-
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Manikarnika Films Production (@manikarnikafilms) -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై పోటీ చేస్తున్నారు. హిమాచల్లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్పూర్లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ. -
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
సిమ్లా: బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సినీ నటి 'కంగనా రనౌత్' మీద కాంగ్రెస్ శనివారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.మండిలోని సర్కాఘాట్లో జరిగిన బహిరంగ సభలో 'కంగనా రనౌత్' మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అప్పట్లో అత్యంత సంపన్నులు (ఆ కాలం నాటి అంబానీ) అని పేర్కొన్నారు. అయితే వారికి ఆ సంపద ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదని అన్నారు.బ్రిటీష్ వారికి సన్నిహితంగా ఉండేవారని, సంపద ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ రహస్యమే అని కంగనా కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనుకూలంగా ఓట్లు వచ్చినప్పటికీ.. జవహర్లాల్ నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారో ఎవరికీ తెలియదని కూడా ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి కుటుంబ పాలన మొదలైందని అన్నారు.సంజయ్ గాంధీ మీద మాత్రమే కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మంది నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విక్రమాదిత్య సింగ్ను కూడా 'కార్టూన్' అని పిలిచారు.స్వాతంత్య్ర సమరయోధులను వ్యాపారవేత్తలతో పోల్చడం, సంజయ్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించడం వంటి హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంగనాను తదుపరి ప్రచారంలో పాల్గొనకుండా ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
-
ఓటర్లతో కంగనా స్టెప్పులు.. ప్రచారంలో కాంగ్రెస్పై ఆగ్రహం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ విజన్కు మద్దతివ్వాలని రనౌత్ కోరారు. మరోవైపు జోగిందర్నగర్లో ప్రచారం చేసిన కంగనా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. కంగనా రనౌత్ డ్యాన్స్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Kangana Ranaut dances with people during a public meeting in Mandi's Jogindernagar. pic.twitter.com/k3PODhNg9j — ANI (@ANI) April 13, 2024 -
బాలీవుడ్ నటి కంగనపై హిమాచల్ మంత్రి పోటీ
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ వెల్లడించారు. కాగా మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కంగనాకు పోటీగా మంత్రి విక్రమాదిత్య సింగ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత మూడు పర్యాయాలు ఆమె గెలిచారు. ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మాట్లాడుతూ. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. విక్రమాదిత్యపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. గతంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను గెలిచాను అని అన్నారు. హిమాచల్ ప్రజల గురించి కంగనాకు ఏం తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలవదని అన్నారు. ‘దేవ్ భూమి’ హిమాచల్ నుంచి బాలీవుడ్కు స్వచ్చంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా జూన్ 1న హిమాచల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి, చదవండి: కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారణ -
ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్
చాలామంది హీరోహీరోయిన్లకు బైక్స్, కార్స్ అంటే కాస్త పిచ్చి ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే చాలు కొనేస్తుంటారు. లేదంటే మంచి సందర్భం చూసుకుని వాటిని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఖరీదైన కారు కొనేసేంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? కారు కొనడం ఎందుకంత స్పెషల్? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు కంగన రనౌత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. బాలీవుడ్ బడా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే రాజకీయంగానూ కంగనా రనౌత్.. పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఈమెకు బీజేపీ తరఫున మండి ఎంపీ టికెట్ కేటాయించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగానే కంగన కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ప్రొడక్షన్స్ పేరుపై బెంజ్ మెబాజ్ జీఎల్ఎస్ ఎస్680 కారు కొనుగోలు చేసింది. అయితే దీని విలువ దాదాపు రూ.3 కోట్లు పైనే. మరోవైపు కంగన దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెజ్ బెంజ్, ఆడీ క్యూ8 కార్లు ఉన్నాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?) -
అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్
సిమ్లా : సినీ నటి, హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ బీజేపీ అభ్యర్ధి కంగనా రౌనత్ భారత్కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ తరుణంలో తాను చేసిన వ్యాఖ్యల్ని కంగనా సమర్ధించుకున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమ్మిట్లో కంగనా రనౌత్ మాట్లాడారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ మాట్లాడారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్పై స్పందిస్తూ కంగనా ట్వీట్ చేశారు. అందుకు కారణాల్ని వివరిస్తూ.. నాడు ‘అక్టోబర్ 21, 1943న సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు తానే ప్రధాని అని ప్రకటించారంటూ ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్వీట్ చేశారు. All those who are giving me gyan on first PM of Bharata do read this screen shot here’s some general knowledge for the beginners, all those geniuses who are asking me to get some education must know that I have written, acted, directed a film called Emergency which primarily… pic.twitter.com/QN0jD3rMfu — Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) April 5, 2024 ‘భారత్ తొలి ప్రధాని అంశంలో నన్ను విమర్శిస్తున్న వారు ఈ స్క్రిన్లో ఉన్న ఒక్కసారి చదవండి. నాకు కొంచెం చదువు చెప్పుచ్చు కాదా అని నన్ను అడుగుతున్న మేధావులందరికీ నేను ఒకటే చెబుతున్నా. నేను రైటర్ను. యాక్ట్ చేశా. డైరెక్షన్ చేశా అనే విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. -
దేశ ప్రధానులు వాళ్లే.. బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు..
వేసవి హీట్తో పాటు దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాడీవేడి రాజకీయం నడుస్తోంది. ఎలక్షన్ సమయం కాబట్టి ఒక పార్టీ నేత మరో పార్టీ నేతపై విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో వారు మాట్లాడే ప్రతీ మాట విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జనరేషన్. ఏ మూలకు చీమ చిట్టుకుమన్నా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దీంతో, సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తారు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. తాజాగా ఇద్దరు బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. One BJP candidate from North says Subash Chandra Bose was our first PM !! And another BJP leader from South says Mahatma Gandhi was our PM !! Where did all these people graduate from? 😁 — KTR (@KTRBRS) April 5, 2024 ఇక, ఈ వీడియోలో మన దేశ ప్రధానుల విషయమై బీజేపీ నేతలిద్దరూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రౌత్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశ మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు వివాదాస్పందగా మారాయి. ఈ వీడియోను కేటీఆర్ షేర్ చేస్తూ వీరంతా ఎక్కడ చదువుకున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. Whatsapp University students😁👇 Subhash Chandra Bose was the first Prime Minister of India - BJP candidate Kangana Ranaut. Mahatma Gandhi was out Prime Minister - BJP candidate K. Annamalai pic.twitter.com/WmuT0sqcez — Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 5, 2024 -
మండి ప్రజల గొంతునవుతా.. కంగనా రనౌత్
సిమ్లా: ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఓ వైపు అధికార పక్షం, మరో వైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నాయి. ఇటీవల బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు దక్కించుకున్న బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' ప్రచారం మొదలు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ప్రచారం ప్రారంభించిన కంగనా.. అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటులో 'మండి ప్రజల గొంతు' అవుతానని పేర్కొన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు మరియు రోడ్ల కోసం పని చేస్తానని, ప్రజల హక్కుల కోసం పోరాడతానని.. మండి కోసం నేను గొంతు పెంచుతానాని అన్నారు. స్వామి వివేకానంద, సద్గురు జీ, ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తి అని కంగనా అన్నారు. ఇది నా జన్మభూమి.. నన్ను తిరిగి పిలిచింది. నన్ను ప్రజలు ఎన్నుకుంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కంగనను లోక్సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి పోటీ చేయడానికి ఐదవ జాబితాలో అభ్యర్థిగా ప్రకటించింది. ఒకరికొకరు సహకరించుకోవడం బీజేపీ సంస్కృతి. అదే నమ్మకంతో వారితో కలిసి నడుస్తాం, గెలుస్తాం.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం’ అని ఆమె పేర్కొన్నారు. నేను బీజేపీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్ప్రదేశ్లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
నా నామినేషన్ తట్టుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు: కంగనా
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ తమ లోక్సభ అభ్యర్థిగా కంగనా రనౌత్ను ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఈ బాలీవుడ్ నటి పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి నటి కౌంటర్ ఇవ్వడం, ఈసీ నోటీసులు.. వంటి పరిణామాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కంగనా మండిలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. మండిలో తన నామినేషన్ను జీర్ణించుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి నామినేషన్ వేసిన తరువాత చాలా సంతోషించినట్లు తెలిపారు. తిరిగి సొంత ప్రదేశానికి రావడాన్ని ఎవరూ సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిందువల్లో శక్తిని నిర్మూలించడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మండిలో ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు అతిపెద్ద మేళా నిర్వహిస్తారని, అలాంటి ప్రాంత మహిళలపై కాంగ్రెస్ నేతలు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండికి రిషి మాండవ్య పేరు పెట్టారని, ఋషి పరాశరుడు తపస్సులో కూర్చున్న రిషి మాండవ్య పేరు పెట్టారని, అంతటి పవిత్ర ప్రదేశం మండి అని పేర్కొన్నారు. చౌకబారు నేతల నుంచి ఇంతకన్నా మనం ఏం ఆశించగలమని కంగనా ప్రశ్నించారు. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha seat, actor Kangana Ranaut says, "... Congress could not accept my nomination from Mandi. They started doing cheap politics. Their leader Rahul Gandhi talks about destroying the 'shakti' in Hindus. Their spokesperson… pic.twitter.com/D53fySekCz — ANI (@ANI) March 29, 2024 -
కంగనాపై అసభ్య పోస్ట్.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రీయా శ్రీనతేకు టికెట్ నిరాకరించింది. 2019లో సుప్రీయా శ్రీనతే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలసిందే. అయితే ఈసారి కూడా మహారాజ్గంజ్ నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని సుప్రియా శ్రీనతే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో సుప్రియా శ్రీనతేపై బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మహారాజ్గంజ్లో వీరేంద్ర చౌదరీని బరిలోకి దింపింది. సుప్రియా శ్రీనతే సోషల్ మీడియా ఖాతా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్పై వెలువడిన అసభ్యకరమైన విమర్శలు కాస్త వివాదం రేపాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తాను లోక్ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిపారు. అయితే తన స్థానంలో మరో అభ్యర్థి పేరును సూచించినట్లు సుప్రియా పేర్కొన్నారు. కంగనాపై చేసిన అసభ్యకరమైన పోస్ట్పై.. సుప్రియా శ్రీనతే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డులు పలువురికి తెలుసని తనకు తెలియకుండానే కంగనాపై అసభ్యకరమైన సోస్ట్ వేశారని తెలిపారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావటంతో డిలీట్ చేశానని తెలిపారు.‘సుప్రియాపేరడీ’ అనే ‘ఎక్స్’ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారని.. దాని నిర్వాకులు ఎవరో తెలియదన్నారు. తన ‘ఎక్స్’ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అప్పటికే ఆమె పోస్ట్ వివాదస్పదం కాగా.. బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. -
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్ప్రదేశ్లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్స్టా అకౌంట్ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్చైర్లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంగనా రనౌత్పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
శరీర భాగాలు కాదు చూడాల్సింది.. వేశ్యతో సహా..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటలతో బాలీవుడ్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ సీటును కేటాయించింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కంగనాపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా యూపీకి చెందిన కాంగ్రెస్ మహిళానేత సుప్రియ శ్రీనాథే విమర్శలు చేసింది. గతంలో కంగనా సినిమాల్లో బోల్డ్గా నటించిన ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి ఫోటోలతో హిమాచల్ ప్రదేశ్ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన కంగనా తనదైన శైలిలో కాస్తా ఘూటుగానే రిప్లై ఇచ్చిపడేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ.. 'ప్రియమైన సుప్రియా జీ.. ఒక ఆర్టిస్ట్గా నా కెరీర్లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించా. నేను క్వీన్ చిత్రంలోని అమాయక అమ్మాయి నుంచి ధకడ్ సినిమాలో గూఢచారిగా, మణికర్ణికలో దేవతగా, అలాగే చంద్రముఖిలో దెయ్యంలా, రజ్జో చిత్రంలో వేశ్యగా.. అలాగే తలైవిలో విప్లవ నాయకురాలిగా నటించా. మన ఆడబిడ్డలను పక్షపాతమనే సంకెళ్ల నుంచి మనం విడిపించాలి. వారి శరీర భాగాల పట్ల ఉత్సుకత కంటే.. వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అన్నింటికీ మించి వారి జీవితాలను, పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలని మనం గ్రహించాలి.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగనాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. చాలా బాగా బుద్ధి చెప్పావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సుప్రియ శ్రీనాథే ఆ పోస్ట్ను తన ఇన్స్టా నుంచి తొలగించింది. కానీ కొద్ది సేపటికే ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం కంగనా ఎమర్జన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఎన్నికల తర్వాత జూన్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. Dear Supriya ji In the last 20 years of my career as an artist I have played all kinds of women. From a naive girl in Queen to a seductive spy in Dhaakad, from a goddess in Manikarnika to a demon in Chandramukhi, from a prostitute in Rajjo to a revolutionary leader in Thalaivii.… pic.twitter.com/GJbhJTQAzW — Kangana Ranaut (@KanganaTeam) March 25, 2024 -
‘కంగన’కు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాలో బాలీవుడ్ నటి కంగనారనౌత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనకు కాషాయ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంగన గతంలో ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టు ఒకటి తాజాగా వైరల్గా మారింది. పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్ప్రదేశ్ నుంచి తాను పోటీ చేయబోనని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సమస్యలున్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని గతంలో ఎక్స్లో చేసిన పోస్టులో కంగన తెలిపింది. అక్కడి సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ రాణి అవుతానని పేర్కొంది. అయితే తాజాగా ఆదివారం (మార్చ్ 24) బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్ దక్కింది. మండి నుంచి బీజేపీ ఎంపీ టికెటివ్వడంపై కంగన స్పందించింది. ఇది తాను గౌరవంగా భావిస్తున్నానని, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాజాగా ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. మండి నుంచి పోటీ చేయనన్న పాత ట్వీట్ను చూపిస్తూ తాజా ప్రకటనపై కంగనను సోషల్మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా, బీజేపీ ఐదో జాబితాలో కంగనతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు బీజేపీ ఎంపీ టికెట్లు దక్కాయి. Just two years back when somebody said you will fight elections from mandi.. you said u want a state with complexities u can work on and won't fight from mandi now u are eating ur own words 😭 pic.twitter.com/GVJt91faFE — ح (@hmmbly) March 24, 2024 ఇదీ చదవండి.. వరుణ్కు మొండిచెయ్యి.. జితిన్కు పట్టం -
Lok sabha elections 2024: కంగనా రనౌత్, నవీన్ జిందాల్కు బీజేపీ టికెట్లు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో 111 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. కేంద్ర మంత్రి అశి్వనీకుమార్ చౌబే, ఎంపీ వరుణ్ గాం«దీకి ఈసారి టికెట్లు నిరాకరించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబాల్పూర్ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పూరీ నుంచి పోటీ చేయబోతున్నారు. సీనియర్ నేత మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి, పిలిభిత్ నియోజకవర్గంలో వరుణ్ గాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద, ఇటీవల బీజేపీలో చేసిన సీతా సోరెన్ జార్ఖండ్లోని దుమ్కా స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారు. టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర ధరించిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఆదివారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హరియాణాలోని కురు క్షేత్ర నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్లోని తమ్లూక్ నుంచి పోటీ చేయబోతున్నారు. కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీకి దిగబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఈసారి అవకాశం కలి్పంచలేదు. తన అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేయడం పట్ల బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆదివారం చెప్పారు. ఆమె తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ టికెట్పై పోటీచేయబోతున్నారు. బీజేపీలో చేరడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్.. పోటీ ఎక్కడంటే?
లోక్సభ ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్ నిలిచారు. ఇవాళ ప్రకటించిన బీజేపీ జాబితాలో బాలీవుడ్ క్విన్ కంగనా రనౌత్ సీటును కేటాయించారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోనే ఆమె పోటీ చేయనున్నారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని కంగనా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కంగనా తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భారత్, భారతీయ జనతా సొంత పార్టీ, బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన మండి నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమనేది హైకమాండ్ నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. నేను ఒక కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది చంద్రముఖి-2, తేజస్ సినిమాలతో మెప్పించింది. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే లోక్సభ బరిలో మరో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్కుమార్ సైతం తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high… — Kangana Ranaut (@KanganaTeam) March 24, 2024 -
వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
కంగనా రనౌత్ పుట్టినరోజు.. ఈ బ్యూటీ తల్లి గురించి తెలుసా?
రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు అంశం ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్. అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అందుకే కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పిలుస్తారు. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా.. ధైర్యంగా ఎదుర్కొగల సత్తా ఆమెది. మార్చి 23న కంగనా రనౌత్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మార్చి 23 1987లో హిమాచల్ ప్రదేశ్లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా రనౌత్.. అదే గ్రామంలో కంగనా అమ్మగారు ఇప్పటికీ కూడా పొలంలో పని చేస్తుంటారు. రోజుకు 8గంటల పాటు పొలంపనిలోనే ఆమె ఉంటారట. 25 ఏళ్లకుపైగా టీచర్గా పని చేసిన ఆమె తన కూతురు మిలీనియర్ అయినా కూడా పల్లెటూరులోనే జీవిస్తున్నారు. ముంబై వంటి నగరాలు అమ్మకు నచ్చవని అందుకే ఆమె సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతుందని గతంలో కంగనా తెలిపారు. ఆమె తల్లిదండ్రుల కోరికతో డాక్టర్ అవ్వాలనుకున్న కంగనా.. తన 16వ ఏటనే కెరీర్ కోసమని ఢిల్లీలో అడుగు పెట్టి ఆపై మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 2006లో గ్యాంగ్ స్టర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్.. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది. ఆపై ఆమె అనేక సినిమాలతో బాలీవుడ్లో తన సత్తా ఎంటో చూపించింది. ఆమెకు ఇప్పటివరకూ మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్- 3 సినిమా ఆమె కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ వీడియో ద్వారా తన చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇవాళ ఆమె 37వ బర్త్ డే జరుపుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన కంగనా.. కాంగ్రాలోని బగ్లాముఖి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆపై ఆమె ఫోటోలతో ఉన్న పలు కేక్స్ను కూడ కట్ చేశారు. ఆమె అభిమానులు భారీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీనితో పాటు 'తను వెడ్స్ మను పార్ట్ 3' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut_____) -
Kangana Ranaut: వివాదాల క్వీన్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?
కంగనా రనౌత్ పేరు చెప్పగానే ఆమె సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయి. తెలుగులో ప్రభాస్ 'ఏక్ నిరంజన్', తమిళంలో పలు సినిమాలు చేసినప్పటికీ.. హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఎందుకో ఈమెకి అస్సలు కలిసి రావడం లేదు. హిందీలో తీసిన ప్రతి సినిమా కూడా ఘోరమైన ఫ్లాప్స్గా నిలిచాయి. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) మరోవైపు కంగన.. తమిళంలో తలైవి, చంద్రముఖి 2 లాంటి చిత్రాల్లో నటించింది. యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చినప్పటికీ.. రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు మరో తమిళ సినిమాకు కంగన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గతంలో కంగనతో 'తలైవి' తీసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్.. ఇప్పుడు తన కొత్త మూవీలోనూ కంగననే తీసుకున్నట్లు సమాచారం. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే జరుగుతోందట. అలానే కంగన హీరోయిన్గా ఫిక్స్ అయిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు హిందీ సినిమాలు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా దక్షిణాది నుంచి వస్తున్నాయి. బహుశా కంగన కూడా హిందీ కంటే సౌత్ చిత్రాలు చేయడానికి అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుందా అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: 'సింపతీ స్టార్' బిరుదుపై స్పందించిన సమంత)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement