Landslides
-
కుటుంబం, తోడుంటానన్న ప్రియుడు దూరమైపోయినా..శృతి స్ఫూర్తిదాయక జర్నీ
ధైర్యంగా ఉండాలి. ఆశ నిలపాలి. స్థైర్యాన్ని కూడగట్టుకోవాలి. జూలై 30న వాయనాడ్ వరదల్లో శ్రుతి చూసిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది. పెళ్లి కోసం దాచిన డబ్బు, బంగారం నీటి పాలయ్యాయి. ఆఖరికు చేసుకోవాల్సిన కుర్రాడు కూడా యాక్సిడెంట్లో మరణించాడు. అయినప్పటికీ ఎందరో ఆమెకు తోడుగా నిలిచారు. శ్రుతి విధిని ఎదిరించి నిలబడింది. మొన్నటి సోమవారం ప్రభుత్వ ఉద్యోగిగా నియమితురాలై తన సీటులో కూచుని నవ్వింది.సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్బుక్ పేజీలో ఇలా రాశారు ‘వాయనాడ్ వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన శ్రుతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చాం. ఇవాళ మా మాట నెరవేర్చాం’ అని ఉంది అందులో. వాయనాడ్ కలక్టరెట్లోని కంప్యూటర్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా బాధ్యతలు తీసుకుని చిరునవ్వుతో చూస్తున్న శ్రుతి ఫొటోను విజయన్ తన వ్యాఖ్యకు జత చేయడం వల్ల నెటిజన్స్ అందరూ ఆ ఫొటోలోని శ్రుతిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.‘ఈ సమయంలో మా అమ్మా నాన్నలేరు. నాకు కావలసిన భర్త కూడా లేరు. అందుకు నాకు బాధగా ఉంది. కాని జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలని తెలుసుకుని ఆ విధంగా కొనసాగినందుకు సంతోషంగా ఉన్నాను’ అందామె. 24 ఏళ్ల శ్రుతి కచ్చితంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమె కోసం కేరళ అంతా తోడుగా నిలిచింది. ఇకపై నిలిచే ఉంటుంది. ఒక ధైర్యం సాటి మనిషి కల్పిస్తే బాధలో ఉన్న వ్యక్తి కోలుకుంటారనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. అలాగే దు:ఖంలో ఉన్న వ్యక్తి ధైర్యం సడలనివ్వకుండా ఉంటే సమాజం తోడు నిలిచి ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటుందనడానికి కూడా ఈ ఘటనే ఉదాహరణ.వాయనాడ్లో ఆమెవాయనాడ్లోని ఒక ప్రయివేటు సంస్థలో అకౌంటెంట్గా పని చేస్తున్న శ్రుతి తనకు బాల్య స్నేహితుడైన జాన్సన్ను వివాహం చేసుకోవాలనుకుంది. వారివి వేరు వేరు మతాలైనా ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. సెప్టెంబర్, 2024లో పెళ్లి అనుకుంటే జూన్ 1 వాళ్లు వాయనాడ్ సమీపంలోని సొంత ఇంటికి మారారు. జూన్ 2న శ్రుతికి, జాన్సన్కు నిశ్చితార్థం అయ్యింది. అంతా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉండగా జూన్ 30న వరదలు చుట్టుముట్టాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి శ్రుతి వాయనాడ్లో ఉండటం వల్ల ఆమె తప్ప కుటుంబంలోని 15 మంది మృత్యువు పాలయ్యారు. అదొక్కటే కాదు పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచి పెట్టిన బంగారం, 4 లక్షల నగదు మొత్తం వరద నాలయ్యాయి. ఇల్లు కూలిపోయింది. ఈ విషాదంలో శ్రుతి స్తంభించిపోయింది. అయితే జాన్సన్ ఆ సమయంలో ఆమెకు కొండంత అండగా ఉన్నాడు. ధైర్యం చెప్పాడు. ‘నీ దగ్గర రూపాయి లేకపోయినా నేను వివాహం చేసుకుంటా... నిన్ను సంతోషంగా ఉంచుతా’ అని మాట ఇచ్చాడు. అందరూపోయినా జాన్సన్ ఉన్నందుకు ఆమె కార్చే కన్నీటిలో ఒక చిన్న ఆశాకిరణాన్ని నిలబెట్టుకుంది.కోల్పోయిన ఆ తోడుఅయితే విధి మరోసారి శ్రుతి మీద పగబట్టింది. సెప్టెంబర్ మొదటి వారంలో తన బంధువుల సమాధులను (వాయనాడ్ వరద మృతులు) చూసి వద్దామని వ్యాన్లో జాన్సన్ బయలుదేరి తోడుగా శ్రుతిని, బంధువులను తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే ఆ వ్యాన్కు యాక్సిడెంట్ అయ్యింది. డ్రైవ్ చేస్తున్న జాన్సన్ దుర్మరణం పాలయ్యాడు.కదలిన కేరళఈ ఉదంతం తెలిసిన వెంటనే కేరళ మొత్తం కదిలింది. అందరూ శ్రుతి ఫొటోను తమ ఫోన్ల డీపీలుగా పెట్టుకుని ‘నీకు మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. వందలాది వేలాది మెసేజ్లు వెల్లువెత్తాయి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంఎల్ఏలు వచ్చి పలుకరించి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు. ఇవన్నీ శ్రుతిని నిలబెట్టాయి. ఇప్పుడు తను ప్రభుత్వ ఉద్యోగిని అయ్యింది. మర్చిపోయిన నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుంది. కాలం దయతో చూడాలి అందరినీ. అది ఇక్కట్లపాలు చేసినా వెలుతురు తీసుకువస్తుంది. (చదవండి: రణబీర్ కపూర్కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?) -
వయనాడ్ విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో సోమవారంప్రచారం చేశారు.‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా. ..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.జూలైలో వయనాడ్లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద ఇళ్లు బురదలో కొట్టుకుపోయాయి. -
భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి.. 13 మంది మృతి
యూరోపియన్ దేశమైన బోస్నియా-హెర్జెగోవినాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణగంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు, కొండచరియలు విరిగినపడిన ఘటనలో 13 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బోస్నియాకు రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.BREAKING!!! WORLD MEDIA DONT TALK ABOUT THIS !!! Bosnia and Herzegovina under heavy flooding may lives lost, many disappeared. pic.twitter.com/DniAUgk87n— Neo (@petrovicsrb) October 5, 2024 ఈ ఘటనలో శిథిలాలల కింది చిక్కుకున్న ప్రజలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కోనసాగిస్తున్నాయి. కనీసం 10 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని, మృతిచెందిన వారిలో చాలా మంది దక్షిణ బోస్నియాలోని డోంజా జబ్లానికా గ్రామంలో ఉన్నారని అధికారులు తెలిపారు.BREAKING!!! Jablanica, BOSNIA AND HERZEGOVINA: The flood destroyed the whole village. pic.twitter.com/sv4ZCpGS8n— Neo (@petrovicsrb) October 5, 2024 ‘‘జబ్లానికా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ’ అని ప్రభుత్వ అధికారి డార్కో జుకా తెలిపారు.📷: An aerial view shows the area destroyed by a landslide in Donja Jablanica, Bosnia, Saturday, Oct. 5, 2024.https://t.co/QmZXdIENx7 pic.twitter.com/1CC0JL8gyu— Voice of America (@VOANews) October 6, 2024 -
ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న యాగి
మనీలా: ఫిలిప్పీన్స్ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. క్వెజాన్ ప్రావిన్స్లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్ ప్రావిన్స్లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్ ప్రావిన్స్లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్ సుర్ ప్రావిన్స్లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు. మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్ ప్రావిన్స్లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు. పసిఫిక్ రింగ్ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్లో సంభవించిన భీకర తుపాను హయియాన్తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు
నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు
-
శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్ట్: మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం డ్యాంకు సమీపంలోని ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం పైభాగంలోని హైదరాబాద్–శ్రీశైలం రహదారిలో కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో డ్యాం వ్యూ పాయింట్ నుంచి లింగాలగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి ఈగలపెంట వరకు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, టూవీలర్పై వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అధికారులు సూచించారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో వరదనీరు పొంగి పొర్లింది. మండలంలో 130.80 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సున్నిపెంటలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ ప్రహారీ గోడ కొంత భాగం కూలిపోయింది. -
మనసు లేని బ్యాంకులు! కేరళ ప్రభుత్వం అసంతృప్తి
కేరళలో వయనాడ్ విపత్తు బాధితుల పట్ల బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితుల ఖాతాల నుంచి రుణాల ఈఎంఐలను కట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రుణాలను బ్యాంకులు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.ఈ రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భరించలేని నష్టమేమీ వాటిల్లదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం విజయన్ మాట్లాడుతూ.. బాధితుల వడ్డీ మొత్తాలలో సడలింపు లేదా నెలవారీ వాయిదాలను చెల్లించడానికి సమయాన్ని పొడిగించడం పూర్తి పరిష్కారం కాదన్నారు.గత జులై 30న జరిగిన భయానక దుర్ఘటన ప్రభావాన్ని, మిగిల్చిన శోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విపత్తులో 200 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది చనిపోయారని, విపత్తు కారణంగా వారి భూమి నిరుపయోగంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్న వారు ఇంటినే పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. బాధితులు తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ చేయడమే మన చేయగల మేలు అని సీఎం విజయన్ సూచించారు.సాధారణంగా బ్యాంకులు మాఫీ చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం చెల్లించాలని ఆశిస్తాయనీ, అయితే ఈ సమస్యపై అలాంటి వైఖరి తీసుకోవద్దని సీఎం విజయన్ అన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు సొంతంగా భరించాలని ఆయన కోరారు. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కొందరి ఖాతాల నుంచి ఈఎంఐలు కట్ చేసిన కేరళ గ్రామీణ బ్యాంకుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో యాంత్రికంగా ఉండకూడదన్నారు. -
తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!
కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్. కొండచరియలు వాయనాడ్ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్. ఎవరంటే ఆమె..!కేరళలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. ఎవరంటే ఆమె..?కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్ కాలేజీ బస్సు డ్రైవర్గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్ కేన్సర్తో చనిపోవడంతో డిప్రెషన్కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.వాయునాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్డ్రైవర్గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్కి భారీ విందు..!) -
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
Himachal: విరిగిపడిన కొండచరియలు.. 128 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 128 రహదారులు మూతపడ్డాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మండీ, బిలాస్పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లో వరద ముప్పు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి తాకిడి కారణంగా పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మండీలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్లో నాలుగు, హమీర్పూర్ జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. అలాగే 44 విద్యుత్, 67 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.మండీ జిల్లాలోని జోగిందర్నగర్లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మశాలలో 125.4, కటౌలాలో 112.3, భరారీలో 98.4, కందఘాట్లో 80, పాలంపూర్లో 78.2, పండోహ్లో 76, బైజ్నాథ్లో 75, కుఫ్రీలో 70.8, కుఫ్రిలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో సగటున 445.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. ఇప్పుడు 321.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
రేపు వయనాడ్కు ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్లో ఈనెల 10న ప్రధాని మోదీ పర్యటించనున్నారని సీఎం పినరయి విజయన్ చెప్పారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాదిమంది చనిపోవడం తెల్సిందే. బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తారని విజయన్ వివరించారు. ఈ దుర్ఘటనలో బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని సీఎం విజయన్ చెప్పారు. తమ వినతి మేరకు 9 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించిందన్నారు. ఈ కమిటీ విపత్తు తీవ్రతను అంచనా వేసి, నివేదిక ఇస్తుందన్నారు. ఈ దుర్ఘటనలో 131 మంది వరకు గల్లంతైనట్లు గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ ప్రధాని మోదీ వయనాడ్లో పర్యటనకు రానుండటం గమనార్హం. -
ఆమె గొంతుక.. మన గుండెల్లో..!
‘దయచేసి మమ్మల్ని రక్షించండి’ వణుకుతున్న గొంతుతో సహాయం కోసం నీతూ జోజో చేసిన ఆర్తనాదం కొందరి ప్రాణాలను రక్షించగలిగింది. వయనాడ్లో జూలై 30 వరదల సందర్భంగా సహాయం కోసం మొదట వచ్చిన ఫోన్ కాల్ నీతూ జోజోదే. ఆ కాల్ రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తన కుటుంబమే కాదు ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండేలా ప్రయత్నిస్తున్న క్రమంలోప్రాణాలు కోల్పోయింది నీతూ జోజో...కేరళ వరదల (2018)పై గత సంవత్సరం వచ్చిన మలయాళ చిత్రం ‘2018’లో వరద బీభత్సం, చావుకు బతుకుకు మధ్య ఊగిసలాడిన బాధితుల దృశ్యాలు, వరద అనే అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన ఇండ్లు... ఒళ్లు జలదరింప చేసే దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు వాటికి మించిన దృశ్యాలు వయనాడ్లో కనిపిస్తున్నాయి. ‘2018’ సినిమాలో ఇతరులను రక్షించాలని తపించిన వారిని ఉద్దేశించి ‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ అనే పెద్ద అక్షరాలు తెరమీద కనిపిస్తాయి. అలాంటి ఒక హీరో నీతూ జోజో.నీతు వయనాడ్లోని మూపెన్స్ మెడికల్ కాలేజీలో నర్స్. ‘కొండచరియలు విరిగిపడ్డాయి. నేను ఇక్కడ పాఠశాల వెనకాల నివసిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపగలరా. మీకు ఫోన్ చేయడానికి ముందు నేను చాలామందికి ఫోన్ చేశాను’ అంటూ వెప్పడి గ్రామం నుంచి మూపెన్ మెడికల్ కాలేజీకి ఫోన్ చేసింది నీతు.సిబ్బంది ఆమె నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని సహాయ బృందాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమీపంలో నివసిస్తున్న ఏడు కుటుంబాలు తన ఇంట్లో ఆశ్రయం పొందారని, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన తమ ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని ఫోన్లో చెప్పింది నీతు.‘ఆమె చాలా ఆందోళన, బాధతో ఫోన్ చేసింది. నేను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఆసుపత్రి నుంచి మా అంబులెన్స్ నీతు ఉంటున్నప్రాంతానికి బయలుదేరింది’ అంటుంది మూపెన్స్ మెడికల్ కాలేజీ డీజీఎం షనవాస్ పల్లియాల్.అయితే చెట్లు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయింది. అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. దీంతో నీతూకు ధైర్యం చెప్పడానికి అంబులెన్స్ డ్రైవర్, ఇతర సిబ్బంది నాన్స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రెండోసారి కొండ చరియలు విరిగిపడిన తరువాత ఫోన్ కనెక్షన్ కట్ అయింది. రోడ్లు బ్లాక్ కావడం, చూరలమాల వంతెన కొట్టుకుపోవడం వల్ల సహాయ సిబ్బంది నీతూ దగ్గరకు చేరుకోలేకపోయారు. భర్త, బిడ్డ, అత్త , ఇరుగు పొరుగు వారుప్రాణాలతో బయటపడినప్పటికీ నీతూ చనిపోయింది.‘నేను నీతూకు ఫోన్ చేసినప్పుడు తాము మృత్యువు నుంచి తప్పించుకున్నామనే ధైర్యం ఆమె గొంతులో వినిపించింది. నీతూకు ధైర్యం ఇవ్వగలిగాం గానీ దురదృష్టవశాత్తు రక్షించలేకపోయాం’ అంటుంది షనవాస్ పల్లియాల్. ఆరోజు అర్ధరాత్రి దాటిన తరువాత... నెప్పడి గ్రామంలోని నీతు ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైంది. ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేసింది. ఒకవైపు తమను రక్షించమని ఫోన్ చేస్తూనే, మరోవైపు తన ఇంటి వారిని, పొరుగువారిని సురక్షితప్రాంతానికి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.అయితే తెల్లవారుజామున నాలుగు గంటలప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడడంతో మృత్యువు చెంతకు వచ్చింది. ఇక ఎంతమాత్రం తప్పించుకోలేని పరిస్థితి. నీతూతో పాటు ముగ్గురిప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.‘మా ఇంట్లో ఉంటే సురక్షితం అని మమ్మల్ని తీసుకువెళ్లడమే కాదు. మాకు ధైర్యం చెప్పింది. ఇలా అవుతుందని అనుకోలేదు’ అని నీతును గుర్తు తెచ్చుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది పొరుగింటి మహిళ.‘నీతూ ఫోన్ కాల్ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆమెను నిర్జీవంగా చూడాల్సి వచ్చింది’ శోకతప్త హృదయంతో అంటుంది నీతూతో కలిసి మూపెన్స్ మెడికల్ కాలేజీలో పనిచేసిన ఉద్యోగి.బీభత్సాలు జరిగినప్పుడు తమప్రాణాలు అడ్డేసి ఇతరులప్రాణాలు కాపాడేవారు ఉంటారు. నీతు జోసెఫ్ను వయనాడ్ ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. -
వయనాడ్ : అంతులేని విషాదంలో ఆనంద క్షణాలు, వైరల్ వీడియో
కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయం పెను విషాదాన్ని సృష్టించింది. కుటుంబాలకు కుటుంబాలు నాశనమై పోయాయి. సొంతవారు, పొరుగువారు ఇలా సర్వం పోగొట్టుకుని గుండెలవిలసేలా కొందరు రోదిస్తోంటే, తోడును, ఉన్నగూడును కోల్పోయి మరికొంతమంది బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి సంబంధించిన విషాద కథనాలు, ఫోటోలు మనల్ని కలచివేస్తున్నాయి. ఇంతటి విషాదంలోనూ మనసుకు స్వాంతన కలిగించే కథనాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వయనాడ్లో విషాదంలో మనుషులతో పాటు అనేక మూగజీవాలు అతలాకుతలమైపోయాయి. పెంపుడు జంతువులు తమ వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో, ఎటు పోవాలో తెలియక అల్లాడిపోయాయి. అలా తమ యజమాని కోసం విశ్వాసానికి మారుపేరైన ఒక కుక్క ఆశగా ఎదురు చూసింది. కళ్లు కాయలు కాచేలా ఆరు రోజులపాటు వెదికింది. ఇక కనిపించవా అమ్మా అన్నట్టు కంట నీరు పెట్టుకుంది. చివరికి దాని ఎదురు చూపు ఫలించింది. ఆనందమైన ఆ క్షణాలు రానేవచ్చాయి. అంతే.. ఆనందంతో ఎగిరి గంతేసింది. యజమానిని చూసిన ఆనందంతో ప్రేమతో తోక ఊపుకుంటూ, ఆమెను చుట్టేసుకుంది. కళ్లు చెమర్చే ఈ దృశ్యాలు నెట్టింట్ వైరల్గా మారాయి. -
వయనాడ్ : తవ్వే కొద్ది బయటపడుతున్న మృతదేహాలు
తిరువనంతపురం : వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ ఏడో రోజు సోమవారం (ఆగస్ట్5న)ముమ్మరంగా కొనసాగుతుంది.👉కొద్ది సేపటి క్రితమే కాంతన్పరా వద్ద చిక్కుకున్న 18 మంది సహాయక సిబ్బందిని హెలికాఫ్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.👉 వాయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నది 40కిలోమీటర్ల మేర సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. 👉మొత్తం 1500మంది ఫైర్ఫోర్స్ సిబ్బంది, వాలంటీలర్లు సంయుక్తంగా కలిసి ముందక్కైలో సహాయచర్యల్ని కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో తవ్వే కొద్దీ శవాలు వెలుగులోకి వస్తున్నాయి. 👉ఇక ఆదివారం వరకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆరుజోన్లుగా విభజించిన ఆర్మీ, నేవీ, ఫారెస్ట్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు బాధితుల జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇవ్వాళ సైతం సహాయక చర్యల్ని ప్రారంభించినట్లు చెప్పారు. 👉వాయనాడ్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సహాయక శిబిరాలు నిర్వహిస్తున్న పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి.👉రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటికే 387మృత దేహాలు వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం శిధిలాల కింద వెతుకుతున్నారు. అయితే ఘటన జరిగి ఆరురోజులు కావడంతో ప్రాణాలతో బయటపడడం కష్టమేనని అంటున్నారు స్థానికులు. దాదాపూ 200మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది.👉ఆర్మీ,ఎన్డీఆర్ఎఫ్,కేరళ పోలీసులు,ఫైర్,రెస్క్యూ డిపార్ట్మెంట్లు గాలింపులు చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్నిపర్ డాగ్స్ డోన్స్ద్వారా గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు.👉కొండచరియల బీభత్సం పదుల సంఖ్యలో కుటుంబాలను బలితీసుకుంది. తమవారి ఆచూకి లభించకపోతుందా అని చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్న ప్రాంతాల్లో చూస్తున్న ఎదురుచూపులు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నాయి. Wayanad landslides: Rescue operations enter 7th day, death toll at 308Read @ANI Story | https://t.co/YAuUVbwTj4#Kerala #Wayanad #Landslides pic.twitter.com/zj7HQAO2QO— ANI Digital (@ani_digital) August 5, 2024 -
Wayanad landslide: వయనాడ్ విలయానికి... ఉమ్మడి కుటుంబం బలి!
వయనాడ్: అప్పటిదాకా ఇంటినిండా 16 మంది సభ్యుల సందడితో కళకళలాడిన ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కసారిగా కళతప్పింది. కొండల మీదుగా దూసుకొచ్చిన ప్రకృతి ప్రళయం కుటుంబాన్ని అమాంతం మింగేసింది. చూరల్మల కుగ్రామంలో ఆ ఉమ్మడి కుటుంబంలో 42 ఏళ్ల మన్సూర్ ఒక్కడే మిగిలాడు. విపత్తు రోజున ఊళ్లో లేకపోవడంతో బతికిపోయాడు. తన ఇంట్లో 16 మందిని కొండలు కబళించాయంటూ విలపిస్తున్నాడు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ విలయానికి బలైన వారి సంఖ్య 221కి చేరినట్టు కేరళ ఆదివారం ప్రకటించింది. వాస్తవ సంఖ్య 370 దాటినట్టు స్థానిక మీడియా చెబుతోంది. జీవనదిలో నిర్జీవ దేహాలు వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది.సైన్యానికి సెల్యూట్.. బాలుడి లేఖ వయనాడ్లో అన్వేషణ, సహాయక పనుల్లో సైన్యం కృషిని రాయన్ అనే స్థానిక చిన్నారిని కదలించింది. ‘మీరు నిజంగా గ్రేట్’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరీ్మకి లేఖ రాశాడు. ‘‘ధ్వంసమైన నా వయనాడ్లో బాధితులను ఆర్మీ కాపాడుతున్న తీరు చూసి గర్వపడుతున్నా. మీ ఆకలిని కేవలం బిస్కెట్లతో చంపుకుంటూ శరవేగంగా బ్రిడ్జి కట్టడం టీవీలో చూశా. నేను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తా’’ అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఆర్మీ యూనిఫాంలో మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆర్మీ అతనికి తిరుగు లేఖ రాసింది! -
Major Sita Ashok Shelke: వయనాడ్ వారియర్
వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయవిధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄ాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు...వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన చూరల్మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్పై సగర్వంగా నిలుచున్న మేజర్ సీతా షెల్కే ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.లింగ వివక్షతను సవాలు చేసి సగర్వంగా వెలుగుతున్న ఫొటో అది.‘ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లతో కలిసి మేజర్ సీత షెల్కే పదహారు గంటలోనే 24 టన్నుల సామర్థ్యం ఉన్న బెయిలీ వంతెనను నిర్మించారు’ అని అభినందిస్తూ ‘ఎక్స్’లో ΄ోస్ట్ పెట్టారు లెప్టినెంట్ కల్నల్ జేఎస్ సోది(రిటైర్డ్). తన కామెంట్తో ΄ాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.‘ఒక్క చిత్రం చాలు వంద మాటలు ఎందుకు!’ అన్నట్లు ఈ ఫొటోలలో ఒక్కటి చూసినా చాలు సీత బృందం కష్టం, శక్తిసామర్థ్యాలు తెలుసుకోవడానికి.ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శి«థిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసింది ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత.సహాయచర్యలు చేపట్టడంలో ఈ బ్రిడ్జి కీలకం కానుంది.‘ఇది సైన్యం విజయం మాత్రమే కాదు. సహాయకార్యక్రమాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు, స్థానిక అధికారులు... ఎంతోమంది విజయం’ వినమ్రంగా అంటుంది సీత.కొండచరియలు విరిగిపడిన చోట పనిచేయడం పెద్ద సవాలు. అక్కడ పురుషులతో సమానంగా పనిచేసింది సీత.మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన సీతకు ‘సాహసం’ చిన్నప్పటి నుంచి సన్నిహిత మిత్రురాలు. ఆ ధైర్యమే ఆమెను సైన్యంలోకి తీసుకువచ్చింది.మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్(ఎంఈజీ) అనేది వంతెనలు నిర్మించడం, మందు΄ాతరలను నిర్వీర్యం చేయడం...ఇలాంటి పనులెన్నో చేస్తుంటుంది. ఈ ఇంజినీరింగ్ యూనిట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే ప్రమాదాల అంచున పనిచేయడం. ఏమాత్రం అప్రమత్తంగా లేక΄ోయినా ్ర΄ాణాలు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’లోని డెబ్బై మంది సభ్యులలో ఏకైక మహిళ సీత. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అసౌకర్యం అనుకోలేదు. అధైర్య పడి΄ోలేదు.‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు.‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట.‘రిస్క్ తీసుకోక ΄ోవడం కూడా పెద్ద రిస్కే’ అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా ΄ాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు.వాయనాడ్లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్–స్టాప్గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు....రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది. -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
వయనాడ్ విధ్వంసం.. కుటుంబాన్ని రక్షించేందుకు అధికారుల సాహసం
కేరళలోని వయనాడ్ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 358కు చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అయిదో రోజు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వయనాడ్లో వర్షాలు పడుతున్నా, అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అధికారుల సాహసోపేతమైన ఆపరేషన్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలు కురిపించారు. ఈ వారం ప్రారంభంలో వాయనాడ్లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 350 మందికి పైగా మరణించారు మరియు వందల మంది తప్పిపోయారు.ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖ అధికారులు ఎనిమిది గంటలు శ్రమించి ఓ కుటుంబాన్ని ప్రాణాలతో రక్షించారు. కొండ ప్రాంతంలో చిక్కుకున్న గిరిజన వర్గానికి చెందిన నలుగురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు.పనియా కమ్యూనిటీకి చెందిన కుటుంబం లోతైన లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉన్న గుహలో చిక్కుకుపోయింది. దీంతో కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని బృందం అడవిలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి వెళ్లి రక్షించారు. అయితే వారిని చేరుకోవడానికి రెస్క్యూ టీమ్ నాలుగున్నర గంటలపాటు ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.#WayanadLandslideTeam of Kerala Forest Officers Trekked deep down into the dense forest for 8 hrs & Saved 4 Tribal Toddlers & Mother who were hiding in a cave & starving from nearly 5 daysSalute to Real Heroes 🔥🫡#WayanadDisaster #Wayanad #Armypic.twitter.com/mJ78gpRuzx— Veena Jain (@DrJain21) August 3, 2024 అయితే వారు కొద్ది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో నలుగురు పిల్లల తల్లి ఆహారం కోసం అడవిలో వెతుకుతూ ఉండగా తమ కంటపడినట్లు అధికారులు తెలిపారు. తాము రక్షించిన వారిలో తల్లిదండ్రులు, 1 నుంచి 4 ఏళ్ల మధ్యనున్న నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ముంగు ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని తెలపగా చివరకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన అధికారులు సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. ‘‘వయనాడ్లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. -
వయనాడ్ విపత్తు: ఆ 300 మంది ఎక్కడ?
వయనాడ్/కొల్లామ్: కేరళలో కొండచరియలు పడ్డాక కాపాడండంటూ ఆర్తనాదాలు చేసిన వారిని కాపాడిన సహాయక బృందాలు ఇప్పుడు కనిపించకుండా పోయిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రకృతి వినాశక విశాల ఘటనాప్రాంతాల్లో ఇంకా వస్తున్న సెల్ఫోన్ సిగ్నళ్ల సాయంతో మనుషుల జాడను గుర్తించే అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. సెల్ఫోన్ చివరి లొకేషన్ను అత్యంత ఖచ్చితత్వంతో చూపించే గూగుల్ జీపీఎస్ కోఆర్డినేట్స్, డ్రోన్ ఏరియల్ ఫొటోల సాయంతో శిథిలాలు, కూలిన చెట్లు, బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేయనున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో మరణాల సంఖ్య తాజాగా 300 దాటింది. గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.బృందాలుగా ఏర్పడి బరిలోకి..దాదాపు 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంచేశారు. అత్తమల అరాన్మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, డీఎస్జీ, కోస్ట్గార్డ్, నేవీ, స్థానిక యంత్రాంగం, కేరళ పోలీసులు, స్థానికులు, అటవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంయుక్తంగా ఈ సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ను మొదలుపెట్టారు. డ్రోన్ ఆధారిత అత్యాధునిక రాడార్ను ఢిల్లీ నుంచి తేనున్నారు. 190 అడుగుల బేలీ తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తవంతో భారీ యంత్రాలను తెచ్చేందుకు మార్గం సుగమమైంది.కేంద్రం శ్రద్ధతో పట్టించుకోవాలి: రాహుల్గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సైతం పనులను పర్యవేక్షించారు. ‘‘ఇది పెను విషాదం. ఈ ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పట్టించుకోవాలి. బాధిత కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో శాశ్వత పునరావాసం కల్పించాలి’’ అన్నారు. వారికి కాంగ్రెస్ 100 ఇళ్లు కట్టిస్తుందన్నారు.నిక్షేపంగా ఇల్లు,కుటుంబంఇంతటి విలయం మధ్య ఒక ఇల్లు నిక్షేపంగా ఉండటం రెస్క్యూ టీమ్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పడవెట్టు కున్ను ప్రాంతంలో భారీ కొండచరియలు పడినా అక్కడి ఒక ఇల్లు మాత్రం దెబ్బతినలేదు. అయితే చుట్టుప క్కల అంతా కొండచరి యలు పడిన భయానక దృశ్యాన్ని చూసిన ఆ ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులు ప్రాణభయంతో మంగళవారం నుంచి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫలానా ప్రాంతంలో తమ వారి జాడ తెలీడం లేదని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఘట నాస్థలికి చేరుకున్న హెలికాప్టర్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.పరిమళించిన మానవత్వంరూ.10 వేలు దానమిచ్చిన చిరు టీస్టాల్ యజమానురాలుసర్వం కోల్పోయిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి చిన్నపాటి టీస్టాల్ యజమానురాలు సైతం తనవంతు సాయంచేసి దానగుణాన్ని చాటారు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే వృద్ధ మహిళ సుబేదా కేరళ విలయ బాధితులకు తనవంతుగా రూ.10,000 ఇచ్చారు. ఈమె దానగుణం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘‘ బ్యాంక్ రుణం కట్టేందుకే ఈ డబ్బు దాచా. టీవీలో విషాదవార్త విని మనసు చలించింది. నెలవారీ కిస్తీ(ఈఎంఐ) తర్వాత కడదాం.. ముందు వీళ్లను ఆదుకుందాం అని భర్త సైతం నాకు మద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక వయనాడ్దాకా వెళ్లి స్వయంగా ఇచ్చే ఓపికలేక కలెక్టరేట్కు వెళ్లి ముఖ్యమంత్రి విపత్తు సహాయనిధిలో జమచేశా’ అని సుబేదా చెప్పారు. వరద బాధితుల సహాయార్ధం గతంలోనూ ఈమె తన నాలుగు మేకలను అమ్మేసి వచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు.మేజర్ సీతకు సలామ్కఠిన, విపత్కర, తీవ్ర ప్రతి కూల పరిస్థితుల్లో మహిళలు పనిచేయడం కష్టమనే భావనను ఒక్క ఫొటోతో చెదరగొట్టిన ఆర్మీ మేజర్ సీత అశోక్ శెల్కేకు అందరూ మెచ్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మీదుగా 190 అడుగుల బేలీ వంతెనను నిర్మించాల్సిన బాధ్యతను మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, సెంటర్ తలకెత్తుకుంది. మేజర్ సీత సారథ్యంలోని జవాన్ల బృందం రేయింబవళ్లూ పనిచేసి 31 గంటల్లోపు వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేజర్ సీత ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. ‘ భారత సైన్యం తరఫున ఇక్కడికొచ్చి సాయ పడు తున్నందుకు నాక్కూడా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధి కారులకు, సాయç ³డిన స్థానికులకు నా కృతజ్ఞతలు’ అని సీత అన్నారు. సీత సొంతూరు మహారాష్ట్ర లోని అహ్మద్నగర్ దగ్గర్లోని గడిల్గావ్. -
వయనాడ్ లో ఆగని మరణ మృదంగం
-
Wayanad Landslides: ఆగని మరణ మృదంగం
వయనాడ్(కేరళ): కనీవిని ఎరుగని పెను విషాదం నుంచి కేరళ ఇంకా తేరుకోలేదు. మరుభూమిలా మారిన తమ సొంత భూమి నుంచి బయటకు తీస్తున్న ఆప్తుల పార్ధివదేహాలను చూసిన బంధువులు, స్నేహితుల ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య తాజాగా 289కి పెరిగింది. ఇంకా 200 మందికిపైగా స్థానికుల జాడ గల్లంతైంది. కాలంతోపోటీపడుతూ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్గార్డ్, పోలీసు, స్థానిక యంత్రాంగం ముమ్మర గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే భీతావహంగా మారిన అక్కడి పరిసరాలు సహాయక చర్యలకు పెద్ద అవరోధంగా తయారయ్యాయి. కూలిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, కొట్టుకొచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదమయమై నేల, కూలిన చెట్లు, వరద ప్రవాహం, భారీ వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగించడం అక్కడి బృందాలకు పెద్ద సవాల్గా మారింది. కాగా, ఇప్పటివరకు 91 శిబిరాలకు 9,328 మందిని తరలించామని కేరళ రెవిన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. 225 మంది ఆస్పత్రుల్లో చేరగా 96 మందికి చికిత్స కొనసాగుతోంది.ఇది జాతి విపత్తు: రాహుల్గతంలో సొంత నియోజకవర్గమైన వయనాడ్లో జరిగిన ఈ ఘోర విపత్తు చూసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకా గాంధీ కేరళకు వచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించారు. తర్వాత మేప్పాడిలోని ఆస్పత్రుల్లో క్షతగాత్రులను, సహాయక శిబిరాల్లో బాధితుల బంధువులను కలిసి పరామర్శించారు. ‘‘ఇది వయనాడ్, కేరళలో భారీ విషాదం నింపింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందాల్సిందే. కుటుంబసభ్యులు, సొంతిళ్లను కోల్పోయిన స్థానికులను చూస్తుంటే మాటలు రావడం లేదు. సర్వం కోల్పోయిన వారిని ఎలా ఓదార్చాలో, వారికెలా ధైర్యం చెప్పాలో తెలీడం లేదు. ఇది జాతీయ విపత్తు’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఇంతటి మహా విషాదాన్ని చూస్తుంటే మా నాన్న చనిపోయిన సందర్భం గుర్తొస్తోంది. అయితే వీళ్లు తమ నాన్నను మాత్రమే కాదు.. మొత్తం కుటుంబాన్నే కోల్పోయారు. నేను బాధపడుతున్నదానికంటే అంతులేని విషాదం వీరి జీవితాల్లో ఆవహించింది. వయనాడ్ బాధితులకు అందరూ అండగా నిలబడటం గర్వించాల్సిన విషయం. దేశ ప్రజలు బాధితులకు ఆపన్నహస్తం అందిస్తారు’ అని రాహుల్ అన్నారు.పారిపోదామనుకున్నా: వైద్యురాలి ఆవేదనధైర్యంగా పోస్ట్ మార్టమ్ చేసే వైద్యురాలు సైతం మృతదేహాలు ఛి ద్రమైన తీరు చూసి డాక్టర్ మనసు కకావికలమైన ఘటన వయనాడ్లోని స్థా నిక ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఇంతటి హృదయవిదారక దృశ్యాన్ని ఏనాడూ చూడలేదని బాధి తుల మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ ఎన్నో రకాల పోస్ట్మార్టమ్లు చేశాగానీ ఇలాంటివి ఇదే మొదలు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు శవపరీక్ష సమయంలో గుండెనిబ్బరంతో ఉంటారు. కానీ భారీ బండరాళ్లు పడిన ధాటికి దెబ్బతిన్న మృతదేహాలను చూశాక నాలో స్థైర్యం పోయింది. కొన్ని మృతదేహాలు పూర్తిగా చితికిపోయాయి. ఒకదానివెంట మరోటి తెస్తూనే ఉన్నారు. ఎక్కువ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా రూపు కోల్పోయాయి. ఒక ఏడాది చిన్నారి మృతదేహం దారుణంగా దెబ్బతింది. ఇక నా వల్ల కాదు.. క్షతగాత్రుల సహాయక శిబిరానికి పారిపోదామనుకున్నా. కానీ ఇంకోదారిలేక వృత్తిధర్మం పాటిస్తూ 18 మృతదేహాలకు పోస్ట్మార్టమ్ చేశా. తర్వాత కేరళలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సర్జన్లు వచ్చారు. రాత్రి 11.30కల్లా 93 పోస్ట్మార్టమ్లు పూర్తిచేశాం. ఈ ఘటనను జీవితంలో మర్చిపోను’ అని వైద్యురాలు తన అనుభవాన్ని చెప్పారు.కదిలొచ్చిన తల్లి హృదయంతల్లులను కోల్పోయిన పసిపిల్లలు పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలను చూసిన ఒక తల్లి అనుకున్న తడవుగా వయనాడ్కు పయనమైంది. నాలుగు నెలల బిడ్డకు తల్లి అయిన ఆమె విషాదవార్త తెలియగానే వయనాడ్కు భర్త, పిల్లలతో కలిసి బయల్దేరారు. సెంట్రల్ కేరళలోని ఇడుక్కి నుంచి వస్తున్న ఆమెను మీడియా పలకరించింది. ‘‘ నాకూ చంటిబిడ్డ ఉంది. తల్లిపాల కోసం బిడ్డపడే ఆరాటం నాకు తెలుసు. అందుకే నా చనుబాలు ఇచ్చి అక్కడి అనాథలైన పసిబిడ్డల ఆకలి తీరుస్తా’ అని ఆమె అన్నారు. కాగా, కేరళ బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన సంతాప సందేశం పంపించారు. అవిశ్రాంతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్మీని ఆయన అభినందించారు. -
Satellite Images: వయనాడ్ విలయానికి ముందు.. ఆ తర్వాత
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విలయంలో మరణించినవారి సంఖ్య 288కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. అనేక మంది ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వయనాడ్ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాన్ని 3డీ రూపంలో చూపించింది. హైదరాబాద్లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సి) అధునాతన కార్టోశాట్-3 ఆప్టికల్ శాటిలైట్ ఈ చిత్రాలను క్యాచ్ చేసింది.కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86వేల చ.మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో గుర్తించింది. ఇరువంజిపుళ నదిలో దాదాపు 8కి.మీ మేర ఈ శిథిలాలు కొట్టుపోతున్నట్లు చూపుతోంది. సముద్రమట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఈ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది. -
Wayanad Landslides: బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి: సీఎం పినరయి
Updatesవయనాడ్ కొండచరియలు విరిగిపడిన విపత్తులో మృతుల సంఖ్య 288కి చేరింది. మరో 200 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు 219 మంది గాయాలతో చికిత్స పొందుతున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి.. తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ప్రాంతాన్ని ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించారు. చూర్మలాలో ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. 288 మంది మృతిచెందగా, వెయ్యి మందిని కాపాడారు. వయనాడ్ విపత్తుపై అఖిలపక్ష సమావేశం జరిగింది: సీఎం పినరయి విజయన్ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి చర్చించాం.శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంమైనే మేము దృష్టి పెట్టాం. ఆర్మీ సిబ్బంది కృషిని అభినందిస్తున్నాను. చాలా మందిని రక్షించినట్లు వారు తెలిపారు. మట్టి, బురద కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యంత్రాలను కిందకు దింపడం కష్టతరంగా ఉండడంతో వంతెన నిర్మాణం చేస్తున్నారు. బెయిలీ వంతెన నిర్మాణం చాలా వరకు పూర్తయింది.గల్లంతైన వారి కోసం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన వారిని తాత్కాలికంగా శిబిరాలకు తరలిస్తున్నారు. పునరావాస పనులు త్వరగా జరుగుతున్నాయి. Wayanad landslide | Kerala CM Pinarayi Vijayan says "A high-level meeting was held today. After that political party leaders meeting was also held. The opposition leaders also attended the meeting. Our focus is to rescue those who were isolated. I appreciate the efforts of the… pic.twitter.com/G40UffRpiT— ANI (@ANI) August 1, 2024సీఎం పినరయి విజయన్ వయనాడ్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వయనాడ్ విపత్తుపై చర్చ జరుపుతున్నారు.#WATCH | Wayanad Landslide: Kerala CM Pinarayi Vijayan chairs an all-party meeting in Wayanad pic.twitter.com/PLpNeYnv5s— ANI (@ANI) August 1, 2024వయనాడ్కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ వెంట ప్రియాంకబాధితులకు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.#WATCH | Kerala: Congress leader & Lok Sabha LoP Rahul Gandhi and Congress leader Priyanka Gandhi Vadra arrive at Kannur airportThey will visit Wayanad to take stock of the situation of the constituency which has been rocked by massive landslides leading to 167 deaths. pic.twitter.com/sKlKnc4sBo— ANI (@ANI) August 1, 2024 వయనాడ్లోని కొండచరియలు విరిగినపడిన ప్రాంతంలో సీఎం పినరయి విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు.మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సాయం తీసుకున్న సీఎం పినరయి విజయన్మరోపక్క.. బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ నడుం లోతుకి పైగా కూరుకుపోయిన బురదలో విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వయనాడ్కు సీఎం విజయన్154 మృతదేహాలను జిల్లా అధికారులకు అప్పగించాంశిథిలాల కింద దొరికిన మృతదేహాలను జెనెటిక్ శాంపిళ్లను సేకరిస్తున్నాంసీఎం పినరయి విజయన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సహాయం కోరారుఆయన ఇవాళ వయనాడ్లో పర్యటిస్తారు:::కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad. The death toll stands at 167. pic.twitter.com/vEPjtzyK94— ANI (@ANI) August 1, 2024ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వయనాడు బయలుదేరారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించనున్న రాహుల్.. రిలీఫ్క్యాంప్లో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. #WATCH | Congress leader & Lok Sabha LoP Rahul Gandhi along with Congress leader Priyanka Gandhi Vadra arrives at Delhi airport, they'll shortly leave for Wayanad, Kerala.Bothe the Congress leaders will visit Wayanad to take stock of the situation of the constituency which has… pic.twitter.com/7u3wLfSb21— ANI (@ANI) August 1, 2024కేరళ వయనాడ్ జిల్లా మెప్పాడి, మందక్కై, చూరాల్మల, అట్టామల, నూల్పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయనాడ్ లో రెండో రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
వయనాడ్ విషాదం: ఈ తరహా విపత్తుల్ని ముందుగా గుర్తించలేమా? మానవ తప్పిదాలతోనే..
