రైలు పై విరిగిపడిన కొండచరియలు | Landslides broken on trains in visakhapatnam | Sakshi
Sakshi News home page

రైలు పై విరిగిపడిన కొండచరియలు

Published Fri, Jun 30 2017 7:02 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

కొత్తవలస-కిరండోలు రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని కొత్తవలస- కిరండోలు రైలు మార్గంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండపై నుంచి ఓ గూడ్స్‌ రైలుపై కొండచరియలు విరిగిపడటంతో ఆ రైలు రెండు ఇంజన్లు దెబ్బతిన్నాయి. శివలింగాపురం-టైడా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొత్తవలస - కిరణ్‌డోలు ప్యాసింజర్‌ రైలును అధికారులు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. గంటలతరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement