
బాలీవుడ్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఓడించారు.
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మండీ ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో తల్లితో పాటు డ్యాన్స్ చేస్తున్న రంగోలి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలలో కంగనా బంధువులు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ విజయం తర్వాత కంగనా ఒక పోస్ట్ను షేర్ చేశారు. దానిలో ఆమె మండీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment