితే మరికొన్ని చోట్ల టోర్నడోలు విజృంభించాయి. మరికొన్ని చోట్ల కార్చిచ్చు ఘటనలు స్థానికులను కకావికలం చేస్తున్నాయి. మిస్సోరీ రాష్ట్రంలో టోర్నడో కారణంగా 11 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి అర్కాన్సాస్లో ముగ్గురు, టెక్సాస్లో సిటీలో దుమ్ము తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.దేశవ్యాప్తంగా 16 కౌంటీలలో పలు ఇళ్లు, వ్యాపార సంస్థ నష్టం వాటిల్లిందని, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, చెట్లు కూలిపోయాయని అర్కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ(Arkansas Department of Public Safety) ఒక ప్రకటనలో తెలిపింది. టెక్సాస్ పాన్హ్యాండిల్లోని అమరిల్లో కౌంటీలో చోటు చేసుకున్న కారు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మిస్సౌరీలోని బేకర్స్ఫీల్డ్ ప్రాంతంలో తుఫానుల కారణంగా ఇద్దరు మరణించారని, పలువురు గాయపడ్డారని మిస్సౌరీ స్టేట్ హైవే పెట్రోల్ తెలిపింది. ఈ నేపధ్యంలో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు సూచించారు.బేకర్స్ఫీల్డ్కు తూర్పున 177 మైళ్ల దూరంలోని ఒక ఇంటిని సుడిగాలి చుట్టుముట్టడంతో, ఒకరు మృతి చెందారని, మరో మహిళను రెస్క్యూ టీమ్ రక్షించిందని అధికారులు తెలిపారు. అర్కాన్సాస్లోని కేవ్ సిటీ ప్రాంతంలో టోర్నడో కారణంగా ఐదుగురు గాయపడ్డారని, ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు మేయర్ జోనాస్ ఆండర్సన్ తెలిపారు. ఇది కూడా చదవండి: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 9 మంది మృతి -
New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని
భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.ఈ వీడియోను న్యూజిలాండ్(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. Prime Minister of New Zealand Christopher Luxon celebrating #Holi. pic.twitter.com/xjPbxPLeyT— The Gorilla (News & Updates) (@iGorilla19) March 12, 2025వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్పై హ్యాపీ హోలీ అని రాసివుంది. కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం -
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
మాట తప్పని నైజం.. జగన్ మాటే జనం పాట
-
కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ అసహనం
-
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
రామగిరి(నల్లగొండ): పెద్దల మాట.. చద్దన్నం మూట.. అంటారు. పాత కాలంలో చద్దన్నమే ఆహారం. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి. కానీ, ఇప్పుడు పాత తరం చద్దన్నానికి ఆదరణ లభిస్తోంది. నల్లగొండ ఎన్జీ కాలేజీ గేటు వద్ద చద్దన్నం (Fermented rice) స్టాళ్లు పెట్టారు. ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో ప్రజల నుంచి ఆదరణ బాగా వస్తోంది. సాధారణ బియ్యంతో పాటు బ్రౌన్ రైస్తో కూడా చద్దన్నం తయారు చేస్తున్నారు. జొన్నగట్క, రాగి జావ కూడా స్టాళ్లలో విక్రయిస్తుండటంతో తినే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చద్దన్నం స్టాళ్ల వద్ద పొద్దున్నే జనం బారులు తీరుతున్నారు. చద్దన్నంతో లాభాలుఒకప్పుడు తాతల కాలంలో చద్దన్నమే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తి( immunity )ని పెరుగుతుంది. చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. ఎండాకాలంలో పొద్దున్నే చల్ల పోసుకుని చద్దన్నం తినడం వల్ల చలువ చేస్తుంది. ఇంకా ఇతర లాభాలుఉదయాన్నే చద్దన్నం తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది.చద్దన్నంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టవచ్చుపొట్ట ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా లభిస్తుంది. మంచి శక్తినిస్తుంది దెబ్బలు తొందరగా మానే అవకాశం ఉంటుంది.ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండాలంటే చద్దన్నం చాలా మంచిది.త్వరగా వడదెబ్బ తగలకుండా కాపాడుతుది.అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది.శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి.బీపీ అదుపులో ఉంటుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. -
మళ్లీ ప్రకంపనలు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపన తీవ్రంగా ఉండటంతో భూమి కొన్ని సెకన్ల పాటు దీని ప్రభావం కనిపించింది. జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. దీని కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. భూ ప్రకంపనలతో పాటు, ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్ధాలకు జనం మరింత భయాందోళనలకు గురయ్యారు.CCTV में कैद दिल्ली-NCR में भूकंप के तेज झटकेसुबह-सुबह भूकंप के झटकों से कांपी दिल्ली, 4.0 तीव्रता. दिल्ली में सोमवार सुबह भूकंप के जोरदार झटके महसूस किए गए. भूकंप के कारण लोगों की नींद भी खुल गई. कंपन इतनी ज्यादा थी कि कई सेकंड तक धरती डोलती रही.#earthquake | #delhincr |… pic.twitter.com/2zsuG2ZyKe— NDTV India (@ndtvindia) February 17, 2025ఈ భూకంప ప్రకంపనల గురించి స్థానికుడు సుమన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘భూమి కింద ఏదో విరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద శబ్దంతో నేను నిద్రలో నుంచి మేల్కొన్నాను. ఎంతో భయాందోళనలకు లోనయ్యాను. నేను నా ఐదేళ కుమారుడిని ఎత్తుకుని, ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటి నుండి బయటకు పరుగులు తీశాను. నాలాగే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిలబడ్డారు’ అని తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత ఢిల్లీలో ఈ స్థాయి భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.బీహార్, హర్యానాలో..ఢిల్లీతో పాటు బీహార్,హర్యానాలలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. బీహార్లోని సివాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హర్యానాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, సోనిపట్లలో భూమి కంపించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న బహదూర్గఢ్లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. Prime Minister Narendra Modi tweets, "Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation." pic.twitter.com/KX9qCArbG3— ANI (@ANI) February 17, 2025ప్రధాని మోదీ ట్వీట్ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భూకంపం పై ఢిల్లీ ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని తెలిపారు. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భూకంపాలకు కారణమిదే..భూమి నాలుగు పొరలతో కూడి ఉంటుంది. ఇవి ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్. వీటిలో క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్ను లిథోస్పియర్ అని అంటారు. ఈ 50 కి.మీ మందపాటిగా ఉన్న పొర అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల ఇలాంటి ఏడు ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు భూప్రకంపనలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు. భూకంపం కేంద్రం నుంచి తీవ్రత ఎంతనేది కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపం ఏ తీవ్రతతో ఉందనేది చెబుతారు. భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం అంత తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే దానిని భారీ భూకంపంగా గుర్తిస్తారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్! -
చిన్న వయసు.. పెద్ద మనసు
వయసులో ఆమె చాలా చిన్నది.. కానీ గొప్ప మనసుందని ప్రపంచానికి చాటి చెప్పింది.. తాను మరణిస్తున్నానని తెలిసి.. మరో ఐదుగురి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు..మరణానంతరం మరో ఐదుగురికి ప్రాణంపోయడమే కాదు.. వారి రూపంలో తాను జీవించి ఉందనేలా.. ఆమె తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. అవయవ దానంపై ఆమె నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. ఇంతటి గొప్ప త్యాగానికి.. రూపమిచ్చిన ఆమె పేరు డాక్టర్ భూమికారెడ్డి.. యువ డాక్టర్ నంగి భూమికారెడ్డి (24) స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, నంగివాండ్లపల్లి. నంగి నందకుమార్ రెడ్డి, లోహిత దంపతుల ఏకైక కుమార్తె. ఇటీవలే వైద్య విద్యను పూర్తి చేసి హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా వైద్య సేవలను అందిస్తోంది. ఫిబ్రవరి 1న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తాను ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని అనుకోకుండా ప్రమాదానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న భూమికారెడ్డిని సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ శివానందరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం చికిత్సలు చేసింది. క్రానియోటమీ సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం తుది శ్వాస విడిచింది.బిడ్డ మాట కోసం.. భూమికారెడ్డి తమతో పదే పదే అవయవదానం గురించి మాట్లాడుతుండేదని, ఆ మేరకు తమ బిడ్డ మాట కోసం భూమికారెడ్డి అవయవాలను దానం చేయడానికి తమ కుటుంబ సభ్యులతో చర్చించి చివరకు అంగీకరించారు తల్లిదండ్రులు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే.. ఆస్పత్రిలోని సందర్శకులు, ఇతర రోగుల కళ్లు చెమ్మగిల్లాయి. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుని మరో ఐదుగురి ప్రాణాలను నిలబెట్టాలనే నిర్ణయానికి వచి్చన భూమికారెడ్డి తల్లిదండ్రులను అక్కడి డాక్టర్లు అభినందించారు. అనంతరం భూమికారెడ్డి మృతదేహానికి కాంటినెంటల్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు.భూమికారెడ్డి త్యాగం వెలకట్టలేనిది.. యువ డాక్టర్ భూమికారెడ్డి మన మధ్య లేకపోయినా ఆమె చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆమె, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సమిష్టిగా నిర్ణయించి అవయవదానం చేయడానికి ముందుకురావడం కలకాలం గుర్తిండిపోతుంది. భూమికారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వైద్య రంగం ఓ మంచి వైద్యురాలిని కోల్పోయింది. – కాంటినెంటల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డిఅవయవదానం వివరాలు.. డాక్టర్ భూమికారెడ్డి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తులను కిమ్స్ ఆస్పత్రికి, గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి, కాలేయం కాంటినెంటల్ ఆస్పత్రికి, కిడ్నీల్లో ఒకటి నిమ్స్ ఆస్పత్రికి, మరొకటి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. -
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముగ్గురు యువకుల హల్ చల్
-
శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్
అగ్రరాజ్యం అమెరికాను శీతాకాల తుపాను భయకంపితులను చేస్తోంది. సుమారు పది లక్షల మంది అమెరికన్లు భారీ శీతాకాలపు తుఫానుకు ప్రభావితమయ్యారు. ఈ తుపాను కారణంగా ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం, అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.మధ్యఅమెరికాను తాకిన ఈ తుఫాను మరో రెండు రోజుల్లో తూర్పు దిశగా కదులుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్ల్యుఎస్) తెలిపింది. ఈ నేపధ్యంలో కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి(Emergency) ప్రకటించారు. మిసిసిపీ, ఫ్లోరిడాతో సహా ప్రాంతాల్లో తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ముప్పు పొంచివుందని ఎన్డబ్ల్యుఎస్ పేర్కొంది.ఆర్కిటిక్ చుట్టూ ప్రసరించే చల్లటి గాలితో కూడిన పోలార్ వోర్టెక్స్(Polar Vortex) వల్ల ఈ విపరీత వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దశాబ్దంలో సంభవించిన అత్యంత భారీ హిమపాతం ఇదేనని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇది 2011 తరువాత అమెరికాలో అత్యంత శీతల జనవరిగా పేర్కొంది. చారిత్రక సగటు కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు ఒక వారం పాటు కొనసాగనున్నాయని పేర్కొంది. ఆదివారం సాయంత్రానికి తుఫాను వచ్చే అవకాశం ఉన్న తూర్పు తీరంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.ఎన్డబ్ల్యుఎస్ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ అమెరికాలో ఆదివారం తుపాను కారణంగా జనజీవనానికి ఆటంకాలు ఏర్పాడతాయి. పలు చోట్లు రోడ్లను మూసివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాన్సాస్, ఇండియానా(Indiana)లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం 8 ఇంచుల మేరకు మంచు కురిసే అవకాశాలున్నాయి. మిడ్వెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో మంచు తుఫానులు తలెత్తే అవకాశం ఉంది. మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటుకీ, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలలో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది.ఇది కూడా చూడండి: కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు -
బాబు మాయమాటలు నమ్మి మోసపోయాం
-
World Meditation Day : మెరుగైన సమాజం కోసం
ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.జూన్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) -
టూరు.. భలే జోరు..
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మండువేసవిలో దట్టమైన మేఘాలు.. ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. ముచ్చటగొలిపే మున్నార్.. కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్గా నిలుస్తాయి. కూర్గ్లో ట్రెక్కింగ్.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్హోళె నేషనల్ పార్క్లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్.. తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు. ఐదు రోజుల ప్రయాణం అద్భుతం.. ఈ సీజన్లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది. – సాయి హర్ష, మణికొండఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..ఈ సీజన్లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు. – భాస్కర్రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ -
Delhi: కొద్దిపాటి ఉపశమనం.. తగ్గని కాలుష్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్యం కాస్త ఉపశమించింది. దీంతో అక్కడి ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అయితే కాలుష్య స్థాయి ఇప్పట్లో ఆశించినంతలా తగ్గేలా కనిపించడంలేదు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా జనం పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.కొద్ది రోజుల క్రితం 400 దాటిన కాలుష్య సూచీ ఇప్పుడు 300 నుంచి 400 మధ్యలో ఉంటోంది. ఢిల్లీవాసులు కాలుష్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్లను వినియోగిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీబీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం ఏక్యూఐ కొద్ది రోజుల క్రితం వరకూ ప్రమాదకర కేటగిరీలో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీవాసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని నుంచి ఉపశమనం కోసం వర్షాలు పడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఏపీ ప్రజలపై మరో భారం (ఫోటోలు)
-
ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్పై జనం ఆగ్రహం
-
జార్ఖండ్లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్పూర్
రాంచీ: జార్ఖండ్లో భూకంపం సంభవించింది. రాజధాని రాంచీ, జంషెడ్పూర్తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.జార్ఖండ్లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి.. -
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) -
నంద్యాలలో చిరుత సంచారంతో కలకలం?
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
బహ్రాయిచ్లో కొనసాగుతున్న ఆందోళనలు
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.బహ్రాయిచ్ జిల్లాలోని మహరాజ్గంజ్ మార్కెట్లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి
మైహార్: మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు రోడ్డు పక్కనే నిలిపివుంచిన ఉన్న హైవా వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా తొమ్మదిమింది మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు.ఈ ఘటనలో గాయపడిన వారిని మైహర్, అమర్పతన్, సత్నా జిల్లా ఆసుపత్రులకు తరలించారు. 30వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు ప్రయాగ్రాజ్ నుంచి రేవా మీదుగా నాగ్పూర్ వెళుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా వెళుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 53 సీట్లున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే, నాదన్, మైహార్ పోలీసులు ఎస్డిఎం వికాస్ సింగ్, తహసీల్దార్ జితేంద్ర సింగ్ పటేల్, ఎస్పీ సుధీర్ కుమార్ అగర్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు డోర్ కట్ చేసి, ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికుల్లోని కొందరు కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం -
కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో రోజుకు వెయ్యి మందికి పైగా జనం కుక్క కాటుకు గురవుతున్నారు. ఢిల్లీకి చెందిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, హిందూరావు, జీటీబీ, డీడీయూ, లోక్నాయక్, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రేబిస్ వ్యాక్సిన్ కోసం ప్రతి రోజు వెయ్యి మందికి పైగా బాధితులు వస్తున్నారు.కుక్కకాటు కేసుల్లో 60 శాతం మంది చిన్నారులేనని వైద్యులు చెబుతున్నారు. సఫ్దర్జంగ్ ఆస్పత్రికి చెందిన యాంటీ రేబిస్ క్లినిక్ హెడ్ డాక్టర్ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రోజూ దాదాపు 500 రేబిస్ టీకాలు వేస్తున్నారని తెలిపారు. వీరిలో 200 మంది కొత్త రోగులు కాగా, 300 మంది పాత రోగులు. లోక్ నాయక్ ఆస్పత్రి అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ రీతూ సక్సేనా మాట్లాడుతూ తమ ఆస్పత్రికి ప్రతిరోజూ దాదాపు 100 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వస్తున్నారని తెలిపారు. సెలవు దినాల్లో వీరి సంఖ్య మరింతగా పెరుగుతున్నదన్నారు.సాధారణంగా కుక్క, పిల్లి, నక్క, తోడేలు, గబ్బిలం లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు బాధితుడు తప్పనిసరిగా రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా జంతువు కరచిన వెంటనే బాధితునికి మొదటి డోస్ ఇస్తారు. రెండవది మూడు రోజులు, మూడవది ఏడు రోజులు, నాల్గవ డోస్ 28 రోజులకు అందిస్తారు. మొదటి డోస్తో పాటు యాంటీ రేబిస్ సీరమ్ (ఏఆర్ఎస్)ను కూడా బాధితునికి ఇస్తారు.ఇది కూడా చదవండి: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం -
ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. రంగపురి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే కూతుళ్లను హత్య చేసి, ఆపై తాను విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటనలో సల్ఫా మాత్రలు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కూతుళ్లలో ఒక కుమార్తె అంధురాలు. మరో కుమార్తె కూడా అంగవైకల్యంతో బాధపడుతోంది. సంఘటనా స్థలంలో సల్ఫేట్ సాచెట్లను పోలీసులు గుర్తించారు. ఒక గదిలోని డబుల్ బెడ్పై కుమార్తెల మృతదేహాలు పడి ఉండగా, రెండో గదిలో తండ్రి మృతదేహం లభ్యమైంది. అయిదుగురి నోటి నుండి తెల్లటి నురగ వచ్చినట్లు కనిపిస్తోంది. వీరందరి మెడకు ఎర్రటి దారం కట్టివుంది.ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటి యజమాని, తండ్రి హీరాలాల్(50) కార్పెంటర్గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అతని భార్య క్యాన్సర్తో మృతిచెందింది. ఈ నెల 24 నుంచి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టగా, వారికి లోపల ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య -
నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.జంఫారా ప్రావిన్స్లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బుండి: రాజస్థాన్లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎకో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన గురించి బుండి ఏఎస్పీ ఉమా శర్మ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. కాగా రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఓ కారు రెండు బైక్లను ఢీకొంది. ఈ ఘటనలో కూడా ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి -
బాబు, పవన్ పై పిఠాపురం ప్రజల ఆగ్రహం
-
కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ మిగలలేదు..
-
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్యార్డ్లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా..
-
వరద సహాయక చర్యల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం
-
చుట్టుముట్టిన కష్టాలు
కళ్ల ముందు నీళ్లు పారుతున్నాయి.. కానీ గొంతు తుడుపుకొనేందుకు గుక్కెడు మంచి నీరు లేని పరిస్థితి. పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి. అడుగు పడనీయని అంధకారం.. విష పురుగులు విలయతాండవం.. ఇళ్లు, వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుధ్యం.. పట్టపగలే పీక్కుతింటున్న దోమలు. ఇదీ.. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజల దీన స్థితి.సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం, తురకపాలెం తదితర గ్రామాలను మంగళవారం ‘సాక్షి’ బృందం పరిశీలించింది. వరద సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒకవర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్లు చెబుతున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లను ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతల ఇళ్ల వద్దకు చేరుతున్నాయి.దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిపాటి నీరు, ఆహారం వచ్చిందంటే చాలు.. వాటి మీదికి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మంచి నీళ్లిచ్చినా తాగి ప్రాణాలు దక్కించుకుంటామని పలువురు బాధితులు ‘సాక్షి’తో చెప్పారు.అంధకారంలో గ్రామాలుమూడు రోజులుగా 27 లంక గ్రామాలను వరద చుట్టుముట్టగా గత రెండు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లంక గ్రామాల పరిధిలో ఉన్న రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నీటిలో మునగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్ లైన్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయి గ్రామాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని పూరిళ్లతో పాటు వీధుల్లోనూ నీరు అలానే ఉంది. విషపురుగులు బెడద పెరిగింది. దోమలు పట్టపగలే పీక్కుతింటున్నాయి. దీనికి తోడు పారిశుధ్యం అధ్వానంగా మారడంతో జ్వరాలు పెరుగుతున్నాయి. బయట ఆస్పత్రులకు వెళదామంటే బోట్లు లేని దుస్థితి. నీరు, భోజనం సరఫరా చేయడానికి వచ్చిన బోట్లలో కొంతమందిని బయటకు తరలించి అక్కడి నుంచి తెనాలి, గుంటూరులోని ఆస్పత్రులకు పంపారు. బోట్లు లేక.. ఊరు దాటలేక... లంక గ్రామాల నుంచి బయటకు వచ్చేందుకు బోట్లు అందుబాటులో లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. బయటకు వచ్చి సొంతంగా తాగునీరు, ఆహారం, ఇతర వస్తువులు తెచ్చుకుందామన్నా ప్రభుత్వం తగినన్ని బోట్లను ఏర్పాటు చేయలేదు. అలాగే పశువులకు తినేందుకు మేత లేక అవి దీనంగా అరుస్తున్నాయి. వేలాది ఎకరాల్లోని అరటి, తమలపాకు, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలు మొత్తం నీటి పాలయ్యాయి. ఒక్కో ఎకరానికి రెండు నుంచి రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఎకరం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశారు. వరద రాకతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బోటు లేదు.. ఓటి మాటలేసీఎం చంద్రబాబు దగ్గరుండి మూడు రోజులుగా హెలికాప్టర్లు, డ్రోన్లు, బోట్లతో వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ.. కనీసం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటుచేయలేదనేందుకు నిదర్శనం ఈ చిత్రం. విజయవాడలో వరద నీటిలో థర్మాకోల్ షీట్పై వెళుతున్న దివ్యాంగురాలిని చంద్రబాబు పరామర్శిస్తున్న దృశ్యమిది. -
AP: వరద బీభత్సం.. సింగ్నగర్లో హృదయ విదారక ఘటన
సాక్షి, విజయవాడ: సింగ్నగర్లో వరద బీభత్సం సృష్టించడంతో ప్రజల కష్టాలు హృదయ విదారకంగా మారాయి. వరద దాటే ప్రయత్నం చేస్తూ మహిళ మృతి చెందింది. గంగానమ్మ ఆలయం ఎదురుగా మసీదు రోడ్డులో ఈ ఘటన జరిగింది. నీటిలో నుంచి దాటుతుండగా మహిళ గుండెపోటుతో మరణించింది. తరలించలేక మృతదేహాన్ని కారుపైనే పెట్టి వదిలేశారు స్థానికులు. మొత్తం జలమయం కావడంతో జనజీవనం స్తంభించింది.కాగా, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కీసర-ఐతవరం మధ్య రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. తీరం వెంబడి 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికాలు జారీ చేసింది. -
వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు
నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
కాలుష్య కోరల్లో కుత్బుల్లాపూర్
-
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేదార్నాథ్ విపత్తు: 18 రోజులు దాటినా లభించని 17 మంది ఆచూకీ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది గల్లంతైనట్లు సోన్ప్రయాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ నడక మార్గం రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండే రోజు..: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. -
సూడాన్లో భారీ వర్షాలు.. 32మంది మృతి
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల వరదల సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో 32 మంది మృతిచెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5,575 ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా డయేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలావుండగా కస్సాలా నగరం గుండా ప్రవహించే గాష్ నది నీటి మట్టం పెరుగుతోంది.దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సూడాన్లో సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందగా, లెక్కలేనన్ని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. -
అనుమానమొస్తే వెంటనే చెప్పండి: జేకే పోలీసులు
జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా రాష్ట్రంలో అణువణువునా తనిఖీలు చేపడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు రాష్ట్రంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు.ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువు గానీ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.అనుమానాస్పదుల ఎత్తు, వారు ధరించిన దుస్తులు, వారి దగ్గర ఏవైనా ఆయుధాలు కనిపిస్తే ఆ వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని జమ్ము పోలీసు అధికారి అజయ్ శర్మ తెలిపారు. ఇటీవల కొందరు అనుమానాస్పద వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ బాలునికి కనిపించారని, ఈ విషయాన్ని ఆ బాలుడు సమీపంలోని సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియజేశాడన్నారు. అయితే అది ఆ బాలుని ఊహ మాత్రమేనని, నాలుగు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎవరి ఆచూకీ తెలియలేదన్నారు. -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక డబుల్ డెక్కర్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావా పోలీసు అధికారి సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ శనివారం రాత్రి 12:30 ప్రాంతంలో రాయ్బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే కారులో ఉన్న ముగ్గురు కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. #WATCH | Etawah, Uttar Pradesh: 7 killed in a collision between a double-decker bus and car on Agra Lucknow ExpresswaySSP Etawah Sanjay Kumar Verma says, "A double-decker bus going from Raebareli to Delhi collided with a car at around 12:30 am. There were 60 people on the bus,… pic.twitter.com/LcuMLYDLpN— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2024 -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు. 123 మంది మృతి. వందలాది మంది జాడ గల్లంతు
-
229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య
దక్షిణ ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. గోఫా జోన్ ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవహారాల విభాగం విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం మృతులలో148 మంది పురుషులు, 81 మంది మహిళలు ఉన్నారు.ఇథియోపియా దక్షిణ ప్రాంతీయ రాష్ట్ర ప్రతినిధి అలెమాయేహు బావ్డి మరణాల సంఖ్యను ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. కాగా బురదమట్టిలో నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చామని, వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని ఇథియోపియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (ఈబీసీ) తెలిపింది. మృతులలో అధికంగా స్థానికులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులు వ్యవసాయ నిపుణులు ఉన్నారని పేర్కొంది.ఘటన జరిగిన ప్రాంతంలో ఇథియోపియన్ రెడ్క్రాస్ అసోసియేషన్తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ రెస్క్యూ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో దక్షిణ ఇథియోపియాలోని గోఫా ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో భారీగా జనం సమాధి అయ్యారు. సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభంకాగా, ఇంతలో మరొక కొండచరియ విరిగిపడటం మరింత విషాదానికి దారితీసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదని, మృతదేహాలను ఇంకా బయటకు తీస్తున్నామని గోఫా ప్రాంత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ అధిపతి మార్కోస్ మెలేస్ మీడియాకు తెలిపారు. ఘటనపై స్పందించిన ఇథియోపియా ప్రధాని అభి అమ్మద్ మాట్లాడుతూ భారీ ప్రాణనష్టం తనను ఎంతగానో కలచివేసిందని, విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఫెడరల్ అధికారులను ఘటన జరిగిన ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. ఇథియోపియా పార్లమెంటేరియన్ కెమల్ హషి మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం అందిస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The death toll from two landslides in southern #Ethiopia jumped to 229 and could rise further as the search for survivors and casualties continued into a second day.Following heavy rain a landslide buried people in Gofa zone in Southern Ethiopia regional state on Sunday night,… pic.twitter.com/uVyYiUxdP4— DD News (@DDNewslive) July 24, 2024 -
తండ్రి మృతదేహాన్ని 20 కి.మీ. మోసుకెళ్లి..
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని ఆయన కుమారులు 20 కిలోమీటర్లు జట్టీలపై మోసుకెళ్లారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పంచాయతీ పరిధి ఆర్లపెంట గ్రామానికి చెందిన రవ్వా భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను తొలుత భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచగా రానురాను ఖర్చు పెరగడంతో కుమారులు సుక్మా జిల్లా పాలచల్మలో ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న భీముడు సోమవారం మృతి చెందాడు. అయితే, పాలచల్మ నుంచి స్వగ్రామమైన ఆర్లపెంట 20 కి.మీ. దూరం ఉండగా మార్గమధ్యలో పలుచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భీముడి కుమారులిద్దరు జట్టీ కట్టి తమ తండ్రి మృతదేహాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలోనుంచి జోరువానలో 20 కి.మీ. మేర నడుస్తూ తీసుకెళ్లారు. ఆర్లపెంట చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలకు వరద అడ్డంకి నిండుగా ప్రవహిస్తున్న ప్రాణహిత వేమనపల్లి: ఆఖరి మజిలీకి వరద అడ్డొచ్చింది. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామం ఉన్నా నిరుపయోగంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలో వగావత్ సాలక్క, ఎల్లెల గంగయ్య వృద్ధాప్యంతో మృతిచెందారు. వేమనపల్లిలో వైకుంఠధామం ఉన్నా నీళ్లు, కరెంటు, బాత్రూం సౌకర్యాలు లేక, శిథిలావస్థకు చేరి నిరుపయోగంగానే మారింది.ఎవరూ అక్కడ అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లరు. ప్రాణహిత నదికి తీసుకెళ్లి అంతిమ సంస్కారా లు నిర్వహిస్తుంటారు. కాగా, నాలుగు రోజులుగా ప్రాణహిత నది నిండుగా ప్రవ హిస్తోంది. సోమవారం పుష్కరఘాట్, రోడ్డుపూర్తిగా మునిగిపోవడంతో నదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం గంగయ్యను కుటుంబీకులు మత్తడివాగు వైపు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగా.. సోమవారం సాలక్క మృతదేహాన్ని సైతం అటువైపే తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంపుడొర్రె వరకు ప్రాణహిత ముంపు నీరు ఆవరించి ఉండటంతో మృతదేహంతో అంపుడొర్రె దాటి అవతలి వైపు వెళ్లారు. మత్తడి ఒర్రెలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.వరద ‘గుండాల’ గుండాల: అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర పని ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వాగులు దాటుకుంటూ ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే. మండలంలోని గుండాల – కొడవటంచ గ్రామాల మధ్య లోలెవెల్ వంతెన ఉన్నా.. వరదలు పెరగడంతో దానిపై నుంచి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కొడవటంచ గ్రామస్తులు అధికారుల కళ్లుగప్పి ఇలా ఏడుమెలికల వాగు దాటుకుంటూ వెళ్లాల్సి వచి్చంది. తప్పని డోలీ ఇక్కట్లు జ్వరంతో ఉన్న మహిళను మూడు కిలోమీటర్లు మోసుకుంటూ.. ఆ తర్వాత అంబులెన్స్లో భద్రాచలం ఆస్పత్రికి తరలింపు బూర్గంపాడు: వానాకాలం వచి్చందంటే ఆ గ్రామస్తులకు డోలీల ఇక్కట్లు తప్పడం లేదు. జబ్బు చేసినా, ఏదైనా ఆపద వచి్చనా డోలీ కట్టాల్సిందే. సరైన రహదారి లేక వారు కష్టపడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీకాలనీకి చెందిన సొడే రాజు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే గ్రామస్తులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకొచి్చ, ఆ తర్వాత ఆటోలో భద్రాచలం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.మళ్లీ అదే గ్రామంలోని నర్సమ్మ అనే మహిళ జ్వరం బారిన పడగా సోమవారం ఆమెను కుటుంబసభ్యులు డోలీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చారు. సమాచారం తెలిసిన బూర్గంపాడు ఎస్సై రాజేశ్ స్పందించి వెంటనే అంబులెన్స్ను పంపించగా అందులో నర్సమ్మను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సహకారంతో తమకు కొంతమేర డోలీ బాధ తప్పిందని బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలం ఐటీడీఏకు కూతవేటు దూరంలోనే ఉన్న తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. అంబులెన్స్ లేక.. మోటారు బైక్పై...రాజవొమ్మంగి: అభాగ్యురాలైన ఓ గిరిజన మహిళ ఆస్పత్రిలో కన్నుమూస్తే ఆమెను మోటారుసైకిల్పై ఇంటికి తరలించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో జరిగింది. మిరియాలవారి వీధి గ్రామానికి చెందినకుంజం అన్నపూర్ణ (60) అనారోగ్యంతో సోమవారం జడ్డంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది.పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో మృతదేహాన్ని తరలించేవారు కరువయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చేసేదిలేక జడ్డంగి లారీఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణజాల మల్లికార్జున్ చొరవచూపి మృతదేహాన్ని యువకుల సహాయంతో మోటారు సైకిల్పై 5 కిలోమీటర్ల దూరంలోని మిరియాలవారి వీధి గ్రామానికి చేర్చారు. -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 15 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం కానున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. నెతన్యాహు యూఎస్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చ కూడా జరగనుంది.మరోవైపు గాజాలో పోలియో వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గాజాలోని ప్రజలకు పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదు. సెంట్రల్ గాజాలోని బురెజ్ శరణార్థుల శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది మృతిచెందారు. గాజా నగరాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు తరలివెళ్లాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సైన్యం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. -
అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడి సరయూ నదీతీరంలో భక్తివిశ్వాసాలు పెల్లుబికాయి. నేటి (ఆదివారం) ఉదయం నుంచి భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి, శ్రీరాములవారిని దర్శనం చేసుకుంటున్నారు.గురు పూర్ణిమ సందర్భంగా రామనగరికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సరయూలో భక్తుల స్నానాలు మొదలయ్యాయి. శ్రీ రాముడు తన గురువైన వశిష్ణుడిని ఆరాధించాడని చెబుతారు. ఈరోజు రామాలయంలో రోజంతా గురు పూర్ణిమవేడుకలు జరగనున్నాయి. Uttar Pradesh: On Guru Purnima in Ayodhya, devotees flocked to the Sarayu River for holy dips and rituals. The city buzzed with celebrations, honoring the ancient guru-disciple tradition with extensive security measures in place pic.twitter.com/2jfVkbFhlB— IANS (@ians_india) July 21, 2024 -
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం’’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం… pic.twitter.com/lVcgXOuo8N— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్ఆర్కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు.శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్ కాలనీ మీదుగా రషీద్ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మహిళలు జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. -
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
కాంగోలోని ఒక గ్రామంలో సాయుధ దుండగులు జరిపిన హింసాకాండలో తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. కాంగో రాజధాని మిలీషియాకు సమీపంలో జరిగిన ఈ హింసాయుత దాడిలో 72 మంది మృతి చెందారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.కాంగోలో ఇటీవలి కాలంలో ప్రత్యర్థి వర్గాల మధ్య హింస తీవ్రమైంది. రాజధాని కిన్షాసాకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్సాలే గ్రామంలో ఈ హింసాయుత ఘటన చోటుచేసుకుంది. కిన్సాలే క్వేమౌత్ ప్రాంతంలో టెకే- యాకా కమ్యూనిటీల మధ్య రెండేళ్లుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా వందలాది మంది పౌరులు బలి అవుతున్నారు. దాడికి పాల్పడుతున్న వారు మొబోండో మిలీషియా సభ్యులని తెలుస్తోంది. వీరు యాకా వర్గంలోని ప్రజలను రక్షించేవారిగా పేరొందారు.క్వామౌత్ ఏరియా ప్రావిన్షియల్ అధికారి డేవిడ్ బిసాకా మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిలీషియాను తరిమికొట్టడంలో సైన్యం విజయవంతమైందన్నారు. 2024 ఏప్రిల్లో కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి సమక్షంలో కాల్పుల విరమణపై ఒప్పందం జరిగినప్పటికీ, ఈ గ్రూపుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో అవి తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని తూర్పు ప్రాంతంలో చెలరేగుతున్న హింసను నిరోధించడానికి కాంగో సైన్యం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని బంగారం ఇతర వనరులలో వాటా కోసం ఇరు వర్గాలు పరస్పరం పోరాటం సాగిస్తున్నాయి. -
హత్రాస్ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. -
పంజా విసురుతున్న పులి
సాక్షి, అమరావతి: దేశంలో వివిధ రాష్ట్రాల్లో 2019–23 మధ్య పులుల దాడి కారణంగా 315 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో పులుల దాడి కారణంగా 110 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. మహారాష్ట్రలోనే పులుల దాడిలో 200 మంది మరణించగా ఆ తరువాత ఉత్తరప్రదేశ్లో 34 మంది మృత్యువాత పడ్డారు. మానవ–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ కారణంగా జరుగుతున్న ఈ దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ సంఘర్షణను తగ్గించే చర్యల్లో భాగంగా దేశంలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద ప్రాజెక్టు టైగర్ పేరుతో వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధికి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మానవ వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు పేర్కొంది. ఎక్స్గ్రేషియాలను 24 గంటల్లోనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది.పంట పొలాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా నిరోధించేందుకు ముళ్ల కంచె, బయో ఫెన్సింగ్, ఇతర అడ్డంకులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిపింది. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నట్లు తెలిపింది. తీవ్ర గాయాలపాలైతే రెండు లక్షల రూపాయలు, చిన్న గాయాల చికిత్సలకు 25 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్లాండ్లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్కోర్వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
అసోంలో వరదలు.. 60 మంది మృతి
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల బారిన పడిన అసోం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షలమంది నిరాశ్రయులుగా మారగా, 60 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరిగింది. ఫలితంగా నగాంవ్, డిబ్రుగఢ్ తదితర జిల్లాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.మరోవైపు ఉత్తరాఖండ్లోని అలకనందా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సమీపప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో జూలైలో సాధారణం కన్నా అధికవర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్లో సాధారణంకన్నా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొంది. -
ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్కు పుట్టిన సంతానాన్ని మిక్స్డ్ పాపులేషన్గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది. వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి. -
ఇరాన్లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్లోని కష్మార్లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.ఇరాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిపోయిందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరేగిపోతున్నారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చెప్పారు.ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల సమాలోచన సదస్సు (రౌండ్టేబుల్ సమావేశం) సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్, ప్రముఖ అంబేడ్కరిస్ట్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతతో, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి, ఎన్నికల హింసను, పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సదస్సుల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే చెప్పుకోవచ్చు. నాయకులను ప్రజల చేత ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందింది. నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా మలుచుకుని పోరాటాలు చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంతరం ఐక్యతతో ముందుకు సాగితేనే ఇలాంటి దాడులను ఆపగలం. – బైరి నరేష్, సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడుయూపీ తరహా అరాచకాలకు ముఖ చిత్రంగా ఏపీ యూపీ తరహా అరాచకాలకు ఏపీ ముఖచిత్రంగా మారుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జేసీబీలతో ఇళ్లను కూలి్చవేయడం చూస్తుంటే యూపీలో పాలనే ఏపీలో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య. వీటిన్నింటినీ అడ్డుకునేందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ త్వరలో ప్రజాసంఘాలన్నింటితో కలిసి విస్తృత పోరాటం చేస్తాం. – రెంజర్ల రాజేష్, అంబేడ్కరిస్ట్, గాయకుడుకూటమి పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు చూస్తుంటే...కూటమి పాలన ఐదేళ్లలో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను అరికట్టేందుకు సరైన నిర్ణయంతో ముందుకు సాగాలి. – చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం బాధాకరం. ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మారిస్తే వారు జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక బృందాలను తీసుకువచ్చామని చెప్పినప్పటికి, ఎన్నికలైన తరువాత దాడులు జరగడం బాధాకరం. దాదాపు 30 గ్రామాల్లో మాదిగ పల్లెలను టార్గెట్ చేస్తూ కూటమి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన అధికారులు పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటు. – కె.కృçష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శిచట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన తరువాత చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది. ముఖ్యంగా పల్నాడులో వ్యాపారాలను స్వచ్ఛందంగా టీడీపీ నేతలకు అప్పగించాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు తల వంచాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా కుల ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఈ దుష్పరిణామాలపై ప్రజా సంఘాలన్ని సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. – కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీఅన్యాయంగా కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ కేసులను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. – జయసుధ, వీసీకే పార్టీ నాయకురాలుఐక్యతతో ముందుకు సాగాలి రాష్ట్రంలో దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలి. బా«ధితులకు అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రజా సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. – బాలరాజు, అంబేడ్కరిస్ట్, నెల్లూరురాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పి కూటమి అరాచకాలను ఎండగట్టాలి. – భాను, జర్నలిస్ట్ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాల, మాదిగలపై దాడులు పెరిగిపోయాయి. వీటిన్నింటిని అరికట్టాలంటే కలిసి కట్టుగా పోరాటం చేయాలి. దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితులు రావాలి. – వాసిమళ్ల విజయ్, క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ఈవీఎంలు బ్యాన్ చేయాలి ఈవీఎంలు బ్యాన్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని బ్యాన్ చేస్తేనే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి. ప్రజా సమస్యల మీద పోరాడే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. గెలిచిన వారు ప్రజా రంజక పాలన అందించాలే గానీ, వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు. – పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిరాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన 77 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరగడం గర్హనీయం. రాష్ట్రంలో మనిíÙని మనిషిగా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మనుషుల మధ్య జరుగతున్న హింసను అరికట్టాలి. బాధితుల తరపున హైకోర్టులో పోరాడటానికి మేం సిద్ధం. – వేముల ప్రసాద్, హైకోర్టు అడ్వొకేట్ప్రతి ఎన్నికల్లో దళిత పల్లెల్లో రక్తం పారుతోంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా దళిత పల్లెలే దాడులకు గురవుతున్నాయి. దాడుల్లో దళితుల రక్తం ఏరులై పారుతోంది. ఏపీలో కూటమి నేతలు దళిత పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ -
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్ఖండ్లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.వీరిలో కాన్పూర్లో ఎనిమిది మంది, చిత్రకూట్లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్పూర్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. -
కంగనా విజయం.. ఆనందంతో తల్లి, సోదరి నృత్యం
బాలీవుడ్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఓడించారు.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మండీ ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో తల్లితో పాటు డ్యాన్స్ చేస్తున్న రంగోలి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలలో కంగనా బంధువులు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ విజయం తర్వాత కంగనా ఒక పోస్ట్ను షేర్ చేశారు. దానిలో ఆమె మండీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రంలో వడదెబ్బకు 8 మంది మృతి
చిట్యాల/ హాలియా/కాసిపేట/చొప్పదండి/ములుగు/మహబూబాబాద్/వరంగల్/మునుగోడు: రాష్ట్రంలో వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో శుక్ర వారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) బైక్పై వ్యవసాయ పనిముట్ల కోసం ఉదయం నల్ల గొండ పట్టణానికి వెళ్లి పనిచూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు.చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఇదే జిల్లాలో ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా చిట్యాల బస్టాండ్లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఇదే జిల్లాకు చెందిన మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మంచినీళ్ల కోసమని కిందికి దిగి... కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్లో నివాసం ఉండే మధ్యప్రదేశ్కు చెందిన జాకీర్ హు స్సేన్(60) అనే లారీ డ్రైవర్ చొప్పదండికి సిమెంట్ లోడ్తో వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీళ్ల కోసమని కిందికి దిగాడు. ఈ క్రమంలో అతడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా వారు వచ్చి హుస్సేన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) రోజువారీగా పందులు మేపడానికి వెళ్లి ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
ఛత్తీస్గఢ్లో మారిన సమీకరణలు? కాంగ్రెస్కు అనుకూలం?
దేశంలో లోక్సభ ఎన్నికల ఆరు దశల ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఏడవ, చివరి దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో పలు రాజకీయ సమీకరణలు మారాయి. ఛత్తీస్గఢ్ విషయానికొస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లోని 11 స్థానాలకు గాను 9 స్థానాను బీజేపీ దక్కించుకుంది. అయితే ఈసారి ఓటర్లు ఏ ప్రాతిపదికన ఓటువేశారనే అంశం బీజేపీకి అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఛత్తీస్గఢ్లో మొదటి మూడు దశల్లో 11 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని లోక్సభ సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని ఓటర్ల మనోభావాలు ఇలా ఉన్నాయంటూ పలు అంశాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళల ఓట్లు బీజేపీకి పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ హామీపై కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు రిజర్వేషన్ను రద్దు, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశాలకు మద్దతు పలికారట. ఇది కాంగ్రెస్కు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.2019లో ఛత్తీస్గఢ్లో బీజేపీ 9 లోక్సభ స్థానాలు, కాంగ్రెస్ రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్కు కొంత మేలు జరిగేలా కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్కు మూడు సీట్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్నంద్గావ్లో భూపేష్ బఘేల్, బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో దుర్గ్, మహాసముంద్ స్థానాల్లో కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనే అంచనాలున్నాయి. దీంతో పాటు కోర్బా సీటులో సరోజ్ పాండే, జ్యోత్స్నా మహంత్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గెలుపు ఓటములుండే అవకాశం ఉంది. -
దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు
దేశాన్ని అగ్ని ప్రమాదాలు వణిస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్లో ఒక గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి, 27 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఢిల్లీలోని వివేక్ విహార్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి, ఆరుగురు శివువులు సజీవ దహనమయ్యాయి. ప్రతీ ఏటా వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశాన్ని వణికించిన కొన్ని అగ్ని ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుంది.1. డిసెంబర్ 1995 (హర్యానా, మండి దబ్వాలి)భారతదేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది. హర్యానాలోని మండీ దబ్వాలిలో జనరేటర్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో జరిగిన తొక్కిసలాటలో 540 మంది మృత్యువాత పడ్డారు.2. ఫిబ్రవరి 1997(ఒడిశా, బరిపడ) మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 206 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 148 మంది తీవ్రంగా గాయపడ్డారు.3. జూన్ 1997 (న్యూఢిల్లీ) గ్రీన్ పార్క్లోని ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించారు. సినిమా చూస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 103 సజీవ దహనమయ్యారు.4. జూన్ 2002 (ఆగ్రా) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని శ్రీలీ ఇంటర్నేషనల్ ఫుట్వేర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 42 మంది మృత్యువాత పడ్డారు.5. జూలై 2004(తంజావూరు, తమిళనాడు)తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ పాఠశాలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 94 మంది అమాయక చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన తమిళనాడు చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తారు.6. సెప్టెంబర్, 2005(ఖుస్రోపూర్, బీహార్) బీహార్లోని ఖుస్రోపూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది చనిపోయారు. దీంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.7. ఏప్రిల్, 2006(మీరట్) ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని విక్టోరియా పార్క్లో బ్రాండ్ ఇండియా ఫెయిర్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 100 మంది మృత్యువాత పడ్డారు.8. డిసెంబర్, 2011(కోల్కతా) కోల్కతాలోని ఏఎమ్ఆర్ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు వ్యాపించి 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి చుట్టూ మృతదేహాలు కుప్పలు కనిపించాయి.9. సెప్టెంబర్, 2012(శివకాశి, తమిళనాడు) ముదలిపట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.10. మే, 2022 (న్యూఢిల్లీ)పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 మందికి పైగా జనం మరణించారు. -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
అమేథీలో బీజేపీకి ఎదురుగాలి?
యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్సింగ్ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్లాల్ ఖట్టర్ను కూడా తొలగించారని, రమణ్సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్నాథ్సింగ్ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
ఆ పాలన మాకొద్దు.. 'బాబో'!
ఆ పాలన మాకొద్దు.. బాబో! -
వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం
-
అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు !
పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక పేరు ( Name ) పెట్టడం సహజం. అవి వాళ్ళు పూజించే కులదైవం, పూర్వీకులు, ప్రముఖులు ఎవరివైనా కావచ్చు. ఇవి చాలవన్నట్లు వారి రంగు రూపు రేఖా విలాసాలను బట్టి ఏదో ఒకటి జత చేసి పిలుస్తుంటారు. ఒక ఊరిలో ఎల్లయ్య, మల్లయ్య, రామయ్య, సోమయ్యలు ఎందరో ఉండొచ్చు. వాళ్ళను గుర్తు పట్టడానికి ఉపయోగపడేవి ఇంటిపేర్లు ( Surnames ). ఇవి సాధారణంగా వాళ్ళ వాళ్ళ వంశాన్ని, వృత్తిని బట్టి, నివసించే పరిసరాలు, వలస వచ్చిన ప్రాంతాలను బట్టి రకరకాలుగా వస్తుంటాయి, మన దేశంలోనే కాదు బయట కూడా. తెలుగు వారికి ఇంటిపేరు ముందు అసలు పేరు తర్వాత వస్తుంది. ఉత్తరాది ఇందుకు భిన్నం. ఐతే అమెరికా వంటి దేశాల్లో కూడా ఇదే తీరుమనలానే పేర్లు వెనుక వృత్తులు..అమెరికా వంటి బయటి దేశాలకు వెళ్ళాక మనవాళ్ళు కూడా అదే అనుసరిస్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ముందు ఇంటి పేరు ఉంటుంది, అమెరికాకు వెళ్లగానే మన వాళ్లు ఇంటి పేరును వెనక్కి నెట్టేస్తారు. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి అక్కడి వారి పేర్లు, ఇంటిపేర్ల సమాచారం మా పిల్లలు, కుటుంబ మిత్రులను అడిగి తెలుసుకుంటుంటాను . అమెరికాలో మనం వినే చాలా పేర్ల వెనక మనలాగే వృత్తులు (చేసే పని) ముడిపడి ఉంటాయి. అలాగే వారి వంశానికి సంబంధించిన ఇతివృత్తానికి ముడిపడి ఉంటాయి. ఉదాహారణకు స్మిత్ ( Smith ), గోల్డ్ స్మిత్ ( Gold smith ), బట్లర్ ( Butler ), కుక్ ( Cook ), టైలర్ ( Tailor ), టర్నర్ ( Turner ) వంటివి వృత్తి పరమైన పేర్లు. అలాగే కిమ్ ( Kim ) బంగారు పనిచేసే కొరియా వారు , కిండర్మన్ ( Kindermann ) అంటే ఉపాధ్యాయుడు, గాగ్నెక్స్ ( Gagneux ) అంటే ఫ్రెంచ్ రైతు, సెటిల్మైర్ ( Tenant farmer - German ) అంటే జర్మన్లో కౌలుదారు కూడా అలాంటివే. ఇక మరికొన్ని ఎక్కడి నుంచి వచ్చారన్నదానికి ముడిపడి ఉంటాయి. రామోస్ ( Ramos ) హిస్పానిక్ పేరు, గోల్మన్ ( Gole man ) తూర్పు జర్మనీ ప్రాంతాన్ని బట్టి, పెర్రీ ( పెర్రీ ) ఆంగ్ల పియర్ చెట్టు దగ్గరి నివాసి, రివేరా ( Rivera ) హిస్పానిక్ నది ఒడ్డు నివాసి, టోర్రెస్ ( Torres ) స్పానీష్ టవర్ దగ్గరి నివాసి వంటివి పరిసరాలను బట్టి వచ్చిన పేర్లు. వాషింగ్టన్ ఒక సెటిల్మెంట్ పేరు. మనిషిని బట్టి వచ్చే పేర్లు..ఇక మనిషిని చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాన్ని బట్టి మరికొందరి పేర్లు వచ్చాయి. గ్రే ( Gray ) బూడిద రంగు జుట్టున్న వ్యక్తి , వైట్ ( White ) తెల్ల జుట్టున్న వ్యక్తి, బ్రౌన్ ( Brown ) వంటివి వాళ్ళ జాతిని బట్టి వచ్చినవి. సమాజంలో బాగా బతికిన వాళ్లకు సంబంధించిన వాళ్ల పిల్లలు తమ తాత ముత్తాతల పేర్లు కలిసి వచ్చేట్టు పేర్లు కూడా పెట్టుకుంటారు. డేవిస్ ( Davis ) అంటే డేవిస్ కుమారుడు అని వాళ్ళ తండ్రిని బట్టి వచ్చిన పేరు. అలాంటివే జాన్సన్ ( Johnson ),ప్యాటర్సన్ ( Patterson ), నెల్సన్ ( Nelson ), రాబిన్సన్ ( Robinson ) వంటివి. మన దగ్గర తండ్రి పేర్లు ఉంటాయి.సినీ తారలు కూడా..అలాగే తల్లిప్రేమ కూడా కొందరిలో కనిపిస్తుంది గౌతమీపుత్ర శాతకర్ణి లాగా. దేశం ఏదైనా, మతం ఏదైనా ఆస్తికులు అన్ని చోట్లా ఉంటారు. దేవుడి పేరును తమ పేరులో పెట్టుకుంటారు. హేస్ ( Hayes ), హ్యూస్ ( Hughes ) ఐరిష్ దేవుడి పేర్లు. అలాంటిదే మార్టిన్ ( Mortin రోమన్ దేవుడు ) కూడా. మర్ఫి (Murphy ), ఫిలిప్స్ ( Phillips ) మనం ఎప్పుడో వాడి మూలకు పడేసిన రేడియో పేర్లు వాళ్లకు మాత్రం గొప్ప బలవంతులు. ఇక సినిమా నటుల సంగతి దగ్గరకుస్తే.. హాలీవుడ్ అయినా బాలీవుడ్, టాలీవుడ్ వారైనా చాలామంది తమ అసలు పేర్లు మొత్తానికే మార్చుకోవడం తెలిసిందే కదా . అలాంటిదే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అభిమాన తార, ఫ్యాషన్ ఐకాన్ మెరిలిన్ మన్రో ( Marilin Monroe ), ఆమె గారి అసలు పేరు మాత్రం నోరు తిరగని నోర్మా మార్టెన్సన్ !. --వేముల ప్రభాకర్(చదవండి: అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !) -
బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
బ్రెజిల్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 57కి చేరింది. స్థానిక అధికారులు మీడియాకు పలు వివరాల తెలిపారు.ఉరుగ్వే, అర్జెంటీనా సరిహద్దుల్లోని రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా 67 మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు. 32 వేల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని 497 నగరాల్లో మూడింట రెండొంతుల మందిపై తుఫాను ప్రభావం పడింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక జలవిద్యుత్ ప్లాంట్లోని ఆనకట్ట పాక్షికంగా దెబ్బతింది. బెంటో గోన్సాల్వ్స్ పట్టణంలోని ఆనకట్ట కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.పోర్టో అలెగ్రేలోని గైబా సరస్సులో నీరు పెరిగింది. వీధులను వరద నీరు ముంచెత్తింది. పోర్టో అలెగ్రే అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. రాగల 36 గంటల్లో రియో గ్రాండే దో సుల్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. -
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం. సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కాగే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేకుంటే వారి ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్ను నిలిపివేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారాయి.రాజు కాగే తన నియోజకవర్గమైన బెలగావిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో ఆయన ‘నాకు గతంలో కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇకముందు మాకు ఎక్కువ ఓట్లు రాకపోతే, అప్పుడు మేము మీ ఇంటికి అయ్యే విద్యుత్తును నిలిపివేస్తాం. దీనిని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను’ అని ప్రజల ముందు వ్యాఖ్యానించడం చూడవచ్చు.దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటనతో ముడిపెట్టారు. డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్కు ఓటు వేయాలని, లేకపోతే మీరనుకున్న పనులు జరగవని ప్రజలతో అన్నారు. ఇది కాంగ్రెస్కు ఉన్న అర్హత, అహంకారాన్ని తెలియజేస్తోందని, ఓటర్లను తమ బానిసలు అని కాంగ్రెస్ నేతలు ఎలా అనుకుంటారని పూనావాలా ప్రశ్నించారు.కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం చిక్కోడి లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఏప్రిల్ 26న రెండో దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. మూడో దశలో మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. -
దయనీయ స్థితిలో ఆఫ్గన్ శరణార్థులు
పొరుగుదేశం పాకిస్తాన్లో ఆఫ్గన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ సుమారు ఆరు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ వారి స్వస్థలాలకు బలవంతంగా తిరిగి పంపింది. అయితే ఇప్పటికీ పాక్లో కనీసం 10 లక్షల మంది ఆఫ్గన్ శరణార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.బహిష్కరణ భయంతో ఆఫ్గన్ శరణార్థులు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పాకిస్తాన్లో తల దాచుకుంటున్న వీరు తిరిగి ఆఫ్గనిస్తాన్కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో వీరికి జీవనోపాధి, అద్దె ఇల్లు, నిత్యావసరాల కొనుగోలు మొదలైనవి ఎంతో కష్టతరంగా మారాయి.తాజాగా కరాచీ పోలీసులు 18 ఏళ్ల ఆఫ్గన్ యువకుడి నుంచి నగదు, ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిపోర్టేషన్ సెంటర్కు పంపారు. అక్కడి నుంచి ఆ యువకుడిని ఆఫ్ఘనిస్థాన్కు తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు 50 ఏళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ వదిలి పాక్ తరలివచ్చారు.ఆ యువకుడు ఇంతవరకూ ఎప్పుడూ ఆఫ్గనిస్తాన్కు వెళ్లలేదు. అతనిని ఆఫ్గనిస్తాన్ తరలించినప్పుడు అతని దగ్గర కట్టుబట్టలు తప్ప మరేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్లో యుద్ధ పరిస్థితుల మధ్య 17 లక్షల మంది పాకిస్తాన్కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇలా చట్టపరమైన అనుమతులు లేకుండా వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేందుకు పాక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల దాడి.. 17 మంది మృతి!
ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులు ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నిహివ్లోని ఎనిమిది అంతస్తుల భవనంపై పడ్డాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 61 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నిహివ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం మూడవ సంవత్సరంలోకి ప్రవేశించించింది. ఈ యుద్ధంలో రష్యా తన సత్తా చాటుతోంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు అదనపు సైనిక సామగ్రిని అందించకపోవడంతో అది రష్యాతో తలపడలేకపోతోంది. ఇంతలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్ను పంపిణీ చేయనున్నమని ప్రకటించారు. పాశ్చాత్య దేశాలు తమ దేశానికి వాయు రక్షణ వ్యవస్థలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యర్థించారు. తమకు తగిన వాయు రక్షణ పరికరాలు ఇప్పటికే అందివుంటే, రష్యా దాడులకు తిప్పికొట్టేవారమని అన్నారు. క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు తమ దగ్గరున్న వాయు రక్షణ క్షిపణులు అయిపోయాయని జెలెన్స్కీ తెలిపారు. కాగా ఇటీవల రష్యా .. ఉక్రెయిన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లలో ఒకదానిని ధ్వంసం చేసింది. -
దేశ రాజధానిలో ఘనంగా ఈద్ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్ మసీదు ఇమామ్లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఫతేపూర్ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్.. ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లింలు ఈద్ కోసం పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. #WATCH | Delhi: Devotees gather at Jama Masjid to offer prayers, on the occasion of Eid-ul-Fitr. pic.twitter.com/Id3OsJDGxv — ANI (@ANI) April 11, 2024 -
నేనున్నాను.. నేను విన్నాను
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వీరిని చూసి స్వయంగా బస్సు దిగి వచ్చిన సీఎం వారి సమస్యలను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. దీంతో వారంతా ముగ్ధులైపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు. – కురిచేడు/మాచవరం / పిడుగురాళ్ల రూరల్/ వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట రూరల్ దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్ఎస్పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా అంధురాలి చదువుకు సీఎం అభయం మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా జగనన్న ధైర్యమిచ్చారు మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్చైర్కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా చిన్నారి వైద్యసాయానికి భరోసా మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా సాగర్ జలాలకు హామీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా -
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి. 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మండిన సన్డే సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది. కూల్డ్రింక్స్ తాగొద్దు ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్డ్రింక్స్కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ -
ద్విచక్ర వాహనంపై ఐదుగురు.. రూ. 17 వేల జరిమానా!
సాధారణంగా మనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు రైడర్లను చూసి ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో ఒక బైక్పై ఐదుగురు కుర్రాళ్లు ప్రయాణిస్తున్న వీడియో వైరల్గా మారింది. ఐదుగురు కుర్రాళ్లు బైక్పై వెళుతుండగా వారిని ట్రాఫిక్ పోలీసులు గమనించి, వారికి భారీ మొత్తంలో చలానా జారీచేశారు. ఈ ఉదంతం చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బైక్పై ఐదుగురు కూర్చొని గ్రామంలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ట్రాఫిక్ పోలీసులు తారసడ్డారు. చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్రకుమార్ సింగ్ ఆ బైక్ నడిపే కుర్రాళ్లను అడ్డుకుని, వారికి రూ.17 వేలు చలానా జారీ చేయడంతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం గురించి చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ కార్వీ కొత్వాలి ప్రాంతంలోని ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్పై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించామన్నారు. తరువాత వారిని ఆపి, వారి పేరు, చిరునామా తెలుసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ ను తనిఖీ చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న ఈ ఐదుగురు కుర్రాళ్లకు రూ.17 వేలు చలాన్ జారీ చేశామన్నారు. అలాగే ఆ వాహనాన్ని సీజ్ చేశమన్నారు. -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
‘కోళ్లనే కాపాడలేనివాడు మమ్మల్నేం కాపాడతాడు?’
ఎన్నికల గుర్తు కారణంగా పార్టీ లేదా అభ్యర్థి ఓడిపోయారంటూ వచ్చే వార్తలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. ఎన్నికల గుర్తులు పార్టీలకు ప్రాణం లాంటివి. ఎన్నికల గుర్తును చూసి ఓటువేసేవారి సంఖ్య అధికంగానే ఉంటుందనే మాట వినిపిస్తుంటుంది. ఓటు వేసే సమయంలో గుర్తులు కనిపించకుంటే ఓటు వేయకుండానే వెనుదిరిగేవారు కూడా ఉన్నారట. అవి 1957 సాధారణ ఎన్నికలు.. పంజాబ్లో ఒక అభ్యర్థి తన ఎన్నికల చిహ్నంగా కోడిని ఎంచుకున్నాడు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తన ఎన్నికల గుర్తు గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆయన ఆ ప్రాంతంలో వందల కోళ్లను వదిలాడు. అయితే ఎక్కడినుంచో వచ్చిన ఒక నక్కల గుంపు ఆ కోళ్లను వేటాడింది. కొన్ని కోళ్లు ఎలాగోలా నక్కల బారి నుంచి తప్పించుకున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి ఓటర్లు.. నక్కల బారి నుంచి ఎన్నికల గుర్తునే కాపాడుకోలేని అభ్యర్థి మమ్మల్ని ఎలా కాపాడతాడని ఎదురుతిరిగారట. 1957 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఇటువంటి విచిత్ర ఉదంతం చోటుచేసుకుందట. యూపీలోని ఓ పోలింగ్ బూత్కి వచ్చిన కొందరు పడవ నడిపేవారు ఓటు వేయకుండానే వెనుదిరిగారట. వారిని కారణం అడిగితే లోపల బ్యాలట్ పేపర్పై బోటు గుర్తు లేదని, అందుకే ఎవరికీ ఓటు వేయకుండా వెళ్లిపోతున్నామని చెప్పారట. -
సీఎం జగన్తో జనం ఏమన్నారంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టి న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. అలాగే లబ్ధిదారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను, సూచనలు స్వీకరించారు. పింఛన్ కోసం పడిగాపులు లేవు పింఛన్ కోసం రెండు మూడు రోజులు బయట ఉండేవాళ్లం. గతంలో మా వికలాంగుల్లోనే వైకల్యానికి పర్సెంటేజ్ ప్రకారం తేడా చూపించేవాళ్లు. జగనన్న వచ్చాక ఆ తేడా లేకుండా మూడువేల పెన్షన్ ఇస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. రంగమ్మ, రాతన, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా మన ప్రభుత్వం రాకమునుపు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో 4సం.ల 10 నెలలు పెన్షన్ - రూ.1000. మీ బిడ్డ హయాంలో పెన్షన్ రూ.2 వేల నుండి రూ.3వేలకు పెంచుకుంటూ వెళ్లాం. దేశం మొత్తంలోనే మూడు వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఇంకొక్కటి లేదు. మన రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయిలు. మన తర్వాత మిగతా రాష్ట్రాలు - రెండో స్థానంలో తెలంగాణా 12వేల కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో 8వేల కోట్లు, 6 వేల కోట్లు, 4వేల కోట్లు, పెన్షన్ చూస్తే రూ.500, పక్కన ఒడిస్సాలో, ఉత్తర ప్రదేశ్ లో కూడా కేవలం రూ.500. ఒక్క మన ప్రభుత్వంలోనే అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మల మీద ప్రేమ, అభిమానం చూపిస్తూ 66లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. గతంలో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 33 లక్షలు మాత్రమే. మనం ఇస్తున్న 66 లక్షల పెన్షన్లలో 45 లక్షలు నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలే. ఇది గుర్తించమని కోరుతున్నాను. - సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు సవాల్ చేసిన అంధుడు నీ ఓదార్పు యాత్ర మొదలు నేటి మేమంతా సిద్ధం యాత్ర వరకూ 100 కార్యక్రమాల్లో నే పాల్గొన్నాను అన్నా. పోలీసులు అడ్డుపడ్డా సరే ఆగలేదు. నాకు కళ్లు లేవు అయినా నీ కళ్లతోనే నేను చూస్తున్నాను అని భావిస్తున్నాను. ఒక్కసారి నిన్ను తాకాలని ఆశపడుతున్నాను. ఇక మా నియోజకవర్గం శింగనమలకు ఓ టిప్పర్ డ్రైవర్ను అభ్యర్థిగా పెట్టారని చంద్రబాబు అంటున్నాడు. టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? అని అడుగుతున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న టిప్పర్ డ్రైవర్కి చంద్రబాబు భయపడుతున్నాడు అంటే మా వీరాంజనేయులు గెలుపు ఖాయం అయినట్టే అని చెబుతున్నా. నాకు కనిపించదు. కానీ బాబుకు కనిపిస్తుంది కదా.,.. చంద్రబాబూ...నువు చూడు.... రేపు శింగనమలలో జూన్ 4వ తారీకున గెలిచి, జెండా ఎగరేసి, జగనన్నకు నేనే స్వయంగా స్వాగతం పలుకుతాను -పాలమూరి వినోద్ కుమార్, అమ్మవారిపేట, శింగనమల, బుక్కరాయసముద్రం అనంతపురం జిల్లా. మీ సాయం మరువలేం జగనన్నా అన్నా నేను ట్రాన్స్ కోలో పనిచేసేవాడిని. ఒక ప్రమాదంలో పైనుంచి పడి నడుం విరిగింది. డ్రోన్ సభలో నన్ను పిలిచి మీరు ఐదు లక్షలు సహాయం అందించారు. మా నాన్నకు 3వేలు పెన్షన్ అందిస్తున్నారు. మీ మేలు మరిచిపోలేను. మిమ్మల్ని చూసేందుకే నా కుటుంబం అంతా ఇక్కడకు ఉదయం 6 గంటలకే వచ్చి ఎదురు చూస్తున్నాం. -బలరాం నాయక్, లక్ష్మి తాండ, తుగ్గలి, దివ్యాంగుడు పేదవాడికి పెద్ద వైద్యం ఆరోగ్యశ్రీతోనే సాధ్యం రెండేళ్ల క్రితం మా నాన్నగారికి రెండు కిడ్నీల్ ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ చేయాలని చెప్పారు. నంద్యాల, కర్నూల్ లో పెద్ద హాస్పటల్ అనడంతో గౌరీగోపాల్ హాస్పటల్ లో డయాలసిస్ చేయించుకోమన్నారు. ఆ ఆసుపత్రి పేరు ఎందుకు చెబుతున్నామంటే ఎంతో డబ్బు ఉంటేనో, బాగా పెద్దవాళ్లు అయితేనో మాత్రమే అక్కడ వైద్యం చేయించుకోగలరు అంటారు. అలాంటి ఆసుపత్రిలో మా నాన్నకు డయాలసిస్ జరిగింది. అది ఆరోగ్యశ్రీ వల్లే సాధ్యం అయ్యింది. దాని తర్వాత మా నాన్నకు కిడ్నీ మార్పిడి చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చేయించుకోగలిగాం. ఆరోగ్య శ్రీ తరఫున అధికారులు మాకు వెన్నంటి ఉండి ఎంతో సాయం చేసారు. మీరు మా ఇంటి పెద్దగా మాకు అన్నీ చేసారు. అందుకే మిమ్మలన్నే మా పెద్దన్నగా భావిస్తున్నాను -జనార్థన్ రెడ్డి, చెన్నంపల్లి గ్రామం, ఔకు మండలం, నంద్యాల జిల్లా మా ధైర్యం నువ్వే జగనన్నా మేము రైతులం. నీవు ఇస్తున్న రైతు భరోసా డబ్బును విత్తనాలకు, ఎరువులకు ఉపయోగించుకుంటున్నాం. ఇంటిపట్టా ద్వారా సొంత ఇంటి కల నెరవేరింది. మా పిల్లల చదువుల కోసం అమ్మఒడి ఇస్తున్నారు. ప్రజల గుండెల్లో నమ్మకం, ధైర్యం మీరు. ఆ నమ్మకం, ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోము. మిమ్మల్ని గెలిపించుకోవాడానికి మేమంతా సిద్ధం అన్నా -మాధవి, మహిళారైతు, రాతన, కర్నూలు జిల్లా మా స్కూల్ ఎంత బాగా చేసారో జగన్ మామ నాడు నేడు పేరుతో మా స్కూల్ను ఎంతో బాగా తయారు చేసారు జగన్ మామ. కోడిగుడ్డు చిక్కీ బాగా పెడుతున్నారు. ఆరోగ్యశ్రీలో మా నాన్నకు ఆపరేషన్ కూడా జరిగింది. విద్యార్థి 7th క్లాస్, హోసూరు, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా నాకు స్ట్రోక్ వచ్చింది అన్న. మా ఎమ్మెల్యేగారి సాయంతోనే ఆపరేషన్ చేయించుకుని బయటపడగలిగాను. -లాల్ బాష, బాలుడి తండ్రి ఎప్పటికీ మీరే మాకు సీఎం జగన్ సార్ నేను పేదరాలిని. నాకు రైతుభరోసా, చేయూత, ఆసరా, ఇంటిపట్టా అన్ని పథకాలూ వచ్చాయి. జగనన్న తోడు కూడా వచ్చింది. మా కలలన్నీ నిజమైనాయి. మాకు ఎవరూ వద్దు, మీరే కావాలి, మీరే రావాలి -శ్యామల, రాతన, కర్నూలు జిల్లా నీ వల్లే మా నాన్న మాతో ఉన్నాడు మా నాన్నకు రెండు లంగ్స్ ఫెయిల్ అయ్యాయి. పెద్ద ఆసుపత్రికి వెళితే 4లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మా నాన్నకు ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మాతో ఉన్నాడు. మీ పాలనలో అందరికీ అన్ని పథకాలూ అందుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని మోసం చేసాడు. బాబు పాలనకు జగనన్న పాలనకు తేడా గమనించాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నరేష్, రాతన గ్రామం, కర్నూలు జిల్లా కరోనాలో ఆదుకుంది నువ్వే ఒక ఇల్లు నాకల. నేను చాలా పేదవాడిని. మీ పథకాలవల్ల ఎంతో లబ్ది పొందాము. దేశం అంతా కరోనాలో ఉన్నప్పుడు కరువు సమయంలో మీరు ఎంతో ఆదుకున్నారు. మా చీకటి బతుకుల్లో మీరు వెలుగులు నింపారు. అటు పొద్దు ఇటు పొడిచినా మళ్లీ నువ్వే రావాలి జగనన్నా -శివ, హోసూరు గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా కులం చూడం మతం చూడం అన్న ఒకే ఒక్కడు మా సీఎం ఈ రాష్ట్రంలో నీ వల్ల లబ్ది పొందని మనిషే లేడన్నా. నీకు ఓటు వేసినా వేయకపోయినా నీవిచ్చిన పథకాలకు లబ్దిదారులయ్యారు. వారంతా నీవే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు -సురేష్, రాతన, కర్నూలు జగనన్నవల్లే ఈరోజు నా కొడుకు బ్రతికి, బడికి పోతున్నాడు నా కొడుకు అన్నా...తల్లిలేనివాడు. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం CMRF ద్వారా 20లక్షలు వచ్చాయి. ఇదీ సమస్య అని వెళ్లి అడగగానే రెండే రోజుల్లో మా నాయకులు నా కొడుకు వైద్యానికి డబ్బులు సాంక్షన్ చేయించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈరోజు నా బిడ్డ స్కూల్ వెళుతున్నాడు. ఈ సాయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు -లక్షణ, చందూరి గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా నా అన్నవే అనుకుంటున్నా.. అన్నా నా భర్త ఆరోగ్య మిత్రలో ఉద్యోగిగా చేస్తూ మరణించాడు. నాకు మీ పాలనలో అన్ని పథకాలు వచ్చాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా పథకాలు అన్నీ అందాయి. డిగ్రీ చదివిన నాకు ఓ చిన్న ఉద్యోగం ఇప్పిస్తే మీకెంతో రుణపడి ఉంటాను అన్నా. మిమ్మల్ని నా అన్నగా అనుకొని ఈ సాయం అర్థిస్తున్నాను. -సరస్వతి, తుగ్గలి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అర్హులకు అందని పథకం అంటూ లేదు అన్నా నీ పాలనలో మాకు అందని పథకమంటూ లేదు. మా ఆయనకు ఆరోగ్య శ్రీద్వారా ఆపరేషన్ జరిగింది. తుగ్గలి మండలంలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ మాకు సాంక్షన్ చేయండి చాలు సర్. షరీఫా, చెన్నంపల్లి గ్రామం, తుగ్గలి మండలం తమ మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజీ కావాలని కోరిన చెల్లెమ్మ షరీఫాకు సీఎం వైఎస్ జగన్ బదులిచ్చారు. 'ప్రతి మండలానికీ రెండు జూనియర్ కాలేజీలు పెట్టబోతున్నామని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లలకోసమే పెడుతున్నామని తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న రెండు హైస్కూల్ ను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్టు తెలియజేసారు. ఇదంతా నాడు నేడు ద్వారా దశలవారీగా జరుగుతుందని మీ పిల్లలను ఇంటర్ వరకూ మీ మండలంలోనే చదివించుకోవచ్చని భరోసా ఇచ్చారు. -
సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!
వేసవి అనంగానే దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతారు. ఈ కాలంలో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ కూల్డ్రింక్లు వంటిపై ఆధారపడుతుంటారు. అయితే కూల్డ్రింక్లు తాగొద్దని సూచించడంతో అందరూ..కొబ్బరి బొండాలు, చెరుకు రసాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో చెరుకు రసానికి మించిన పానీయం లేదని చెప్పొచ్చు. ఇది తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. పైగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అందరికీ ఇది మంచిదేనా? కాదా సవివరంగా తెలుసుకుందామా!. నోరూరించే తియ్యటి చెరుకు రసాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి చెరుకురసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! ఎన్ని లాభలంటే.. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది. చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్ ఫైబర్ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. వీళ్లు అస్సలు తాగొద్దు.. అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్ని చోట్ల చెరకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు. అలాగే ఒక్కోసారి ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!) -
విద్యుదాఘాతానికి గురైన ఏడుగురి పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలోని పాండవ్ నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు ఈ ప్రాంతానికి చెందిన ఏడుగురిని విషాదంలోకి నెట్టివేశాయి. హోలీ వేడుకల్లో మునిగిన వీరంతా హై టెన్షన్ లైన్ను పొరపాటున తాకారు. ఫలితంగా వీరు తీవ్రంగా కాలిపోయారు. ప్రస్తుతం బాధితులు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గాయపడిన ఈ ఏడుగురిలో ముగ్గురు పిల్లలు, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. దీనికి ముందు వీరంతా తమ ఇంటి పైకప్పులపైకి చేరి హోలీ ఆడుతున్నారు. ఈ సమయంలో నీరు హైటెన్షన్ లైన్ను తాకడంతో పేలుడు సంభవించింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులలో ఒక జీఆర్పీ జవాన్తో పాటు అతని భార్య కూడా ఉన్నారు. #WATCH | A few members of a family admitted to Safdarjung hospital after getting injured due to an electric shock from a high-tension wire in the Pandav Nagar area of East Delhi, after celebrating Holi: Delhi Police pic.twitter.com/1nkJONc5HU — ANI (@ANI) March 25, 2024 -
Colors of Politics: నెహ్రూ నుంచి మోదీ వరకూ..
హోలీకి భారత రాజకీయాలకు మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. మొఘల్ చక్రవర్తులు, బ్రిటీష్ పాలకులు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోలీ సందర్భంగా ప్రజల కోసం తన నివాసం తీన్ మూర్తి భవన్ తలుపులు తెరిచేవారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఢిల్లీ ప్రజలతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగే హోలీ వేడుకలు రాజకీయాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తీన్ మూర్తి భవన్ గతంలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివాసంగా ఉండేది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ భార్య జాక్వెలిన్ భారత్లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నాటి దౌత్యవేత్త బీకే నెహ్రూ తన ఆత్మకథ ‘నైస్ గైస్ ఫినిష్ సెకండ్’లో జాక్వెలిన్ హోలీ వేడుకల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. హోలీ వేడుల్లో నెహ్రూ.. 1962లో కెన్నెడీ భార్య జాక్వెలిన్ తొమ్మిది రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె హోలీ రోజు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోజు ఆమె జవహర్లాల్ నెహ్రూకు వీడ్కోలు చెప్పడానికి తీన్ మూర్తి భవన్కు వెళ్లారు. ఆమె ఆరోజున ఫ్యాషన్ దుస్తులు ధరించారు. అక్కడ ఉన్న నాటి అమెరికన్ అంబాసిడర్ గాల్బ్రైత్ కుర్తా పైజామా ధరించి వచ్చారు. బికె నెహ్రూ తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నెహ్రూ హోలీ వేడుకలను ఎంతో ఇష్టపడేవారు. జాక్వెలిన్ తీన్ మూర్తి భవన్కు చేరుకోగానే వివిధ రంగులలో గులాల్ నింపిన చిన్న గిన్నెలను వెండి ట్రేలో ఆమె ముందుకు తీసుకువచ్చారు. నెహ్రూ.. జాక్వెలిన్ నుదుటిపై గులాల్ రాశారు. అక్కడే ఉన్న ఇందిరా గాంధీ కూడా జాక్వెలిన్కు రంగులు పూశారు. అనంతరం నెహ్రూ.. పాలం విమానాశ్రయంలో జాక్వెలిన్ కెన్నెడీకి వీడ్కోలు పలికారు. దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా హోలీ ఆడేవారు. తీన్ మూర్తి భవన్లో హోలీని జరుపుకునే ఈ ప్రక్రియ 1963 వరకు కొనసాగింది. 1964లో నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆ సంవత్సరం అక్కడ హోలీ జరగలేదు. 1964లో ఆయన మరణానంతరం ప్రధానమంత్రి నివాసంలో హోలీ వేడుకలు నిలిచిపోయాయి. ఇందిర నివాసంలో.. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సఫ్దర్జంగ్ రోడ్లోని ఆమె ప్రభుత్వ నివాసంలో హోలీ వేడుకలు జరిగేవి. ఆరోజు వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక వంటకాలు వడ్డించేవారు. తరువాతి కాలంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు తమ ఇంట్లో హోలీ ఆడేవారు. పలువురు కాంగ్రెస్ నేతలు వారి నివాసానికి చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొనేవారు. వాజపేయి, మోదీల రంగుల కేళి అటల్ బిహారీ వాజపేయి దేశ ప్రధాని అయ్యాక ఆయనకు గులాల్ పూయడానికి చాలా మంది ఆయన నివాసానికి వెళ్లేవారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాటి ప్రధాని వాజపేయి సమక్షంలో హోలీ వేడుకలు చేసుకున్న ఉదంతం 1999లో జరిగింది. వాజ్పేయి తన నివాసంలో హోలీ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మిత్రపక్షాలే కాకుండా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. నాడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాడు వాజ్పేయి, మోదీ పరస్పరం రంగులు పూసుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ ఆడేవారు. నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హోలీ వేడుకలను మానసిక వికలాంగ చిన్నారుల మధ్య జరుపుకునేవారు. ఇందులో రంగులు, గులాల్ బదులు పూలు జల్లుకునేవారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారిక నివాసంలో కూడా హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుగుతుంటాయి. పాత ఢిల్లీ వీధుల్లో ఉరిమే ఉత్సాహం పాత ఢిల్లీ వీధుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు అతీతంగా నేతలంతా ఒకరినొకరు కలుసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తాజాగా ఆయన దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నూతన చైతన్యం, ఉత్సాహం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. -
హోలీ రాకుండానే యువకుల హంగామా!
రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది. కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 లక్షల 94 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్ ‘ఆ కారు నంబర్ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు. Water-Balloon Kalesh (On 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too on the street) pic.twitter.com/2rU5jLe4f6 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 19, 2024 -
ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అందరూ మహిళలు, చిన్న పిల్లలే. ఇవి బాధ్యత రహితమైన దాడులని ఆప్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఖోస్ట్, పక్టికా ప్రావిన్సుల్లోని పౌరుల నివాసాలపై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ వైమానిక దాడులు జరిగినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే దాడులని పేర్కొన్నారు. కాగా, ఆదివారం ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి పాక్ భూభాగంలోనే పాకిస్తాన్ సైన్యంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనికులు పలువురు చనిపోయారు. వీటికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అధ్యకక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు జరగడం గమనార్హం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే మిలిటెంట్ గ్రూపునకు గట్టి పట్టుంది. ఈ మిలిటెంట్లు పాకిస్తాన్ సైనికులపై దాడి జరిపి లెఫ్టినెంట్ కల్నల్తో సహా పలువురు జవాన్లను హతమార్చారు. వీరి అంత్యక్రియల సమయంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని జర్దారీ ప్రకటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదీ చదవండి.. అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్ -
అండర్ వాటర్ మెట్రోకు అనూహ్య ఆదరణ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మెట్రోలో తాజాగా సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోల్కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘వందే భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. #CommercialServices on #KaviSubhash-#HemantaMukhopadhyay stretch begins this morning.... pic.twitter.com/6bCxoz5oO9 — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 కోల్కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లోని హౌరా మైదాన్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 7 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి మరో మెట్రో బయలుదేరింది. కోల్కతా మెట్రోపాలిటన్ రవాణా నెట్వర్క్లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నదికి దిగువన ఉంది. నది కింద ఉన్న ఈ సొరంగం పొడవు 520 మీటర్లు. Regular service on Howrah Maidan - Esplanade, Kolkata Metro started today! pic.twitter.com/Rp2ofTHFS9 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 15, 2024 కోల్కతా మెట్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు ఫొటోలలో ప్రయాణికులు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. ప్రయాణ సమయంలో, ఒక ప్రయాణికుడు ప్లకార్డుపై ‘భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మోడీ జీ’ అని రాశారు. కాగా హుగ్లీ నది దిగువ భాగాన్ని గుర్తించే సొరంగ భాగాన్ని నీలిరంగు ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ వాటర్ మెట్రో మార్గంలో ప్రతి 12 నుండి 15 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి. #Metro passengers queuing up at #Esplanade Metro station this morning to be a part of the history..... pic.twitter.com/smVgUQX9uJ — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 -
ఆకర్షిస్తున్న ఆగ్రా మెట్రో.. 4 రోజుల్లో 1.22 లక్షల మంది ప్రయాణం!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు. 2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్వర్క్కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. -
తాబేలు మాసం తిని తొమ్మిదిమంది మృతి.. 78 మందికి అనారోగ్యం!
ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు. ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి!
ఇండోనేషియాలోని సుమత్రా దీవులు ప్రకృతి విలయానికి అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఇండోనేషియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి డోనీ యుస్రిజల్ తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వసం సృష్టించాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 19 కి చేరుకుంది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడినకారణంగా 14 గృహాలు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
యూపీలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి!
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గౌరబాద్షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో శనివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బీహార్లోని సీతామర్హి నుంచి ప్రయాగ్రాజ్కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్పూర్ నుంచి కెరకట్ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. ఆయన కారు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ధ్వంసమైన కారు, లారీని క్రేన్, జేసీబీల సాయంతో పోలీసులు తొలగించారు. -
‘శని’ వారికి వ్యాపార భాగస్వామి.. లాభాలలో వాటా కూడా!
దేశంలో శని దేవుని ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో ఒక ప్రత్యేకమైన శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటారు. ఇందుకోసం ఒక డాక్యుమెంట్ తయారు చేసి, శని దేవుని పాదాల చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని వారు నమ్ముతారు. ఇప్పటి వరకు 1,500 మంది వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. ఈ ఆలయం ఖర్గోన్ జిల్లాలోని మోర్ఘడిలో శ్రీ సిద్ధ శని గజానన్ శక్తిపీఠం రూపంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 21 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ దేవుని విగ్రహం లేదు. శిల రూపంలో శనిదేవుడు ఇక్కడ కొలువుదీరాడు. ఇక్కడికి వచ్చిన పలువురు వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారని ఆలయ పూజారి సందీప్ బార్వే తెలిపారు. వారు వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని శనిదేవునికి సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి, తమ వ్యాపారంలో పురోగతి కోసం శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటారు. ఇందుకోసం వారు ఒక దరఖాస్తును వారు నింపుతారు. దానిలో తన వ్యాపారంలో శని దేవుడిని భాగస్వామిగా చేస్తున్నట్లు రాస్తారు. వివాదాస్పద కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోరుతూ కూడా పలువురు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..! -
మూడేళ్లలో 3,200 రోడ్డు ప్రమాదాలు, 1,231 మంది మృతి!
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో గత మూడేళ్లలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో గత మూడేళ్లలో మొత్తం 3200 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1231 మంది మృతి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 23 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఖర్గోన్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ టీఐ దేవేంద్ర సింగ్ పరిహార్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 24 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాలను తగ్గించేందుకు కలెక్టర్ నేతృత్వంలో అన్ని రోడ్ ఏజెన్సీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రోడ్ల విస్తరణ, నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించనున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు.. 39 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కారణంగా 39 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ వివరాలను ఖామా ప్రెస్ వెల్లడించింది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయెక్ మాట్లాడుతూ హిమపాతం కారణంగా వేలాది పశువులు కూడా మృతి చెందాయన్నారు. హిమపాతం, వర్షం కారణంగా 637 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 14 వేల పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం, మంచు తుఫాను తర్వాత సోమవారం సలాంగ్ హైవేను తెరిచారు. సార్ ఎ పుల్ నివాసి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ భారీవర్షాలు, కురుస్తున్న హిమపాతం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మంచు కారణంగా భారీ సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయన్నారు. పలు రోడ్లు బ్లాక్ అయ్యాయని, ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పశువుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్,హెరాత్ ప్రావిన్సులలో పశువుల యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. -
యూపీలో కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురు గల్లంతు!
యూపీలోని బులంద్షహర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న కారు వర్షం కారణంగా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అలాగే ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. వీరిని గాలించేందుకు రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమంది మంది ప్రయాణిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక జహంగీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్నా కాలువలో కారు పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే డీఎం, ఎస్ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. -
అడుగడుగునా అవమానించే హోటల్కు జనం క్యూ!
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. ‘డైలీ మెయిల్’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్ చేసే ఈ హోటల్లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది. -
తిండి లేక అలమటిస్తున్న పాలస్తీనియన్లు!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు. -
సోనియా గాంధీ భావోద్వేగ లేఖ!
రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ బుధవారం (ఫిబ్రవరి 14) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభకు వెళుతుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఆ విమర్శలకు వివరణగా రాయ్బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది. ఈ సన్నిహిత సంబంధం ఎంతో పాతది. నా అత్తమామల నుండి నాకు అదృష్టంలా వచ్చింది’ అని సోనియా గాంధీ ఆ లేఖలో రాశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का रायबरेली की जनता के नाम संदेश- pic.twitter.com/6zlJkWjwvi — Congress (@INCIndia) February 15, 2024 రాయ్బరేలీతో అనుబంధం.. ‘రాయ్బరేలీతో మా కుటుంబ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో మీరు నా మామగారైన ఫిరోజ్ గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఆయన తర్వాత నా అత్తగారు ఇందిరాగాంధీని కూడా ఇలానే ఢిల్లీకి పంపారు. నా జీవితంలోని ఒడిదుడుకులలలో మీ ప్రేమ, ఉత్సాహం దొరికింది’ గత రెండు దఫాల ఎన్నికల్లో.. ‘నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత, నేను మీ వద్దకు వచ్చాను. మీరు నా కోసం ఆప్యాయంగా చేతులు చాచారు. గత రెండు దఫాల ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలిచిన సంగతి మరచిపోలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ కారణంగానే అని గర్వంగా చెబుతాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను’ ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు.. ‘ఇప్పుడు నా ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా నేను రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక నేను మీకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని పొందలేను. నా మనసులో ఈ వేదన అలానే ఉంటుంది. అయితే నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మీరు ఆదుకున్నట్లే ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ప్రతి కష్టంలోనూ మీరు ఆదుకుంటారని నాకు తెలుసు.పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. త్వరలోనే కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
జనంపైకి పాల ట్యాంకర్ .. ముగ్గురు మృతి, 150 మందికి గాయాలు!
సిక్కింలోని గ్యాంగ్టక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపైనున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. వీరిలో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సిక్కింలోని రాణిపూల్లోని తాంబ్లా గేమ్ ఫెయిర్లో ఆదివారం రాత్రి 7.13 గంటలకు జరిగింది. ఆ సమయంలో రాణిపూర్ టాటా మైదానం జనంతో కిటకిటలాడింది. ఈ సమయంలో హఠాత్తుగా సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీకొని నేరుగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 150 మంది గాయపడ్డారు. సిక్కిం పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జనం హాహాకారాలు మిన్నంటాయి. CCTV footage of Sikkim Milk Union truck accident at Ranipool Mela, Sikkim pic.twitter.com/wStmjBfilp — Jyoti Mukhia (@jytmkh) February 10, 2024 -
కూలిన మెట్రో స్టేషన్ వాల్... పలువురికి గాయాలు!
ఢిల్లీలోని గోకల్పురి మెట్రో స్టేషన్లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్లోని సైడ్ వాల్లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ గురువారం 11 గంటల సమయంలో గోకల్పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ (తూర్పు వైపు) కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
అమెరికాలోని డెన్వర్లోని నివాస ప్రాంతంలో ఆదివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒక యువకునితో పాటు ఒక బాలుడు ఉన్నట్లు పోలీసుశాఖ అధికార ప్రతినిధి సీన్ టోవెల్ మీడియాకు తెలిపారు. Two people have died following an early morning shooting on February 4 in a residential area of #Denver that left four other people injured, police said.https://t.co/dma1vdrviA — The Hindu (@the_hindu) February 5, 2024 ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గ్రీన్ వ్యాలీ రాంచ్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు సోషల్ మీడియా పోస్ట్లో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉదయం ఆరు గంటల సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
కొలంబియా పల్లెల్లో రోజూ స్టంట్లే
-
చంపై సోరెన్ను ‘జార్ఖండ్ టైగర్’ అని ఎందుకంటారు?
చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్ ‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు. చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్తో పాటు చంపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు. చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు. -
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్లు రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
సూడాన్లో హింస.. 52 మంది మృతి!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం (యూఎన్ఐఎస్ఎఫ్ఏ) శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్ఐఎస్ఎఫ్ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. 2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి. -
రిపబ్లిక్ డే పరేడ్ను ప్రత్యక్షంగా చూడాలంటే..
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించాలనే ఆసక్తి కలిగినవారి కోసం ఈ వివరాలు.. పరేడ్ జరిగే సమయం రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26న ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు సాగుతుంది. ఈ పరేడ్ను 77 వేల మంది కూర్చుని తిలకించవచ్చు. ఇందుకు ఏర్పాటు చేసిన కుర్చీలలో 42 వేల సీట్లను సాధారణ పౌరులకు కేటాయించారు. ఇది కూడా చదవండి: ‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు? గణతంత్ర దినోత్సవ థీమ్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. ముఖ్య అతిథి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ముందుగా జనవరి 25న జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోదీని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న ఆయన రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్కు హాజరవుతారు. పరేడ్ టిక్కెట్ ధర ఎంత? ఎలా తీసుకోవాలి? రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్గా ఉంటాయి. అన్రిజర్వ్డ్ సీట్లకు రూ. 500, రూ. 100 రూ. 20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయాలంటే.. 1) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. 2) పేరు, ఈ- మెయిల్ ఐడీ, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్లో వచ్చిన ఓటీపీని తెలియజేయడం ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాల్సి ఉంటుంది. 3) పరేడ్లో ఎఫ్డీఆర్ రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ ది రిట్రీట్ ఈవెంట్లు ఉంటాయి. దీనిలో టిక్కెట్ కొనుగోలుదారు తనకు కావలసిన ఈవెంట్ను ఎంచుకోవచ్చు. 4) టిక్కెట్ కొనుగోలుదారు తన ధృవీకరణ కోసం పేరు, చిరునామా, వయస్సు, లింగం, ఫోటో ఐడీ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్) జెరాక్స్ కాపీని సమర్పించాలి. 5) కొనుగోలు చేయాలనుకుంటున్న టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోవాలి. టిక్కెట్ల వర్గం ప్రకారం చార్జీలను చెల్లించాలి. 6) టిక్కెట్ల చార్జీలను చెల్లించిన తర్వాత క్యూఆర్ కోడ్తో పాటు బుకింగ్ వివరాలు కలిగిన నిర్ధారణ ఇమెయిల్, ఎస్ఎంఎస్ అందుతుంది. 7) ఈ-టికెట్ హార్డ్ కాపీని అందుకున్నాక, టిక్కెట్ కొనుగోలుదారు తన ఒరిజినల్ ఫోటో. ఐడీలను పరేడ్లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లాలి. వేదిక ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రవేశం పొందవచ్చు. -
పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి సెలవులు ముగియడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఏపీకి తరలి వెళ్లిన వారంతా రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వేలాది వాహనాల్లో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. చౌటుప్పల్ వద్ద పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్ద కొర్లపాడ్ టోల్ ప్లాజాల వద్ద రద్దీకి అనుగుణంగా బూత్ల సంఖ్యను పెంచారు. మరోపక్క ఏపీలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ట్రావెల్స్ బస్సులైతే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇదీచదవండి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే -
నకిలీ మందులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజ్ఞప్తి చేసింది. నకిలీ మందులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయని, ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడంలో భాగంగా పలు సూచనలు చేసింది. ► ప్రజలను మోసం చేయడానికి కొన్ని ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండేలా నకిలీ మందులు తయారు చేస్తున్నారు. వీటిలో అవసరమైన పదార్థాలేవీ ఉండవు. సుద్ద, మొక్కజొన్న పిండి లేదా బంగాళాదుంప పిండి మొదలైనవి కలిగి ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైనట్టు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ► నకిలీ మందులు రోగి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. ఇవి వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా, కాలక్రమేణా రోగికి వినాశకరమైన పరిణామాలు సృష్టిస్తాయి. ► కొన్ని నకిలీ మందులు చూడటానికి అసలు ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టం. అనుమానిత నకిలీ ఔషధం, అసలైన ఔషధం మధ్య తేడాలను గుర్తించడానికి అనుమానాస్పద ఉత్పత్తిని అదే కంపెనీకి ముందు ఉపయోగించిన ఉత్పత్తితో సరిపోల్చండి. మునుపటి ప్యాకేజింగ్తో సరిపోల్చడానికి ప్రయత్నించండి. అనుమానం వస్తే భవిష్యత్లో పోలిక కోసం మీరు ఉత్పత్తిని తరచుగా ఉపయోగిస్తుంటే దయచేసి దాని ఫొటోగ్రాఫ్ తీసుకోండి. మందులు కచ్చితత్వంతో తయారు చేస్తారు. కాబట్టి పరిమాణం, బరువు, రంగు, నాణ్యతలో ఏదైనా వైవిధ్యం నకి లీని సూచిస్తుంది. స్పెల్లింగ్ తప్పులు లేదా వ్యాకరణ దోషాలు ఉంటాయి. త యారీ తేదీ, గడువు తేదీని తనిఖీ చేయండి. టాబ్లెట్లు బాటిల్లో ఉంటే అన్ని టాబ్లెట్లు ఒకేలా కనిపించాలి. మాత్రలు చిప్ లేదా పగుళ్లు లేదా తప్పు పూత కలిగి ఉంటే, ఆ ఉత్పత్తులను కూడా అనుమానాస్పదంగా పరిగణించాలి. ► పేరున్న కంపెనీలతో ఉత్పత్తి ధరను తనిఖీ చేయండి. ఇది మరింత చౌకగా లేదా భారీ తగ్గింపుతో అందిస్తే అది నకిలీ ఉత్పత్తి కావొచ్చని అనుమానించాలి. కేంద్ర ప్రభుత్వం 300 ప్రముఖ బ్రాండ్ పేర్లను గత ఆగస్టు తర్వాత తయారు చేసింది. దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్పై బార్కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది. ప్యాకేజింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ► మెడికల్ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులను పట్టుబట్టి తీసుకోవాలి. వెబ్సైట్లు లేదా ఇతర ఇంటర్నెట్ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల నుంచి మందులు కొనుగోలు చేయవద్దు. లైసెన్సు ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి. నకిలీ మందుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు ఫోన్ చేసి చెప్పవచ్చు. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు.... మార్కెట్లో నకిలీ డ్రగ్స్ తరలింపును గుర్తించేందుకు పలుచోట్ల తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడానికి అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్లో బొల్లారంలోని ఒక గోడౌన్లో కేన్సర్ నిరోధక మందులు( నకిలీవి) స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని కాశీపూర్, ఉత్తరాఖండ్, ఘజియాబాద్ నుంచి రాష్ట్రంలోకి నకిలీ డ్రగ్స్ ప్రవేశానికి సంబంధించిన నకిలీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. అధికారులు జరిపిన దాడుల్లో నకిలీ డ్రగ్స్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న నకిలీ మందుల్లో సన్ ఫార్మా (అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో ఉపయోగించే రోసువాస్ 10 టాబ్లెట్లు) వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో తప్పుడు లేబుల్లు ఉన్నాయి. -
ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు..
ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు లేక పంటలు లక్ష్యం మేర సాగయ్యే పరిస్థితి కనిపించక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. అలాగే, ఉద్యోగ, ఉపాధి కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన త్వరలోనే తమకు ఫలాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. సూర్యుడు మకరంలోకి చేరుతూ వెలుగులను విరజిమ్మే కాలం నుంచి తమ జీవితాల్లోనూ వెలుగులు ప్రసరించాలని అంతా కోరుకుంటున్నారు. కష్టనష్టాలు, ఒడిదుడుకుల మధ్య సాగిన బతుకులు ఈ పండుగ నుంచి మారాలని కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: కస్టం మిల్లింగ్ కహానీ.. -
సంక్రాంతి :పల్లెబాట పట్టిన జనం..రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిట (ఫొటోలు)
-
రోజంతా అల్లాడించి...రోడ్డెక్కిన ట్రక్కులు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్వత్రా నో స్టాక్...! రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు. అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు. -
కూడళ్లలో పాలు పంచిన పోలీసులు..
కొత్త సంవత్సరం 2024లోకి మనమంతా కాలుమోపాం. నూతన సంవత్సరం తొలి రోజును ఆనందంగా గడిపేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే రాజస్థాన్లోని జోధ్పూర్ పోలీసులు నూతన సంవత్సరం వేళ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జోధ్పూర్ పోలీసులు ఈ ఏడాది తొలిరోజున జనం చేత పాలు తాగించారు. నూతన సంవత్సరం వేళ నగరంలోని ప్రధాన కూడళ్లలో సామాన్యుల చేత పాలు తాగించిన పోలీసులు మద్యం సేవించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే మద్యానికి బదులుతా పాలు తాగాలని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూపాల్ సింగ్ లఖావత్ కోరారు. కాగా నగరంలోని పలు కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన పాలకేంద్రాలకు భారీగా జనం తరలివచ్చారు. కొందరు అక్కడే పాలుతాగగా, మరికొందరు పాలను పాత్రలలో ఇళ్లకు వెళ్లారు. కోల్కతాలోని పార్క్ స్ట్రీట్లో నూతన సంవత్సరం సందర్భంగా పలువురు హుషారుగా నృత్యాలు చేశారు. చెన్నైలోనూ అర్థరాత్రి దాటిన తరువాత కూడా నూతన సంవత్సర వేడుకలు కొనసాగాయి. మెరీనా బీచ్కు చేరుకున్న జనం సంబరాల్లో మునిగిపోయారు. ఐటీ సిటీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో జనం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇది కూడా చదవండి: పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం! #NewYear2024 पर जोधपुर पुलिस की अनूठी पहल, दूध पिलाकर दिन की शुरुआत, बाल्टी-केतली लेकर लाइन में दिखे लोग #JodhpurNews pic.twitter.com/twS0y4SHse — Khushbu Goyal (@kgoyal466) January 1, 2024 -
2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది. చర్చిలో మహిళా మతాధికారులు కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చంద్రునిపైకి నలుగురు మానవులు 2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది. అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ సూపర్కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది. అతిపెద్ద వ్యోమనౌక అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి. మూడవసారి పారిస్లో ఒలింపిక్స్ 2024లో పారిస్లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్లో జరిగే ఒలింపిక్స్కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు -
గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ / సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సును తీసుకురావాలని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకున్నారు. 2024లో సైతం అన్ని రకాల సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించడంతో పాటు, సమానత్వం, శాంతియుత, సుస్థిర, ఆరోగ్యకర సమాజం కోసం కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్లో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
ఇళ్లకొచ్చి బెదిరింపులు.. సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లకు వచ్చి, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఆధార్ కార్డులు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఏలూరు, తణుకు నగరాల్లో వీరు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్ చేసిన టీడీపీ.. ఇప్పుడు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాదలోని ఓ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆధార్ కార్డు కావాలంటూ అడిగారు. మీరెవరని ప్రశ్నించగా టీడీపీ నుంచి వచ్చామని, ఆధార్ కార్డు ఇస్తే యాప్లో వివరాలను నమోదు చేస్తామని చెప్పారు. ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ దురుసుగా అడిగారు. మీకెందుకివ్వాలంటూ ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆమెను బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఏలూరు కొత్తపేటలోనూ ఇదే విధంగా పలు ఇళ్లలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ చెప్పాలని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. స్థానికులు గట్టిగా ఎదురు తిరగడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా దెందులూరు, ఉంగుటూరు, తణుకులో కూడా టీడీపీ, జనసేనకు చెందిన పలువురు స్థానిక నాయకులు కొందరు యువకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తణుకులోనూ ఓటరు లిస్టుతో ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతూ బాబు గ్యారంటీ కార్డులు అందజేస్తున్నారు. మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీ వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం 8, 17 వార్డుల్లో ఇలాగే బెదిరించిన టీడీపీ కార్యకర్తలపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి, హెచ్చరించి పంపించారు. వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో అపరిచితులు ఎవరికీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులు, ఓటీపీ నంబర్లు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరికీ చెప్పవద్దని వాటి కోసం బలవంతం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడిదేం పని? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అండదండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకొనేందుకు వెళ్లిన వాలంటీర్లపై నానా రకాల ప్రచారం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం నియమించిన వారు. అదే ప్రాంతానికి చెంది, నిత్యం ప్రజల మధ్య ఉండి, వారికి సుపరిచితులైన వారు. అలాంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధంగా అందేలా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తే తప్పంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు అదే జనసేన, టీడీపీ వారు ఆ ప్రాంతానికి సంబంధం లేని వారిని, అపరిచితులను ఇంటింటికీ పంపి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇవ్వని వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు వస్తున్నారు అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారు. ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తాయని అవి చెప్పాలని అడుగుతున్నారు. మీకెందుకని అడిగితే టీడీపీ యాప్లో నమోదు చేయాలని అంటున్నారు. వారి తీరుతో మాకు భయంగా ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – బి.మణి, వన్టౌన్, ఏలూరు చదవండి: ఇదీ.. జగన్ కమిట్మెంట్ -
మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!
భారత్లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆదివారం కొత్తగా మరో 335 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు. కరోనాతో కన్నుమూసినవారిలో నలుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. కరోనా కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతం. డిసెంబర్ 8న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో పాజిటివ్ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మీడియాకు తెలిపారు. కాగా రాష్ట్రంలో బయటపడిన కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. కొత్త వేరియంట్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికురాలిలో నెలరోజుల క్రితమే సబ్-వేరియంట్ని గుర్తించారని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇది కూడా చదవండి: ఈ ఏటి మేటి మహిళలు వీరే! -
కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. అవును.. ఇది నిజం.. దేశంలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపధ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ రోదించారు. వేదికపై కూర్చున్న ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలో దీర్ఘశ్వాస తీసుకున్నారు. ఆ సమయంలో అతని కళ్లు మరింత ఎర్రబారాయి. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు. ఉత్తరకొరియా ప్రభుత్వ టెలివిజన్ ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసి, ప్రసారం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపుతో పాటు, సభకు హాజరైన తల్లుల రోదనను కలిపి చూపించారు. అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ కన్నీరు కారుస్తున్న చిత్రాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే కిమ్ జోంగ్ ఏడుపు అక్కడి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఉత్తరకొరియా జాతీయ టెలివిజన్లో కిమ్ ఏడుపు చూపించడం ఇదేమీ మొదటిసారి కాదని నిపుణులు అంటున్నారు. ఇది నిజమైనదా లేదా మొసలి కన్నీరా అనే అంశంతో సంబంధం లేకుండా.. కిమ్ జోంగ్ మానవత్వం కలిగిన నేత అని చూపించేందుకే అతని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహంలో భాగమని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరకొరియా సుప్రీం కమాండర్ బహిరంగంగా కన్నీరు పెట్టడమనేది తొలిసారిగా 2011డిసెంబర్లో కనిపించింది. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ సమాధి వద్ద తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ను గుర్తు చేసుకుంటూ కిమ్ కంటనీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కూడా అతని వెనుక ఉన్నారు. ‘రోడాంగ్ సిన్మున్’లో ప్రచురితమైన ఫోటోలో.. తండ్రి అంత్యక్రియల్లో కిమ్ కన్నీటిని నియంత్రించుకున్న దృశ్యం కనిపించింది. 2020, అక్టోబర్లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ జోంగ్.. కరోనా మహమ్మారి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు తన ప్రయత్నాలు సరిపోలేదని పేర్కొంటూ కిమ్ ప్రసంగ సమయంలో రోదించారు. కాగా సియోల్లోని కూక్మిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్యోడర్ టెర్టిస్కీ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా నేతలు ఏడవడం కొత్త విషయమేమీ కాదని, మాజీ నేతలు కిమ్ జోంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్ ఇలా ఏడుస్తూ కనిపించారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు 2022, జూలై 2022లో జరిగిన విక్టరీ డే ఈవెంట్లో తన భర్త పక్కన నిలుచుని ఏడుస్తూ కనిపించారు. ఉత్తర కొరియా నేతల తీరును విశ్లేషించిన ఒక నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నేతల ఏడుపులను ఆయా సందర్భాలను అనుసరించి వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. కిమ్ జోంగ్ 2020లో ఒలికించిన కన్నీరు ఉద్దేశపూర్వకంగా లేదా సెంటిమెంటల్ రాజకీయాల కోసం చేసిన చర్యగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సవాలుతో కూడిన దేశ పరిస్థితుల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఒంటరితనంతో కుమిలిపోతూ భావోద్వేగానికి లోనై ఉండవచ్చన్నారు. అలాగే తండ్రి మరణించినప్పుడు కిమ్ ఏడుపు.. తండ్రిని కోల్పోయిన బాధలోంచి వచ్చినదన్నారు. కొరియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బాలాజ్ స్జాలోంటాయ్ మాట్లాడుతూ నియంతలు బహిరంగంగా రోదించడం అనేది చాలా అరుదు అని పేర్కొన్నారు. వియత్నాం మాజీ నియంత హో చి మిన్ కూడా దీనికి ఉదాహరణ అన్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఏడుపు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అయి ఉండవచ్చన్నారు. భావోద్వేగ సందర్భాల్లో ప్రజల మందు ఉదాసీనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఇలా భావోద్వేగంతో కనిపించి ఉండవచ్చని స్జాలోంటాయ్ పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపు నిజమైనదే అయితే, అతను నిజంగా ప్రజానాయకుడైతే ఉత్తరకొరియాలో నియంతృత్వ పాలన పోయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించివుండేవారన్నారు. కిమ్ జోంగ్ ఉన్ కార్చిన కన్నీరు అతని అపరిపక్వతకు చిహ్నమని స్జాలోంటాయ్ విశ్లేషించారు. ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాకు కొత్త భయం -
భారత్ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు
భారత్ పొరుగు దేశాల్లో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈసారి ఏకకాలంలో మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్, చైనా, పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి. భూకంపం వచ్చిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ మూడు దేశాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాపువా న్యూ గినియాలో అత్యధిక తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, పాకిస్థాన్లో ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున 03:38 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదయ్యింది. పాకిస్థాన్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం చైనాలోని జిజాంగ్లో నేటి తెల్లవారుజామున 03:45 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే సమయంలో పాపువా న్యూ గినియాలోని న్యూ గినియా ఉత్తర తీరంలో తెల్లవారుజామున 03:16 గంటలకు 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ మూడు చోట్లా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది కూడా చదవండి: జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు! -
తెలంగాణ సృజనకు పట్టం!
స్టార్టప్లకు సహకారం అందించే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)తాజాగా పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ (పీఎఫ్ఐ- 2023)లో తమ ఆవిష్కర్తలు భాగస్వామ్యం వహించనుండటంపై హర్షం వ్యక్తం చేసింది. గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్స్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్ (గెయిన్), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫారమ్ల (సీ-కాంప్) సహకారంతో ‘పీఎఫ్ఐ- 2023’ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనుంది. ‘స్కేలింగ్ ఇన్నోవేషన్స్: ఫ్రమ్ ఐడియా టు ఇంపాక్ట్’ అనే థీమ్తో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, జంతు ఆరోగ్యం, వ్యవసాయ యంత్రాలు, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణం, క్లీన్ ఎనర్జీతో సహా వివిధ రంగాలలో డీప్టెక్, గ్రాస్రూట్ ఆవిష్కర్తలకు పీఎఫ్ఐ- 2023 ఒక వేదిక కానుంది. మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో బధిరులకు భద్రతా హెచ్చరిక హెల్మెట్ తయారుచేసిన ఎన్కే రాజలిపాషా, రోగులకు సహాయపడే హెల్త్ బెడ్ రూపకర్త అల్లాడి ప్రభాకర్, విద్యుత్-పొదుపు, వీధి దీపాల నియంత్రణ ఆవిష్కర్త రాజు ముప్పరపు, వ్యర్థాలను నియంత్రించే యంత్రం తయారు చేసిన తేజస్వి వెలుగపల్లి, వ్యవసాయం, గ్యాస్ సిలిండర్లతో ఆటోమేటెడ్ టైమర్ నియంత్రణ కవాటాలను రూపొందించిన ఎం గోపాల్ సింగ్ ఉన్నారు. తమ ఆవిష్కరణలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం కలగడంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు పీఎఫ్ఐ- 2023లో అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇది ఆవిష్కర్తల సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు జాతీయ వేదికపై తమ ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో నెట్వర్కింగ్ అవకాశాలు, సదస్సులు, ప్లీనరీ చర్చలు, ప్యానెల్ చర్చలు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించనున్నారు. ఇది మేథస్సును పరస్పరం పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆవిష్కర్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులతో పాటు కీలక వాటాదారులు కూడా పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ.. -
కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం..
దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రం ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఇక్కడి జనంలో చికాకు, కోపం, ఒత్తిడి తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అత్యంత కలుషిత నగరాల్లో నివసించే జనం డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట లాంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మనిషిలో కోపం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతుంది. విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మనిషి మెదడుకు చేరి, దానిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసించేవారు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం అనేది మెదడును దెబ్బతీస్తుంది. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ను అడ్డుకుంటుంది. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. ఎవరైనా కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. దాని సాధారణ పనితీరులో జోక్యం చేసుకుంటాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడిని ఎదురవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది బయటకు వెళ్లడం లేదు. మునుపటిలా స్నేహితులు, బంధువులను కలవడం తగ్గించేశారు. కనీసం పార్కుకు వెళ్లడం లేదా బయట నడవడం కూడా మానుకున్నారు ఫలితంగా ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా అలాంటి వారిలో చికాకు, కోపం పెరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి! -
ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర వర్గానికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం జహంగీర్పురిలో 434, బవానాలో 441, ద్వారకలో 412, బురారీలో 441, ఆనంద్ విహార్లో 387, అశోక్ విహార్లో 386గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైంది. ఢిల్లీ-ఎన్సిఆర్లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పర్వతాలపై మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 10.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఇదిలా ఉండగా వాయు కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానం తదుపరి దశకు చేరుకుంది. దీంతో రాజధానిలో జీఎన్జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. టూరిస్ట్ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, రాష్ట్ర రవాణా బస్సులు, డీజిల్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల్లోని అన్ని రకాల పర్మిట్లు కలిగిన బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని నిషేధించనున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు! -
నేపాల్లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు!
భారత్ పొరుగు దేశమైన నేపాల్లో ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదయ్యిందని, భూకంప కేంద్రం మక్వాన్పూర్ జిల్లాలోని చిట్లాంగ్లో ఉందని నేపాల్ సైన్స్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా నవంబర్ 3న, నేపాల్లోని జాజర్కోట్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇప్పటికీ గుడారాలలో నివసిస్తున్న దుస్థితి నెలకొంది. చలికి వీరంతా అల్లాడుతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఐదుగురు మృతిచెందారు. కాగా నవంబర్ 17న మయన్మార్లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ టంగ్ నగరానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమయ్యింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు? -
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
పాక్నూ కాటేస్తున్న వాయుకాలుష్యం.. లాహోర్ ప్రజలు విలవిల!
భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్లోనూ గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాక్లోని రెండో అతిపెద్ద నగరమైన లాహార్ పొగమంచు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురి జీవనోపాధి దెబ్బతింటోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధ్వాన్నంగా ఉంది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘ప్రమాదకర’ స్థాయిని సూచిస్తూ 470 వద్ద ఉంది. పాక్ మీడియా డాన్ పేర్కొన్న వివరాల ప్రకారం వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంటలను కాల్చడం కారణంగానే కాలుష్యం కమ్ముకుంది. పొగమంచు కారణంగా లాహోర్ నగరంలో దృశ్యమానత(విజిబులిటీ) తగ్గింది. వైమానిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లాహోర్కు చెందిన పలువురు విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధుల బారిన పడ్డారని తెలుస్తోంది. పొగమంచు నుండి తప్పించుకునేందుకు కొందరు నగరాన్ని విడిచిపెట్టారు. పాక్లోని లాహోర్, పంజాబ్లలో పొగమంచు సంక్షోభం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా? -
జమ్మూకశ్మీర్లో కంపించిన భూమి.. 3.9 తీవ్రత నమోదు!
జమ్మూకశ్మీర్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్లోని దోడాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం భయానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, రోడ్లపైకి చేరారు. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం (నవంబర్ 16) ఉదయం 9:34 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కాగా నవంబర్ 4 న నేపాల్లో సంభవించిన భూకంపంలో 70 మందికి పైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వేలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు.. స్వల్ప స్థాయి భూకంపాలు భారీ భూకంపానికి సంకేతంగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు తరచూ సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? Earthquake of Magnitude:3.9, Occurred on 16-11-2023, 09:34:19 IST, Lat: 33.05 & Long: 76.18, Depth: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/oRC4OXqC4F@Indiametdept @ndmaindia @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @DDNational pic.twitter.com/uukXdJuS7T — National Center for Seismology (@NCS_Earthquake) November 16, 2023 -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఇంకా తెల్లారని ఢిల్లీ.. పొగమంచు వీడేనా?
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత ‘తీవ్రం’గానే ఉంది. దీపావళి తర్వాత, దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభం తిరిగి తలెత్తింది. నగరం విషపూరిత పొగమంచుతో నిండిపోయింది. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో అన్ని వయసుల వారూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (బుధవారం) ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిలో కాలుష్యాన్ని కొలిచే సగటు వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) ‘తీవ్రమైన’ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉదయం 6 గంటలకు నమోదు చేసిన డేటా ప్రకారం ఎక్యూఐ ఆర్కే పురంలో 417, ఆనంద్ విహార్లో 430, ఐజీఐ విమానాశ్రయంలో 403, నరేలాలో 430, పంజాబ్ బాగ్లో 423గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ప్రతి సంవత్సరం చలికాలం ప్రవేశించడంతోనే వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి కాలుష్య కారకాలుగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్కు అమితాబ్తో దోస్తీ ఎలా కుదిరింది? #WATCH | Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB). (Visuals from IIT Delhi, shot at 6:30 am) pic.twitter.com/AxgNPrXBOv — ANI (@ANI) November 15, 2023 -
నేడు ఛత్తీస్గఢ్లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు?
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 13) ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ముంగేలి అసెంబ్లీ నియోజకవర్గంలోని జంకుహిలో ఉదయం 11 గంటల నుంచి 11:40 వరకు జరిగే ఎన్నికల సభలో ఆయన ప్రసంగించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జి ఓం మాథుర్ ఇప్పటికే ముంగేలికి చేరుకుని సభా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ప్రధాని పర్యటన స్థానిక బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి మర్నాడే ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు జనాన్ని కూడగట్టడం వారికి సవాలుగా పరిణమించింది. అయినప్పటికీ బీజేపీ నేతలు జనసమీకరణకు నడుం బిగించారు. రాష్ట్రంలో ప్రధాని పాల్గొంటున్న మూడవ బహిరంగ సభ ఇది. దీనికి ముందు మోదీ నవంబర్ నాలుగు, ఐదు తేదీలలో దుర్గ్, డోంగర్గావ్లలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. బస్తర్లో ప్రధాని రూ. 27 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే రాయ్గఢ్లో రూ.6,350 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేశారు. గత జూలై 7న ప్రధాని మోదీ రాయ్పూర్లో రూ.7,600 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఛత్తీస్గఢ్ అసెబ్లీ ఎన్నికల్లో నవంబర్ 7 మొదటి దశ పోలింగ్ జరగగా, నవంబర్ 17 రెండవ దశ పోలింగ్ జరగనుంది. ఇది కూడా చదవండి: బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
కన్ఫ్యూజ్ చేస్తున్న వివేక్..విజయం కలేనా..?
సాక్షి,మంచిర్యాల: నాయకులు పార్టీ మారడం సాధారణంగా జరిగేదే. ఓ నేత పార్టీలు మారుతూ జనాన్ని కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తుంటారు. అందుకే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో విజయాన్ని చూడలేదు. తాజాగా మరోసారి పార్టీ మారారు. ఈసారి తనకొడుకును బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. గతంలో తండ్రిని ఓడించిన అధికార పార్టీ నాయకుడు ఈసారి ఆయన తనయుడిని కూడా ఓడిస్తానంటున్నారు. ఇంతకీ అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఆ నాయకులెవరో చూద్దాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి గులాబీ పార్టీలో పేరు తెచ్చుకున్న బాల్క సుమన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. విద్యార్థి నేతగా ఉద్యమంలో చురుగ్గా ఉన్నకాలంలోనే రాష్ట్రం ఏర్పాటైనపుడు 2014లో పెద్దపల్లి నుంచి గులాబీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా చెన్నూరు నుంచే పోటీ చేస్తున్నారు సుమన్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఈసారి చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈసారి అసెంబ్లీ బరిలో వివేక్ నిలబడకుండా ఆయన తనయుడు వంశీతో రాజకీయం అరంగేట్రం చేయిస్తారని తెలుస్తోంది. వ్యాపారరంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న గడ్డం వివేక్..రాజకీయాల్లో తత్తరపాటు నిర్ణయాలతో ఓటమిపాలవుతున్నారనే టాక్ నడుస్తోంది. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్తోనే ఉన్న వివేక్ 2009లో ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాటం జరుపుతున్నా తెలంగాణ ఇవ్వడంలేదని కాంగ్రెస్ మీద కోపం వచ్చి ఆనాడు గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించాక కృతజ్ఞతతో మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ తరపున ఎంపీ సీటుకు పోటీ చేసి బాల్క సుమన్ మీద ఓడిపోయారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2016లో మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కాని.. గత ఎన్నికల్లో కేసీఆర్ సీటు ఇవ్వనందుకు కోపం వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల టైమ్లో బీజేపీకి రాజీనామా చేసి మరోసారి సొంతగూటికి చేరుకున్నారు గడ్డం వివేక్. లోక్సభ ఎన్నికల్లో మరోసారి పెద్దపల్లి నుంచే బరిలోకి దిగాలనుకుంటున్న గడ్డం వివేక్...అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు వంశీకృష్ణకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో తనను ఓడించిన బాల్క సుమన్ మీద చెన్నూరులో పోటీ చేయడానికి తనయుడిని సిద్ధం చేస్తున్నారట వివేక్. తండ్రిని ఓడించిన సుమన్ను ఓడించి అసెంబ్లీలో ప్రవేశించడానికి వివేక్ తనయుడు వంశీకృష్ణ రెడీ అవుతున్నారని టాక్. అయతే గతంలో ఒకసారి తండ్రిని ఓడించి ఎంపీగా గెలిచాను...ఈసారి కొడుకును ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అవుతానంటున్నారు గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్. తండ్రీ, తనయులను ఓడించి చరిత్ర కెక్కుతానంటున్నారు బాల్కసుమన్. ఎన్నికల వేళ రాజకీయాల్లో కోలాహలం మామూలే. రాత్రి ఒక పార్టీ.. ఉదయం మరోపార్టీ మారే నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ మారే నేతల్ని మనం చూస్తున్నాం. గడ్డం వివేక్ ఈసారైనా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని భావిస్తున్నారా? వివేక్ నిర్ణయం కరెక్టా? కాదా అన్నది చెన్నూరు ప్రజలే తేలుస్తారు. -
ఇంకా ముప్పు తప్పలేదు: నేపాల్కు శాస్త్రవేత్తల హెచ్చరిక!
నేపాల్లో సంభవించిన భూకంపంలో 132 మంది మృతి చెందారు. లెక్కకు మించిన జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కనిపించింది. నెల రోజుల వ్యవధిలో నేపాల్లో ఇది మూడో భూకంపం. భూకంపం ముప్పు ఇంకా తప్పలేదని, అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేపాల్లో మరోమారు భూకంపం సంభవించవచ్చని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. గతంలోనూ పలువురు శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతంలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చని అంచనా వేశారు. భారత టెక్టోనిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతుండటంతో అది యురేషియన్ ప్లేట్ను ఢీకొననుంది. ఫలితంగా హిమాలయాలపై ఒత్తిడి ఏర్పడి, అనేక భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాబోయే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎనిమిది కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేమని అంటున్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి? -
భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం?
మీకు తెలుసా? భూమిపై వేర్వేరు చోట్ల రోజూ కనీసం 55 భూకంపాలు సంభవిస్తూంటాయని! ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవమే. భూమి పొరల్లో నిత్యం జరిగే కదలికలు ఒక దశ దాటినప్పుడు పుట్టే భూకంపం విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతోంది. నేపాల్ శనివారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం కూడా వందల మందిని బలితీసుకుంది. ఈ నేపధ్యంలో భూకంపం అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు? ఆసక్తికరమైన ఈ వివరాలు మీ కోసం... మన భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుందని..పై భాగాన్ని క్రస్ట్, రెండో పొరను మాంటెల్.. మధ్యభాగంలోని భాగాన్ని కోర్ అంటారని భౌగోళిక శాస్త్రం చెబుతుంది. క్రస్ట్ భాగానికి వస్తే.. ఇది జిగ్సా పజిల్ మాదిరిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలనే మనం టెక్టానిక్ ప్లేట్లు అంటాం. పైగా ఈ ముక్కలు చాలా నెమ్మదిగా కదులుతూంటాయి కూడా. ఈ కదలికల కారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటూంటాయి. కొన్నిసార్లు ఒక ప్లే ఇంకోదాని కిందకు జరిగిపోతూంటాయి. ఈ క్రమంలో అక్కడ పేరుకుపోయిన ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైతే దాన్ని మనం భూకంపం అని పిలుస్తాం. స్థూలంగా ఈ భూకంపాలు నాలుగు రకాలు... భూమి పైపొరలు కదిలితే... భూమి పైపొర క్రస్ట్లోని టెక్టానిక్ ప్లేట్ల ఒరిపిడి కారణంగా వచ్చేవి ఇవి. ఈ పలకలు కదిలే సమయంలో కొన్నిసార్లు ఒకదానికిందకు ఒకటి వెళ్లిపోతాయి. లేదా దూరంగా జరుగుతాయి. ఇంకొన్నిసార్లు దగ్గరకు వస్తూంటాయి. ప్లేట్లు వేగంగా కదిలినప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రెషర్ విడుదలవుతుంది. అంటే భూకంపం వస్తుందన్నమాట. వీటిని టెక్టానిక్ భూకంపాలని పిలుస్తారు. భూకంపాలు చాలా వరకు ఈ రకమైనే. సాధారణ భూకంపాలు అని కూడా అంటారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువ వేగం ఉంటే వచ్చే భూకంపం క్షణాల్లో ఎంతటి నగరాన్నయినా ధ్వంసం చేస్తుంది. జనావాసాలు లేని, సముద్రాల్లో వచ్చే భూకంపాలతో నష్టం తక్కువ. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట్ల వస్తే మాత్రం ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఒత్తిడి తీవ్రమైతే... అగ్నిపర్వతాలకూ టెక్టానిక్ ప్లేట్లకూ మధ్య కొంత సంబంధం ఉంది. టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల వద్ద అంటే రెండు ప్లేట్లు కలుసుకునే చోట భూమి లోపలి పొరల్లో ఉండే లావా వంటి పదార్థం బయటకు వచ్చే మార్గాలీ అగ్ని పర్వతాలు. భూమ్మీద ఉన్న అత్యధిక శాతం అగ్ని పర్వతాలు ప్లేట్ల సరిహద్దుల్లోనే ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా... ఆ కదలికల కారణంగా అగ్నిపర్వతాల దిగువన కూడా ఒత్తిడి, రాపిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు భూమి పై పొర (క్రస్ట్) చిరిగిపోయి లోపలి లావా, కరిగిన రాయి పైకి ఎగజిమ్ముతుంది. దాన్నే మనం అగ్నిపర్వత భూకంపం అని పిలుస్తాం. 18వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు భూకంపాలకు అగ్నిపర్వతాలు ప్రధాన కారణమని అనుకునేవారు. కానీ ఇది సరికాదని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు ప్రయత్నించి అసలు విషయం తెలుసుకున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు భూమి లోపలి భాగంలో శూన్యత ఏర్పడుతుందని, ఈ శూన్యతను పూరించడానికి, అంతర్గత శిలలు లోనికి జారుతాయని తెలిపారు. అప్పుడు భూకంపం ఏర్పడుతుందని తేల్చారు. అయితే సాంకేతిక అభివృద్ధి ఈ భావన నిరాధారమని నిరూపించింది. హిమాలయ ప్రాంతంలో గత వందేళ్లలో అగ్నిపర్వత విస్ఫోటన సంకేతాలు లేనప్పటికీ ఈ ప్రాంతంలో భూకంపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇది అగ్ని పర్వతాల కారణంగా భూకంపాలు సంభవిస్తాయనే వాదనను తోసిపుచ్చింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే భూకంప ప్రభావిత ప్రాంతం చాలా పరిమితంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. కుప్పకూలినా... భూకంపమే! భూమిలోపలి నిర్మాణాలు (గుహలు, గనులు సొరంగాలు) కుప్పకూలినప్పుడు పుట్టే భూకంపాలు ఇవి. వీటి తీవ్రత తక్కువే. ప్రభావం కూడా తక్కువ ప్రాంతంలో కనిపిస్తుంది. కొలాప్స్ భూకంపాలు చాలా వరకూ మానవ చర్యల ఫలితంగానే వస్తూంటాయి. 2010లో కోపియాపో గనుల వద్ద, 2019లో రిడ్జ్క్రెస్ట్ (కాలిఫోర్నియా, అమెరికా) ఇలాంటి భూకంపాలు నమోదయ్యాయి. అణ్వస్త్ర, రసాయన ఆయుధాల పేలుళ్లు కూడా భూకంపాలకు కారణమవుతాయి. భారీ స్థాయి గని పేలుళ్లు కూడా! వీటిని పేలుళ్లకు సంబంధించిన భూకంపాలు ఇంగ్లీషులో చెప్పాలంటే ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారు. వీటితో విధ్వంసం తక్కువ. కాకపోతే ప్రకపంపలు చాలా దూరం ప్రయాణించగలవు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమాపై అణుబాంబు పడినప్పుడు, లెబనాన్లో 2020లో జరిగిన పేలుడు ఓ మోస్తరు స్థాయిలో భూకంపాలు పుట్టించాయి. ఇది కూడా చదవండి: నేపాల్లో భారీ భూకంపం.. 128 మంది మృతి -
ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పినప్పటి నుండి, జనం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కార్మికవర్గం దీనిని సరైనదిగా భావించడం లేదు. అయితే యాజమాన్యం దీనిని సమర్థించుకునేందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ రోజు మనం.. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు అధిక గంటలు పని చేస్తున్నారు? అత్యధిక వేతనం పొందుతున్నవారెవరు? అనే విషయాలను తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ ప్రజలు గరిష్టంగా 9.6 గంటలు పని చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో సగటు ఉద్యోగి రోజుకు 9.2 గంటలు పనిచేస్తున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగి రోజూ సగటున 9 గంటలు పని చేస్తున్నాడు. అయితే తక్కువ పనిగంటల విషయానికొస్తే దేశంలోని మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 6 గంటలు పని చేస్తారు. ఏ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రజలు అత్యధిక జీతం పొందుతున్నారో తెలుసుకుందాం. 2022వ సంవత్సరంలో ఆర్బీఐ దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కేరళ ప్రజలు దేశంలోనే అత్యధిక జీతం పొందుతున్నారు. ఇక్కడ తలసరి వార్షిక ఆదాయం రూ.1,94,767. వేతనాల గురించి చెప్పాలంటే ఇక్కడి కార్మికులకు రోజువారీ వేతనం రూ.838. కాగా హర్యానా, పంజాబ్లు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? -
అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి?
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పులలో 22 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడినట్లు సమాచారం. అమెరికాలోని లెవిస్టన్ నగరంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లిగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తాజగా అనుమానితుడి రెండు ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసింది. నిందితుడు ఉపయోగించిన నల్ల వాహనం కోసం లూయిస్టన్లో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. దుండగుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి, గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ కాల్పుల్లో జనం గాయపడ్డారని లెవిస్టన్లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. లెవిస్టన్.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో పోర్ట్ల్యాండ్కు ఉత్తరాన 35 మైళ్ల దూరంలో ఉంది. తాజాగా ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆ ప్రకటనలో కోరారు. స్థానికులు తాత్కాలికంగా ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం -
అప్పుడేం చేశారు..? ఇప్పుడేం చేస్తారు? గల్లీ ప్రశ్నిస్తోంది..!
సాక్షి హైదరాబాద్: నగరంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు సమరభేరి మోగించి కదన రంగంలో ప్రచారస్త్రలను సంధిస్తున్నాయి. సభలు, సమావేశాలు, భారీ ప్రదర్శనలు సమరోత్సాహంతో ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏళ్లకు ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోని ఓటర్లు కూడా తమ వద్ద ఉన్న ఏకైక పాశుపతాస్త్రాన్ని సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. మౌలిక సమస్యలపై నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు బస్తీ సంక్షేమ సంఘాలు సరికొత్త ప్రశ్నావళితో ముందుకొస్తున్నాయి. బస్తీలు, మురికివాడల్లో నివసించే ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా భావించే పార్టీల ధోరణి మారాలంటున్నాయి. స్థానిక నాయకులు మొదలుకొని బరిలోకి దిగిన అభ్యర్థుల వరకు బస్తీల్లోకొచ్చే వారిపై ఈ ప్రశ్నిస్త్రాలను సంధించనున్నారు. బస్తీలపై వివక్ష ఎందుకు? బస్తీలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది కంకర తేలిన సిమెంట్ రోడ్లు, ఇరుకు గల్లీలు. ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండే అగ్గిపెట్టెల్టాంటి ఇళ్లు. వాటిని ఆనుకొని నురగలు కక్కుతూ ప్రవహించే నాలాలు. ముక్కుపుటాలదిరే దుర్గంధం గుర్తుకొస్తుంది. దోమల స్వైరవిహారం కళ్ల మందు కనిపిస్తుంది. ఫుట్పాత్లు, పేవ్మెంట్లను ఆశ్రయించుకొని జీవనం సాగించే చిరువ్యాపారులు కనిపిస్తారు. దశాబ్దాలుగా అనేకసార్లు ఎన్నికలొచ్చాయి. కానీ బస్తీ ముఖచిత్రం మారలేదు. మరోసారి ఎన్నికలు వచ్చాయి. అన్ని గల్లీల్లో ఇప్పుడు పార్టీల జెండాలు ఎగురుతున్నాయి. మైకుల్లో ప్రచారం హోరెత్తుతోంది. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఈ హామీలు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్లోనూ ఉంటాయని బస్తీవాసులకు తెలుసు. అందుకే ‘గత ఎన్నికల్లో ఓటేస్తే ఏం చేశారు. ఇప్పుడు ఓటెందుకు వేయాలి’ అనే మౌలికమైన ప్రశ్నతో వివిధ పార్టీల నాయకులను నిలదీసేందుకు బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్లో సుమారు 1,500కు పైగా మురికి వాడలు, బస్తీలు ఉన్నాయి. లక్షలాది మంది నివసించే ఈ మురికివాడలే అన్ని రాకీయ పార్టీలకు ప్రధాన ఓటుబ్యాంకులు. బాధ్యతగా ఓటు వేసేది కూడా వాళ్లే. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా బస్తీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి నివాస హక్కుల కోసం పోరాడుతున్న హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య వివిధ పార్టీల అభ్యర్థులపై ఈ అ్రస్తాలను సంధిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే కావాలి? అని హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య ప్రతినిధి బ్రదర్ వర్గీస్ అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? స్థానిక సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బస్తీసంఘాలు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కరపత్రాలను పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు బస్తీల్లో పర్యటించారు. ఏయే సమస్యలను పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న సమస్యలేంటి అనే అంశాలపై చర్చిస్తున్నారు. బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని బస్తీ సంఘాలు భావిస్తున్నాయి. డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరుపైనా ప్రశ్నించనున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? బస్తీల్లో ప్రచారానికి వచ్చే నాయకులను, పార్టీలను నిలదీసేందుకు బస్తీ సంఘాలు సిద్ధం చేస్తున్న ప్రశ్నావళి ఇలా ఉంది. బస్తీ ప్రజల ఉపాధి కోసం ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు. ఎప్పటి వరకు ఇళ్లు కట్టించి ఇస్తారు. బ్యాంకుల నుంచి రుణసదుపాయం కల్పిస్తారా? వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మీ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. బస్తీలు నీటమునగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా? బస్తీల్లోని యువతను నిర్విర్యం చేసేందుకు మోహరించి ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాలాలను కబ్జా చేసిన వాళ్లను, బస్తీల్లో ప్రజలపై దౌర్జన్యం చేసే వారిని కట్టడి చేయగలరా? వరదల నివారణకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తారు? వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? గత ఎన్నికల్లో మీ పార్టీ ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? ఇప్పుడు కొత్తగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలను నిలబెట్టుకోలేని పార్టీలకు ఓటెందుకు వేయాలి? -
భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో
కెనడా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి ఈ రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తున్నదని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ నుంచి కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పంపిస్తున్నన్నట్టు భారత్ ప్రకటించిన నేపధ్యంలో జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కెనడా దౌత్యవేత్తల అధికారిక హోదాను ఏకపక్షంగా రద్దు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని ఆయన ఆరోపించారు. భారత్ చర్య కారణంగా కెనడా, భారతదేశంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు సాధారణ జీవితాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేసిందని ట్రూడో పేర్కొన్నారు. ఇది దౌత్య విధానంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. భారత్లో ఉంటున్న కెనడియన్ల సంక్షేమంపై తనలో ఆందోళన నెలకొన్నదన్నారు. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కెనడా చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలోని కెనడియన్ దౌత్యవేత్తలకు సంబంధించి కెనడా ప్రభుత్వం అక్టోబర్ 19న చేసిన ప్రకటనను గమనించామని, ఇరు దేశాల్లోని దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం గురించి చర్చించామని పేర్కొంది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్య అధికంగా ఉందని, అందుకే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లోనూ కెనడా జోక్యం పెరిగిపోయిందని భారత ప్రభుత్వం ఆరోపించింది. కెనడియన్ దౌత్యవేత్తలు వెనక్కి రావడం గురించి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ .. అక్టోబర్ 20 తర్వాత 21 మంది కెనడియన్ దౌత్యవేత్తలు మినహా మిగిలిన దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని భారతదేశం తెలియజేసిందని అన్నారు. ఈ మేరకే తాము దౌత్యవేత్తలందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారిని భారతదేశం నుండి సురక్షితంగా వెనక్కి పిలిపించామన్నారు. భారత్ చేపట్టిన ఈ చర్యను తాము ఊహించలేదని అన్నారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని, ఏ దేశంలోనైనా దౌత్యవేత్తల అధికారాలను ఏకపక్షంగా రద్దు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఇటువంటి చర్య కారణంగా ఏ దౌత్యవేత్త అయినా భారత్లో పనిచేయడం కష్టమని అన్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, గత నెల రోజులుగా ఈ అంశంపై కెనడా ప్రభుత్వంతో కలిసి భారత ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపింది. ఈ నిర్ణయాలు వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1కు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దౌత్యవేత్తల విషయంలో సమానత్వాన్ని అమలు చేయాలనే నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా భారత్ పరిగణించదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా -
దేశంలోని సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా ఏది?
అది కేరళలోని ఒక జిల్లా. అక్కడి పౌరులందరికీ రాజ్యాంగంలో నియమనిబంధనలు, హక్కులు గురించి క్షుణ్ణంగా తెలుసు. జిల్లాలోలోని ప్రతీ పౌరుడు రాజ్యాంగాన్ని చదివాడు. ఇటువంటి విలక్షణత కలిగిన జిల్లా దేశంలో ఇదొక్కటేనని చెప్పవచ్చు. ఈ జిల్లా పేరు కొల్లాం. ఈ జిల్లాలలో 10 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరికీ రాజ్యాంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. రెండేళ్ల క్రితం కేరళలోని పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. ‘సిటిజన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఈ జిల్లాల్లోని పిల్లలు, పెద్దలు, అధికారులు, శ్రామికులు ఇలా అందరూ రాజ్యాంగాన్ని చదివి, దానిపై అవగాహన ఏర్పరుచుకున్నారు. కొల్లాం జిల్లా జనాభా 14 లక్షలు. ఈ జిల్లాలోని వారికి వివిధ పంచాయతీలు, కొల్లాం జిల్లా యోజన సమితి, కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ ఎడ్మినిస్ట్రేషన్ మొదలైనవన్నీ ‘సిటిజన్-2022’ కింద రాజ్యాంగంపై అవగాహన కల్పించాయి. ఈ నేపధ్యంలో కొల్లాం రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా మార్పునొందింది. 2023 జనవరి 14న కేరళ సీఎం పినరయి విజయన్ కొల్లాం జిల్లాను భారత తొలి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా ప్రకటించారు. జిల్లాలోని 7 లక్షల కుటుంబాలకు చెందిన 23 లక్షల మంది పౌరులకు రాజ్యాంగ అక్షరాస్యతను అందించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కొల్లంలో దాదాపు 90% మందికి అవగాహన తరగతులు నిర్వహించారు. ఫలితంగా జిల్లాలో సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత సాధ్యమయ్యిందని అధికారులు చెబుతున్నారు. -
ఢిల్లీవాసులకు దిల్ లేదా? మృతదేహాన్ని తొక్కుకుంటూ పోతారా?
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని కారు ఢీకొని, చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్పై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అత్యంత అమానవీయమైన విషయం ఏమిటంటే ప్రమాదం జరిగిన తరువాత ఆ వ్యక్తి మృతదేహంపైనుంచి అనేక వాహనాలు వెళ్లిపోయాయి. కనీసం ఎవరూ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో ‘గత రాత్రి 11:20 గంటలకు, జాతీయరహదారి- 8 సర్వీస్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం ఉన్నట్లు ఉత్తర వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్కు కాల్ వచ్చిందని తెలిపారు. పరిశీలనలో ఆ గుర్తుతెలియని మృతదేహం ఫరీదాబాద్కు చెందిన 43 ఏళ్ల బిజేందర్గా గుర్తించామని పేర్కొన్నారు. బిజేందర్ టాక్సీ డ్రైవర్. ఈ ఘటనకు కారకులైన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన టాక్సీ.. మృతుడు బిజేందర్దేని పోలీసులు గుర్తించారు. బిజేందర్ ఈ టాక్సీని నడిపేవాడు. ఈ ఏడాది ఏప్రిల్లో వేరొకరి నుంచి ఈ టాక్సీ కొనుగోలు చేశాడు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. -
అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!
మధ్యయుగం, ప్రాచీన శిలాయుగలలో మానవుడు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అనేదాని గురించి నేటికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఆ కాలంలో వారిలో ఎవరైన చనిపోతే ఎలా వీడ్కోలు చెప్పేవారు, ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని చేధించారు శాస్త్రవేత్తలు. నాటి మానవులు చనిపోయిన వాళ్లకి జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఐరోపా అంతటా ప్రాచీన శిలాయుగంలో మానవ అవశేషాలపై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో నరమాంస భక్షణ గురించి వెల్లడైంది. దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్డలీనియన్లుగా పిలిచేవారు. వారు నరమాంస భక్షణ చేసేవారని తేలింది. అయితే ఎవ్వరైన చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని తెలిపారు. ఖననం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని తినేసేవారని చెప్పుకొచ్చారు. అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా ఉండేదని అన్నారు. అందుకు సంబంధించన ఎముకలు, పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు. మాగ్డలీనియన్ ప్రజల సంస్కృతి, కళ, వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనం అని, వారు ఉపయోగించిన రాయి, ఎముకలపై చెక్కిన కళఖండాలే అందుకు సాక్ష్యం అని అన్నారు. ఐరోపాలో పురాతన శిలయుగంలో రెండు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం మాగ్డలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మాగ్డలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా, ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్ల అనే మరో జాతి ప్రజలు ఉండేవారని. వీరు కూడా తమలో ఎవరైన చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ ఇరు జాతులు అంత్యక్రియల నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని, అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఐరోపాలోని గోఫ్స్ గుహలో ఉన్న కపాల పాత్రలు, ఎముకలతో చేసిన గిన్నేలు, గ్లాసులు సాక్ష్యం అని చెప్పారు. తొలుత ఎపిగ్రావెటియన్లు చనిపోయిన వారిని పాతిపెట్టేవారని, ఆ తర్వాత మాగ్డలేనియన్లు ఉన్న ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత వారి ఆచార పరంపరను ఈ జాతి వారు కొనసాగించనట్లు గుర్తించారు. నాటి మానవులు ఇంత భయానక రీతిలో అంత్యక్రియలను నిర్వహించడానికి గల కారణాలపై పరిశోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. (చదవండి: వాట్! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్ అదిరిపోలా..!) -
ఏపీకి జగనే కావాలంటోన్న జనం
-
వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? మహాత్ముని అంతరంగ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి, తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు. ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు. ‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది. ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి? -
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
స్వీట్లతో చంపేస్తారా? అన్నం పెట్టరా?
-
అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు?
ప్రపంచంలోని వివిధ దేశాలలోని ప్రజల జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ప్రజల జీవనశైలి, పని విధానంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రజల జీవితకాలం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని ప్రజలు అధికకాలం జీవిస్తుండగా, మరికొన్ని దేశాల్లోని ప్రజల ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. అమెరికాకు సంబంధించి ఒక నూతన నివేదిక పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. అమెరికాలో గత 100 సంవత్సరాలతో పోలిస్తే, ప్రజల సగటు వయస్సులో క్షీణత చోటుచేసుకున్నదని తేలింది. ఈ రిపోర్టు ప్రకారం చూస్తే అమెరికన్లు గతంతో పోలిస్తే ఇప్పుడు త్వరగా చనిపోతున్నారు. పరిశోధకులు తెలియజేసిన విషయాలను బీబీసీ ప్రపంచం ముందు ఉంచింది. అమెరికాలో పేదల సగటు వయసు తగ్గిందని పరిశోధనల్లో తేలింది. నల్లజాతి అమెరికన్ల జీవితకాలం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. సమాజంలోని అసమానతలు వయస్సుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అమెరికన్ల సగటు జీవితకాలం క్షీణించడానికి అనేక కారణాలను దానిలో తెలియజేశారు. ఇందుకు వ్యాధులతో పోరాటం, ఔషధాలు నుంచి ఆయుధాల వరకు అన్నీ బాధ్యతవహిస్తున్నాయి. సామూహిక కాల్పుల ఘటనలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల అమెరికాలో లక్షల మంది చనిపోతున్నారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి, ఇతర వ్యాధుల కారణంగా, చిన్న వయస్సులోనే మరణాలు సంభవించాయని వివరించారు. వేగంగా పెరుగుతున్న అసమానతలు, మారణాయుధాల వినియోగం, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని స్పష్టమయ్యింది. ఇది కూడా చదవండి: సింగపూర్కు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ -
అసోంలో భూకంపం.. భయంతో జనం పరుగులు!
అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదైంది. గత సోమవారం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Earthquake of Magnitude:3.1, Occurred on 01-10-2023, 03:01:33 IST, Lat: 26.08 & Long: 90.05, Depth: 17 Km ,Location: Dhubri, Assam, India for more information Download the BhooKamp App https://t.co/8bErjjuCfL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/1mxvy1CAQ5 — National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2023 -
ఆ వెయ్యిమంది రైల్వే స్టేషన్లో కుక్కల్లా ఎందుకు మొరిగారు?
మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు వందలాది మంది ఒకే చోట గుమిగూడి మిమ్మల్ని చూసి కుక్కలా మొరిగితే మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా సరే ఇటువంటి అనుభవం ఎదురైతే ఆశ్చర్యపోతారు. అవహేళన చేస్తున్నారేమోనని అనుకుంటారు. ఇటువంటి ఉదంతం బెర్లిన్లోని పోట్స్డామర్ ప్లాట్జ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే స్టేషన్ వెలుపల సుమారు వెయ్యి మంది జనం ఒకచోట గుమిగూడారు. అయితే ఉన్నట్టుండి కుక్కలా మొరగడం మొదలుపెట్టారు. రైల్వేస్టేషన్లో ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వారు సామూహికంగా మొరుగుతూ అటువైపు వచ్చిపోయే వారితో మాట్లాడుతున్నారు. ‘డైలీ మెయిల్’ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ వెలుపల సామూహికంగా కుక్కల్లా మొగిన వ్యక్తులను ట్రాన్స్-స్పెసీస్ అని అంటారు. వీరు తమను తాము కుక్కలుగా భావిస్తుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటిపై పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ Hundreds of people who identify as dogs gathered at the Potsamer Platz railroad station, in central Berlin, on Tuesday for a meeting organized by a group called 'Canine Beings' which advocates for the rights of people who identify as #dogs. Germany. pic.twitter.com/n3Wj13SeIC — Funny News Hub (@Funnynewshub) September 20, 2023 -
కాంగ్రెస్వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు.