Visakhapatnam
-
పుస్తకాలు ప్రాణం పోసుకుంటున్నాయి
గ్రంథాలయం సమాజానికి హృదయం వంటిది. ఆ గ్రంథాలయంలోని సాహితీ సంపద ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. డిజిటల్ సముద్రంలో ఈదులాడుతున్న సమూహాలకు మంచినీటి ఊటలా ఇంకా పుస్తకం దాహం తీరుస్తూనే ఉంది. సాహితీ దాహార్తులకోసం మంచి పుస్తకాలను అందించాలనే తపనతో వైజాగ్ నగరంలో బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ను నడుపుతున్నారు కొందరు ఔత్సాహికులు. అందరూ ఆధునికపు హంగుల వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో వయసు భేదం లేకుండా పుస్తకం వైపు నడిచేలా చేస్తున్నారు వీరు. ‘ఒకప్పుడంటే గ్రంథాలయాల విలువ తెలిసినవారు ఉండేవారు. ఈ రోజుల్లో ఇది సాధ్యమా..’ అనే వారికి వైజాగ్ వాసులకు చేరువైన బిఎమ్ఆర్సి (బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్) సరైన సమాధానం అవుతుంది. వీరు పుస్తకాల ద్వారా ప్రజలకు ఏం చె΄్పాలనుకుంటున్నారు, ఎలా తమ ఆలోచనను ముందుకు తీసుకువెళుతున్నారు.. అనే విషయాలను అడిగితే ఎన్నో విషయాలను మన ముందుంచారు.పిల్లలకు ఆకర్షణీయమైన కథలుబుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ రూపకల్పన గురించి ఫౌండర్ హరి మాదాల మాట్లాడుతూ –‘‘మా కథల కార్యక్రమం ఎలా సాగుతుందంటే.. ‘ధైర్యవంతులైన వీరులు, మాట్లాడే జంతువులు, అంతులేని ఊహలతో మా పుస్తకాలయం నిండిపోతుంది’ అన్నారు. హరి సాఫ్ట్వేర్ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం సింగపూర్ నుంచి వైజాగ్ వచ్చేశాక కొన్ని రోజుల్లోనే అక్కడి పట్టణ వాతావర ణంలో ఎవరికి వారే అన్నట్టుగా ఉండటం గమనించారు. తమచుట్టూ ఓ మంచి కమ్యూనిటీని బిల్డ్ చేయాలనుకున్నారు. అందుకు తగినట్టుగా వైజాగ్ ఉక్కునగరంలో పిల్లల కోసం బుక్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. తమ పిల్లలను తీసుకొని వచ్చే తల్లిదండ్రులతో పరిచయాలు ఏర్పడతాయని ఆలోచించారు. ఇంగ్లిష్, తెలుగు సాహిత్యంలో కామిక్స్, ఫిక్షన్ బుక్స్ని లైబ్రరీలో ఉంచారు. కేవలం బుక్ రీడింగ్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుందో లేదో అని ఆలోచించి పిల్లలకు వారాంతాల్లో కథలు చెప్పడం, ఆర్ట్ వర్క్.. యాక్టివిటీస్ చేయించడం మొదలు పెట్టారు. పెద్దవాళ్లకు రివ్యూస్ప్రైవేట్ కంపెనీలో మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న కవిత మాట్లాడుతూ–‘‘టీవీ, మొబైల్స్తో టైమ్ పాస్ చేసే పెద్దవాళ్లు, గృహిణులు మన ఇళ్లలో ఉంటారు. వారిని రప్పించడానికి బుక్ రివ్యూ ΄్లానింగ్ సక్సెస్ అయ్యింది, వారాంతపు సాయంత్రాల్లో బుక్ రివ్యూ ఉంటుంది. కొంతమంది ఆ వారం తాము ఏ బుక్ గురించి, కథ గురించి చెబుతారో.. ఆ విషయాలు ముందుగానే చెప్పి, పాల్గొంటారు. కొందరు బుక్ రివ్యూస్ వినడానికే వస్తుంటారు’ అని వివరించారు. ‘ఈ బుక్ మ్యాజిక్ క్లబ్ యాక్టివిటీస్కి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, చూసి కొంతమంది తమ ప్రాంతంలో కూడా స్టార్ట్ చేస్తామంటూ ఆసక్తి చూపారు. అలా, గాజువాకలో, స్టీల్ ΄్లాంట్లో బుక్ మ్యాజిక్ క్లబ్ను స్టార్ట్ చేశారు కొందరు. చాలా మంది బుక్స్ చదవడం మొదలుపెట్టాక తమ లైఫ్లో మార్పులు వచ్చాయని, చాలా ఉపయోగకరంగా ఉంటోందనీ చెబుతున్నారు. అంటే, పుస్తకం విలువ ఎప్పుడూ పెరిగేదే తప్ప, తగ్గదు’ అని వివరించారు బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ మెంబర్ ఉపాసన.సరైన ఎంపిక పుస్తకమే..5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు పుస్తకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత మళ్లీ 30 ఏళ్లు దాటినవారే బుక్ రీడింగ్లో కనిపిస్తున్నారు. 12 నుంచి 30 ఏళ్లలోపు వాళ్లు మాత్రం పుస్తకానికి దూరంగా ఉండటం గమనించాం. వారు కాలేజీ చదువులు, ఉద్యోగంలో నిలదొక్కుకోవడంలో బిజీగా ఉంటున్నారు. పిల్లలు ఫాంటసీ, కామిక్స్ అది కూడా బొమ్మల పేజీలలోని చిన్న చిన్న టెక్ట్స్ చదవడానికి ఇష్టపడుతున్నారు. మా చిన్నపాపకు రెండేళ్లు, 150 వర్డ్స్ వరకు చెబుతుంది. ఇమాజినేషన్కి, పబ్లిక్ స్పీకింగ్, వకాబులరీ..కి సరైన ఎంపిక పుస్తకమే. కార్పోరేట్రంగంలో టెక్నికల్ స్కిల్స్ కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్కిల్ను పుస్తకం నేర్పుతుంది. – హరి మాదాల, బిఎమ్ఆర్సి ఫౌండర్, వైజాగ్రైటింగ్ వర్క్షాప్స్..మా గ్రూప్లో 80 ఏళ్ల పెద్దావిడ కూడా మెంబర్గా ఉన్నారు. పాడ్ కాస్టింగ్ ద్వారా కథలు వింటున్నానని, అది తన ఆలోచనా ధోరణిని మార్చిందని చెబుతారావిడ. ఇప్పుడు మా క్లబ్ నుంచి 100 పుస్తకాలకు పైగా రివ్యూస్ జరిగాయి. గతంలో అనుకున్నది ఇప్పుడు నెరవేరింది. రైటర్స్ క్లబ్లో జరిగే రైటింగ్ వర్క్షాప్స్కూ వెళుతుంటాను. వాటిలో రాసిన కొంతమంది కథలను కలిపి, బుక్గానూ తీసుకువచ్చారు. మా బుక్ క్లబ్లో డాక్టర్లు, ఇంజనీర్లు, గృహిణులు, పిల్లలు, టీనేజర్లు, యువత, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా, పుస్తకాలు ఎవరు చదువుతారు అని చాలామంది అనుకుంటారు. మొదట్లో నెలకు ఒకసారి బుక్ రివ్యూస్ చేసేవాళ్లం. వచ్చేవారి ఆసక్తిని గమనించి రెండువారాలకోసారి ఏర్పాటు చేస్తున్నాం. కానీ, పిల్లల కోసం ప్రతి వారం రివ్యూ ్రపోగ్రాం పెట్టమని అడిగేవారు పెరుగుతున్నారు. – డాక్టర్ ఆండాల్, బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ మెంబర్, వైజాగ్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్ ఒప్పుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
అల్లుడిపైనే అనుమానం, రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్
-
రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మృతిపై అనుమానాలు ఉన్నాయి..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తల్లి సత్యవతి.. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం, శ్రీచరణ్ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండే వారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరి సారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాది సాంప్రదాయమైన కుటుంబం అని ఆవేదన వ్యక్తం చేశారుసీపీ కార్యాలయంలో ఫిర్యాదు..గాయత్రి తల్లిదండ్రులు సీపీ కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైతే సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముస్సోరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి మృతి వెనుక అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆధారాలున్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కీలకంగా మారింది. -
ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్లోని 'కియానా హోమ్స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.రూమ్లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్లోని ఆసుపత్రికి తరలించారు. -
భారత షిఫ్పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్కు చెందిన షిప్పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖ : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
విశాఖ స్టీల్ప్లాంట్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో మరోసారి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్లోని ఎస్ఎంఎస్-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవ ఉక్కు (Molten Steel) ల్యాడిల్ నుంచి నేలపైకి పొర్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేదే.ఘటన అనంతరం ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవల కూడా(సోమవారం) స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2 నుంచి సలసలా మరిగే ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో.. భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి ప్లాంట్లో భద్రతా వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
దటీజ్ జగన్..
సాక్షి, విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించే విషయంలో అధికార కూటమి నేతలకు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య వ్యత్యాసం కార్మిక లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. కారి్మక నాయకులు సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా.. ‘మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?’ అంటూ మంత్రి లోకేష్ అగౌరవంగా మాట్లాడడం కార్మికుల్లో ఆగ్రహం రగిలించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..నాకేం తెలియదు..అవగాహన లేదంటూ వెళ్లిపోయారు. ఇదే సమయంలో విశాఖకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. సెవెన్హిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయి, ప్రమాద కారణాలు తెలుసుకుని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రూ.కోటి పరిహారం కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క నెలలోనే రూ. కోటి పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జగన్ చూపిన మానవత్వం, చొరవ కార్మికుల మనసు గెలిచింది. -
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
జగన్ రాకతో దద్దరిల్లిన విశాఖ..
-
Exclusive Visuals: విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్
-
స్టీల్ ప్లాంట్ ప్రమాదం బయటపడ్డ సంచలన నిజాలు
-
నన్ను వదిలి వెళ్లిపోయావా?
‘నువ్వు వస్తావని ఇంటి డోర్ వద్దే చూస్తున్నా.. ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ వేరొకరు.. నన్ను వదిలి వెళ్లిపోయావా? డ్యూటీకి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న భార్యకు అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నువ్వు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి.. అక్కడి నుంచి అటుగానే నన్ను వదిలి వెళ్లిపోయావా? స్టీల్ప్లాంట్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతారని ఏనాడూ అనుకోలేదు. మావి కూలి బతుకులు. ఇప్పుడు మాకు దిక్కెవరు. – నక్కా జోగమ్మ, మృతుడు రమణ భార్య‘12 ఏళ్ల క్రితం ఉక్కు ద్రవం పడి కాళ్లు గాయపడ్డాయి.. నేడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను మింగేసింది!’ అని ఒకరు..అప్పుడు కాలు.. ఇప్పుడు శరీరమే మసైపోయింది.. 12 ఏళ్ల కిందట నా భర్త విధి నిర్వహణలో ఉంటుండగానే ఉక్కు ద్రవం పడి కాలు తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను పొట్టనబెట్టుకుంది. ఏంటి భగవంతుడా మాకీ కర్మ? జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లలిద్దరినీ బీటెక్ చదివించారు. ఇప్పుడు అకస్మాత్తుగా నా భర్తను దూరం చేసి మమ్మల్ని ఇలా రోడ్డున పడేశావు. – గొట్టాపు రాధ, మృతుడు గోట్టాపు త్రినాథ్ భార్య అన్యోన్య దాంపత్యాన్ని చూసి దేవుడికే కన్ను కుట్టి.. ‘పిల్లల్ని బాగా చూసుకో’ అంటూ మధ్యాహ్నం పెట్టిన మెసేజే నా భర్త ఆఖరి మాట అవుతుందనుకోలేదు’ అని మరొకరు.. ‘మాది ప్రేమ వివాహం. 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు ధను‹Ù, లోకేష్ 6, 7 తరగతులు చదువుతున్నారు. సోమవారం విధులకు వెళ్లిన నా భర్త, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫోన్కు మెసేజ్ చేశారు. ‘పిల్లలకు ఒంట్లో బాగోలేదు, వారిని కనిపెట్టుకుని ఉండు’ అని చెప్పారు. ఇంతలోనే ఇంతటి ఘోరవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో అన్యోన్యంగా ఉన్న తమ కుటుంబాన్ని చూసి భగవంతుడికి కన్ను కుట్టిందనుకుంటా. సాయంత్రం దేవుడి గదిలో దీపం పెడదామనుకుంటే.. ఏకంగా భర్త జీవితమే దీపంలా ఆరిపోతుందని ఊహించలేకపోయాను. –గొందేశి రాజమ్మ, మృతుడు వెంకటప్పారావు భార్య ఇలా మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా చేసిన ఆక్రందనలు.. కన్నీటి రోదనలతో కేజీహెచ్ మార్చురీ ప్రాంగణం శోకసంద్రంగా మారిపోయింది. విశాఖ స్టీల్ప్లాంట్లో సంభవించిన ఘోర ప్రమాదం ఎనిమిది మంది శ్రామికుల ప్రాణాలను బూడిద చేయడమే కాకుండా, వారిని నమ్ముకున్న కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని చీకట్లను నింపింది. బతుకుదెరువు కోసం నిరంతరం స్వేదం చిందించే ఆ కార్మికులపై, సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల మరిగే ఉక్కు ద్రవం మృత్యువులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది శ్రామికులు సజీవ దహనమై బొగ్గు ముద్దల్లా మారిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియ, ఆపై తమ వారి మృతదేహాలను చూసి బంధువులు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి. -
స్టీల్ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాల్సిందే: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు సంబంధించి.. -
కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: బొత్స
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వారిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ అక్కడే మీడియాతో మాట్లాడారు.ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని బొత్స సత్యనారాయణ అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగుతున్నాయని, ఆ విధంగా కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బొత్స ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆయన, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఆపాలని తేల్చి చెప్పారు. ప్రమాదంలో దుర్మరణ చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైయస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.‘‘విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున, అధినేత వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్ చర్యలను ఆపాలి’’ అన్నారు.మంత్రి లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. ‘‘నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం’’ అని చెప్పారు.కాగా, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. బిహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 8 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. -
స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ
-
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్ప్లాంట్ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.నియంతలా లోకేశ్ తీరుస్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేజీహెచ్ దగ్గరా.. కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన తాజా విషాదంపై మరోసారి హై లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, నివేదికలతో హడావిడి చేయడం.. కొంతకాలానికి అంతా మరచిపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు పునరావృతమవుతుంటే అసలు బాధ్యులెవరు? తప్పంతా యాజమాన్యానిదేనా? లేక పర్యవేక్షణ బాధ్యత ఉన్న ప్రభుత్వాలకు అసలేం సంబంధం లేదా?? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.విశాఖ ఉక్కు కర్మాగారంలో.. ద్రవ ఉక్కు ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనతో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రతి ప్రమాదం తర్వాత యాజమాన్యాన్ని తప్పుబట్టడం, విచారణ కమిటీలు వేయడం, పరిహారాలు ప్రకటించడం జరుగుతోంది. కానీ వరుసగా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? అసలు బాధ్యత ఎవరిపై ఉంది?..విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉత్పత్తి, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల సంరక్షణ, సిబ్బంది నియామకాల బాధ్యత ప్రధానంగా యాజమాన్యానిదే. ఇది కాదనలేని విషయం. కానీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, వారి స్థానంలో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడటం పెరిగిందని. దీంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నాయి.ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్న ప్లాంట్లో ఇప్పుడు వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి అధికమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రత అనేది కేవలం యంత్రాల మీద ఆధారపడదు. అనుభవం ఉన్న సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, క్రమబద్ధమైన నిర్వహణ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడితో కథ ముగియదు. తాజా ప్రమాదం తర్వాత.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపైనే నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కులో పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అనే ప్రశ్న కార్మిక వర్గాలు, పరిశ్రమల నిపుణుల నుంచి వస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నాయకులు పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు విశాఖ ఉక్కు పరిరక్షణపై పలుమార్లు మాట్లాడారు. కానీ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలపై అదే స్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? ఫ్యాక్టరీల శాఖ, కార్మిక శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఏమి బయటపడింది? గత ప్రమాదాల తర్వాత ఇచ్చిన సూచనల అమలు ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.ప్రమాదం జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి బాధ్యతలు కూడా వాటిపైనే ఉంటాయి.ముఖ్యంగా గత పదిహేనేళ్లలో స్టీల్ప్లాంట్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా భద్రతా వ్యవస్థలపై స్వతంత్ర సమీక్షలు జరిగాయా? గత విచారణల సిఫారసులు అమలయ్యాయా? వాటిని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.ఇక మరో కోణం ప్రైవేటీకరణ వివాదం. విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ వాస్తవంగా ప్లాంట్ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, సిబ్బంది బలోపేతం, ఆధునీకరణ వంటి అంశాల్లో ఎంత మేర పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మాగారం గురించి రాజకీయంగా పెద్ద ప్రకటనలు చేసినవారు, కార్మిక భద్రతపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారా? అనే ప్రశ్న కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడటం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, సిబ్బంది విధానాలు, ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ వైఫల్యం వంటి అనేక అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఈ విషాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గత ప్రమాదాల మాదిరిగానే ఈ ఘటన కూడా మరో ఫైల్గా మిగిలిపోకుండా చూడటం. స్వతంత్ర విచారణ, భద్రతా ప్రమాణాల సమగ్ర ఆడిట్, సిబ్బంది కొరతపై సమీక్ష, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై స్పష్టమైన జవాబుదారీతనం తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి కొన్నేళ్లకోసారి ప్రాణాలు కోల్పోయేది కార్మికులే.. సంతాప ప్రకటనలు విడుదల చేసేది వ్యవస్థే. -
స్టీల్ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం
విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ నిమిత్తం నిపుణులపైన ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా అప్డేట్స్.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారుమరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారుఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం ప్రమాదాలకు కారణమైందిగత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా ఇంటికి పంపించారుఅనుభవం లేని వారితో, తక్కువ జీతాలకు పని చేయించడమే ఈ విషాదానికి కారణంయాజమాన్యం బాధ్యతారాహిత్యం, కక్కుర్తి వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారుకార్మిక సంఘాల డిమాండ్ ఇదేస్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలికాలం చెల్లిన యంత్రాలను తొలగించి కొత్త వాటిని నిర్మించాలికార్మికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిమృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలిక్షతగాత్రులకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలిపవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ ప్రమాదంపై మొదట కార్మిక సంఘాలను నిలదీయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలుమృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిస్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిభాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావునక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుమృతదేహాలను బంధువులకు అప్పగించిన అధికారులుబిహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూపుబాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్న్నాథ్, కేకేప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరం: బొత్సకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందిస్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ కుట్రలుస్టీల్ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేకార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ప్లాంట్ వచ్చింది అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంఘోర ప్రమాదం జరిగిన స్పందించని సీఎం చంద్రబాబు, మంత్రులునిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతివిజయవాడలోనే ఉన్నా విశాఖపట్నం వెళ్లని సీఎం చంద్రబాబుఈరోజు ఉదయం వరకు ఒక్కరు కూడా వెళ్లని రాష్ట్ర మంత్రులుకేంద్రమంత్రి కుమారస్వామి వచ్చాక వచ్చిన రాష్ట్ర మంత్రులుఈరోజు ఉదయం వెళ్లిన మంత్రి నారా లోకేష్లోకేష్ తర్వాత వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కేంద్రమంత్రి వచ్చేవరకు సంఘటన వైపు కన్నెత్తి చూడని హోంమంత్రి అనితకనీసం పట్టించుకోని జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులుఈరోజు కూడా విశాఖకు వెళ్లని సీఎం చంద్రబాబువిజయవాడలోనే సమీక్షలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబురేపు విశాఖకు వైఎస్ జగన్స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న జగన్ఆసుపత్రులలో ఉన్న క్షతగాత్రులకు పరామర్శఏపీలో రెడ్బుక్ అరాచకం నడుస్తోంది: గుడివాడ అమర్నాథ్కార్మిక సంఘాలను లోకేష్ అవమానించాడులోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారుఎవరికీ సమాధానం చెప్పను అనే విధంగా లోకేష్ మాట్లాడారుకార్మికులను బెదిరించే ధోరణిలో లోకేష్ మాట్లాడారుబాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలికార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందిస్టీల్ ప్లాంట్ వద్ద లోకేశ్కు చేదు అనుభవంవిశాఖ స్టీల్ ప్లాంట్ వద్దకు మంత్రి నారా లోకేశ్హోం మంత్రి అనితతో ప్లాంట్ వద్దకు వెళ్లిన లోకేశ్లోకేశ్ ఎదుట నిరసనకు దిగిన కార్మిక సంఘాలులోకేశ్ను నిలదీసిన కార్మిక సంఘాలునైపుణ్యం లేని కార్మికులకు ఎలా అనుమతి లభించిందని ఆగ్రహంఎంపీ భరత్, అనితలు సర్దిచెప్పబోయినా.. వినని కార్మిక సంఘాలుకార్మికులకు సమాధానం ఇవ్వలేకపోయిన లోకేశ్వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోని లోకేశ్ఎందుకు గొడవ పడుతున్నారంటూ ఆగ్రహంప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేశ్ అసహనంలోకేశ్ తీరుపై మండిపడ్డ కార్మికులు👉విశాఖ స్టీల్ప్లాంట్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కుమారస్వామి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. విశాఖ స్టీల్ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.👉150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది.👉గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
మృత్యువలయంగా విశాఖ స్టీల్ ప్లాంట్..!
విశాఖ స్టీల్ ప్లాంట్లో తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.తాజాగా విశాఖ స్టీల్ప్టాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, పలువురు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. 2012లో ఘోర ప్రమాదం.. అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్ ప్టాంట్లో జరిగిన ఘోర దుర్ఘటనకు గుర్తుకుతెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్న స్టీల్ప్లాంట్ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆక్సిజన్ పైప్లైన్లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్లైన్ పేలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో, అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో అక్కడే ఉన్న పలువురు ఈ ఘోరం బారిన పడ్డారు. మరణించిన 19 మందిలో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.తీవ్ర గాయాలు: ఎందరో ఉద్యోగులు తీవ్రమైన శాతంలో కాలిపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నెస్-3 లో జరిగిన మరో పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. .గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి.ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన మరికొన్ని ప్రమాదాలు..మే 22, 2012: సింటర్ ప్లాంట్లో మంటలు చెలరేగడంతో, కొత్త బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. రూ. 1 కోటి ఉత్పత్తి నష్టం.మే 1, 2012: కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ IIIలో జరిగిన పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఫిబ్రవరి 6, 2012: స్టీల్ మెల్టింగ్ షాప్ లో భారీ పరిమాణంలో వేడి లోహం ఒలికిపోవడం, రూ. 1 కోటి నష్టంఏప్రిల్ 10, 2011: సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న లాడిల్ నుండి అది కిందపడటంతో ఎస్ఎంఎస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది.ఏప్రిల్ 14, 2011: ఎస్ఎంఎస్లోని కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది, 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. ఏప్రిల్ 17, 2011: ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం, మూడు కన్వేయర్ బెల్టులకు నష్టం, రూ. 20 కోట్ల నష్టంమే 1, 2011: బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయంజూన్ 18, 2011: కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్లోని రెండు కన్వేయర్ బెల్టులలో ఒకదానిపై వేడి కోక్ పడటంతో అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 15 లక్షల నష్టం -
మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: అద్దాల రైలులో అరుదైన పర్యాటక మార్గం.. సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలోని ‘ఇండియన్ రూట్స్’ ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో విశాఖ–అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రైలు మార్గంగా అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, పచ్చని లోయలు, జలపాతాల మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది. జూన్ 15న గోవాలో జరగనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. విశాఖ– అరకు మార్గంలో పర్యాటకుల కోసం మొట్టమొదటి విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్ను 2017 ఏప్రిల్ 16న అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ కోచ్. ఆ తర్వాత పర్యాటకుల నుంచి వచ్చిన విశేష స్పందన, డిమాండ్ మేరకు ఈ మార్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విస్టాడోమ్ కోచ్ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. అనంతరం, పూర్తిస్థాయి అత్యాధునిక ఎల్ హెచ్ బి విస్టాడోమ్ కోచ్లతో అప్గ్రేడ్ చేసిన రైలు (విశాఖ–కిరండూల్ ఎక్స్ప్రెస్)ని 2021 నవంబర్ 22న ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు మార్గానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ప్రయాణంలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని విశాఖపట్నం డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. -
చల్లటి కబురు.. ఏపీని తాకిన రుతుపవనాలు
సాక్షి, విశాఖ: ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఏపీని నైరుతి రుతుపవనాలు తాకినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. దీంతో, రాయలసీమలో రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. కాగా, ఈనెల 15వ తేదీ నాటికి ఏపీ అంతట రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. -
భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు
విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్కుమార్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్ సుమారు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. దువ్వాడలోని రెండో లైన్లో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో నాలుగో నెంబర్ ప్లాటుఫారంపై కాచిగూడ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. మరో ఐదు ట్రైన్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6.15 నుంచి 8.15 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించిన రైల్వే అధికారులు.. రైళ్లు రాకపోకలను పునరుద్ధరించారు.విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో జీఎం తనిఖీలుసౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ గురువారం విశాఖ– ఇచ్ఛాపురం సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన సింహాచలం రైల్వే స్టేషన్తో పాటు కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన.. నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఇచ్ఛాపురం– విశాఖ మధ్య విండో ట్రైలింగ్ ఇన్స్పెక్షన్ ద్వారా రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రిడ్జిలను పరిశీలించి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ బి.ఎస్.కె. రాజ్కుమార్, పీసీఎస్టీఈ ఓబీ సురేష్కుమార్, పీసీవోఎం వినీత్కుమార్, సీఏవో అంకుష్ గుప్తా, డీఆర్ఎం లలిత్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో బ్యాంకు దోపిడీకి యత్నం
మర్రిపాలెం: ఓ బ్యాంక్ ఉద్యోగి విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో దోపిడీకి యత్నం చేశాడు. అడ్డు వచ్చిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్పై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ మేనేజర్ (ఆపరేషన్స్) ఎల్లా రవికుమార్ విశాఖలోని తన మిత్రుడు మేనేజర్గా ఉన్న ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖకు బుధవారం బ్యాంక్ పనివేళలు ముగిసే సమయానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు క్లోజింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బంగారు నగలను అపహరించేందుకు రవికుమార్ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన బ్యాంకు మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్లు రవికుమార్ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రవికుమార్ తనతో తెచ్చుకున్న సుత్తితో వారి తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు గాయాలవడంతో వారు కేకలు వేశారు. స్థానికులు వెంటనే వచ్చి నిందితుడిని పట్టుకుని క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కంచరపాలెం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడిని అదే బ్యాంక్ యలమంచిలి శాఖలో మేనేజర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కాగా, నిందితుడు బెట్టింగ్లకు బానిసగా మారి అప్పుల్లో కూరుకుపోయాడని, వాటిని ఎలా అయినా తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న ఈ బ్యాంక్ బ్రాంచ్లో గోల్డ్ లోన్లు ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటారని తెలుసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. -
బీచ్లలో బీరు.. బారు
ఇన్నాళ్లూ.. బీచ్ అంటే షికార్లు.. సరదాలు.. పిల్లలు, కుటుంబంతో సేదతీరే ప్రాంతం! ఇకపై.. బీచ్లంటే బీరు, బారు.. మందూ, చిందూ.. ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం!! రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది! గురువారం మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చజెండా ఊపింది! కూటమి సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీచ్ షాక్స్ అంటే.. మినీ బార్లే బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏమిటంటే... బీచ్లలో చిన్న సైజు బార్లే. వెదురు గానీ చెక్కతోగానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్ధాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దశలవారీ మద్యం నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరి్మట్ రూమ్లను రద్దు చేసింది. 48 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది.కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిచి్చ.. మొత్తం 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్ రాష్ట్రంలో ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలతో విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. తీరప్రాంతం ధారాదత్తం.. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బీచ్ షాక్స్ పేరుతో బీచ్లలో బార్లకు అనుమతినిచ్చింది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో పైలట్ ప్రాజెక్టుగా మినీ బార్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. అనంతరం రాష్ట్రంలోని ఇతర బీచ్లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీచ్లలో కూడా మినీ బార్లు ఏర్పాటుకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వాటికి కూడా అనుమతి ఇవ్వనుందని ఎక్సైజ్శాఖ వర్గాలు తెలిపాయి. మినీ బార్లను కూడా టీడీపీ సిండికేట్కే ఏకపక్షంగా కట్టబెట్టనుందన్నది సుస్పష్టం.ఇక బీచ్కు వెళ్లాలంటే భయం భయం..!చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్లకు ఉదయం, సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి.ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి బ్యాచ్లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. ఇక బీచ్లలో కూడా మందు బాబులు, గంజాయి బ్యాచ్లు మహిళలపై విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో బీచ్లలో పోలీసు భద్రత కూడా లేదు. మరోవైపు విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో ఎందరో యువకులు ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు బీచ్లలో మినీ బార్లు ఏర్పాటుతో మద్యం మత్తులో సముద్ర స్నానాలు, ఈతకు దిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.బికినీ ఫెస్టివల్ నుంచి బీచ్ షాక్స్ దాకా.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో బీచ్లలో బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 2016లో జీవో నంబర్ 470 కూడా జారీ చేశారు. దాంతోపాటు బీచ్లలో బికినీ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా సన్నాహాలు చేశారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీచ్లలో బార్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మినీ బార్ల ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి తలుపులు తెరచింది. – సాక్షి, అమరావతి -
విశాఖ తీరంపై చంద్రబాబు కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ తీర ప్రాంతంలో అభివృద్ధి మాటున రియల్ ఎస్టేట్ సంస్థలకు, అనుయాయ కంపెనీలకు అడ్డగోలుగా భూకేటాయింపులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖ తీర ప్రాంతంలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి.. కోస్తా తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లజేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మధురవాడ నుంచి భీమిలి వరకూ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను కోరాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న సీఆర్జెడ్–3 నుంచి సీఆర్జెడ్–2కు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మే నెల 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ) సమావేశంలో మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్జెడ్–2 పరిధిలోకి తేవాలంటూ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండే ఏపీసీజెడ్ఎంఏకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు మెంబర్ సెక్రటరీగా ఉన్న శరవణన్ (ఐఎఫ్ఎస్), విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పీసీబీ ఆర్వో తదితరులు హాజరయ్యారు. 2019లో జారీ చేసిన సీఆర్జెడ్ నోటిఫికేషన్లో ఈ మేరకు మార్పులు చేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణశాఖను కోరాలని సమావేశం అభిప్రాయపడింది. తద్వారా మధురవాడ నుంచి భీమిలి వరకు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. కోస్టల్ కారిడార్కు ముప్పు! వాస్తవానికి 2019లో ఇచ్చిన సీఆర్జెడ్ నోటిఫికేషన్ ప్రకారం మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్జెడ్–3 జోన్ పరిధిలో ఉంది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల వరకూ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టకూడదు. ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న సహజ ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు అలల తాకిడిని, తుపానులను అడ్డుకునే కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. సీఆర్జెడ్–3 పరిధిలో ఉండటంతో ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేదు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన నేతలు ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీటిని ఇప్పుడు సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకరావడం ద్వారా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలకు అవకాశం ఏర్పడనుంది. తద్వారా ఇప్పటికే తాము చేపట్టిన నిర్మాణాలను శాశ్వతం చేసుకోవడంతో పాటు తమ అనుయాయులకు భూకేటాయింపులతో రానున్న రోజుల్లో విశాఖ తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ విధ్వంసం చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విశాఖలోని విలువైన భూములపై కన్నేసింది. మొదటగా తమ బంధువు ఆక్రమించుకున్న 5 వేల కోట్ల విలువైన ఎండాడలోని స్థలాన్ని గీతం పేరిట అక్రమాన్ని సక్రమం చేసేందుకు జీవీఎంసీలో తీర్మానం చేసింది. అం తేకాకుండా విశాఖలో ఉన్న పర్యావరణాన్ని రక్షిస్తున్న పచ్చని కొండలను ఎక్కడికక్కడ గుండు గీయిస్తోంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఏకంగా సీఆర్జెడ్–3 నుంచి సీఆర్జెడ్–2లోకి మార్చడం ద్వారా సహజ రక్షణ కవచాలుగా ఉన్న పర్యావరణాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతోంది. టూరిజం పేరుతో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోకి రాగానే బస్సులో కాలిన వాసన వస్తుండటంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలుపుతుండగానే ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ నాగరాజు బస్సులోని ప్రయాణికులందరినీ కిందకి దించాడు. ఆగ్నిమాపక వాహనం వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయిన సంగతి తెలిసిందే. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. -
రైల్వేజోన్కు సర్వం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ప్రారంబోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని రైల్వే బోర్డు భావిస్తోంది. విశాఖ నుంచి ఏదైనా కొత్త రైలు ప్రారంభించినప్పుడు భారీగా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఒక్క రోజే గడువు ఉండటంతో అనుబంధ జోన్లు, డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవుని రద్దు చేసి విధులకు హాజరవ్వాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీన జరిగే ప్రారంబోత్సవంలో పాల్గొనేందుకు దక్షిణ కోస్తా జోన్ పరిదిలోని డీఆర్ఎంలు విశాఖకు వస్తున్నారు.దీనిపై నేడు డెక్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎంల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయి పనుల్లో రైల్వే ఉద్యోగులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లలో జాప్యం జరగకుండా ఉండేందుకు రైల్వేబోర్డు ఆయా డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగీ విధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. పరిపాలన, క్షేత్ర స్థాయి పనులపై పూర్తి దృష్టి సారించింది. ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, కొత్త జోన్ పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) శనివారం విశాఖ జోన్ జీఎం సందీప్ మాథుర్తో సమావేశమయ్యారు. మరోవైపు రైల్వే బోర్డు అధికారులకు దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జీఎంలు, డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆస్తులు విభజనపై ఈ భేటీలో చర్చించారు.కొత్త బోర్డులతో హద్దుల మార్పు జోన్ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకున్నాయి. కొత్త జోన్ సరిహద్దులను ఖరారు చేస్తూ, పాత బోర్డుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న రైల్వే కార్యాలయాలు, కల్యాణమండపాలు, ఇతర భవనాల వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ స్థానంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని మారుస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల హడావుడితో జోన్ కార్యాలయంతోపాటు పరిసరాల్లో సందడి నెలకొంది. సీపీఆర్వోగా బాలాజీ కిరణ్మరోవైపు పాలనాపరమైన కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వోగా బాలాజీ కిరణ్ను నియమించింది. ఒక పక్క క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, మరోపక్క పరిపాలనా విభాగాల కూర్పుతో జోన్ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. రద్దీకి అనుగుణంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు నుంచి అదనపు రైళ్లు, వందేభారత్ కనెక్టివిటీ పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి జోన్ అమల్లోకి రాగానే వైజాగ్ – సికింద్రాబాద్ వందేభారత్తోపాటు పలు రైళ్ల నిర్వహణ, అడ్మిని్రస్టేషన్ కంట్రోల్ మొత్తం విశాఖ కేంద్రంగా జరగనుండటంతో ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందనున్నాయి.కొత్త రైల్వే జోన్లోకి స్వాగతం!మధిర: ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను నూతనంగా ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగిన విజయవాడ డివిజన్ను కొత్తజోన్లోకి మార్చారు. అలాగే, ఇన్నాళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మధిర, తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లను విశాఖ జోన్, విజయవాడ డివిజన్ పరిధిలోకి బదలాయించారు.ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుండగా.. మధిర మండలం బయ్యారం సమీపాన కొత్త జోన్ పరిధిని సూచిస్తూ సిబ్బంది శనివారం బోర్డు ఏర్పాటు చేశారు. కాగా, ఇన్నాళ్లు రైల్వే ఉద్యోగులు, ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం సికింద్రాబాద్ వెళ్తుండగా.. ఇకపై జీఎంను కలవాలంటే విశాఖకు, ఇతర అధికారులను కలిసేందుకు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని మూడు రైల్వేస్టేషన్ల పరిధి ఉద్యోగులు, ప్రజలు పాలనపరమైన అంశాల్లో ఇబ్బంది ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు. -
విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోలు)
-
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
వామ్మో.. అలాంటి గాలి పీలుస్తున్నామా?
విశాఖ నగరవాసులు తమకు తెలియకుండానే ప్రమాదకర వాతావరణంలో జీవిస్తున్నారా? రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత నగరాన్ని నెమ్మదిగా “పాల్యూషన్ హాట్స్పాట్”గా మారుస్తోందా? అసలు ప్రజలు పీలుస్తున్న గాలి నిజంగానే సురక్షితమేనా? తాజాగా వెలువడిన ఒక నివేదిక ఈ ప్రశ్నలకు ఆందోళనకర సమాధానాలు ఇచ్చింది. విశాఖ ప్రజలు దాదాపు ప్రతి 10 రోజుల్లో 7 రోజులు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.“రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సంస్థ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో గత మూడు సంవత్సరాలుగా వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మానిటరింగ్ స్టేషన్ ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం.. 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 70.68 శాతం రోజుల్లో PM10 స్థాయులు భారత జాతీయ భద్రతా పరిమితిని మించిపోయాయి.PM10.. పీఎంఅంటే గాలిలో తేలే సూక్ష్మ ధూళి కణాలు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో గత రెండేళ్లలో నైట్రోజన్ డైఆక్సైడ్ (NO2) స్థాయిలు 34 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాల వల్లే ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.నివేదికలో మరింత షాకింగ్ అంశం ఏమిటంటే.. 2026లో PM10 వార్షిక సగటు 139.59 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్గా నమోదైంది. ఇది జాతీయ ప్రమాణాల కంటే రెండింతలకు పైగా అధికం. అంతేకాదు, జీవీఎం కార్పొరేషన్ మానిటరింగ్ స్టేషన్ పరిధి వరుసగా మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా నమోదవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా కూడా పరిస్థితి మెరుగ్గా లేదని నివేదిక పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్లో PM10 సగటు 67 µg/m³ ఉండగా, 2026 నాటికి అది 84 µg/m³కు పెరిగింది. PM2.5 స్థాయిలు కూడా 33 శాతం పెరిగి జాతీయ పరిమితులను దాటాయి. ముఖ్యంగా చలికాలంలో కాలుష్యం మరింత తీవ్రంగా నమోదైంది. 2025 డిసెంబర్, 2026 జనవరిలో PM10 స్థాయులు 100 µg/m³ దాటినట్లు అధ్యయనం వెల్లడించింది.ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా పరిశ్రమల ఉద్గారాలు, పోర్ట్ కార్యకలాపాలు, రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లు, పెరుగుతున్న వాహన రద్దీని నివేదిక స్పష్టంగా గుర్తించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీతో పాటు పరిశ్రమల దహన ప్రక్రియల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు విశ్లేషణ చెబుతోంది.ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారిపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం పరిశ్రమలపై కఠిన నియంత్రణలు, హైపర్లోకల్ ఎమిషన్ మ్యాపింగ్, మరిన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, రియల్టైమ్ హాట్స్పాట్ రిపోర్టింగ్ వ్యవస్థలను వెంటనే అమలు చేయాలని “రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సూచించింది. -
విశాఖలో వాన బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన విశాఖవాసులకు గురువారం ఉదయం వర్షం ఊరటనిచ్చింది. అయితే కాసేపటికే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోగా.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.ఇదిలా ఉండగా విశాఖ నగరానికి సమీపంలో సముద్రం వైపు అకస్మాత్తుగా సీ స్టార్మ్ ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ద్వారకానగర్, మధురవాడ, సీతమ్మధార, జగదాంబ జంక్షన్తో పాటు బీచ్రోడ్ సమీప ప్రాంతాల్లో వచ్చే 30 నుంచి 40 నిమిషాల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు.ఈ స్టార్మ్ నెమ్మదిగా కదులుతుండటంతో భారీ వర్షం కంటే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అవసరం లేకుండా బయటకు రావొద్దని, బీచ్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఇంకా వర్షాలు కొనసాగొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.#Visakhapatnam rains alert - Sudden sea storm development near the city can give a spell of rains across Dwaraka Nagar, Madhurawada, Seethammadhara, Jagadamba and areas close to Beach road (like Mahalakshminagar) during next 30-40 minutes. Slow moving storms and rains will be…— Andhra Pradesh Weatherman (@praneethweather) May 28, 2026 -
విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
‘చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాయొచ్చు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వ్యవస్థల మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్ హిట్ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?కోవిడ్ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్:కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్ టాపర్ వచ్చాడని తెలిసి ఆన్ లైన్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్ డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్ మావిగన్ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్ జరిగి మెరిట్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. -
నిప్పుల కుంపటిలా భానుడు.. నీటి చుక్క కోసం పక్షుల విలవిల! (ఫొటోలు)
-
పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండానే..!
విశాఖ: విశాఖ వెస్ట్లో ఉన్న గోపాలపట్నం కాపు భవన్ ప్రారంభోత్సవానికి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆహ్వానం అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తైన కాపు భవన్ను.. రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గణబాబు. అయితే ఈ కార్యక్రమానికి కాపు నాయకులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ ఆహ్వానం అందలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవం సందర్భం కనీసం కాపు నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్లే చేసేశారు. దీనిపై కాపు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గ భవన్ ప్రారంభోత్సవానికి కాపు నేతలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. -
బాబుది పా‘శవ’క పాలన
బీచ్రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.పేదల పొట్ట కొడుతున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..
విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్కు చెందిన భార్గవ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్ బీఆర్టీఎస్ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. -
‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!
శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా ఉన్న సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. -
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్లో సందడి (ఫొటోలు)
-
‘ఏయూ శతాబ్ధి ఉత్సవాల్లో చారిత్రక తప్పిదం’
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వార్షికోత్సం జరుగుతున్నందుకు సంతోషమే. ఈ సందర్భంలో ఈ యూనివర్శిటీ స్థాపన జరిగిన తీరు, అందుకు కృషి చేసిన మహానుభావులను స్మరించుకోవడం అవశ్యం. లక్షలాది మంది విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించిన ఆంధ్ర యూనివర్శిటీ ఇప్పటికీ సమున్నతంగా వెలుగుతోంది. శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కొన్ని చారిత్రక అంశాలను ప్రస్తావించినట్లు కనిపించలేదు. అందుకే చరిత్ర కొంత గుర్తు చేయడం అవసరం అనిపిస్తోంది..ఈ యూనివర్శిటీని స్థాపించడానికి పానగల్ మహారాజు కారణమని చెప్పాలి. ఈయన గొప్పదనం గురించి అతిధులు మాట్లాడినట్లు కనిపించలేదు. ఆంధ్ర విశ్వ విద్యా పరిషత్తు ను స్థాపించాలని కోరుతూ ప్రఖ్యాత స్వాతంత్ర యోధులు, తెలుగు నేతలు ప్రకాశం పంతులు ,కొండా వెంకటప్పయ్య పంతులు తదితరులు ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్యపరచేవారు. ఆ దశలో పానగల్లు రాజా పానుగంటి వెంకట రాయనం మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (1925- 28) ఎన్నికయ్యారు. ఆయన చొరవ చూపించి, ఆంధ్ర నేతల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుని ఆంధ్ర యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ ప్రతిపాదనను తమిళ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించినా ఈయన ముందుకు తీసుకువెళ్లారు. ఈ యూనివర్శిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు కొంతమంది రాయలసీమను సూచించారు. కాని అన్నిటిని పరిగణనలోకి తీసుకున్న పానగల్ రాజా దీనిని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన సర్ సీఆర్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి సహకరించాలని కోరారు. అప్పటికే ప్రముఖ విద్యావేత్తగా పేరొందిన సీఆర్ రెడ్డి అందుకు అంగీకరించడంతో ఈ యూనివర్శిటీ ఏర్పాటు సాధ్యమైంది. తొలి వీసీగా ఉండాలని రాజా కోరడం, సీఆర్ రెడ్డి సిద్దపడడం విశేషం. ఈ సందర్భంగా సీఆర్ రెడ్డి పానగల్ రాజాగారికి ఒక సలహా ఇచ్చారు. యూనివర్శిటీ పెట్టాలంటే కాలేజీలు అవసరం అని.. కాలేజీలకు హైస్కూళ్లు అత్యవసరం అవుతాయని చెప్పారు. ఈ కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూలును ఏర్పాటు చేయాలన్న సీఆర్ రెడ్డి సలహాను పానగల్ రాజా గారు పాటించారు. (అప్పట్లో కృష్ణా జిల్లాలో బందరు, విజయవాడల్లో హైస్కూళ్లు ఉండేవి. రాజా గారి నిర్ణయం కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూల్ ఏర్పాటైంది.) ఈ చర్య వల్ల ఆంధ్ర ప్రాంతంలో విద్యావ్యవస్థకు బలమైన పునాది పడింది.తదుపరి 1926లో యూనివర్శిటీ ఏర్పాటు జరిగింది. మౌలిక వసతులు వచ్చేవరకు తాత్కాలికంగా విజయవాడలో నిర్వహించి తదుపరి విశాఖకు తరలించారు. సీఆర్ రెడ్డి తర్వాత ప్రముఖ విద్యా వేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ చాన్సలర్గా నియమితులై అనన్యమైన సేవలు అందించారు. తదనంతర కాలంలో ఆయన రాష్ట్రపతి అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మహనీయుల కృషి వల్ల కోస్తా, రాయలసీమలలోని పలు జిల్లాలలో కాలేజీలు హైస్కూళ్లు స్థాపితం అయ్యాయి. ఇందుకు పలువురు జమిందార్ రాజాలు కూడా సహకరించారు. పర్లాకిమిడి జిల్లాలోని జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ విశాఖలో యూనివర్శిటీ భవనాల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేశారు. అందుకు కృతజ్ఞతగా యూనివర్శిటీ ప్రాంగణంలో ఆయన విగ్రహం కూడా పెట్టారు. ఆంధ్ర యూనివర్శిటీ స్థాపనకు కారకుడైన పానగల్ మహారాజ తన విగ్రహం వద్దని, విక్రమ్ దేవ్ విగ్రహం పెట్టాలని సూచించడం ఆయన ఔదార్యానికి నిదర్శనం. శతవార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్ర ప్రజలకు తెలియాలని ఆశిస్తున్నాను.:::దేవులపల్లి గోపాలరావు, హైకోర్టు న్యాయవాది -
99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఎండాడలో ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం సుమారు రూ.1,000 కోట్లకుపైగా విలువ కలిగిన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024–29 ప్రకారం ఇన్ఫోసిస్ లిమిటెడ్కు మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో ఇన్ఫోసిస్ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.దీంతోపాటు ఎండాడ వద్ద సర్వే నెంబర్ 175/పీలో మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్కు కేటాయించడానికి ఏపీఐఐసీకి బదలాయించాలని రెవెన్యూశాఖను కోరింది. ఈ క్యాంపస్కు అవసరమైన మౌలికవసతులను రూ.79 కోట్లతో ఏపీఐఐసీ, వీఎంఆర్డీఏ కల్పించనున్నాయి.2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆరేళ్లలో రెండు దశలను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుకు 100 శాతం గ్రీన్ఎనర్జీని అందించాలని ఇంధన శాఖను ఆదేశించింది. భూమి అమ్మకం ఒప్పందం కుదిరిన 120 రోజుల్లోగా అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైజాగ్ ఇన్ఫోసిస్ @ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్ను తీసుకువస్తే.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కారు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలుగా అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పులేదు.రూ.వేల కోట్ల లాభాలను గడిస్తూ... ఒకపక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. తొలిసారిగా టైర్–2 నగరానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్దే తొలిసారిగా ఇన్ఫోసిస్ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్లో 1,000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్ను 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు నెలలకు ఒకసారి రూ.8,500 కోట్లకుపైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. గతేడాది బెంగళూరులో తన వద్ద అదనంగా ఉన్న 53 ఎకరాలను ఇన్ఫోసిస్ రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించిందని, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశి్నస్తున్నారు. భూములివ్వడంతోపాటు భవన నిర్మాణానికీ డబ్బులు..! చంద్రబాబు సర్కారు ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ పేరిట కే.రహేజా, సత్వా, కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అంతేకాకుండా ఇలా కేటాయించిన భూముల్లో 50 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. -
సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)
-
గాజువాకలో అగ్నిప్రమాదం
విశాఖ: గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకన్య థియేటర్ దగ్గర ఎలక్ట్రానిక్ షోరూమ్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ పై అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరొకవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
విశాఖపట్నం : ‘కళా సెంటినియల్ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)
-
విశాఖ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు
సాక్షి, విశాఖపట్నం : విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి ముస్తాబవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం పోర్టు అథారిటీలో అందుబాటులోకి వచ్చిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి అంతర్జాతీయ విహార యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు దేశీయంగా సర్వీసులు నడవగా తొలిసారిగా అంతర్జాతీయ సర్వీసులకు కార్డిలియో విహార నౌక గ్రీన్సిగ్నల్ ఇచ్చిoది. ఈ ఏడాది జూలై 15న విశాఖపట్నం నుంచి సర్వీసు ప్రారంభం కానుందని ఏపీ టూరిజం ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. మొత్తం 14 రోజులపాటు సాగే ఈ విహార యాత్ర విశాఖ నుంచి మొదలై చెన్నై మీదుగా థాయ్లాండ్లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్ పట్టణాలను సందర్శిస్తూ చివరకు సింగపూర్ చేరుకోనుందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులు సముద్రం మధ్యలో మూడు రోజులపాటు విహరిస్తూ నౌకలోని విలాసవంతమైన సౌకర్యాలు, వినోద కార్యక్రమాలు, రుచికరమైన భోజనాలు రుచి చూడవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఫుకెట్లో రెండు రోజులపాటు బస చేసే అవకాశం ఉండటంతో పర్యాటకులు అక్కడి అందమైన తీరాలను, థాయ్లాండ్ దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆస్వాదించవచ్చని వెల్లడించారు. ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులు పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల కాలపరిమితి కలిగి ఉండేలా చూసుకోవాలని టూరిజం ఫోరం ప్రతినిధులు సూచించారు. థాయ్లాండ్, మలేషియా దేశాలకు చేరుకున్నాక అనుమతులు లభిస్తాయని, సింగపూర్ సందర్శనకు మాత్రం ముందే అనుమతి పత్రాలు తీసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
నంబరు లేని వాహనంలో హోం మంత్రి ప్రయాణం
విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి అనిత శనివారం సాయంత్రం బీచ్రోడ్డులో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే, ఆమె నంబరు లేని వాహనంలో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ కనిపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాహనంపై కనీసం తాత్కాలిక (టీఆర్) నంబరు కూడా లేకపోవడం గమనార్హం. -
భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
మౌనిక హత్య కేసులో కొత్త మలుపు
విశాఖపట్నం: గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కొత్తమలుపు చోటుచేసుకుంది. నిందితుడు చింతాడ రవీంద్ర పోలీసులనే తప్పుదోవ పట్టించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మౌనికను వేరే అపార్ట్మెంట్లో హత్య చేసి మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్కు తీసుకొచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాను నివాసముంటున్న కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో మౌనికను హత్య చేసినట్టు పోలీసుల వద్ద నిందితుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజు రవీంద్ర ఉంటున్న అపార్ట్మెంట్కు మౌనిక వచ్చినట్టు సీసీ కెమెరాలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. దీంతో అతడిని పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించగా, తాను మౌనికను హత్య చేసింది తన అపార్ట్మెంట్లో కాదని, అక్కడికి సమీపంలో ఉన్న మరో అపార్ట్మెంట్లోని తన స్నేహితుడి ఫ్లాట్లోనని చెప్పడంతో పోలీసులు ఆ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అక్కడికి మౌనిక వచ్చినట్టు, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో తరలించినట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. అసలు ఏం జరిగిందంటే? నగరంలోని సంజీవయ్యనగర్కు చెందిన మౌనికను నేవీ ఉద్యోగి చింతల రవీంద్ర గత నెల 29న పాతగాజువాకలోని ఎల్వీనగర్లోని ఒక అపార్ట్మెంట్లో పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య అనంతరం అతడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన దాని ప్రకారం మౌనికను కీర్తి ఎన్క్లేవ్లోనే హత్య చేశాడని పోలీసులు సైతం అనుకున్నారు. దాని ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం పలుమార్లు నిందితుడు నివాసముండే అపార్ట్మెంట్తోపాటు, తల, చేతులు కాల్చిన ధారపాలేనికి వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కీర్తి ఎన్క్లేవ్లో హత్య జరిగిన రోజుగాని, అంతకుముందు మూడు రోజులుగాని హతురాలు మౌనిక నిందితుడి ఇంటికి వచ్చినట్టు సీసీ కెమెరాలో నమోదు కాలేదు. ఇతర ఆధారాలు కూడా లభించలేదు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. దీంతో పోలీసులు రవీంద్రను తమ కస్టడీకి తీసుకొని పలు కోణాల్లో విచారించారు. ట్రాలీ బ్యాగ్లో మృతదేహం.. ఫ్రిజ్లో శరీర భాగాలు! మౌనికను తమ అపార్ట్మెంట్కు సమీపంలో ఉన్న తన స్నేహితుడి అపార్ట్మెంట్ ఫ్లాట్లో హత్య చేసినట్టు నిందితుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. రవీంద్ర స్నేహితుడు సురేంద్రతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య జరిగిన ఫ్లాట్లో నివాసముంటున్నారు. గత నెల 29న స్నేహితుడు సురేంద్రకు ఫోన్ చేయగా, ఇంట్లో ఎవరం లేమని, డ్యూటీలో ఉన్నామని చెప్పాడు. ఫ్లాట్లో ఎవరూ లేకపోవడాన్ని అదనుగా భావించిన రవీంద్ర ప్రియురాలు మౌనికను పథకం ప్రకారం హత్య చేయడానికి స్నేహితుడి ఫ్లాట్కు తీసుకువెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో రవీంద్ర ఆవేశంతో మౌనిక నోరు, ముక్కు మూసి ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో పెట్టి తన ఫ్లాట్కు తీసుకెళ్లిపోయాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను రిఫ్రిజిరేటర్లో, మరికొన్ని భాగాలను మంచం కింద ఉంచాడు. తల, చేతులను ఒక గోనె సంచిలో మూటగట్టి అడవివరం దరి ధారపాలెంలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు సురేంద్రకు ఫోన్లో చెప్పగా, పోలీసులకు వెంటనే లొంగిపోవాలని అతడు సూచించడంతోపాటు రాజాంలో ఉన్న నిందితుడి సోదరుడికి, గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈలోగా రవీంద్రను తమ్ముడు గాజువాక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అప్పగించాడు. కాగా, ఈ హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మౌనికను హత్య చేసింది రవీంద్ర ఒక్కడేనా, ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక డబ్బుల కోసం వేధిస్తుండటం వల్లే హత్య చేశానని నిందితుడు చెప్పిన నేపథ్యంలో నిజానిజాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. -
రనౌట్ వివాదం : అంపైర్ను పొడిచి చంపేశాడు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లో రనౌట్ నిర్ణయం అంపైర్ ప్రాణం తీసింది. స్థానిక మ్యాచ్లో 21 ఏళ్ల క్రికెట్ అంపైర్ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించాడు అజిత్. ఇందులో భాగంగా అఇత్ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో 26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండిగాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్ సోదరుడు వాపోయాడు. కిషోర్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
విశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సంద్రాన సమరాంగణం సాగర గర్భంలో సొరంగం
సాక్షి, విశాఖపట్నం: నౌకా దళ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారనుంది. నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ‘లార్జ్ కావిటేషన్ టన్నెల్(ఎల్సీటీ)’ నిర్మాణానికి శంకుస్థాపనతో నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెళ్లలో ఒకటిగా ఇది నిలవనుంది. సముద్ర గర్భంలోనే యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఎల్సీటీ పూర్తయితే.. కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకూ ఒకే చోట జరిగే వేదికగా విశాఖ చరిత్రపుటలకెక్కనుంది. రెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏమిటీ లార్జ్ కావిటేషన్ టన్నెల్.. సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించేటప్పుడు వాటి ప్రొపెల్లర్ల దగ్గర నీటి ఒత్తిడి తగ్గి, చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా ‘కావిటేషన్’ అంటారు. ఈ బుడగలు పేలినప్పుడు విపరీతమైన శబ్దం రావడమే కాకుండా, ప్రొపెల్లర్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల.. పరిశోధనలకు విఘాతం కలుగుతుంటుంది. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు, కృత్రిమంగా సముద్ర వాతావరణాన్ని సృష్టించే ఒక భారీ నీటి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే ‘లార్జ్ కావిటేషన్ టన్నెల్’ అని పిలుస్తారు. విశాఖలో సుమారు 230 మీటర్ల పొడవు ఉండే టన్నెల్ని నిర్మించనున్నారు. ఈ టన్నెల్లో నీటి ప్రవాహ వేగాన్ని, ఒత్తిడిని నియంత్రిస్తూ నౌకల నమూనాలను పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎల్సీటీ ప్రయోజనాలేంటి.? » యుద్ధ సమయంలో శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండాలంటే నౌకలు శబ్దం చేయకూడదు. ఈ టన్నెల్ ద్వారా ప్రొపెల్లర్ల శబ్దాన్ని కనిష్ట స్థాయికి ఎలా తగ్గించాలో శాస్త్రవేత్తలు పరిశోధించవచ్చు. » భారీ నౌకలను సముద్రంలోకి దించిన తర్వాత లోపాలు గుర్తిస్తే సరిదిద్దడం కష్టం. కానీ ఎల్సీటీలో నమూనా నౌకలను ఉంచి, వివిధ వేగాల వద్ద అవి ఎలా పనిచేస్తాయో ముందే తెలుసుకోవచ్చు. ఫలితంగా.. లోపాల్ని సులువుగా సరిదిద్దే అవకాశం ఉంటుంది. » ప్రొపెల్లర్ల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా నీటి ఘర్షణను తగ్గించి, ఇంధన వినియోగాన్ని ఆదా చేయవచ్చు. » కేవలం నౌకలే కాదు.. నీటిలోపల ప్రయోగించే క్షిపణులైన టార్పెడోల్ని కూడా ఇక్కడ పరీక్షిస్తారు. టార్పెడో నీటిలో ప్రయాణించేటప్పుడు దాని స్థిరత్వం ఎలా ఉంది, ప్రయాణ మార్గంలో నీటి ఒత్తిడికి అది ఎలా స్పందిస్తోంది అనేది ఇక్కడ కచ్చితంగా లెక్కించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఈ ఎల్సీటీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతికొద్ది అత్యాధునిక టన్నెళ్లలో ఒకటి. దీని నిర్మాణంతో అమెరికా, రష్యా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ నిలవనుంది. ఇది కేవలం మన దేశ అవసరాలకే కాకుండా, భవిష్యత్తులో మిత్ర దేశాల నౌకా నమూనాల పరీక్షలకూ వేదికవుతుంది. నౌకాదళానికి, ఎన్ఎస్టీఎల్కు లాభమేంటంటే.? నగరంలో ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అనుబంధ సంస్థ ఎన్ఎస్టీఎల్ ఆధ్వర్యంలో ఈ ఎల్సీటీ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. గతంలో ఈ తరహా పరీక్షల కోసం రష్యా లేదా యూరప్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశంలోనే, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అదేవిధంగా.. మన యుద్ధ నౌకల డిజైన్లు, రహస్యాలు ఇతర దేశాలకు తెలియకుండా మన దగ్గరే భద్రంగా ఉంటాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా అత్యాధునిక సబ్మెరైన్లు, టార్పెడోలు, యుద్ధ నౌకల తయారీలో ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్తలకు ఇది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారనుంది. దీని నిర్మాణం పూర్తయితే.. విశాఖ, ఎన్ఎస్టీల్లో నౌకా నిర్మాణానికి సంబంధించి ‘కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకూ అన్నీ ఒకే చోట జరగనున్నాయి. ఇది మన రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో శాస్త్రవేత్తల మేధస్సుకు, భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనమని రక్షణ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు?: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.విభజన హామీలు ఏమయ్యాయి? మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి. ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి రూ.14 వేలు ఎందుకు? ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది. మరో భారీ ఎల్పీజీ నౌక.. విశాఖ పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చిన 'పైన్ గ్యాస్' ఎల్పీజీ నౌక.. 47 వేల టన్నుల గ్యాస్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ డిమాండ్, నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్టు సమాచారం.కాగా, వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్ వెసల్స్ రాకతో విశాఖ పోర్టు కళకళలాడుతోంది. ఐదు రోజుల క్రితం(శుక్రవారం) కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చింది. మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి బీడబ్ల్యూ బిర్చ్ వెసల్ 24,000 మెట్రిక్ టన్నుల భారీ ఎల్పీజీ నౌక వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎమ్టీ సెంచూరియన్–1 వెసల్లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్లోడ్ చేశారు. కాగా, అమెరికా నుంచి మరిన్ని గ్యాస్ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.యుద్ధ సంక్షోభం తరువాత నాలుగు ఎల్పీజీ నౌకలు విశాఖ వచ్చాయని విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. లక్ష టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని.. మరో 3 గ్యాస్ నౌకలు రానున్నాయని తెలిపారు. 13 క్రూడ్ ఆయిల్ నౌకలు వచ్చాయని.. మరో 4-5 క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖ పోర్టు.. ముంబై పోర్టుతో సమానంగా కార్గో హ్యాండిలింగ్ చేస్తుందన్నారు. -
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
‘అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు’
విశాఖ: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేకే రాజు ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. అమరావతిని వైఎస్ జగన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రూ. 50 వేల కోట్లు తెచ్చారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ పోరంబోకు, స్థానిక సంస్థల భూములు విద్యా సంస్థలకు ఇవ్వకూడదని తీర్పు ఉంది. ఆక్రమించిన భూమిలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. కూటమి పాలనలో విశాఖలో జరిగిన భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరిపించాలి. జోడుగుళ్ళ పాలెంలో రూ. 50 కోట్లు విలువ చేసే 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కులను కూటమి నేతలు కబ్జా చేస్తున్నారు.’ అని మండిపడ్దారు. -
‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశి్నస్తూ డీపీఆర్ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ముగింపు..మళ్లీ మొదటికే కథ! మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. డబుల్ డెక్కర్తోనే అసలు సమస్య విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్ మెట్రో డీపీఆర్ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా డబుల్ డెక్కర్ కారిడార్ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది. మరోసారి డీపీఆర్లో మార్పులకు..! విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ దెబ్బతింటుందని కేంద్రం తేలి్చచెప్పింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకైనా డబుల్ డెక్కర్ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది.డబుల్ డెక్కర్తో ‘డబుల్’ భారంవిశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్ కంటే.. ప్రస్తుత ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ఏడీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్ డెక్కర్ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్ లైన్ల మారి్పడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. -
విశాఖలో అద్భుత సైకత శిల్పం.. పర్యాటకుల సందడి
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరం మరో అరుదైన ఘటనకు నిలయమైంది. విశాఖలో సరికొత్త సైకత(ఇసుక శిల్పం) శిల్పం పర్యాటకులకు మరింతగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ సరికొత్త సైకత శిల్పం ఏంటని అనుకుంటున్నారా?. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ చైన్ 'కేఎఫ్సీ' (KFC)కి చెందిన చికెన్ బకెట్. దీనికి సంబంధించిన భారీ ఆకార శిల్పం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది భారత్లోనే అతిపెద్ద ఇసుక నిర్మాణం కావడం గమనార్హం.విశాఖపట్నం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రామకృష్ణ మిషన్ బీచ్లో ఇటీవల ఒక అద్భుతమైన ఇసుక శిల్పం వెలిసింది. విశాఖలో కేఎఫ్సీ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇసుక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, కేఎఫ్సీ సైకత శిల్పం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాగా, ఈ అద్భుత కళాఖండాన్ని ప్రముఖ స్థానిక సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. కేవలం ఇసుకను మాత్రమే ఉపయోగించి తయారు చేసిన ఈ శిల్పం చూడటానికి అచ్చు అసలైన కేఎఫ్సీ చికెన్ బకెట్లాగే ఉండటం గమనార్హం.ఇక, ఈ శిల్పంపై కేఎఫ్సీ వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ ముఖచిత్రాన్ని ఎంతో స్పష్టంగా చెక్కారు. దీనిని రూపొందించడానికి ఆయన సుమారు రెండు రోజుల పాటు నిరంతరంగా శ్రమించారు. ఈ భారీ శిల్పాన్ని "ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్" గా అభివర్ణిస్తున్నారు. బీచ్కు వచ్చే పర్యాటకులు ఈ శిల్పం ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ భారీ ఇసుక శిల్పం ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక, ఇది విశాఖపట్నం నగరంలో కేఎఫ్సీ 14వ బ్రాంచ్ కావడం విశేషం. సముద్ర తీర వాతావరణానికి అనుగుణంగా, కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ డిజైన్ను రూపొందించారు. -
వంట గది ఖాళీ.. రోడ్డెక్కిన సిలిండర్ల ర్యాలీ
విశాఖపట్నం: నగర శివారు గ్రామాల్లో వంట గ్యాస్ కోసం సామాన్యుడి పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో వినియోగదారులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి భీమిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లు బారులు తీరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వంట గదిలో పనులన్నీ పక్కన పెట్టి, గృహిణులు, కూలీలు గ్యాస్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక గంటల తరబడి రహదారిపైనే నిరీక్షిస్తున్నారు. చేతిలో పని వదిలేసి, పొయ్యి వెలిగించుకోవడానికి సిలిండర్లు పట్టుకుని రోడ్ల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్ సందడి (ఫొటోలు)
-
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. బీఆర్ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు. -
విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ బరితెగించింది.కూటమి ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు మరో స్టేజ్కు చేరుకున్నాయి. అధికార అండతో కోర్టులో కేసు ఉండగానే యాజమాన్యం నిర్మాణాలను ప్రారంభించింది. అయితే, గీతం అక్రమ నిర్మాణాలవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలోని 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో గీతం యాజమాన్యం నిర్మాణాలు చేపట్టింది. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభించింది. అధికార అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఆక్రమిత భూముల్లో ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక, ఇప్పటికే గీతం కబ్జా భూములను 22-ఏ జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల 5000 కోట్ల విలువైన భూమి అడ్డదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ జరిగింది. -
విశాఖ జలాల్లోకి రష్యా యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో సముద్ర జలాల్లో అనిశ్చితి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో విశాఖ సాగరజలాల్లో రెండు రష్యాయుద్ధ నౌకలు ప్రత్యక్షం కావడం అంతర్జాతీయ చర్చకు దారి తీసింది.రష్యానౌకాదళానికి చెందిన స్టెరెగుష్చి క్లాస్ కార్వెట్స్ అయిన షోవర్షెన్నీ, రెజ్కీ యుద్ధనౌకలు రెండు రోజుల కిందట అనధికారిక విజిట్పేరుతో విశాఖ తీరానికి చేరుకున్నాయి. రష్యా నౌకల్లో వచ్చిన సిబ్బందికి భారతనౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ నౌకల రాక వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఇండియన్ నేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఆ నౌకలు విశాఖకు ఎందుకు వచ్చాయి.. ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించే అవకాశం ఉందా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సాగరతీరంలో షార్క్ల వేట..!
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ, విశాఖ ఫిషింగ్ హార్బర్ సాక్షిగా అరుదైన షార్క్ భారీ అక్రమ రవాణా సాగుతోంది. అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న షార్క్ ఫిన్స్ (మొప్పలు) కోసం మత్స్యకారుల రూపంలో వేటగాళ్లు సాగర గర్భాన్ని జల్లెడ పడుతున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని కోట్లాది రూపాయలకు విదేశాలకు తరలిస్తున్నారు. షార్క్ల అక్రమ రవాణా అరికట్టకపోతే ఇందులో పలు జాతులు అంతరించే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం షార్క్ల వేటను ‘టైగర్æ’ వేటతో సమానంగా పరిగణిస్తున్నా, విశాఖ తీరంలో మాత్రం చట్టం చుట్టంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ చట్టం (1972) ప్రకారం షార్క్ల వేటను, ఎగుమతిని కఠినతరం చేసింది. ముఖ్యంగా 2001లో షార్క్లోని కొన్ని అరుదైన జాతులను షెడ్యూల్–1 జాబితాలో చేర్చడం ద్వారా వీటి వేటను పూర్తిగా నిషేధించింది. మత్స్యకారులకు బెదిరింపులు విశాఖ హార్బర్లో వేటకు వెళ్లే మత్స్యకారుల అమాయకత్వాన్ని కూడా దళారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పొరపాటున వలకు చిక్కిన షార్క్లను చూపి ‘వీటిని విక్రయించడం నేరం, పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది‘ అని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ భయంలో మత్స్యకారులు వాటిని వదిలించుకోవాలని చూసినప్పుడు, దళారులు అతి త క్కువ ధర చెల్లించి వాటిని కొనుగోలు చేస్తారని సమాచారం. మరికొంతమంది దళారులు ఏకంగా మత్స్యకారుల అవతారమెత్తి.. షార్క్ల వేట చేస్తున్నారనే విమర్శలున్నాయి. బయట మార్కెట్లో లక్షల విలువ చేసే షార్క్ల విడిభాగాలు, మత్స్యకారుల చేతుల్లో కేవలం కొన్ని వందల రూపాయిలకే దళారుల పరమవుతున్నాయి. అక్రమ రవాణా మార్గం విశాఖ హార్బర్లో దొరికిన షార్క్లను హార్బర్లోనే రహస్య ప్రాంతాలకు తరలిస్తారని తెలుస్తోంది. అక్కడ నిపుణులైన వ్యక్తులతో ఫిన్స్, కాలేయాన్ని, ఇతర భాగాలను వేరు చేస్తారు. వీటిని ఐస్ బాక్సుల్లో భద్రపరిచి, రవాణా వాహనాల్లో చేపల లోడ్ మధ్యలో దాచి పెడుతున్నట్లు సమాచారం. స్మగ్లర్లు మల్టీలేయర్ రవాణా పద్ధతిలో చిన్న చిన్న ఐస్ బాక్సుల్లో దాచి.. ప్రైవేట్ బస్సుల ద్వారా చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి ఇవి నేరుగా చెన్నైకి చేరుతాయి. అక్కడి నుంచి సముద్ర మార్గం లేదా విమానాల ద్వారా చైనా, థాయ్లాండ్, సింగపూర్, మలేషియా, హాంగ్కాంగ్ తదితర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయని నిఘా వర్గాల సమాచారం. అధికారుల నిర్లక్ష్యం ఈ అక్రమ రవాణా అంతా మత్స్యశాఖ అధికారుల కళ్లముందే జరుగుతున్నా, వారు కనీసం తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు కింది స్థాయి సిబ్బందికి దళారులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయనీ.. అందుకే అక్రమ రవాణా వాహనాలు యథేచ్ఛగా వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా ‘సాంకేతిక కారణాలు’ సాకుతో కాలయాపన చేస్తున్నారే తప్ప, గట్టి నిఘా పెట్టిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. కేవలం విశాఖలోనే కాకుండా దేశవ్యాప్తంగా.. అనేక సముద్ర తీర ప్రాంతాల్లో షార్క్ల వేట సాగుతోంది. వరల్డ్వైడ్ ఫండ్–ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఐ), ట్రాఫిక్ సంస్థల నివేదిక ప్రకారం.. భారత దేశ వ్యాప్తంగా గడిచిన దశాబ్ద కాలంలో 18,000 కిలోల షార్క్ ఫిన్స్ని దళారుల నుంచి స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో ఫిన్స్ వాటా 82 శాతం కాగా.. మిగిలిన 18 శాతంలో షార్క్ దంతాలు, కార్టిలేజ్(మృదులాస్థి), చర్మం ఉన్నాయి. 2025 జనవరిలో విశాఖ తీరానికి సమీపంలో అక్రమంగా సేకరించిన షార్క్ఫిన్స్ని తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. సముద్ర పర్యావరణానికి విఘాతం » సముద్ర ఆహార గొలుసులో షార్క్లు అగ్రస్థానంలో ఉంటాయి. » ఇవి చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న జీవులను తిని సముద్రాన్ని శుభ్రంగా ఉంచుతాయి. » వీటి సంఖ్య తగ్గితే సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. » షార్క్లు చాలా నెమ్మదిగా ఎదుగుతాయి. » తక్కువ పిల్లలకు జన్మనిస్తాయి. » విచ్ఛలవిడి వేట వల్ల ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.భారీ డిమాండ్ » షార్క్లోని ప్రతి భాగం అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో సమానం. »ముఖ్యంగా ‘షార్క్ఫిన్స్’ (మొప్పలు) కోసం వీటిని వేటాడుతుంటారు. »ఎందుకంటే చైనా, హాంగ్కాంగ్, తైవాన్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో షార్క్ ఫిన్స్తో చేసే సూప్ చాలా ఖరీదైనది. » ఈ సూప్ని హోదాకు చిహ్నంగా భావిస్తారు. »హాంగ్కాంగ్లో ప్లేట్ ఫిన్ సూప్ ధర రూ.8,500 నుంచి రూ.10,000 వరకూ ఉంటుంది. » అదేవిధంగా.. షార్క్ కాలేయం నుంచి తీసే నూనెను (స్క్వాలెన్స్) సౌందర్య సాధనాలు, క్యాన్సర్ మందుల తయారీలో ఉపయోగిస్తారు. » షార్క్ చర్మాన్ని ఖరీదైన లెదర్ వస్తువుల తయారీకి, వెన్నెముక ఎముకలను కొన్ని రకాల చీలమండ నొప్పుల మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. » అంతర్జాతీయ మార్కెట్లో ఒక కిలో ఎండిన షార్క్ ఫిన్స్ ధర నాణ్యతను బట్టి రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది. » షార్క్లలో హ్యామర్హెడ్, గ్రే రీఫ్, వేల్షార్క్లకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. » విశాఖ సాగర జలాల్లో గ్రేరీఫ్ షార్క్, హ్యామర్హెడ్, బ్లాక్టిప్, బ్లాక్టిప్ రీఫ్, స్పాట్టైల్, వైట్ చీక్, టైగర్, స్పేడ్నోస్, బుల్షార్క్ జాతులు ఎక్కువగా దొరుకుతున్నాయి. -
సెలూన్ ముసుగులో వ్యభిచారం
విశాఖపట్నం: ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సెలూన్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందాపై బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలోని రోబరి హౌస్ ఉన్న భవనంలో హెయిర్ పోర్ట్ సెలూన్ పేరిట ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్ కటింగ్ లేదా మసాజ్ వంటి ఎలాంటి సేవలు అందించకుండా, ఆ గదులను కేవలం వ్యభిచారం కోసం విటులకు అద్దెకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సెలూన్కు వస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. ఈ దందా కోసం ప్రధాన నిర్వాహకుడు.. చంటి అనే సహాయకుడిని నియమించుకున్నాడు. అతడి ద్వారా అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్ ఫోన్లలో పంపించేవాడు. ఆ తర్వాత వారితో బేరం మాట్లాడుకుని సెలూన్కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఒక విటుడు, అలాగే ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. కాగా.. ఎన్ఏడీ జంక్షన్ ప్రాంతం స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచార కూపంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇది రెండోసారి. గతంలో విల్లా కాంప్లెక్స్లో ఉన్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై కూడా టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే. -
ఆ నాలుగేళ్లు విశాఖకు వైభవం
డాబాగార్డెన్స్: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల పాటు మేయర్గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్ పెడుతూ, జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్లో 20 మీటర్ల క్లాక్ టవర్ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జీవీఎంసీ వైఎస్సార్ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్హ్యాండెడ్గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
వెలుగుల భారత్కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ అణు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు విస్తరిస్తోంది. సెన్సార్ల ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రతిక్షణం పర్యవేక్షించే సాంకేతికతను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్ సాంకేతికత అభివృద్ధి, సహాయం డైరెక్టర్ డాక్టర్ జిష్ణు ద్వివేది, ఆర్ఆర్క్యాట్లో ఆవిష్కరణలు, వ్యాపార ప్రారంభాలను ప్రోత్సహించే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ పీఐఈ హబ్) డైరెక్టర్ డాక్టర్ క్రైస్ట్ ప్రకాష్ పాల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ వెళ్లిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..ఆధునిక సాంకేతికతతో అణు విద్యుత్ ఉత్పత్తి దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్ఆర్ కాట్ ముందంజలో ఉంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతలు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వైద్య రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అణు రియాక్టర్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అలాగే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగించే పరికరాలు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల పరికరాల నాణ్యతను పెంచుతున్నాయి. అత్యాధునిక పదార్థాలతో తయారైన పరికరాలు ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి. ముందుగానే లోపాలు గుర్తించే టెక్నాలజీ విద్యుత్ కేంద్రాల్లో పరికరాల లోపాలు ముందుగానే గుర్తించడానికి ఆర్ఆర్ కాట్ రూపొందించిన ఆధునిక లేజర్, డయాగ్నస్టిక్ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతల ద్వారా విద్యుత్ ప్లాంట్లలో జరిగే లోపాలను త్వరగా గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్ మాత్రమే కాకుండా పునరుత్పాదక శక్తి రంగంలో కూడా ఆర్ఆర్ కాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సౌర శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే అధునాతన పరికరాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ టెక్నాలజీలు భవిష్యత్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు విద్యుత్ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, పరికరాల తయారీ, నిర్వహణలో ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. దేశంలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ఇక్కడి కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు దేశ విద్యుత్ భద్రతకు అండగా నిలుస్తున్నాయి. -
వేరే యువతితో ఉండగా ఇంటికి తాళం వేసిన భార్య
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.. విశాఖ జిల్లా కరక పాలమాంబ ఆలయ కమిటీ ఛైర్మన్గా ఉన్న మద్ధి శ్రీనివాస్.. భార్యను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెద్ద వాల్తేర్లోని కాగితాల వీధిలోని ఓ ఇంట్లో యువతితో మద్ధి శ్రీనివాస్ ఉండగా.. ఆయన భార్య గదికి తాళం వేసింది.గతంలోనూ టీడీపీ నేత మద్ధి శ్రీనివాస్ భార్య ఆందోళనకు దిగింది. మద్ధి శ్రీనివాస్పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు. -
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఆయన తన దందాను టాప్ గేర్లోకి తీసుకువెళ్లారు. ఎక్సైజ్ శాఖ 125 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్ మొదలు ‘కప్పం కట్టండి...బార్ లైసెన్స్ తీసుకోండి’ అని హుకుం జారీ చేశారు. అందుకు విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా ఆయన దందా సాగుతోంది. ఒక్కో బార్ లైసెన్స్కు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వడంతోపాటు నెలకు రూ.50 వేలు చెల్లించాలన్నది టీడీపీ ఎమ్మెల్యే మాట.తద్వారా బార్ల లైసెన్సుల వ్యవహారంలో ఏకమొత్తంగా రూ.2.50 కోట్లతోపాటు నెలకు రూ.62.50 లక్షల చొప్పున వసూళ్ల దందాకు స్కెచ్ వేశారు. ఇక విశాఖలో ప్రాంతాలవారీగా ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తుండటంతో వారందరూ సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పినదానికి సై అంటున్నారు. జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల విషయంలో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయ్యే వరకూ లైసెన్సులు ఇవ్వలేదు. ఎక్సైజ్ అధికారికే కప్పం వసూళ్లు, పంపిణీ బాధ్యతలు.. ఇక సదరు టీడీపీ ఎమ్మెల్యే తరఫున కప్పం వసూలు చేసి, వాటాలు పంచే బాధ్యతను ఏకంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి అప్పగించడం మరో విశేషం. సదరు అధికారి తాను చెప్పినట్టు కప్పం వసూలు చేసే బాధ్యతను కిందిస్థాయి అధికారులకు అప్పగించారు. అందుకు సహకరించని ఇద్దరు ఎక్సైజ్ సీఐలపైనా బదిలీ వేటు వేశారు. కాగా సదరు అస్మదీయ అధికారికి తాజాగా పదోన్నతి లభించింది. పదోన్నతి తీసుకుంటే మరో జిల్లాకు బదిలీ కావాల్సి ఉన్నందున, తనకు పదోన్నతే అక్కర్లేదని ఆయన చెప్పేశారు. మరో జిల్లాలో ఉన్నతాధికారి పోస్టు కంటే విశాఖ జిల్లాలో టీడీపీ మద్యం డాన్కు కుడిభుజంగా ఉండటమే ఎక్కువ లాభసాటిగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశం. పెద్దల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోంది.మాట వినకపోతే... విశాఖలో మొత్తం 125 బార్లకు తొలుత ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కప్పం చెల్లించేందుకు సమ్మతించిన 55 బార్లకే మొదటి దశలో లైసెన్సులు ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో 13 బార్లు, మూడోసారి నోటిఫికేషన్తో 27 బార్లకు లైసెన్సులకు పచ్చ జెండా ఊపారు. ఇక మిగిలిన బార్లకు ఎక్సైజ్శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కప్పం చెల్లించకుండా ఎవ్వరూ బార్లకు లైసెన్సులు దాఖలు చేయడానికి వీలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటోంది. ⇒ తనను ధిక్కరిస్తూ లైసెన్సుల కోసం అప్లికేషన్ దాఖలుకు యతి్నంచినవారిపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తూ బెదిరిస్తున్నారు. ⇒ తమకు కాదని లైసెన్సు తెచ్చుకున్నా నగరంలో బార్ ఏర్పాటు చేసేందుకు ఎవరూ స్థలాలు, భవనాలు అద్దెకుగానీ లీజుకుగానీ ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలూ జారీ అయ్యాయి. ⇒ సొంత స్థలాలు, భవనాల్లో బార్లను ఏర్పాటు చేయాలని భావిస్తే ఎక్సైజ్ అధికారులను పంపించి తనఖీలతో వేధిస్తామని కూడా బెదిరిస్తున్నారు. ⇒ దాంతో బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకే ఔత్సాహికులు హడలిపోతున్నారు. -
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
-
మూగ బంధం.. అంతులేని మమకారం
విశాఖపట్నం: కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే మూగజీవాలు దూరమైనా ఆ వ్యధ అంతకంటే ఎక్కువే ఉంటుంది. విశ్వాసానికి మారుపేరైన శునకాలను కేవలం పెంపుడు జంతువుల్లా కాకుండా, ఇంట్లో బిడ్డల్లా సాకుతున్న ఎందరో విశాఖవాసులు.. ఆ మూగజీవాలపై తమకున్న అంతులేని ప్రేమను కొత్తగా చాటుకుంటున్నారు. సాధారణంగా మనుషులకు సమాధులు కట్టి వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడం మనం చూస్తుంటాం. కానీ, అప్పుఘర్ పార్క్ సమీపంలో ఉన్న సాగరతీరానికి వెళితే.. హృదయాన్ని హత్తుకునే అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడ ఇసుక తిన్నెల్లో పదుల సంఖ్యలో శునకాలకు నిర్మించిన సమాధులు దర్శనమిస్తాయి. ఇంటికి కాపలాగా ఉంటూ, యజమాని చుట్టూ తిరుగుతూ, ఎలాంటి స్వార్థం లేకుండా ఎనలేని ప్రేమను పంచేవి శునకాలు. కొన్ని నెలలో, సంవత్సరాలో తమతో గడిపి, సంతోషాన్ని పంచిన ఆ మూగజీవాలు మరణిస్తే యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అవి తమనుంచి దూరమైన తరువాత, వాటికి గౌరవప్రదమైన రీతిలో ఆఖరి మజిలీ నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో వాటి కోసం ప్రత్యేకంగా సమాధులను కట్టించి తమ శాశ్వతమైన ప్రేమకు రూపమిస్తున్నారు. ఒక్కో సమాధి నిర్మాణానికి సుమారు రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చవుతోంది. అయినా సరే, తమ కుటుంబంలో ఒకరిగా మెలిగిన జీవులకు ఘనంగా తుది వీడ్కోలు పలకడానికి వారు ఏమాత్రం వెనకాడటం లేదు. సముద్రపు అలల సాక్షిగా వెలసిన ఈ స్మృతి చిహా్నలు.. వ్యక్తులకు, మూగజీవాలకు మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్ విశాఖపట్నం -
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్బుక్ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
వైఎస్ జగన్ విశాఖ పర్యటన అప్డేట్స్.. 👉విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబసభ్యులను వైఎస్ జగన్ కలిశారు. విశాఖ రాణాప్రతాప్ నగర్లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుఅరకు వ్యాలీ తుంగల్గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుకవివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్ వైఎస్ జగన్కు స్వాగతం అరకు చేరుకున్న వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్ జగన్.గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్కు స్వాగతం పలకనున్న మహిళలు..👉విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్. 👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు.👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
విశాఖ తీర రక్షణకు తూట్లు!
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మారి్పడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు.విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. పర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యంవీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పారీ్టల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆరి్థక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజే‹Ù, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మిం కుల దుర్మరణం
పద్మనాభం (భీమిలి): విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం విద్యుదాఘాతానికి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండయ్యపాలేనికి చెందిన తాపీ మేస్త్రీ కంటుబోతు శ్రీను (34), ఇసకలపాలేనికి చెందిన మరో మేస్త్రీ కాళ్ల సూరీడు (60), ఆయన కుమారుడు సూరిబాబు ఇసకపాలెంలో రేకుల షెడ్డు నిర్మిం స్తున్నారు. కొలతలు తీసుకుంటున్న సమయంలో, అక్కడే అడ్డుగా ఉన్న ఒక పొడవైన ఇనుప పోల్ను పక్కకు జరిపేందుకు యత్నించారు.ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల నుంచి ఇనుప పోల్కు విద్యుత్ ప్రసరించడంతో శ్రీను, సూరీడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరిబాబును 108లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సూరీడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సూరీడు మరణం, సూరిబాబుకు గాయాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్లో ఆర్కిటెక్ట్. వారిద్దరూ తమ వివాహం కేవలం ఒక ఫంక్షన్ హాల్కే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి మూడు రోజులపాటు పండుగలా చేసుకోవాలని విశాఖపట్నం తీరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నారు.సాక్షి, సెంట్రల్ డెస్క్: ఒకప్పుడు ఆకాశమంత పందిరి.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావుడి. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమారుడి ఇళ్లల్లో ఉరుకులు పరుగులు కనిపించేవి. ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగా బాలి, మాల్దీవులు, రాజస్థాన్, కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. మన మధ్యే.. మన రాష్ట్రంలోనే ప్రకృతి అందాల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడం నయా ట్రెండ్గా మారింది. సంప్రదాయబద్ధంగా.. ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపిస్తున్నారు. వధూవరుల తరఫు సమీప బంధువులతో పాటు అత్యంత ఆత్మీయుల సమక్షంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహానికి ముందు బ్యూటీ సెషన్లు, స్థానిక సంస్కృతిని తెలుసుకునే వర్క్షాప్లు వంటి వినూత్న కార్యక్రమాలు 2026లో ట్రెండ్గా ఉన్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్కే జై కొడుతున్నారు. వధువు తరఫున 40–50 మంది.. వరుడి తరఫున మరో 40–50 మందితో ప్రశాంతంగా పెళ్లి వేడుకను ముగిస్తున్నారు. ఆ తరువాత సొంతూళ్లలో బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.చుట్టూ ప్రకృతి అందాలు.. సెలయేటి సవ్వళ్లు.. పక్షుల కిలకిలా రావాల మధ్య అడుగులో అడుగేస్తూ.. వధూవరుల ‘సప్తపది’ తంతు ఆహా.. అన్నట్టు ఉంటోంది. మొదటి రోజు: పెళ్లి సందడి రుషికొండ సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్లో బంధువులందరికీ స్వాగతం పలికారు. సాయంత్రం సముద్రపు గాలుల మధ్య జరిగిన ’మెహందీ’ వేడుక కన్నుల పండువగా సాగింది. రెండవ రోజు: పసుపు సంబరం ఉదయాన్నే బీచ్ ఎదురుగా ఉన్న తోటలో ’హల్దీ’ వేడుక జరిగింది. పసుపు రంగు బట్టల్లో అతిథులందరూ ఒకరిపై ఒకరు పూల రెక్కలు, పసుపునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. సాయంత్రం ‘సంగీత్’ వేడుకలో సముద్రపు అలల హోరు మధ్య డీజే పాటలకు అంజలి, రమేష్ కుటుంబ సభ్యులు నృత్యాలతో హోరెత్తించారు. మూడవ రోజు: కల్యాణ ఘట్టం తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున మంటపం పచ్చని మామిడి ఆకులు, మల్లెపూల అలంకరణలతో దివ్యంగా ఉంది. బాలభానుడి కిరణాలు సముద్రాన్ని తాకుతున్న వేళ.. వేద మంత్రాల సాక్షిగా రమేష్ అంజలి మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ శైలిలో అతిథులకు మర్చిపోలేని అనుభూతినిచి్చంది. ఇలా వీరేకాదు అత్యధికులు ఈ తరహా వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ హితంగానూ.. ప్లాస్టిక్ రహిత అలంకరణలతో స్థానిక కళాకారులు, స్థానిక వంటకాలకు స్థానం కల్పిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బాధ్యతాయుతమైన ట్రెండ్గా మారింది. 2026 నాటికి భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మార్కెట్ విలువల 18 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. 2033 నాటికి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఏపీలోనూ ఆదరణ మన రాష్ట్రంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగాయి. విశాలమైన తీర ప్రాంతాలు, కొండకోనల నడుమ రిసార్ట్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన వారు సైతం విశాఖపట్నం, భీమిలి, చీరాల, బాపట్ల వంటి తీరాలతోపాటు దిండి, కోనసీమలోని రిసార్ట్స్, కొండ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వివాహ వేదికలుగా మార్చుకుంటున్నారు.దోహదం చేస్తున్న అంశాలివీ » జెన్ జెడ్ అభిరుచులకు డెస్టినేషన్ వివాహాలు అద్దం పడుతున్నాయి. » విహార యాత్రలా మాత్రమే కాకుండా.. వధూవరుల కుటుంబాల మధ్య అనుబంధాలను మరింతగా పెనవేస్తాయని జెన్ జెడ్ భావిస్తోంది. » డెస్టినేషన్ వెడ్డింగ్స్తో ఏర్పాట్ల కోసం పడే శ్రమ, ఖర్చులను కూడా పరిమితం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపించి మధురానుభూతి పొందుతున్నారు. » సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, కొండ ప్రాంతాల వంటి ప్రకృతి అందాల నడుమ పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గుర్తుండిపోయే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు లభిస్తున్నాయి. » ఆదాయం పెరగడంతో చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ను సామాజిక హోదాకు గుర్తింపుగా భావిస్తున్నారు.మధురానుభూతి గతంలో పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉండేది. ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులంతా హైరానా పడాల్సి వచ్చేది. అందుకే మా అబ్బాయి అమర్ శంకర్ వివాహం విశాఖలోని రిసార్ట్స్లో ప్లాన్ చేశాం. ఆత్మీయుల సమక్షంలో చేసిన పెళ్లి మధురానుభూతి ఇచ్చింది. వచ్చిన బంధువులంతా మినీ ట్రిప్లా ఎంజాయ్ చేశారు. మేము కూడా అతిథుల మాదిరిగా సరదాగా గడిపాం. – యు.ఉషాదేవి, విజయనగరంబడ్జెట్ ఫ్రెండ్లీగానే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేసుకోవచ్చు. వధూవరుల అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా సరే మేం చేస్తాం. స్టేజి ఎంపికపైనే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సమకూరుస్తున్నాం. – టి.రవళి, తలశిల వెడ్డింగ్ ప్లానర్స్, విజయవాడఅతిథుల్లా వస్తే చాలు వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అతిథుల్లా వస్తే చాలు. వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు, నచ్చిన మెనూ, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రఫీ, ఘట్టానికి తగ్గట్టు స్టేజి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం అందరూ వివాహాన్ని గ్రాండ్గా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టు సరీ్వసు అందిస్తున్నాం. – అభి, అభి ఈవెంట్స్ అండ్ ఫుడ్ కేటరర్స్, రాజమండ్రి -
నాటి ప్రణాళికలే.. నేటి ప్రగతికి బాటలు
విశాఖ సిటీ: ఒక నగరం ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్గా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు ఉంటే సరిపోదు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఉండాలి. సరిగ్గా ఇదే దూరదృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు పునాదులు వేయగా, అవే ఇప్పుడు ప్రగతికి దిక్సూచిగా మారాయి. అందులో ప్రధానమైన ‘వైజాగ్ కోస్టల్ హైవే’ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. విశాఖ ఓడరేవు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఆరు వరుసల ఎక్స్ప్రెస్కు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ట్రాఫిక్ సమస్యలను తీర్చడమే కాకుండా, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపిరి పోయనుంది. సుమారు 55 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో తీరం వెంబడి సాగే ఈ రహదారి అభివృద్ధికి త్వరలోనే అంకురార్పణ జరగనుంది. పట్టాలెక్కనున్న ప్రాజెక్టు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అమలు దశలోకి అడుగుపెడుతోంది. హార్బర్ నుంచి కైలాసగిరి వరకు ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు, అక్కడి నుంచి భోగాపురం వరకు 60 మీటర్లకు విస్తరించనున్నారు. రుషికొండ సమీపంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సముద్ర అందాలకు ఆటంకం కలగకుండా, భూసేకరణ సమస్యలు తలెత్తకుండా దీనిని రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికి దీనిపై దృష్టి సారించింది. గతంలో ఉన్న ప్లాన్కు చిన్న పాటి సాంకేతిక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఎలివేటెడ్ కారిడార్ పొడవును పెంచడం, భీమిలిలో నేరేళ్లవలస కొద్దిగా ముందగానే రహదారిని మళ్లిస్తూ డిజైన్లను మార్పు చేసింది. ఈ మార్పుతో ఇంకా కొంత మేర భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. భీమిలి నుంచి భోగాపురం వరకూ 19.66 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్ట్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును రెండు లేదా మూడు రీచ్లుగా విభజించి పనులు చేపట్టనున్నారు. వైజాగ్ కోస్టల్ హైవే కేవలం ఒక రోడ్డు ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఇది విశాఖను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో ఒక కీలక అడుగుగా పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఐటీ రంగానికి నిలయమైన రుషికొండ, పర్యాటక ప్రాంతమైన భీమిలి, అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం.. ఈ మూడింటిని కలిపే ఈ రహదారి ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నారు. నాడు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పనవిశాఖను గ్లోబల్ హబ్గా మార్చాలనే సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కోస్టల్ కారిడార్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికలో చేర్చింది. విశాఖ నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ‘సిక్స్ లేన్’ డిజైన్లను ఖరారు చేసింది. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం సాహసోపేత అడుగులు వేసింది. వీఎంఆర్డీఏ ద్వారా సుమారు 55 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్ కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిని అనుసరించి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాకుండా, పారదర్శకమైన రీతిలో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించింది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, రూ. 6,289 కోట్ల వ్యయం అయ్యే ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తింపజేయడంలో సఫలీకృతమైంది. -
కట్టుకున్నవాడే యముడయ్యాడు..
విశాఖపట్నం: ఆరిలోవ ప్రాంతంలో మరో దారుణం జరిగింది. దుర్గానగర్లో 14 రోజుల కిందట ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం మరువక ముందే.. తాజాగా బాలాజీనగర్లో మరో హత్య చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 11వ వార్డు పరిధిలోని బాలాజీనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో బి.దేవుడు, దుర్గ (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ సిరిపురంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న దేవుడు.. తరచూ ఇంట్లో ఆమెతో గొడవ పడేవాడు.ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే దుర్గను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మెడకు ఉరితాడు బిగించి, ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి దాక్కున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన దుర్గ.. తొమ్మిది గంటలైనా బయటకు రాకపోవడం, తలుపులు తెరవకపోవడంతో పెదగదిలికి చెందిన ఆమె స్నేహితురాలు పలుమార్లు ఫోన్ చేసింది. ఆమె స్పందించకపోవడంతో వెంటనే దుర్గ తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన అక్కడికి చేరుకుని చూడగా తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి.. ఆమె మెడకు తాడు బిగించి, కింద పడి ఉంది. దుర్గ ఉరి వేసుకుందని భావించిన తండ్రి.. స్థానికుల సాయంతో ఆమెను విమ్స్ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐలు కృష్ణ, వరహాలు నాయుడు సాయంత్రం తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి బయట బైక్, లోపల సెల్ఫోన్ ఉండి, ఆ సమయంలో భర్త కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. ఇంట్లో క్షుణ్ణంగా గాలించగా.. ఫ్రిజ్ వెనుక నక్కిన దేవుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
బాబు పాలనలో అప్పులెన్ని.. ఎవరిది విధ్వంసం?: కుంభా రవిబాబు
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలను మభ్య పెట్టడానికే ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విమర్శించారు. అప్పులను బడ్జెట్లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగిందని తెలిపారు. ఎవరిది విధ్వంస పాలనలో ప్రజలు గుర్తించాలని కోరారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పుల తడకగా ఉంది. బడ్జెట్, తిరుమల లడ్డూ అంశాలపై చర్చ లేకుండా చేశారు. బడ్జెట్ రూపకల్పనలో అనేక అవకతవకలు ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఆదాయ, వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. ఈ బడ్జెట్ అంతా లోపభూయిష్టంగా ఉంది. అప్పులను బడ్జెట్లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు.గతంలో అప్పులపై.. బాబు, పవన్, బీజేపీ అనేక ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ వృద్ధిపై తప్పుడు లెక్కలు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా డీఎస్డీపీ ఎలా పెరుగుతుంది. ఆదాయం, వ్యయానికి సంబంధించిన లెక్కలకు ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. రూ.10 లక్షల కోట్లు అప్పు అని తప్పుడు ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పు ఎంత? ఎవరిది ఆర్ధిక విధ్వంసం.. ప్రజలు అర్ధం చేసుకోవాలి. వైఎస్ జగన్ పాలనలో 15వేలకు పైగా సచివాలయాలు నిర్మించి.. లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా?. ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేయడమే విధ్వంసమా?. 17 మెడికల్ కాలేజీలు తీసుకు రావడం విధ్వంసమా?. తెచ్చిన కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామనడం విధ్వంసమా? ప్రజలే తెలుసుకోవాలి. -
ఏయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ఏబీవీపీ ప్రయత్నించగా.. ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అంటూ ఏబీవీపీ నిరసనకు దిగింది. ఇంతవరకు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ వారిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నిచింది. ఏయూలో ఏబీవీపీ శాఖ కొనసాగుతుంది. ఏబీవీపీని ఎవరు అడ్డుకోలేరని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నేతలు అన్నారు. ఎస్ఎఫ్ఐ నేతలు.. వీసీకి ఫిర్యాదు చేశారు. ఏయూలో బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువైందని.. ఏబీవీపీ విద్యార్థుల పేరుతో బయట వ్యక్తులు ఏయూలోకి ప్రవేశిస్తున్నారన్నారు. వారిని కట్టడి చేయాలంటూ వీసీకి ఎస్ఎఫ్ఐ నేతలు ఫిర్యాదు చేశారు. ఏయూలో భారీగా పోలీసులు మోహరించారు. -
భారత్ నమ్మకమైన ‘విశ్వ మిత్ర’
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సముద్ర భద్రత అనేది కేవలం ఒక దేశానికి పరిమితం కాదని.. సముద్ర సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిలాన్–2026’ విన్యాసాలను రాజ్నాథ్సింగ్ విశాఖలో గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ ప్రారం¿ోత్సవంలో ముఖ్యఅతిథిగా రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. 74 దేశాల నౌకాదళ అధిపతులు, ప్రతినిధులు భాగస్వాములై చేపట్టిన ఈ విన్యాసాలు భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యానికి అద్దం పడుతున్నాయన్నారు. భారత్ నమ్మకమైన విశ్వ మిత్రగా ఉంటుందని స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసానికి దోహదం సముద్ర వ్యాపారం, రవాణా విపరీతంగా పెరిగిన క్రమంలో పైరసీ, తీవ్రవాదం, అక్రమ రవాణా వంటి సవాళ్లు పెరిగాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. జలసంధులు, సముద్ర వనరుల యాజమాన్యం విషయంలోనూ వివాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఏ ఒక్క దేశం కూడా ఒంటరిగా ఎదుర్కోలేదని, అందుకే ‘మిలాన్’ వంటి వేదికలు పరస్పర విశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.సముద్ర జలాల్లో శాంతి స్థాపనకు ‘ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం’(అన్క్లాస్) చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దార్శనికతతో సముద్ర భద్రత కోసం ప్రారంభించిన సాగర్ కార్యక్రమం ఇప్పుడు మహాసాగర్గా రూపాంతరం చెందిందన్నారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ మిలాన్ విన్యాసాలను మారిటైమ్ మహాకుంభంగా అభివరి్ణంచారు. కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్ డా.సమీర్ వి,కామత్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ప్రారంభం ఐఎఫ్ఆర్, మిలాన్తోపాటు విశాఖలో మూడో అతి పెద్ద కీలక కార్యక్రమం ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం(అయాన్స్) కాంక్లేవ్ శుక్రవారం ప్రారంభం కానుంది. మొత్తం 42 దేశాలకు చెందిన నౌకాదళ అధిపతులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. విశాఖ బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్లో జరిగే ఈ సదస్సులో హిందూ మహా సముద్రంలో సవాళ్లు, సహకారంపై ఆయా దేశాల ప్రతినిధులు కీలకంగా చర్చించనున్నారు.ఆసియన్ దేశాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి సమావేశం రాజ్నాథ్సింగ్ తొమ్మిది ఆసియన్ సభ్య దేశాల నౌకాదళాధిపతులు, ప్రతినిధి బృందాలతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్(ఆసియాన్)లో ఉన్న బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం దేశాలతో భారత్ రక్షణ సహకారం మరింత బలోపేతం కానుందని మంత్రి అన్నారు. ‘ఆత్మనిర్భర భారత్’లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చెందిన భారత రక్షణ రంగం నుంచి ఆసియాన్ దేశాలు ప్రయోజనం పొందాలని ఆయన ఆహా్వనించారు.భారత నౌకాదళ తయారీ సామర్థ్యానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ నిదర్శనమన్నారు. సముద్ర తీర స్థిరత్వం కోసం యువ నౌకాదళ అధికారుల మధ్య పరస్పర అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తరించాలని కేంద్రమంత్రి రక్షణ మంత్రి ప్రతిపాదించారు. ‘సఖ్యత, సహకారం, సమన్వయం’ అనే నినాదంతో, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం కోసం అందరూ కలిసి పని చేయాలని రక్షణ మంత్రి సారథ్యంలో ఆసియాన్ దేశాలు సమావేశం తీర్మానించాయి. -
విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)
-
భారతీయతత్వాన్ని ప్రపంచానికి చాటాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వసుధైక కుటుంబం అనే భారతీయ తత్వాన్ని ప్రపంచానికి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ద్వారా చాటిచెబుతున్నామని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం మన నావికాదళ విశేష లక్షణాలని ఆమె కొనియాడారు. వ్యూహాత్మకంగా విశాఖపట్నం ఎంతో కీలకమైన నగరమని, ఐఎఫ్ఆర్ను ఇక్కడ నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. పదేళ్లకు ఒకసారి జరిగే ఐఎఫ్ఆర్కు విశాఖపట్నం మరోసారి వేదికైంది. త్రివిధ దళాధిపతి హోదాలో ఐఎఫ్ఆర్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు.విశాఖ తీరంలో లంగరేసిన మొత్తం 71 దేశీ, విదేశీ నౌకలను ఆమె ఐఎన్ఎస్ సుమేధ నుంచి పరిశీలించారు. రెండు గంటలకుపైగా నౌకల సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారతదేశం సముద్ర వారసత్వం కలిగిన దేశమని, దశాబ్దాలుగా ఇతర దేశాలతో సముద్ర మార్గంలో వాణిజ్యం జరిపామని గుర్తు చేశారు. సముద్ర మార్గాలు మన దేశ సంస్కృతి, భద్రతకు ప్రధాన ఆధారమని అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని ఐఎఫ్ఆర్ ద్వారా మరో సారి చాటిచెప్పినట్టు అయ్యిందన్నారు. అంతర్జాతీయ స్నేహ సంబంధాలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. నావికాదళం మరింత బలోపేతానికి చర్యలు ఐఎఫ్ఆర్లో భారత నావికాదళ విన్యాసాలతో మన శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రదర్శించగలిగామని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సముద్ర భద్రత, ఉగ్రవాద చర్యలను నిరోధించడంతోపాటు సముద్ర మార్గంలో జరిగే దోపిడీని అరికట్టడంలో భారత నావికాదళ కృషిని ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా విపత్తు సమయాల్లో భారత నావికాదళం స్వదేశంతోపాటు విదేశాల్లోనూ సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడుతోందని గుర్తు చేశారు.‘సురక్షిత సముద్రం – సమృద్ధ భారత్’ అనే నినాదంతో మన నావికాదళం నిరంతరం ఎంతో జాగరూకతతో పనిచేస్తోందని ప్రశంసించారు. ఆమె ప్రత్యేకంగా ఒడిశాలోని బలి జాతర ఉత్సవాన్ని ప్రస్తావిస్తూ... ఇది ఆగ్నేయాసియాకు ప్రయాణించిన పురాతన కళింగ నావికులను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సాంస్కృతిక స్పృహకు దోహదపడిందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సిందూర్లో కీలకపాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎఫ్ఆర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిగ్ – 29కే ఫైటర్ జెట్స్తోపాటు కామోవ్ – 31 హెలికాప్టర్లు, ఎంహెచ్ – 60ఆర్ మలీ్టరోల్ హెలికాప్టర్లు.... ఇలా మొత్తం 36 హెలికాప్టర్లను తీసుకెళ్లగలిగే ఐఎన్ఎస్ విక్రాంత్ను విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళానికి కేటాయించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్... ఆపరేషన్ సిందూర్ సమయంలో కరాచీ నగరానికి దగ్గరలో లంగరు వేసి శత్రువు గుండెల్లో దడ పుట్టించింది. రష్యా, యుఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర విదేశాలతోపాటు స్వదేశానికి చెందిన మొత్తం 71 నౌకలు విశాఖ తీరంలో లంగరేసి నగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. అదేవిధంగా నగరాల పేర్లతో ఉన్న ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ముంబై యుద్ధనౌకలు కూడా ఇందులో పాల్గొన్నాయి. భారత నౌకాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొదటి సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్కు అనకాపల్లి జిల్లాకు చెందిన కెప్టెన్ ధీరజ్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించడం గమనార్హం. ఆకట్టుకున్న నావికాదళ విన్యాసాలు వివిధ యుద్ధనౌకల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ రాష్ట్రపతి ముర్ము ముందుకు సాగుతున్న తరుణంలో నావికాదళం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల (ఎఎల్హెచ్) నుంచి కాంబాట్ జంప్స్, యుద్ధ సమయంలో ఉపయోగించే టెన్ – టెన్ మెథడ్లో రెస్క్యూ డైవర్లని యుద్ధ నౌకలపై మోహరించడం, నీటి ఉపరితలానికి కేవలం 10 అడుగుల ఎత్తులో ఎగురుతూ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం, హెలికాప్టర్లపై నుంచి సాహసోపేతంగా సముద్రంలోకి దూకి.. బాధితులను రక్షించడం, వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించడం... వంటి విన్యాసాలు గగుర్పొడిచాయి. అదేవిధంగా రెండు హాక్ విమానాలు.. ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లుగా ప్రెసిడెన్షియల్ యాచ్ మీదుగా గంటకు 400 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తూ నిర్వహించిన విన్యాసాలు కంటి రెప్ప వాల్చనీయలేదు. అనంతరం చేతక్ హెలికాఫ్టర్ ద్వారా ఫ్లైపాస్ నిర్వహించారు. ఆ తర్వాత ఏఎల్హెచ్ ధ్రువ్, యూహెచ్త్రీహెచ్, సీకింగ్, కామోవ్ హెలికాఫ్టర్లు, విమానాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా చేసిన విన్యాసాలు నౌకాదళ సత్తాని చాటాయి. చివరిగా డోర్నియర్, మిగ్ – 29కే యుద్ధ విమానాలు డైమండ్ ఆకారంలో గంటకు 400 నాటికల్ మైళ్ల వేగంతో గాల్లో దూసుకొస్తూ చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. తీరంలో 6 వరుసల్లో 71 నౌకల లంగరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు నావికాదళ కేంద్రానికి ఉదయం 9.50 నిమిషాలకు చేరుకున్నారు. ఆమెకు నౌకాదళ ప్రధానాధికారి దినేష్ కె.త్రిపాఠితోపాటు గవర్నరు అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ యుద్ధనౌకలో ప్రయాణిస్తూ తీరప్రాంతం వెంబడి ఆరు వరుసల్లో లంగరు వేసిన 71 దేశీ, విదేశీ నౌకల సామర్థ్యాలను ఆమె పరిశీలించారు. మొత్తం 19 విదేశీ యుద్ధనౌకలతోపాటు భారత నేవీకి చెందిన 45 యుద్ధ నౌకలు, తీరప్రాంత రక్షణ నౌకలు, వాణిజ్య నౌకలు, పరిశోధన నౌకలు కూడా ఇందులో భాగమయ్యాయి. ఈ సందర్భంగా మిగ్ – 29 కే జెట్ ఫైటర్లు, డారి్నయర్ ఎయిర్క్రాఫ్ట్స్, చేతక్ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నిప్పులు చిమ్ముతూ ఎయిర్క్రాఫ్ట్లు దూసుకెళ్లిన దృశ్యాలు మురిపించాయి. -
విశాఖ : మిలన్ విన్యాసాలకు సాగరతీరం ముస్తాబు (ఫొటోలు)
-
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. కాన్వాయ్లోని చివరి వాహనం దెబ్బతీంది. -
నౌకాదళం 'అల'రింతకు సిద్ధం
నింగీనేలా నివ్వెరబోయేలా నీలిసంద్రం యుద్ధనౌకలను మోహరించిందా.. పోటెక్కిన అలలు సమరోత్సాహంతో ఎగసి పడుతున్నాయా.. కెరటాల హోరు స్నేహ శంఖారావం పూరిస్తోందా.. అన్నట్టు అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబైంది. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను చాటేలా.. మిత్రదేశాల సమన్వయంతో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్– 2026, ఐయాన్స్ కాన్క్లేవ్లకు తూర్పు తీరం వేదికవుతోంది. బుధ, గురువారాల్లో అద్భుత విన్యాసాలతో భారత నౌకాదళం తన సైనిక పరాక్రమ విశ్వ రూప ప్రదర్శనకు సర్వసన్నద్ధమైంది.విశాఖ సిటీ: ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఐఎఫ్ఆర్, మిలాన్, విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాల కోసం 72 దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా నావికాదళ అధికారులు, విదేశీ ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. ఒకేసారి మూడు ప్రధాన వేడుకలు దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఒకేసారి మూడు ప్రధాన నౌకాదళ కార్యక్రమాలను (ఐఎఫ్ఆర్, మిలాన్, ఐయాన్స్) నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘మహాసాగర్’ దార్శనికతలో భాగంగా.. సముద్ర భద్రత, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. దశాబ్దం తర్వాత నగరంలో ఈ ఫ్లీట్ రివ్యూను ‘యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. బుధవారం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్–2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐయాన్స్) సదస్సుకు విశాఖ తీరం ఆతిథ్యమిస్తోంది. నేడు విన్యాసాలు తిలకించనున్న రాష్ట్రపతి ఇండియన్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)కు ముఖ్య అతిథిగా భారత సర్వసైన్యాధ్యక్షురాలు, దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. ఆమె మంగళవారం సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు రాష్ట్రపతి నేవల్ డాక్ యార్డ్కు చేరుకుంటారు. అనంతరం ఆమె సుమేధ అనే యుద్ధనౌకపై (ప్రెసిడెన్షియల్ యాచ్) ప్రయాణిస్తూ.. సముద్రంలో లంగరు వేసిన 71 యుద్ధ నౌకలను వీక్షిస్తారు. ఇందులో 52 భారతీయ నౌకలు, 19 విదేశీ యుద్ధనౌకలు ఉన్నాయి. ప్రతి నౌకలోని సైనికులు తమ దేశ సంప్రదాయ పద్ధతిలో రాష్ట్రపతికి వందనం సమరి్పస్తారు. 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. సముద్రం మధ్యలో మార్కోస్ కమాండోలు శత్రువులను ఎలా ఎదుర్కొంటారో ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. నౌకాదళ విమానాల ‘ఫ్లై పాస్ట్’, సముద్ర గర్భంలో జలాంతర్గాముల విన్యాసాలనూ నౌకాదళ సైనికులు ప్రదర్శిస్తారు. ప్రత్యేక ఆకర్షణగా సిటీ పరేడ్ విశాఖ తీరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేలా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ గురువారం జరగనుంది. ఈ మెగా ఈవెంట్.. సముద్ర భద్రత, ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా నిలవనుంది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆర్కే బీచ్ వద్ద సాగరతీరం వెంబడి ఈ పరేడ్ జరుగుతుంది. ఈ భారీ ప్రదర్శనను ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 45 విదేశీ నౌకాదళ మార్చింగ్ బృందాలు, 8 అంతర్జాతీయ నావికాదళ బ్యాండ్లు ప్రతిభను చాటనున్నాయి. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు విదేశీ సైనిక బృందాలు కవాతు నిర్వహిస్తాయి. ఈ పరేడ్లో భారత నౌకాదళానికి చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ‘ఎయిర్ పవర్ డెమాన్్రస్టేషన్’ మొదలవుతుంది. అలాగే భారతదేశ సంస్కృతిని తెలిపే జానపద కళారూపాలు, వివిధ రాష్ట్రాల శకటాలు, విదేశాల సంస్కృతులను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయి. ఇందులో ఎన్సీసీ, సీ క్యాడెట్ కార్ప్స్, నేవీ చి్రల్డన్ స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. పరేడ్ చివరలో సముద్రంలో లంగరు వేసిన యుద్ధనౌకల ‘సెరిమోనియల్ ఇల్యూమినేషన్’ (దీపకాంతులతో అలంకరణ), లేజర్ లైట్ షో, బాణసంచా, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండు దశల్లో మిలాన్ మిలాన్–2026 విన్యాసాలు విశాఖలోని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ విన్యాసాలను ప్రారంభిస్తారు. ఇవి 19 నుంచి 20 వరకు హార్బర్ ఫేజ్, 21 నుంచి 25 వరకు సీ ఫేజ్లో జరగనున్నాయి. హార్బర్ ఫేజ్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్జాతీయ సముద్ర సెమినార్లు, ద్వైపాక్షిక చర్చలు, మిలాన్ విలేజ్ ప్రదర్శనలు ఉంటాయి. సీ ఫేజ్లో భాగంగా సముద్ర గర్భంలో అసలైన యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. ఇందులో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, క్లిష్టమైన నౌకా విన్యాసాలు నిర్వహిస్తారు. 20న ఐయాన్స్ కాన్క్లేవ్ హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం (ఐయాన్స్) ఈ నెల 20న హోటల్ నోవొటెల్లో జరగనుంది. ఈ సదస్సులో 42 దేశాల నౌకాదళాధిపతులు పాల్గొని సముద్ర భద్రత, విపత్తు నిర్వహణపై చర్చిస్తారు. ఈ సందర్భంగా భారత్ 2025–27 కాలానికి గానూ ’ఐయాన్స్’ అధ్యక్ష పదవిని థాయిలాండ్ నుంచి స్వీకరించనుంది. 72 దేశాల నుంచి 71 యుద్ధ నౌకలు ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల్లో మొత్తం 72 దేశాలు పాల్గొంటున్నాయి. 71 యుద్ధ నౌకలు (19 విదేశీ నౌకలతో కలిపి), 50కిపైగా విమానాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, ఫిలిప్పీన్స్, యూఏఈ వంటి ప్రధాన దేశాలు తమ శక్తివంతమైన నౌకలను పంపాయి.ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణఐఎఫ్ఆర్, మిలాన్ ద్వారా భారత్ తన స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ నిలవనుంది. దీంతో పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా జతకట్టడం విశేషం. రెండు విమాన వాహక నౌకలు ఒకేసారి కవాతు నిర్వహించడం భారత రక్షణ రంగ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఇవి కాకుండా విధ్వంసక నౌకలు, అత్యాధునిక జలాంతర్గాములు, విశాఖపట్నం క్లాస్ డి్రస్టాయర్లు, నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు కూడా సముద్ర గర్భంలో భారత్ పటిష్టతను చాటనున్నాయి. మిగ్–29కె, పి–8ఐ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో కలిపి 50కి పైగా ఎయిర్క్రాఫ్ట్లు గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి.రాష్ట్రపతికి ఘన స్వాగతం గోపాలపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విశాఖలో నిర్వహించనున్న ఫ్లీట్ రివ్యూను ప్రారంభించేందుకు ఆమె నగరానికి విచ్చేశారు. విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు రాష్ట్రపతికి ఆతీ్మయంగా స్వాగతం పలికారు. -
విశాఖ : సముద్ర తీరాన శౌర్య సింహనాదం (ఫొటోలు)
-
విశాఖపట్నం : ఆర్కే బీచ్ ఆధ్యాత్మిక సాగరంగా మారింది (ఫొటోలు)
-
మాలలు తీసేందుకు వెళ్తే.. అప్పికొండ శివాలయానికి తాళం!
విశాఖ : మాలలు తీసేందుకు అప్పికొండ శివాలయానికి వెళ్లిన శివస్వాములకు చేదు అనుభవం ఎదురైంది. శివస్వాములు మాలలు తీసేందుకు కనీస ఏర్పాట్లు చేయడాన్ని పక్కకు పెట్టిన అధికారులు.. ఏకంగా ఆలయానికే తాళాలు వేశారు. 41 రోజుల దీక్ష అనంతరం అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే శివ స్వాములు మాలలు తీయడానికి వెళ్తే ఆలయ అధికారులు శివాలయానికి తాళం వేసేశారు. దాంతో అధికారులు, పోలీసుల తీరుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని శివస్వాములు మండిపడుతున్నారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని, దేవాదయ, పోలీస్ శాఖ వారు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏ అధికారి పర్యవేక్షిస్తున్నారో కూడా తెలియదని, ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అధికారుల తీరును తప్పుబట్టారు. -
నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)
-
‘ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు’
విశాఖ: ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు భాగస్వామ్యం అవుతున్నాయని ఈఎన్సీ(Eastern Naval Command) చీఫ్ సంజయ్ భల్లా స్పష్టం చేశారు. 71 నౌకలతో పాటు 19 విదేశీ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయన్నారు. ఆరు వరుసల్లో నౌకలను మోహరిస్తారన్నారు ఈఎస్సీ చీఫ్. ‘రాష్ట్రపతి ఫ్లిట్ రివ్యూ ను సమీక్షిస్తారు. ఐఎఫ్ఆర్లో 50 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటున్నాయి. 1995 లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలన్ లో ఇప్పుడు 65 దేశాలు భాగం పంచుకుంటున్నాయి. అయాన్స్ కాంక్లేవ్ 2008 లో ప్రారంభమైంది. 19న జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ లో 45 దేశాల నేవీ కంటెంజెంట్స్ భాగస్వామ్యం అవుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ సహా 17యుద్ధ నౌకలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి’ అని స్పష్టం చేశారు. -
విశాఖకు చేరుకుంటున్న విదేశీ యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్, ఐవోఎన్ఎస్ చీఫ్ ఆఫ్ నేవీస్ కాంక్లేవ్కు విశాఖ నగరం సిద్ధమవుతోంది. యుద్ధ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఒక్కో దేశానికి చెందిన నౌకాదళాధికారులు, యుద్ధ నౌకలు, సెయిలర్స్ విశాఖ నేవల్ బేస్కు చేరుకుంటున్నారు. తూర్పు నౌకాదళాధికారులు, నావికులు విదేశీ ప్రతినిధులు, నౌకలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈనెల 15 నుంచి ఐఎఫ్ఆర్–2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే మాల్దీవులు, వియత్నాం, సీషెల్స్, ఫిలిప్పీన్స్ నౌకాదళాలు విశాఖ చేరుకున్నాయి. మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బందితో పాటు సీజీఎస్ హరావీ, సీషెల్స్కు చెందిన ఎస్సీజీఎస్ జొరాస్టర్ కోస్ట్గార్డ్ షిప్, వియత్నాంకు చెందిన వార్షిప్లకు తూర్పు నౌకాదళం ఆతిథ్యమందించింది. శుక్రవారం రాత్రి మరికొన్ని దేశాలకు చెందిన నౌకలు వచ్చాయి. శనివారం సాయంత్రానికి వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు విశాఖకు రానున్నాయని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
‘లడ్డూ కల్తీ పేరుతో చంద్రబాబు వికృత రాజకీయాలు’
సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తన అసమర్థత బయట పడకుండా ఏడాదిన్నరగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నాడని, శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడటం సిగ్గచేటన్నారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.చంద్రబాబు సీఎంగా ఉండగా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంకర్లు దొడ్డి దారిన ఎలా ప్రవేశించాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి లభించిందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆలయ ప్రతిష్టను దిగజార్చారుస్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఏడాది క్రితం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన సీబీఐ సిట్ చార్జిషీట్ తప్పని తేల్చడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తప్పును చేశామని అంగీకరించి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. అబద్ధాన్ని నిజం చేయడమే లక్ష్యంగా మరిన్ని తప్పులు చేస్తున్నారు.ఏకంగా కేబినెట్ మొత్తాన్ని మీడియా ముందుకు పంపించి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు. దేవుడితో ముడిపడిన సున్నితమైన అంశాన్ని పట్టుకుని వికృత రాజకీయాలకు తెరదీయడం సిగ్గుచేటు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో కట్టు కథలు ప్రచారం చేస్తూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు. లడ్డూకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలిసిందని మొన్నటిదాకా ప్రచారం చేసిన కూటమి నాయకులు.. కొత్తగా పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ తిమ్మిని బమ్మిని చేసే కుట్రకు తెరదీశారు.బాబూ.. వీటికి సమాధానం చెప్పువాస్తవానికి తాను చేసిన ఆరోపణలన్నింటికీ తానే సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు.. ఆ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టేసి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీకి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిల్స్ తోనే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ పరీక్షలు జరిపింది. ఆ నెయ్యి లోనే పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అండ్ కో పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజుకో కల్పిత కథనాలు రాసి ప్రజలను అయోమయానికి గురిచేసి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా కల్తీ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ రిజెక్టు చేసి వెనక్కి తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లనే దొడ్డి దారిన తెప్పించి లడ్డూ తయారీకి వాడారు. దీనికి సీఎంగా ఉన్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందిపోయి దొంగే దొంగ అన్నట్టుగా ఆయనే తిరుమలపై తప్పుడు ప్రచారం ఊపందించాడు. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశంపై రాజకీయాలు చేస్తూ లబ్ది పొందాలనుకోవడం సిగ్గుచేటు. సీబీఐ చార్జిషీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు 2014-19 వరకు రూ. 273.90 లకు తిరుమలకు నెయ్యిని సరఫరా చేసింది. వాస్తవం ఇలా ఉంటే నువ్వుల నూనె కన్నా తక్కువ ధరకు నెయ్యి ఎలా సప్లై చేస్తున్నారని వారే ప్రశ్నిస్తారు.నేరం చేసినట్టు సీబీఐ చార్జిషీట్లో పొందుపరిచిన బోలేబాబా డెయిరీకి కూడా చంద్రబాబు సీఎంగా ఉండగానే టీటీడీకి అనుమతి లభించింది. మార్చి 6, ఏప్రిల్ 19, 2019న 82 వేల కేజీలు ఒకసారి, 12 వేల కేజీలు ఇంకోసారి నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేసే బల్క్ ఆర్డర్ ఇవ్వడంపైన సీబీఐ సిట్ అనుమానం వ్యక్తం చేసింది. పైగా ఆ ఆర్డర్ కేజీ విలువ రూ.291 మాత్రమే కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకి లేదా? బోలేబాబా డెయిరీకి 82 వేల కేజీల నెయ్యిని రూ.291లకు ఆర్డర్ ఇవ్వలేదని, టీటీడీ రిజెక్టు చేసి పంపిన నెయ్యిని అడ్డదారిలో తెచ్చి వాడలేదని చంద్రబాబు సహా కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగలరా? 2015లో టీటీడీకి నెయ్యిని సప్లై చేస్తున్న నందిని డెయిరీ పేరుతో విజయవాడలో డూప్లికేట్ నెయ్యి తయారు చేసి 12 ట్యాంకర్లు సప్లై చేస్తే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ చేసిన విషయం నిజమా కాదా? ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలకు ఏం సమాధానం చెబుతారు?హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్అధికారంలో ఉన్న చంద్రబాబు తన వద్ద ఉన్న వ్యవస్థలతో విచారణ జరిపించి ఎవరైనా తప్పు చేసి ఉంటే న్యాయ స్థానాల్లో శిక్షలు పడేలా చేయకుండా రోడ్డెక్కి తప్పు ప్రచారం చేయడం, తనకు అనుకూల పత్రికలు, టీవీలలో ఊదరగొట్టడం, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కరపత్రికల ద్వారా తిరుమల ప్రతిష్టకు నష్టం వాటిల్లేలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు చంద్రబాబుకి ఎవరిచ్చారు?చంద్రబాబు చేసిన మహాపచారం తెలుగుదేశం పార్టీకి అంటుకుని ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా పోతుందనే భయంతో పాపాన్ని జనసేన, బీజేపీకి అంటించడానికే ప్రెస్మీట్ పెట్టించాడు. కానీ అక్కడ కూర్చున్న వారందరిలోనూ తప్పు చేశామన్న భావన కనిపిస్తోంది. దేవుడితో ఆటలాడుకుంటున్నామన్న అపరాధం కనిపిస్తోంది. స్వామీజీలు, పీఠాధిపతులు, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించే చంద్రబాబు మోసాలను ఇకనైనా గుర్తించి ఆయన్ను ప్రశ్నించాలి. తన అసమర్థ పాలన నుంచి ఎన్నికల హామీలు అమలు చేయలేని చేతకాని తనం నుంచి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్న చంద్రబాబుని నిలదీయాలి. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ప్రకటించకుండా అబద్దాలు, మోసాలతో మభ్య పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి. -
కౌన్సిల్ తీర్మానంతో గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే తమ బంధువు సంస్థ గీతం ఆక్రమిత భూములను క్రమబబ్ధికరించుకునేందుకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో ఎన్నడూ లేనివిధంగా గూండారాజ్ను అమలు చేసి తీర్మానాన్ని ఆమోదించుకున్న అధికార పార్టీ.. ఇప్పుడు తోకపత్రిక విషయంలో మరో అడుగు ముందుకు వేసి ఏకంగా రికార్డులు మార్చి మరీ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధపడినట్టు స్పష్టమవుతోంది. అత్యవసరమైన అంశాలను చేర్చాల్సిన టేబుల్ అజెండాలో చివరి అంశంగా (67వ అంశం) తన తోకపత్రిక ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్.. ఆమోద పబ్లికేషన్స్కు భూ కేటాయింపు అంశాన్ని గత ఏడాది ఆగస్టు 22 నాటి సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తీసుకొచి్చంది. అయితే ఈ విషయాన్ని కౌన్సిల్ తిరస్కరించింది.కౌన్సిల్ సమావేశం ఈ తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సమావేశపు వివరాలను ప్రకటన రూపంలో జీవీఎంసీ విడుదల చేసింది. ఇందులో స్పష్టంగా టేబుల్ అజెండాలో ఉన్న 67వ అంశాన్ని కౌన్సిల్ ఆమోదించలేదని ప్రకటించారు. అయినప్పటికీ.. రికార్డుల్లో మాత్రం కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా పేర్కొంటూ తహసీల్దారుకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ (జోన్–2) లేఖ రాశారు. ఇందులో స్పష్టంగా 2025 ఆగస్టు 22 నాటి జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఈ రికార్డుల తారుమారులో ఎవరిపాత్ర ఎంత ఉందనే వ్యవహారం ఇప్పుడు తేలాల్సి ఉంది. లాంఛనమే అయితే..! వాస్తవానికి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం లాంఛనమే అంటూ స్థానిక సంస్థల అధికారాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది తోకపత్రిక. నిజంగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కేవలం లాంఛనమే అయితే.. గీతంకు భూ కేటాయింపుపై ఎందుకంతగా రాద్ధాంతం చేసి.. ప్రతిపక్ష కార్పొరేటర్లపై దాడికి దిగి మరీ చర్చలేకుండానే ఆమోదించినట్టుగా ప్రకటించారు. స్థానిక సంస్థలు అంగీకరించకుండా భూమిని కేటాయించడం నేరుగా ముఖ్యమంత్రికి కూడా సాధ్యమయ్యే పనికాదు. ఆ విషయం తోకపత్రికకు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే అత్యవసరంగా టేబుల్ అజెండా మీదకు తెచ్చి.. ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఆమోదం పొందలేదు.ఆ తర్వాత మరో కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసుకునేందుకు తీర్మానం రూపంలో ముందుకు రావాల్సిందే. అంతేతప్ప.. ఏదో ఒక సభ్యుడు అనుమానం వ్యక్తం చేస్తే.. వ్యక్తిగతంగా అనుమానం తీర్చాం కాబట్టి ఆమోదించినట్టుగా రికార్డులు సృష్టిస్తామంటే కుదరని పని. ఈ విషయం కూడా తోకపత్రికకు స్పష్టంగా తెలుసు. ఆమోదించని తీర్మానాన్ని.. కౌన్సిల్ తిరస్కరించిన తీర్మానాన్ని మళ్లీ కౌన్సిల్ ముందు పెడితే ఆమోదించే అవకాశం లేదని అవగాహన ఉంది. అందుకే రికార్డులు తారుమారు చేసి కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా రికార్డులు మార్చివేశారు.ఈ రికార్డుల మారి్పడి వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందనేది లోతుగా విచారిస్తే కచి్చతంగా అసలు దొంగల గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా జీవీఎంసీ తీర్మానం లాంఛనమే అయితే రికార్డులు మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాస్తవానికి జీవీఎంసీ తీర్మానం తప్పనిసరి కాబట్టే ఏకంగా రికార్డులు మార్చి మరీ.. ఆమోదించని తీర్మానాన్ని ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఎలాగూ ఉంది తమ ప్రభుత్వమే కదా అనే ధీమాతోనే ఈ తతంగం నడిపించినట్టు తెలుస్తోంది.రికార్డులు మార్చిందెవరు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశపు అజెండాను సెక్రటరీ సెల్ తయారుచేస్తుంది. సమావేశపు వివరాలను కూడా సదరు సెక్రటరీ సెల్ నమోదు చేయడంతోపాటు మినిట్స్ను కూడా నమోదు చేస్తుంది. ఈ విధంగా తయారైన మినిట్స్ను మేయర్ ఆమోదానికి ఉంచి.. ఆ కాపీని సభ్యులందరికీ అందజేయాల్సి ఉంటుంది. అయితే కౌన్సిల్లో ఆమోదించని విషయాన్ని కాస్తా ఆమోదించినట్టు రికార్డుల్లోకి ఎక్కించడంలో సెక్రటరీతోపాటు సెక్రటరీ సెల్ పాత్ర ఏమిటనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా సదరు సెక్రటరీ సెల్పై ఒత్తిడి తెచి్చన వ్యక్తులు ఎవరనేది కూడా లోతుగా విచారిస్తే తేలనుంది.ఇప్పటివరకు సదరు సమావేశపు వివరాలను సభ్యులకు కూడా అందించలేదని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశపు వివరాలను సభ్యులకు ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఎలాగూ ఉంది తమ ప్రభుత్వమే కదా అని స్థానిక సంస్థల నిర్ణయాన్ని ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోవడం ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మొత్తంగా ఆమోదం లభించని తీర్మానం కాస్తా తమ తోకపత్రిక కోసం ‘ఆమోద’ముద్ర వేయించడంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విశాఖ ఉక్కు: ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగు..!
విశాఖ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగుపడింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆర్ఐఎన్ఎల్ టెండర్లు ఆహ్వానించింది. కోల్ హ్యాండ్లింగ్ సహా ప్రైవేటుకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్కు టెండర్లు ఆహ్వానించారు. ఉక్కు ఉత్పత్తిలో థర్మల్ పవర్ ప్లాంట్ కీలక భూమిక పోషిస్తుంది. దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు ఆహ్వానించడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలక విభాగాలను ప్రైవేటీకరణతో కార్మికుల తొలగింపు కార్యక్రమం సైతం కొనసాగుతోంది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. -
క్రూయిజ్ రాకకు వేళాయే..
సాక్షి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి సిద్ధమైంది. విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)లో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి క్రూయిజ్ సర్వీసులు అందించేందుకు కార్డిలియా క్రూయిజ్ షిప్ రాబోతోంది. సాగర జలాల్లో ఐదురోజుల పాటు విహరించనుంది. విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నైకి సర్వీసు నడిపేందుకు కార్డిలియా క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ సిద్ధమవుతోంది. జూన్ 24న ఈ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ విశాఖ చేరుకోనుంది. రేట్లు, బెర్తింగ్ టైమ్స్ తదితర అంశాలపై ఇప్పటికే విశాఖ పోర్టు అధికారులతో సంస్థ ప్రతినిధులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు సర్విసులు నడపనుంది. వచ్చే ఏడాదిలోనూ ఇదే సమయంలో క్రూయిజ్ నడిపేందుకు అనుమతులు తీసుకుంది. ఫుడ్ కోర్టులు..షాపింగ్మాల్స్..లైవ్షోలు.. టెర్మినల్ ప్రారంభమైన తర్వాత మూడుసార్లు విశాఖ వచ్చిన కార్డిలియా క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ జూన్ నెలాఖరున విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. మొత్తం 11 అంతస్తుల క్రూయిజ్ షిప్ జూన్ 20న మద్రాస్ నుంచి బయలుదేరి 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. మళ్లీ అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి 26న ఉదయం పుదుచ్చేరి, అక్కడి నుంచి 27న చెన్నైకి చేరుకోనుంది.నెల రోజుల పాటు ఈ సర్విసులు నడపనున్నారు. అంటే మొత్తంగా విశాఖ నుంచి జూన్ 24వ తేదీతో పాటు జులై 1, 8, 15 తేదీల్లో క్రూయిజ్ సర్విసులు నడవనున్నాయని వైజాగ్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ షిప్లో 300 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. షిప్లో ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్షోలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.వచ్చే ఏడాది సర్విసులకూ సిద్ధంవిలాసాల నౌక 2027లోనూ విశాఖ నుంచి సేవలందించేందుకు ముందస్తు బుకింగ్ని వైజాగ్ క్రూయిజ్ టెర్మినల్తో సిద్ధం చేసుకుంది. 2027 జూన్ 9న చెన్నైలో మొదలుపెట్టి వయా పుదుచ్చేరి మీదుగా వైజాగ్కు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ సమయంలో మాత్రం విశాఖకు ఏడుసార్లే కార్డిలియా క్రూయిజ్షిప్ రానుంది. మళ్లీ క్రూయిజ్ సేవలు మొదలవుతున్న తరుణంలో.. ప్రపంచ పర్యాటకులు క్రూయిజ్లో వచ్చి.. మహా విశాఖ నగరంలో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేసేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.2500 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్తో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, విశ్రాంత గదులు, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లను తెరవనున్నారు. భవిష్యత్లో క్రూయిజ్ సర్విసులు విశాఖ నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయనీ.. దానికనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై పోర్టు అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారు. -
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
-
సాగర తీరాన సమర భేరి
విశాఖ సిటీ : భారత నావికాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదిక అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 25 వరకు తీరం అంతర్జాతీయ నౌకా బలగా లతో కిక్కిరిసిపోనుంది. ఈ నెలలో 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్– 2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐఓఎన్ఎస్) సదస్సుకు అతిథ్యమిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈనెల 21 నుంచి 25 వరకు భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మిలాన్–2026 సీ ఫేజ్’ విన్యాసాలకు మెరుగులు దిద్దుకుంటోంది. దశాబ్ద కాలం తర్వాత ఐఎఫ్ఆర్ సముద్ర భద్రత, సహకారం, స్థిరత్వం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. దేశ చరిత్రలోనే మొదటి సారిగా అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షను 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్–2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఫ్లీట్ రివ్యూకు ’యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. తీరప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, కొత్త సాంకేతికత అనే అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చించనున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు సముద్ర గర్భంలో భారత రక్షణ శక్తి సామర్థ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్రపతి సమక్షంలో ‘ఫ్లీట్ రివ్యూ’ ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈనెల 18న జరగనుంది. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము విశాఖ తీరంలో జరిగే నౌకల కవాతుకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమె ప్రెసిడెన్షియల్ యాచ్లో నౌకాదళ విన్యాసాలను పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన సుమారు 90 యుద్ధ నౌకలు, 45 విమానాలతో పాటు సుమారు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు సముద్రంలో బారులు తీరి రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు ఐఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ఈ వేదికపై ప్రపంచానికి చాటి చెప్పనుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు ఉంటే, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. విమానవాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్ సబ్ మెరైన్లు పాల్గొంటాయి. అలాగే అత్యాధునిక డిస్ట్రాయర్లు ఐఎన్ఎస్ విశాఖపట్నం, తారాగిరి సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విన్యాసాలను భారత నేవీ ప్రదర్శించనుంది. గగనతలంలో నౌకాదళానికి చెందిన మిగ్–29కె ఫైటర్ జెట్లు, పి–8ఐ నిఘా విమానాలు, సముద్రపు గద్దలుగా పేరుపొందిన ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు, సీ కింగ్, ధృవ్ హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. విదేశీ వైమానిక దళాలకు చెందిన ఆధునిక విమానాలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి. 60కి పైగా దేశాల భాగస్వామ్యం ఐఎఫ్ఆర్, మిలాన్ కోసం భారత నౌకాదళం మొత్తం 137 దేశాలకు ఆహా్వనం పింపింది. ఇందులో ఇప్పటి వరకు 60కి పైగా దేశాలు భాగస్వామ్యం అవుతున్నట్లు ధృవీకరణ వచ్చింది. ఇందులో 4 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మంది వరకు రానున్నారు. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల నుంచి 23కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడం ప్రారంభమవుతుంది.విన్యాసాల షెడ్యూల్ ఇలా..⇒ ఈ నెల 15న నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ ప్రారంభమవుతంది. 21వ తేదీ వరకు భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ⇒ 18వ తేదీ ఉదయం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమవుతుంది. ⇒ 19వ తేదీ ఉదయం మిలాన్–2026 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆరంభమవుతుంది. ⇒ 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో దేశ విదేశీ నౌకాదళాల కవాతు, ఎయిర్ పవర్ డెమో (వైమానిక ప్రదర్శన) ఉంటాయి. ⇒ 19, 20 తేదీల్లో మిలాన్ విన్యాసాల్లో భాగంగా ’హార్బర్ ఫేజ్’లో అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ⇒ 20న ఐవోఎన్ఎస్ సదస్సు జరగనుంది. ఇందులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇందులో 25 సభ్యదేశాలు, 9 అబ్జర్వర్ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ⇒ 21 నుంచి 25 వరకు ‘మిలాన్’ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి.మిత్ర దేశాల కలయిక.. మిలాన్–2026 ఈనెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేతుల మీదుగా ‘మిలాన్–2026’ విన్యాసాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. దీనికి సుమారు 137 దేశాలను ఆహ్వానించారు. ఇప్పటివరకు 60కి పైగా దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. మిలాన్ విన్యాసాలు రెండు దళల్లో జరుగుతాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ‘హార్బర్ ఫేజ్’లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు ‘సీ ఫేజ్’ ప్రారంభమవుతుంది. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహిస్తాయి.రక్షణ దళాల సమీకరణ (బలగాల వివరాలు) మొత్తం యుద్ధ నౌకలు - 110కి పైగా (భారత్ + విదేశీ)భారత నౌకాదళ నౌకలు - 90 వరకు విదేశీ యుద్ధ నౌకలు - 23 నుంచి 25 విమానాలు హెలికాప్టర్లు - 60కి పైగా ప్రధాన యుద్ధ నౌకలు - ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్యపాల్గొనే దేశాలు, ప్రతినిధులు అంశం - వివరాలు మొత్తం ఆహ్వానిత దేశాలు - 137 భాగస్వామ్యాన్ని ధృవీకరించిన దేశాలు - 60+ విదేశీ ప్రతినిధుల సంఖ్య - సుమారు 4వేలు విదేశీ నౌకాదళాధిపతులు - 25 నుంచి 30 మంది -
విశాఖ: రిటైర్డ్ సూపరిండెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, విశాఖపట్నం: రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు.. పంచాయితీరాజ్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖ, మధురవాడ, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా, హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. -
మూడు కోళ్లు, ఊరికి రూ.12 వేలు... ఇదీ ఓ ఎస్ఐ రేటు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మీ ఊళ్లో బరి గీసుకోండి. ఊరికి మూడు కోళ్లు...రూ. 12 వేలు ఇవ్వండి! ఇది అనకాపల్లి జిల్లాలోని ఓ ఎస్ఐ సంక్రాంత్రి వసూళ్ల లెక్క! భారీగా ‘బరి’లు గీసుకోండి. మందు, డ్యాన్సులు మీ ఇష్టం. స్థానిక ప్రజా ప్రతినిధులూ పాల్గొంటున్నారు కాబట్టి ఇబ్బందేమీ లేదు. గుండాట, లాటరీ బాల్ ఏ ఆటైనా మీ ఇష్టం. మా వాటా మాకిస్తే చాలు. ఇది అనకాపల్లి జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల కథ! ఊళ్లో ఉత్సవం ఉందా? కోడి పందాలు నిర్వహించుకోండి. మేమేమీ పట్టించుకోం!! ఇది తాజాగా మరో నియోజకవర్గంలో పరిస్థితి. ఇలా అన్ని చోట్లా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహించుకుంటుంటే అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా చీడికాడలో కోడి పందాల నిర్వహణలో బరిలో నిలిచిన కోళ్లకు తగిలించిన కత్తి తగిలి ఏకంగా వడిసిలి అప్పలనాయుడు అనే వ్యక్తి చనిపోయారు. ఈ విషయం ఫిబ్రవరి 1వ తేదీన జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో భారీగా చేతులు తడిపిన పోలీసుల వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం. కాసుల రుచి మరిగి.. సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణతో భారీగా ఆదాయానికి అలవాటు పడిన పోలీసు, రెవెన్యూ వర్గాలు గ్రామీణ ఉత్సవాల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా చీడికాడలో నిర్వహించిన కోడి పందాలతో బరిలో ఉన్న కోళ్లకు కట్టిన కత్తి తెగి ఏకంగా ఒక వ్యక్తి మరణించాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదేవిధంగా చోడవరంలో కూడా తాజాగా బయటకు వచ్చిన డ్యాన్సుల వీడియో కూడా హల్చల్ చేసింది. అశ్లీల నృత్యాలు కాదంటూ స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ తరహాలో ఉత్సవాలను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే గ్రామ ఉత్సవాలన్నింటిలోనూ కోడి పందాల నిర్వహణకు అనుమతిలిచ్చి జేబులు నింపుకోవడానికి అటు రెవెన్యూ, ఇటు పోలీసువర్గాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే చీడికాడలో వ్యక్తి మృతిచెందిన వ్యవహారంలో ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు అందనప్పటికీ కోడి పందాలతోనే చనిపోయాడని మాత్రం గుసగుసలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై బదిలీ వేటు పడింది. అంతేకాకుండా ఉత్సవాల పేరుతో పందాల నిర్వహణకు అనుమతించిన పోలీసులు, వారి వసూళ్లపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ నగర శివారులోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరిపై బదిలీ వేటు పడనుందనేది చూడాల్సి ఉంది. గోదావరి జిల్లాలకు దీటుగా...! గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ అధికార పార్టీ నేతల అండదండలతో భారీగా ‘బరి’లు రంగంలోకి వచ్చాయి. గతంలో సంక్రాంత్రి పందెం కోళ్ల బరిలను చూసేందుకు పక్కనే ఉన్న గోదావరి జిల్లాలకు వెళ్లేవారు. అయితే, ఈ దఫా మాత్రం అదే స్థాయిలో భారీ సెట్టింగులతో స్థానికంగానే నిర్వహించారు. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఓ రేంజ్లో పందెం బరిలు గీశారు. అలాగే పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో కూడా ఒక మోస్తరుగా పందెం బరిలు ఏర్పాటు చేసుకున్నారు. కోడి పందాలతో పాటు డ్యాన్సులూ హోరె త్తాయి. ఇంతటితో ఆగకుండా భారీగా మద్యం అమ్మకాలతో పాటు గుండాట, లాటరీ బాల్ ఆటలకూ లాటరీ పద్ధతిలో స్టాళ్ల కేటాయింపులు జరిగాయి. ఒక్కో స్టాలుకు రూ.8 లక్షల చొప్పున వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల ఊపుతో ఇప్పుడు గ్రామాల్లో జరిగే ఉత్సవాలకు కూడా కోడి పందాల నిర్వహణ వ్యవహారం పాకడం గమనార్హం. -
మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’
విశాఖపట్నం: రైల్వే స్టేషన్ అంటేనే నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఒక జనసముద్రం. ఆ రద్దీలో సామాన్య ప్రయాణికులను, మారువేషంలో తిరిగే నేరగాళ్లను వేరు చేసి చూడటం మానవమాత్రులకు కత్తిమీద సామే. కానీ.. ఆధునిక సాంకేతికత తోడైతే అసాధ్యం సుసాధ్యమని ‘రైల్ రోబోకాప్ – ఏఎస్సీ అర్జున్’ నిరూపించింది. సోమవారం నిశ్శబ్దంగా సాగిపోతున్న రాత్రి వేళ, ప్లాట్ఫారంపై తన గస్తీని కొనసాగిస్తున్న ఈ రోబో రూపంలోని కృత్రిమ మేధస్సు ఒక్కసారిగా అప్రమత్తమైంది. దాని డిజిటల్ కళ్లు రద్దీలో ఉన్న ప్రతి ముఖాన్ని నిశితంగా స్కాన్ చేస్తుండగా, ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలు తన డేటాబేస్లోని ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాతో సరిపోలాయి. కనురెప్పపాటు కాలంలోనే ఆ రోబో తన విశ్లేషణను పూర్తి చేసి, కంట్రోల్ రూమ్కు ప్రమాద హెచ్చరికలను పంపింది. అప్పటివరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోబో పంపిన నిక్కచ్చి సమాచారంతో ఆరీ్పఎఫ్ ఎస్ఐ వి. కీర్తిరెడ్డి నేతృత్వంలోని బృందం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెన్షన్ స్క్వాడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎటు నుంచి ముప్పు వస్తుందో ఊహించలేక ఆ ఇద్దరు అనుమానితులు తచ్చాడుతుండగానే, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రాథమిక తనిఖీలో వారి వద్ద కనీసం టికెట్లు కూడా లేకపోవడం అధికారుల అనుమానాన్ని బలపరిచింది.అయితే అసలు సంచలనం వారి గతాన్నితవ్వినప్పుడు బయటపడింది. పట్టుబడిన హడప శివ, జె. బంగారు సాధారణ దొంగలు కాదని, రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు, డకాయిటీలతో భీభత్సం సృష్టించిన గజదొంగలని తేలింది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నేరగాళ్ల ఆటను ‘ఏఎస్సీ అర్జున్’ తన ఏఐ మేధస్సుతో కట్టిపడేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్ఎం లలిత్ బోరా స్పందిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించడంలో ఏఐ సాంకేతికత ఒక తిరుగులేని ఆయుధమని ప్రశంసించారు. -
5వేలు కాదు జస్ట్ వెయ్యి కోట్లే సిగ్గు లేకుండా సమర్ధింపా
-
‘తిరుపతి లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే ఈ దాడులు’
విశాఖ: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిలైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూటమి నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారని, ప్రధానంగా తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) విశాఖ నుంచి మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లి పచ్చమూకలు విధ్వంసం సృష్టించడమే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందనే దానికి ఉదాహరణ అని అన్నారు. ‘పచ్చమూకలను చెదరగొట్టే అవకాశమున్నా పోలీసులు పట్టించుకోలేదు. జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులే వేశారు. పక్కాప్లాన్ ప్రకారమే దాడులు చేస్తూ లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర బయటపడుతుందనే డైవర్షన్ పాలిటిక్స్. తిరుపతి లడ్డూ, చంద్రబాబు కుటుంబం భూదోపిడీని డైవర్షన్ చేసేందుకే దాడులు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ లెక్క ప్రకారమే దోపిడీ చేసిన గీతం భూమి విలువ రూ. 1000 కోట్లు. అంటే భూమి కబ్జా చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా?, ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టే హక్కు మీకెరిచ్చారు?, విశాఖలో ఉన్న భూములు, ఆస్తులు మీ జాగీరు కాదు’ అని హెచ్చరించారు. -
ఎన్బీఎఫ్సీ సారథి ఫైనాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
విశాఖపట్నం : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ ద్వారక నగర్ లోని ఎంఎస్ఎంఈ (MSME) ఫోకస్డ్ ఎన్బీఎఫ్సీ 'సారథి ఫైనాన్స్' ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలపై (MSME) దృష్టి సారించే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) 'సారథి ఫైనాన్స్' ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ చేపడుతున్న దేశవ్యాప్త సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ఆరుగురు వ్యక్తులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్ లెట్లు, ఎర్ర,తెల్ల రక్త కణాలు వంటి కంపోనెంట్లు అందించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.దాదాపు10 లీటర్ల రక్తాన్ని సేకరించి, స్థానిక ఆసుపత్రుల్లోని రోగుల అవసరాల కోసం రక్త నిల్వల కొరతను తీర్చడానికి అందజేశారు. స్థానిక ఆరోగ్య వ్యవస్థలకు మద్దతుగా సారథి ఫైనాన్స్ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఇటువంటి డ్రైవ్లను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏఆర్సీ ఖాళీ
ఆరిలోవ: దశాబ్దాల పాటు సింహాల గర్జనలు, పులుల గాండ్రింపులతో దద్దరిల్లిన విశాఖలోని ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ) ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒకప్పుడు 34 పెద్ద పులులు, 34 సింహాలు కలిపి మొత్తం 68 వన్య మృగాలతో కళకళలాడిన ఈ కేంద్రం నేడు వెలవెలబోతోంది. కాలక్రమంలో వృద్ధాప్య సమస్యలతో ఒక్కో జంతువు మృత్యువాత పడగా, చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన ‘బిగో’అనే ఆడ సింహం కూడా ఈ నెల 7న కన్నుమూసింది. దీంతో ఏఆర్సీ పూర్తిగా ఖాళీ అయ్యింది. 2000లో కేంద్రం ఏర్పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జూ పార్కు సమీపంలో, జాతీయ రహదారిని ఆనుకొని 2000లో జంతు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సర్కస్ కంపెనీలు గ్రామాలు, పట్టణాలకు వచ్చి ప్రజలకు వినోదాన్ని పంచేవి. ఆయా కంపెనీలు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు, కుక్కల చేత బలవంతంగా విన్యాసాలు చేయించేవి. ఈ క్రమంలో మూగజీవాలు సర్కస్ యాజమాన్యాల చేతిలో హింసకు గురవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో సర్కస్లలో జంతువులతో విన్యాసాలు చేయించడాన్ని తప్పుబడుతూ, వాటితో ఆటలాడించకూడదని 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని వివిధ సర్కస్ కంపెనీల నుంచి జంతువులను స్వాదీనం చేసుకుంది. వాటి సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, మైసూరు, ముంబయి, చెన్నైలలో ప్రత్యేకంగా ఐదు జంతు పునరావాస కేంద్రాల(యానిమల్ రెస్క్యూ సెంటర్–ఏఆర్సీ)ను నిర్మించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లోని జూలాజికల్ పార్కులకు అప్పగించింది. ప్రసిద్ధ సర్కస్ కంపెనీలైన ఫేమస్, జెమిని, అజంతా తదితరాల నుంచి స్వాధీనం చేసుకున్న పులులు, సింహాలను ఈ ఐదు ఏఆర్సీలకు తరలించింది. అప్పటి నుంచి వాటికి ఆహారం, వైద్యం అందించి సంరక్షించారు. ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం ఈనెల 7న బిగో(24) అనే ఆడ సింహం మృతి చెందడంతో ఏఆర్సీలో జంతువులేవీ లేవు. ఈ విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు, సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏఐ) దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల అనుమతితో ఈ స్థలాన్ని జూ పార్కు అవసరాలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం. గత 25 ఏళ్లుగా ఇక్కడి సిబ్బంది, వైద్యులు జంతువులకు అత్యుత్తమ సేవలు అందించారు. – జి.మంగమ్మ, క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కువిశాఖ ఏఆర్సీలో 68 జంతువులుకేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2000లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 2001లో ఇది ప్రారంభమైంది. ఇక్కడకు తీసుకొచ్చిన 34 పెద్ద పులులు, 34 సింహాల కోసం ప్రత్యేకంగా ఇనుప కేజ్లు, నైట్ క్రాల్స్, అవి స్వేచ్ఛగా తిరగడానికి విశాలమైన ఎన్క్లోజర్లు నిర్మించారు. వాటికి సకాలంలో ఆహారం, వైద్యం అందించడానికి వెటర్నరీ ఆసుపత్రి, ఒక వైద్యుడు, సహాయకులు, జంతు సంరక్షకులను నియమించారు. అవి యుక్త వయసులో ఉన్నప్పుడు వాటి గాండ్రింపులు, గర్జనలతో ఏఆర్సీ ప్రాంతం హోరెత్తేది. జాతీయ రహదారిపై వెళ్లే వారికి సైతం ఆ గర్జనలు వినిపించేవి. ఇప్పుడు అవన్నీ మరణించడంతో అక్కడ నిశబ్దం ఆవహించింది. సహజంగా అడవుల్లో పులులు, సింహాల సగటు జీవిత కాలం 15 నుంచి 16 ఏళ్లు కాగా, ఇక్కడ సంరక్షణలో అవి 20 నుంచి 25 ఏళ్లకు పైగా జీవించడం విశేషం. అర్జున్ (26), కొనాల్ (26) అనే మగ సింహాలు, మాధురి (25), సుధ (23), రాణి (23) అనే ఆడ సింహాలు ఎక్కువ కాలం జీవించాయి. వీటితో పాటు సీత (24) అనే ఆడ పులి, వినయ్ (21) అనే మగ పులి కూడా ఇక్కడ సుదీర్ఘ కాలం జీవించాయి. వృద్ధాప్యం కారణంగా అవయవాలు పనిచేయకపోవడం, పక్షవాతం వంటి వ్యాధులతో ఇవి మృతి చెందాయి. మంచి పోషకాహారం, వైద్యం అందించడం వల్లే అవి ఎక్కువ కాలం జీవించాయని అధికారులు తెలిపారు. -
జీవీఎంసీలో రౌడీ రాజ్యం.. కబ్జాకు పచ్చ జెండా
‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు.. నోరు మూసుకుని బయటకు వెళ్లిపోండి.. లేదంటే ఇబ్బంది పడతారు..’ అంటూ అధికార కూటమి పార్టీల కార్పొరేటర్లు బరితెగించి బెదిరింపులు.. మెడ పట్టుకుని తోసేయడాలు.. స్వయానా మేయర్ రౌడీ అవతారం ఎత్తి దౌర్జన్యం చేయడం.. ఆయనే అజెండాలోని అంశాలు చదివి.. ఆయనే ఆమోదించడం.. అందరూ ఆమోదించారని ఏకపక్షంగా ప్రకటించడం.. మొత్తంగా జీవీఎంసీలో నిబంధనలకు చరమ ‘గీతం’ పాడటం విస్తుగొలుపుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ, బాలకృష్ణ చిన్న అల్లుడు, లోకేశ్ తోడల్లుడు భరత్కు చెందిన గీతం విద్యా సంస్థ విశాఖ నడిబొడ్డున కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువ చేసే 54.79 ఎకరాల భూములను క్రమబద్ధీకరించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా బరి తెగించింది. ఆ భూములను తమ కుటుంబపరం చేసుకునే తీర్మానం చేయించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులను కౌన్సిల్ హాలులోకి పిలిపించింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగి ఫక్తు రౌడీ ప్రభుత్వంలా వ్యవహరించింది. సమావేశం వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు మీడియాపై నిషేధం విధించింది. ఇలా అన్ని విధాలుగా బరి తెగింపు చర్యలకు పూనుకుంది. చివరకు అజెండాలోని అంశాలను సెక్రటరీ విభాగానికి చెందిన అధికారులు కాకుండా స్వయంగా మేయర్ చదివి మరీ అన్నీ ఆమోదించినట్టు ప్రకటించేశారు. సమావేశం ప్రారంభం నుంచి ప్రభుత్వ భూములను కబ్జాదారులపరం చేయవద్దంటూ.. విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకూడదంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు శాంతియుతంగా నిరసనకు దిగారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, నేలపై పడుకుని మరీ నిరసన తెలిపారు. ఎలాగైనా సరే తమ కుటుంబ సంస్థ కబ్జా చేసిన భూములను కైవశం చేసుకోవాలన్న కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పాలకవర్గ గడువు నెలలో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం చివరి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతిపక్షం గొంతు నొక్కి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఈ క్రమంలో ‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదు.. కబ్జా చేసిన భూమిని దోచి పెడతారా?’ అంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై విచక్షణా రహితంగా అధికార కూటమి పార్టీల కార్పొరేటర్లు దాడులకు దిగారు. కొందరిని మెడ పట్టుకుని నులిమారు. మరికొందరి ఛాతీపై బలంగా కొట్టారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తోసివేశారు. ఇలా అన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మరీ అన్ని అంశాలకు ఆమోద ముద్ర వేసినట్టు ప్రకటించి సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు. రౌడీలా ప్రవర్తించిన మేయర్!ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారని, కబ్జా చేసిన వారికే భూమిని అప్పగిస్తారా.. అంటూ న్యాయమైన డిమాండుతో కౌన్సిల్ సమావేశంలో నిలదీసేందుకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో పాటు సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు కూడా నిరసనకు దిగారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కింద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సమయంలో అజెండా నుంచి గీతం భూ కబ్జాలను సక్రమం చేసేలా పొందు పరిచిన 15వ అంశాన్ని తొలగించాలంటూ మేయర్కు వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడరు బాణాల శ్రీనివాసు విన్నవించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మేయర్ రెచ్చిపోయి రౌడీలా ప్రవర్తించారు. రెండు చేతులతో బలంగా శ్రీనివాసు ఛాతీని నెట్టారు. సభను హుందాగా నడపాల్సిన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఫక్తు రౌడీలా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి కిందపడిపోయారు. మేయర్ కనుసైగతో మిగిలిన కూటమి కార్పొరేటర్లు కూడా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగారు. ఇష్టారీతిలో తోసివేయడంతో పలువురి కాళ్లకు, మోచేతులకు గాయాలయ్యాయి. ముందుగానే పక్కా ప్లాన్తో మీడియాను అనుమతించకుండా రౌడీయిజంతో అన్ని అంశాలను ఆమోదించినట్లు ప్రకటించుకున్నారు. పక్కా ప్లానింగ్తో దౌర్జన్యంవాస్తవానికి అజెండాలో పొందు పరిచిన గీతం భూ కబ్జాలను క్రమబద్దీకరించే అంశాన్ని తొలగించాలంటూ ఇప్పటికే వైఎస్సార్సీపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జాలో ఉన్న వ్యక్తికే ఎలా కట్టబెడతారని నిలదీస్తున్నాయి. సమావేశంలో ఈ అంశంపై నిలదీయాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో పక్కా ప్లానింగ్తో అధికార పార్టీ సిద్ధమైంది. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కుటుంబ సభ్యుల వ్యవహారం కావడంతో రౌడీయిజం చేసి, మరీ ఈ అంశాన్ని ఆమోదించేందుకు సిద్ధమైంది. రౌడీయిజం బయటకు పొక్కకుండా ఉండేందుకు మీడియాను అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి లేదంటూ శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమయ్యే ముందుగా జీవీఎంసీ ప్రకటన జారీ చేసింది. దీనిపై మీడియా ప్రతినిధులు మేయర్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా, వెలగపూడి తన మార్క్ రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఎవ్వడినీ అనుమతించేది లేదంటూ దురుసుగా మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల ప్రవేశం జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరుగా కౌన్సిల్ హాలులోకి పోలీసులు రంగ ప్రవేశం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్ సమావేశం నుంచి ఎవరినైనా బయటకు పంపేందుకు మేయర్ నిర్ణయిస్తే, మార్షల్స్ ద్వారా వారిని సమావేశం హాలు నుంచి బయటకు పంపడం ఆనవాయితీ. అసెంబ్లీ, మండలి సమావేశాల తరహాలోనే మార్షల్స్కు మాత్రమే హాలులోకి అనుమతి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులను హాలులోకి అనుమతించకూడదు. అయితే, గీతం భూముల వ్యవహారం కావడంతో నేరుగా పోలీసులు రంగ ప్రవేశం చేయడం గమనార్హం. సమావేశంలో గందరగోళం ఏర్పడిన తరుణంలో మేయర్ రెండు దఫాలు తన రూంలోకి వెళ్లి.. టీడీపీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్వయంగా మార్షల్స్కు బదులుగా పోలీసులను కౌన్సిల్ సమావేశంలోకి పిలిచారు. ఇందుకు మేయర్ అనుమతివ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పలువురు కార్పొరేటర్లు మండిపడుతున్నారు. జీవీఎంసీ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. సాధారణంగా సెక్రటరీ విభాగానికి చెందిన ఒక ఉద్యోగి.. అజెండాలోని అంశాలను వరుస సంఖ్యలో చదివి వినిపిస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా అజెండాలోని అంశాలను తానే స్వయంగా చదవడంతో పాటు వెంటనే ఆమోదించినట్టు కూడా మేయర్ ప్రకటించారు. ఆ సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి, పల్లా, మరికొందరు కార్పొరేటర్లు అక్కడ లేకపోయినా ఆమోదించడం గమనార్హం. మెడ పట్టుకుని తోసేస్తూ కార్పొరేటర్లపై దాడులుగీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణ విషయంలో అధికార టీడీపీ పూర్తి స్థాయిలో రౌడీయిజానికి దిగింది. కార్పొరేటర్లపై దాడులు చేయడంతో పాటు ఏకంగా గొంతు పట్టుకుని బెదిరింపులకు దిగింది. వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావును స్వయంగా మేయర్.. మెడ పట్టుకుని తోసివేశారు. అధికార పార్టీ కార్పొరేటర్లు చేసిన దాడిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బల్లా లక్ష్మణ రావు కాలికి గాయాలయ్యాయి. డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్పై టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు రేయి వెంకటరమణ, చెన్నా జానకీరామ్, సాడి పద్మారెడ్డి, పీవీ సురేష్, కోరుకొండ స్వాతిదాస్లపై కూడా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ మెడను కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గట్టిగా పట్టేసుకున్నాడు. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడరు అల్లు శంకర్రావు మోచేతికి బలంగా గాయాలయ్యాయి. -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తోసేసిన మేయర్
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మీడియాను అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మేయర్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. గీతం భూ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. గీతం భూముల వ్యవహారంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ పీలా శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను మేయర్ తోసేశారు. కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్లు బీభత్సం సృష్టించారు. 62వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది.చర్చ జరగకుండానే గీతంకు భూములు కేటాయింపు..అధికార దుర్వినియోగంతో గీతం భూములను చంద్రబాబు సర్కార్ క్రమబద్దీకరించింది. చర్చ జరగకుండానే గీతంకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ సభ్యులను సస్పెండ్ చేసి ఏకపక్షంగా ఆమోదించింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసిన మేయర్, టీడీపీ కార్పొరేటర్లు.. కౌన్సిల్లో గూండాయిజం ప్రదర్శించారు.జీవీఎంసీ కౌన్సిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖలో కూటమి భూదోపీడీపై విపక్షాలు పోరుబాట పట్టాయి. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు యత్నించాయి. అంతకుముందు గీతం భూ కబ్జాపై జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నిరనస చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్రబాబు పాల్గొన్నారు.గీతం ’కబ్జా’ భూముల చిట్టా ఇదే..గీతం విశ్వవిద్యాలయం, ఆసుపత్రి యాజమాన్యం ఆక్రమణలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూముల వివరాలివి.. ఎండాడ గ్రామ సర్వే నంబర్ 15/1 నుంచి 15/5 వరకు 24.51 ఎకరాలు, 16/4లో 1.95 ఎకరాలు, 17/27లో 1.01 ఎకరాలు, 17/30లో 1.09 ఎకరాలు, 18/2లో 1.03 ఎకరాలు, 20/5లో 5.60 ఎకరాలు, 20/10లో 1.50 ఎకరాలు, 20/12లో 0.10 ఎకరాలు, 191/1లో 0.48 ఎకరాలు, 191/2లో 0.86ఎకరాలు, 191/9లో 0.70 ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాల 39 సెంట్లు.రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37/2లో 4.29 ఎకరాలు, 38/1బిలో 7.27 ఎకరాలు, 53/4లో 0.03 ఎకరాలు, 55/3లో 0.35 ఎకరాలు, 61/5లో 0.40 ఎకరాలు, 61/5లో 0.06 ఎకరాలు.. కలిపి మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 40 సెంట్లు. ఈ రెండు గ్రామాల్లో కలిపి ఎంపీ శ్రీభరత్ కుటుంబం ఆ«దీనంలోని గీతం సంస్థల చేతిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి 54.79 ఎకరాలు. -
విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్సీపీ పోరాటం..
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ప్రారంభించారు. దీక్షలో గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మజ్జి చిన శ్రీను, వాసుపల్లి గణేష్ కుమార్, ధర్మశ్రీ, పసుపులేటి బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. నిరసన దీక్ష అనంతరం గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూములను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకోనుంది. గీతంకు భూ కేటాయింపుపై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. గీతంకు భూ కేటాయింపు రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. జీవీఎంసీ కౌన్సిల్లో అడ్డదారిలో ఆమోదించే ప్రక్రియను వైఎస్సార్సీపీ అడ్డుకోనుంది. భూకబ్జాకు పాల్పడిన ఎంపీ భరత్ను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.చంద్రబాబు కుటుంబ సభ్యులు.. భూ దోపిడీకి తెర తీశారని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్ అజెండా నుంచి గీతం భూ దోపిడీ అంశాన్ని వెనక్కు తీసుకోవాలని కోరాం. వెనక్కు తీసుకుంటే సరి.. లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.ఉత్తరాంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అతి పెద్ద భూ కబ్జాను అడ్డుకోవడం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది చంద్రబాబు కుటుంబ సభ్యుడు.. ఎంపీ భరత్ రూ.5 వేల కోట్ల భూ దోపిడీ చేశారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని గీతం సంస్థ భూ కబ్జా చేస్తుంది. గీతం భూ కబ్జాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కన్నబాబు అన్నారు.వామపక్షాల నిరసన..జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గీతం భూ దోపిడీని అడ్డుకోవాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు ఎంపీగా ఉండి భూ ఆక్రమణకు పాల్పడటం ఏంటని నేతలు ప్రశ్నించింది. -
GVMC Council: మీడియాకు అనుమతి నిరాకరణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. ఇవాళ ఉదయం వరకు మీడియాకు అనుమతి ఉందంటూ ప్రకటించిన అధికారులు.. మీడియా ప్రతినిధులకు పాసులు కూడా జారీ చేశారు. కాసేపట్లో సమావేశం ప్రారంభమవుతుందనగా మీడియాకు అనుమతి లేదంటూ సమాచారం ఇచ్చారు.కౌన్సిల్ సమావేశంలో గీతం భూదోపిడీని నిలదీస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించిన సంగతి తెలిసిసందే. గీతంకు భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. కౌన్సిల్ సమావేశానికి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, పండుల రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హాజరుకానున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా కాసేపట్లో కౌన్సిల్ సమావేశానికి వైఎస్సార్సీపీ నేతలు బయలుదేరనున్నారు. -
విశాఖ భూములు కొల్లగొట్టేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు అండ్ కో భూ దాహానికి విశాల విశాఖ బక్కచిక్కిపోతోంది. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తామని బీరాలు పలికే చంద్రబాబు... భూ దోపిడీతో విశాఖ పరువుని బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. ఊరూ పేరూ లేని కంపెనీలకు విలువైన స్థలాలను ధారాదత్తం చేసేస్తున్నారు. అడ్డగోలుగా.. అధికారం అండతో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన తమ కుటుంబ సభ్యులకు అధికారికంగా బదలాయించేస్తున్నారు. ఓటేసిన విశాఖ వాసులను మాత్రం వెన్నుపోటు పొడిచేశారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. ‘గీతం’కు భూ పందేరం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.5 వేల కోట్ల విలువ చేసే 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం వర్సిటీకి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇలా చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని 2011 జనవరి 28న జగపాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని భారత అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. అదేవిధంగా 2012 సెపె్టంబర్ 14న జారీ చేసిన జీవో నం.571 ప్రకారం, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్వో) – 24 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చెయ్యకూడదు. వీటన్నింటినీ తుంగలో తొక్కి.. గీతం కోసం ప్రభుత్వం సాగిలపడుతోంది. అభివృద్ధి పేరుతో అయినవారికి కేటాయింపులు.! విశాఖ భూముల్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. నచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. కోట్ల రూపాయిలు విలువైన భూముల్ని ఎకరం 99 పైసలకు కట్టబెట్టడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 25న రిజిస్టర్ అయిన ఉర్సా క్లస్టర్ అనే సంస్థకు అదే ఏడాది ఏప్రిల్లో 59.86 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. టీసీఎస్, కాగ్నిజెంట్.. ఇలా నచ్చిన కంపెనీలకు విశాఖలోని విలువైన భూములను ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైపోయారు. అవసరమైతే మొత్తం భూమే ఇచ్చేస్తామని మంత్రి లోకేశ్ అంటున్నారు. ఈ భూ దోపిడీపై పలు వర్గాల నుంచి వచ్చిన విమర్శలతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం.. మరికొన్ని కంపెనీలకు ఇదే తరహాలో భూములు ఇచ్చేందుకు తెరవెనుక మంత్రాంగం నడుపుతోందనే ఆరోపణలున్నాయి. బీచ్ ఒడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన భూములను లులూ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టేసింది. ఇలా విశాఖలోని భూములన్నింటినీ కొల్లగొట్టేందుకు ప్రభుత్వం స్కెచ్ వేస్తోంది.2014 – 19 మళ్లీ రిపీట్.!2014లో అధికారంలోకి వచ్చినప్పుడు భూ కుంభకోణపర్వం మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు పార్ట్ – 2ను కొనసాగిస్తోంది. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలంతా కలిపి.. ఒక మాఫియాలా తయారయ్యారు. అవకాశం ఉన్న చోట రికార్డులను తారుమారు చేయడం, సాధ్యం కాకపోతే కబ్జా చేయడం, ఇంకోచోట ల్యాండ్ పూలింగ్ పేరిట దారుణాలకు దిగడం ఇలా అనేక రూపాల్లో ఈ భూబాగోతాలు సాగిపోయాయి. లక్షల ఎకరాల్లో భూ రికార్డులు ట్యాంపరింగ్కు గురయ్యాయని అధికారులు ప్రకటించినప్పుడు.. హుద్హుద్ సమయంలో భూ రికార్డులు తడిచిపోయాయనే అబద్ధాల్ని వల్లెవేశారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.వేల కోట్లు విలువ చేసే భూముల్ని టీడీపీ భూ బకాసురుల ఆక్రమణల చెర నుంచి విడిపించి ప్రభుత్వ ఆ«దీనంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి కూటమిగా అధికారంలోకి వచ్చి విశాఖ మొత్తాన్ని హోల్సేల్గా అమ్మేయాలన్నదే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు భూ కేటాయింపులు చేసేస్తోంది. రూపాయికి ఏమొస్తుందో తెలీదు కానీ.. వైజాగ్లో మాత్రం ఎకరం భూమి అప్పనంగా వచ్చేస్తోందనేది ప్రస్తుతం రాష్ట్రమంతటా హాట్టాపిక్గా మారిపోయింది.రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తుండడం చట్టాన్ని ఉల్లంఘించడమే. గీతం వర్సిటీ ఆక్రమించేసిన 54 ఎకరాలను ఏ ప్రాతిపదికన వారికిచ్చేస్తున్నారు..? విశాఖలో ఇటీవల జరుగుతున్న భూ కేటాయింపులు సుప్రీంకోర్టు తీర్పునకు పూర్తి విరుద్ధం. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం, మంత్రులు, అధికారులపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ – 1988 కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాను. – ఈఏఎస్ శర్మ, విశ్రాంత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కేటాయింపుల వెనుక క్విడ్ ప్రోకో విశాఖ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనుక క్విడ్ ప్రోకో నడిచిందనే అనుమానాలున్నాయి. ఎకరం 99 పైసలకు ఇస్తున్నట్లుగా చేసుకున్న ఒప్పందాలన్నింటినీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి. ప్రజల ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఈ భూపందేరాలతో విశాఖ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. – సీహెచ్ నర్సింగరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
విశాఖలో జూపార్క్ మూసివేత.. సందర్శకుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇందిరాగాంధీ జూపార్క్ మూసివేతపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ తీసుకున్నా పార్క్ లోపలకు పంపడం లేదని పర్యాటకులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన కారణంగా అధికారులు.. జూపార్క్ను మూసేశారు. పవన్ కల్యాణ్ పర్యటనపై సమాచారం లేకుండా జూపార్క్ మూసివేశారు. జూపార్క్ సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు.పవన్ పర్యటన ఉన్నట్లు కనీసం బోర్డులు కూడా పెట్టలేదని సందర్శకుల అసహనం వ్యక్తం చశారు. ఉదయం నుంచి జూపార్క్ను మూసివేయడంతో పర్యాటకులు పడిగాపులు గాస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనుమతిస్తామన్న జూపార్క్ అధికారులు.. ఒంటి గంట తర్వాత కూడా అనుమతించకపోవడంతో పర్యాటకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జూపార్క్ సందర్శనకు రావాలన్న సెక్యూరిటీ సిబ్బందితో పర్యాటకులు వాగ్వాదానికి దిగారు. -
‘గీతం భూ కబ్జాపై పవన్ మాట్లాడాలి.. పచ్చ మీడియాకు కళ్లు లేవా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ స్టాండ్ ఏమిటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాటం లేదు. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు.విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకునేతల పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు, మాజీ మంత్రి అమర్నాథ్ నియోజకవర్గ సమన్వయకర్తలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ వేయాలంటూ డిమాండ్ చేశారు.అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘చంద్రబాబు భూ దోపిడీని అడ్డుకోవడానికి గీతం యూనివర్సిటీకి వచ్చాము. చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదువేల కోట్ల భూమి ప్రభుత్వానికి చెందిందని గత వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలో హెచ్చరిక బోర్డులు పెట్టాం. ప్రభుత్వ భూమిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారా?. చంద్రబాబు లెజెండరీ అని రోజూ సొల్లు కబుర్లు చెబుతారు. భూ కబ్జాలు చేయడమేనా మీ లెజెండరీ. ఏబీఎన్, టీవీ-5, ఈనాడులకు భూ దోపిడీ కనిపించడం లేదా?. భూ కబ్జాపై నోరూ విప్పాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్కు ఉంది. విశాఖలో ఉండి కూడా పవన్ గీతంపై ఎందుకు మాట్లాడలేదు?. గీతం భూ దోపిడీపై బీజేపీ, జనసేన మాట్లాడాలి. అవసరమైతే గీతం భూకబ్జా భూములను పరిశీలించడానికి వైఎస్ జగన్ను పిలుస్తాము. చంద్రబాబు భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలి. భూ దోపిడీని రేపు కౌన్సిల్లో అడ్డుకుంటాం అని హెచ్చరించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘గీతం సంస్థకు భూమి కట్టబెట్టడంలో ప్రభుత్వం బరితెగించింది. భూములను ధారాదత్తం చేస్తే అడిగే వారు లేరని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. మా ప్రభుత్వం టూరిజం భవనాలు కడితే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గీతం సంస్థకు 55 ఎకరాలు కట్టబెడుతుంది ప్రభుత్వం. గీతం భూ కబ్జాపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటి?. గతంలో ఇక్కడికి వచ్చి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఏం తప్పు చేసినా మాట్లాడకుండా ఉండటమే మీ స్టాండా పవన్?. తిరుమల లడ్డు విషయం ఇప్పుడు పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.జీవీఎంసీ అజెండా నుంచి గీతం భూముల అంశం తీసేయ్యాలి. లేదంటే జీవీఎంసీ కౌన్సిల్ జరగనివ్వం. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. గీతం సంస్థ కబ్జా చేసి కేటాయించమని అడుగుతుంది. ఈ కబ్జాను అంగీకరించిన రోజే ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రచ్చ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ నడుస్తోంది. ఎంపీ భరత్ మీద కేసు పెట్టాలి. ఈ ప్రాంతంలో ఉన్న భూములను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘రుషికొండ ప్రభుత్వ భవనాలపై తప్పుడు ప్రచారం చేశారు. గీతం కబ్జాపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వేల కోట్లు విలువైన భూమి కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం. గీతంలో డబ్బున్న వారు చదువుతారని ఎంపీ చెప్పారు. చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని చట్టం ఏమైనా చేశారా?. కూటమి జమానాలో భూ కబ్జాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. గీతం కబ్జాపై కూటమి నేతలకు బాధ్యత లేదా?. ఈ భూమిని కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. -
‘ఎంపీ భరత్ భూ దోపిడీ.. పవన్, బీజేపీకి కనిపించట్లేదా?’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖలో భూ బదలాయింపు అంశం రేపు(గురువారం) జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ ఐటమ్గా చేర్చారు. భూ దోపిడిని ఆపాలని మేయర్, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించాం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. రేపు గీతం యూనివర్సిటీలో కబ్జాకి గురైన 5 వేల కోట్ల విలువైన భూమిని సందర్శిస్తాను. ఈనెల 30వ తేదీన కౌన్సిల్లో పోరాటం చేస్తాం. అదే రోజు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపడతాం.విశాఖ భూ దోపిడీపై జనసేన, బీజేపీ సమాధానం చెప్పాలి. ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడటంపై మీ స్పీడ్ చూపించాలి. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నీతి కబుర్లు చెబుతారు. విశాఖ భూ దోపిడీపై ఎందుకు మాట్లాడలేదు?. సెంటు, రెండు సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పెడతారు. 55 ఎకరాల భూమిని ఎలా క్రమబద్దీకరణ చేస్తారు?. వామపక్షాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. గీతం విద్యా సంస్థ ఒక దోపిడీ సంస్థ. విద్యార్థుల నుంచి సీట్లు కోసం కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేశారు. 1998 నుంచి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.మరోవైపు.. విశాఖ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..‘అధికారం చేతిలో ఉంది కదా అని గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఈ భూ కేటాయింపు అన్యాయం. ఎంపీ భరత్కు 55 ఎకరాల భూమి కేటాయించడం అప్రజాస్వామ్యం. విశాఖలో భూములను పప్పు బెల్లాలులా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్ట పెట్టారు. జీవీఎంసీ ఎజెండా నుంచి గీతం అంశాన్ని తొలగించాలని వినతి పత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూ దోపిడిపై మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
-
విశాఖలో గీతం భూదోపిడీ.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: గీతం భూ దోపిడీపై సీపీఎం నిరసన చేపట్టింది. గీతం యూనివర్సిటీ ముందు సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 5 వేల కోట్ల భూములను ఏ విధంగా గీతం యూనివర్శిటీకి కట్టబెడతారంటూ ప్రభుత్వాన్ని సీపీఎం నేతలు నిలదీశారు. ప్రభుత్వం ప్రజా ఆస్తులుకు రక్షణగా ఉండాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భరత్పై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు బంధువైన అంత మాత్రాన ఎంపీ భరత్కు 55 ఎకరాల భూమి కట్టబెడతారా? అంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు.గీతం యూనివర్సిటీ దగ్గర సీఐ మల్లేశ్వరరావు ఓవరాక్షన్గీతం యూనివర్సిటీ దగ్గర సీఐ మల్లేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీపీఎం నేతలు గీతం యూనివర్సిటీ ముందు ఆందోళన చేయడానికి వీల్లేదంటూ సీఐ అడ్డుకున్నారు. దీంతో సీఐతో సీపీఎం నేతలు వాగ్వాదానికి దిగారు. నిరసనను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ సీఐని సీపీఎం నేతలు నిలదీశారు. శాంతియుత నిరసన.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని సీపీఎం నేతలు పేర్కొన్నారు. -
విశాఖ కలెక్టర్ కు మేయర్ వార్నింగ్
-
నేడూ టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: వైజాగ్ వేదికగా జరగనున్న భారత్–న్యూజిలాండ్ టీ–20 మ్యాచ్కు సంబంధించి రెండో దశ టికెట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టంగా రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్లతో పాటు కార్పొరేట్ బాక్స్ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251 కాగా, ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా.. టీ–20 సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుండగా, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఫ్లడ్లైట్ల వెలుతురులో మ్యాచ్ ప్రారంభం కానుంది. -
‘గీతం’కు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ఉదారంగా సమర్పించడం చట్ట విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పష్టంచేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని తెలిపారు. ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి వేర్వేరుగా లేఖలు రాశారు. పేదల గుడిసెలు తొలగించి.. పెద్దలు ఆక్రమించిన భూములు క్రమబద్ధీకరిస్తారా? అదే అధికారులు విశాఖ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని, వీధి వ్యాపారుల బళ్లను పోలీసు బలగాల సహాయంతో పొక్లెయిన్లు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు మరొక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిని ఈ నెల 30న జరిగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో క్రమబద్దీకరణ చేయడానికి చూస్తున్నారని పత్రికల్లో వార్తలు చూశానని తెలిపారు. ఈ విషయంలో విశాఖ రూరల్ మండలం తహసీల్దారు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు ఏ నియమం కింద ఇటువంటి క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నిబంధనల్లో బీఎస్వో (బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్)24 కింద గానీ, రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 571 కింద గానీ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని వివరించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు జగపాల్ సింగ్ (కేస్ నంబర్ 1132/2011) కేసులో 2011 జనవరి 28న అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఈఏఎస్ శర్మ ఆ లేఖలో స్పష్టంచేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల ప్రకారమే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం రూ.22 కోట్లు ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అంత విలువైన భూమిని లాభాలు గడించే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తే, సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆ నిర్ణయాలకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అసైన్డ్ భూములను గీతం కొనుగోలు చేసింది గతంలో గీతం సంస్థ రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించిన డీ పట్టా భూములను కూడా చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేసిందని శర్మ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ప్రైవేటు సంస్థల మీద చర్యలు తీసుకుని ఆ కొనుగోళ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావని అవి ప్రజాస్వామ్య విధానాలు, చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తాను సూచించిన అంశాలపై దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. అందుకే ఈ లేఖను కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా పంపుతున్నట్లు ఆయన తెలిపారు. -
ఎంపీ భరత్కు భూములు ఎలా ఇస్తారు?: జగ్గు నాయుడు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ భరత్ భూ దోపిడీపై విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి జగ్గు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ భరత్ భూదోపిడిని అరికట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వేల కోట్ల భూములు దోచుకోవడానికా మీకు ప్రజలు ఓట్లు వేసింది? అని ప్రశ్నించారు.విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి జగ్గు నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎంపీ భరత్ కబ్జా చేశారు. భూమి విలువ సుమారు 5000 కోట్లు ఉంటుంది. ఎంపీ భరత్ భూ దోపిడిని అరికట్టాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టరాదు. ఎన్నికలకు ముందు విశాఖలో భూములను కాపాడుకుంటామని కూటమి పార్టీలు చెప్పాయి. వేల కోట్ల భూములు దోచుకోవడానికా మీకు ప్రజలు ఓట్లు వేసింది. పేదవాడికి 60 గజాలు భూమి ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ఎంపీ భరత్కు ఎలా ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు.కాగా, విశాఖలో అత్యంత విలువైన రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు. -
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలుచుకుంటే అడ్డేముంది? చంద్రబాబు బరితెగిస్తే తిరుగేముంది? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని విధంగా భూ దోపిడీతో తన సొంత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఇస్తున్న అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఖరీదు ఏకంగా రూ.5,000 కోట్లు!! విశాఖలో అత్యంత విలువైన రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు. నాడు గీతం యాజమాన్యం ఆక్రమణల చెర నుంచి విడిపించి విలువైన ప్రభుత్వ భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపాడితే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వాటిని నజరానాగా తమ బంధువులకు అప్పగించేందుకు సన్నద్ధమైంది. రూ.వేల కోట్ల ఆస్తులకు వారసుడైన ఎంపీ శ్రీభరత్.. ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి తన భూ దాహాన్ని తీర్చుకోవడానికే విశాఖ ఎంపీ అవతారమెత్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చివరి సమావేశంలో కుట్రలకు పదును!బలం లేకపోయినా.. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని బలవంతంగా లాక్కొన్న టీడీపీ కౌన్సిల్కు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. ఇదే అదునుగా ప్రభుత్వ పెద్దలు తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంవో, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి ధారాదత్తం చేయాలనే కుట్రలకు పదును పెట్టారు. రూ.5,000 కోట్లకు పైగా విలువైన భూముల్ని చివరి సమావేశంలో నారా లోకేశ్ తోడల్లుడు ఎంపీ శ్రీభరత్కు కానుకగా ఇవ్వాలని కౌన్సిల్ భావిస్తోంది. ఆక్రమిత భూములేనని తేల్చిన ‘సిట్..’1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి తమ సన్నిహితుల భూ ఆక్రమణలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గీతం’ ఆక్రమణల పర్వం మొదలైంది. ఒక్కో గజం తమ చెరలోకి తీసుకుంటూ ప్రభుత్వ భూములకు అక్రమాల కంచె వేసింది. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూములను సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేసినా పాచిక పారలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ.. విశాఖలో భూ కుంభకోణాలపై కొరడా ఝుళిపించింది. కబ్జారాయుళ్ల చెరలో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఉండటానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో.. గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. గీతం ఆక్రమించుకున్న భూమిలో 40.51 ఎకరాలకుపైగా దశలవారీగా స్వాధీనం చేసుకున్నారు. గీతం వర్సిటీ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అందులో నిర్మించిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్లను తొలగించారు. గీతం యాజమాన్యం కోర్టుని ఆశ్రయించగా స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ 2016లోనే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని నాడు చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు అవే భూములను గిఫ్ట్గా ఇచ్చేందుకు బాబు సర్కారు సన్నద్ధమైంది.నిబంధనలకు విరుద్ధంగా ఎలా కేటాయిస్తారు?గీతం యాజమాన్యం భూ కబ్జాలపై అప్పటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడుతూ అది భూముల ఆక్రమణే అని స్పష్టం చేశారు. తాను ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్’ (సీసీఎల్ఏ) బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఎన్.కిరణ్ కుమార్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గీతం యాజమాన్యం సుమారు 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరిందని, దీనిపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధమని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. గీతం కోరిన ఆ భూమిని ప్రైవేట్ సంస్థకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ విభాగాలైన ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సామాజిక సంక్షేమ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చామని తెలిపారు. అయితే తాను పదవీ విరమణ చేసిన తర్వాత నాటి ప్రభుత్వం (టీడీపీ సర్కారు) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. 2014లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ని రద్దు చేస్తూ 2017 మే 15న జీవో నం.165 విడుదల చేశారని చెప్పారు. అప్పటికే ఆ ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థలు ఆక్రమించుకున్నాయన్న ఆరోపణలు వాస్తవమేనంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనప్పుడు దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను (కంచె వేయడం, ఆక్రమణల తొలగింపు లాంటివి) ఐవైఆర్ సమర్థించారు. ‘ఎవరు కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం సరైన చర్యే’ అని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని ఉర్సా కోసం..విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం ఊరు పేరు లేని ‘ఉర్సా’ లాంటి సంస్థలకు బరి తెగించి అప్పనంగా కట్టబెడుతోంది. ఎకరం కేవలం 99 పైసలకే లీజుకు ఇచ్చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతోంది. ఈ విషయం బహిర్గతం కావడంతో జీవోల జారీ అంశాన్ని పెండింగ్లో పెట్టింది. సర్కారు భూములపై ‘గీతం’ లోన్లు.!ఒకవైపు గీతం ఆక్రమించిన భూములకు అధికారిక ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే గీతం వర్సిటీకి కేటాయించిన ప్రభుత్వ భూములపై లోన్లు తీసుకునేందుకు గతేడాది అనుమతులు మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం కోసం అడ్డగోలు నిర్ణయాన్ని తీసుకుంది. గీతం కోసం గతంలో ఎండాడలోని సర్వే నం. 17/1, 17/28లోని 71.15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భూములు 22 ఏ జాబితాలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివీుద బ్యాంకులో లోన్లు తీసుకునేందుకు అడ్డగోలుగా అనుమతించింది. 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను మార్ట్గేజ్ చేసి.. బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే విధంగా అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు ఆక్రమిత భూములను సైతం కట్టబెడుతున్నారు.బడ్డీ కొట్లు తొలగిస్తూ... బడాబాబుకు భూములా?పొట్ట కూటి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను పోలీస్ బలగాలు, పొక్లెయిన్లతో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిర్వాసితులను చేస్తోంది. వీధి వ్యాపారులను కూడా అదే విధంగా తొలగిస్తోంది. మరోవైపు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న బడాబాబుకి మాత్రం దానం చేస్తోంది. రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు ఇంకొక న్యాయం! ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తారు? బీఎస్వో–24, రెవిన్యూ శాఖ 2012లో జారీ చేసిన జీవో నం.571 ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావు. ప్రజాస్వామ్య విధానాలకు, చట్టాలకు లోబడి పని చేయాలి. గీతం వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
హెరిటేజ్ పాల కంటే విశాఖలో భూమి ధర తక్కువ: కన్నబాబు
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కూటమిగా ముఠా కట్టి.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే భూమి ధర ఎలా తక్కువగా ఉందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి నేతలు ప్రజలను సూపర్ మోసం చేశారు. చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకం ఒక్కటే. ప్రైవేటు వాళ్లకి దోచిపెట్టడం. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే విశాఖపట్నంలో ఎకరా భూమి ధర తక్కువ. సామాన్యులను వదిలేసి కార్పొరేట్ల కోసం పనిచేసే వాళ్ళని దావోస్ మ్యాన్ అంటారు. దావోస్లో కూటమి నేతలు కలరింగ్ ఇస్తున్నారు.భూములు ప్రజా సంపద. చంద్రబాబు.. విశాఖ భూములు ఏమైనా మీ బాబు గారి సొమ్మా?. భూములున 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి?. విశాఖపట్నం భూములు పప్పు బెల్లాల్లా పంచుతున్నారు మరి అమరావతి భూములు ఎందుకు ఇవ్వరు?. చెప్పింది ఆచరించటం, చేసేదే చెప్పడం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధాంతం. మాట నిలబెట్టుకోవడం కోసం కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు. కూటమి ముఠా చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారు. -
కేకే లైన్ను విశాఖ డివిజన్లో కొనసాగించాల్సిందే: కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసినా సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్లో కలుపుతుంటే ముగ్గురు కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని కెకె రాజు మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే కూటమి ప్రభుత్వ ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను విడతలవారీగా ప్రైవేటు పరం చేస్తున్నారని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు.కేంద్రంలో చక్రం తిప్పుతానని, డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ చంద్రబాబు చేతులెత్తేశాడని ఆయన ధ్వజమెత్తారు. త్వరలోనే కేకే లైన్ను విశాఖ డివిజన్లో కలిపేలా వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే కూటమి నాయకులు కలిసి రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉత్తరాంధ్రకు ద్రోహంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. విశాఖలోని వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెడుతూ ఒకపక్క, కేంద్రం నుంచి సాధించాల్సిన ప్రాజెక్టుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ మరోపక్క ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని పణంగా పెడుతున్నాడు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేసేలా కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు. స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదుటనే చెప్పారు.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తిగా అటకెక్కించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని విడతల వారీగా ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు అంగీకరించాడు. విశాఖ మెట్రో ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారు. ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరించారు. మాది డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నా, కూటమి వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని బాకాలు ఊదుతూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నాడు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిని పట్టించుకోరనే కుట్రతో చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచీ ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తున్నాడు. విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు. రైల్వే జోన్ విభజనతో ఈ విషయం మరోసారి రుజువైంది.ఉత్తరాంధ్రకు తీరని నష్టంవిశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటుతో రాష్ట్ర ప్రయోజనాల సాధనలో సీఎం చంద్రబాబు వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసినా సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు చోద్యం చూస్తూనే ఉన్నారు. అరకుతోపాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ను విశాఖ జోన్ కోల్పోయినా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖ రైల్వే జోన్ను కేంద్రం ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోలేదు.రైల్వే ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగా విశాఖ రైల్వే డివిజన్కి తీరని అన్యాయం జరిగింది. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. ఈ రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. ఈ డివిజిన్లు విభజించిన విధానం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా ఎంపీలు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం దారుణం.నాడు వైఎస్సార్సీపీ ఒత్తిడితో విశాఖ రైల్వే జోన్వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని నాడు వైయస్సార్సీపీతోపాటు వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు డిమాండ్ చేశాయి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వైయస్సార్సీపీ హయాంలోనే రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో ప్రకటించింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస-కిరండోల్ సెక్షన్తోపాటు పలాస - ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించి ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో విశాఖ డివిజన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాకపోగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.ఉద్యమ కార్యాచరణతో ముందుకు..విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటాలు చేసింది. గతంలో మా పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కేకే లైన్తో కూడిన విశాఖ డివిజన్ ఏర్పాటుచేయడంతో పాటు రాయగడ డివిజన్లో కలిపిన ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ డివిజన్లోనే కొనసాగించేలా వైయస్సార్సీపీ పోరాడుతుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేకే లైన్ను విశాఖ డివిజన్లో చేర్చడానికి వైయస్సార్సీపీతో కలిసి ఉద్యమించాలి. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారమే రైల్వే జోన్ విషయంలో కేంద్రం ముందుకెళ్లాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై త్వరలోనే పక్కా ప్రణాళికలతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. -
సాక్షి ఎఫెక్ట్: దిగొచ్చిన ఏయూ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఏయూ హాస్టల్ విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఏయూ విద్యార్థుల ఆకలి కేకలపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు దిగొచ్చారు. ఫీజుతో సంబంధం లేకుండా భోజనం పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇవాళ(బుధవారం) ఉదయం నుంచి భోజనం పెడతామని సర్కులర్ విడుదల చేశారు. ఉదయం నుంచి మెస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో... విద్యార్థులు ఫీజులు చెల్లించలేదన్న నెపంతో ఏయూ పాలకులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజులుగా హాస్టల్ విద్యార్థులకు భోజనాలు పెట్టకుండా పస్తులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసిన వెంటనే చెల్లిస్తామని విద్యార్థులు వేడుకున్నప్పటికీ.. ఏయూ అధికారులు కనికరించ లేదు.ఫీజు చెల్లిస్తేనే భోజనాలు పెడతామని తెగేసి చెప్పి మెస్లకు తాళాలు వేశారు. దీంతో హాస్టల్స్ విద్యార్థులు మెస్ల వద్దకు వచ్చి గంటల తరబడి నిరీక్షించినా తెరవకపోవడంతో ఆకలితోనే వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఏయూ విద్యార్థుల ఆకలి కేకలపై సాక్షి మీడియా వరుస కథనాలు ఇవ్వడంతో అధికారులు దిగొచ్చారు.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులు హాస్టల్ ఫీజులు కట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత హాస్టళ్లకు వచి్చన విద్యార్థులకు ఏయూ అధికారులు షాక్ ఇచ్చారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం విద్యార్థులు మెస్లకు వెళ్లగా.. వాటికి తాళాలు వేసి ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి కూడా అలాగే ఉండడంతో వేలాది మంది పస్తులు పడుకోవాల్సి వచి్చంది. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. కనీసం 50 శాతమైనా ఫీజు కడితేనే భోజనాలు పెడతామని చెప్పి విద్యార్థుల చేతుల్లో అధికారులు స్లిప్పులు పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అప్పులు చేసి రూ.4 వేలు, రూ.5 వేలు చొప్పున చెల్లించారు. వీరికి మాత్రమే మంగళవారం మధ్యాహ్నం భోజనాలు పెట్టారు.ఇంకా 60 శాతం మంది ఫీజులు కట్టకపోవడంతో మెస్లోకి కూడా అనుమతించ లేదు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫీజులు కట్టలేదని రెండు రోజులుగా విద్యార్థులను పస్తులు వుంచడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోతే దానికి విద్యార్థులు బలైపోవాలా అని ప్రశ్నించారు. -
టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ రుణాలు మంజూరు అయ్యేవి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్గా ఏపీని మార్చారు.కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాధాకృష్ణపై బాబు ప్రేమ రూ.15 కోట్ల విలువైన భూమి
-
ఆంధ్రా యూనివర్సిటీలో ఆకలి మంటలు..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. హాస్టల్ మెస్కు తాళాలు వేసిన అధికారులు.. నిన్నటి నుంచి విద్యార్థులకు హాస్టల్లో విద్యార్థులకు భోజనం పెట్టలేదు. ఫీజు చెల్లిస్తేనే మెస్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు కడితేనే మెస్ ఓపెన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని క్రూరమైన చర్యగా ఎస్ఎఫ్ఐ ప్రకటించింది.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ఫీజులు చెల్లించలేని దుస్థితిలో విద్యార్థులు ఉన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్ట వేసాయి. తక్షణమే సమస్యలు పరిష్కరించాలి హాస్టల్ మెస్లను యథావిధిగా కొనసాగించాలి’’ అని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. -
చంద్రబాబూ.. ఇదేం పాలన..?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది ఏ వర్గానికి సంక్రాంతి పండగ సంతోషం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పండగ ముందే మద్యం ధర పెంచారు.. భూముల విలువ కూడా పెంచేశారు.. భూములు కొనాలంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికీ యూరియా అధిక ధరకే దొరుకుతుంది’’ అంటూ మండిపడ్డారు.‘‘విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 5వేల 600 కోట్ల బకాయిలు ఉన్నాయి. రెండు నెలల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జీతాలు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కిపోయిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ప్రాజెక్ట్ వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. గ్రీన్ కో కంపెనీకి అభినందనలు. మేము పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేము భూములు ఇవ్వలేదు’’ అని బొత్స పేర్కొన్నారు...ఈ రెండేళ్లలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది?. ప్రభుత్వం నుంచి ఎవరైనా సమాధానం చెప్పండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. గతంలో ఎప్పుడైనా గ్రామ బహిష్కరణ ఉందా..?. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?. ఊరిలోకి వస్తే మనుషుల్ని చంపేస్తారా..?. దహన సంస్కారాలకు వెళ్లాలంటే ఆధార్ కార్డులు చూపించి వెళ్ళాలా?. పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా. ఇలాంటి ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదు...సాల్మన్ హత్య అత్యంత దారుణం. ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లి లాంటిది అని ప్రధాని మోదీ అంటున్నారు.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..?. ప్రధాని రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై కూడా స్పందించాలి. కూటమి పాలనలో ఏమి జరుగుతుందో ప్రధాని తెలుసుకోవాలి. సాల్మన్ హత్య అత్యంత దారుణం.. తీవ్రంగా ఖండిస్తున్నాం.. చంద్రబాబు.. ఇదేనా పరిపాలన..?..ఏం చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నావ్.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్యులకు ఎక్కడా మేలు చేయడం లేదు. వైఎస్సార్ సంక్షేమ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. సంక్రాతి మూడు రోజులు.. ఏ టీవీ చూసినా.. కోడి పందాలే. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. పరిశ్రమలతో మా హయాంలో జరిగిన ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవే ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి’’ అని బొత్స చెప్పారు. -
కాళ్ల పారాణి ఆరకముందే..
విశాఖపట్నం: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్పై చోటుచేసుకుంది. పండగ ఆనందాలు మిగలాల్సిన ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీ కాలనీకి చెందిన మువ్వ నారాయణ రావు కుమార్తె రమా హిమజ (27)కు, గత ఏడాది నవంబర్లో ఎంవీవీ వినీష్తో వివాహం జరిగింది. హైదరాబాద్లో నివాసముంటున్న ఈ నూతన దంపతులు తొలి పండగ కోసం విశాఖ వచ్చారు. నాలుగు రోజులు కుటుంబంతో సంతోషంగా గడిపిన వీరు, శుక్రవారం కారులో అన్నవరం వెళ్లారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, అదే రోజు రాత్రి తిరిగి విశాఖ బయలుదేరారు. మరో పావు గంటలో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో.. ఎన్ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై కారు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి రోటరీ డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాద తీవ్రతకు భయపడి తీవ్ర ఆందోళనకు గురైన హిమజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆమెను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. మృతురాలి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శంకర నారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
సమైక్యతను చాటిన బొడ్డేడ కుటుంబం
అనకాపల్లి జిల్లా: సంప్రదాయాలను కొనసాగిస్తూ నూతన తరాలకు సమైక్యతల విలువలను నేర్పుతూ ఒకే కుటుంబానికి చెందిన 60 మంది సభ్యులు ఒకేచోటకి చేరారు. ఒకే ఆకులో సహపంక్తి భోజనం చేసి సమైక్యతకు ప్రత్యేకగా నిలిచింది బొడ్డేడ కుటుంబం. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలేనికి చెందిన సుంకరమెట్ట సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి కుటుంబీకులు ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. ఏటా మాదిరిగానే సంక్రాంతి రోజు ఒకే ఆకుపై భోజనం చేసి సమైక్యతను చాటుకున్నారు. ఐదు దశాబ్దాలుగా కుటుంబ పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కనుమ పండుగ రోజు గవరపాలెం చేరుకుంటారు. తమ పూర్వీకుల నివాసమైన అనకాపల్లిలో ఆనందంగా పండగ చేసుకుంటారు. -
జనాల్లోకి దూసుకెళ్లిన గుర్రం, ఎడ్ల బండి
విశాఖపట్నం జిల్లా: మండలంలోని అనంతవరంలో శుక్రవారం గుర్రపు, ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో ఓ గుర్రం, మరో ఎడ్ల బండి గాడితప్పి జనాల్లోని దూసుకు పోవడంతో నలుగురు గాయపడ్డారు. ఈ పందాలకు విజయనగరం జిల్లా జామి మండలం అలమండ, కొట్యాడ, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి తదితర ప్రాంతాల నుంచి పది గుర్రాలు, విజయనగరం జిల్లా కొట్టాం, బోనంగి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి 12 ఎడ్లు బళ్లు వచ్చాయి. ముందుగా గుర్రపు పందాలు ప్రారంభించారు. నాలుగు గుర్రాలు బాగానే లంకించాయి. ఐదో గుర్రాన్ని పందెంలోకి దించారు. కొద్దిగా ముందుకు పరుగు తీసి జనాల్లోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో గుర్రం పైన కుర్చున్న దేవరాపల్లికి చెందిన నవీన్కు, పందాలను తిలకించేందుకు వచ్చిన అన్నవరానికి చెందిన జి.ఎర్నిబాబు(53) కుడికాలి మోకాలు భాగంలో గాయాలయ్యాయి. ఎడ్ల బండ్ల పందాలు ట్రైల్ రన్ చేస్తుండగా జోడెద్దులు బండితో పాటు జనాల్లోకి దూసుకు వెళ్లాయి. ఈ సంఘటనలో అనంతరం పంచాయతీ గొల్లలపాలేనికి చెందిన చందక శ్రావణి(33), అల్లబోని పైడమ్మ(49) గాయపడ్డారు. 108 ఈఎంటీ తిరుపతి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. -
నాటుకోడికి కనుమ గిరాకీ
విశాఖపట్నం: కనుమ పండగ నాటుకోడికి గిరాకీ తెచ్చింది. సాధారణ రోజుల్లో బ్రాయిలర్ కోడి మాంసం తిని విసిగిపోయిన జనం.. శుక్రవారం కనుమ రోజున నాటు కోళ్ల సంతకు పరుగులు తీశారు. దీంతో అక్కడ కోళ్లకు గిరాకీ పెరిగింది. జాతీయరహదారి పక్కన డెయిరీఫారం వద్ద నిత్యం నాటుకోళ్ల బజారు జరుగుతుంది. ఇక్కడకు తగరపువలస, ఆనందపురం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతాల నుంచి నాటుకోళ్లను వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొన్నేళ్లగా సంక్రాంతి సందర్భంగా కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో నాటు కోడి కిలో రూ.600 ఉండే ధర ఇప్పుడు రూ.800కు పెరిగిపోయింది. ఇది కేవలం లైవ్ ధర. డ్రస్డ్ నాటుకోడి మాంసమైతే మటన్ ధర కంటే ఎక్కువేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా కొనుగోలుదార్లు వెనక్కి తగ్గకుండా నాటుకోడివైపే మొగ్గు చూపారు. ఇక్కడ కనుమ రోజున 700కు పైగా కోళ్ల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు తెలిపారు. బ్రాయిలర్ కోడి మాంసం కూడా కిలో రూ.300 దాటడం కూడా నాటుకోళ్ల గిరాకీకి కారణమని చెప్తున్నారు. -
నార్వే చిన్నది.. వైజాగ్ చిన్నోడు..
విశాఖపట్నం: ప్రేమకు దేశాలు, సరిహద్దులు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. ఏడు సముద్రాల అవతల పుట్టిన ఓ యువతి, మన వైజాగ్ కుర్రాడి ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం వీరి నిశి్చతార్థం అత్యంత వైభవంగా జరిగింది. నార్వేలో చిగురించిన ప్రేమ ఎన్ఏడీ జంక్షన్ శాంతినగర్(అంబేడ్కర్ నగర్)కు చెందిన గొట్టిపల్లి జ్ఞాన్ ప్రకాష్ కుమారుడు సైమన్ 2016లో ఉద్యోగ రీత్యా నార్వే వెళ్లారు. అక్కడ ఓ బ్యాంకులో ఉద్యోగిగా స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్గా పనిచేస్తున్న తూరాతో సైమన్కు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట నార్వేలో జరిగిన ఓ మ్యూజిక్ క్విజ్లో తొలిసారి కలుసుకున్న వీరి పరిచయం ప్రేమగా మారింది. తూరాలోని స్వచ్ఛమైన నవ్వు, స్వేచ్ఛా భావాలు సైమన్ను ఆకట్టుకోగా, సుమారు రెండేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పగా, ఇరు కుటుంబాలు సానుకూలంగా స్పందించాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ, నార్వే కుటుంబ వ్యవస్థకు దగ్గరగా ఉంటుందని, ఇక్కడి వారిలో కనిపించే ప్రేమ, ఆప్యాయతలు తమకు ఎంతగానో నచ్చాయని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో చూడాలన్న ఆశతో, తొలి బహుమతిగా చీరను అందించానని వరుడి తండ్రి జ్ఞాన్ ప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు. వంటకాలు అదిరిపోయాయ్.. ఈ వేడుకకు హాజరైన నార్వే అతిథులు భారతీయ వంటకాలు ‘యమ్మీ’ అంటూ లొట్టలేశారు. చీరకట్టులో భారతీయ స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారని, ఇక్కడి వారి మర్యాదలు, ఆప్యాయమైన పలకరింపులు తమను మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని నూతన జంట ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, బీఎస్ కృష్ణ తదితరులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. -
ఆదివాసీకి ఎంత కష్టం.. ఎంత కష్టం
మహారాణిపేట: నిరుపేద ఆదివాసీ మహిళ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు వారి కుటుంబం నరకయాతన అనుభవించింది. అంబులెన్సులు అందుబాటులో లేక దాదాపు రెండు రోజులు నానా ఇబ్బందులు పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం నిర్మతి గ్రామానికి చెందిన కూడ రత్నకుమారి (34)కి ఈ నెల 6వ తేదీన చెట్టు మీద పడడంతో తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా గురువారం తెల్లవారుజామున చనిపోయింది. మెడికో లీగల్ కేసు కావడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శవ పంచనామా చేయడానికి పోలీసులు 24 గంటల తర్వాత శుక్రవారం ఉదయం వచ్చారు. వారు నివేదిక ఇచ్చాక పోస్టుమార్టం పూర్తయింది.36 గంటల పాటు మార్చురీ వద్ద మృతురాలి కుటుంబం పడిగాపులు కాసింది. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 4.15కు రత్నకుమారి మృతదేహాన్ని రమేష్కు అప్పగించారు. సుదూరాన ఉండే తమ గ్రామానికి రత్నకుమారి మృతదేహాన్ని తరలించడానికి తిప్పలు పడ్డారు. సంక్రాంతి కావడంతో కేజీహెచ్ సిబ్బంది, అధికారులు ఫోన్లకు అందుబాటులోకి రాలేదు. రత్నకుమారి భర్త రమేష్ రెండు రోజుల పాటు అందరినీ బతిమాలుకున్న వైనం చూపరులను కదిలించింది. ప్రైవేట్ అంబులెన్సుల వారు రూ.20 వేల వరకు అడిగారు. అంత మొత్తం భరించలేక బాధితులు కన్నీరుపెట్టుకున్నారు. కేజీహెచ్ ఎస్టీ సెల్ ఏర్పాటు చేసిన వాహనంలో బయలుదేరారు. 6 గంటలు ప్రయాణించి పొద్దుపోయాక రమేష్ ఇంటికి చేరాడు.అందుబాటులో లేని వాహనాలు..కేజీహెచ్లో గిరిజనుల కోసమే రెండు అంబులెన్సులను ప్రత్యేకించారు. కానీ, వీటిలో ఒకటి రిపేరులో ఉంది. మరొకటి అందుబాటులో లేదు. ఈ వాహనానికి డ్రైవర్ లేరని సమాచారం. గిరిజనుల కోసం, ముఖ్యంగా దూరప్రాంతాల వారి కోసం ప్రత్యేకంగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
విశాఖలో మాంజా టెర్రర్
విశాఖ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎగురేసే గాలిపటాల కారణంగా మాంజా(అత్యంత పదునుగా ఉండే దారం) దడపుట్టిస్తోంది. ఈ మాంజా బారిన పడి అనేక మంది గాయాల బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో మాంజా కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఉదంతం వెలుగుచూసింది. మాజీ సైనిక ఉద్యోగి నోటిని మాంజా కోసేసింది. మాంజా దారం తగిలి వెంకట్రావు అనే మాజీ సైనికోద్యోగి గాయపడ్డారు. రెండు పెదవుల మధ్య తీవ్ర గాయమైంది. దాంతో తీవ్ర రక్త స్రావంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నోటికి రుండు వైపులా కుట్ల వేసేంతంగా గాయమైంది. మధురవాడలో బైక్ పై కొడుకుతో కలిసి ప్రయాణిస్తుండగా ఇది చోటు చేసుకుంది. తెలంగాణలో ఘటనలుజనవరి 13 వ తేదీన ఓ పోలీసు అధికారి విధుల్లో భాగంగా బైక్పై వెళ్తుండగా మెడకు చైనీస్ మాంజా తగిలి తీవ్ర గాయపడ్డాడు. రక్తస్రావం ఎక్కువగా జరిగి ఆసుపత్రికి తరలించారు.నిజామాబాద్: ఒక రైతు గాలిపటాల దారంలో చిక్కుకుని తీవ్ర గాయపడ్డాడు.మాంజా వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఘటనలుసంక్రాంతి సీజన్లో: చైనీస్ మాంజా కారణంగా పదుల సంఖ్యలో గాయాలు నమోదయ్యాయి.పోలీసుల చర్యలు: "సీజ్ ది కైట్" ఆపరేషన్లో మాంజా విక్రయాలు, వినియోగంపై కేసులు నమోదు చేశారు. కానీ అమలు కఠినంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.ప్రమాదాల తీవ్రతగాజు పొడి, లోహపు పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మాన్ని, గొంతును కోసేంత పదునుగా ఉంటాయి.ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు.నిషేధం ఉన్నప్పటికీ: మార్కెట్లో మాంజా సులభంగా లభిస్తోంది. పోలీసులు అరెస్టులు చేసినా, వినియోగం తగ్గడం లేదు -
భర్త ఆశయం కోసం అక్షయపాత్ర పట్టిన ఇల్లాలు
విశాఖపట్నం: తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి అంటేనే హరినామ స్మరణ. నెల రోజుల పాటు సాగే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో అక్షయపాత్రను నెత్తిన మోస్తూ, చిడతల సవ్వడితో, తంబురా మీటుతూ వచ్చే హరిదాసులను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. తరతరాలుగా పురుషులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఈ పవిత్ర వృత్తిలో, విధి ఆడిన వింత నాటకంలో ఒక సామాన్య మహిళ ‘హరిదాసి’గా మారి అరుదైన బాటను ఎంచుకుంది.. విశాఖకి చెందిన కందుల నాగమణి. భర్త మరణానంతరం ఆయన వదిలివెళ్లిన భక్తి వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ఆమె చేస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. భక్తి సామ్రాజ్యంలో ... సాధారణంగా హరిదాసులంటే కాషాయ వస్త్రాలు, నుదుట తిరునామాలు, తలపై అక్షయపాత్రతో కనిపిస్తారు. ఇది పురందరదాసు, కనకదాసుల కాలం నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయం. హరిదాసుల గానామృతం కేవలం ఆధ్యాతి్మక చింతననే కాకుండా, సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇన్నాళ్లూ పురుషులకే పరిమితమైన ఈ రంగంలోకి నాగమణి అడుగుపెట్టడం వెనుక ఒక కన్నీటి గాథ, అంతకు మించిన గుండె నిబ్బరం ఉన్నాయి. జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని సాయిరామ్నగర్లో నివసించే నాగమణి భర్త కందుల చంద్రం, గతంలో బ్రాండిక్స్ కంపెనీలో బస్సు డ్రైవర్గా పని చేస్తూనే, ఏటా ధనుర్మాసంలో హరిదాసుడుగా మారి భక్తిని పంచేవారు. భర్త కీర్తనలు పాడుతుంటే పరవశించిపోయే నాగమణి, ఆయనతో పాటే ఆ ఆధ్యాత్మిక గీతాలను నేర్చుకుంది. 2018లో గుండెపోటుతో చంద్రం మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అధైర్యపడని ఆత్మవిశ్వాసం భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కానీ నాగమణి కుంగిపోలేదు. భర్త పనిచేసిన కంపెనీలోనే స్టిచింగ్ ఆపరేటర్గా చేరి పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కుమార్తె చంద్రిక పదో తరగతి, చిన్న కుమార్తె వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అయితే కేవలం ఆర్థిక అవసరాలే కాకుండా, తమకు మగపిల్లలు లేరనే వెలితి రాకూడదని, తన భర్త కొనసాగించిన కులవృత్తి ఆగిపోకూడదని నాగమణి దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ సంకల్పమే ఆమెను ‘హరిదాసి’గా మార్చింది. తన భర్త గతంలో ఏ ఏ వీధుల్లో అయితే హరినామ స్మరణ చేశారో, సరిగ్గా అదే ప్రాంతాల్లో ఇప్పుడు నాగమణి తంబురా పట్టుకుని కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపిస్తున్నారు. కఠినమైన నిష్ట.. నిరంతర నామస్మరణ ధనుర్మాసం మొదలవగానే నాగమణి దినచర్య ఎంతో కఠినంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, స్నానపానాలు ముగించుకుని, దైవ ప్రార్థన అనంతరం హరిదాసి వేషధారణలో సిద్ధమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విరామం లేకుండా సాయిరామ్నగర్, మురళీనగర్, పట్టాభిరెడ్డి గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో కీర్తనలు పాడుతూ భక్తులను ఆశీర్వదిస్తోంది. హరిదాసుల సంప్రదాయం ప్రకారం తలపై ఉన్న అక్షయపాత్రను ఇంటికి వెళ్లే వరకు కింద పెట్టకూడదు. ఒకవేళ భక్తులు ఇచ్చే బియ్యం, కానుకలతో పాత్ర నిండిపోతే, ఒక రాయిపై దించి సంచిలోకి మార్చుకుంటారు. తిరిగి ఇంటికి చేరుకున్నాకే అక్షయపాత్రను దేవుడి మూల ఉంచి, పూజ నిర్వహించి అప్పుడు భోజనం స్వీకరిస్తారు.చేయూత కోసం ఎదురుచూపు ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా నాగమణి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. సొంతంగా తంబురా కొనుగోలు చేసే స్తోమత లేక ఇతరుల నుంచి తీసుకుని వాడుతోంది. స్థానిక దాత పైలా దేముడు నాయుడు ఆమెకు 7 కేజీల రాగి పాత్రను బహూకరించి తన వంతు సాయం అందించారు. ‘భర్త నేరి్పన విద్యను, మా కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యం. పిల్లల చదువుల కోసం, నా వృత్తి కోసం ఎవరైనా దాతలు సహకరిస్తే కృతజ్ఞతతో ఉంటాను’ అని నాగమణి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు అంతరించిపోతున్న కళారూపాన్ని మహిళగా భుజాన మోస్తున్న నాగమణి నిజంగానే అభినందనీయురాలు. -
పట్టపగలే మహిళపై వ్యక్తి దాడి
అల్లిపురం (విశాఖ): విశాఖ జగదాంబ జంక్షన్లో పట్టపగలు బస్సుదిగి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై బలంగా కొట్టాడు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించాడు. ఈ హఠాత్పరిణామానికి హతాశురాలైన ఆమె హాహాకారాలు చేసినా స్థానికులు, పోలీసులు స్పందించకపోవడంతో తీవ్రంగా కలత చెందింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో బాధితురాలు తన ఆవేదనను వెలిబుచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె కథనం ప్రకారం.. మధురవాడకు చెందిన దేవి జగదాంబ జంక్షన్లో బస్సు దిగి నడిచి వెళ్తుండగా కనకమహాలక్ష్మి మాలధారణలో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె చెంపపై గట్టిగా కొట్టడంతో పాటు ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఈ దాడికి ఆమె కళ్లజోడు కిందపడి విరిగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే జగదాంబ సెంటర్లో ఈ ఘటన జరిగినప్పటికీ, స్థానికులు, పోలీసులు స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దిశ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు మానసిక రోగి అని పోలీసులు ముక్తాయింపునివ్వడం గమనార్హం.


