వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు | Wayanad Landslide Again, Officials Advised Everyone In The Area To Be Vigilant | Sakshi
Sakshi News home page

వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు

Published Sun, Sep 1 2024 12:32 PM | Last Updated on Sun, Sep 1 2024 4:10 PM

Wayanad Landslide Again

నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్‌మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన  అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement