Trains
-
పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
న్యూఢిల్లీ: యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాగ్రాజ్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.తాజాగా దుర్గ్(ఛత్తీస్గఢ్) నుండి చాప్రా(బీహార్) వరకూ, అలాగే చాప్రా నుండి దుర్గ్ వరకు నడిచే సారనాథ్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ దుర్గ్-చాప్రా సారనాథ్ ఎక్స్ప్రెస్ను ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 21 వరకు రద్దు చేశారు. ఈ రైలు ప్రయాగ్రాజ్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీంతో ప్రయాగ్రాజ్కు వెళదామనుకున్న ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ రైలు ద్వారా ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారి డబ్బును రైల్వేశాఖ వారి ఖాతాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాగ్రాజ్లో భారీ రద్దీని తగ్గించడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇదేవిధంగా రైలు నంబర్ 55098/55097 గోరఖ్పూర్-నర్కటియగంజ్ ప్యాసింజర్ రైలును ఫిబ్రవరి 23 వరకు రద్దుచేశారు. అలాగే రైలు నంబర్ 15080 గోరఖ్పూర్-పాటిలీపుత్ర ఎక్స్ప్రెస్ కూడా ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు. మహాశివరాత్రికి ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకున్న భక్తులకు ఈ వార్త షాక్లా తగిలింది. మరోవైపు జయనగర్ నుండి ప్రయాగ్రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రూట్ను మార్చారు. ఈ రైలు ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్ళదు. బీహార్, ఛత్తీస్గఢ్ల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివెళుతున్నారు. దీంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది.ఇది కూడా చదవండి: రిస్క్లో కుంభమేళా మోనాలిసా? -
లక్షలాది జనం.. రవాణా ఘోరం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది. మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి. 30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్రాజ్కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. -
Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్రాజ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రతి స్టేషన్లో తాగునీరు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి అందిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
Bangladesh: సమ్మెకు దిగిన రైల్వే సిబ్బంది.. కదలని రైళ్లు
ఢాకా: బంగ్లాదేశ్లో రైల్వే సిబ్బంది సమ్మెతో ఈరోజు (మంగళవారం) రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులు ఓవర్ టైం పనికి తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రైల్వే సిబ్బంది సమ్మె ప్రభావం లక్షలాది మంది ప్రయాణికులపై పడింది.పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఓవర్ టైం పనికి ప్రయోజనాలు కల్పించాలని కోరూతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. ఈ సమ్మె దాదాపు 400 ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు 2,50,000 మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా హింస కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
ఈసారైనా నమో భారత్ రైలొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్.. సమీప నగరాలను, పట్టణాలను చుట్టేసే ఇంటర్ సిటీ రైలు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం హైదరాబాద్ ఎదురుచూస్తోంది. గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లను, హైదరాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోనూ అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది. వందేభారత్ తరహాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు, గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని మొదట వందే మెట్రో రైళ్లుగా పిలిచారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైళ్లుగా పేరు మార్చారు. అహ్మదాబాద్–భుజ్ స్టేషన్ల మధ్య మొట్టమొదటి నమో భారత్ రైలు పట్టాలెక్కింది. గత సంవత్సరమే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయని భావించినా వీలు కాలేదు. వచ్చే బడ్జెట్లో అయినా మనకు వీటిని కేటాయిస్తారని ప్రజలు ఆశపడుతున్నారు.సామాన్యుల రైళ్లు..నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 250 కిలోమీటర్ల దూరం వరకు నడపాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, భద్రాచలం, కర్నూల్, మహబూబ్నగర్, గజ్వేల్, వికారాబాద్, తాండూర్తోపాటు ప్రస్తుతంఇంటర్ సిటీ రైళ్లు నడుస్తున్న సికింద్రాబాద్–విజయవాడ మధ్య కూడా ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. గతంలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలోనూ ఇంటర్ సిటీ రైళ్లుగా వీటిని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు వీటిని నడపడం వల్ల ప్రజలు తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. కాజీపేట – సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ఇంటర్ సిటీ లేదా మెము ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని 12 సంవత్సరాల క్రితం ప్రతిపాదించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నమో భారత్ను ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా నడపాలనే డిమాండ్ ఉంది. సామాన్య, మధ్య తరగతివారికి ఉపయోగపడే తక్కువ దూరం నడిచే పుష్పుల్ మెము, ఇంటర్ సిటీ, నమో భారత్ ర్యాపిడ్, వందే సాధారణ్ (అమృత్ భారత్) ఎక్స్ప్రెస్లను ప్రారంభించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్–మనోహరాబాద్–కొత్తపల్లి రూట్లో రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి వెళ్లే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.స్టాండింగ్ జర్నీకి అవకాశం..ప్రస్తుతం ఎంఎంటీఎస్ వంటి లోకల్ రైళ్లు నడుస్తున్నట్లుగానే వందే మెట్రోలు రాకపోకలు సాగిస్తాయి. ఒక బోగీలో 100 మంది కూర్చొనే సదుపాయం ఉంటుంది. వీటిలో కనీసం 200 మంది నిలబడి ప్రయాణం చేయవచ్చు. ఆటోమెటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను నివారించే కవచ్ సాంకేతికతతో వీటిని అనుసంధానం చేశారు. ప్రతి బోగీలో సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత లభిస్తుంది. -
‘ఆపుకోలేని’ ఆవేదన!
రైలింజన్లలో వాష్రూంలు లేక మహిళా లోకోపైలట్ల యాతనఒక్కసారి ఊహించుకోండి.. మీరు బిజీ సెంటర్లో ఉన్నారు. చాలా అర్జెంటు.. ఎక్కడా వెళ్లే పరిస్థితి లేదు. మీకెలా అనిపిస్తుంది? నరకయాతన కదూ.. ఒక్క రోజుకే మన పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో రైళ్లను నడిపే మహిళా లోకోపైలట్లు రోజూ ఈ నరకయాతనను అనుభవిస్తున్నారు. అదీ ఎన్నో ఏళ్లుగా.. దేశవ్యాప్తంగా..లోకోపైలట్లు 86,000దక్షిణమధ్య రైల్వేలో 12,000మహిళలు 3,000 మహిళలు 500భారతీయ రైల్వే.. గతంతో పోలిస్తే ఎంతో మారింది. మన రైళ్లలోనూ ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే రైళ్లను నడిపే లోకోపైలట్లకు కనీస సదుపాయమైన వాష్రూం మాత్రం నేటికీ అందు బాటులోకి రాలేదు. వీటిని ఏర్పాటు చేయాలని 2016లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా.. నేటికీ అది సాకారం కాలేదు. దీంతో చేసేది లేక.. కొందరు మహిళా లోకోపైలట్లు అడల్ట్ డైపర్లు వాడుతున్నారు.. మరికొందరు డ్యూటీకెళ్లేటప్పుడు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.మా సమస్యను పట్టించుకునేవారేరి?వాష్రూం లేకపోవడం వల్ల స్త్రీ, పురుష లోకోపైలట్లు ఇద్దరికీ ఇబ్బంది అయినా.. తమ సమస్యలు వేరని తమిళనాడుకు చెందిన సీనియర్ మహిళా లోకోపైలట్ ఒకరు చెప్పారు. ‘మెయిన్ జంక్షన్లలో తప్పితే.. చాలా స్టేషన్లలో 1–5 నిమిషాలు మాత్రమే రైలును ఆపుతారు. ఆ టైంలోనే వెనుక ఉన్న బోగీకి లేదా స్టేషన్లోని వాష్రూంకు వెళ్లి.. పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి తిరిగి రాకపోతే.. ట్రైన్ నిర్ణిత సమయం కన్నా ఎక్కువ సేపు ఆగితే.. వివరణ ఇచ్చుకోవాలి.దాని కన్నా.. వెళ్లకపోవడమే బెటరని చాలామంది భావిస్తారు’అని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల వల్ల తాను కూడా మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్ బారిన పడ్డానని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకునేవారేరి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా.. ఒకసారి ఇంజన్ క్యాబిన్లోకి ప్రవేశిస్తే విధులు ముగిసేవరకు బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే వాకీటాకీల్లో పై అధికారులకు సమాచారం అందజేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మహిళా లోకోపైలట్లు చెబుతున్నారు.పైగా కొన్ని చోట్ల స్టేషన్లు చాలా ఖాళీగా ఉంటాయి. అలాంటి స్టేషన్లలో వాష్రూంను వినియోగించడమంటే తమ భద్రతను పణంగా పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎనిమిది గంటల డ్యూటీ అంటారు. కానీ ఒక్కసారి బండెక్కితే పదకొండు గంటలు దాటిపోతుంది.అప్పటి వరకు ఆపుకోవాల్సిందే’అని దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ఒక సహాయ మహిళా లోకోపైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రాన్ని ఆపుకోవడం లేదా నీళ్లు తక్కువగా తాగడం వల్ల మహిళల్లో మూత్రనాళం, కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఇది ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ శాంతి రవీంద్రనాథ్ హెచ్చరించారు.రైలు నడుపుదామనుకున్నా.. కానీ.. ⇒ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది లోకో పైలట్ అవ్వాలని వచి్చ.. డెస్క్ జాబ్లో సర్దుకుంటున్నారు. .. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉండేది. లోకో పైలట్ క్వాలిఫై అయి ఐదేళ్లయింది. వాష్రూం లేని చోట పనిచేయడం ఇబ్బందని.. డెస్క్ జాబ్ చేస్తున్నాను’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ చెప్పారు. తాను లోకోపైలట్ అయినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యానని.. అయితే మహిళలు శానిటరీ న్యాప్కిన్లు ధరించి డ్యూటీకి రావాల్సిన దుస్థితిని కల్పిస్తున్న ఇలాంటి పని వాతావరణంలోకి రావడానికి ఎందరు ఇష్టపడతారని ఓ లోకోపైలట్ ప్రశ్నించారు.నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు పడలేక.. సెలవు పెట్టడమే బెటరని భావిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్ డ్యూటీలు చేయలేని వాళ్లకు స్టేషన్డ్యూటీలు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు అంతగా ఇవ్వడం లేదు. ప్రెగ్నెన్సీతో విధులకు హాజరయ్యే మహిళలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నారు. ‘గతంలో చాలాసార్లు స్టేషన్ డ్యూటీ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కావడం వల్ల స్టేషన్ డ్యూటీ ఇచ్చారు’అని సికింద్రాబాద్కు చెందిన రేవతి చెప్పారు. చేస్తామని చెప్పి.. చేయలేదురైలింజన్లలో వాష్రూంలు లేకపోవడంపై ద ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ వర్మ అప్పట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. దీంతో ప్రతి ఇంజన్ క్యాబిన్లో ఏసీ సదుపాయంతో పాటు వాష్రూమ్ను ఏర్పాటు చేయాలని హక్కుల కమిషన్ 2016లో ఆదేశించింది. దీనికి సమాధానంగా అన్ని రైళ్లలో వాష్రూంను ఏర్పాటు చేస్తామని రైల్వే చెప్పింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. దేశంలో కొన్ని డివిజన్లలోని ఇంజన్లలో వీటి ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. క్లీనింగ్ తదితర నిర్వహణ సమస్యలతోపాటు ఇంజిన్లోకి లోకోపైలట్ మినహా ఎవరినీ అనుమతించ రాదనే నిబంధనలు వంటి కారణాలతో దాన్ని అమలు చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఇది లోకోపైలట్ల కనీస హక్కులను హరించడమేనని అలోక్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం వస్తున్న వందేభారత్లలో ఈ సమస్య పెద్దగా లేదని చెప్పారు. మిగతావాటి పరి స్థితి ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, యూరప్, బ్రిటన్లలో లోకోపైలట్లకు ప్రతి 4 గంటలకు 20–25 నిమిషాల బ్రేక్ ఉంటుందని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్/సాక్షి, సెంట్రల్డెస్క్కమిటీ వేసినా.. ముందడుగు పడలేదు..రైలింజన్లలో వాష్రూంలు, సరైన విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు కల్పించాలని ఇప్పటికి అనేక సార్లు రైల్వేబోర్డుకు విన్నవించాం. 3 నెలల క్రితమే రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు. – మర్రి రాఘవయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) -
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు
-
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్న్యూస్.. 'జన సాధారణ్ అన్ రిజర్వ్డ్’ స్పెషల్ ట్రైన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.1) రైలు నంబర్ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15, 17 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు నంబర్ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.3) రైలు నంబర్: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదీ చదవండి: పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ4) రైలు నంబర్ (08537) విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్రిజర్వ్డ్ కోచ్లను అందుబాటులోకి తెచ్చింది.సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లుదక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా 16 జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలే ఈ జన సాధారణ రైళ్లలో వసూలు చేస్తామన్నారు. ఛార్జీల పెంపు భారీగా ఉండదు. ప్లాట్ ఫారమ్ చార్జీలు కూడా పెంచటం లేదు.చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ఈ సంక్రాంతికి నడపనున్నాం. సిటీ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి కొన్ని బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. చర్లపల్లి కాకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి’’ అని శ్రీధర్ వెల్లడించారు. -
పేదోడి రైళ్లకు సెలవు!
రాజంపేట: తిరుపతి– గుంతకల్ మధ్య ఉన్న రెండు వేర్వేరు మార్గాల్లో పేదోడి రైళ్లకు బ్రేక్ వేశారు. ఏకంగా రెండునెలలపాటు పల్లె రైళ్లకు రాబోయే కుంభమేళా–2025 (Maha Kumbh Mela 2025) నేపథ్యంలో సెలవు ఇచ్చేశారు. పేదవాడి కోసం ఉన్నదే ఒకరైలు, దానిని కూడా రద్దు చేశారు. దీంతో పేద ప్రయాణిక వర్గాల్లో రైల్వేబోర్డు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. దేశంలో ఎక్కడా రైళ్లు లేన్నట్లుగా రాయలసీమలో (Rayalaseema) ప్రతి గ్రామీణ రైల్వేస్టేషన్లో ఆగుతూ, పరుగులుతీసే పల్లెరైళ్లను కుంభమేళా–2025కు దారిమళ్లించడం ఇప్పుడు సీమలో వివాదాస్పదంగా మారుతోంది. దీంతో తిరుపతి–గుంతకల్ మధ్య వేర్వేరు రెండు రైలుమార్గాల్లో నడిచే పల్లె రైలును రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ సీవోఎం కె.మనికుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అడిగే నాథుడు లేన్నట్లుగా రైల్వే ఉన్నతాధికారులు గుంతకల్ డివిజన్ (Guntakal Division) పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వంపై పేదవర్గాల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో.. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే (07657/07658) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు. తక్కువ ధరతో గమ్య చేరడానికి పేదవర్గాలకు ఈరైలు అనుకూలంగా ఉంది. తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరుతుంది. ప్రతి గ్రామీణస్టేషన్లో ఆగుతుంది. దీనిని రద్దు చేయడంతో ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుంతకల్–తిరుపతి(ధర్మవరంలైన్)మార్గంలో.. గుంతకల్– తిరుపతి (ధర్మవరంలైన్) మార్గంలో 07589/07590 నంబరుగల తిరుపతి నుంచి కదిరి దేవరపల్లెకు నడిచే పల్లెరైలును కూడా రద్దు చేశారు. ఈ రైలు అనంతపురం, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేది. డివిజన్ కేంద్రం గుంతకల్కు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ప్యాసింజర్ రైలు నడిచేది. ఈ రైలు కూడా ఆ మార్గంలో ఉన్న పీలేరు, మదనపల్లె, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన పల్లె వాసులకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఆ రైలు రద్దు కావడంతో ఎక్స్ప్రెస్రైళ్లే దిక్కయ్యాయి రెండునెలలపాటు ప్రయాణానికి గ్రహణం కుంభమేళా–2025 కోసం రెండునెలల పాటు తిరుపతి నుంచి కడప మీదుగా, అటు ధర్మవరం మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల మీదుగా ఉండే రైలుమార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడి ప్రయాణించే వేలాదిమంది పేదలకు పల్లెరైళ్లను దూరం చేశారు. ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు ఏకంగా రెండు రైలుమార్గాల్లో ఆరు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే గ్రామీణులు ఇబ్బందులను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదన్న అపవాదును మూటకట్టుకుంది. రైల్వేబోర్డు కుంభమేళాకు రేక్స్ కేటాయించాలని కోరితే, దక్షిణమధ్య రైల్వే అధికారులు రాయలసీమలో పేదలకు అందుబాటులో ఉండే రైళ్లను కేటాయించడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇతర రైల్వేజోన్తోపాటు మరికొన్ని డివిజన్లలో రేక్ పొజిషన్ పుష్కలంగా ఉన్నప్పటికి ‘సీమ’పల్లెరైళ్లను కేటాయించారు. ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎంపీలు నోరుమెదిపే పరిస్థితిలో లేరని పేదప్రయాణికులు ఎద్దేవా చేస్తున్నారు. మార్చి 1వరకు పల్లె రైళ్లకు సెలవురైల్వేబోర్డు ఆదేశాలతో దక్షిణమధ్య రైల్వే వారు తిరుపతి–కదిరిదేవరపల్లె ప్యాసింజర్ రైలు, గుంతకల్–తిరుపతి ప్యాసింజర్రైలు, తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటి ఎక్స్ప్రెస్ రైలును వచ్చేయేడాది మార్చి01 వరకు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈరైళ్లు రెండు మార్గాల్లో కూడా నడవవు. సామాన్యుడు అంటే చిన్నచూపు పేదోడి రైళ్లను రద్దు చేస్తే అడిగేవారు లేరన్న ధీమాలో కేంద్రప్రభుత్వం ఉంది. ఎక్స్ప్రెస్రైళ్లలో జనరల్బోగీలు వేయడంలో రైల్వే వివక్షను ప్రదర్శిస్తోంది. ప్యాసింజర్రైళ్లు రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా రైళ్లను నడపాలి. సామాన్యుడు అంటేనే కేంద్రానికి చిన్నచూపు. – టీఎల్ వెంకటేశ్, సీపీఐ నేత, పీలేరుపేదలను ఇబ్బందులు పెట్టారు... తక్కువ ధరతో పల్లెవాసులకు అనుకూలంగా ఉన్న ఇంటర్సిటీ రైలును రద్దు చేయడం అన్యాయం. తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ వరకు పేదవర్గాలు తక్కువ వ్యయంతో వెళ్లే వారు. ఉన్న ప్యాసింజర్ రైళ్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్రైలును నడపాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలంటే మోదీ సర్కారుకు చిన్నచూపు. – పులివేల రమణయ్య, నాగిరెడ్డిపల్లె, నందలూరు -
ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలిచిన రైళ్లు.. కారణం ఇదే
సాక్షి, హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆదివారం పలు రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య రావడంతో హైదరాబాద్-నాగ్పుర్ వందే భారత్, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి పంపించారు.సింగరేణి ప్యాసింజర్ రైలు ఉప్పల్ స్టేషన్లో 20 నిమిషాలు ఆగిపోయింది. అలాగే, మెయిన్ లైన్లో గూడ్స్ రైలు కూడా నిలిచిపోయింది. సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్బోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైళ్లను పంపించిన అధికారులు, సిగ్నలింగ్ వ్యవస్థను సరి చేశారు.ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్ఫామ్పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి. -
పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశమంతా గత రెండు రోజులుగా తెల్లటి పొగమంచు కింద తలదాచుకుంటోంది. ఈరోజు (శుక్రవారం) మూడో రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెరిగిన చలికి తోడు పొగమంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో రవాణా సమస్య తీవ్రమయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలకు వరకూ కూడా విజిబులిటీ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా అమృత్సర్, చండీగఢ్, ఢిల్లీల నుండి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్వేపై చాలా తక్కువ విజిబులిటీ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. పొగమంచు కారణంగా లక్నో, చండీగఢ్లకు వచ్చే విమానాలను జైపూర్కు మళ్లించారు.ఇక రైళ్ల విషయానికొస్తే ఢిల్లీలోని వివిధ స్టేషన్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు, ఆనంద్ విహార్కు వచ్చే 10 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. ఈ రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా చదవండి: Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! -
కాజీపేటలోనే ఎంఎంటీఎస్ కోచ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్హెచ్బీ, వందేభారత్ కోచ్లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.తొలుత నెలకు 24 కోచ్ల ఉత్పత్తి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్లతో కూడిన రేక్స్ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్లోని మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.వందే భారత్కు డిమాండ్ పెరగటంతో..దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్లో వందే భారత్ కోచ్ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని నూజివీడు–వట్లూరు సెక్షన్లో జరుగుతోన్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం తెలిపారు.ఈ నెల 7, 8, 11, 12 తేదీల్లో ధన్బాద్–అలప్పుజ (13351), 7న టాటా–యశ్వంత్పూర్ (18111), సంత్రగచ్చి–సనత్నగర్ (07070), 8, 13 తేదీల్లో విశాఖ–విజయవాడ (08567), 8న టాటా–బెంగళూరు (12889), 11న హతియా–యర్నాకుళం (22837),12న హతియా–బెంగళూరు (12835) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. -
స్పీడ్ విజన్ కెమెరాలతో రైలు ప్రమాద కుట్రలకు చెక్
న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్లపై బరువైన వస్తువులు, సిలిండర్లు పెట్టి, రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వేశాఖ చెక్ పెట్టనుంది. ఇటువంటి దుశ్చర్యలను విఫలం చేసేందుకు రైల్వేశాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది.రైలు ప్రమాద కుట్రలను పసిగట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ (ఇంజిన్) ముందు, గార్డు క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలు అమర్చనున్నారు. దీంతో లోకోమోటివ్ పైలట్లు ట్రాక్పై అడ్డుగావున్న వస్తువును దూరం నుండే చూడగలుగుతారు. ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి. ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది.ఇటీవలి కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై భారీ వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాలను రైళ్లకు అమర్చాలని నిర్ణయించారు. ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు పంపారు. బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది. మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే, రైళ్లకు స్పీడ్ విజన్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది. ఇది కూడా చదవండి: ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా? -
ఆరు వందేభారత్లకు మోదీ పచ్చ జెండా
న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్బాద్లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుమొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. #WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK— ANI (@ANI) September 15, 2024 -
షార్ట్ సర్క్యూట్తో రైలును పేల్చేందుకు కుట్ర?
హర్దోయ్: కోల్కతా నుంచి అమృత్సర్ వెళ్తున్న దుర్గియానా ఎక్స్ప్రెస్ ఓహెచ్ఈ వైర్ను బలంగా తాకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన యూపీలోని హర్దోయ్లో చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో షార్ట్ సర్క్యూట్తో రైలును పేల్చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని లక్నో నుంచి బయలుదేరింది. ఉదయం ఐదు గంటలకు ఉమర్తాలి స్టేషన్ దాటిన వెంటనే ట్రాక్పై వేలాడుతున్న ఓహెచ్ఈ వైర్ను బలంగా తాగింది. వెంటనే పేలుడు సంభవించింది. దీంతో పైలట్ రైలును ఆపి ఉమ్రతాలి, దలేల్నగర్ స్టేషన్లకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత దుర్గియానా ఎక్స్ప్రెస్ బయలుదేరేందుకు అనుమతినిచ్చారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని, వందే భారత్లతో పాటు మరికొన్ని రైళ్లను మరో మార్గంలోకి మళ్లించారు. రెండు రైళ్లను రద్దు చేశారు.ఈ ఘటన దరిమిలా దుర్గియానా ఎక్స్ప్రెస్ రైలు విద్యుత్ కేబుల్ను బలంగా తాకడమనేది సహజంగా జరిగినది కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక లోపం కంటే ట్యాంపరింగ్కే ఎక్కువ అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ -
Vande Bharat: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. 👉స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్తో కనువిందు చేస్తోంది. 👉 ఇంటీరియర్ను జీఎప్ఆర్పీ ప్యానెల్తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. 👉 అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 👉 దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. 👉 ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్తో పనిచేస్తాయి. 👉 దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 👉 లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 👉 మొదటి శ్రేణి ఏసీ కోచ్లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 👉 కోచ్లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. 👉 అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. 👉 ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. 👉 సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు
సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీ్ధన్ (12643) యథావిధిగా పునరుద్ధరించారు.అలాగే సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలును రెండు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి నడిపారు. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదుగా, న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు. -
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
ఆ రైళ్లలో బెడ్రోల్స్ లేవు...
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు నడిపే స్పెషల్ రైళ్లలో బెడ్రోల్స్కు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న బెడ్ రోల్స్ సంఖ్య, వాటిని శుభ్రపరిచి తిరిగి అందించే లాండ్రీల సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడటమే దీనికి కారణం. రెగ్యులర్ రైళ్లు, సంవత్సరం పొడవునా నిర్వహించే సాధారణ స్పెషల్ రైళ్లకు ఇవి సరిపోతుండగా, ఉన్నట్టుండి వచ్చే రద్దీ ఆధారంగా నడిపే స్పెషల్ రైళ్లకు ఈ సమస్య ఏర్పడుతోంది. ఐదు రోజుల వరుస సెలవులతో.. పంద్రాగస్టు నేపథ్యంలో గురువారం దేశవ్యాప్త సెలవు ఉంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాకపోకలు బాగా పెరుగుతాయి. శనివారం వారాంతం కావటంతోపాటు ఆదివారం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో శనివారం ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉండనుంది. ఆదివారం ఎలాగూ సెలవు, ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి. సోమవారం రాఖీ పౌర్ణమి.. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో.. మరిన్ని స్పెషల్ రైళ్లు నడపాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 15 మంది పార్లమెంటు సభ్యులు విన్నప లేఖలు పంపారు. ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చి0ది. దీంతో అందుబాటులో రేక్స్ తక్కువగా ఉండటంతో.. కొన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. స్పెషల్ రైళ్లు ఇవే.. 18న నర్సాపూర్–సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్–నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ–తిరుపతి మధ్య వీటిని నడుపుతున్నారు. వీటన్నింటిలో ఏసీ కోచ్లున్నాయి. కానీ, వాటిల్లోని ప్రయాణికులకు బెడ్రోల్స్ను సర్దుబాటు చేయలేమని నిర్ణయించుకున్న దక్షిణ మధ్య రైల్వే, బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లలో బెడ్ రోల్స్ను సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రయాణికులే సొంత ఏర్పాట్లతో రావాలన్నది దాని పరోక్ష సారాంశం. -
సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి
రైళ్లలో జనరల్ బోగీలు చూడగానే కిక్కిరిసి ఉంటాయి. కూర్చోవడానికే కాదు.. నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. లగేజీ బెర్తు...వాష్రూమ్, ఫుట్బోర్డు ఇలా ఎక్కడచూసినా ఫుల్ రష్ కనిపిస్తుంది. గంటల తరబడి నిలబడటానికి ఇబ్బంది పడేవారు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్ల వద్ద కూడా కూర్చొనేవారు ఉన్నారు. వాస్తవానికి ఒక్కో జనరల్ బోగీలో కూర్చొని 75 మంది దాకా ప్రయాణించొచ్చు. కానీ ఏ జనరల్ బోగీ చూసినా... అందులో ప్రయాణించే వారి సంఖ్య 150 నుంచి 200 మంది పైనే ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్నగర్, వరంగల్, కామారెడ్డి, కాజీపేట రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొనేందుకు ‘సాక్షి ’క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకుంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్కు అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాదిమంది రెండు, మూడు బోగీల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ తదితర అన్ని రైళ్లలోనూ సాధారణ ప్రయాణికులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాదిమంది కార్మికులు హైదరాబాద్లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ఈ కార్మికుల కుటుంబాలు, బంధువులు నిత్యం తమ స్వస్థలాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేక, అందుబాటులో ఉన్న రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. తగ్గిన ప్యాసింజర్ రైళ్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్నింటిని ఎక్స్ప్రెస్లుగా మార్చారు. పదేళ్లు దాటినా ఇంటర్సిటీ రైళ్ల సంఖ్య పెరగలేదు. దీంతో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే రైళ్లలోనే సాధారణ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సుమారు 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్ రైళ్లు ఉంటే 150 వరకు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ 2 లక్షల మందికి పైగా సాధారణ ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రస్తుతం 24 బోగీలు ఉన్న ట్రైన్లలో 2 నుంచి 3 సాధారణ బోగీలు ఉండగా, 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలే ఉన్నాయి. ప్రయాణికులు మాత్రం వాటి సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఎలాగోలా ప్రయాణం ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్కు ముందు ఒకటి, వెనుక మరొకటి చొప్పున 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో బోగీలో కనీసం 250 మందికి పైగా ప్రయాణం చేస్తూ కనిపించారు. కొందరు బాత్రూమ్ వద్ద కిటకిటలాడుతుండగా, మరికొందరు పుట్బోర్డుపైన నిండిపోయారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. » కాజీపేట్, వరంగల్ స్టేషన్లలో సాధారణ బోగీల్లో ప్రయాణికుల దుస్థితిని పరిశీలించినప్పుడు, ఒక్క కోణార్క్ ఎక్స్ప్రెస్లోనే కాకుండా ఈస్ట్కోస్ట్, సంఘమిత్ర, గోరఖ్పూర్, సాయినగర్ షిర్డీ, కృష్ణా, మచిలీపట్నం, గౌతమి, గోదావరి, శాతవాహన, గోల్కొండ, ఇంటర్సిటీ, తదితర అన్ని రైళ్లలోను ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది. » కామారెడ్డి మీదుగా ఇటు సికింద్రాబాద్, అటు నాందేడ్, ముంబై, షిరిడీలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ 2 సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి. » సికింద్రాబాద్ నుంచి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్లోని 2 సాధారణ బోగీలు సికింద్రాబాద్లోనే కిక్కిరిసిపోతాయి. కానీ మిర్జాపల్లి, అక్కన్నపేటస్టేషన్, కామారెడ్డి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాందేడ్, ముంబయికి వెళ్లే ప్రయాణికులు దేవగిరి ఎక్స్ప్రెస్లోని సాధారణ బోగీలనే ఆశ్రయిస్తారు. దీంతో ఈ ట్రైన్ కామారెడ్డికి వచ్చేసరికి కాలు మోపేందుకు కూడా చోటు ఉండదు. అయినా సరే ముంబయికి ఉపాధి కోసం వెళ్లే కూలీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల రద్దుతో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్ఫుల్, ప్యాసింజర్ రైళ్లను తరచు రద్దు చేయడం వల్ల మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఒత్తిడి పెరుగుతోంది. మెయింటెనెన్స్ పనుల పేరిట వారం, పదిరోజుల పాటు రద్దు చేస్తున్నారు. మరోవైపు ఏ ట్రైన్ ఎప్పుడు, ఎందుకు రద్దవుతుందో కూడా తెలియదు. దీంతో రోజువారీ ప్రయాణం చేసే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు, వివిధ వర్గాలకు చెందినవారు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల వల్ల సాధారణ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడమే ఇందుకు కారణం. ‘ఒక నెలలో పుష్ఫుల్ రైళ్లు 20 రోజులునడిస్తే కనీసం 10 రోజులు రకరకాల కారణాలతో రద్దవుతున్నాయని తాండూరుకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు కోవిడ్ అనంతరం చాలా వరకు పుష్ఫుల్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చారు. సాధారణ బోగీల సంఖ్యను పెంచకుండా చార్జీలు మాత్రమే పెంచారు. » మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, తదితర స్టేషన్ల నుంచి సుమారు 1000 మందికి పైగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. కానీ మహబూబ్నగర్ నుంచి కాచిగూడకు రాకపోకలు సాగించే డెమో ట్రైన్ తరచు రద్దవుతోంది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతకాలంగా 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని , దీంతో సకాలంలో హైదరాబాద్కు చేరుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోగీలు పెంచడమే పరిష్కారం అన్ని ప్రధాన రైళ్లలో సాధారణ బోగీలను 2 నుంచి 4కు పెంచనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ స్పష్టం చేసింది. కానీ దక్షిణమధ్య రైల్వేలో ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగైదు రైళ్లలో మాత్రమే బోగీల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు. జోన్ పరిధిలో సుమారు 320 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ బోగీలు పెంచడమే తక్షణ పరిష్కారం. » అన్ని ప్రధాన రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం మహిళలకు ఎంతో కష్టం. ఈ దిశగా చర్యలు చేపట్సాల్సి ఉంది. డెమో రైలును రైట్టైమ్ ప్రకారం నడపాలి మహబూబ్నగర్ డెమో రైలులో ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న. కొద్ది రోజుల నుంచి డెమో ఆలస్యంగా నడుస్తోంది. దీంతో టైమ్ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. లేట్గా వెళ్లిన రోజుల్లో కొన్నిసార్లు సగం జీతమే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి డెమో రైలును టైమ్ ప్రకారం నడపాలి. – ఎం.మహేశ్, ప్రైవేట్ ఉద్యోగి, మర్లు (మహబూబ్నగర్) నాలుగు రోజుల జీతం కట్ కొన్ని రోజుల నుంచి డెమో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుండ డంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను పనిచేసే సంస్థకు ఆలస్యంగా వెళుతుండటంతో నెలలో నాలుగు రోజులైన జీతం కట్ చేస్తున్నారు. డెమో రైలును రైట్టైమ్లో నడిపి మా సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి, హన్వాడ బోగీలు పెంచాలి ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటల వరకు ఉద్యోగంలో ఉండాలి. అందుకే ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఉండే పుష్ఫుల్ ట్రైన్కు వెళ్తాను. ఇది సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తుంది. దీని తర్వాత వచ్చే కాకతీయ ట్రైన్ వేళలు మార్చారు. బోగీల సంఖ్య కూడా తగ్గించారు. దీంతో ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఆధారపడాల్సి వస్తోంది. సాధారణ రైళ్లలో బోగీలు పెంచితే చాలు. – సత్తిబాబు, కాంట్రాక్టు రైల్వే ఉద్యోగి, భువనగిరి -
‘వందేభారత్పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్లు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్టాప్లు, ఐప్యాడ్, మూడు వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. -
విజయవాడ రూట్లో పలు రైళ్ల రద్దు: ఎస్సీఆర్
సాక్షి,విజయవాడ: ఆగస్ట్ నెలలో ఐదు రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం(జులై 3) ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడవ లైన్ ఏర్పాటులో భాగంగా మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మరమ్మతుల వల్లే రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి ఆగస్ట్ 8 వరకు 37 రైళ్లు రద్దు చేయనుండగా 38 రైళ్లను దారి మళ్లించనున్నారు. -
బోగీల్లో మంటలు
సాక్షి, హైదరాబాద్/ సికింద్రాబాద్: నగరంలోని ఏదో ఒక రైల్వేస్టేషన్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఏసీ బోగోల్లో మంటలు చెలరేగిన సమయంలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ లేరు. ⇒ గతంలో నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్పైన నిలిపి ఉన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోనూ ఇలాగే మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు దిగి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రైన్లో పేలుడు స్వభావం ఉన్న పదార్థాల వల్లనే మంటలు అంటుకున్నట్టు అప్పట్లో గుర్తించారు. ⇒ సికింద్రాబాద్ స్టేషన్లోనూ చారి్మనార్ ఎక్స్ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి నగరానికి చేరుకున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే యార్డుకు చేరుకున్న కొద్దిసేపటికే అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన నాలుగేళ్ల క్రితం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.ఒకవేళ యార్డుకు చేరుకోకముందే అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. ఇలా తరచుగా ఏదో ఒక ట్రైన్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని రైళ్లలో పొగలు రావడంతోనే గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు భారీ ఎత్తున మంటలు అంటుకొని ప్రయాణికులు, అధికారులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన సంఘటనలూ ఉన్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమా..రైల్వేయార్డులు, వాషింగ్లైన్లు, పిట్లైన్లలో నిలిపి ఉంచే బోగీలకు భద్రత ఉండటం లేదనే ఆరోపణలున్నా యి. కోచ్లను శుభ్రం చేసేందుకు రైళ్లను పిట్లైన్లకు తరలిస్తారు. కొన్నింటిని డిపోల్లో నిలిపివేస్తారు. రైళ్లు, బోగీలు ఎక్కడ నిలిపి ఉంచినా, వాటిపైన భద్రతా సిబ్బంది నిఘా కొరవడుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ బోగీలు అడ్డాలుగా మారుతున్నాయి. తాగుబోతులు, ర్యాగ్పిక్కర్స్, అసాంఘిక శక్తులు రాత్రి వేళల్లో బోగీల్లో తిష్టవేస్తూ మద్యం సేవిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి వంటివి తాగి మండుతున్న పీకలను బోగీల్లోనే వేస్తున్నారు. దీంతో సిగరెట్ పీకలు, వెలిగించిన అగ్ని పుల్లలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ⇒ ఏసీ బోగీల నిర్వహణలో వైఫల్యం వల్ల తరచూ విద్యుత్ షార్ట్సర్క్యూట్ వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా యి. ఏసీ బోగీల్లో ప్రయాణికులు చెత్తాచెదారం, ఆహారపదార్ధాలు వదిలేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. ఎలుకలు తరచుగా విద్యుత్ వైర్లు కట్ చేయడం వల్ల షార్ట్సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు రైల్వే భద్రతా నిపుణుడు ఒకరు చెప్పారు. ఆరీ్పఎఫ్, జీఆర్పీ వంటి పోలీసు విభాగాలు పిట్లైన్లు, యార్డుల్లో నిరంతరం నిఘా కొనసాగించాలి. బయటి వ్యక్తులు యార్డుల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.ఏసీ కోచ్ల్లో అగ్ని ప్రమాదంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఉద యం 10.30 గంటలకు ఏసీ కోచ్లను వాషింగ్ కోసం మెట్టుగూడ వద్దనున్న క్లీనింగ్ పిట్ యార్డ్ తీసుకెళ్లారు. క్లీనింగ్ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో తిరిగి రైల్వే స్టేషన్కు తరలిస్తుండగా ఏసీ బోగీల్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది స్టేషన్లో మంటలు ఆర్పే యంత్రాలతో తగలబడుతున్న బోగీలను అదుపు చేసే ప్రయ త్నం చేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించ కుండా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలోనే అక్కడకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. రైలు కోచ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై సమీక్షించి, భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలకు బ్రేక్!
ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్ఎస్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ పీఆర్ఎస్కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. -
రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?
సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!. రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్ ఫోన్కి టికెట్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్ తాలుకా లిస్ట్ తీసి.. ఆ రైలు లాస్ట్ స్టేషన్ వద్ద సిబ్బంది కలెక్ట్ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్ని తీయడం జరుగుతుంది. ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్ చేసి రైల్వే మాస్టర్కి అందజేస్తారు. ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్సీటీసీ సైట్లో లేదా రైల్వేస్టేషన్ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్ సెంటర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్కు నడిచే చార్మి నార్ ఎక్స్ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్పూర్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
40వేల నార్మల్ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు పెంచుతాం
-
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్–విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం–తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం–బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు–విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్–తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా–సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్–పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్–పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్–సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్–ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు–ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్–హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ–నర్సాపూర్ (17226), హుబ్లీ–గుంతకల్లు (07337), గుంతకల్లు–హుబ్లీ (07338), బల్గెవి–కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట–బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
పలు రైళ్లు రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఖుర్దారోడ్ డివిజన్, ఖుర్దారోడ్–బ్రహ్మపూర్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న లిమిటెడ్ హైట్ సబ్వే పనుల నిమిత్తం ట్రాఫిక్ బ్లాక్ తీసుకుంటున్నందున ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో రీ షెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ► ఫిబ్రవరి 1వ తేదీన భువనేశ్వర్లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరాల్సిన భువనేశ్వర్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(12830) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరుతుంది. ► ఫిబ్రవరి 1వ తేదీన పూరీలో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరాల్సిన పూరీ–గుణుపూర్(18417) ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. ► ఫిబ్రవరి 1వ తేదీన గుణుపూర్లో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన గుణుపూర్–పూరీ(18418) ఎక్స్ప్రెస్ ఉదయం 9గంటలకు బయల్దేరుతుంది. ► ఈనెల 31న తిరుపతిలో ఉదయం 10.40 గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి–పూరీ(17480) ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2.40 గంటలకు బయల్దేరుతుంది. ► ఫిబ్రవరి 1న సంత్రాగచ్చిలో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన సంత్రగచ్చి–తాంబరం (06054) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో రాత్రి 7.50 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–షాలిమర్(22826) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాత్రి 10.10గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న తిరునల్వేలిలో తెల్లవారు 3 గంటలకు బయల్దేరాల్సిన తిరునల్వేలి– పురూలియా (22606) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం 7.15 గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న పుదుచ్చేరిలో మధ్యాహ్నం 2.15 గంటలకు బయల్దేరాల్సిన పుదుచ్చేరి–హౌరా(12868) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 5గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న చైన్నె సెంట్రల్లో రాత్రి 7 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– హౌరా(12840) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాత్రి 9.30 గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న సికింద్రాబాద్లో సాయంత్రం 4.50 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్–హౌరా(17016) విశాఖ ఎక్స్ప్రెస్ రాత్రి 7.35గంటలకు బయల్దేరుతుంది. -
అయోధ్య రూట్లో రైళ్లు రద్దు.. కారణమిదే!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య కాంట్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ)కి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్లల్లా పవిత్రోత్సవానికి జరుగున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్లో ట్రాక్ డబ్లింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభోత్సవానికి ముందే హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జనవరి 22కు ముందుగానే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమవుతుందని యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. అయోధ్యలో రామ మందిరాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రామ్లల్లాకు పట్టాభిషేకం జరగనుంది. రాజకీయ నేతలు మొదలుకొని, సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
World Longest Train Trips: ప్రపంచంలోని పొడవైన రైలు ప్రయాణాలు (ఫోటోలు)
-
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి వివరీతంగా పెరిగింది. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఉదయం పూట ఈ వారం పొడవునా తేలికపాటి పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 9న తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. ఢిల్లీలో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు. అయితే ఇది ఐదవ తరగతిలోపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల తరువాతనే వీరికి తరగతులు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది శనివారం కంటే మూడు డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా ఉంది. జమ్మూ డివిజన్లో దట్టమైన పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. 11 విమానాలు ఆలస్యంగా నడిచాయి. -
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లు పూర్తిగా, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు ♦ ఈ నెల 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో విజయవాడ–విశాఖపట్నం (22702/222701) ♦ ఈ నెల 19 నుంచి 28 వరకు గుంటూరు–విశాఖపట్నం (17239) ♦ ఈ నెల 20 నుంచి 29 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240) ♦ ఈ నెల 19 నుంచి 28 వరకు బిట్రగుంట–విజయవాడ (07977/07978) ♦ ఈ నెల 22 నుంచి 26 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు ♦ ఈ నెల 15 నుంచి 28 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863/07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ఈ నెల 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 20, 29 తేదీల్లో భావ్నగర్–కాకినాడ టౌన్ (12756), ఈ నెల 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు గౌహతి (12509), ఈ నెల 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 28 వరకు ధనబాద్–అలెప్పి (13351), ఈ నెల 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్పూర్ (18111), ఈ నెల 17, 24 తేదీల్లో జసిదిహ్–తాంబరం (12376), ఈ నెల 15, 22 తేదీల్లో హథియా–ఎర్నాకుళం (22837), ఈ నెల 15, 24 తేదీల్లో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 20, 27 తేదీలలో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 16, 21, 23, 28 తేదీలలో హథియా–బెంగళూరు (12835), ఈ నెల 19, 26 తేదీల్లో టాటా–బెంగళూరు (12889) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లించారు. -
100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన నాలుగు రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్లో 134% ఆక్యుపెన్సీ.. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్లో ఈ ట్రైన్లో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబా ద్ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్లో 134 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్కు వచ్చే వందేభారత్లో ఇది ఏకంగా 143 శాతానికి చేరుకుంది. సంవత్సరాంతం కావడంతో రెండు వైపుల నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో చాలా మంది వెయిటింగ్ జాబితాలో నిరీక్షించవలసి వచ్చింది. గత డిసెంబర్ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్లో... గతేడాది ఏప్రిల్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను మొదట 8 కోచ్లతో ప్రారంభించారు. ఈ ట్రైన్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో గతేడాది మే 17 నుంచి 16 కోచ్లకు పెంచారు. గత డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 114 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వచ్చే వందేభారత్లో 105 శాతానికి ఆక్యుపెన్సీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు గత సెపె్టంబర్లో 8 బోగీలతో ప్రవేశపెట్టిన కాచిగూడ–యశ్వంత్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో డిసెంబర్లో ఆక్యుపెన్సీ 107 శా తానికి చేరింది. తిరుగుదిశలో యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ వరకు 110 శాతం వరకు నమోదైంది. అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ–ఎంజీఆర్ చెన్నై–వందేభారత్ ఎక్స్ప్రెస్లో సైతం గత డిసెంబర్లో 126 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్లో ఇది 119 శాతం వరకు ఉంది. గత సెస్టెంబర్లో 8 కోచ్లతో ఈ ట్రైన్ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్ తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఆకట్టుకుంటున్న సదుపాయాలు... వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే విధంగా రైళ్లను నడుపుతుండటంతో ఎక్కువ మంది వందేభారత్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రైన్లో ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లతో అన్ని రకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నా యి. జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, చార్జింగ్ పాయింట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తిగా సురక్షితమైన, మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. -
పట్టాలపై పొగమంచు
రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య బుధవారం రైలు పట్టాలపై పొగమంచు కమ్ముకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది. ప్రధానంగా సికింద్రాబాద్–బల్లార్షా–న్యూఢిల్లీ మధ్య ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం తగ్గించి నడిపించారు. సిగ్నల్స్ను పొగమంచు కమ్మేయడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు. వేగం బాగా తగ్గించి నడపడంతో రైళ్లు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంపైకి వచ్చేవరకూ రైళ్లు కనిపించక ప్రయాణికులు సైతం తికమకపడ్డారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, బిజిగిరిషరీఫ్, హసన్పర్తి మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఉదయం 11 గంటల తర్వాత సూర్యుడు రావడంతో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు యథాతథస్థితికి చేరుకున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్గా భారత్లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్ఫారమ్లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని బీజింగ్లో రెండు మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మంది గాయపడ్డారు. 102 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే బీజింగ్లో మెట్రో రైళ్లు క్షణం గడువు లేకుండా నడుస్తుంటాయి. నగరంలో 27 రైల్వే లైన్లలో ప్రతిరోజూ 13 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రెండు నిమిషాలకో రైలు నడుస్తుంది. బీజింగ్లో శుక్రవారం భారీగా మంచు కురిసింది. రైల్వే ట్రాక్లు తడిసి ఉన్నాయి. ఈ క్రమంలో సబ్వే వద్ద ఓ రైలు బ్రేక్ వేసింది. వెనకనే వస్తున్న రైలు బ్రేక్ వేయడంలో విఫలమైన నేపథ్యంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయని బీజింగ్ మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడిపోయామని స్థానికులు తెలిపారు. కొందరు ఎముకలు విరిగి ఆర్తనాదాలు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 515 మంది గాయపడగా ఆస్పత్రికి తరలించారు. 102 మందికి ఎముకలు విరిగి పరిస్థితి తీవ్రంగా ఉందని వెైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్ప్రెస్లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్ప్రెస్, రేవాంచల్ ఎక్స్ప్రెస్, మహామన ఎక్స్ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
శబరిమలకు 22 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 22 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. సికింద్రాబాద్–కొల్లాం (07111/07112) ప్రత్యేక రైలు ఈ నెల 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, జనవరి 5, 12, 19 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్–కొట్టాయం (0713/0714) ప్రత్యేక రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07117/07118) స్పెషల్ ట్రైన్ జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 4వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07009/07010) స్పెషల్ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8, 15 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. -
రైళ్లు, విమానాల రాకపోకలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రూట్లలో పరిమితంగా సర్విసులను పునరుద్ధరించారు. ముంబయి మీదుగా చెన్నైకి వెళ్లే కొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్ళించారు. ఈ నెల 8వ తేదీ వరకు వివిధ మార్గాల్లో సుమారు 120 రైళ్లను రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాన్ తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటే రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, భువనేశ్వర్, కోల్కతా, తదితర ప్రాంతాలకు వెళ్లే రైలు మార్గాల్లో వరదల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలపై వరదనీటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రాత్రింబవళ్లు విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. రాకపోకలు నిలిచిన రైళ్ళు ఇవే: కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి. సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె. చెన్నై–హైదరాబాద్, సింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రమ్ తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రూట్లో రైలు సర్విసులు పునరుద్ధరణ: తిరుపతి–సికింద్రాబాద్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గూడూరు రూట్లలో కొన్ని సర్విసులను పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాన్ కారణంగా రద్దయిన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులు రైళ్ల పునరుద్ధరణకు అనుగుణంగా తిరిగి తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 20 విమాన సర్విసులు రద్దు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20 దేశీయ విమాన సర్విసులు నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, రాజమండ్రి, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బయలుదేరే విమానాలను వాతావరణ ప్రభావం కారణంగా అధికారులు రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి హైదరాబాద్కు రావలసిన విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు రైళ్లతో పాటు విమానాలు కూడా రద్దవడంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. -
మిచౌంగ్ తుపాను : దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్ పరిధిలో రైళ్లపై తుపాన్ ఎఫెక్ట్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీళ్ళు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం. ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశాం. తుపాను తీరం దాటాక వీలైనంత త్వరగా రైళ్లు పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
‘రైళ్లను పేల్చేస్తా’నంటూ బెదిరించి.. పోలీసు విచారణలో నిందితుని ట్విస్ట్!
పట్నా: బీహార్ రాజధాని పట్నా రైల్వే స్టేషన్లో ఆ సమయంలో కలకలం చెలరేగింది. రాజధాని, జన-శతాబ్ది, వందే భారత్ రైళ్లను పేల్చివేస్తామంటూ రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ వచ్చింది. రాజేంద్ర నగర్ టెర్మినల్ స్టేషన్ మేనేజర్కు ఆగంతకుడు ఈ బెదిరింపు లేఖను పోస్ట్ ద్వారా పంపాడు. తాను ఈ మూడు రైళ్లను పేల్చకుండా ఉండాలంటే రైల్వే శాఖ తనకు రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని స్టేషన్ మేనేజర్.. జీఆర్పీకి, స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరొకరిని ఈ కేసులో ఇరికించాలని ఒక పథకం ప్రకారం స్టేషన్ మేనేజర్కు బెదిరింపు లేఖ పంపాడు. ఈ కేసులో కామత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు కామత్ విస్తుపోయే వివరాలను వెల్లడించాడు. కపిల్ దేవ్ అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని, పోలీసు కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కామత్ ఈ బెదిరింపు లేఖ రాశాడని పోలీసుల విచారణలో తేలింది. కామత్, కపిల్ దేవ్ మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో కామత్ జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన అతను కపిల్దేవ్పై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
దీపావళి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా హైదరాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–కటక్ (07165/07166) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
పదేళ్లయినా విస్తరించని కవచ్!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్... వేగవంతమైన, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన రైలు. కానీ వేగంగా, విలాసవంతంగా ప్రయాణించడం కంటే రైళ్లు భద్రంగా గమ్యస్థానం చేరడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని విస్మరించిన రైల్వే శాఖ... రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థను విస్తరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు–హౌరా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురై ఏకంగా 296 మంది ప్రయాణికులు దుర్మరణం పాలై నాలుగున్నర నెలలు దాటినా నేటికీ కవచ్ వ్యవస్థను కొత్తగా ఒక్క కిలోమీటర్ మేర కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ వ్యవస్థను విస్తరించి ఉంటే తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన తప్పి ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేవలం 5 డీజిల్ లోకొమోటివ్లలో దీన్ని ఏర్పాటు చేయడం తప్ప ఎలాంటి పురోగతీ లేదు. ఏటా 5 వేల కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇటీవల 3 వేల కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ పనుల్లో వేగం లేదు. టీకాస్ నుంచి కవచ్గా రూపాంతరం... రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్డెన్స్ సిస్టం (టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్నగర్ సెక్షన్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. 260 కి.మీ. నిడివిలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించింది. ఆరేళ్ల క్రితం దాని పేరును కవచ్గా మార్చింది. 2022 నాటికి కవచ్ ఎక్కడెక్కడంటే.. నాందేడ్–నిజామాబాద్–సికింద్రాబాద్–కర్నూలు–గుంతకల్ మార్గంలో 960 కి.మీ. పర్బణి–పర్లివైజ్నాథ్–లాతూర్–వికారాబాద్ మార్గంలో 31 కి.మీ. వాడి–వికారాబాద్–సనత్నగర్ మార్గంలో 174 కి.మీ. ఇవి తప్ప, దేశంలోని మిగతా ప్రాంతాల్లో వీటి ఏర్పాటు జరగలేదు. కవచ్ పనితీరు ఇలా... ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్పై ప్రతి కి.మీ.కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేస్లతో అనుసంధానిస్తారు. దీంతో ఎప్పటికప్పుడు ఇవి రైళ్లను నియంత్రిస్తుంటాయి. లోకో పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తనంతట తనుగా బ్రేక్లు వేసుకోవటం, హారన్ మోగించటం లాంటివి కవచ్ చేయగలదు. పొరపాటున ఒకే ట్రాక్పై ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే.. కనీసం 100 మీటర్ల దూరంలోనే అవి ఆటోమేటిక్గా నిలిచిపోతాయి. వందేభారత్లకూ పొంచి ఉన్న ప్రమాదం.. గంటకు 160 కి.మీ.వేగంతో (నిర్ధారిత పరిధి) దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లలోనూ కవచ్ వ్యవస్థ లేదు. అవి పరుగుపెట్టే ట్రాక్ మొత్తం కవచ్ వ్యవస్థ ఏర్పాటైతేనే పనిచేసే పరిస్థితి ఉన్నందున వందేభారత్ రైళ్లు కూడా ఎదురెదురుగా ఇతర రైళ్లను ఢీకొనే ప్రమాదపు అంచులో ఉన్నట్టే. వందేభారత్ ఎక్స్ప్రెస్..పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2016 చివర్లో తయారీపై మొదలైన ప్రయోగాలు 2018 నాటికి పూర్తి. అందుకే దీన్ని తొలుత ‘ట్రైన్–18’గా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ–వారణాసి మధ్య తొలి రైలు పరుగు ప్రారంభించింది. ఆలోచన నుంచి పట్టాలెక్కడం వరకు పట్టిన సమయం కేవలం రెండున్నరేళ్లు. ఖర్చు: ఒక్కో రైలు తయారీకి అవుతున్న వ్యయం దాదాపు రూ. 100 కోట్లు. కవచ్ ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా నిరోధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా రూపొందించిన వ్యవస్థ. పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2013లో ప్రయోగాలు మొదలు. అవి విజయవంతం కావడంతో ఆ వ్యవస్థను వినియోగించేందుకు 2021లో అనుమతి. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్వర్క్ 1.29 లక్షల కి.మీ. మేర విస్తరించి ఉంది. కానీ కవచ్కు అంకురార్పణ జరిగి దశాబ్దం దాటుతున్నా ఇప్పటివరకు ఏర్పాటైంది కేవలం 1,425 కి.మీ. నిడివిలోనే.ఖర్చు: కిలోమీటర్కు రూ.50 లక్షలు. -
మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు.. జాతీయ రహదారుల దిగ్బంధం
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కోరుతూ నిరసనకారులు రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించారు. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. నేడు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు నిరసనకారులు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు షోలాపూర్లో రైలు పట్టాలను దిగ్బంధించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిరసనకారులు రైలు పట్టాలపై టైర్లు తగులబెట్టారు. అటు.. జల్నా జిల్లాలో జరిగిన నిరసనల్లో కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారని పోలీసులు మంగళవారం తెలిపారు. రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జల్నాలో జరిగిన మరో ఘటనలో షెల్గావ్ గ్రామంలోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఆందోళనకారులు రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రిజర్వేషన్ డిమాండ్కు మద్దతుగా మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే అక్టోబర్ 25 నుండి జాల్నా జిల్లాలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా నిరసనలకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయులు రాజీనామా -
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడు పుట్టిందో?
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట. మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ.. ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వివరాలు సేకరిస్తున్నాం ‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. -
వీల్చైర్ వాడేవారి కోసం రైళ్లలో ర్యాంపులు
న్యూఢిల్లీ: వీల్చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు. త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు. -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్లో ప్రయాణికులు, దిగువ డెక్లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
వందే భారత్కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడేది ఆహారం, నీళ్లతోనే. డబ్బు పెట్టినా సురక్షితమైన నీళ్లు లభించవు. చాలా సార్లు రైళ్లలో అసురక్షితమైన ఏవో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. అయితే రైళ్లలో ఏ బ్రాండ్ వాటర్ బాటిళ్లు అమ్మాలో నిబంధనలు ఉన్నాయి. తాజాగా పోర్బందర్ ఎక్స్ప్రెస్ ప్యాంట్రీ కారు నుంచి అనధికారిక, నాసిరకం తాగునీటి బాటిళ్లను మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం వాటర్ బాటిళ్ల విక్రయంపై ఓ సిబ్బందిలో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 కేసులు లోకల్ బ్రాండ్కు చెందిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన మేనేజర్ను, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. సీనియర్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ (DCM) సుధీర్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ భారతీయ రైల్వేలలో ‘రైల్ నీర్’ బ్రాండ్ వాటర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని, ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే నిర్దిష్ట బ్రాండ్ నీటిని విక్రయించడానికి కచ్చితమైన ప్రోటోకాల్ ఉందని పేర్కొన్నారు. 'రైల్ నీర్' బ్రాండ్ వాటర్ బాటిళ్ల సరఫరా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్లను విక్రయించాల్సిన పని లేదన్నారు. ‘రైల్ నీర్’ అనేది భారతీయ రైల్వేలో భాగమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC)కి చెందిన బాటిల్ వాటర్ బ్రాండ్. -
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వర్షాల కారణంగా హసనపర్తి–కాజీపేట సెక్షన్ మధ్యలో ట్రాక్లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్–సిర్పుర్ కాగజ్నగర్ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్–ధనాపూర్ (12791)రైలును గురువారం కాజీపేట, విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబాద్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనారస్ (22535) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. హెల్ప్ డెస్క్ల ఏర్పాటు వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్లతో పాటు గూడురు స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు. -
రైలు ప్రయాణంలో తకరారు.. వరంగల్ వరకే తిరుపతి–కరీంనగర్ రైలు..
కరీంనగర్: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని అధికారులు పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఆకస్మిక పరిణామంతో జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.. ► సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ గురు, శుక్రవారాల్లో రద్దయ్యాయి. ► సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ గురువారం రద్దవగా శుక్రవారం ఉదయం కూడా రద్దు చేశారు. ► సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఘన్పూర్–సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నారు. ఘన్పూర్–కాగజ్నగర్ వరకు రద్దు చేశారు. ఈ మూడు రైళ్ల వల్ల నిత్యం హైదరాబాద్ వెళ్లాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ► తిరుపతి–కరీంనగర్ బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను వరంగల్కే పరిమితం చేశారు. వరంగల్–కరీంనగర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పిల్లాపాపలతో తిరుమల దర్శనానికి వెళ్లిన వారంతా లగేజీతో వర్షంలో తడుస్తూ తిరిగి బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ► సికింద్రాబాద్–పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి, రామగుండం నుంచి వెళ్లాల్సి ఉండగా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ► చైన్నె–అహ్మదాబాద్ వెళ్లాల్సిన నవజీవన్ ఎక్స్ప్రెస్ను పెద్దపల్లి, మంచిర్యాల కాకుండా వాడి–సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు. ► న్యూఢిల్లీ–హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్ను బల్లార్షా–ఆదిలాబాద్–ముత్కేడ్ జంక్షన్ మీదుగా నిజామాబాద్ నుంచి దారి మళ్లించారు. ► గోరక్పూర్–సికింద్రాబాద్ రైలును పెద్దపల్లి–కరీంనగర్– నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు. -
మరిన్ని ఫీచర్లతో వందే భారత్ రైళ్లు.. కొత్తగా ఏమేం ఉన్నాయంటే..?
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ప్రాజెక్టు వందేభారత్ రైళ్లు. దేశమంతటా వేగంగా ప్రయాణించగల వందేభారత్ రైళ్లను ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే.. ఈ రైళ్లలో నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ప్రయాణికులు కూడా కొన్ని లోపాలను రైల్వే శాఖకు ఫీడ్బ్యాక్లో ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏమేం మార్పులంటే.. ► రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్లను ఏర్పాటు చేయనున్నారు. ► సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చనున్నారు. కోచ్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ► అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. ► వందే భారత్ రైళ్లలో కోచ్ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ► మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్టైట్ ప్యానల్స్లో మార్పులు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్ను లోకో పైలట్కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ► నీరు బయటకు రాకుండా వాష్ బెసిన్ లోతులను పెంచనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్లో లైటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ► త్వరలో రిజర్వేషన్ చేయించుకోనివారికి కూడా అధునాతన సదుపాయాలతో కోచ్లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారిగా వందే భారత్ రైళ్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు -
డ్రైవర్ లేకుండా మెట్రో రైలు
వాహనం నడపాలంటే డ్రైవర్లు తప్పనిసరి. కానీ ఆధునిక సాంకేతికత డ్రైవర్ల అవసరం లేకుండా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తోంది. పాశ్యాత్య దేశాలలో డ్రైవర్లెస్ కార్లు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. అలాగే ఐటీ సిటీలో డ్రైవర్లతో నిమిత్తం లేకుండా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. కంట్రోల్ రూం నుంచి రైలు గమనాన్ని పర్యవేక్షిస్తారు. డ్రైవర్లకు అనారోగ్యం, సమ్మె వంటి సమస్యలతో ఇబ్బంది ఉండదు. బనశంకరి: బెంగళూరులో డ్రైవర్లు లేకుండానే మెట్రో రైళ్లు దూసుకుపోనున్నాయి. ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. దీనికి కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2020 డిసెంబరులో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తరువాత దేశ ఆర్థిక రాజధాని ముంబై లో డ్రైవర్లెస్ మెట్రో రైళ్లు వచ్చాయి. ఆగస్టులో తమిళనాడు రాజధాని చైన్నెలో అమలులోకి రానుంది. ఇప్పుడు ఐటీ సిటీలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర మార్గంలో 19 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ గా ఉన్న గులాబీ లైన్లో (ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర) ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది, నిజానికి గత ఏడాది పూర్తి కావలసి ఉంది. కానీ కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది చివరిలో ప్రారంభించే కారిడార్లో డ్రైవర్ రహిత మెట్రో నడపడానికి బీఎంఆర్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. సీబీటీసీ సిగ్నలింగ్ ఆధారంగా డ్రైవర్లు లేకుండా ఈ రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇంటర్చేంజ్గా సిల్క్బోర్డు స్టేషన్ నమ్మ మెట్రో గులాబీ మార్గం నిర్మాణదశలో ఉండగా దీని పొడవు 18.82 కిలోమీటర్లు. ఈ మార్గాన్ని ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర కు అనుసంధానిస్తారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్ కాగా 16 స్టేషన్లు కలిగి ఉంది. ఆర్వీ రోడ్డు స్టేషన్ టెర్మినల్ స్టేషన్ కాగా గ్రీన్ లైన్తో ఇంటర్చేంజ్ కల్పిస్తారు. సిల్క్బోర్డు స్టేషన్ గులాబీలైన్, నీలి లైన్ మధ్య మరో ఇంటర్ చేంజ్ స్టేషన్ కానుంది. గులాబీ లైన్ను మొదట్లో బొమ్మసంద్ర వరకు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పుడు బొమ్మసంద్ర నుంచి తమిళనాడులోని హోసూరు పట్టణం వరకు విస్తరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎలా పనిచేస్తాయంటే ► డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి మెట్రో రైల్వేలో సాంకేతికంగా మార్పులు చేశారు. ఆధునిక సీబీటీసీ సిగ్నలింగ్ వ్యవస్థలను అమర్చారు. ఇది రైళ్లు స్వయంచాలితంగా సంచరించడానికి సహాయపడుతుంది. ►గులాబీ (పర్పుల్) లైన్కు సీబీటీసీ సాంకేతికతను అమర్చారు. ఎలక్ట్రానిక్ సిటీ, గొట్టిగెరె, నాగవార, సిల్క్బోర్డు, కెంపేగౌడ విమానాశ్రయం లాంటి కొత్త మార్గాల్లో సీబీటీసీ వ్యవస్థను అమర్చుతారు. ►డ్రైవర్ రహిత మెట్రోరైలులో డ్రైవర్ ఉండరు, ఒక అటెండర్ మాత్రం ఉంటారు, అత్యవసరం అనుకుంటే అటెండర్ డ్రైవింగ్ను తీసుకుంటారు. డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడేళ్లు సంచరిస్తే ఆ అటెండర్ అవసరం కూడా ఉండదని మెట్రో అధికారులు తెలిపారు. ►ప్రతి రైలును కంట్రోల్ రూమ్ కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తారు. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విలాసవంతమైన వందే భారత్ ట్రైన్లు ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. తక్కువ టికెట్ ధరతో నాన్ ఏసీ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్లతో వందే సాధారణ్ పేరుతో కొత్త ట్రైన్లను తయారు చేయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వందే సాధారణ్ ట్రైన్లపై భారత రైల్వే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకే వేళ ఇదే నిజమైతే మెరుగైన ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది. ఇక బడ్జెట్ ధరలో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయనున్న వందే సాధారణ్ ట్రైన్ ఫీచర్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉండనున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ మాదిరిగా కాకుండా లేటెస్ట్ రైలు లోకో లాగింగ్ ఉంటుంది. అన్నీ రైళ్లు ఒక లోకోమోటివ్ (ఇంజిన్)తో ప్రయాణికులకు సేవల్ని అందిస్తుండగా..దీనికి రెండు వైపులా లోకోమోటివ్ ఉంటాయి. ప్రతి చివరలో లోకోమోటివ్తో పాటు, ట్రైన్ వేగం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ట్రైన్లు చివరి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ..స్టేషన్ వద్ద లోకోమోటివ్ సదరు ట్రైన్ నుంచి విడిపోనుంది. తద్వారా టర్న్ రౌండ్ సమయం తగ్గుతుంది. ఈ కొత్త ట్రైన్ల కోసం లోకోమోటివ్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్డబ్ల్యూ)లో, కోచ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త రైలు ఎలా ఉండబోతుంది. అందులోని సౌకర్యాలు ఎలా ఉండనున్నాయని రైల్వే బోర్డ్ నిర్ధేశించిన అక్టోబర్ నాటికి వెలుగులోకి రానున్నాయి. లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్కు చెందిన ఒక ప్యాసింజర్ కోచ్. ఇందులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ అండ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ కోచ్లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్ కోచ్లు, 12 సెకండ్ క్లాస్, 3 టైర్ స్లీపర్ కోచ్లు ఉంటాయి. అన్ని బోగీలు నాన్ ఏసీగా ఉంటాయి. చదవండి👉 నైట్ షిఫ్ట్లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే -
ఇండియా ఫస్ట్ ఏసీ ట్రైన్ - ఆశ్చర్యగొలిపే నిజాలు!
మన దేశంలో ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే విస్తరించి ఉంది. అయితే ఒకప్పుడు అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు రైల్వే అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ట్రైన్లో ఉండే జనరల్, ఏసీ, స్లీపర్ వంటి కోచ్లు ఉండేవి కాదు కేవలం ఫస్ట్ (ఏసీ కోచ్) అండ్ సెకండ్ క్లాసులు మాత్రమే ఉండేవి. ఈ ఏసీ కోచ్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎక్కడ మొదలయ్యాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏసీ కోచ్ లేదా ఫస్ట్ క్లాసులో కేవలం బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించాలి. వారి అవసరాలకు అనుగుణంగా చల్లగా ఉండటానికి ఏసీ బోగీలను ఏర్పాటు చేసుకున్నారు. భారతీయులకు వీటిలోకి అనుమతి ఉండేది కాదు. ఇండియన్స్ సెకండ్ క్లాసులోనే ప్రయాణించాలి. ఏసీ బోగీలుగా పిలువబడే వాటికి ఏసీలకు బదులు ఐస్ బ్లాక్స్ ఉపయోగించే వారు. వీటిని నేరుగా ఫ్లోర్లోనే ఉంచేవారని తెలుస్తోంది. ఈ రైలు మొదట 1928లో ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్పూర్, లాహోర్ మీదుగా ప్రయాణించేది. ఆ తరువాత 1930లో సహరాన్ పూర్, అంబాలా, అమృత్సర్, లాహోర్కి మళ్లించారు. ఈ రైలు పేరు 'ఫ్రాంటియర్ మెయిల్' (Frontier Mail). ఆ తరువాత ఇది 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో వినియోగంలో ఉండేది. (ఇదీ చదవండి: రైతు దశ తిప్పిన టమాట.. ఇది చూస్తే ఆగుతుంది నోటమాట!) ఫ్రాంటియర్ మెయిల్ ప్రత్యేకతలు.. నిజానికి ఫ్రాంటియర్ మెయిల్ అనేది బ్రిటీష్ వారి కాలంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్. కొన్ని నివేదికల ప్రకారం ఇది సుమారు 35 రైల్వే స్టేషన్స్లో ఆగుతూ 1893 కిమీ ప్రయాణిస్తుందని సమాచారం. ఒక సారికి ఇది 1300 మంది ప్రయాణికులను తీసుకెళ్లేదని, టెలిగ్రామ్స్ వంటి వాటిని తీసుకెళ్లడానికి కూడా దీన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది. -
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది!
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది! -
రైలు ప్రయాణికులకు ఊరట.. ఏసీ రైళ్లలో తగ్గనున్న ఛార్జీలు..
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్ప్రెస్ సహా 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ల ఛార్జీలను 25 శాతం మేర తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు శనివారం తెలిపింది. అనుభూతి, విస్తాడోమ్ కోచ్లు సహా ఏసీ సౌకర్యం ఉండే అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇతర వాహన ప్రయాణ ఛార్జీలను బట్టి కూడా రాయితీని నిర్ణయిస్తామని పేర్కొంది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఏసీ కోచ్ల్లో ప్రయాణాలపై డిస్కౌంట్ పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని కూడా వివరించింది. ‘ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్చార్జ్, జీఎస్టీ మొదలైన తదితర ఛార్జీలు అదనం. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించవచ్చు’అని రైల్వే బోర్డు పేర్కొంది. ‘గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని సెక్షన్లలోని రైళ్లలో విభాగాల వారీగా రాయితీ ఉంటుంది. డిస్కౌంట్ పథకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపస్ ఉండదు’అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే, కొన్ని తరగతులకు ఫ్లెక్సీ ఫేర్ అమల్లో ఉన్న కొన్ని రైళ్లకు ఈ రాయితీ పథకం వర్తించదు. పండగలు, సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నడిపే రైళ్లల్లో రాయితీ ఉండదు. రాయితీ స్కీమ్ వందేభారత్ రైళ్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని దింపారు -
రైళ్లలో అరకొరగా ఆన్బోర్డు సేవలు
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్బోర్డు సేవలు దెబ్బతిని కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు. ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్రోల్స్ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండగానే జన్మభూమి ఎక్స్ప్రెస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా షార్ట్సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి. -
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. 40 కోట్ల మంది ప్రయాణం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ చరిత్ర సృష్టించింది. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు చేరుకుంది. 2017 నవంబర్ 29న నగరంలో మెట్రో సేవలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలుత నాగోల్ నుంచి అమీర్పేట్ వరకు మెట్రో రైలు పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మీదుగా మియాపూర్ వరకు.. నాగోల్ నుంచి అమీర్పేట్ మీదుగా రాయదుర్గం వరకు మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. అదేవిధంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా ప్రయాణికుల రద్దీతో పాటే ట్రిప్పుల సంఖ్య సైతం పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచేందుకు హెచ్ఎంఆర్ చర్యలు చేపట్టింది. అంచెలంచెలుగా.. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 4.90 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలో ఈ సంఖ్య 5 లక్షలు దాటనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 6.70 లక్షల మంది ప్రయాణం చేసేందుకు అనుగుణంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతిరోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. మరో 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నట్లు ఎండీ వెల్లడించారు. -
40 ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్ట్లు.. స్పందన ఉంటే కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపుల జాబితాను పెంచింది. ఇక నుంచి కొన్ని స్టేషన్లలో తాత్కాలికంగా ఆగనున్నట్లు పేర్కొంది. ఆరు నెలలు పరిశీలించి, ప్రయాణికుల నుంచి స్పందన మెరుగ్గా ఉంటే కొనసాగిస్తామని తెలిపింది. తిరుపతి–లింగంపల్లి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, చెన్నై–సికింద్రాబాద్–విశాఖ ఎక్స్ప్రెస్, నాగర్సోల్–నర్సాపూర్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్ప్రెస్, భద్రాచలం రోడ్డు– బల్లార్షా ఎక్స్ప్రెస్, హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–రాయ్పూర్ ఎక్స్ప్రెస్, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, ఎర్నాకులం–పట్నా ఎక్స్ప్రెస్, మైసూరు–దర్బంగా భాగమతి ఎక్స్ప్రెస్, రామేశ్వరం–బెనారస్ ఎక్స్ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్–తిరుపతి çసంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్ప్రెస్, చార్మినార్–పద్మావతి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్, ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్, కొండవీడు ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్–లక్నో ఎక్స్ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్–మధురై ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్–కరైకల్ ఎక్స్ప్రెస్, నాగర్కోయల్–సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్, నాగర్కోయల్– కాచిగూడ ఎక్స్ప్రెస్, చెంగల్పట్టు–కాకినాడ ఎక్స్ప్రెస్, డెల్లా ఎక్స్ప్రెస్, హిమసాగర్ ఎక్స్ప్రెస్, పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్–ఎక్స్ప్రెస్, తిరుపతి–కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్, రాప్తి సాగర్ ఎక్స్ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్ప్రెస్, గుంటూరు–నర్సాపూర్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్–కాచిగూడ ఎక్స్ప్రెస్, సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్, యలహంక–కాచిగూడ ఎక్స్ప్రెస్లలో కొన్ని తాత్కాలిక స్టాపులను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, సంఘాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
పట్టాలెక్కిన మరో ఐదు వందే భారత్ రైళ్లు.. పచ్చ జెండా ఊపిన ప్రధాని..
భోపాల్: మధ్యప్రదేశ్ నుంచి ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో రెండిటిని ప్రత్యక్షంగా ప్రారంభించగా మూడింటిని మాత్రం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ప్రధాని ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లలో ఇప్పటికి 23 రైళ్లు పట్టాలెక్కాయి. మధ్యప్రదేశ్ షాహ్ధూల్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మొదట భోపాల్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ చేరుకుని భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం గోవా- ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా వందేభారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు ప్రారంభించిన రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య అనుబంధాలను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. అనంతరం దేశంలోని 3000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు. #WATCH | Madhya Pradesh | PM Narendra Modi flags off five Vande Bharat trains from Rani Kamlapati Railway Station in Bhopal. Vande Bharat trains that have been flagged off today are-Bhopal (Rani Kamalapati)-Indore Vande Bharat Express; Bhopal (Rani Kamalapati)-Jabalpur Vande… pic.twitter.com/N4a72zwR0m — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి.. -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్ప్రెస్లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్ప్రెస్గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్ప్రెస్గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్ప్రెస్లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్ల మెయింట్నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ వరకూ ఈ సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్లు నిర్మించనున్నారు. 5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. వందేభారత్లోనూ స్లీపర్ కోచ్లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పీఈటీఎస్కు టెండర్లు ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే(పీఈటీఎస్)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్ పాకెట్లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు. -
మీకు తెలుసా! ఒక ట్రైన్ తయారీకి అయ్యే ఖర్చు ఎంతంటే?
ట్రైన్ గురించి, ట్రైన్ జర్నీ గురించి దాదాపు అందరికి తెలుసు. రైలు ప్రయాణం అంటేనే అదో రకైమన అనుభూతి అనే చెప్పాలి. లయబద్దంగా కదులుతూ ఎన్నెన్నో కొత్త ప్రాంతాలను పరిచయం చేసే ఆ ప్రయాణం చేసిన వారికే తెలుస్తుంది. అయితే ఒక ట్రైన్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. ఒక బోగీ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అని చాలా మందికి తెలియక పోవచ్చు. మనం ఈ కథనంలో అలాంటి వివరాలను తెలుసుకుందాం. కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో 12,000 కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాల రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్లలో అయితే జనరల్, ఏసీ, స్లీపర్ అనే పేర్లతో బోగీలు ఉంటాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారు రూ. 1.25 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి, ఏసీ కోచ్ నిర్మించడానికి రెండు కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక ఇంజిన్ తయారీ విషయానికి వస్తే.. ట్రైన్ మొత్తం ఈ ఇంజిన్ మీద ఆధార పడి ఉంటుంది, కావున దానికయ్యే ఖర్చు ఆ రేంజ్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఇంజిన్ తయారీకి రూ. 20 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ రైలు తయారీకి రూ. 115 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఈ ట్రైన్ బోగీలను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ట్రైన్ చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 24 బోగీలు నాశనమైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ కోచ్ల మొత్తం విలువ రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. -
పలు రైళ్లు రద్దు, రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: భద్రత, ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేశారు. మరికొన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్నం–రాయ్పూర్(08527/08528) పాసింజర్ స్పెషల్ ఇరువైపులా రద్దయింది. షెడ్యూల్ చేసిన రైళ్లు ► ఈ నెల 3న విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్ (12807) సమతా ఎక్స్ప్రెస్ విశాఖలో గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 3న అమృత్సర్–విశాఖపట్నం (20808) హిరాకుడ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అమృత్సర్లో 5 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న సికింద్రాబాద్–భువనేశ్వర్(17016) విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న చైన్నె సెంట్రల్–హౌరా (12840) మెయిల్ చైన్నె సెంట్రల్లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న వాస్కోడగామా–షాలిమార్ (18048) అమరావతి ఎక్స్ప్రెస్ వాస్కోడగామాలో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. గమ్యం కుదించిన రైళ్లు ► విశాఖపట్నం–కిరండూల్ (18514) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ► కిరండూల్–విశాఖపట్నం (18513) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 5 నుంచి 12 వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► విశాఖపట్నం– కిరండూల్ (08551) పాసింజర్ స్పెషల్ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ► కిరండూల్– విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► ఈ నెల 4న రామేశ్వరం–భువనేశ్వర్ (20895), బెంగళూరు–భువనేశ్వర్(18464) ప్రశాంతి ఎక్స్ప్రెస్లు మార్గమధ్యలో 45 నిమిషాలు, 30 నిమిషాలు నిలిపివేస్తారు. -
Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే..మూడు రైళ్లు..
ఒడిశా ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందనేది సర్వత్రా.. అందరి మదిలోను మెదులుతున్న ప్రశ్న. ఐతే ఆ ఘటన గురించి ప్రత్యక్షసాక్షులు, అధికారుల కథనం మేరకు..ఈ భారీ విషాదం నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కోరమాండల్ షాలిమర్ ఎక్స్ప్రెస్ అనే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడం తోపాటు గూడ్స్ రైలుని ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న యశ్వంత్పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ అనే మరోరైలు పట్టాలు తప్పిన కోచ్లపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిపారు. మూడవ రైలు అదే సైట్లో ఆపి ఉంచిన గూడ్స్ రైలు ప్రమాదం బారిన పడినట్లు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ పెను ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఇక కార్యాచరణ వైఫల్యంపై ప్రశ్నల నేపథ్యంలో రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అలాగే క్రాష్ జరిగిన ప్రదేశంలో సీసీఫుటేజ్ విజ్యువల్స్లో పట్టాలపై రైలు కోచ్లు చిన్నాభిన్నామై పోతున్నట్లుగా మెలిపెట్టే దృశ్యాలు కనిపించాయి. (చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం) -
కాకతీయ.. ఎక్స్ప్రెస్గా మారినా ప్రయోజనం శూన్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నిత్యం నడుస్తున్న రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. పేరుకే టైం టేబుల్ తప్ప ఆచరణలో అమలు కావడంలేదు. నెలలో సగం రోజులకుపైగా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ఇటు భద్రాచలంరోడ్ , అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు అర్ధరాత్రి వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు బెళగావి.. కరోనాకు ముందుకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్ నుంచి నిత్యం మూడు రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇందులో మణుగూరు, కొల్హాపూర్లు ఎక్స్ప్రెస్ రైళ్లుగా ఉండగా కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్గా సేవలు అందించేంది. మూడు రైళ్లూ మణుగూరులో బయల్దేరి కొత్తగూడెం మీదుగా సికింద్రాబాద్కు ప్రయాణికులను చేరవేసేవి. దీంతో కొత్తగూడెంతోపాటు పాల్వంచ, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, ఇల్లెందు, టేకులపల్లి తదితర మండలాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా సమయంలో ఈ మూడు రైళ్లు రద్దు చేయగా.. ఆ తర్వాత మణుగూరు సూపర్ఫాస్ట్, ప్యాసింజర్గా ఉన్న కాకతీయను ఎక్స్ప్రెస్గా మారుస్తూ పునరుద్ధరించారు. కొల్హాపూర్ స్థానంలో బెళగావి అంటూ గత జనవరిలో రైల్వే అధికారుఉలు ప్రకటించి రద్దు చేశారు. బెళగావి నుంచి సికింద్రాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలును మణుగూరు వరకు పొడిగిస్తూ ఎట్టకేలకు శనివారం రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్లో అర్ధరాత్రి ఎదురుచూపులు సికింద్రాబాద్ –మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్లో రోజూ రాత్రి 11:45 గంటలకు బయల్దేరి తెల్లవారుజామున 4:15 గంటలకు భద్రాచలంరోడ్ చేరుకోవాలి. కానీ ఈ రైలు నెలలో సగం రోజులకు పైగా సికింద్రాబాద్లో సమయానికి బయల్దేరడం లేదు. ఫలితంగా సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికులు అర్ధరాత్రి వేళ జాగారం చేయాల్సి వస్తోంది. నగరంలోని చాలా మంద్రి ప్రయాణికులు రాత్రి 9:30 నుంచి 10:30 గంటల మధ్యలోనే ఇంటి నుంచి పిల్లాపాపలు, లగేజీతో బయల్దేరితేనే 11:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. తీరా స్టేషన్కి వచ్చాక రైలు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా ఫ్లాట్ఫారమ్ మీదకు వస్తోంది. దీని వల్ల చిన్నపిల్లలు, భారీ లగేజీతో అర్ధరాత్రి రెండు గంటలకుపైగా పసిపిల్లలు సహా ప్రయాణికులు మేల్కోవాల్సి వస్తోంది. చివరి నిమిషంలో ఫ్లాట్ఫారమ్ మారితే అటు ఇటు వెళ్లడం మరో ప్రయాస. సికింద్రాబాద్లో ఆలస్యంగా బయల్దేరడంతో కొత్తగూడేనికి నిర్దేశిత సమయానికి రావడం లేదు. ఫలితంగా ఈ రైలును నమ్ముకుని ఉదయం వేళ భద్రాచలంలో సీతారాముల దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయి. సింగరేణి ఇక అంతేనా! సికింద్రాబాద్కు వెళ్లే రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే కోల్బెల్ట్ ప్రాంతాలను కలిపే ఏకై క రైలు సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను నడిపేతీరు ఇంకా మారలేదు. రైలు వేగం పెంచుతామంటూ రెగ్యులర్ కోచ్లు తీసి పుష్పుల్ కోచ్లతో నడిపినా, ప్యాసింజర్ను అప్గ్రేడ్ చేస్తూ ఎక్స్ప్రెస్గా మార్చినా ఇసుమంతైనా మార్పు రాలేదు. ఈ రైలు కూడా నెలలో ఇరవై రోజులకు పైగా గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుని ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా ఒకప్పుడు కిక్కిరిసిన ప్రయాణికులతో నడిచిన సింగరేణి ఇప్పుడు ఆ స్థాయిలో ప్రయాణికులను ఆకట్టుకోలేకపోతోంది. బొగ్గు రవాణా ద్వారా రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయం అందిస్తున్న ఈ జిల్లాకు, ఇక్కడి ప్రజలు, వారి సమయం, అవసరాలను రైల్వేశాఖ ఇప్పటికై నా గుర్తించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. తమ సమయాన్ని వృథా చేయొద్దని, టికెట్ రూపంలో తాము చెల్లిస్తున్న సొమ్ములకు సరిపడా నాణ్యమైన సేవలు అందించాలని ప్రయాణికులు రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నారు. -
నెల్లూరుకు వందే భారత్ రైలు
నెల్లూరు(సెంట్రల్): భారత రైల్వే సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ రైలు నెల్లూరు మీదుగా ప్రయాణించనుంది. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరేలా ఈ రైలు సూపర్ స్పీడ్తో పట్టాలపై పరుగులు తీయనుంది. కాగా ఈ రైలులో ఒక్క సారైనా ప్రయాణించాలని ప్రయాణికులు ఉత్సాహం చూపుతున్నారు. కాగా రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు వందే భారత్ రైలు నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆగనుంది. 9 నుంచి రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సికింద్రాబాద్లో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు నేరుగా తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. ఎక్కడా ప్రయాణికులకు అందుబాటులో ఉండదు. అయితే ఈ రైలు 9వ తేదీన తిరుపతి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఈ రైలు 10వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 130 కి.మీ. స్పీడ్కు అనుమతులు సాధారణంగా ప్రస్తుతం ఉన్న అన్ని సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లు కేవలం 70 నుంచి 100 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణిస్తాయి. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్కు మాత్రం 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు స్పీడ్ కెపాసిటీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 110 కి.మీ. వేగంతో, ట్రాక్ ఇబ్బందులు లేనిచోట్ల 130 కి.మీ. వేగంతో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. 8 కోచ్లు మాత్రమే ప్రస్తుతం తిరుగుతున్న ఎక్స్ప్రెస్, సూపర్పాస్ట్ రైళ్లలో అన్నీ కలిపి 23 కోచ్లు ఉంటాయి. కానీ వందే భారత్ రైలు సూపర్ స్పీడ్తో ప్రయాణించనుండడంతో కేవలం 8 ఏసీ కోచ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితిని బట్టి మరికొన్ని రోజుల్లో కోచ్లు పెంచే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయాల్లో.. సికింద్రాబాద్ – తిరుపతి(20701) వందే భారత్ రైలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి – సికింద్రాబాద్(20702) వందే భారత్ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు సాయంత్రం 5.20 గంటలకు, సికింద్రాబాద్కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది. దాడులు చేస్తే కఠిన చర్యలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ రైల్లో ప్రయాణికులు కూడా ఉత్సాహంగా ఎక్కుతున్నారు. కాగా కొంతమంది ఇటీవల ఈ రైలుపై దాడులు చేశారు. వివిధ చోట్ల దాడులు చేసిన 39 మందిని ఇటీవల అరెస్ట్ చేశాం. అలాంటివి జరిగితే రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – శివేంద్ర మోహన్, డీఆర్ఎం, విజయవాడ డివిజన్ -
పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
గుంతకల్లు: నైరుతి రైల్వేలో బెంగుళూరు సమీపంలో జరుగుతున్న రైల్వే పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ► ధర్మవరం– బెంగళూరు–ధర్మవరం (06595/96) స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఏప్రిల్ 01.06, 29 వ తేదీల్లో రద్దు చేశారు. ► ఇక పూరి–యశ్వంత్పూర్ (22883) ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 31న నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, జోలార్పేట్ మీదుగా యశ్వంత్పూర్కు మళ్లించారు. ► ఎల్టీటీ ముంబై–కోయంబత్తూరు (11013) ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్లు, రేణిగుంట, జోలార్పేట్, సేలం మీదుగా కోయంబత్తూరుకు మళ్లించారు. ► ఇక గుంతకల్లు డివిజన్లోని పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల కోసం పలు స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు–రాయచూర్–గుంతకల్లు స్పెషల్ ప్యాసింజర్ రైళ్లును 23 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నడపరు. ► నంద్యాల–కడప–నంద్యాల (07284/85), విజయపుర–రాయచూర్– విజయపుర స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు 23వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు రద్దయ్యాయి.