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు.. సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి. నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.తేడాలు ఇవే..ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.ముందస్తు సూచనలుకొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా చేస్తే..ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. -
జల సమాధి.. 600 మంది ఆచూకీ గల్లంతు
-
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు. 123 మంది మృతి. వందలాది మంది జాడ గల్లంతు
-
Wayanad: బురద వరద ముంచేసింది
వయనాడ్ (కేరళ): ఘోర కలి. మాటలకందని విషాదం. కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచి్చంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 123 మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలావరకు సమీపంలోని నదుల్లోకి కొట్టొకొచ్చినవే. ఏ శవాన్ని చూసినా కాళ్లు చేతులు తెగిపోయి కని్పంచడం బీభత్స తీవ్రతను కళ్లకు కడుతోంది. ప్రమాద స్థలం పొడవునా నిండిపోయిన బురద ప్రవాహాన్ని, మట్టి దిబ్బలను తొలగిస్తే వందల్లో శవాలు బయట పడతాయని చెబుతున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు ఉత్తరాది నుంచి పొట్ట చేత పట్టుకుని వచి్చన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. సమీపంలోని టీ ఎస్టేట్లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. నడి రాత్రి ఘోర కలి... మెప్పడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. తొలుత సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వేళ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక సిబ్బంది హుటాహుటిన స్పందించారు. బాధితులను సమీపంలోని చూరల్మల స్కూలు వద్ద సహాయక శిబిరాలకు తరలించారు. అనంతరం తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతమంతటా మళ్లీ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శిబిరాలతో పాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలన్నీ బురదలో కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిల వంటివన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాంతో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో సహాయక బృందాలు అక్కడ కాలు పెట్టలేకపోతున్నాయి. అయితే బురదలో చిక్కుబడి ప్రాణాలతో ఉన్న పలువురిని సైన్యం, నేవీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి హెలికాప్టర్ల ద్వారా కాపాడాయి. మెప్పడి ఆరోగ్య కేంద్రంలో స్థలాభవం కారణంగా మృతదేహాలను నేలపైనే వరుసగా పేరుస్తున్నారు. ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారంతా తలలు బాదుకుంటూ, హృదయ విదారకంగా రోదిస్తూ తమవారి శవాల కోసం వెదుక్కుంటున్నారు! నిర్వాసితులుగా మారిన వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రంగంలోకి సైన్యం కేరళ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సైన్యం, జాతీయ విపత్తు దళం హుటాహుటిన రంగంలోకి దిగాయి. బురద, మట్టి దిబ్బల కింద ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నారు. వారి ఆనవాలు పట్టేందుకు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు తదితరాల్లో కేరళకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన బుధవారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.ప్రాణం దక్కించుకున్న వృద్ధుడు వయనాడ్ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్గా మారింది.త్రుటిలో బయటపడ్డాం... కళ్లముందే సర్వస్వాన్నీ ముంచెత్తిన వరద, బురద బీభత్సం నుంచి పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయారు. ఓ వృద్ధ జంట తమ ఇంటి చుట్టూ బురద నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుండటంతో వణికించే చలిని, జోరు వానను కూడా లెక్కచేయకుండా రాత్రి 11 గంటల వేళ కొండపై భాగానికి వెళ్లిపోయింది. కాసేపటికే వాళ్ల ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. ‘‘పొరుగింటాయనను రమ్మని బతిమాలాం. రాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు’’ అంటూ వాళ్లు వాపోయారు. ‘‘మా బంధువులైన దంపతులు పసిపాపను చంకనేసుకుని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ నాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రవాహం, బురద తమను ముంచెత్తుతున్నాయని చెప్పారు. కాసేపటికే ఫోన్ మూగబోయింది. వాళ్ల జాడా తెలియడం లేదు’’ అంటూ ఒక మహిళ రోదించింది.వయనాడ్కు రెడ్ అలర్ట్: న వయనాడ్తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఫోన్లలో ఆర్తనాదాలు బురద ప్రవాహంలో చిక్కుబడ్డ చాలామంది కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేశారు. ప్రాణ భయంతో ఫోన్లోనే ఏడ్చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చానళ్లలో ప్రసారమవుతున్న ఆ సంభాషణలు, గ్రామాలన్నీ బురద కింద కప్పబడిపోయిన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఇది మాటలకందని విషాదమని సీఎం విజయన్ అన్నారు. ‘‘భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ప్రాంతమంతా పెను విధ్వంసానికి లోనైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. పలు శవాలు చెలియార్ నదిలో పొరుగున మలప్పురం జిల్లాలోకి కొట్టుకొచ్చాయి.నదే రెండుగా చీలింది విరిగిపడ్డ కొండచరియల ధాటికి స్థానిక ఇరువలింజిపుజ నది ఏకంగా రెండుగా చీలిపోయింది! అక్కడి వెల్లరిమల ప్రభుత్వ పాఠశాల పూర్తిగా సమాధైపోయిందని సీఎం విజయన్ చెప్పారు. -
229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య
దక్షిణ ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. గోఫా జోన్ ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవహారాల విభాగం విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం మృతులలో148 మంది పురుషులు, 81 మంది మహిళలు ఉన్నారు.ఇథియోపియా దక్షిణ ప్రాంతీయ రాష్ట్ర ప్రతినిధి అలెమాయేహు బావ్డి మరణాల సంఖ్యను ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. కాగా బురదమట్టిలో నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చామని, వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని ఇథియోపియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (ఈబీసీ) తెలిపింది. మృతులలో అధికంగా స్థానికులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులు వ్యవసాయ నిపుణులు ఉన్నారని పేర్కొంది.ఘటన జరిగిన ప్రాంతంలో ఇథియోపియన్ రెడ్క్రాస్ అసోసియేషన్తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ రెస్క్యూ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో దక్షిణ ఇథియోపియాలోని గోఫా ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో భారీగా జనం సమాధి అయ్యారు. సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభంకాగా, ఇంతలో మరొక కొండచరియ విరిగిపడటం మరింత విషాదానికి దారితీసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదని, మృతదేహాలను ఇంకా బయటకు తీస్తున్నామని గోఫా ప్రాంత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ అధిపతి మార్కోస్ మెలేస్ మీడియాకు తెలిపారు. ఘటనపై స్పందించిన ఇథియోపియా ప్రధాని అభి అమ్మద్ మాట్లాడుతూ భారీ ప్రాణనష్టం తనను ఎంతగానో కలచివేసిందని, విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఫెడరల్ అధికారులను ఘటన జరిగిన ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. ఇథియోపియా పార్లమెంటేరియన్ కెమల్ హషి మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం అందిస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The death toll from two landslides in southern #Ethiopia jumped to 229 and could rise further as the search for survivors and casualties continued into a second day.Following heavy rain a landslide buried people in Gofa zone in Southern Ethiopia regional state on Sunday night,… pic.twitter.com/uVyYiUxdP4— DD News (@DDNewslive) July 24, 2024 -
విరిగిపడిన కొండచరియలు.. 150 మందికి పైగా మృతి
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలోని గోఫా జోన్లో ఈ విషాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు శిథిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీస్తుండగా మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 146 మంది మృతదేహాలను వెలికితీసినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.వర్షం నుంచి వచ్చిన బురద కారణంగా సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయని, మృతి చెందిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను బురదలో నుంచి బయటకు తీస్తున్నామని చెప్పారు. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని తెలిపారు.అయితే జులైలో ప్రారంభమయ్యే వర్షాకాలంలో ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. ఈ వర్షాకాలం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. -
ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండచరియలు..
గోపేశ్వర్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గౌచర్– కర్ణప్రయాగ్ మార్గంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై చట్వాపీపల్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని మోటారు సైకిల్పై వస్తున్న నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50)లపై పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో చనిపోయా రన్నారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్ హైవేపై సుమారు డజను చోట్ల రహదారి మూసుకుపోయిందని పోలీసులు వివరించారు. కొండచరియలు విరిగి పడటంతో రుద్రప్రయాగ్– కేదార్నాథ్ జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలోని కుమావ్, గఢ్వాల్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. -
చైనాలో వరద బీభత్సం: 53 మంది మృతి
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్డాంగ్ ప్రావిన్స్లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. -
కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
ఐజ్వాల్: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.#Mizoram: 2 killed, many feared dead after stone quarry collapses in #AizawlTwo individuals were killed after a stone quarry collapsed in Aizawl’s Melthum and Hlimen border on May 28 around 6 am after #CycloneRemal wreaked havoc across Mizoram, as per latest reports.… pic.twitter.com/rCr7cExMGX— India Today NE (@IndiaTodayNE) May 28, 2024క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్ ఆపరేషన్కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.10 Dead, Several Feared Trapped As Stone Quarry Collapses In Mizoram https://t.co/8B5FGdvLz6— Priyanka Krishnadas (@pri3107das) May 28, 2024 మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో రెమాల్ తుపాన్ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
జకార్తా: ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది మృతి చెందగా మరో 18 మంది వరకు కనిపించకుండా పోయారు. మరాపి అగ్నిపర్వతం నుంచి రాళ్లు, లావా కలిసి కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి తోడు, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన బురద ప్రవాహం నాలుగు జిల్లాల పరిధిలోని నివాసప్రాంతాలను తుడిచిపెట్టింది. వందకు పైగా నివాసాలు, భవనాలు వరదలో మునిగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. -
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం
న్యూఢిల్లీ: ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావానికి యమునా నది మరోసారి పోటెత్తింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఉత్తరాఖండ్ ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ శాఖ తెలపడంతో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. యమునా నది ప్రవాహమైతే జులై 13న అత్యధికంగా 208.66 మీ. రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 205.39 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమీషన్(CWC) తెలిపింది. హర్యానాలోని యమునానగర్ హాత్నికుండ్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి నీటి ప్రవాహం ఉధృతి 30,153 క్యూసెక్కులకు చేరినట్లు చెబుతోంది సెంట్రల్ వాటర్ కమీషన్. హిణాచల్ ప్రదేశ్ లోనూ, ఉత్తరాఖండ్ లోనూ మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కొండతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చరియలు జారి పడటం, వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. #WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ — ANI (@ANI) August 16, 2023 యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టామని రహదారులపై చిక్కుకున్న వారిని విడిపించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. కల్క -షిమ్లా, కీరత్ పుర్-మనాలి, పఠాన్ కోట్ - మండి, ధర్మశాల - షిమ్లా రహదారులన్నీ మూసివేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్గా ఖాళీ కుర్చి -
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
హిమాచల్, ఉత్తరాఖండ్లో భీకర వర్షం
షిమ్లా/డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు. వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్నగర్లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షా దిగ్భ్రాంతి షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్సింగ్ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు. కేదార్నాథ్కు రాకపోకలు బంద్ ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని ప్రైవేట్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్దామ్ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
Cloudburst: యాభై మందికిపైగా మృతి
ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు ఉత్తరాదిన జల ప్రళయాన్ని సృష్టించాయి. వర్షాలకు తోడు అకస్మిక వరదలు పోటెత్తడంతో ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యక్తం చేశాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొండల్లో నుంచి వచ్చిన వరద నీటితోపాటు కొట్టుకువచ్చిన బురద, మట్టి వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది. #WATCH | River flowing in full spate along road to Prashar Lake in Mandi district of Himachal Pradesh pic.twitter.com/01MxFkRmC6 — ANI (@ANI) August 14, 2023 41 మంది మృతి హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల కొండచరియలు పేకమేడల్లా విరిగిపడుతున్నాయి.https://www.sakshi.com/telugu-news/national/954-police-medals-including-63-telugu-sates-onn-independence-day-eve-1735070 ఇప్పటి వరకు ఈ రకమైన ఘటనల్లో 41 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోవడం, నదుల నీటి మట్టం పెరిగి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. చదవండి: 954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక #UPDATE | A total of 41 people have lost their lives in Himachal Pradesh due to landslides and incessant rainfalls in the region. Search and rescue operation is underway: CMO Himachal Pradesh https://t.co/I7BYA9rsmQ — ANI (@ANI) August 14, 2023 జల ప్రళయానికి సాక్ష్యం తాజాగా మండీ జిల్లాలో భారీ వర్షంతో ఆకస్మిక వరదలు వచ్చి ఏడుగురు కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ను స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. వీడియో చూస్తుంటే అక్కడ జల ప్రళయం ఎలా ఉంది అనటానికి సాక్ష్యంగా నిలుస్తోంది. చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన #UPDATE | A total of 41 people have lost their lives in Himachal Pradesh due to landslides and incessant rainfalls in the region. Search and rescue operation is underway: CMO Himachal Pradesh https://t.co/I7BYA9rsmQ — ANI (@ANI) August 14, 2023 కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి అంతకుముందు భారీ వర్షాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది చనిపోయారు. సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో ఆదివారం ఆకస్మిక వరదలు సంభవించడంతో రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. మరో ఘటనలో సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు. #WATCH | Solan, Himachal Pradesh: Restoration work underway by administration near Chakki Mod after a landslide occurred near Shimla-Kalka highway (Parwanoo). pic.twitter.com/lBkyv64c5G — ANI (@ANI) August 14, 2023 ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు సోలన్ జిల్లాలోని బలేరా పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్షెహెర్ తహసీల్లోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి మరో మహిళ చనిపోయింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హమీర్పూర్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జిల్లావాసులందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. #WATCH | Rise in water level of river Ganga in Rishikesh due to heavy rainfall in Uttarakhand pic.twitter.com/ghdSjc6FVs — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 విద్యాసంస్థలు బంద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14 (సోమవారం) మూసివేస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను దూరంగా వెళ్లాలని ఆయన కోరారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర పర్యటనను టూరిస్టులు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం మరోవైపు వర్షాలతో అల్లకల్లోమవుతున్న హిమాచల్ ప్రదేశ్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వరద కారణంగా సంభవించిన మరణాలు చాలా బాధాకరమైనవని పేర్కొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం వరదల కారణంగా రాష్ట్రంలో 752 రోడ్లను మూసేశారు. వరదలు కొండచరియలు విరిగిపడటం వల్ల హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు. #WATCH | Uttarkhand CM Pushkar Singh Dhami is conducting an aerial survey of Mohanchatti, the disaster-affected area of Yamkeshwar block of Pauri district. pic.twitter.com/v2ERGRMF5M — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 621 రోడ్లు మూసివేత మండి, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిమ్లాను చండీగఢ్ను కలిపే సిమ్లా-కాల్కా జాతీయ రహదారిపై రహదారి గత రెండు వారాలుగా పదే పదే కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా ప్రభావితమైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్పుర్లో భవనాలు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగాయి. కేదార్నాథ్ యాత్ర నిలిపివేత మరోవైపు ఉత్తరాఖండ్లో వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంతో గత 48 గంటల్లో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు దెబ్బతిన్నాయి. రెండు రోజులపాటు కేదార్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. గంగా నది మట్టం కూడా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారని తెలిపారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami says "Several places have been damaged in the last 48 hours, due to incessant rainfall in the region. Roads have washed away, bridges have been damaged. Kedarnath Yatra has been stopped for the next 2 days. Water level in Ganga River is… https://t.co/0plFr17Pny pic.twitter.com/61aVP9SD84 — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 ఎడతెరిపి లేని వర్షాలతో ట్రాఫిక్ జామ్ కొండచరియలు విరిగిపడి, జాతీయ రహదారులతోపాటు వివిధ రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-ఛంబా నేషనల్ హైవేను అధికారులు మూసివేశారు. హరిద్వార్లో గంగానది 294.90 మీటర్ల వద్ద ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. చమోలీ జిల్లాలోని త్రాలి, నందానగర్ ఘాట్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితం అయ్యాయి. పిండర్, నందాకిని నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ మోటార్బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్లు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. -
వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖలాపూర్ తహశీల్లోని ఇర్షల్వాడి గ్రామంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలతో రాళ్లు, బురద మట్టి గ్రామాన్ని కప్పేశాయని గురువారం ఘటనాస్థలిని సందర్శించిన సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. గ్రామంలో 48 గిరిజన కుటుంబాలకు చెందిన మొత్తం 103 మంది నివసిస్తుండగా కొందరు పాలం పనులకు, వారి పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లారని తెలిసిందన్నారు. సుమారు 20 అడుగుల మేర పేరుకుపోయిన రాళ్లు, బురదలో 17 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారని, మరో 21 మందిని సహాయక సిబ్బంది కాపాడారని చెప్పారు. రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ కొండప్రాంతంలో భారీ వర్షం కొనసాగుతున్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. 2014లో పుణే జిల్లా మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 50 గిరిజన కుటుంబాలకు చెందిన 153 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఫ్ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద నుంచి 12 ఇప్పటి వరకు మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో 75 మందిని సురక్షింతంగా బయటకు తీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి సైతం గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. కాగా కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రుల వైద్య ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. #Breaking : An incident of devastating landslide reported at Irshalwadi village in Khalapur tehsil in #Raigad District of #Maharastra,as report says the entire village is victim of the landslide. 4 people have died till now and more than 100 villagers feared trapped . NDRF… pic.twitter.com/8SE5LTnnZD — Rahul Jha (@JhaRahul_Bihar) July 20, 2023 మరోవైపు శివసేన(ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్యా ఠాక్రే ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడ వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉందన్నారు. తాము గ్రామస్థులతో మాట్లాడటానికి ప్రయత్నించామని.. కానీ అక్కడికి చేరుకోవడం కష్టంగా ఉందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే ఘటనా స్థలానికి వెళ్లేందుకు పట్టుబట్టి రాష్ట్ర యంత్రాంగంపై మరింత ఒత్తిడి తీసుకురావాలనుకోవట్లేదని అన్నారు. అలాగే ఈ సమస్యను రాజకీయం చేయకూడదని కూడా అన్నారు. బాధితుల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, ప్రస్తుతానికి రెస్క్యూ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. खालापूर (जि. रायगड) येथील इरशाळगडाच्या पायथ्याशी असलेल्या वस्तीवर दरड कोसळली आहे. या घटनेची माहिती मिळताच मुख्यमंत्री @mieknathshinde हे तातडीने घटनास्थळी दाखल झाले असून मदत व बचावकार्याचा आढावा घेत आहेत. प्रचंड पाऊस आणि अवघड रस्ता यामुळे बचाव कार्य कार्यात अडथळा येत असला तरी… pic.twitter.com/ipXze5yOZu — CMO Maharashtra (@CMOMaharashtra) July 20, 2023 కొండచరియలు విరిగిపడిన మృతులకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందినప్పటి నుంచి స్థానిక ధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని.. మరో రెండు బృందాలు త్వరలో చేరుకుంటాయని చెప్పారు. భారీ వర్షాలు, చీకటి కారణంగా మొదట్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, అయితే ఇప్పుడు వేగం పుంజుకుందని ఆయన అన్నారు. #रायगड जिल्ह्यातील #खालापूर जवळील #इर्शाळवाडी येथे दरड कोसळून झालेल्या दुर्घटनेतील मदतकार्याला वेग देण्यासाठी मी स्वतः घटनास्थळी चालत जाण्याचा निर्णय घेतला आहे. मी स्थानिक नागरिकांना केलेल्या आवाहनाला प्रतिसाद देऊन #एनडीआरएफ पथकाच्या मार्गदर्शनाखाली मदतकार्याला वेग देण्यासाठी… pic.twitter.com/4AUCXf8gIU — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 20, 2023 -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
రైలు పట్టాలపై జారిపడిన కొండ చరియలు
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్లో బొర్రా, కరకవలస మధ్య (82వ కిలోమీటర్ వద్ద) కొండ చరియలు జారిపడటంతో ఓహెచ్సీ విద్యుత్ స్తంభం, రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కేకే లైన్లో రెండోలైన్కు సంబంధించిన పనులు జరుగుతుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 82వ కిలోమీటర్ వద్ద ఒక్కసారిగా కొండచరియలు జారిపడ్డాయి. దీంతో ఓహెచ్సీ విద్యుత్లైన్ స్తంభం విరిగిపడింది. పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సాంకేతిక సమస్య కారణంగా విశాఖపట్నం వెళుతున్న కిరండూల్ పాసింజర్ రైలును కొంతసేపు బొర్రా రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం బయలుదేరింది. ఈ కారణంగా సోమవారం రాత్రి విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే నైట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. మంగళవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్ప్రెస్, అదే రోజు విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్, బుధవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైళ్ల రద్దు చేశారు. సోమవారం రాత్రి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్ప్రెస్ రైలు కోరాపుట్, దమంజోడి, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
జమ్మూ: అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు శనివారం కూడా నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతూ ఉండడంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గం మధ్యలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. భక్తులెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను భక్తులందరూ తూచ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో రెండు మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తోంది. ‘‘అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాలైన పాహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నాం’అని ఒక అధికారి వెల్లడించారు. బేస్ క్యాంప్ అయిన భగవతి నగర్ నుంచి శనివారం కొత్త బ్యాచ్ ఎవరినీ అనుమతించలేదు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది. 80 వేల మందికి పైగా భక్తులు ఈ ఏడాది యాత్రకు డబ్బులు చెల్లించారు. -
హిమాచల్లో భారీ వానలు.. వరదల్లో చిక్కుకున్న టూరిస్టులు..
సిమ్లా: ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా, మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయని దీంతో టూరిస్టులు కూడా వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. భారీ వర్షాల కారణంగా బాగిపుల్ ప్రాంతంలోని ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు మండి ప్రషార్ రోడ్లోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుండి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు వెల్లడించారు. Cloudburst triggers flash floods in Mandi, Himachal Pradesh. Landslides Force Closure Of Pandoh-Mandi Highway VC: Deputy Commissioner Mandi#India #Himachal #Mandi #Cloudburst #Rains #Extreme #Floods #Storm #HimachalPradesh #Landslide #Flooding #Viral #Weather #Climate… pic.twitter.com/kqvAqG1qhb — Earth42morrow (@Earth42morrow) June 25, 2023 ఇదిలా ఉండగా.. పంచకులలో ఓ కారు వరదనీటిలో కొట్టుకుపోగా ఓ మహిళను స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, హిమాచల్ ప్రదేశ్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. Damage reported in #Seraj Valley due to Flash Flood#HimachalPradesh #Monsoon pic.twitter.com/AJc4RQEqdX — Weatherman Shubham (@shubhamtorres09) June 25, 2023 Scary visuals emerged from Khark Mangoli Panchkula, where a lady's car was swept away by the sudden excessive water flow in the river, while parked nearby. Hats off to the people who came to their rescue. The lady along with her mother came to pay obeisance at a Temple. pic.twitter.com/Mh24O92rHJ — Gagandeep Singh (@Gagan4344) June 25, 2023 ఇది కూడా చదవండి: పెళ్లింట పెను విషాదం.. -
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం
జోషిమఠ్: ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్రోగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపుగా 300 మంది చిక్కుకుపోయారు. లిపులేఖ్–తవాఘాట్ రోడ్డులో అతి పెద్ద కొండ చరియ విరిగి పడడంతో దాదాపుగా 100 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ధరాచులా, గంజి ప్రాంతంలో 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుకి మరమ్మతులు నిర్వహించి తిరిగి రాకపోకలు సాగించడానికి మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిత్రోగఢ్, రుద్రప్రయాగ, తెహ్రిగర్వాల్, ఉధామ్సింగ్ నగర్, ఉత్తర కాశీ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చార్దామ్ యాత్రలో ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని మరో రెండు మూడు రోజుల పాటు ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. -
కాలిఫోర్నియాలో వరదల బీభత్సం..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్
ఎడతెగని వర్షాల కారణంగా కాలిఫోర్నియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో కొండ చరియలు విగిగిపడి చెట్లుకూలడం, హిమపాతం వెల్లువలా రావడం తదితర కారణాలతో రహాదారులన్ని తెగిపోయి నీళ్లతో దిగ్బంధమయ్యి. దీనికి తోడు సమీపంలోని పజారో నదిపై కట్ట తెగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయాయి. దీంతో అధ్యక్షుడు జోబైడెన్ అత్యవసర పరస్థితిని ప్రకటించారు. పజారో నది సమీపంలో సుమారు 17 వందల మందికి పైగా నివాసితులు ఉన్నారని, వారిలో చాలమంది లాటినో వ్యవసాయ కార్మికులే. ఇప్పటి వరకు అధికారులు ఆ నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 8 వేల మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు తెలిపారు. వాస్తవానికి ఈ పంజారో వ్యాలీ ప్రాంత స్ట్రాబెర్రీలు, యాపిల్స్, కాలీప్లవర్, బ్రోకలీ, ఆర్టిచోక్లను పండించే తీర ప్రాంతం. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ..సంఘటనా స్థలానికి చేరుకున్న డజన్ల కొద్ది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 96 మందిని రక్షించి కౌంటీ షెల్టర్లో ఉంచారు. ఈ వరదలు కారణంగా వేలాది మంది నిరాశ్రయులైనట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ఈ వరదల బీభత్సం కారణంగా కాలిపోర్నియా రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని, మళ్లీ యాథాస్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు పజరా నది సమీపంలోని ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు గవర్నర్ గావిన్ న్యూసోమ్ కార్యాలయం పేర్కొంది. అలాగే రోజలులు సియెర్రా నెవాడా, గోల్డ్ కంట్రీకి దక్షిణంగా ఉన్న ఫ్రెస్నో కౌంటీ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Mandatory Evacuation orders issued for the Community of #Pajaro due to a #LeveeBreak. Please heed evac warnings/orders. Pajaro River levee broke early this morning resulting in active flooding. #Evacuate if told. #TurnAroundDontDrown @Cal_OES @CaltransHQ @CAgovernor pic.twitter.com/tDttiTcaC0 — California Governor's Office of Emergency Services (@Cal_OES) March 11, 2023 (చదవండి: ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు.. కీలక పదవులు) -
నేపాల్లో భూకంపం
న్యూఢిల్లీ: నేపాల్లో మంగళవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీతోపాటు రాజస్తాన్లోని జైపూర్లో ప్రకంపనలు సంభవించాయి. నేపాల్లోని సుదూర్ పశ్చిమ్ ప్రావిన్స్లోని బజురా జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేపాల్ అధికారులు చెప్పారు. భూకంపం ధాడికి కొండపై నుంచి బండరాయి దొర్లుకుంటూ వచ్చి మీదపడగా ఒక మహిళ చనిపోయింది. రెండిళ్లు కూలిపోగా, పలు ఇళ్లకు, ఒక ఆలయానికి పగుళ్లు వచ్చాయి. కొండచరియలు విరిగిపడి ఒకరు గాయపడగా, 40 గొర్రెలు చనిపోయాయి. ప్రకంపనలతో భయాందోళనలకు గురయ్యామని నోయిడా, ఢిల్లీ వాసులు చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదు. -
కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం.. 19 మంది మృతి.. వేల మంది..
కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల దాటి వరదలు సంభవించాయి. డ్యాములు పొంగిపొర్లాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపించాయి. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. EE.UU. Declara a California en estado de emergencia por las constantes lluvias que afectan esa parte del país. #California#Noticias pic.twitter.com/qNRwg9fJLY — JOSELITO POCHES (@joselitopoches) January 16, 2023 శీతకాల వర్షాల ధాటికి కాలిఫోర్నియాలో వరదలతో పాటు కొండచరియులు విరిగిపడ్డాయి. పలు చోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. తుఫాన్ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 19 మంది చనిపోయినట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో తెలిపింది. Así se desgajó una carretera en Pescadero, California, por las intensas lluvias en EU. Dónde ya ha decretado estádo de catástrofe#California #Californiastorm #Noticias pic.twitter.com/YpoRIDTOY9 — JOSELITO POCHES (@joselitopoches) January 16, 2023 కాలిఫోర్నియాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కూడా తుఫాన్ ముప్పు ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా తర్వాత ఈ తుఫాన్ లాస్ ఏంజెల్స్ వైపు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్.. -
జోషీ మఠ్లో ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ!
జోషిమఠ్. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు చిరపరిచితమైన పేరు. ఉత్తరాఖండ్లో అత్యంత పురాతమైన పట్టణం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరకొస్తున్నాయి. జోషిమఠ్లో వందలాది ఇళ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భూమిలోంచి నీళ్లు ఉబుకుబుకి పైకి వస్తున్నాయి. ఈ పట్టణం నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోవడమే దీనికి కారణం. ఏదో ఒక రోజు జోషిమఠ్ మునిగిపోవడం ఖాయమని దశాబ్దాల క్రితమే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరాఖండ్లోని జోíషీమఠ్లో ప్రజలు గత కొద్ది రోజులుగా ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపుగా 600 ఇళ్లు బీటలు వారాయి. నేలకింద నుంచి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తోంది. భూమి కింద నుంచి శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు వణికిపోతున్నారు. చార్ధామ్ యాత్రికుల కోసం హెలాంగ్ నుంచి మార్వారి వరకు రోడ్డుని వెడల్పు చేసే ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ముప్పు ముంచుకొచ్చింది. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. జోషీమఠ్ పరిస్థితిపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. అక్కడి 600 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శనివారం అక్కడ పర్యటించనున్నారు. దాంతో విపత్తు సహాయక బృందాలు ప్రజల్ని తరలిస్తున్నాయి. ఎందుకీ ముప్పు ? జోషీమఠ్ పట్టణం కొండల్లో ఏటవాలుగా ఉన్నట్టు ఒకవైపు ఒరిగి ఉంటుంది. అత్యంత పురాతనమైన కొండచరియలపై ఇళ్లు నిర్మించడంతో పునాదులు బలంగా లేవు. అడపా దడపా భూ ప్రకంపనలు పలకరిస్తూనే ఉంటాయి. రైని ప్రాంతంలోని అలకనంద నదికి వరదలు వచ్చినప్పుడల్లా జోíషీమఠ్లో మట్టిని బలహీనపరుస్తోంది. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టవద్దని ఎందరో నిపుణులు హెచ్చరించినా మన ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్ని పేల్చేయడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, చెట్లు నరికేయడం వంటి చర్యలు జోíషీమఠ్ పట్టణాన్ని ప్రమాదంలో పడేశాయి. ఎన్టీపీసికి చెందిన తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. గత ఏడాది ఈ ప్రాజెక్టు దగ్గర ఆకస్మిక వరదలు సంభవించి 200 మంది మరణించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా చార్ధామ్ యాత్ర చేయడానికి వీలుగా హెలోంగ్ నుంచి మార్వారి వరకు 20కి.మీ. మేర చేపట్టిన రహదారి వెడల్పు చేసే ప్రాజెక్టు ముప్పుని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. సమస్యకి శాశ్వతమైన పరిష్కారాలు కనుగొనే వరకు చిన్నపాటి తవ్వకాలు కూడా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది జోషీమఠ్కి ముప్పుని తొలిసారి గుర్తించారు. చమోలిలో ప్రమాదకరంగా కొండచరియలు విరిగిపడినప్పుడు జోíషీమఠ్లో ఇళ్లు బీటలు వారాయి. అప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. దీనికి గల కారణాలపై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ పట్టణం ఉన్న ప్రాంతంలో సహజసిద్ధంగా వచ్చే ముప్పుతో పాటు మానవ తప్పిదాలు కారణమని తేల్చింది. 50 ఏళ్ల క్రితమే ప్రమాదం గుర్తించిన నిపుణులు జోషీమఠ్ పూర్తిగా మునిగిపోతుందని 50 ఏళ్ల క్రితమే నిపుణులు అంచనా వేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో తరచూ వరదలు రావడానికి గల కారణాలు అన్వేషించడానికి ఏర్పాటు చేసిన మిశ్రా కమిటీ 1976లో ఇచ్చిన నివేదికలో జోíషీమఠ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయాన్ని ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వృద్ధులు కథలుగా చెబుతున్నారు. జోషిమఠ్ కనుమరుగైపోతుందా అన్న ఆందోళనలో స్థానికులు దినమొక గండంగా బతుకుతున్నారు. కుప్పకూలిన జోషిమఠ్ ఆలయం జోషీమఠ్: హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్లోని జోíషీమఠ్లో ఓ ఆలయం శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు చెప్పారు. ఆలయ గోడలు పగుళ్లు వారుతుండటంతో 15 రోజుల క్రితమే మూసివేసినట్లు చెప్పారు. సింగ్ధర్ వార్డులోని చాలా ఇళ్లు బీటలు వారుతుండటంతో 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అదేవిధంగా, అక్కడికి సమీపంలోనే ఉన్న జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే 60 కుటుంబాలను కూడా మరో చోటికి తరలించారు. మర్వారీలోని జలాశయం బీటలు వారి నీరు ధారాళంగా మూడు రోజులుగా దిగువకు వస్తుండటంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. చార్ధామ్లో కొనసాగుతున్న బైపాస్ రోడ్డు, జల విద్యుత్ ప్రాజెక్టు పనులను, ఔలి రోప్ వే సేవలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఏడాది కాలంగా భూమి కుంగిపోతోంది. పక్షం రోజులు గా భూమి కుంగుబాటు మరీ ఎక్కువైంది. ఏమిటీ జోషీమఠ్ ? హిమాలయాల్లోని ప్రకృతి అందాలకు నెలవు ఈ పట్టణం. చమోలి జిల్లాలో బద్రీనాథ్, హేమ్కుంద్ సాహిబ్ మధ్య 6 వేల అడుగుల ఎత్తులో జోషీ మఠ్ ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఈ పట్టణం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుడు ఎనిమిదో శతాబ్దంలో జోíషీమఠ్లోనే జ్ఞానోదయం పొందారని ప్రతీతి. ఇప్పటికే అత్యధిక భూకంపం ముప్పు ఉన్న కేటగిరి జోన్–5లో ఈ ప్రాంతం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్హౌజ్ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య -
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్ల్యాండ్లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్ల్యాండ్లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
హిమాచల్ ప్రదేశ్లో వరదల బీభత్సం.. 22 మంది మృతి
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడటం ప్రమాదాల తీవ్రతను మరింత పెంచుతోంది. గత 24 గంటల్లో ఒకే కుటుంబంలో ఎనిమిది మందితో సహా దాదాపు 22 మంది మరణించారు, 9 మంది గాయపడ్డారు. మరో ఆరుగురు కనిపించకుండా పోయారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఆ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిలిచిపోయింది. ప్రస్తుతం రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రా, చంబా, బిలాస్పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండి జిల్లాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆగస్టు 25 వరకు హిమాచల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుధేష్ కుమార్ వెల్లడించారు. WATCH: 2 killed, at least 15 missing after heavy rain #triggers #cloudburst, flash floods, landslides in several parts of Mandi district in #HimachalPradesh#Himachal #mandi #Flood #heavyrain pic.twitter.com/C6JpfVo8mp — BNN India (@BNNIN) August 20, 2022 మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, షోఘిలోని సిమ్లా-చండీగత్ హైవే సహా 743 రోడ్లు ట్రాఫిక్ కారణంగా బ్లాక్ చేశారు. ఒక్క మండిలోనే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జ్ శనివారం ఉదయం కూలిపోయిన విషయం తెలిసిందే. Dharampur @ Beas River Many peoples missing in Baggi of Mandi District 🙏🏻 Damaging Rains over parts of #Uttarakhand & #HimachalPradesh pic.twitter.com/UaAyr3a0Jx — Weatherman Shubham (@shubhamtorres09) August 20, 2022 -
కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి, 45 మంది గల్లంతు
ఇంపాల్: మణిపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. #WATCH | NDRF, SDRF, State Government and Railways workers involved in rescue work at the landslide-hit Tupul station building in Noney, Manipur (Video credit: CPRO, NF Railway) pic.twitter.com/N7zo2pLaY7 — ANI (@ANI) June 30, 2022 చదవండి: ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం -
Afghan earthquake: జీవచ్ఛవాలు
గయాన్ (అఫ్గానిస్తాన్): అఫ్గానిస్తాన్ను కుదిపేసిన పెను భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లు నేలమట్టమయ్యాయి. వ్యవప్రయాసల కోర్చి సహాయ చర్యల కోసం వెళ్లిన సిబ్బంది కొండల్లో మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడి ఉండటం చూసి కంటతడి పెడుతున్నారు. వాటిని వెలికి తీయడం తప్ప చేయడానికి అక్కడేమీ లేదని సహాయ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. బుధవారం నాటి భూకంపంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. పక్తిక ప్రావిన్స్లోని గయాన్, బర్మల్ జిల్లాల్లో అత్యధికంగా విధ్వంసం జరిగింది. అక్కడి ఊళ్లన్నీ శిథిలాల దిబ్బలుగా మిగిలాయి. ప్రాణాలతో బయట పడ్డవారు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. జీవచ్ఛవాలుగా మారారు. అయిన వారి కోసం వారు ఏడుస్తూ వెదుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భారీ వర్షం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఉత్తర వజరిస్తాన్ నుంచి అఫ్గాన్కు వెళ్లిన 30 మంది పాకిస్తానీలు భూకంపానికి బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. చేతులే ఆయుధాలుగా గ్రామాలన్నీ నేలమట్టం కావడంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో చూసేందుకు గ్రామస్తులు చేతులనే ఆయుధాలుగా మార్చుకున్నారు. గుట్టలుగా పడున్న రాళ్లు, రప్పలను చేతులతో తొలగిస్తున్నారు. తలదాచుకోవడానికి తమకు కనీసం టెంట్ కూడా లేదని వాళ్లు వాపోతున్నారు. పరిసర ఊళ్ల వాళ్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరూ సాయానికి రావడం లేదని చెబుతున్నారు. తిండికి కూడా లేక వారంతా అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మరణించిన తమవారి ఆత్మశాంతి కోసం బాధితులు చేస్తున్న ప్రార్థనలే వినిపిస్తున్నాయని కవరేజీకి వెళ్లిన బీబీసీ జర్నలిస్టు చెప్పారు. సహాయ చర్యలకు రంగంలోకి దిగినట్టు యునిసెఫ్ చెప్పింది. మృతుల్లో చిన్నారులే అధికం భూకంపంలో పిల్లలు, యువతే అత్యధికంగా బలైనట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు. రెండు హెలికాఫ్టర్లలో పక్తిక ప్రావిన్స్కు వెళ్లిన వైద్యులకు ఎటు చూసినా పిల్లలు, యువత శవాలే కనిపిస్తున్నాయి. భూకంప తీవ్రతకు సెల్ టవర్లు కూడా కూలి కమ్యూనికేషన్లు తెగిపోవడంతో సమాచారం తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో కొద్ది రోజులైతే తప్ప తేలేలా లేదు. -
తీరని విషాదాన్ని నింపిన అఫ్గనిస్తాన్ భూకంపం.. 1000 మంది మృతి
కాబూల్: అప్గనిస్తాన్లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు అఫ్గనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 1,000 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భూకంప తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. వందలాది ఇళ్లు నేలమట్టం రిక్టర్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించిన ప్రాతం మారుమూల పర్వత ప్రదేశం కావడంతో సమాచార లోపం నెలకొంది. దీంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు, ఇతర భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. An earthquake of magnitude 6.1 killed more than 900 people in Afghanistan, disaster management officials said, with hundreds injured and the toll expected to grow as information trickles in from remote mountain villages https://t.co/hh63ZvwR6a pic.twitter.com/xUbo7XDB6y — Reuters (@Reuters) June 22, 2022 యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ (27 మైళ్ళు) దూరంలో 51 కిమీ లోతులో సంభవించింది. భూకంపం కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఖోస్ట్ ప్రావిన్స్లో కూడా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. భారీ తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు పాక్లోని లాహోర్, ముల్తాన్, క్వెట్టా వరకు విస్తరించాయి. పాక్టికా ప్రావిన్స్ పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉంది. దీంతో పొరుగుదేశం పాకిస్థాన్లోనూ భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు BREAKING Death toll from #Afghanistan earthquake reaches 1,000😭😭#earthquake pic.twitter.com/VzHtiyGkus — Kainat Ali🌺 (@Kainatali56) June 22, 2022 సాయం చేయండి తమకు అంతర్జాతీయ సాయం కావాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నాయి. ‘తీవ్రమైన భూకంపం పాక్టికా ప్రావిన్స్లోని నాలుగు జిల్లాలను కదిలించింది. వందలాది మంది మరణించారు. గాయపడ్డారు. చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి’ అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్లో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ఆ ప్రాంతానికి బృందాలను పంపామని తెలిపారు. కాగా తాలిబన్ల ఆక్రమణతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతున్న అఫ్గన్ ప్రజలను ఈ భూకంపం మరింత దీనస్థితిలోకి నెట్టివేసింది. -
వరదలతో అతలాకుతలమైన అస్సాంలో ...ఓ విచిత్రమైన ఘటన: వీడియో వైరల్
గౌహతి: అస్సాంలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారులన్ని జలమయమైపోయాయి. ఈ మేరకు మొత్తం 36 జిల్లాలకు గానూ సుమారు 32 జిల్లాలు ఈ వరదలకు ప్రభావితమయ్యాయి. పైగా వరదలు, కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 30 మంది మరణించారు. కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ద్వారా అస్సాం పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. బరాక్ వ్యాలీ ప్రాంతో రైలు, రోడ్డు మార్గం వరదల కారణంగా మరింత అధ్వాన్నంగా మారాయి. ఈ మేరకు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న విషాదకర ఘటనలను వీడియోతీస్తుంటే...ఒక ఆశ్చర్యకరమైన ఘటన వీడియోలో బంధింపబడింది. నడుములోతు నీటిలో ఒకవ్యక్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకుని వస్తున్నాడు. ఆ ఘటన చూస్తుంటే చిన్న కృష్ణుడిని ఎత్తుకుని యుమునా నదిని దాటిని వాసుదేవుడిలా అనిపించింది. పైగా ఆవ్యక్తి తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఆనందంగా నడుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Heartwarming picture from Silchar Floods! This video of a father crossing the waters with his newborn baby in Silchar reminds of Vasudeva crossing river Yamuna taking newborn Bhagwan Krishna over his head! Everyday is Father’s Day!@narendramodi @himantabiswa @drrajdeeproy pic.twitter.com/1PEfaiCxA5 — Sashanka Chakraborty 🇮🇳 (@SashankGuw) June 21, 2022 (చదవండి: ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!: సంక్షోభ సంకేతాలపై శివసేన స్పందన) -
ఆగని అస్సాం వరద మరో 17 మంది మృతి
గువాహటి: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో చాలా చోట్ల రవాణా స్తంభించింది. ఆదివారం మరో ఎనిమిది మంది మరణించారు. దీంతో కొండచరియలు పడిన ఘటనల్లో సంభవించిన తొమ్మిది మరణాలతో కలుపుకుంటే గత 36 రోజుల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 32 జిల్లాల్లో 37 లక్షల మంది ప్రజానీకంపై వరద ప్రభావం కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లోని దాదాపు లక్షన్నర మందికిపైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ఆదివారం కామ్రూప్ జిల్లాలో పర్యటించి తగిన సాయం చేస్తామని స్థానికులకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధైర్యం చెప్పారు. -
Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి
దిస్పూర్: ఎడతెరిపి లేని వర్షాలు అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #India Moment the bamboo bridge was washed away in #Assam due to heavy rains and flooding. 20 districts of Assam were affected by #floods on Monday. 2 people died.#indiafloods 💬 @GaiaNewsIntl 🌎 pic.twitter.com/kzaDPpQrUS — ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) May 17, 2022 ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్లో ఇద్దరు, ఉదల్గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. #WATCH | Assam: Efforts to airdrop relief material were initiated in Haflong amidst the #AssamFloods on May 18; will continue today, May 19. pic.twitter.com/jEnaQFGBlj — ANI (@ANI) May 18, 2022 వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది. తిరగబడ్డ రైలు బోగీలు వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్ప్రెస్కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు...ముగ్గురు మృతి
Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వరదలు సృష్టించిని విధ్వంసం: న్యూ కుంజంగ్, ఫియాంగ్పుయ్, మౌల్హోయ్, నమ్జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూవ్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు. #WATCH Roads, bridges and agricultural land were inundated in Hojai, Assam yesterday due to floods following incessant rain in the region pic.twitter.com/DitKiMbb6O — ANI (@ANI) May 15, 2022 (చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు) -
సలేశ్వరంలో విరిగిపడిన కొండచరియలు
లింగాల/అచ్చంపేట/అచ్చంపేట రూరల్/మన్ననూర్: నల్లమలలో కురుస్తున్న అకాల వర్షాలతో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని సలేశ్వరం లోయలో ఉన్న భక్తులు శివ(నాగర్కర్నూల్), సూర్యనారా యణ(నల్లగొండ), విజయలక్ష్మి (లింగో టం, అచ్చంపేట మండలం), కొత్తపల్లి ప్రతాప్రెడ్డి, పాండయ్య(షాబాద్, రంగా రెడ్డి జిల్లా), జిందమ్మ(శక్తినగర్, రాయచూర్, కర్ణాటక)లకు గాయాల య్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. ఇదిలా ఉండగా... మూడు రోజుల పాటు సాగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అక్కడి కొండలు, గుట్టలు ఎక్కుతూ ‘వస్తున్నాం.. లింగమయ్యా, వెళ్లొస్తాం లింగమయ్య..’ అంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. అమ్రాబా ద్ అభయారణ్యం శివనామ స్మరణతో మార్మోగింది. -
బ్రెజిల్ వరద బీభత్సం: ఎటు చూసిన అల్లకల్లోలం.. 204కు చేరిన మృతుల సంఖ్య
బ్రస్సెల: బ్రెజిల్ దేశంలో సంభవించిన వరద విపత్తు వల్ల మృతుల సంఖ్య 204కు పెరిగింది. బ్రెజిల్ దేశంలోని ఆగ్నేయ రియో డి జనీరో రాష్ట్రంలోని పెట్రోపోలిస్ నగరంలో భారీ వరదల కారణంగా 204 మంది మరణించినట్లు బ్రెజిల్ అధికారులు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతోపాటు బురద ప్రవాహంలో చిక్కుకొని మరో 51 మంది గల్లంతు అయినట్లు రియో డిజెనీరో రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రతినిధి చెప్పారు. వరదల వల్ల బ్రెజిల్లోని చారిత్రాత్మక పర్యాటక కేంద్రమైన పెట్రోపోలిస్ నగరంలో ఇప్పటికీ 810 మంది నిర్వాసితులు గత వారం రోజులుగా పాఠశాల శిబిరాల్లో నివశిస్తున్నారు.అతి భారీవర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించడంతో ప్రాణనష్టంతోపాటు ఆస్తినష్టం సంభవించింది. వేలాది ఇళ్లు వరదల్లో దెబ్బతిన్నాయి. -
కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
తిరుమల: భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత వర్సిటీ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది. ల్యాండ్స్లైడ్స్ నిపుణులు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకుని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు. అమృత వర్సిటీ స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్, టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసులురెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
తిరుమల నడకదారిలో విరిగిపడ్డ కొండచరియలు
సాక్షి, తిరుపతి: గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది. చదవండి: ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రధాని మోదీ ఫోన్ నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్టు మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. టన్నుల బరువున్న కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడానికి కష్టతరంగా మారింది. మరోపక్క ఘాట్ రోడ్డులో కూడా అనేక ప్రాంతాలలో కొండచరియలు పడిపోవడంతో వీటిని తొలగించే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. మరిన్ని రోజులు నడకదారులను టీటీడీ మూసివేయనుంది. తిరుమల ఘాట్రోడ్డులో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. -
కేరళలో ఆగని వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సైన్యం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్వాసితుల్ని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఆ శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు. మాసు్కలు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం 11 బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలను కొనసాగిస్తోంది. అన్ని విధాలా అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు కేరళ ఏ సాయం అడిగినా కేంద్రం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మేము కేరళలో పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి ఏ సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేరళలో సోమవారం నుంచి ప్రారంభించాలి్సన పాఠశాలల్ని 20వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయ సందర్శనకు రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. కేరళలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్లన్నీ పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు:ఏడు ఇళ్లు నేలమట్టం
-
బస్సులో జనం.. విరిగిపడిన కొండచరియలు.. వైరల్ వీడియో
న్యూఢిల్లీ: ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపాన, ఎలా ఎదురవుతుందో ఎవరు చెప్పలేరు. అదృష్టం బాగుంటే ఒక్క సారి తృటిలో తప్పిన ఘటనలు చాలానే వున్నాయి. తాజాగా నైనిటాల్ పట్టణ పరిధిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఉత్తరాఖండ్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కొండ ప్రాంతాలు కావడంతో ఈ వర్షాలకు బాగా నానిపోయిన కారణంగా తరచూ రహదారులపై కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నైనిటాల్లో శుక్రవారం ఓ బస్సు 14 మంది ప్రయాణికులతో కొండ ప్రాంతం గుండా వెళ్తోంది. ఇంతలో హఠాత్తుగా కొండ చరియలు విరిగి బస్సు ముందు విరిగిపడ్డాయి. ఇదంతా ఆ బస్సులోని ప్రయాణికులు చూసి భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సరైన సమయంలో స్పందించి బస్సుని వెనక్కి తీస్తున్నా కూడా కొంతమంది భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న వీడియోను మనం చూడవచ్చు. #WATCH | Uttarakhand: A bus carrying 14 passengers narrowly escaped a landslide in Nainital on Friday. No casualties have been reported. pic.twitter.com/eyj1pBQmNw — ANI (@ANI) August 21, 2021 -
హృదయ విదారకం: 13 శవాలు వెలికితీత.. ఇంకా శిథిలాల కింద?
సిమ్లా/హిమాచల్ ప్రదేశ్: కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టిపెళ్లలు తొలగించిన రక్షణా బృందాలు.. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. క్షతగాత్రులను సమీప భవానగర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హిమాచల్ప్రదేశ్ రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగి పడిన విషయం విదితమే. ఆ సమయంలో రహదారిపై సుమారుగా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ గురువారం వెల్లడించారు. ఘటనాస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది కిన్నౌర్ జిల్లాకు చెందిన వారే ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ వారి ఆచూకీ కోసం అధికారుల వద్దకు వెళ్లిన బంధువులు హృదయ విదాకరంగా విలపిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు చూసి కంటతడి పెడుతున్నారు. #HimachalPradesh : Landslide in Kinnaur: 40 feared trapped | @CMOFFICEHP #TheStatesman #kinnaur #himachallandslide #Himachal @TheStatesmanLtd (Source: Unknown) pic.twitter.com/tEhqpsUX4R — Vineet Gupta (@statesmannet) August 11, 2021 Drone footage of Kinnaur landslide. A long stretch mark can be seen. People are being rescued from the bus trapped in landslide.#savekinnaur #HimachalLandSlide pic.twitter.com/DCfs3r6cxi — News Leak Centre (@CentreLeak) August 12, 2021 किन्नौर हिमाचल में बुधवार को पहाड़ दरकने से मलबे में दबे लोगों की तलाशने में @NDRFHQ और @ITBP_official जवान, जान दांव पर लगा लगातार सर्च अभियान चला रहे। अब तक मलबे से 13 शव व 13 लोगों को जिंदा निकाला जा चुका है।@JagranNews @mygovhimachal #HimachalLandSlide #kinnaurlandslide pic.twitter.com/qotclyJZgF — amit singh (@Join_AmitSingh) August 12, 2021 -
మహారాష్ట్రలో జల ప్రళయం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలతో జల ప్రళయం సంభవించింది. గడిచిన 48 గంటల్లో మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వర్షం సంబంధిత ఘటనల్లో 129 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. కొండచరియలు విరిగిపడి రాయ్గఢ్ జిల్లాలో తలియే గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటి వరకు 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకునిపోయారు. సతారా జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 27 మంది చనిపోయారు. గోండియా, చంద్రాపూర్ జిల్లాల్లోనూ పలువురు మృత్యువాతపడ్డారు. రత్నగిరి జిల్లాలో 10 మంది, సతారా జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది, ముంబైలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా చిప్లూన్ పట్టణం పూర్తిగా జలమయమైంది. ఇళ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, వీధులలో 4 నుంచి 14 అడుగుల మేర నిలిచింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో, కోవిడ్ ఆసుపత్రిలో వెంటిలేటర్లపై ఉన్న 8 మంది మృతి చెందారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు నేవీ ఇతర సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల సాయంతో యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొంకణ్లోని ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి, పాల్ఘర్, పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, మరాఠ్వాడాలోని పర్భణీ, నాందేడ్, విదర్భలోని అకోలా జిల్లాల్లో మూడు, నాలుగు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లోని నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నివాసాలు 15 అడుగుల మేర వరదలో నీట మునిగాయి. వందలాది గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కొంత విశ్రాంతి ఇవ్వడం, వరద తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్లో కొంత వేగం పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మరణించిన వారి పట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశా రు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం అందించనున్ననట్లు తెలిపారు. తలియే గ్రామం జల సమాధి! రాయ్గఢ్ జిల్లా తలియే గ్రామం జల సమాధి అయింది. ఈ గ్రామంపై కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 35 ఇళ్లలోని వారు సజీవ సమా ది అయ్యారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల మేరకు 38 మృతదేహాలను బయటికి తీయగలిగారు. శిథిలాల కింద మరో 36 మందికిపైగా ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతోపాటు కలకలాన్ని రేకెత్తించింది. గురువారం సాయం త్రం 4.30 గంటల ప్రాంతంలో తలియే గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ కింద ఉన్న ఈ గ్రామంలో సుమారు 35 ఇళ్లుండేవి. వరదలతో ఈ గ్రామమే కనపడకుండాపోయింది. తలి యే గ్రామం కన్పించకుండా మట్టిదిబ్బలు, బురదమయంగా మారింది. కొండప్రాం తంలో ఈ గ్రామం ఉండడం, రోడ్లు జలమయం కావడం, కుంగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. -
వర్షం పడిందంటే భయం భయంగా.. మొత్తం 290 మంది మృతి
సాక్షి, ముంబై: గడిచిన 29 ఏళ్లలో ముంబై నగరం, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో కొండచరియలు విరిగిపడిన సుమారు 290 మందికిపైగా మృతి చెంది నట్లు తెలిసింది. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో కొందరి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో వికలాంగులుగా మారారు. ఏటా ఇలాంటి ప్రమాదాలు జరగ్గానే కొండలపై, వాటి కింద గుడిసెల్లో ఉంటున్న పేద కటుంబాల అంశం తెరమీదకు వస్తుంది. ఆ తరువాత షరా మామూలే అవుతుంది. ప్రమాదం జరగ్గానే ఆగమేఘాల మీద మంత్రులు, ప్రభుత్వ, బీఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించడం, మృతు లకుటుంబాలకు సానుభూతి ప్రకటించడం, ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపేసుకుంటున్నా రు. అవసరమైతే గుడిసెలను ఖాళీచేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కనుగొనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆదివారం ముంబైలో కురిసిన భారీ వర్షానికి వేర్వేరు సంఘటనలో దాదాపు 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య అధికంగా ఉంది. 25 నియోజకవర్గాల్లో ప్రమాదకర కొండలు.. 1991 నుంచి 2021 వరకు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఏకంగా 25 నియోజక వర్గాలలో ప్రమాదకర కొండలున్నాయి. ఇప్పటికే ఆ కొండలపై, వాటికి ఆనుకుని అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. కొండల కింద ప్రమాదకరంగా ఉన్న 22,483 గుడిసెల్లో 9,657 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి స్థలాంతరం చేయాలని ఇదివరకే ‘ముంబై జోపడ్పట్టి సుధార్ మండలి’ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదేవిధంగా మిగతా గడిసెలపై కొండ చరియలు విరిగిపడకుండా ఇళ్ల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని సిఫార్సు చేసింది. కానీ, ఇంతవరకు ప్రమాదకరంగా ఉన్న కొండలు, వాటికి ఆనుకున్న ఉన్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదిలాఉండగా కొండ పరిసర ప్రాంతా ల్లోని మురికివాడల్లో నివాసముంటున్న పేద కుటుంబాలు స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. లేదంటే బలవంతంగా తరలించే ఏర్పాట్లు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం సంబంధిత అధికారులకు నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఏటా వర్షాకాలంలో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే ప్రమాదముంటుంది. కొండల కింద, కొండలపైన, చుట్టుపక్కల ఉన్న గుడిసెల్లో వేలాది కుటుంబాలున్నాయి. అందులో లక్షలాది మంది పిల్ల, పాపలతో నివాసముంటున్నారు. వర్షా కాలంలో పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు వచ్చి ఇళ్లపై పడతాయి. దీంతో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు పేద కుటుంబాలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తారు. భారీ వర్షం కురి సిందంటే చాలు రాత్రులు నిద్ర లేకుండా గడుపుతా రు. దీంతో ప్రమాదం జరగకముందే సురక్షిత ప్రాం తాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. వర్షాకాలం భయం భయం.. ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల కొండలున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు భయంభయంగా బతుకీడుస్తారు. ముంబైలో మలబార్ హిల్, వర్లీ సీ ఫేస్, అంటాప్ హిల్లో ప్రాంతాల్లో, ఉప నగరాల్లో ఘాట్కోపర్, విద్యావి హార్, ఎం–తూర్పు వార్డు పరి«ధిలోని దిన్క్వారి మార్గ్పై గౌతం నగర్, పాంజర్పోల్, వాసి నాకావద్ద ఓం గణేశ్ నగర్, రాహుల్ నగర్, నాగాబాబా నగర్, సహ్యాద్రి నగర్, అశోక్ నగర్, భారత్నగర్ తదితరా ప్రాంతాల్లో కొండల కింద ఉంటున్న ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. లేదంటే బలవంతంగా తరలించాల్సి వస్తుం దని హెచ్చరించింది. అయినప్పటికీ బలవంతం గా అక్కడే ఉంటే ఆ తరువాతే జరిగే పరిణామాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదానికి కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బీఎంసీ ఎలాంటి బాధ్యత వహించదని పరిపాలనా విభాగం స్పష్టం చేసింది. అయినప్పటికీ వేలాది కుటుంబా లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే కా లం వెల్లదీస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారింది. #MumbaiRains UPDATE 20:30-18/7/21#VikhroliLandslide & #ChemburLandslide 🔸@5Ndrf OPS END 🔸After final search 🔸@ Both sites 🔸Chembur-21 dead 2 inj 🔸Vikhroli-10 dead 🔸All missing actd for 🔸@NDRFHQ prays for 🔸Departed souls@HMOIndia @PIBHomeAffairs @ANI @PIBMumbai pic.twitter.com/UFmiWrYStu — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) July 18, 2021 Landslide at Gholai Nagar in Kalwa, Thane district. 5 dead and 2 injured, Rescue and Search Operation is underway. #mumbairains #MumbaiRainUpdate #KalwaLandslide pic.twitter.com/rTwaKHza7H — Ankita Gupta (@ankitagupta102) July 19, 2021 Another land slide video coming from vikroli west parksite near kailash complex #MumbaiRains #MumbaiRainUpdate @IndiaWeatherMan @MumbaiRainApp @Mumbairain pic.twitter.com/XsfyAEePhN — Rahul Pandey (@scriberahul) July 19, 2021 -
ఇండోనేషియాలో భారీ వరదలు
-
ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి
జకార్తా: తూర్పు ఇండోనేషియాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 44 మంది మృతి చెందారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారని విపత్తు సహాయ సంస్థ తెలిపింది. ఇంకా చాలా మంది తప్పిపోయినట్లు పేర్కొంది. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత లామెనెలే గ్రామంలోని అనేక ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. అయితే, ఈ శిథిలాల కింద 38 మృతదేహాలను, ఐదుగురు గాయపడిన వారిని గుర్తించినట్లు స్థానిక విపత్తు సంస్థ అధిపతి లెన్ని ఓలా తెలిపారు. ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో 40 ఇళ్ళు ధ్వంసమవడంతో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా ఇళ్ళ మునిగిపోవడంతో వారి ఇళ్లను విడిచిపెట్టి వందలాది మంది పారిపోయారు. ఇండోనేషియాలో ప్రతి సంవత్సరం కాలానుగుణ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా అనేక ద్విపాల సమూహం ఇక్కడ మిలియన్ల మంది ప్రజలు పర్వత ప్రాంతాలలో లేదా సారవంతమైన వరద మైదానాల సమీపంలో నివసిస్తున్నారు. వరదల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: బంగ్లాదేశ్లో 7 రోజుల లాక్డౌన్ సచిన్వాజే కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
ఇండోనేషియాలో మరో ప్రమాదం
జకర్తా: ఇండోనేషినియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా.. 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయని నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (బీఎన్పీబీ) అధికారి ఒకరు తెలిపారు. మొదట కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఖాళీ చేయిస్తున్న సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. మృతుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు ఉన్నారని చెప్పారు. సైనికులు, పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ ఏజెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయయి. శనివారం గరుట్, సుమేడాంగ్తో సహా పశ్చిమ జావాలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. -
‘అలా చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు’
సాక్షి,విజయవాడ: రెండు వారాల క్రితం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్తో కూడిన నిపుణుల కమిటీ కొండ చరియలు విరిగి పడే ప్రాంతాన్ని పరిశీలించారు. ఒక వారం లోపు నేవిదిక సమర్పిస్తామని తెలిపారు. భక్తుల భద్రత మాకు ముఖ్యమని ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్ వెల్లడించారు. (చదవండి: ‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’) ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల నుంచి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం. ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు. అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది. ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారు. ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్. ఫెన్సింగ్, కేబుల్, హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్రతను తగ్గించ వచ్చు. కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం. కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలిచ్చాం. కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించ వచ్చు. హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు’ అన్నారు. -
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
సాక్షి, విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రీ సమీపంలో కొండచరియలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. -
విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు
సాక్షి, విజయవాడ: భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు ధ్వంసమైంది. దాంతో ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. మట్టి పెళ్లలను తొలగించి అంబులెన్స్లో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినాఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోమయాడు.