ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు | Many Trains Are Restored And Diverted | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు

Published Thu, Sep 5 2024 8:53 AM | Last Updated on Thu, Sep 5 2024 10:13 AM

Many Trains Are Restored And Diverted

సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్‌లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచి­లీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబా­ద్‌­–ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (12655), చెన్నై సెం­ట్రల్‌–కాట్రా (16031), త్రివేండ్రం–హజ­రత్‌ నిజాముదీ్ధన్‌ (12643) యథావిధిగా పు­నరుద్ధరించారు.

అలాగే సికింద్రాబాద్‌–గుంటూరు (17202) రైలును రెండు గంట­లు ఆలస్యంగా సికింద్రాబాద్‌ నుంచి నడి­పా­రు. గూడూరు–సికింద్రాబాద్‌ (12709) రైలు­ను వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదు­గా, న్యూఢిల్లీ–ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (12­622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్‌–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement