Kangana Ranaut
-
తండేల్ను వెనక్కి నెట్టిన ఎమర్జన్సీ.. సిల్లీ ఆస్కార్ అంటూ కంగనా కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్స్టా లో ట్వీట్స్ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్కు రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.కాగా.. నెట్ఫ్లిక్స్లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
ఓటీటీలో సడెన్గా 'ఎమర్జెన్సీ ' ఎంట్రీ
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని కంగనానే నిర్మించారు. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, సడెన్గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవంగా ఎమర్జెన్సీ మూవీని మార్చి 17న నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానున్నట్లు కంగనా ప్రకటించింది. కానీ, అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటించిన సమయం కంటే మూడు రోజులు ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. కంగనా ఇందులో ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. -
కంగనా రనౌత్ ఎమర్జన్సీ.. చెత్తగా తీశారన్న ప్రముఖ కన్నడ నటి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్పై ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన) ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కంగనా నటించిన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' పోలుస్తూ మాట్లాడారు. ఎమర్జన్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు వచ్చినప్పటికీ.. ఆ సినిమా నిర్మించిన తీరు బాగాలేదని ఆమె అన్నారు. కంగనా విషయానికొస్తే ఆమె అద్భుతమైన నటి అని కొనియాడింది. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా రమ్య కామెంట్స్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.రమ్య మాట్లాడుతూ.. "ఎమర్జెన్సీ చిత్రం చెత్తగా నిర్మించారు. కంగనా రనౌత్ చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆ సినిమాతో కంగనాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమా చెడుగా తీయడం వల్లే ప్రేక్షకులు తిరస్కరించారు. గతంలో కంగనా మణికర్ణికను కూడా నిర్మించింది ఆ మూవీ కంటెంట్ బాగుంది. అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అందుకే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.' అని తెలిపింది. కాగా.. కంగనా రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఎమర్జన్సీ చాలాసార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. -
క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్
ప్రసిద్ధ కవి, సినీ పాటల రచయిత జావెద్ అక్తర్(Javed Akhtar)కి బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) క్షమాపణలు చెప్పింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య వ్యవహారంలో అనవసరంగా పేరు ప్రస్తావించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ 2020లో కంగనాపై జావెద్ పరవునష్టం దావా వేశారు. ఒక సహ నటుడికి క్షమాపణ చెప్పాలంటూ జావెద్ 2016లో తనను బెదిరించారని, గౌరవానికి భంగం కలిగించారని కంగన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా వీరిద్దరు రాజీ కుదుర్చుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఇద్దరు సినీ ప్రముఖులూ శుక్రవారం హాజరై పరస్పర ఫిర్యాదులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. న్యాయస్థానం కూడా వీరిద్దరి నిర్ణయానికి అంగీకారం తెలిపింది. (చదవండి: సీరియస్ ప్రశ్న.. విష్ణు ఫన్నీ ఆన్సర్)‘ఈరోజు నేను, జావెద్ న్యాయ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నాం. ఆయన ఎంతో దయతో హుందాగా వ్యవహరించారు. నేను దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రానికి పాటలు రాయడానికి కూడా అంగీకరించారు’’ అని రనౌత్ ప్రకటించారు.‘కంగనా నాకు క్షమాపణలు కోరింది. మరోసారి ఇలాంటివి పునరావృతం చేయనని చెప్పింది. అందుకే కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. ఆమె కూడా నాపై పెట్టిన కేసును వాపసు తీసుకుంది’ అని జావెద్ అక్తర్ చెప్పారు. Kangana Ranaut has apologized to Javed Akhtar for her derogatory remarks & settled the defamation case in a Mumbai courtBJPigs regularly prove that they are true followers of Savarkar 🤡😂pic.twitter.com/n7qNn2oVDn— Veena Jain (@DrJain21) February 28, 2025 -
రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే?
ఒకరు చేసిన పనికి మరొకర్ని నిందించడం సరికాదంటోంది హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta). కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తనపై ఆరోపణలు గుప్పించినందుకుగానూ రాహుల్గాంధీపై ప్రతీకారం తీర్చుకోవడం తనకిష్టం లేదని చెప్తోంది. తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో చిట్చాట్ (ఆస్క్ మీ ఎనీథింగ్) నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది.రాహుల్ తప్పు లేదుఈ క్రమంలోనే ఓ వ్యక్తి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేసు పెడుతున్నావా? అని అడిగాడు. అందుకు ప్రీతి.. ఇతరులు చేసిన పనికి ఆయనను దూషించడం సరికాదు. ఎవరో చేసిన పనికి రాహుల్ గాంధీ బాధ్యుడెలా అవుతారు? ఏదైనా సమస్యను నేరుగా పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను తప్ప పరోక్ష యుద్ధాల ద్వారా కాదు. రాహుల్ గాంధీతో నాకు ఎటువంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా బతకనిద్దాం. అలాగే నేనూ శాంతియుతంగా జీవిస్తాను అని చెప్పుకొచ్చింది.బీజేపీతో దోస్తీ అంటూ ఆరోపణలుకాగా ఇటీవల కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి నటి తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని ఆరోపించింది. అందుకుగానూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని ఆరోపించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ప్రీతి లేదని బదులిచ్చింది. చాలా ఏళ్లుగా కొన్ని పార్టీలు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. కంగనాను నమ్ముతున్నానుఅలాగే మన దేశంలోని సోషల్ మీడియా చాలా విషపూరితంగా మారిపోయిందని పేర్కొంది. ఏ చిన్న కామెంట్ చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంది. తనకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని నొక్కి చెప్పింది. కంగనా (Kangana Ranaut) గురించి చెప్తూ.. ఆమె ఒక అద్భుతమైన నటి.. అలాగే ఫ్యాషన్ ఐకాన్. ఇప్పటివరకు డైరెక్టర్గా తను చేసిన పనిని చూడలేదు. కానీ మంచి దర్శకురాలు కాగలదని నమ్ముతున్నాను. రాజకీయ నాయకురాలిగా తన ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. హిమాచల్ ప్రదేశ్వాసులకు అంతా మంచే చేస్తుందని నమ్ముతున్నాను అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చింది. I don’t think it’s fair to vilify anyone like that, as he is not responsible for someone else’s actions. I believe in handling problems or issues directly & not through proxy battles. I also have no problem with Rahul Gandhi, so let him live in peace & I will live in peace too 😀 https://t.co/LAAGOdOJri— Preity G Zinta (@realpreityzinta) February 27, 2025 చదవండి: సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్కు ఆశ్చర్యపోయిన నటి -
50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) బాగా స్పెషల్. నటనా పరంగా ఎంచుకునే పాత్రలు మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఫైర్ బ్రాండ్గానే కనిపిస్తుంది. తన వాగ్భాణాలతో ఆనేకసార్లు వార్తల్లో నిలిచిన కంగన ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో నడుస్తున్న విడాకుల ట్రెండ్ మీద విరుచుకుపడింది. తరచుగా భారతీయతను ప్రస్తుతిస్తూ మాట్లాడే కంగన... ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వివరించడం విశేషం. మన దగ్గర భార్యాభర్తల బంధాలు ఎంత బలమైనవో చెప్పేందుకు ఆమె పాశ్చాత్య దేశాలతో పోల్చారు. దీని కోసం తాజాగా పాప్ స్టార్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) విడాకులు తీసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.జెన్నిఫర్ లోపెజ్ మరో హాలీవుడ్ (Hollywood) టాప్ స్టార్ బెన్ అఫ్లెక్ను 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ రెండేళ్ల వివాహాన్ని ముగించాలని లోపెజ్ పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 21న విడాకులు అమలులోకి వచ్చాయి. జనవరిలో లాస్ఏంజెలస్ కోర్టు ఆమోదించిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ తన పేరు నుండి ‘అఫ్లెక్‘ని తొలగించింది. నిజానికి లోపెజ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం ముందే వారు విడిపోయారు. అంటే వీరిద్దరూ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అఫ్లెక్కు మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ (Jennifer Garner)తో ముగ్గురు పిల్లలు, లోపెజ్కు మార్క్ ఆంథోనీతో కవల పిల్లలు ఉన్నారు.వీరి ఉదంతాన్ని కంగన తన ఇన్స్ట్రాగామ్ పోస్ట్ లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పాప్ ఐకాన్లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్– బోలెడంత కీర్తి, పుష్కలంగా సంపద జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్న విషయాన్ని కంగన ఎత్తి చూపింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలు మార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా సరైన జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉందనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ వివాహాలను పాశ్చాత్యులు ఎగతాళి చేయడాన్ని తప్పుపట్టిం. 'వారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. అత్యంత తెలివైన/మంచిగా కనిపించే నటుడు/చిత్రనిర్మాత/రచయిత, భూమిపై అత్యంత హాటెస్ట్ మ్యాన్ అని ఎందరో పొగిడే బెన్ అఫ్లెక్... పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ పరిపూర్ణ భార్య కోసం ఎదురుచూస్తున్నాడనీ, అలానే జెన్నిఫర్ లోపెజ్ కూడా స్వీయ నిర్మిత ధనవంతురాలు, గొప్ప పాప్ స్టార్లలో ఒకరైనా ఇప్పటికీ ఓ పరిపూర్ణ వ్యక్తి కోసం వెతుకుతున్నారనీ... వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప కాబట్టి వారికి ఎవరూ సరిపోరు కాబట్టి కొంతకాలానికే కనపడే లోపాలతో విసిగిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసి, కొన్ని నెలల వ్యవధిలోనే బ్రతుకు జీవుడా అంటూ వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు' అంటూ కంగన ఎద్దేవా చేసింది.ఈ సందర్భంగా కంగన తన వ్యక్తిగత అనుభవాల నుంచి తన పరిశీలనలను కూడా పంచుకుంది, పాశ్చాత్య సమాజం తరచుగా ‘పరిపూర్ణ‘ మ్యాచ్ కోసం శాశ్వత అన్వేషణను ఎంచుకుంటుందని వెల్లడించింది. అక్కడ వ్యక్తులు సాహచర్యాన్ని కనుగొనడానికి డేటింగ్ యాప్లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో అపరిచితులను వివాహం చేసుకున్నా కూడా వృద్ధాప్యంలో ఒకరినొకరు చేతులు పట్టుకుని కలిసి నడిచే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని ఆమె పొగడ్తలు గుప్పించింది. చదవండి: నటుడి లవ్ మ్యారేజ్.. పిల్లల కోసం ఆలోచించేలోపు విడాకుల దిశగా..‘‘పాశ్చాత్య దేశాలలో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా మారతాయనీ అయితే, భారతదేశంలో బలమైన సంప్రదాయాల పునాదులపై నిర్మించిన వివాహాలు జీవితకాలం కొనసాగుతాయనీ అన్నారామె. 80 ఏళ్ల వయస్సులో కూడా వృద్ధ జంటలు చేతులు జోడించి విహరించడాన్ని చూస్తున్న మనం పాశ్చాత్య ఆదర్శాలను ఆరాధించే బదులు, కాలక్రమేణా కొంత బలహీనపడినా మన స్వంత సాంస్కృతిక విలువలను పునరుద్ధరించుకోవాలనీ పాశ్చాత్య దేశాల నుంచి మార్గదర్శకత్వం పొందడం మానుకోవాలనీ హితవు చెప్పింది. గతంలో కూడా కంగన బాలీవుడ్ సినిమాల్లో వివాహ చిత్రణ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేసింది. వివాహ సంబంధాల సారాంశాన్ని బాలీవుడ్ ప్రేమకథలు తప్పుగా సూచిస్తున్నాయని ఆమె విమర్శించింది.చదవండి: కొన్నేళ్లుగా మాటల్లేవ్.. విడాకులకు కారణం ఇదేనా?కంగన చివరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రం చలనచిత్ర విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తన తదుపరి చిత్రంలో మాధవన్తో కలిసి నటిస్తోంది. -
ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్గా డేట్ చెప్పేసిన కంగనా
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని కంగనా సింపుల్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. ఎమర్జెన్సీ మార్చి 17న నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయినవారు ఎమర్జెన్సీ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.ఎమర్జెన్సీ కథఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది.చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
హిమాలయాల్లో రెస్టారెంట్ను ప్రారంభించిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్
-
కంగనా రనౌత్ రెస్టారెంట్.. తొలి కస్టమర్గా స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో తన బిజినెస్ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్కు మొదటి కస్టమర్గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా రెస్టారెంట్ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో వైరల్ అయిన 'మోనాలిసా'(16) గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తన అభిప్రాయాన్ని సోషల్మీడియా ద్వారా తెలిపారు. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేయంతో ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. చాలామంది ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని ఎగబడ్డారు కూడా.. అయితే తాజాగా మోనాలిసా గురించి కంగనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.'కుంభమేళాలో మోనాలిసాతో చాలామంది ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంతమాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేము. మన చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపై కూడా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా..? బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన దీపికా పడుకోణె, కాజోల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా..? మోనాలిసాను భారీగా వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపై కూడా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా..? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి.' అని ఆమె పోస్ట్ చేశారు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం తాజాగా థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీనే కంగనానే దర్శకత్వం వహించింది. మాధవన్తో కలిసి ఆమె మరో రెండు చిత్రాలలో నటిస్తుంది.సొంతూరు వెళ్లిపోయిన మోనాలిసామధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. -
రిలీజ్కు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. సినీ ప్రియులకు బంపరాఫర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025వివాదాలతో ఆలస్యం..ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు. -
కంగనా మూవీకి షాక్.. ఆ దేశంలో బ్యాన్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన చిత్రం ఎమర్జన్సీ. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చినా ఈ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తానే దర్శకత్వం వహించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బంగ్లాదేశ్లో బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. హసీనా ప్రభుత్వం పడిపోయాక.. భారత్- బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమర్జన్సీ మూవీని అక్కడ బ్యాన్ చేయనున్నారని లేటేస్ట్ టాక్.ఈ ఈ చిత్రంలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయీగా శ్రేయాస్ తల్పడే కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు రానుంది.ఎమర్జన్సీ వీక్షించిన కేంద్రమంత్రి..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎమర్జన్సీ మూవీని వీక్షించారు. ఆయన కోసం కంగనా రనౌత్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. (ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.ఆది నుంచి వివాదాలే..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు..ఈ సినిమా ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ పలువురు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో సెన్సార్ బోర్డు తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ కంగన మండిపడ్డారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం కొత్త ఏడాదిలో థియేటర్లలో సందడి చేయనుంది. -
ఇకపై అలాంటి సినిమాలు తీయను: Kangana Ranaut
-
దర్శకులపై కంగనా సంచలన వ్యాఖ్యలు..
-
నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్
హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏ ముహూర్తాన ఎమర్జెన్సీ సినిమా మొదలుపెట్టిందో కానీ అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజవ్వాల్సిన సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. అన్ని అడ్డంకులు దాటుకుని ఎమర్జెన్సీ (Emergency Movie) ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.తప్పు చేశా..ఎమర్జెన్సీ సినిమా తీయడమేమో కానీ తనను మూడు చెరువుల నీళ్లు తాగించారంటోంది కంగనా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఓటీటీకి వెళ్లుంటే ఇంకా అక్కడ మంచి డీల్ దొరికేది. ఈ సెన్సార్ బాధలు పడే గత్యంతరమే వచ్చుండేది కాదు. అసలు సెన్సార్ బోర్డు (The Central Board for Film Certification) నా చిత్రంలో ఆయా సన్నివేశాలను ఎందుకు తీసేయాలనుకుందో అర్థమే కాలేదు. వారు సూచించిన కట్స్ అన్నీ కూడా చరిత్రలో భాగమైనవే! అయినా వాటిని తీసేసినా కూడా నా సినిమా ధృడంగానే ఉంది.అది నా మొదటి తప్పుఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం ఒక్కటే నేను చేసిన తప్పు కాదు. దానికంటే ముందు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం అతి పెద్ద తప్పుగా భావిస్తున్నాను. గతంలో కిస్సా కుర్సీ కా (ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీల రాజకీయాలపై వచ్చిన సెటైరికల్ మూవీ) మూవీ వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదు. కారణం.. బ్యాన్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమా ప్రింట్లన్నింటినీ కాల్చేశారు. ఆ చిత్ర దర్శకుడు అమృత్ నహ్త ఆత్మహత్య చేసుకున్నాడు. (చదవండి: 'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు)మీకే తెలుస్తుందిఅప్పటినుంచి ఇప్పటివరకు ఇందిరా గాంధీపై ఏ ఒక్కరూ సినిమా తీసే ధైర్యం చేయలేదు. నాకూ దాదాపు అలాంటి పరిస్థితులే వస్తాయని ఊహించలేదు. స్టూడియో కోసం, బడ్జెట్ కోసం కష్టపడాల్సి వచ్చింది. ఇంత చేస్తే నా మూవీ రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడీ సినిమా చూశాక ఇప్పటి జనరేషన్కు ఇందిరాగాంధీ మూడుసార్లు ప్రధాని ఎలా అయిందో తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది.అది తెలుసుకుని మాట్లాడుఈమె ఇంటర్వ్యూ విన్న నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంతా ఓకే కానీ, కిస్సా కుర్సీ కా డైరెక్టర్ అమృత్ నహ్త బలవన్మరణం చేసుకోలేదని చెప్తున్నారు. ఆయన అనారోగ్యంతో మరణించారని.. కాస్త తెలుసుకుని మాట్లాడమని సూచిస్తున్నారు.సినిమా విశేషంకాగా కంగనా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, అశోక్ చబ్రా, మహిమ చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీశ్ కౌశిక్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం ఈ నెల 17న రిలీజవుతోంది.చదవండి: ప్రభాస్ హీరోయిన్కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు! -
ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్లో చోటు ఉంటుంది.'అని అన్నారు.కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)మొదటి నుంచి వివాదాలు..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. -
స్త్రీవాదాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఘోరం: కంగనా
భార్య వేధింపులు.. భార్య కుటుంబం బ్లాక్మెయిలింగ్.. కొడుకును కళ్లారా చూసుకోలేని దుస్థితి, న్యాయం చెప్పాల్సిన కోర్టు కూడా భార్యకే మద్దతు.. ఈ పరిస్థితుల మధ్య అతుల్ సుభాష్ నలిగిపోయాడు, కుమిలిపోయాడు. మగవారికి న్యాయం దొరకదన్న నిరాశ నిస్పృహలోకి వెళ్లిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో మరణమే శరణమని వేడుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ విషాద ఘటనపై హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు.99 శాతం మగవారిదే తప్పు: కంగనాకంగనా మాట్లాడుతూ.. యావత్ దేశం షాక్లో ఉంది. అతుల్ చివరి వీడియో చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. స్త్రీవాదం పేరుతో ఎంతకైనా తెగించడం హీనమైన చర్య. అతడి ఆర్థిక పరిస్థితికి మించి తన దగ్గరి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడికి వల్ల అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ ఒక్క సంఘటన వల్ల మహిళలందర్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవారిదే తప్పుంటుంది. అందుకే ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..అసలేం జరిగింది?బెంగళూరుకు చెందిన ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నితిక సింఘానియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ముందు 24 పేజీల సూసైడ్ నోట్తో పాటు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. తప్పుడు కేసుల వల్ల ఎంతోమంది భర్తలు చనిపోతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని తన డెత్ నోట్లో పేర్కొన్నాడు.చదవండి: మంచు మనోజ్పై దాడి ఘటన.. ఒకరి అరెస్ట్ -
ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్పీజీ’ వైరల్ : తప్పులో కాలేసిన కంగనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో లేడీ ఎస్పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ. -
ఉద్ధవ్ రాక్షసుడు.. మహిళలను అవమానించారు: కంగన
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు. మహిళలను అవమానించిన కారణంగానే ‘రాక్షసుడు’ ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఓటమిని తాను ముందే ఊహించినట్లు ఆమె తెలిపారు. స్త్రీలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని అనుసరించే ఎవరు రాక్షసుడో.. ఎవరు మంచివారో గుర్తించగలమన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించిన దరిమిలా కంగనా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు.వారు తన ఇంటిని పడగొట్టారని, నానా దుర్భాషలాడారని అటువంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నమ్మానని కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శిక్షకు అర్హుడని, ఈ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన కంగనా ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని పేర్కొన్నారు.దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమని కంగనా పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ, 2020, సెప్టెంబర్లో బీఎంసీ ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసింది. తరువాత బాంబే హైకోర్టు బీఎంసీ ఆదేశాలను రద్దు చేసింది. కంగనా నష్టపరిహారానికి అర్హురాలిగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
ఎంవీఏ ఓ రాక్షస కూటమి: కంగన
న్యూఢిల్లీ/సిమ్లా/ముంబై: మహిళలను గౌరవించకపోవడం వల్లే మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ఓడిపోయిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఆమె ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంవీఏను రాక్షస కూటమిగా అభివర్ణించారు. మహిళలను గౌరవించే వారు దేవతలుగా, గౌరవించనివాళ్లు రాక్షసులుగా మిగిలిపోతారన్నారు. 2020లో అవిభాజ్య శివసేన నేతృత్వంలోని ఎంవీఏ సర్కారు ముంబైలోని కంగనా బంగ్లాను కూల్చేయడం తెలిసిందే. అప్పట్లో తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. ‘‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారికి మహారాష్ట్ర ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు. అభివృద్ధికి, సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు’’ అన్నారు. -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' విడుదలకు లైన్ క్లియర్
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై మరోసారి అధికారిక ప్రకటన వచ్చేసింది. కంగనా లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోసం ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాస్తవంగా ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ చిక్కుల వల్ల పలు ఇబ్బందలు రావడంతో రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో విడుదల విషయంలో చిక్కులు వచ్చాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. -
కంగనా రనౌత్ ఇంట విషాదం.. తనే మా ఇన్స్పిరేషన్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అమ్మమ్మ ఇంద్రానీ ఠాకూర్ కన్నుమూసింది. ఈ విషాద వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెతో కలిసున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మా అమ్మమ్మ ఎంతో శక్తివంతమైనది. తనకు ఐదుగురు సంతానం. అందరికీ మంచి విద్య అందించాలని తాపత్రయపడింది. అంతేకాదు ఉన్నత విద్యతో పాటు పెళ్లయిన తర్వాత కూడా తన కూతుర్లు సొంతకాళ్లపై నిలబడాలని కోరుకుంది. సొంత కాళ్లపై నిలబడాలని..వంటింటికే పరిమితం కాకుండా వారికంటూ సొంత కెరీర్ ఉండాలని భావించింది. అప్పట్లోనే తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుని పేరు తెచ్చుకున్నారు. అలా తన సంతానంలోని ఐదుగురు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అది చూసి ఆమె ఎంతో గర్వపడేది. తను ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండేది. చాలా ఆరోగ్యంగానూ ఉండేది. బ్రెయిన్ స్ట్రోక్100 ఏళ్ల వయసుపైబడి ఉన్నప్పటికీ తన పనులన్నీ తనే చేసుకునేది. ఆమె ఎత్తూపొడుగు నాకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం గది శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల మంచానికే పరిమితమైంది. తననలా చూసి మా మనసు తట్టుకోలేకపోయింది. మా అందరికీ తనే స్ఫూర్తి. తను మా డీఎన్ఏలోనే ఉంది. ఆమెను ఎన్నటికీ మర్చిపోలేం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.సినిమాకాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. కంగనా స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది.చదవండి: సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్ -
ఎమర్జెన్సీకి లైన్ క్లియర్.. విడుదల తేదీపై ఉత్కంఠ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్పోన్ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్కు మోక్షం అప్పుడేనా?)కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024 -
కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్కు మోక్షం అప్పుడేనా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
చిన్నప్పుడు అలా ఉండేదాన్ని.. ఛాన్స్ దొరికితే చాలు!
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. బాల్యంలోనూ కెమెరా ముందు పోజులిచ్చేదాన్నంటూ అందుకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నేడు (అక్టోబర్ 9న) ఆమె సోదరుడు అక్షత్ బర్త్డే. దీంతో అతడికి బర్త్డే విషెస్ కూడా తెలియజేసింది. చిన్నప్పుడు వీళ్లిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్న ఫోటోను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసింది.చిన్నప్పుడు అలా ఉండేదాన్ని'నేను పాత ఆల్బమ్స్ చూసినప్పుడు అస్సలు నవ్వాపుకోలేను. ఎందుకంటే చిన్నప్పుడు భలే సరదాగా ఉండేదాన్ని. నేను దాచుకున్న డబ్బుతో చిన్న కెమెరా కొనుక్కుని ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు దిగేదాన్ని. మేము కారులో వెళ్లేటప్పుడు నాన్న ఒక్క నిమిషం కారు ఆపినా సరే వెంటనే బయటకు దిగి మళ్లీ ఫోటోలు క్లిక్మనిపించేదాన్ని.క్లిక్.. క్లిక్.. క్లిక్..చదువుకోమంటే గదిలోకి వెళ్లి ఫోటోకు పోజులిచ్చేేదాన్ని. తోటలోకి వెళ్లి ఏదైనా కూరగాయలు తెమ్మంటే కూడా అక్కడున్న మొక్కతో కలిసి ఫోటో దిగేదాన్ని. అద్దం ముందు దిగిన ఫోటోలో అయితే నాలో ఉన్న దర్శకురాలి ఆసక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.సినిమా..హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పెరిగిన కంగనా.. సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చింది. 2006లో గ్యాంగ్స్టర్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఏక్ నిరంజన్, చంద్రముఖి 2 సినిమాల్లో నటించింది. ఈమె ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలకు సన్నద్ధమవుతోంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడు ఏం మాట్లాడతారో కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్గా ఉంది మేడం!
ఏ సమయంలో ఏం మాట్లాడతారోనని కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్గా ఉంది మేడం! -
ఖరీదైన ఇల్లు అమ్మేసి లగ్జరీ కారు కొన్న హీరోయిన్
మన దగ్గరేమో గానీ బాలీవుడ్లో సెలబ్రిటీలు చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కంగనా రనౌత్ చేరింది. మొన్నీ మధ్యే రూ.32 కోట్ల విలువ చేసే తన ఇంటిని అమ్మేసిన కంగన.. ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే కంగనా రనౌత్ గుర్తొస్తుంది. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చాలామందిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగానూ గెలిచింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఈ మధ్య కాలంలో 'ఎమర్జెన్సీ' సినిమాతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇందిరా గాంధీగా కంగన కనిపించనుంది. లెక్క ప్రకారం సెప్టెంబరు 6న ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్లు కట్ చేయాలని చెప్పింది. అప్పటినుంచి దీని రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది.ఇవన్నీ పక్కనబెడితే మొన్నీమధ్యే పాలి హిల్స్లోని రూ.32 కోట్ల ఖరీదైన బంగ్లాని అమ్మేసిన కంగన.. ఇప్పుడు తన ఆఫీస్ అవసరాల కోసం రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఎల్డబ్ల్యూబీ అనే లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ఖరీదు దాదాపు రూ.3.81 కోట్లుగా ఉంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
కంగనా 'ఎమర్జెన్సీ'కి లైన్ క్లియర్! అందుకు ఓకే అంటేనే..
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.సెప్టెంబర్ 30కి విచారణ వాయిదామీ దగ్గర ఏదైనా గుడ్న్యూస్ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!ఎమర్జెన్సీఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల -
‘క్షమించండి’ అని వేడుకున్నా.. కంగనాపై ఆగని విమర్శలు
ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు. #WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7— TIMES NOW (@TimesNow) September 25, 2024పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలిమంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతంఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు. చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు -
Kangana : నన్ను క్షమించండి..!
-
వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యలు వివాదాస్పదం.. వెనక్కి తగ్గిన కంగనా
వ్యవసాయ చట్టాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వెనక్కి తగ్గారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా అభిప్రాయాలు, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఈ మేరకు కంగనా ఓ వీడియో విడుదల చేశారు.‘నా వ్యాఖ్యలు చాలా మందిని నిరాశకు గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి ఉమ్మడి బాధ్యత’’ అని కంగనా పేర్కొన్నారు. Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024కాగా మండి ఎంపీ కంగనా రనౌత్.. రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు రైతులే స్వయంగా డిమాండ్ చేయాలని కోరారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి. వీటి కోసం రైతులే డిమాండ్ చేయాలి.ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల ఆందోళనల వల్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. రైతుల మేలు కోసమే ఈ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నా’ కంగనా పేర్కొన్నారు. కంగన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కంగన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. -
కాషాయ పార్టీని ఇరుకునపెట్టిన కంగనా.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ
సిమ్లా: కేంద్రం రద్దు చేసిన సాగు చట్టాలపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు.బీజేపీ ఎంపీ కంగనా తాజాగా మండి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను కేంద్రం తీసుకువచ్చి అమలుచేయాలి. దేశ అభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే రైతుల కోసం ఉపయోగపడే మూడు చట్టాలను తీసుకురావాల్సిందే. ఇందుకు రైతులే చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో కంగనా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో, తన వ్యాఖ్యలపై ఆమె మళ్లీ స్పందించారు. అవి కేవలం తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంగనా కామెంట్స్ బీజేపీకి సంకటంగా మారాయి. "All three farm laws should be reinstated." -- BJP MP Kangana RanautIs BJP bringing back those 3 Black Farmers law?why BJP is anti-Farmers? pic.twitter.com/OPw5kgaBZC— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) September 24, 2024 ఈ నేపథ్యంలోనే కంగనా వ్యాఖ్యలను బీజేపీ సీరియస్గానే తీసుకుంది. బీజేపీకి డ్యామేజ్ కాకుండనే ఉద్దేశ్యంతో కాషాయ పార్టీ కంగనాకు దూరం పాటించింది. కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. #WATCH | BJP leader Gaurav Bhatia says, "On the social media platforms, BJP MP Kangana Ranaut's statement on the farm bills that was withdrawn by central govt, is going viral. I want to make it clear that this statement is a personal statement of her. Kangana Ranaut is not… pic.twitter.com/hZmJ8j7Qf8— ANI (@ANI) September 24, 2024 అయితే, కంగనా ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో కేంద్రంలోకి బీజేపీ సర్కార్ను ఇరుకున పెడుతూనే ఉంది. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. ఈ సమయంలో పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని ఘాటుగానే చెప్పారు. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో ఆమె ఇంకా ఏ విషయాలపై స్పందిస్తారో అనే టెన్షన్ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. ఇది కూడా చదవండి: ఆ సొమ్ము సోనియా రిలీఫ్ ఫండ్కు : కంగనా ఆరోపణ -
ఆ సొమ్ము సోనియా రిలీఫ్ ఫండ్కు : కంగనా ఆరోపణ
హిమాచల్: బీజేపీ నేత, ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం(హిమాచల్ ప్రదేశ్)లో ఆర్థికపరమైన సంక్షోభం నెలకొన్నదని ఆమె ఆరోపించారు. దీనిని దేశమంతా గమనిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పైనుంచి డబ్బులు వచ్చేవని, అవి సోనియా రిలీఫ్ ఫండ్కు చేరేవని కంగనా ఆరోపించారు.కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకల పేర్లను ప్రస్తావించకుండా వారి బాల్యం అద్భుతంగా గడిచిందని కంగనా పేర్కొన్నారు. అయితే తన బాల్యాన్ని 15 సంవత్సరాల వయస్సులోనే లాక్కున్నారని, చిన్నప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించానని తెలిపారు. తాను కాలేజీ వయసులో ఉన్నప్పుడు తన వయసులోని అమ్మాయిలు ప్రేమలేఖలు రాసుకునేవారని, తాను మాత్రం స్క్రిప్ట్లు రాయడం ప్రారంభించానని కంగనా పేర్కొన్నారు.వారి బాల్యం (రాహుల్, ప్రియాంక) 50 ఏళ్లు కొనసాగుతుందని, తన బాల్యం 15 ఏళ్లు కూడా కొనసాగలేదని కంగనా వాపోయారు. నాటి రోజుల్లోనే తాను దేశ క్షేమం కోసం ఆలోచించడం ప్రారంభించానని అన్నారు. మండి జిల్లాలోని గోహర్కు వచ్చిన ఆమె.. తాను తుక్డే గ్యాంగ్తో ఒంటరిగా పోరాడిన విషయం అందరికీ తెలుసన్నారు. తాను కష్టాలను భరిస్తూ, దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంటానని, దేశంలోని ఆడపిల్లల రక్షణ కోసం మాట్లాడతానని కంగనా పేర్కొన్నారు. ఇది కూడా చడవండి: యాచకులను నియంత్రించండి.. పాక్కు సౌదీ హెచ్చరిక -
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన దురుసు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలు తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చెయ్యాలని తెలిపారు.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్లోని తన నియోజకవర్గం మండిలో ఆమె మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని కోరారు. ‘ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ మూడు వ్యవసాయ చట్టాలు తిరిగి అమలు చేయాలి. ఇందుకు రైతులు స్వయంగా డిమాండ్ చేయాలి. ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్థంభం. వారి ప్రయోజనాల కోసం చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ అది జరగనివ్వదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. ‘మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దీనిని ఎప్పటికీ అనుమతించం’ అని పేర్కొన్నారు.కాగా 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు. ఆందోళనల్లో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అనంతరం ఈ నేపథ్యంలో తమ నిరసనలను రైతులు నిలిపివేశారు. -
సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్
హిమాచల్ ప్రభుత్వం, సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపత్తు సాయం కోసం ఉద్ధేశించిన నిధులను హిమాచల్ ప్రభుత్వం.. వాటిని సోనియా గాంధీకి అక్రమంగా బదిలీ చేసినట్లు కంగన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. లేని పక్షంలో ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘కంగన తన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే.. మేం పరువు నష్టం దావా వేస్తాం. ఆమె ఆధారాలతో అలాంటి ప్రకటన చేసింది? సోనియా గాంధీ లాంటి నాయకురాలిపై ఆమె అలాంటి ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం.కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు సోనియా గాంధీకి ఇస్తున్నారని చెప్పడం కంటే పెద్ద మూర్ఖపు ప్రకటన మరొకటి ఉండదు. ఒక్క రూపాయి అయినా దారి మళ్లినట్లు రుజువు చేయాలి. లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం కేసు పెడుతుంది’ అని తెలిపారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేశాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరి సోనియా గాంధీకి నిధులు బదిలీ చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడిందని అన్నారు. ‘కేంద్రం విపత్తు నిధులు ఇస్తే, అది సీఎం రిలీఫ్ ఫండ్కు వెళుతుంది. అయితే హిమాచల్లో సోనియా రిలీఫ్ ఫండ్కు వెళుతుంది’ అని మనాలిలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యక్రమంలో పేర్కొన్నారు. -
సోనియాగాంధీపై కంగన సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.కాగా,ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్ల చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్పై కంగన మండిపాటు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బాలీవుడ్ నటి, మండి లోక్సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.భారత్లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని విమర్శలు గుప్పించారు.అనంతరం తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదాపై కంగనా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రాన్ని నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్రబృందం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇదొక భారీ బడ్జెట్ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నకొద్దీ మేము ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్పై ఉంది’’ అని ఆమె చెప్పారు. -
బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన
హైదరాబాద్: ఎంపీ, నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు.దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.సినిమా ఇండస్ట్రీలో బోగం వేషాలు వేసే కంగనా రనౌత్కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
అప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం లాభం? : కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పెళ్లిపై తన మనసులోని మాటను బటయపెట్టింది. అందరిలాగే తనకు కూడా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని ఉందని చెప్పింది. అయితే దానికి సరైన సమయం రావాలని, అప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. పదవిలో ఉండగానే పెళ్లి!తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనాకు పెళ్లిపై ఓ ప్రశ్న ఎదురరైంది. ‘ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘దేవుడి దయ వల్లే అదే జరగాలని కోరుకుంటున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఈ పదవి కాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఏం లాభం’ అని కంగనా నవ్వుతూ బదులిచ్చింది. 2024 ఎన్పికల్లో కంగనా.. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచింది. 2029 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ లోపే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కంగానా భావిస్తున్నట్లు ఉంది. పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలిఅయితే పెళ్లి గురించి కంగనా మాట్లాడడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది. (చదవండి: స్త్రీ-2 దెబ్బకు షారూక్ జవాన్ రికార్డ్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే?)ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
అందుకే నా బంగ్లాను అమ్మేశా: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పలు కారణాల వల్ల ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమెర్జెన్సీ’ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం కోసం ఆమె తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టింది. అయితే విడుదల వాయిదా పడడంతో డబ్బు కోసం తను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ఆమె స్పందిస్తూ.. బంగ్లాను అమ్మిన మాట నిజమేనని, ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కూడా వివరించింది.(చదవండి: 'జాన్వీకపూర్ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!)‘నాకు తెలిసి ఆస్తులు అంటే మనకు అవసరం అయినప్పుడు ఆదుకునేవే. నేను దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడింది. నా దగ్గరు ఉన్న డబ్బంతా ఈ సినిమాపై పెట్టాను. విడుదల అయితే తప్ప నాకు డబ్బు రాదు. అందుకే నేను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మేశాను’ అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా అమ్మిన బంగ్లా.. ముంబైలో ఉన్న బాంద్రాలోని పాలిహిల్ పాత్రంలో ఉంది. 2017లో ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. తాజాగా రూ. 32 కోట్లకు ఈ బంగ్లాను విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: త్రివిక్రమ్పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)ఇక ఎమర్జెన్సీ విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న విడుదల కావాల్సింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ డేట్ని ప్రకటించనున్నారు. -
మరోసారి వాయిదా
కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసారి వాయిదా పడింది. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది.ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ విడుదలలో మరింత జాప్యం కానుంది. సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇదే విషయాన్ని తాజాగా కంగనా రనౌత్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీంతో ఈ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడింది.ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతుందని తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్ చేశారు. ' ఎంతో ప్రతిష్టాత్మకంగా నా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' విడుదల మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి కోసం ఇప్పటికీ నేను ఎదురుచూస్తూనే ఉన్నాను. అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ విషయంలో ప్రేక్షకులు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని కంగనా పేర్కొంది.కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. సినిమా ప్రారంభం నుంచే చాలా విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల కోసం ముంబై హైకోర్టును కూడా కంగనా ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను తాము ఆదేశించలేమని ముంబై హైకోర్టు తెలిపింది. దీంతో మరోసారి వాయిదా తప్పలేదు.ఎమర్జెన్సీ సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్వాలేను చూపించవద్దనీ, పంజాబ్ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి తనపై ఉందని కంగనా తెలిపారు. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో..? అని ఆమె ప్రశ్నించారు. కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్షిప్ ఉంటుందని ఆమె ఘాటుగా స్పందించారు. ఈ సినిమా విషయంలో కంగనాపై హత్య బెదిరింపులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కంగన ‘ఎమర్జెన్సీ’కి దక్కని ఊరట
ముంబై: కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’సినిమాకు విడుదల కష్టాలు తప్పట్లేవు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు సినిమా సర్టిఫికేషన్ పూర్తవలేదు. తక్షణం సర్టిఫై చేయాల్సిందిగా సెన్సార్ బోర్డును ఆదేశించలేమని జస్టిస్ బీపీ కోలాబవాలా, జస్టిస్ ఫిర్దోశ్ పూనీవాలాల బాంబే హైకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది. సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఆదేశించాలంటూ సినిమా నిర్మాణసంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. సినిమాలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీంతో సినిమాకు సరి్టఫికేట్ ఇచ్చే ముందు వీరి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ అంశాన్ని బుధవారం బాంబే హైకోర్టు ప్రస్తావించింది. ‘సర్టిఫికేషన్ అంశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచి్చంది. ఆ ఉత్తర్వులు లేకపోయి ఉంటే ఈరోజే సరి్టఫై చేయాలని సీబీఎఫ్సీని ఆదేశించేవాళ్లం. ఈ దశలో మేం కలుగజేసుకోవడం సబబు కాదు. అందుకే తక్షణం సర్టిఫై చేయాలని ఆదేశించలేం. అయితే సినిమాపై వస్తున్న అభ్యంతరాలపై ఈనెల 18లోపు సీబీఎఫ్సీ నిర్ణయం తీసుకోవాలి’అని హైకోర్టు సూచించింది. సినిమాకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో కంగన అసహనంతో ఒక పోస్ట్చేశారు. ‘‘ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్బోర్డు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్వయంగా బాంబే హైకోర్టే చెబుతోంది’అని కంగన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
Emergency: కంగనాకు బాంబే హైకోర్టు షాక్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ) సినిమాకు ఎదురుదెబ్బ తగలింది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు బుధవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలాతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ చిత్ర సహ నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారనను 19వ తేదీకి వాయిదా వేసింది.కాగా ఎమర్జెన్సీ చిత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కాలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ముఖ్యంగా 1975లో ఆమె విధంచిన ఎమర్జెన్సీ కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగనా నటించడమే కాకుండా, దర్శకత్వం, నిర్మతగానూ వ్యవహరించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమాను వ్యతిరేకిస్తూ అనేక సిక్కు సంస్థలు ఆందోళనలు చేయడంతో వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎమర్జెన్సీ విడుదలను నిలిపివేయాలంటూ సిక్కు సంస్థలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సిక్క సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి వ్యతిరేకంగా జబల్పూర్ హైకోర్టులో(మధ్యప్రదేశ్) పిటిషన్ దాఖలు చేసి, దాని ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరారు. దానిని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ‘ఎమర్జెన్సీ’ని విడుదల చేయాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంగనా, చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. . ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెలువడింది. -
'అలాంటి వారు ముందుగా సినిమా చూడండి'.. ఎమర్జన్సీపై ఆదిపురుష్ రచయిత!
ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఎమర్జన్సీ చిత్రానికి ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషిర్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీకి సిక్కు కమ్యూనిటీ ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ మూవీ రిలీజ్ను అడ్డుకోవద్దని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాపై కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చంపింది నిజం కాదా? అని వారిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదా? అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పంజాబ్లోని అమృత్సర్లో బ్లూ స్టార్ ఆపరేషన్ సమయంలో మరణించిన ఖలిస్తాన్ ఉద్యమ నాయకులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే గురించి రచయిత ప్రస్తావించారు. ఈ చిత్రంలో జర్నైల్ సింగ్ను ఉగ్రవాదిలా చూపిస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన అతను ఉగ్రవాది కాదా? అని ముంతశిర్ ప్రశ్నించారు. దయచేసిన భింద్రావాలేను హీరోగా గుర్తించవద్దని సిక్కు సమాజాన్ని కోరాడు.ఎమర్జన్సీ కంటెంట్పై అభ్యంతరం చెప్పే ముందు సినిమాను చూడమని వారిని కోరారు. ధైర్యమైన సిక్కు సమాజం సినిమా విడుదలకు భయపడుతుందని తాను నమ్మడం లేదన్నారు. వారు భారతదేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. అలాంటి ధైర్యం కలిగిన వారు కేవలం సినిమాకే భయపడుతారంటే ఎవరు నమ్ముతారని మనోజ్ అన్నారు. కాగా.. ఎమర్జన్సీ మూవీ రిలీజ్ను అడ్డుకోవాలంటూ సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని హితవు పలికారు. ఇది పూర్తిగా భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్ర హక్కును హరించడమేనని తెలిపారు. సినిమాపై నిరసనలు తెలిపే వారు.. ముందుగా థియేటర్లలో విడుదలై చూసిన తర్వాత.. అందులో తప్పులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ కూడా నటించారు. అయితే ఈ మూవీపై ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కంగనా రనౌత్కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు: కంగనా రనౌత్
‘‘నేనెంతో ఆత్మగౌరవంతో ఈ సినిమాని రూపొందించాను. కత్తెర లేని వెర్షన్నే రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నాను. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. అన్కట్ వెర్షన్నే విడుదల చేస్తాను’’ అని కంగనా రనౌత్ అన్నారు. కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.ఈ నెల 6న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది ఘోరమైన పరిస్థితి. మన దేశం విషయంలో చాలా నిరాశగా ఉన్నాను. ఓటీటీలో హింస, అశ్లీలం వంటివి చూపించినా అభ్యంతరం చెప్పరు. ఓటీటీకి అంత స్వేచ్ఛ ఉంది.నా సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్వాలేను చూపించవద్దనీ, పంజాబ్ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి ఉంది. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో? కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్షిప్ ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు. -
కంగనా రనౌత్కు కోర్టు నోటీసులు.. 'ఎమర్జెన్సీ' వాయిదా తప్పదా..?
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించిన మణికర్ణిక ఫిల్మ్స్తో పాటు సెన్సార్ బోర్డు, జీ స్టూడియోస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటున్నారని ఇప్పటికే కంగనా రనౌత్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా కోర్టు నోటీసులతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా విషయంలో 24 గంటల్లోపు స్పందించాలని వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కింది. సెప్టెంబరు 6న విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కంగనా రనౌత్కు అడ్డంకులు ఎదురౌతున్నాయి. అయితే, ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
వాళ్ల వేధింపులు తట్టుకోలేక దేశం విడిచి వెళ్లాలనుకున్నా: కంగనా రనౌత్
‘‘సినిమా పరిశ్రమలో దాదాపు పదేళ్ల పాటు నాకు అవకాశాలు రాకుండా కొంతమంది కుట్రలు చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆ సమయంలో దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకున్నాను’’ అని నటి, మండీ లోక్సభ ఎంపీ కంగనా రౌత్ అన్నారు. ఆమె లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ నెల 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు. ‘‘సినిమా పరిశ్రమ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఎప్పటికైనా మంచి హీరోయిన్ కావాలనే ఆశతో 2004లో ముంబైకి వచ్చాను. 2005–06లో ‘గ్యాంగ్స్టర్’, ‘వో లమ్హే’ సినిమాల్లో నటించాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్స్టర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాను. నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. పొగడ్తలు పక్కన పెడితే దాదాపు పదేళ్ల పాటు నాకు అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఛాన్సులు దొరకలేదు. నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం బాలీవుడ్ మాఫియా అని అర్థం అయ్యింది. ఒకానొక సమయంలో దేశమే నన్ను బహిష్కరించిందనిపించింది.. విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నాను. అమెరికాకు వెళ్లిపోయి ఓ షార్ట్ ఫిలిం కూడా తీశాను. అయితే 2014లో విడుదలైన ‘క్వీన్’ సినిమా నా కెరీర్ను మలుపు తిప్పింది’’ అని కంగనా తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘నాకు నటించడం సులభం. కానీ, నటిగా చేయడం పెద్దగా ఇష్టం లేదు. డైరెక్టర్గా ఉండటం ఇష్టం. నటిగా ఉంటే సెట్స్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. అదే డైరెక్టర్గా ఉంటే పూర్తి విషయాలు తెలుస్తాయి. పైగా సెట్స్లో డైరెక్టర్కు ఎక్కువ గౌరవం ఉంటుంది’’ అన్నారు. -
కంగనా రనౌత్ కు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్
-
నాకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి: కంగనా రనౌత్
బాలీవుడ్ టాప్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అంశాన్ని తెరపై చూపించనున్నారు. అయితే, ఈ సినిమా విడుదలను ఆపేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ని శిరోమణి అకాలీదళ్ డిల్లీ(ఎస్ఏడీ) పార్టీ కోరింది. ఈ సినిమాతో చరిత్రను తప్పుగా చూపించనున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు పరమజిత్ సింగ్ సర్నా ఒక లేఖ రాశారు. ఇందులోని సీన్స్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు.అత్యాచారాలపై కంగనా రనౌత్కు చాలా అనుభవం ఉంది: మాజీ ఎంపీకంగనా రనౌత్పై పంజాబ్ మాజీ ఎంపీ, అకాలీదళ్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో రైతుల నిరసనల సందర్భంగా లైంగిక దాడులు జరిగాయని బాలీవుడ్ క్వీన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సిమ్రంజిత్ సింగ్ మాన్ భగ్గుమన్నారు. లైంగిక దాడి ఎలా జరుగుతుందో కంగనా రనౌత్ను అడగండి అంటూ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అత్యాచారాలపై ఆమెకు చాలా అనుభవం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటామని కూడా ఆయన తెలిపారు.రేప్ను సైకిల్ తొక్కడంతో పోల్చడం సిగ్గుచేటు : కంగనాసినిమా విడుదలకు మందే తనకు రేప్ బెదిరింపులు వస్తున్నాయని, అలాంటి బెదిరింపు వ్యూహాలతో తన గొంతును ఆపలేరని కంగనా రనౌత్ నొక్కి చెప్పారు. ప్రముఖ మీడియా సంస్థతో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. 'కొందరు నాపై తుపాకీలు ఎక్కుపెట్టారు. ఒక కళాకారుడి గొంతు అణచివేయాలని చూస్తున్నారు. నేను వారి తుపాకీలకు భయపడను. ఈ దేశం అత్యాచారాలను చిన్నచూపు చూస్తుందేమో అనిపిస్తోంది. ఈరోజు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారానికి గురికావడాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చడం ఆశ్చర్యపోనవసరం లేదు. సరదా కోసం మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అని ఆమె అన్నారు.ఎవరు అడ్డుకుంటారో చూస్తా: కంగనాఎమర్జెన్సీ సినిమా రిలీజ్కు పంజాబ్లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను విడుదలను ఆపేయాలని ఆప్ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఒక వీడియో ద్వారా హెచ్చరికలు కూడా వారు జారీ చేశారు. అయితే బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటూ కంగానా చెప్పారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఎదురుదాడికి దిగారు. అయితే, తన సినిమాపై ఇంత జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వారంలో రెండో సారి.. జేపీ నడ్డాతో కంగనా భేటీ
రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ భేటీలో ఏం చర్చ జరింగిందన్న అంశంపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ వారం ప్రారంభంలో కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. రైతుల నిరసనపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ ఖండించింది.అదే సమయంలో ఆమె స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) పేర్కొంది.ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కంగనా జేపీ నడ్డాతో భేటీ అవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.दिल्ली: जेपी नड्डा के आवास पहुंचीं कंगना रनौत, किसान आंदोलन पर कंगना ने बयान से बीजेपी पार्टी के नेता नाराज़ थे। जिसके चलते बीजेपी ने पार्टी लाइन से हटकर बयानबाजी न करने की नसीहत भी दी थी। #Delhi @JPNadda #KanganaTeam pic.twitter.com/9r6nxypRnx— Ashutosh Tripathi (@tripsashu) August 29, 2024 -
సినిమా రిలీజ్ చేస్తే చంపేస్తాం.. కంగనా స్ట్రాంగ్ కౌంటర్
-
నీలో టాలెంట్ ఉందా?.. ఇక్కడైతే తొక్కేస్తారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. బీటౌన్లో తన కామెంట్స్తో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా మారింది. గత ఎన్నికల్లో భాజపా ఎంపీగా గెలిచిన కంగనా ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో తలెత్తిన ఎమర్జన్సీ నేపథ్యంలో తెరకెక్కించారు.అయితే తాజాగా కంగనా రనౌత్ బాలీవుడ్పై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లను ఎదగనివ్వరని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ అంతా ఈర్ష్య, అసూయలతో నిండిపోయిందని ఆరోపించారు. అందువల్లే చాలామంది కెరీర్స్ నాశనమయ్యాయని పేర్కొంది. ఎదగాలనుకునే వారికి బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన వేదిక కాదన్నారు. ఒకవేళ ఎవరైనా తమ టాలెంట్తో పైకి వస్తే.. వారిని టార్గెట్ చేసి, పరువు తీసి తొక్కేస్తారని కంగనా వివరించింది. అలాగే తనపై కొంతమంది అసూయతో ఉన్నారని తెలిపింది.కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఎమర్జెన్సీ చిత్రం.. కంగనా రనౌత్కు బెదిరింపులు
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై హత్య బెదిరింపులు వచ్చాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. కంగనా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమానే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోసిస్తున్నారు.సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కంగనాపై ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య గురించి ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ' ఈ సినిమాలో అతన్ని (ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే) టెర్రరిస్ట్గా చిత్రీకరిస్తే, మీరు ఎవరి గురించి సినిమా తీస్తున్నారో ఆ వ్యక్తి (ఇందిరా గాంధీ)కి ఏమి జరిగిందో గుర్తుంచుకోండి? సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆమెను ఎలా చంపారో గుర్తు చేసుకోండి. వారి మాదిరే మేమూ మా తల అర్పిస్తాం.. లేదా తల నరికివేయవచ్చు కూడా..' అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పాడు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇద్దరూ ఇందిరాగాంధీపై కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను టెర్రరిస్ట్గా చూపిస్తే సహంచమని కంగనాను వారు హెచ్చరించారు. పంజాబ్లో వేర్పాటువాదం కోరుకొన్నవారిలో భింద్రన్వాలే ఒకరు అని తెలిసిందే. వారు మాట్లాడిన వీడియోను మహారాష్ట్ర, పంజాబ్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ కంగనా రనౌత్ షేర్ చేశారు.ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకూ ఈ దేశంలో ఏమి జరుగుతోంది..? బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై ఇలా బహిరంగంగానే బెదిరింపులకు దిగడమేంటి..? కేవలం భారతదేశ చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తారా.. దేశంలో ఎంతో బలమైన ప్రధాన మంత్రులలో ఒకరిగా గుర్తింపు ఉన్న ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గురించి సినిమాగా చెప్పడం తప్పా..? అంటూ దయచేసి మీ భద్రతను పెంచుకోండి అని కంగనా రనౌత్కు నెటిజన్లు సూచిస్తున్నారు.What is happening in our nation? People are openly threatening the life of BJP MP and Bollywood actress 𝗞𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗥𝗮𝗻𝗮𝘂𝘁 simply for portraying India's history. Is it wrong to tell the story of the Iron Lady of India, who is celebrated as one of the country's strongest… pic.twitter.com/w1QWJhAkG3— Rahul Chauhan (@RahulCh9290) August 26, 2024 -
కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం
ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.2020 మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.కంగనా రౌనత్కు ఆ అధికారం లేదురైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ ట్వీట్ చేసింది. తప్పు.. ఇలా మాట్లాడకూడదుమరోవైపు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. BJP expressed disagreement with its MP Kangna Ranaut's comments on farmers agitation, says she is not authorised to speak on policy issues. pic.twitter.com/xJ878F5pWK— Press Trust of India (@PTI_News) August 26, 2024 -
బాలీవుడ్లో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు: కంగనా రనౌత్
‘‘బాలీవుడ్లోని పలువురు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. నా సినిమాల్లో నటించొద్దని చాలామందికి ఫోన్స్ చేసి మరీ చెప్పారు’’ అన్నారు హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా రూపొందిన ఈ సినిమాని కంగనా రనౌత్, రేణు పిట్టి నిర్మించారు. పలు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్లో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. పలువురు క్యాస్టింగ్ దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్ నాతో పని చేయడానికి నిరాకరించారు. అంతేకాదు... నాతో పని చేయొద్దని చాలామంది నటులకు ఫోన్లు చేశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులు, సవాళ్ల మధ్య అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, మహిమా చౌదరి వంటి నటీనటులతో ‘ఎమర్జెన్సీ’ కోసం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారు నా సినిమాలో భాగమవడంతో పాటు నన్నెంతో ప్రేమగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
నా ఫస్ట్ సినిమా.. నాన్న ఇంటికి వచ్చేయమన్నారు: కంగనా
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్.. 2006లో గ్యాంగ్స్టర్ సినిమాతో వెండితెరపై ప్రయాణం ఆరంభించింది. అయితే దర్శకుడు అనురాగ్ బసు, కంగనా ఓ కెఫెలో కలుసుకున్నారని, అలా ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.అది నిజం కాదుదాని గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో కంగనా మాట్లాడుతూ.. అందులో ఏమాత్రం నిజం లేదు. ఆడిషన్ ద్వారానే నన్ను సెలక్ట్ చేశారు. కాకపోతే సినిమాను ప్రమోట్ చేయాలంటే ఏదైనా కొత్తగా చెప్పాలి కదా.. అందుకే అలా స్టంట్లు చేశారు. బాలీవుడ్లో ఏం జరుగుతుంది? సినీప్రపంచం ఎలా ఉంటుందనేది మా ఇంట్లోవారికి పెద్దగా తెలీదు.కోప్పడ్డారుకాకపోతే వారికి అనురాగ్ బసు తెరకెక్కించిన మర్డర్ సినిమా తెలుసు. ఆ మూవీని డైరెక్ట్ చేసిన వ్యక్తే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలిసి కోప్పడ్డారు. నాన్న.. వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఇంటికి తిరిగి వచ్చేయమన్నాడు. ఎలాగోలా అతడిని ఒప్పించాను. హీరోయిన్ అవ్వాలనుకున్నాపైగా అప్పుడే నా స్కూల్ అయిపోయింది. అంత చిన్న వయసులో నాలుగైదేళ్ల పిల్లవాడికి తల్లిగా నటించాలన్నారు. నిజానికి నాకన్నా ముందు నటి చిత్రాంగద సింగ్ను సెలక్ట్ చేశారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ పాత్ర తిరిగి నా దగ్గరికే వచ్చింది. నేను హీరోయిన్ అవ్వాలనుకున్నాను. అందుకే అంతగా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను అని చెప్పుకొచ్చింది. -
అన్నీ తానై.. కంగన 'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటి కంగన రనౌత్.. ప్రస్తుతం బీజేపీ తరఫున ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇప్పుడు ఈమె ఒకప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రని పోషిస్తూ ఓ సినిమా చేసింది. అదే 'ఎమర్జెన్సీ'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మూవీని రిలీజ్కి సిద్ధం చేశారు. సెప్టెంబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)ట్రైలర్ విషయానికొస్తే.. 1971లో మన దేశంలో జరిగిన ఎమర్జెన్సీ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ అంతా ఆసక్తిగా ఉంది. కంగన.. ఇందిరా గాంధీ, శ్రేయస్ తల్పడే.. వాజ్పేయి, అనుపమ్ ఖేర్.. జయప్రకాశ్ నారాయణ్ పాత్రల్లో కనిపించారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో ఏంటో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!) -
రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: కంగనా
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిండెన్బర్గ్ రిసెర్చ్ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్పర్సన్ మాధవీ బుచ్పై చేసిన ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశాన్నికూడా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఎక్స్లో.. ‘రాహుల్ గాంధీ చాలా విషపూరితమైన, ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ప్రధాని కాలేదనే నిరాశలో దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని అస్థిరపరిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత రాత్రి రాహుల్.. స్టాక్ మార్కెన్ను లక్ష్యంగా చేసుకొని హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికకు వత్తాసు పలికారు. దేశ ప్రజల కీర్తిని, ఎదుగుదలను చూసి మీరు బాధపడుతున్న తీరు చూస్తుంటే మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ తమ నేతగా గెలిపించరు. రాహుల్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉండాలి’ చురకలంటించారు.Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can't be the Prime Minister then he might as well destroy this nation.Hindenberg report targeting our stock market that Rahul Gandhi was endorsing last night has turned out…— Kangana Ranaut (@KanganaTeam) August 12, 2024 కాగా హిండెన్బర్గ్ నివేదికపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..‘ ఛైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేస్తున్నారు. సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఒకవేళ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే..ఎవరిది బాధ్యత? ప్రధాని మోదీనా? సెబీ ఛైర్పర్సనా? లేదా అదానీనా? ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా విచారణ చేపడుతుందా?’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. -
కోట్ల ఆస్తిని అమ్మకానికి పెట్టిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ, నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 6న వెండితెరపైకి రానుంది. కంగనా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో వైరల్గా మారింది. ముంబయిలోని తన ఇంటిని అమ్మకాని పెట్టారని టాక్ వినిపిస్తోంది. అందులోనే కంగనా నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం కూడా ఉంది. బాంద్రాలో దాదాపు 3,042 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రెండు అంతస్తుల భవనం అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటి ధరను రూ. 40 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కంగనా అధికారికంగా వెల్లడించలేదు.అయితే గతంలో సెప్టెంబర్ 2020లో గ్రేటర్ ముంబయి అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత కంగనా కేసు దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు స్టే విధించింది. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కావాలనే నన్ను టార్గెట్ చేశారని కంగనా ఆరోపించింది. అప్పట్లో రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఆ తర్వాత మే 2023లో కంగనాపై అభియోగాలను బీఎంసీ ఉపసంహరించుకుంది. -
కంగనా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండీ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు. అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
‘నేతలు గోల్గప్పాలు అమ్ముకోవాలా?’: కంగనా
బాలీవుడ్ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె జ్యోతిర్మఠం(ఉత్తరాఖండ్)నకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల ముంబైలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంలో ద్రోహం పెద్ద పాపమని పేర్కొన్నారు. అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యల నేపధ్యంలో కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ ఉదంతంపై బాలీవుడ్ క్వీన్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఎంపీ కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మద్దతు పలుకుతూ, అవిముక్తేశ్వరానందపై విమర్శలు చేశారు. శంకరాచార్య తన పదజాలంతో మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగనా ఆరోపించారు.కంగనా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో..‘ రాజకీయాల్లో పొత్తు, పార్టీ విభజన అనేవి చాలా సాధారణమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలని, 1907లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని, 1971లోనూ ఇలానే జరిగిందని, నేతలు రాజకీయాలు చేయకపోతే గోల్గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన శంకరాచార్య హిందూ ధర్మం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा? शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024 -
పెళ్లి వేడుకలో కంగనా.. ఫ్యామిలీతో సంతోషంగా.. (ఫోటోలు)
-
మరో వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్
ధర్మశాల : బీజేపీ ఎంపీ,బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో మండీ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె తన నియోజకవర్గ ప్రజలతో భేటీ అవుతున్నారు. ఈ తరుణంలో సమస్యల్ని పరిష్కరించమని తన వద్దకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.కంగనా రౌనత్పై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాధిత్య సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు నియోజక వర్గ ప్రజలకు ఏదైనా సమస్యలుంటే తనని కలవవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ అవసరం లేదు. మనం ప్రజలకు ప్రతినిధులం.రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి.అది పెద్దదవ్వొచ్చు. చిన్నదవ్వొచ్చు. లేదంటే వారి వ్యక్తిగత పనులు కావొచ్చు.గుర్తింపు కార్డ్ అవసరం లేదుని స్పష్టం చేశారు.ప్రజలు ఐడెంటిటి కార్డ్లు తీసుకొని రావాలని చెప్పడం సరైన పద్దతి కాదని ధ్వజమెత్తారుప్రజల్ని ఆధార్ కార్డ్ అడగడంపై వస్తున్న విమర్శలకు కంగనా రౌనత్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం టూరిస్ట్లకు హాట్స్పాట్.ఇక్కడికి అనేక మంది వస్తుంటారు.అందుకే నియోజక వర్గ ప్రజల్ని ఆధార్ కార్డ్ అడిగాను. ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరించడమే నా లక్ష్యం. ఎవరూ ఇబ్బంది పడకూడదు’అని వ్యాఖ్యానించారు. నెటిజన్లు సైతం కంగనా రనౌత్ను విమర్శిస్తున్నారు. ఓట్లు అడిగే సమయంలో ఆధార్ కార్డ్ అడగలేదు. ఎన్నికల ముందు ఆధార్ కార్డ్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
కంగనా రనౌత్కు చెంపదెబ్బ : ఆమె బెంగళూరుకు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్కు బదిలీ చేశారు.చంఢీగడ్ ఎయిర్పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్పై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎంపీలు కంగనా-చిరాగ్.. అదిరిపోయే లుక్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా మారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి, కంగనా విజయం సాధించారు. దీంతో ఇప్పుడు మీడియా దృష్టి కంగనాపై నిలిచింది.లోక్ సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బుధవారం ఎంపీలంతా పార్లమెంట్కు వచ్చారు. ఇదే కోవలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభ మెట్లు ఎక్కగానే మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా ఆమెకు సమీపంలో కనిపించారు. పార్లమెంట్ మెట్ల మీద వారిద్దరూ కలుసుకుని, నవ్వుతూ పరస్పరం పలుకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్స్ తమ అభిమాన నేతలను చూసి సంబరపడుతున్నారు.కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ గతంలో ఒక చిత్రంలో కలిసి నటించారు. 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’లో వీరిద్దరూ కనిపించారు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలుగా మారి రాజకీయాల్లో విజయం సాధించారు. వీరు నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ సారధ్యంలో రాజకీయాల వైపు పయనం మొదలుపెట్టారు. 2024లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా తొలి ఇన్నింగ్స్లోనే విజయాన్ని అందుకున్నారు. #WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0— ANI (@ANI) June 26, 2024 -
సెప్టెంబరులో ఎమర్జెన్సీ
భారతదేశంలో ఏర్పడ్డ ఎమర్జెన్సీ (25 జూన్ 1975 – 21 మార్చి 1977) పరిస్థితుల ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో భారతదేశ దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, అశోక్ చబ్రా, మహిమా చౌదరి ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను కంగనా రనౌత్, పి. రేణు నిర్మించారు.ఈ సినిమాను తొలుత గత నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 14న రిలీజ్కు ప్లాన్ చేశారు. ఆ తేదీకి కూడా రాలేదు. తాజాగా ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘‘భారతదేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడి జూన్ 25 నాటికి 49 సంవత్సరాలు పూర్తయి, 50వ ఏడాదిలోకి అడుగుపెట్టాం. నాటి పరిస్థితుల నేపథ్యంలో తీసిన ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నాం. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోని ఈ వివాదాస్పదమైన ఎపిసోడ్ను మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
'ఎమర్జెన్సీ'ని ప్రకటించిన కంగనా రనౌత్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే, దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 49 ఏళ్లు పూర్తి కానున్నాయి. 50వ ఏడాదిలోకి అడుగుపెడుతుంది. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ భారత్లో ఎమర్జెన్సీ విధించారు. 'ఎమర్జెన్సీ చీకటిరోజులు' అంటూ తాజాగా తను నిర్మిస్తున్న ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని కంగనా రనౌత్ ప్రకటించారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం 2024 సెప్టెంబర్ 6న విడుదల కానుందని కంగనా రనౌత్ తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్ను ఆమె పంచుకున్నారు. వాస్తవంగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.మణికర్ణిక ప్రొడక్షన్పై ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్ నిర్మించారు. ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు ఆమె చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
సోదరుడికి ప్రేమతో.. కంగనా కాస్ట్లీ గిఫ్ట్ అదిరిందిగా! (ఫోటోలు)
-
ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?
స్టార్ హీరోయిన్, ఈ మధ్య ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. కజిన్ వరుణ్ రనౌత్ పెళ్లి రీసెంట్గా అతడికి చంఢీగడ్లో ఖరీదైన లగ్జరీ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా స్టోరీలో మొత్తం అవే ఫొటోలని పోస్ట్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు)హిమాచల్ ప్రదేశ్కి చెందిన కంగనా రనౌత్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో ఇబ్బందులు దాటుకుని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ప్రభాస్తో 'ఏక్ నిరంజన్' సినిమా చేసింది. గత కొన్నాళ్ల నుంచి ఓవైపు నటిస్తున్నప్పటికీ మరోవైప రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటూ వచ్చింది. అలా ఈ మధ్య లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయిపోయింది.అలా ఎంపీగా అయిన ఆనందంలో ఉన్న కంగనా రనౌత్.. రీసెంట్గా తమ్ముడు వరసయ్యే వరుణ్ పెళ్లికి హాజరైంది. అందరిలా కాకుండా ఏకంగా ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చి అతడిని సర్ప్రైజ్ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' సినిమాలో కంగన నటిస్తోంది. ఒకప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగన నటిస్తోంది. ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) View this post on Instagram A post shared by Varun Ranaut (@varunranaut) -
రాజకీయాల కంటే సినిమాలే నయం: కంగనా రనౌత్
రాజకీయాల్లో అడుగుపెట్టడమే ఆలస్యం.. ఎంపీగా గెలిచి సత్తా చూపించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే లీనమవుతానని ఈ మధ్యే వెల్లడించింది. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఎప్పటినుంచో ఆహ్వానాలుకంగనా రనౌత్ మాట్లాడుతూ.. 'రాజకీయాల నుంచి పిలుపు రావడం నాకు కొత్తేమీ కాదు. నా ఫస్ట్ సినిమా గ్యాంగ్స్టర్ రిలీజైన వెంటనే టికెట్ ఆఫర్ చేశారు. ఆ తర్వాత కూడా పలుసార్లు పాలిటిక్స్లోకి రావాలంటూ ఆహ్వానాలు అందాయి. మా తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సెస్ ఉంది కనుకనే మమ్మల్ని పదేపదే పాలిటిక్స్లోకి రమ్మని ఆహ్వానించేవారు. నాతో పాటు మా నాన్నకు, చెల్లికి కూడా పిలుపొచ్చింది. ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదునాకు ఆసక్తి లేకపోయుంటే ఇంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదు. నేనెప్పుడూ నా మనసుకు నచ్చింది చేస్తుంటాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కేవలం హీరోయిన్గానే కాకుండా డైరెక్టర్గా, నిర్మాతగా, రచయిత్రిగా ఇలా రకరకాల పనులు చేశాను. ఇప్పుడు రాజకీయ జీవితంలోనూ అలాగే ఉంటాను. జనం మధ్యలోకి వెళ్లాలనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని కలుస్తాను. సినిమాలో ఈజీచెప్పాలంటే రాజకీయాల కంటే సినిమాలే ఈజీ. ఇక్కడ ఒక్క సినిమా చూస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోతాం.. కానీ పాలిటిక్స్లో అలా కాదు! డాక్టర్స్ లాగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కోసం లీడర్స్ ఎప్పుడూ అందుబాటులో' ఉండాలి అని చెప్పుకొచ్చింది. కంగనా స్వీయదర్శకత్వంలో నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది.చదవండి: నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్ చేయండి: అజయ్ ఘోష్ -
ఎంపీని కానిస్టేబుల్ కొట్టడం దేనికి సంకేతం?
హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్ను చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆ కానిస్టేబుల్ సోదరుడు కిసాన్ మజ్దూర్ సంఘ్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు. సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్ కౌర్ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో... నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్ సీఎం కీలక కామెంట్స్
చండీగఢ్: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందని చెప్పారు.#WATCH | On Kangana Ranaut-CISF constable incident, Punjab CM Bhagwant Mann says, "That was anger. She (Kangana Ranaut) had said things earlier and there was anger for it in the heart of the girl (CISF constable). This should not have happened. But in reply to it, despite being a… pic.twitter.com/cFhWBw5fxb— ANI (@ANI) June 10, 2024‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్మాన్ మీడియాతో చెప్పారు. జూన్6వ తేదీన కంగన చండీగఢ్ ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది. -
మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో..కంగనా దేశీ లుక్ అదుర్స్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె రాజకీయనాయకురాలిగా తన ప్రస్థానం మొదలుపెట్టనుంది. ముచ్చగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో కంగనా రనౌత్ సరికొత్త స్టన్నింగ్ లుక్లో కనిపించింది. ఆమె నిజమైన బంగారం, వెండితో నేసిన చీరలో తళుక్కుమంది. అందుకు తగట్టు ధరించిన నగలతో అందర్నీ ఆకర్షిచింది. రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించేలా సరికొత్త దేశీ స్టయిల్ని అనుసరిస్తోంది. My oath day look, howz it ? 🙂 pic.twitter.com/VgKGJof69S— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 9, 2024ఈ వేడుక కోసం చేనేత చీర, అమ్రపాల జ్యువెలరీస్ని ఎంపిక చేసుకుంది కంగనా. లైట్ మేకప్తో వెరైటీ హెయర్ స్టయిల్తో సరికొత్త లుక్లో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.(చదవండి: ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!) -
తల్లిని ఏదైనా అంటే చెంప చెళ్లుమనిపిస్తానన్న కంగనా.. 'తను చేసిందీ అదేగా!'
తొలిసారి ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను ఓ కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయంలో కొందరు కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్కు, మరికొందరు నటికి మద్దతు పలుకుతున్నారు. కాగా నాలుగేళ్ల క్రితం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. రూ.100 తీసుకుని ధర్నావాళ్లంతా వంద రూపాయలు తీసుకుని ధర్నాలో పాల్గొన్నారని విమర్శించింది. అప్పట్లో ఆమె కామెంట్లు రైతులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే ఆ ధర్నా చేస్తున్నవాళ్లలో తన తల్లి కూడా ఉందని కుల్విందర్ పేర్కొంది. రైతులను కించపరిచినందుకే తనకు చెంప దెబ్బ రుచి చూపించానంది. ఈ ఘటనపై కంగనా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి చేయడాన్ని సమర్థిస్తున్నారంటే..'నేరం చేసే ప్రతివాడికీ ఏదో ఒక కారణం ఉంటుంది. అలా అని నేరస్తుల భావోద్వేగాలకు విలువిస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తిపై దాడి చేయడం వంటి ఘటను సమర్థిస్తే అత్యాచారం, హత్యలు జరిగినా మీకేం పర్వాలేదనే అర్థం. మీలాంటివారు మీ మానసిక స్థితిపై దృష్టి సారించండి' అని ఘాటుగా ట్వీట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్లు ఆమె పాత పోస్టులను తవ్వి తీస్తున్నారు. 2022లో జరిగిన ఆస్కార్ వేడుకలో హాలీవుడ్ నటుడు క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్యను ఎగతాళి చేశాడు. దీంతో ఆస్కార్ వేదికపైనే క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు స్మిత్. ఈ చర్యను కంగనా సమర్థించింది. నేనైతే ఇలాగే చేస్తాతన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. 'ఎవరైనా తెలివితక్కువ మనుషులు నా తల్లి లేదా సోదరి అనారోగ్యంపై ఇలా కుళ్లు జోకులు వేస్తే నేను కూడా విల్ స్మిత్లాగే చెంప చెళ్లుమనిపిస్తాను. మంచి పని చేశావ్..' అని మెచ్చుకుంది. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఆ కానిస్టేబుల్ కూడా నువ్వు చెప్పినట్లే చేసింది, తల్లిని చులకన చేస్తూ లాగి పెట్టి కొడతానన్నావ్ కదా.. తనూ అదే చేసింది.., దీన్నే ఖర్మ అంటారు, నీకు ఇలా కావాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. As per Kangana Ranaut Will Smith can hit someone for making a joke on his wife but another woman can’t hit her for calling her mother “100rs m baithne wali” & asking to behead her farmer father ?? Hypocrisy ki seema guyss https://t.co/YmvsKCATfS pic.twitter.com/HWrsGQqS0t— m 🕊🍉 (@luco_zain) June 8, 2024 చదవండి: తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు -
మాజీ ప్రియురాలికి సపోర్ట్ చేసిన స్టార్ హీరో
హీరోయిన్ కంగనా రనౌత్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అనే పదమే. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ చేసింది గానీ తర్వాత తర్వాత మూవీస్ కంటే వివాదాల వల్లే పేరు తెచ్చుకుంది. రీసెంట్గా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించింది. కానీ గెలిచిన తర్వాత రోజే ఈమెకు చండీగఢ్ ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కంగన చెంప చెళ్లుమనిపించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో భిన్నాబిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)గతంలో ఖలీస్థానీ ఉద్యమం గురించి కంగన చేసిన కామెంట్స్ వల్ల సదరు మహిళా అధికారి కంగన చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు మహిళా అధికారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ తదితరులు మాత్రం కంగనకు జరిగిన అవమానంపై తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కంగనకు అండగా నిలబడుతున్నారు.మిగతా వాళ్ల సంగతేమో గానీ తాజాగా సీఐఎస్ఎఫ్ అధికారికి వ్యతిరేకంగా పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కంగన-హృతిక్ ప్రేమించుకున్నారు. పరిస్థితులు అనుకూలించక విడిపోయారు. మధ్యలో పోలీస్ కేసుల వరకు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు మాజీ ప్రియురాలికి పరోక్షంగా హృతిక్ సపోర్ట్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్) -
కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్కు జాబ్ ఆఫర్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను చండీగఢ్ ఎయిర్పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కాగా గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాపై.. కంగనా అనుచిత చేసిన వ్యాఖ్యలను గానూ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండగా ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో నటి చెంప చెళ్లుమనిపించారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా ఉందని, రైతులను అవమానించినందుకే తాను ఈపని చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆమెపై విచారణ జరుగుతోంది. -
‘నా తల్లి కోసం ఇలాంటి వెయ్యి ఉద్యోగాలైనా కోల్పోతా’ : కుల్విందర్ కౌర్
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ సస్పెండ్ అయ్యారు. అయితే, తాజా పరిణామాలపై కుల్విందర్ కౌర్ స్పందించారు. ఈ ఉద్యోగం పోతుందనే భయం లేదు.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా తల్లి గౌరవం కోసం అలాంటి వేలాది ఉద్యోగాలను కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు.కంగనా రనౌత్ గతంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ధర్నా చేసిన వారిలో తన తల్లి కూడా ఉందంటూ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కంగనాను చెంప దెబ్బకొట్టింది. రైతులను అగౌరపరించినందుకు తాను ఈ పనిచేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘనటపై కొన్ని గంటల్లోనే ఆమె సస్పెండ్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఉదయం పోలీసులు కుల్విందర్ కౌర్ను అరెస్ట్ అయ్యారు. కాగా, కంగనాపై చేయి చేసుకున్న కుల్విందర్ కౌర్కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమె ఒప్పుకుంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఎవరైనా మీ తల్లి రూ.100కే అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే మీరేం చేస్తారు? అని ప్రశ్నించారు. मुझे नौकरी की फिक्र नहीं है,मां की इज्जत पर ऐसी हजारों नौकरियां कुर्बान है- कुलविंदर कौर— Kulvinder Kaur (@Kul_winderKaur) June 7, 2024 -
‘కంగన’కు చెంపదెబ్బ.. సంజయ్రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీఎంపీ కంగనా రనౌత్ను మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు వేస్తారు. కొందరు చెంపదెబ్బలు కొడతారు. కంగనా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆమెపై నాకు సానుభూతి ఉంది.ఆమె ఇప్పుడు ఒక ఎంపీ. ఎంపీపై దాడి జరగకూడదు. ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెబుతున్నట్లు ఆమె తల్లి గనుక రైతుల ధర్నాలో ఉంటే కోపం వస్తుంది. రైతుల పోరాటానికి వ్యతిరేకంగా కంగన మాట్లాడింది. నాకు రైతుల పట్ల గౌరవం ఉంది’అని సంజయ్రౌత్ అన్నారు.ఛండీగఢ్ ఎయిర్పోర్టులో తనిఖీల సందర్భంగా కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం సంచలనం రేపింది. కంగన రైతుల పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడినందునే తాను కొట్టినట్లు కానిస్టేబుల్ తెలిపింది. కాగా, గతంలో మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నప్పుడు కంగన శివసేనకు వ్యతిరేకంగా తరచూ సవాళ్లు విసురుతూ ఉండేది. ఒక దశలో ముంబైలోని కంగనా స్టూడియో భవనాన్ని మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. -
కంగనా రనౌత్కు చెంపదెబ్బ.. కుల్విందర్ కౌర్ అరెస్ట్
బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ను కానిస్టేబుల్ చెంపదెబ్బ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఆపై ఆమెను అరెస్ట్ చేసింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..బీజేపీ నేత, మండీ లోక్సభ ఎంపీ కంగన రనౌత్ చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చండీగఢ్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టారు. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న కంగనను కుల్విందర్ కౌర్ చెంప పగలగొట్టింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా2020లో మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమేనని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చెపట్టారు. దీంతో తలొగ్గిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.సింగర్ రిహానా మద్దతుఆ సమయంలో ప్రముఖ సింగర్ రిహానా భారత్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని రిహానా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో పలువురు ప్రముఖ ఆమెకు మద్దతుగా నిలిచారు. నోరు పారేసుకున్న కంగనా రనౌత్రిహానా ట్వీట్పై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీగా మార్చాలని అనుకుంటున్నారు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. మేం మాదేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు’ అంటూ రిహానాపై కంగానా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు.టైమ్ మ్యాగజైన్లో బిల్కిస్దీనికి తోడు టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఆయా దేశాలకు 100మంది అత్యంత ప్రభావశీలురు జాబితాను విడుదల చేస్తోంది. 2019లో టైమ్ మ్యాగజైన్ .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్ బాగ్లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్ బాగ్ దాదీగా పేరొందిన 82 ఏళ్ల (నాడు) బిల్కిస్ ముందుండి నడిపించారు. బిల్కిస్ను ప్రస్తావిస్తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో బిల్కిస్ పాల్గొన్నారని, ఆమె రోజువారీ కిరాయి ప్రాతిపదికన అందుబాటులో ఉంటారని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఉద్యోమంలో పాల్గొనందుకు ఆమెకు ఆహారం, బట్టలు, అవార్డ్లు, పాకెట్ మనీ ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆట్వీట్ను కంగాన రీట్వీట్ చేస్తూ “హ హ హ ఆమె అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో కనిపించిన అదే దాదీ. ఆమె రూ.100 రూపాయలకే ధర్నాలో పాల్గొన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రతీకారం తీర్చున్న కుల్విందర్ కౌర్ఈ నేపథ్యంలో నాడు కంగానా చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్ఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఎయిర్ పోర్ట్లో ప్రతీకారం తీర్చున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్ పోర్ట్లోకి వచ్చిన కంగనాను కుల్విందర్ కౌర్ చెంప చెళ్లుమనిపించారు.అందుకే కొట్టాఅనంతరం రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది. కాగా, కంగనాను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ విభాగం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధుల నుంచి తొలగించింది. -
కంగనాను కొట్టిన మహిళకు బంపరాఫర్.. ప్రముఖ సింగర్ పోస్ట్ వైరల్!
ఇప్పుడు దేశవ్యాప్తంగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పైనే ఉంది. తాజాగా ఆమెపై సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారిపోయింది. కంగనా ఎంపీగా గెలవడంతో చెంపదెబ్బ కొట్టిన మహిళా ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే రైతుల ధర్నాను ఉద్దేశించి కంగనా గతంలో కామెంట్స్ చేసినందుకే తాను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెల్లడించింది. ఇదే విషయాన్ని కంగనా కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఈ ఘటనపై కంగనా మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని, అయితే పంజాబ్లో పెరిగిపోతున్న ఉగ్రవాదులను ఏం చేయాలో అర్థం కావడం లేదని వీడియో రిలీజ్ చేసింది. ఈ ఘటనపై అధికారులు మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాబ్ ఇస్తానని హామీతాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించాడు. కంగనాపై చేయి చేసుకున్న ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు. ఆమెతో తనకు ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వను.. కానీ ఆమె కోపాన్ని నేను కచ్చితంగా అర్థం చేసుకున్నానని తెలిపారు. సీఐఎస్ఎఫ్ ఆమెపై చర్యలు తీసుకున్నట్లయితే.. తనకు ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నా.. జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఎవరైనా మీ మదర్ రూ.100కు అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావ్? ఆయన ప్రశ్నించారు. గతంలో కంగనా రైతుల ధర్నాను ఉద్దేశించి రూ.100 కోసం వచ్చారంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలోనూ కంగనా చేసిన పోస్టును షేర్ చేశాడు. -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
ఎయిర్పోర్ట్లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024 -
కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది!
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై గురువారం దాడి జరిగింది. ఛండీగఢ్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది ఒకరు ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల్ని, రైతు ఉద్యమాన్ని అవమానించేలా కంగనా మాట్లాడిందంటూ సదరు సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి కంగన ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ నిమిత్తం సీఐఎస్ఎప్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. This is Kulwinder Kaur, the CISF officer posted at Chandigarh airport who slapped actor and BJP MP #KanganaRanaut today. pic.twitter.com/fTiQzwrf3x— هارون خان (@iamharunkhan) June 6, 2024 -
ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో షేర్ చేసిన కంగనా
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ టికెట్పై పోటీ చేసిన కంగనా రనౌత్ విజయాన్ని అందుకున్నారు. ఆమె హిమాచల్లోని మండీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై ఆమె విజయం సాధించారు. తన విజయంపై కంగనా స్పందిస్తూ ఇది ప్రధాని మోదీ వల్లే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖ నేతలు ఉన్న గ్రూప్ ఫోటోను షేర్ చేశారు. పీఎం నరేంద్ర మోదీని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఏ) నేతగా ఎన్నుకోవడంపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహించడం విశేషం. -
ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?
ఎన్నికల సందడి అయిపోయింది. దేశంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించగా, చంద్రబాబు సీఎం కానున్నారు. వీళ్ల సంగతి పక్కనబెడితే దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు సెలబ్రిటీలు అధికారం దక్కించుకున్నారు. కొందరికి మాత్రం నిరాశ తప్పలేదు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది.మలయాళ నటుడు సురేష్ గోపీ రికార్డ్ సృష్టించారు. త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.టీవీ సీరియల్ 'రామాయణ్'తో చాలా గుర్తింపు తెచ్చుకున్న రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్.. ఈసారి మీరట్ నుంచి ఎంపీగా గెలిచారు.టాలీవుడ్లో హీరోయిన్గా చేసిన రచనా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా జయకేతనం ఎగరవేసింది.'రేసుగుర్రం' విలన్ రవికిషన్.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పుర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఈయన రెండోసారి గెలిచారు.బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని.. ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం.బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ నుంచి, భోజ్పురి నటుడు మనోజ్ తివారీ, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీలుగా గెలిచారు.ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, హిందుపూర్, పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించారు.ఇలా చాలామంది ఈ సారి ఎన్నికల్లో గెలిచారు. మరోవైపు కొందరు ఓడిపోయారు కూడా. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీత.. షిమోగాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్ర అమరావతి లోక్సభ ఎంపీ బరిలో దిగి ఓడిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్) -
కంగనా విజయం.. ఆనందంతో తల్లి, సోదరి నృత్యం
బాలీవుడ్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఓడించారు.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మండీ ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో తల్లితో పాటు డ్యాన్స్ చేస్తున్న రంగోలి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలలో కంగనా బంధువులు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ విజయం తర్వాత కంగనా ఒక పోస్ట్ను షేర్ చేశారు. దానిలో ఆమె మండీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
లోక్సభ ఎలక్షన్స్.. తొలి ప్రయత్నంలోనే గెలుపొందిన బాలీవుడ్ ఫైర్బ్రాండ్ (ఫోటోలు)
-
బ్యాగ్ సర్దుకోవాలన్నారు.. కంగనా గెలిచి చూపించింది
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన నటి 'కంగనా రనౌత్' విజయం సాధించింది.కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై తప్పకుండా విజయం సాధిస్తానని చెబుతూనే ఉంది. అన్నట్టుగానే ఇప్పుడు ఈమె సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో కంగనాను బ్యాగ్ సర్దుకుని బయలుదేరాలి అని ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా విమర్శించారు.ఒక మహిళ గురించి ఇంత తక్కువ మాట్లాడటం వల్ల కలిగే పరిణామాలను వారు తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. ఈ రోజు రాబోయే ఫలితాలే దానికి నిదర్శనం అని కంగనా అన్నారు. ప్రారంభం నుంచి బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందని, మరోమారు మోదీ ప్రధాని అవుతారని కంగనా చెబుతూనే ఉంది. -
విజయం దిశగా కంగనా? మండీ క్వీన్ ఇంట్లో సంబరాలు
హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాల ఫలితాల ట్రెండ్ వెలువడుతోంది. రాష్ట్రంలోని హాట్ సీట్ అయిన మండీపైనే అధికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హాట్ సీటు నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె తొలిసారి ఎన్నికల పోరులో దిగారు. ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్లో వెనుకంజలో ఉన్నా, ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఆమె అధిగమిస్తూ వస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ జెండా ఎగురవేయనుంది. మండీ లోక్సభ సీటు నుంచి కంగనాకు గెలవనున్నారనే అంచనాలున్నాయి. హిమాచల్ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలకు గాను మూడు లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఒక సీటు కాంగ్రెస్కు దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో కంగనా విజయపథాన దూసుకుపోతుండటంతో ఆమె ఇంటిలో సంబరాల వాతావరణం నెలకొంది. -
ఈ తారల ‘ముందస్తు’ జాతకాలివే..
2024 లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఏ సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో ‘ముందస్తు’గా వెల్లడయ్యింది.మనోజ్ తివారీప్రస్తుత ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ సీటుపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్లో మనోజ్ తివారీ విజయం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి.పవన్ సింగ్భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ బీహార్లోని కరకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై పోటీకి ఎన్డీఏ ఉపేంద్ర కుష్వాహను రంగంలోకి దింపింది. అయితే కరకట్ సీటు పవన్ సింగ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.కంగనా రనౌత్హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ పోటీకి దింపింది. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడ్డారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కంగనా రనౌత్ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిర్హువాఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ లోక్సభ స్థానం నుంచి భోజ్పురి గాయకుడు, నటుడు నిర్హువాను బీజేపీ పోటీకి దింపింది. ఇదేస్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ బరిలోకి దిగారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్లో నిరాహువాదే పైచేయి అని వెల్లడయ్యింది.హేమామాలినిబాలీవుడ్ నటి హేమామాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ స్థానం నుంచి మూడోసారి పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్లో హేమ మాలినిదే పైచేయి అని వెల్లడయ్యింది.రవి కిషన్ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి రవికిషన్ పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం రవికిషన్ ఇక్కడి నుంచి సునాయాసంగా గెలుస్తారు. గోరఖ్పూర్ స్థానం బీజేపీకి కంచుకోట. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నాథ్ ఆదిత్యనాథ్ స్వస్థలం. -
కంగనా ఇక మండీ క్వీన్?
హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గుచూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మధ్య భారీ పోటీ ఏర్పడింది. అయితే ఫలితాల్లో కంగనా రనౌత్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి నుంచి పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ మండీ కిరీటం కంగనాకే దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కాంగ్రా లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు పోటీకి దిగారు.హమీర్పూర్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రైజాదా మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సిమ్లా లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి సురేశ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వినోద్ సుల్తాన్పురి తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ఈ నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బిహార్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్ (కంగన ప్రత్యర్థి)
ఓటమే కాదు, కొన్నిసార్లు గెలుపు కూడా గుణపాఠాలు నేర్పుతుంది. జూన్ 1న జరిగే ‘మండీ’ లోక్ సభా స్థానం ఎన్నికల్లో ఒకవేళ నేను గెలిస్తే... ‘గెలుపు కోసం ప్రత్యర్థి గురించి తప్పుగా మాట్లాడటం ఓటమి కన్నా తక్కువేం కాదు’... అన్నదే బహుశా నేను నేర్చుకునే మొదటి గుణపాఠం అవుతుంది!రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవి రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగకూడదు. దిగజార కూడదు. కంగనకు, నాకు మధ్య ఏం లేదు. ఆమె బీజేపీ, నేను కాంగ్రెస్. సినిమాల్లో ఆమె ‘క్వీన్’, సిమ్లా వాళ్లకు నేను ‘కింగ్. ఇద్దరం ఒకింట్లో పుట్టుంటే ఆమె అక్క, నేను తమ్ముడు. కానీ ప్రచారంలో ఆమెను ఎన్నిమాటలన్నాను! అన్నానా? అనవలసి వచ్చిందా? అనవలసి వచ్చినా అది అన్నట్లే!కంగనకు, నాకు మధ్య ఏం లేకుండానూ లేదు. మంచి నటిగా ఆమెను నేను అభిమానిస్తాను. కనుక నేను ఆమె అభిమానిని అన్నట్లే! మా మధ్య సినీతారకు–సినీ అభిమానికి మధ్య ఉండే అనుబంధం ఉన్నట్లే! ‘క్వీన్’ సినిమాలో చూడాలి కంగనను. ‘క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా కాదు, ‘క్వీన్’ సినిమా. అమాయకురాలైన అమ్మాయి. ఆత్మాభిమానం కల అమ్మాయి. ప్రతికూల పరిస్థితుల్ని చేతుల్లోకి తీసుకుని రాణిలా ఏలిన అమ్మాయి. మధురం, సున్నితం, ఆహ్లాదకరం... ‘క్వీన్’ లో కంగన నటన. అందులో అనే ఏముందీ! ప్రతి చిత్రంలోనూ!రొమాంటిక్ థ్రిల్లర్ ‘గ్యాంగ్స్టర్’ తో మొదలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు కంగన. ఇక్కడ ఆమె తొలి చిత్రం ‘మండీ’. దర్శకత్వం బీజేపీ. అందులో విలన్... ఇంకెవరు? నేనే. బీజేపీ నుంచి కంగన, కాంగ్రెస్ నుండి నేను మండీ నుంచి పోటీ పడుతున్నాం. మాటలూ పడుతున్నాం!ఎన్నెన్ని మాటలు! ఎంతెంత మాటలు! అర్థం లేనివి, అనవసరమైనవీ, అసహ్యకరమైనవి, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి! ఆమె బీఫ్ తిన్నారని అన్నాను. ఆమె దర్శించిన దేవాలయాలను శుద్ధి చేయాలని అన్నాను. తిరిగి ఆమె నన్ను ‘మహా చోర్’ అన్నారు. ‘ఛోటా పప్పు’ అన్నారు. కానీ స్త్రీ... పురుషుడిని అనడం వేరు. పురుషుడు స్త్రీని అనడం వేరు.అమ్మ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ‘మండీ’ సిటింగ్ ఎంపీ. అమ్మ కాంగ్రెస్లో ఉండి కూడా... రామాలయం నిర్మించినందుకు మోదీజీని ధైర్యంగా ప్రశంసించగలిగారు! అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన తర్వాత కూడా మోదీని అమ్మ బహిరంగంగా అభినందించారు.అందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ... ‘‘ప్రతిభాసింగ్జీ! మీరు పార్టీ నియమాలను ఉల్లంఘించారు...’’ అని అమ్మను బహిష్కరించి, ‘‘ప్రతిభాసింగ్ జీ! మీరు మా పార్టీలోకి వచ్చేయండి...’’ అని బీజేపీ అమ్మను ఆహ్వానించి, అమ్మ బీజేపీలో చేరి, ఇప్పుడు ఇదే ‘మండీ’ నుంచి నాకు పోటీగా నిలబడి ఉంటే అమ్మను కూడా కంగనను అన్నట్లే అన్నేసి మాటలు అనవలసి వచ్చేదా? మాటలు అనవలసి వస్తే అసలు అమ్మకు పోటీగా నిలబడేవాడినా?‘‘కంగనకు బుద్ధి ప్రసాదించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’ అని కూడా నేను కంగన గురించి అన్నాను. అందుకు కంగన – ‘‘వీరభద్రసింగ్జీ ఈరోజు జీవించి ఉంటే కనుక నా గురించి అగౌరవంగా మాట్లాడినందుకు తన కొడుకు విక్రమాదిత్యను మందలించి, ‘వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పు’ అని ఉండేవారు...’’ అన్నారు.ఆ మాట నిజమే కావచ్చు. కానీ, కొన్నిసార్లు క్షమాపణ కోరటం కూడా అభిమానాన్ని ప్రదర్శించుకోవటమే అవుతుంది. అభిమానం అన్నది గుండెల్లో ఉంటేనే మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. అయినా అందరికీ అమ్మకు ఉన్నంత ధైర్యం ఉంటుందా?! రాజకీయ ప్రత్యర్థిని అభినందించేంత ధైర్యం! – మాధవ్ శింగరాజు -
కంగనా- విక్రమాదిత్య.. గెలుపోటముల లెక్కలివే?
హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానానికి గట్టిపోటీ ఏర్పడనుంది. ఎందుకంటే ఇక్కడ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. సాధారణ ఓటరును తమవైపు తిప్పుకోవడంలో ఏ పార్టీ విజయం సాధిస్తే అది పార్లమెంటు వరకూ చేరుకోగలుగుతుంది.మోదీ మ్యాజిక్, మాజీ సీఎం జైరాం ఠాకూర్ మద్దతు, స్టార్డమ్ మొదలైనవి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు కలసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్కు సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. అలాగే అతని తండ్రి, ఆరుసార్లు రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర కె సింగ్ అభిమానులు విక్రమాదిత్యకు అండగా నిలుస్తారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎవరు గెలిచినా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. విక్రమాదిత్య తండ్రి దివంగత వీరభద్ర సింగ్, తల్లి ప్రతిభా సింగ్లు మండీ నియోజక వర్గం నుండి మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2021 వరకు ఈ నియోజక వర్గంలో జరిగిన 20 ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ 14 సార్లు, బీజేపీ ఐదుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలుపొందాయి. ప్రస్తుతం మండీ నియోజకవర్గంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులు, కిన్నౌర్, లాహౌల్-స్పితి, సిమ్లాలోని రాంపూర్, చంబాలోని భర్మౌర్ స్థానాల్లో ఆధిక్యత సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మే 24న మండిలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు (బుధవారం) కులు, సుందర్నగర్లలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. -
Lok Sabha election 2024: కింగ్ వర్సెస్ క్వీన్
హిమాచల్ప్రదేశ్లో రాజవంశీయుల కంచుకోట అయిన మండి లోక్సభ స్థానంలో ‘కింగ్’, ‘క్వీన్’ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. క్వీన్ తదితర సినిమాలతో అలరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఆమెతో తలపడుతున్నారు. దాంతో ఇక్కడ విజయం రెండు పారీ్టలకు ప్రతిష్టాత్మకంగా మారింది...తొలి నుంచీ రాజులే... పారీ్టలేవైనా మండిలో రాజకుటుంబీకుల హవాయే కొనసాగుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలతో సహా 19సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 13సార్లు రాజ కుటుంబీకులే గెలిచారు. కాంగ్రెస్కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ నుంచి కంగనా బరిలో దిగడంతో తనయుడు విక్రమాదిత్య సింగ్ను బరిలో దించారు. ఆయన సిమ్లా (రూరల్) నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్రసింగ్ ఏకంగా ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా చేశారు. తల్లిదండ్రులిద్దరూ మండి లోక్సభ స్థానం నుంచి మూడేసిసార్లు నెగ్గారు. 2021 మండి ఉపఎన్నికలో తల్లి కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు.కంగనాకు ఆదరణ... కంగనాకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జైరాం ఠాకూర్ మద్దతుతో పాటు మండి లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీజేపీ చేతిలోనే ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. తొలుత ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ తర్వాత మనసు మార్చుకున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తదితరులు కంగనాకు మొదటినుంచి మద్దతిస్తున్నారు.పరస్పర విమర్శలు... పరస్పర విమర్శల్లో కంగనా, విక్రమాదిత్య ఇద్దరూ హద్దులు దాటిపోయారు. ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే, ఆయనను ‘చోటా పప్పు’ అంటూ కంగనా ఎగతాళి చేస్తున్నారు. రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ విక్రమాదిత్యకు మద్దతిస్తోంది. హిమాచల్లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండిని కనీసం సందర్శించలేదని విమర్శలున్నాయి. ఒక్కసారి చాన్సిస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, ఆగిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నారు. మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు.‘మండి’ ప్రస్థానం.. మండిని ఒకప్పుడు మండి మహాసు నియోజకవర్గంగా పిలిచేవారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 13,77,173 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లుండటం విశేషం. వీరభద్రసింగ్ 1971లో తొలిసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేక వెల్లువలో ఓటమి చవిచూసినా 1980లో మళ్లీ విజయం సాధించారు. 1989లో బీజేపీ, 1991, 1996ల్లో కాంగ్రెస్, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాయి. 2004లో ప్రతిభా సింగ్ తొలిసారి గెలిచారు. 2009లో మళ్లీ వీరభద్రసింగ్ విజయం సాధించారు. ఆయన సీఎంగా కావడంతో 2013లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్ నెగ్గారు. 2014, 2019ల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2021లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ ప్రతిభా సింగ్ గెలిచారు. -
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
సినిమాలు, రాజకీయాలు.. అనే రెండు పడవల మీద ప్రయాణం చేయనని చెప్పేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తాను ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తానని ప్రకటించింది. పూర్తిగా ప్రజా సేవకే పరిమితమవుతానంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజాగా కంగనా గురించి ఓ వార్త వైరల్గా మారింది. గ్యాంగ్స్టర్తో పార్టీ?ఆమె ఓ వ్యక్తితో దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతడు గ్యాంగ్స్టర్ అబు సలీమ్ అని.. అతడితో పార్టీ చేసుకుందని ప్రచారం చేస్తున్నారు. దీనిపై కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. గ్యాంగ్స్టర్ అబు సలీమ్తో పార్టీనా? అక్కడ ఉన్నది మిస్టర్ మార్క్ మాన్యూల్ అనే జర్నలిస్ట్. తనను గ్యాంగ్స్టర్తో పోల్చి అవమానిస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన పార్టీలో ఆయనతో దిగిన ఫోటో ఇది అని ఇన్స్టా స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చింది.సినిమా విషయానికి వస్తే..కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. భారత దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టింది. ఇందులో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు.చదవండి: ఏడ్చేసిన కావ్య.. ఆమెను అలా చూస్తే బాధేసింది: బిగ్ బీ -
రాహుల్ ఒక కార్టూన్ క్యారెక్టర్: కంగన
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె నాచన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సియాంజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కార్టూన్ క్యారెక్టర్ అంటూ అభివర్ణించారు.హిమాచల్ ప్రదేశ్లోని నహాన్లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మౌంటెన్ క్యాప్ ధరించడంలో రాహుల్ గాంధీ చేసిన చిన్న పొరపాటును కంగనా ఎద్దేవా చేశారు. ఆయనకు మౌంటెన్ టోపీ ఎలా ధరించాలో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్ ఆ క్యాప్ పట్టుకుని వేదిక అంతా తిరిగారని, కొద్దిసేపటి తరువాత అక్కడున్న ఒక వ్యక్తి సాయంతో రాహుల్ ఆ క్యాప్ ధరించగలిగారని కంగన అన్నారు.రాహుల్ గాంధీ ఒక కార్టూన్ క్యారెక్టర్ అంటూ, ఏ విషయాలను అర్థం చేసుకోలేనివారు తనను ఎగతాళి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాహుల్, ప్రియాంక ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారని, వారికి మౌంటెన్ క్యాప్ ఎలా ధరించాలో కూడా తెలియదని కంగనా వ్యాఖ్యానించారు. చంద్రునిపై బంగాళదుంపలు పండించడం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.తాను ముంబై వెళ్లినప్పుడు కొందరు తన పహాడీ క్యాప్ను చూసి ఎగతాళి చేశారని, తనకి ఇంగ్లీషు రాదని చాలా మంది జోకులు వేసేవారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఇంగ్లీషు నేర్చుకున్నానని, ముంబైలో కూడా నివసించానని, అయినా తన ప్రాంతంతో అనుబంధాన్ని కోల్పోలేదని కంగన పేర్కొన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో పలువురు నేతల ప్రత్యర్థి అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.హిమాచల్ ప్రదేశ్లోని మండీ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన విక్రమాదిత్య సింగ్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కంగనా వెళుతున్న ఆలయాలను శుద్ధి చేయాల్సి న అవసరం ఉందన్నారు. టకోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.దేవ్ సమాజానికి చెందిన కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో ఆహారపు అలవాట్ల గురించి చెబుతుంటారని, ఇది దేవ్ సమాజంవారికి తలవంపులుగా మారాయన్నారు. ఆమె దేవ్ సమాజపు పరువు తీస్తున్నారని ఆరోపించారు. దేవభూమిలో ఉంటున్నవారికి ఇక్కడి దేవనీతిపై ఎంతో నమ్మకం ఉందన్నారు.తన తండ్రి వీరభద్ర సింగ్ ఆరు సార్లు సీఎం అయ్యారని, అది ప్రజల ఆశీర్వాదమని, కంగనా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించే బదులు ప్రధాని మోదీని పదవి నుంచి తప్పుకోవాలని కోరాలన్నారు. ప్రధాని మోదీ గుజరాత్కు చాలా ఏళ్లుగా సీఎంగా ఉన్నారని, ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యానించారు.నటి కంగనా ముంబైలో ఒక కాలు, హిమాచల్లో ఒక కాలు పెడుతూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారని, ఆమె అతి త్వరలో మునిగిపోతారన్నారు. కంగనాకు జూన్ 4 తర్వాత తిరిగి ముంబైలో సినిమా షూటింగ్లకు వెళ్లిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం
ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. ఏదీ దాచకుండా, దేనికీ భయపడకుండా డేరింగ్ అండ్ డాషింగ్గా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటుంటారు. ఈ బ్యూటీ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగింది.గెలిస్తే అంతే!తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా తన సినీప్రయాణంపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 'నేను ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్బై చెప్తాను. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం అనేది అంతా ఒక అబద్ధం. కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదు. పైగా నాకు ఒకే పని ఎక్కువకాలం చేయాలనిపించదు. అందుకే హీరోయిన్గా బోర్ కొట్టినప్పుడు కథలు రాస్తుంటాను. సినిమాలను డైరెక్ట్ చేస్తుంటాను, నిర్మిస్తాను. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాను' అని చెప్పుకొచ్చింది.ఆ చిత్రాలతో ఫేమస్గ్యాంగ్స్టర్ సినిమాతో హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్ క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి సినిమాలతో ఫేమస్ అయింది. ఆమె దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీలో కంగనా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా సీత: ద ఇన్కార్నేషన్, నోటి బినోదిని, అలాగే మాధవన్తో ఓ థ్రిల్లర్ సినిమా ఆమె చేతిలో ఉన్నాయి.చదవండి: 40 ఏళ్లుగా కాపురం.. మా బంధం సక్సెస్ అవడానికి అదే కారణం! -
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
దేశంలో ప్రస్తుతం 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా, కొన్ని స్థానాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ రంగంలోకి దిగారు.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నటిగా తనకు అనేక జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చినా, రాబోయే కాలంలో మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానని, అప్పుడు తనకు ‘ఎంపీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వస్తే చాలా సంతోషిస్తానని తెలిపారు. భవిష్యత్తులో తనకు ఏదైనా మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా పెద్ద పదవి అప్పగిస్తే బాధ్యతగా నెరవేరుస్తానని అన్నారు. తాను ముందుగా మండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.కంగనా తన సినిమా ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ త్వరలోనే విడుదల కాబోతున్నదని కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం కారణంగా తాను హీరో ఆర్ మాధవన్తో చేస్తున్న సినిమాకు గ్యాప్ ఇచ్చానని తెలిపారు. దానిని తిరిగి ప్రారంభించాల్సి ఉందని, అలాగే మరో మూడునాలుగు సినిమాలకు సైన్ చేశానని తెలిపారు.యాపిల్ పండించే రైతుల గురించి కంగనా మాట్లాడుతూ, వారికి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాపిల్ ధరల పెంపు తదితర విషయాలపై అధికార యంత్రాంగంతో చర్చించాల్సి ఉందన్నారు. బీజేపీ అభ్యర్థిగా సొంత వాగ్దానాలు చేయకూడదని పార్టీ ఆదేశించిందన్నారు. -
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
లోక్సభ ఎన్నికల బరిలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా బీజేపీలో చేరకముందే ఆమె టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్యసింగ్ బరిలో నిలిచారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత ఎంత కష్టమో తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారం కోసం తను పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా పేర్కొంది.ఎన్నికల యుద్ధం ప్రారంభం నుంచి వరుసగా ప్రజా సభలతో పాటు పార్టీ కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో చాలా కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసినట్లు కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం వల్ల సరిగ్గా నిద్రకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పారు. కనీసం సమయానికి భోజనం కూడా తీసుకోవడంలేదని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోరాటం ముందు సినిమా నిర్మించడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివేనని కంగన చెప్పడం విశేషం. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. జూన్ 14న విడుదల కావాల్సిన ఈ సినిమా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
ఎమర్జెన్సీ వాయిదా
భారతదేశంలో అమలు చేయబడిన ఎమర్జెన్సీ కాలం (1975 జూన్ 25–1977 మార్చి 21) నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం దేశంలో జరగుతున్న ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారామె. దాంతో కంగనా రనౌత్ రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Manikarnika Films Production (@manikarnikafilms) -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై పోటీ చేస్తున్నారు. హిమాచల్లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్పూర్లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ. -
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
సిమ్లా: బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సినీ నటి 'కంగనా రనౌత్' మీద కాంగ్రెస్ శనివారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.మండిలోని సర్కాఘాట్లో జరిగిన బహిరంగ సభలో 'కంగనా రనౌత్' మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అప్పట్లో అత్యంత సంపన్నులు (ఆ కాలం నాటి అంబానీ) అని పేర్కొన్నారు. అయితే వారికి ఆ సంపద ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదని అన్నారు.బ్రిటీష్ వారికి సన్నిహితంగా ఉండేవారని, సంపద ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ రహస్యమే అని కంగనా కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనుకూలంగా ఓట్లు వచ్చినప్పటికీ.. జవహర్లాల్ నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారో ఎవరికీ తెలియదని కూడా ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి కుటుంబ పాలన మొదలైందని అన్నారు.సంజయ్ గాంధీ మీద మాత్రమే కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మంది నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విక్రమాదిత్య సింగ్ను కూడా 'కార్టూన్' అని పిలిచారు.స్వాతంత్య్ర సమరయోధులను వ్యాపారవేత్తలతో పోల్చడం, సంజయ్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించడం వంటి హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంగనాను తదుపరి ప్రచారంలో పాల్గొనకుండా ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
-
ఓటర్లతో కంగనా స్టెప్పులు.. ప్రచారంలో కాంగ్రెస్పై ఆగ్రహం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ విజన్కు మద్దతివ్వాలని రనౌత్ కోరారు. మరోవైపు జోగిందర్నగర్లో ప్రచారం చేసిన కంగనా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. కంగనా రనౌత్ డ్యాన్స్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Kangana Ranaut dances with people during a public meeting in Mandi's Jogindernagar. pic.twitter.com/k3PODhNg9j — ANI (@ANI) April 13, 2024 -
బాలీవుడ్ నటి కంగనపై హిమాచల్ మంత్రి పోటీ
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ వెల్లడించారు. కాగా మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కంగనాకు పోటీగా మంత్రి విక్రమాదిత్య సింగ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత మూడు పర్యాయాలు ఆమె గెలిచారు. ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మాట్లాడుతూ. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. విక్రమాదిత్యపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. గతంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను గెలిచాను అని అన్నారు. హిమాచల్ ప్రజల గురించి కంగనాకు ఏం తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలవదని అన్నారు. ‘దేవ్ భూమి’ హిమాచల్ నుంచి బాలీవుడ్కు స్వచ్చంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా జూన్ 1న హిమాచల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి, చదవండి: కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారణ -
ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్
చాలామంది హీరోహీరోయిన్లకు బైక్స్, కార్స్ అంటే కాస్త పిచ్చి ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే చాలు కొనేస్తుంటారు. లేదంటే మంచి సందర్భం చూసుకుని వాటిని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఖరీదైన కారు కొనేసేంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? కారు కొనడం ఎందుకంత స్పెషల్? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు కంగన రనౌత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. బాలీవుడ్ బడా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే రాజకీయంగానూ కంగనా రనౌత్.. పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఈమెకు బీజేపీ తరఫున మండి ఎంపీ టికెట్ కేటాయించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగానే కంగన కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ప్రొడక్షన్స్ పేరుపై బెంజ్ మెబాజ్ జీఎల్ఎస్ ఎస్680 కారు కొనుగోలు చేసింది. అయితే దీని విలువ దాదాపు రూ.3 కోట్లు పైనే. మరోవైపు కంగన దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెజ్ బెంజ్, ఆడీ క్యూ8 కార్లు ఉన్నాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?) -
అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్
సిమ్లా : సినీ నటి, హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ బీజేపీ అభ్యర్ధి కంగనా రౌనత్ భారత్కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ తరుణంలో తాను చేసిన వ్యాఖ్యల్ని కంగనా సమర్ధించుకున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమ్మిట్లో కంగనా రనౌత్ మాట్లాడారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ మాట్లాడారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్పై స్పందిస్తూ కంగనా ట్వీట్ చేశారు. అందుకు కారణాల్ని వివరిస్తూ.. నాడు ‘అక్టోబర్ 21, 1943న సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు తానే ప్రధాని అని ప్రకటించారంటూ ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్వీట్ చేశారు. All those who are giving me gyan on first PM of Bharata do read this screen shot here’s some general knowledge for the beginners, all those geniuses who are asking me to get some education must know that I have written, acted, directed a film called Emergency which primarily… pic.twitter.com/QN0jD3rMfu — Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) April 5, 2024 ‘భారత్ తొలి ప్రధాని అంశంలో నన్ను విమర్శిస్తున్న వారు ఈ స్క్రిన్లో ఉన్న ఒక్కసారి చదవండి. నాకు కొంచెం చదువు చెప్పుచ్చు కాదా అని నన్ను అడుగుతున్న మేధావులందరికీ నేను ఒకటే చెబుతున్నా. నేను రైటర్ను. యాక్ట్ చేశా. డైరెక్షన్ చేశా అనే విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. -
దేశ ప్రధానులు వాళ్లే.. బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు..
వేసవి హీట్తో పాటు దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాడీవేడి రాజకీయం నడుస్తోంది. ఎలక్షన్ సమయం కాబట్టి ఒక పార్టీ నేత మరో పార్టీ నేతపై విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో వారు మాట్లాడే ప్రతీ మాట విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జనరేషన్. ఏ మూలకు చీమ చిట్టుకుమన్నా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దీంతో, సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తారు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. తాజాగా ఇద్దరు బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. One BJP candidate from North says Subash Chandra Bose was our first PM !! And another BJP leader from South says Mahatma Gandhi was our PM !! Where did all these people graduate from? 😁 — KTR (@KTRBRS) April 5, 2024 ఇక, ఈ వీడియోలో మన దేశ ప్రధానుల విషయమై బీజేపీ నేతలిద్దరూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రౌత్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశ మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు వివాదాస్పందగా మారాయి. ఈ వీడియోను కేటీఆర్ షేర్ చేస్తూ వీరంతా ఎక్కడ చదువుకున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. Whatsapp University students😁👇 Subhash Chandra Bose was the first Prime Minister of India - BJP candidate Kangana Ranaut. Mahatma Gandhi was out Prime Minister - BJP candidate K. Annamalai pic.twitter.com/WmuT0sqcez — Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 5, 2024 -
మండి ప్రజల గొంతునవుతా.. కంగనా రనౌత్
సిమ్లా: ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఓ వైపు అధికార పక్షం, మరో వైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నాయి. ఇటీవల బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు దక్కించుకున్న బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' ప్రచారం మొదలు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ప్రచారం ప్రారంభించిన కంగనా.. అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటులో 'మండి ప్రజల గొంతు' అవుతానని పేర్కొన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు మరియు రోడ్ల కోసం పని చేస్తానని, ప్రజల హక్కుల కోసం పోరాడతానని.. మండి కోసం నేను గొంతు పెంచుతానాని అన్నారు. స్వామి వివేకానంద, సద్గురు జీ, ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తి అని కంగనా అన్నారు. ఇది నా జన్మభూమి.. నన్ను తిరిగి పిలిచింది. నన్ను ప్రజలు ఎన్నుకుంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కంగనను లోక్సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి పోటీ చేయడానికి ఐదవ జాబితాలో అభ్యర్థిగా ప్రకటించింది. ఒకరికొకరు సహకరించుకోవడం బీజేపీ సంస్కృతి. అదే నమ్మకంతో వారితో కలిసి నడుస్తాం, గెలుస్తాం.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం’ అని ఆమె పేర్కొన్నారు. నేను బీజేపీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్ప్రదేశ్లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
నా నామినేషన్ తట్టుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు: కంగనా
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ తమ లోక్సభ అభ్యర్థిగా కంగనా రనౌత్ను ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఈ బాలీవుడ్ నటి పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి నటి కౌంటర్ ఇవ్వడం, ఈసీ నోటీసులు.. వంటి పరిణామాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కంగనా మండిలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. మండిలో తన నామినేషన్ను జీర్ణించుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి నామినేషన్ వేసిన తరువాత చాలా సంతోషించినట్లు తెలిపారు. తిరిగి సొంత ప్రదేశానికి రావడాన్ని ఎవరూ సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిందువల్లో శక్తిని నిర్మూలించడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మండిలో ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు అతిపెద్ద మేళా నిర్వహిస్తారని, అలాంటి ప్రాంత మహిళలపై కాంగ్రెస్ నేతలు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండికి రిషి మాండవ్య పేరు పెట్టారని, ఋషి పరాశరుడు తపస్సులో కూర్చున్న రిషి మాండవ్య పేరు పెట్టారని, అంతటి పవిత్ర ప్రదేశం మండి అని పేర్కొన్నారు. చౌకబారు నేతల నుంచి ఇంతకన్నా మనం ఏం ఆశించగలమని కంగనా ప్రశ్నించారు. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha seat, actor Kangana Ranaut says, "... Congress could not accept my nomination from Mandi. They started doing cheap politics. Their leader Rahul Gandhi talks about destroying the 'shakti' in Hindus. Their spokesperson… pic.twitter.com/D53fySekCz — ANI (@ANI) March 29, 2024 -
కంగనాపై అసభ్య పోస్ట్.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రీయా శ్రీనతేకు టికెట్ నిరాకరించింది. 2019లో సుప్రీయా శ్రీనతే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలసిందే. అయితే ఈసారి కూడా మహారాజ్గంజ్ నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని సుప్రియా శ్రీనతే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో సుప్రియా శ్రీనతేపై బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మహారాజ్గంజ్లో వీరేంద్ర చౌదరీని బరిలోకి దింపింది. సుప్రియా శ్రీనతే సోషల్ మీడియా ఖాతా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్పై వెలువడిన అసభ్యకరమైన విమర్శలు కాస్త వివాదం రేపాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తాను లోక్ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిపారు. అయితే తన స్థానంలో మరో అభ్యర్థి పేరును సూచించినట్లు సుప్రియా పేర్కొన్నారు. కంగనాపై చేసిన అసభ్యకరమైన పోస్ట్పై.. సుప్రియా శ్రీనతే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డులు పలువురికి తెలుసని తనకు తెలియకుండానే కంగనాపై అసభ్యకరమైన సోస్ట్ వేశారని తెలిపారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావటంతో డిలీట్ చేశానని తెలిపారు.‘సుప్రియాపేరడీ’ అనే ‘ఎక్స్’ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారని.. దాని నిర్వాకులు ఎవరో తెలియదన్నారు. తన ‘ఎక్స్’ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అప్పటికే ఆమె పోస్ట్ వివాదస్పదం కాగా.. బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. -
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్ప్రదేశ్లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్స్టా అకౌంట్ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్చైర్లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంగనా రనౌత్పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
శరీర భాగాలు కాదు చూడాల్సింది.. వేశ్యతో సహా..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటలతో బాలీవుడ్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ సీటును కేటాయించింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కంగనాపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా యూపీకి చెందిన కాంగ్రెస్ మహిళానేత సుప్రియ శ్రీనాథే విమర్శలు చేసింది. గతంలో కంగనా సినిమాల్లో బోల్డ్గా నటించిన ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి ఫోటోలతో హిమాచల్ ప్రదేశ్ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన కంగనా తనదైన శైలిలో కాస్తా ఘూటుగానే రిప్లై ఇచ్చిపడేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ.. 'ప్రియమైన సుప్రియా జీ.. ఒక ఆర్టిస్ట్గా నా కెరీర్లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించా. నేను క్వీన్ చిత్రంలోని అమాయక అమ్మాయి నుంచి ధకడ్ సినిమాలో గూఢచారిగా, మణికర్ణికలో దేవతగా, అలాగే చంద్రముఖిలో దెయ్యంలా, రజ్జో చిత్రంలో వేశ్యగా.. అలాగే తలైవిలో విప్లవ నాయకురాలిగా నటించా. మన ఆడబిడ్డలను పక్షపాతమనే సంకెళ్ల నుంచి మనం విడిపించాలి. వారి శరీర భాగాల పట్ల ఉత్సుకత కంటే.. వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అన్నింటికీ మించి వారి జీవితాలను, పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలని మనం గ్రహించాలి.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగనాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. చాలా బాగా బుద్ధి చెప్పావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సుప్రియ శ్రీనాథే ఆ పోస్ట్ను తన ఇన్స్టా నుంచి తొలగించింది. కానీ కొద్ది సేపటికే ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం కంగనా ఎమర్జన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఎన్నికల తర్వాత జూన్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. Dear Supriya ji In the last 20 years of my career as an artist I have played all kinds of women. From a naive girl in Queen to a seductive spy in Dhaakad, from a goddess in Manikarnika to a demon in Chandramukhi, from a prostitute in Rajjo to a revolutionary leader in Thalaivii.… pic.twitter.com/GJbhJTQAzW — Kangana Ranaut (@KanganaTeam) March 25, 2024 -
‘కంగన’కు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాలో బాలీవుడ్ నటి కంగనారనౌత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనకు కాషాయ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంగన గతంలో ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టు ఒకటి తాజాగా వైరల్గా మారింది. పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్ప్రదేశ్ నుంచి తాను పోటీ చేయబోనని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సమస్యలున్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని గతంలో ఎక్స్లో చేసిన పోస్టులో కంగన తెలిపింది. అక్కడి సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ రాణి అవుతానని పేర్కొంది. అయితే తాజాగా ఆదివారం (మార్చ్ 24) బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్ దక్కింది. మండి నుంచి బీజేపీ ఎంపీ టికెటివ్వడంపై కంగన స్పందించింది. ఇది తాను గౌరవంగా భావిస్తున్నానని, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాజాగా ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. మండి నుంచి పోటీ చేయనన్న పాత ట్వీట్ను చూపిస్తూ తాజా ప్రకటనపై కంగనను సోషల్మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా, బీజేపీ ఐదో జాబితాలో కంగనతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు బీజేపీ ఎంపీ టికెట్లు దక్కాయి. Just two years back when somebody said you will fight elections from mandi.. you said u want a state with complexities u can work on and won't fight from mandi now u are eating ur own words 😭 pic.twitter.com/GVJt91faFE — ح (@hmmbly) March 24, 2024 ఇదీ చదవండి.. వరుణ్కు మొండిచెయ్యి.. జితిన్కు పట్టం -
Lok sabha elections 2024: కంగనా రనౌత్, నవీన్ జిందాల్కు బీజేపీ టికెట్లు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో 111 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. కేంద్ర మంత్రి అశి్వనీకుమార్ చౌబే, ఎంపీ వరుణ్ గాం«దీకి ఈసారి టికెట్లు నిరాకరించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబాల్పూర్ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పూరీ నుంచి పోటీ చేయబోతున్నారు. సీనియర్ నేత మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి, పిలిభిత్ నియోజకవర్గంలో వరుణ్ గాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద, ఇటీవల బీజేపీలో చేసిన సీతా సోరెన్ జార్ఖండ్లోని దుమ్కా స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారు. టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర ధరించిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఆదివారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హరియాణాలోని కురు క్షేత్ర నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్లోని తమ్లూక్ నుంచి పోటీ చేయబోతున్నారు. కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీకి దిగబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఈసారి అవకాశం కలి్పంచలేదు. తన అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేయడం పట్ల బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆదివారం చెప్పారు. ఆమె తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ టికెట్పై పోటీచేయబోతున్నారు. బీజేపీలో చేరడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్.. పోటీ ఎక్కడంటే?
లోక్సభ ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్ నిలిచారు. ఇవాళ ప్రకటించిన బీజేపీ జాబితాలో బాలీవుడ్ క్విన్ కంగనా రనౌత్ సీటును కేటాయించారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోనే ఆమె పోటీ చేయనున్నారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని కంగనా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కంగనా తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భారత్, భారతీయ జనతా సొంత పార్టీ, బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన మండి నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమనేది హైకమాండ్ నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. నేను ఒక కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది చంద్రముఖి-2, తేజస్ సినిమాలతో మెప్పించింది. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే లోక్సభ బరిలో మరో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్కుమార్ సైతం తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high… — Kangana Ranaut (@KanganaTeam) March 24, 2024 -
వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
కంగనా రనౌత్ పుట్టినరోజు.. ఈ బ్యూటీ తల్లి గురించి తెలుసా?
రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు అంశం ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్. అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అందుకే కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పిలుస్తారు. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా.. ధైర్యంగా ఎదుర్కొగల సత్తా ఆమెది. మార్చి 23న కంగనా రనౌత్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మార్చి 23 1987లో హిమాచల్ ప్రదేశ్లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా రనౌత్.. అదే గ్రామంలో కంగనా అమ్మగారు ఇప్పటికీ కూడా పొలంలో పని చేస్తుంటారు. రోజుకు 8గంటల పాటు పొలంపనిలోనే ఆమె ఉంటారట. 25 ఏళ్లకుపైగా టీచర్గా పని చేసిన ఆమె తన కూతురు మిలీనియర్ అయినా కూడా పల్లెటూరులోనే జీవిస్తున్నారు. ముంబై వంటి నగరాలు అమ్మకు నచ్చవని అందుకే ఆమె సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతుందని గతంలో కంగనా తెలిపారు. ఆమె తల్లిదండ్రుల కోరికతో డాక్టర్ అవ్వాలనుకున్న కంగనా.. తన 16వ ఏటనే కెరీర్ కోసమని ఢిల్లీలో అడుగు పెట్టి ఆపై మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 2006లో గ్యాంగ్ స్టర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్.. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది. ఆపై ఆమె అనేక సినిమాలతో బాలీవుడ్లో తన సత్తా ఎంటో చూపించింది. ఆమెకు ఇప్పటివరకూ మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్- 3 సినిమా ఆమె కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ వీడియో ద్వారా తన చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇవాళ ఆమె 37వ బర్త్ డే జరుపుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన కంగనా.. కాంగ్రాలోని బగ్లాముఖి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆపై ఆమె ఫోటోలతో ఉన్న పలు కేక్స్ను కూడ కట్ చేశారు. ఆమె అభిమానులు భారీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీనితో పాటు 'తను వెడ్స్ మను పార్ట్ 3' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut_____) -
Kangana Ranaut: వివాదాల క్వీన్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?
కంగనా రనౌత్ పేరు చెప్పగానే ఆమె సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయి. తెలుగులో ప్రభాస్ 'ఏక్ నిరంజన్', తమిళంలో పలు సినిమాలు చేసినప్పటికీ.. హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఎందుకో ఈమెకి అస్సలు కలిసి రావడం లేదు. హిందీలో తీసిన ప్రతి సినిమా కూడా ఘోరమైన ఫ్లాప్స్గా నిలిచాయి. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) మరోవైపు కంగన.. తమిళంలో తలైవి, చంద్రముఖి 2 లాంటి చిత్రాల్లో నటించింది. యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చినప్పటికీ.. రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు మరో తమిళ సినిమాకు కంగన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గతంలో కంగనతో 'తలైవి' తీసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్.. ఇప్పుడు తన కొత్త మూవీలోనూ కంగననే తీసుకున్నట్లు సమాచారం. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే జరుగుతోందట. అలానే కంగన హీరోయిన్గా ఫిక్స్ అయిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు హిందీ సినిమాలు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా దక్షిణాది నుంచి వస్తున్నాయి. బహుశా కంగన కూడా హిందీ కంటే సౌత్ చిత్రాలు చేయడానికి అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుందా అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: 'సింపతీ స్టార్' బిరుదుపై స్పందించిన సమంత) -
'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా తెరిస్తే చాలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనిపించాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ఇంకేం పనిలేనట్లు జామ్ నగర్లోనే కనిపించారు. పాటలు పాడుతూ డ్యాన్సులేస్తూ ఊహించన పనులెన్నో చేశారు. అయితే ఇదేదో అంబానీ అంటే గౌరవంతో చేసింది కాదు. తెర వెనక కోట్ల రూపాయల డీలింగ్స్ జరిగాయట. తాజాగా హీరోయిన్ కంగన పోస్ట్తో ఇదంతా బయటపడింది. (ఇదీ చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!) స్టార్ సెలబ్రిటీల్లో చాలామంది ప్రతి విషయాన్ని డబ్బుతోనే లెక్కేస్తారు. సినిమాలు, యాడ్స్లో నటిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తారు. ఇది కాదన్నట్లు పలు వ్యాపారాలు చేస్తూ ఆస్తులు బాగానే కూడబెట్టుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ అంబానీ లాంటి బిజినెస్మేన్ పెళ్లికి.. జస్ట్ అలా హాజరయ్యేందుకు కూడా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుంటారట. అవును మీరు సరిగానే విన్నారు. గతంలో తనకు కూడా ఇలా ఆఫర్స్ వచ్చాయని, కానీ తాను ఆత్మగౌరవం చంపుకోలేదని కంగన రాసుకొచ్చింది. 'ఆర్థికంగా దారుణమైన పరిస్థితుల్ని చాలాసార్లు నేను ఫేస్ చేశారు. కానీ ఎవరెన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చూసినా సరే పెళ్లిళ్లలో డ్యాన్స్ లాంటివి చేయలేదు. ఐటమ్ సాంగ్స్లో కూడా నాకు ఛాన్సులు వచ్చాయి. కానీ నేను చేయలేదు. కొన్నాళ్ల తర్వాత అవార్డ్ షోలకి కూడా వెళ్లడం మానేశాను. ఇలా డబ్బు, ఫేమ్ వద్దని చెప్పడానికి ఆత్మగౌరవం చాలా కావాల్సి ఉంటుంది' అని కంగన తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్లో చరణ్ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) కంగన తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఆర్టికల్ చూస్తే.. గతంలో దిగ్గజ సింగర్స్ ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి వాళ్లకు కూడా తమ పెళ్లిలో పాటలు పాడితే రూ.50 కోట్లకు అంతకు మించిన మొత్తం ఇస్తామని ఆశ చూపారట. కానీ వాళ్లు వెళ్లలేదు. కానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో మాత్రం బాలీవుడ్ హేమాహేమీలు అందరూ కనిపించారు. వీళ్లు.. పెళ్లికి హాజరవడంతో పాటు డ్యాన్సులు చేసినందుకు గానూ ఒక్కో సినిమాకు అయ్యేంత రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. బహుశా అందుకేనేమో ప్రీ వెడ్డింగ్కే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అయనట్లు ఉంది. అంబానీ ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్లో బాలీవుడ్ స్టార్స్ షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్లతో పాటు చిన్న పెద్ద స్టార్స్ అందరూ వచ్చారు. దక్షిణాది నుంచి మాత్రం రామ్ చరణ్, రజినీకాంత్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు కంగన పోస్ట్ చూస్తుంటే.. చరణ్, రజినీకాంత్లకు కూడా పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చారేమో అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?) -
రాజకీయాల్లోకి రాబోతున్న కంగనా?
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నానే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై కంగనా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అని.. ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయినా దేశానికి సేవ చేస్తునే ఉంటాను’అంటూ తన పొలిటికల్ ఎంట్రీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘నేను నటిగా కంటే జాతీయవాదిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాను. సినిమా సెట్ నుంచే రాజకీయ పార్టీలతో పోరాడాను. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా దేశం కోసం పనిచేస్తూనే ఉంటాను. ఇవన్నీ చేయకుండా నన్ను ఎవరూ ఆపలేరు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే నాకు సరైన సమయం. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోను. ఈ దేశంలో నాకు అన్ని ప్రాంతాలతో మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించేవారికి రుణపడి ఉంటాను’ అని కంగనా చెప్పుకొచ్చింది. -
రాణి రావడం ఖాయం
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘క్వీన్’కు సీక్వెల్గా ‘క్వీన్ 2’ని రూపొందించే చాన్స్ ఉందని ఈ చిత్రదర్శకుడు వికాస్ బాల్ చెబుతున్నారు. కంగనా రనౌత్ లీడ్ రోల్లో రాజ్కుమార్ రావు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. 2014 మార్చి 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ‘క్వీన్’ సీక్వెల్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు వికాస్. ‘‘క్వీన్’ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది నన్ను ‘క్వీన్ 2’ సినిమా గురించే అడుగుతున్నారు. ‘క్వీన్ 2’కి కథ రెడీగానే ఉంది. ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను కానీ క్వీన్ రావడం ఖాయం’’ అన్నారు వికాస్. ఇక ఈ సీక్వెల్లోనూ కంగనా రనౌత్నే కథాకానాయికగా తీసుకుంటారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వికాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సైతాన్’ మార్చి 8న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే వికాస్ ‘క్వీన్ 2’ గురించి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. -
కొత్త ఫ్లాట్ కొన్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. రేటు ఎంతంటే?
'సీతారామం', 'హాయ్ నాన్న' తదితర చిత్రాలతో తెలుగులో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె ముంబయిలోని ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఫ్లాట్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ ఫ్యామిలీది కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'బిగ్బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!) ముంబయికి చెందిన మృణాల్ ఠాకుర్.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్లో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ తదితర చిత్రాలు చేసింది. ఉన్నంతలో ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2022లో 'సీతారామం' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి సౌత్లో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆచితూచి ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పటికీ అవన్నీ మృణాల్కి మరింత పేరు తెచ్చి పెడుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ముంబయిలోని అంధేరి ప్రాంతంలో కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేసింది. గతంలో ఇది హీరోయిన్ కంగనా రనౌత్ తండ్రి-సోదరుడికి సంబంధించినది. ఇప్పుడు దీన్ని మృణాల్ సొంతం చేసుకుంది. అయితే దీని విలువ ఎంతనేది బయటకు రాలేదు గానీ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఏదైతేనేం మృణాల్ కొత్త ఫ్లాట్ రేటు గురించి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) -
అప్పుడేం జరిగిందో యువతకు తెలియాలి
బాబీ సింహా, వేదిక, మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, అనుష్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘రజాకార్’. ‘సైలెంట్ జెనొసైడ్ ఆఫ్ హైదరాబాద్’ (హైదరాబాద్లో జరిగిన నిశ్శబ్ద మారణహోమం) అనేది ట్యాగ్లైన్. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మార్చి 1న విడుదల కానుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం పాలన, సామాన్య ప్రజలపై రజాకార్ల క్రూరమైన చర్యలు, నిజాం పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేలా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యూహాత్మక ప్రయత్నాలు వంటి అంశాల నేపథ్యంతో ‘రజాకార్’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి–దర్శక–నిర్మాత కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘రజాకార్’ సినిమా పట్ల చిత్ర యూనిట్ చూపిస్తున్న అంకితభావం, తపన నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అన్నారు. ‘‘చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన ఓ అధ్యాయాన్ని ‘రజాకార్’ సినిమాగా తీశాం. 15 ఆగస్టు 1947–17 సెప్టెంబరు 1948ల మధ్య నిజాం పాలనలో ఏం జరిగింది? అనే అంశాలు ఈ తరం యువతీ యువకులకు తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. ‘‘నిరంకుశత్వం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వారి పరాక్రమాన్ని ఈ సినిమాలో వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు యాటా సత్య నారాయణ. -
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
-
బాలీవుడ్లో సందీప్ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్
రణ్బీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్ ఎటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో సందీప్ వంగా పేరు హాట్ టాపిక్గా మారిపోయింది. మీ కుమారుడి 'మీర్జాపుర్' కోసం సలహాలు ఇవ్వండి యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్ రియాక్ట్ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. నేను సందీప్ గురించి కామెంట్ చేయలేదు: ఆమిర్ ఖాన్ మాజీ భార్య యానిమల్ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్ వంగా సినిమాల గురించి కామెంట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు. -
మంచి చిత్రాలు తొక్కేసే బ్యాచ్.. భర్త సంపాదనతో ఎంజాయ్..
ఇటీవలి కాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటి. ప్రేక్షకులను కదిలించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు విధు వినోద్ చోప్రాను ఎంతోమంది భయపెట్టారు. పెట్టుబడిలో పావు వంతు కూడా రాదని, ఓటీటీకి ఇచ్చేయ్ అని ఉచిత సలహాలిచ్చారు. వారిలో విధు వినోద్ భార్య, సినీ క్రిటిక్ అనుపమ చోప్రా కూడా ఒకరు. తెలివైన వాళ్లంటే జెలసీ.. భార్య కూడా తన సినిమా మీద నమ్మకం పెట్టుకోలేదని, ఈ చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్కు రారని విమర్శించిందని చెప్పాడు డైరెక్టర్. తాజాగా ఈ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఎక్స్ (ట్విటర్) వేదికగా అనుపమపై ఫైర్ అయింది. 'విధు సర్ భార్య అనుపమ చోప్రాకు తెలివైన అమ్మాయిలంటే జెలసీ. వాళ్లంటనే ఈమెకు గిట్టదు. అలాంటి వ్యక్తి భర్తపై అసూయపడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన సంపాదించిన పేరు, డబ్బుతో ఈమె సొంతంగా వెబ్సైట్ పెట్టింది, చిన్నచిన్నవ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ఆ గ్యాంగ్తోనే జత కడుతుంది బాలీవుడ్ డైరెక్టర్ భార్యగా సినిమా పార్టీలకు, ఈవెంట్లకు వెళ్తుంటుంది. అక్కడ టాలెంట్ను, మంచి చిత్రాలను తొక్కేయాలనుకునే గాసిప్ గ్యాంగ్తో జత కడుతుంది' అని విమర్శించింది. ఇది చూసిన నెటిజన్లు నీ అంత బోల్డ్గా ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడలేరు అని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'ముందు నీ కెరీర్ క్లోజ్ కాకుండా చూసుకో.. ఈ గొడవలు పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ చేయు' అని సలహా ఇస్తున్నారు. కాగా గతంలో అనుపమ చోప్రా - కంగనా రనౌత్ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. Vidhu sir’s wife @anupamachopra is a disgrace in the name of film journalist, she is not only xenophobic but also deeply jealous and insecure of younger and intelligent women, no wonder she is jealous of her own husband, on whose name and wealth she built her website and other… pic.twitter.com/u6SchlUehk — Kangana Ranaut (@KanganaTeam) February 4, 2024 చదవండి: ఆ సింగర్ ఇంట్లో పని చేశా.. తర్వాతే ఈ బిజినెస్... సందీప్ కిషన్ ఎంతిచ్చాడంటే? -
డేటింగ్లో ఉన్నది నిజమే.. కానీ అతనితో కాదు..స్టార్ హీరోయిన్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈనెల 22న అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైంది కంగనా. అదే సమయంలో అక్కడే ఉన్న ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఓ ఫోటోకు పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగనా అతనితో డేటింగ్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట తెగ వైరలవుతున్న రూమర్స్పై కంగనా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని.. దయచేసి ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని కోరింది. అయితే తాను ఇంకో వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని.. సరైన సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని కంగనా కుండబద్దలు కొట్టింది. ఒక వ్యక్తితో ఫోటో దిగినంత మాత్రాన ఇలా మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కంగనా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకుంది. అయితే గతంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అతను తన హెయిర్ స్టైలిష్ట్ అని కంగనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతలోనే మరోసారి అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవంలో కంగనా, నిషాంత్ ఫొటోలు వైరల్ కావడంతో రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 -
'ఆ రోజే ఎమర్జన్సీ'.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆమె ట్విటర్లో రాస్తూ.. 'ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది. చరిత్ర మరోసారి కళ్ల ముందుకురానుంది' ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June,2024 Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas 🔥#Emergency in cinemas on 14th June,2024@AnupamPKher #SatishKaushik… pic.twitter.com/hOBRnXt4uu — Kangana Ranaut (@KanganaTeam) January 23, 2024 -
కంగనా రనౌత్ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను జరుపుకుంటున్నారు
-
గుడిని శుభ్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ వచ్చేయ్ అంటూ..
శతాబ్దాల కల సాకారం కానుంది. సోమవారం(జనవరి 22) అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానాలు అందాయి. అందులో కంగనా రనౌత్ కూడా పేరు కూడా ఉంది. ఇంకేముంది, వెంటనే అక్కడ వాలిపోయిందీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. సిల్క్ చీర కట్టుకుని బంగారు నగలు ధరించి అయోధ్యలో హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటి గుడి ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేసింది. అనంతరం అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రామా.. ఇకనైనా వచ్చేయ్.. ఈ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన ఆధ్వర్యంలో హనుమంతుడి యాగం చేశాను. అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలో.. చాలా కాలం తర్వాత అయోధ్య రాజు తన స్వస్థలానికి రేపు తిరిగివస్తున్నాడు. వచ్చేయ్ రామా.. వచ్చేయ్' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. కాగా కంగనా రనౌత్ చివరగా తేజస్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె ప్రస్తుతం ఎమర్జన్సీ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు కావాలి.. అప్పుడు సంతోషంగా లేను, అందుకే.. -
ఆడియన్స్ అలాంటి చిత్రాలనే ప్రోత్సహిస్తున్నారు: కంగనా
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తేజస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా.. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోంది. అయితే ఎప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. సినిమాల్లో మహిళల పరిస్థితిని చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ..' ప్రస్తుతం సినిమాల ట్రెండ్ చూస్తుంటే భయంకరంగా మారింది. మహిళల పరువును, వారి బట్టలను హింసాత్మకంగా, అవమానకరంగా తీసి కేవలం గోడమీద పువ్వు లాగా మార్చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నేను సినిమాల్లోకి వచ్చినప్పటీ రోజులు గుర్తుకొస్తున్నాయి. అసభ్యకరమైన ఐటెమ్ నంబర్లు, మూగ పాత్రలు ప్రబలంగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా వేతన సమానత్వం కోసం పోరాడుతున్నా. అందుకే గ్యాంగ్స్టర్, వో లమ్హే, ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక, తలైవి, తేజస్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మించాను కూడా. అందుకే యశ్రాజ్ ఫిల్మ్స్, ధర్మ వంటి పెద్ద ప్రొడక్షన్స్కు వ్యతిరేకంగా వెళ్లా.' అని తెలిపింది. అంతే కాకుండా.. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి పెద్ద హీరోలకు కూడా నో చెప్పా. కానీ నాకు వారితో వ్యక్తిగతంగా వైరం లేదు. కేవలం మహిళా సాధికారత కోసమే నా పోరాటం. నేటి సినిమాల్లోని మహిళల స్థితిగతులు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. దీనికి సినీ పరిశ్రమ మాత్రమే కారణమా? సినిమాల్లో స్త్రీల ఈ విపరీతమైన ధోరణికి ప్రేక్షకులకు భాగస్వామ్యం లేదా?' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన సినిమాలపై చేస్తున్న నెగెటివ్ ప్రచారంపై కూడా స్పందించింది. కంగనా తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..' నా సినిమాలకు డబ్బులిచ్చి మరీ నెగిటివ్ ప్రచారం చేయడం ఎక్కువైంది. అయినా నేను ఇప్పటికీ అలాంటి వారిపై పోరాడుతున్నా. కానీ ప్రేక్షకులు కూడా మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే చిత్రాలనే ప్రోత్సహిస్తున్నారు. ఇది స్త్రీల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న వారిని తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. రాబోయే కాలంలో మహిళా సాధికారత చిత్రాలే కెరీర్గా ఎంచుకున్న నా జీవితంలో మరింత విలువైన సమయం ఇవ్వాలని కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చింది. The latest trend of films where women are reduced to mere flower on the wall, violently and disgracefully stripped of their dignity and clothes is beyond appalling. Reminds me of the time when I entered films, vulgar item numbers, quick in and out sleazy and dumb roles against… — Kangana Ranaut (@KanganaTeam) January 8, 2024 Paid negativity for my films is overwhelming, I have been fighting hard so far but even audiences are encouraging women beating films where they are treated like sex objects and asked to lick shoes, this is deeply discouraging for someone who has been dedicating her life for… https://t.co/VExJHxRE3P — Kangana Ranaut (@KanganaTeam) January 8, 2024 -
ఇంట్లో ప్రశాంతత లేదు: స్టార్ హీరోయిన్
ఏదో ఒక సంఘటనతో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్.. కంగనా రనౌత్. తరచూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉండే ఈ బ్యూటీ నటిగా మాత్రం అంకిత భావంతో పని చేస్తారు. కానీ 2023వ సంవత్సరం కంగనాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. గతేడాది ఈమె నటించిన ఒక్క చిత్రం కూడా విజయాన్ని అందుకోలేదు. హిందీలో నటించిన తేజస్ గానీ, తమిళంలో నటించిన చంద్రముఖి– 2 చిత్రం గానీ పూర్తిగా నిరాశ పరిచాయి. అన్నీ ఫెయిల్యూర్సే.. అంతకు ముందు భారీ అంచనాల మధ్య విడుదలైన తలైవి చిత్రం అపజయాన్నే మూట కట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ ఎమర్జెన్సీ చిత్రం పైనే! ఇందులో కంగనా రనౌత్ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సంచలన నటి తన ఎక్స్ మీడియాలో ఇంట్లో లేనప్పుడే తాను ప్రశాంతంగా, సంతోషంగానూ ఉంటానని పేర్కొన్నారు. మనం ఈ శరీరానికి నిరంతరం సొంతదారులం కాదన్నారు. ఈ జీవితం కూడా చాలా చిన్నదని, ఆ విషయం తనకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందనే వేదాంతాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండొద్దు ఎప్పుడూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించరాదన్నది అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని తాను 2023లోనే తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. తాను పలు మైలురాళ్లను దాటి తన కలల ఇంటిని, గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్లను నిర్మించుకున్నానని, అయినప్పటికీ ఇంటిలో ఉన్నప్పుడు కలగని ప్రశాంతత, ఆనందం బయట ఉన్నప్పుడు కలుగుతుందన్న విషయాన్ని గ్రహించానని చెప్పారు. I grew up with an inbuilt feeling of being out of place, I traveled miles and build homes of my dreams, farm houses, cottages. I felt happy, content even at peace but I never felt at home. Slowly it started to get evident that may be we don’t belong in this body, life is just a… — Kangana Ranaut (@KanganaTeam) December 31, 2023 Happy new year everyone ♥️ pic.twitter.com/3IB8XqM8wU — Kangana Ranaut (@KanganaTeam) December 31, 2023 చదవండి: ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ -
ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరోయిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్. 2006లో బాలీవుడ్ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలో స్టార్గా ఎదిగింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్కు చేరుకుంది. అయితే సినిమాలతో పాటు అంతేస్థాయిలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా.. ఈ ఏడాది తేజస్ మూవీతో అభిమానులను పలకరించింది. అక్టోబర్ 27న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రముఖి -2 తర్వాత నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. View this post on Instagram A post shared by ZEE5 (@zee5) -
వరుస ఫ్లాపులు.. ‘తగ్గేదేలే’ అంటున్న హీరోయిన్!
కొందరు హీరోలు మాత్రమే ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పాపులారిటీ పొందుతుంటారు. ఇక అలాంటి హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ఒకరు. ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆమె తరచూ వివాదాలకు కేరాఫ్గా నిలుస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా బహుభాషా నటిగా రాణిస్తున్న కంగనా రనౌత్లో ఒక నిర్మాత, దర్శకురాలు ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇటీవల అన్ని అపజయాలను ఎదుర్కొన్నారు. హిందీలో తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ మధ్య తమిళం, హిందీ భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది. ఇటీవల కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి–2 చిత్రం ప్లాప్ అయ్యింది. అయినా ఈమెకు అవకాశాలు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం కంగనా రనౌత్ను వరించింది. ఇందులో నటుడు మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీ చిత్రం తను వెడ్స్ మను తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. కాగా ఇంతకు ముందు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హిందీలో కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రం విజయం కంగనా రనౌత్కు చాలా ముఖ్యం. -
అనుకోని అతిథి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను సర్ప్రైజ్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. మాధవన్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలోప్రారంభమైంది. ఈ సినిమా సెట్స్ని అతిథిలా సందర్శించారు రజనీకాంత్. ఆ ఫోటోను కంగనా రనౌత్ షేర్ చేశారు. ‘‘మా సినిమా తొలి రోజే గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమా తలైవర్ (రజనీకాంత్ను ఉద్దేశించి..) మా సినిమా సెట్స్కు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. మేం థ్రిల్ అయ్యాం. మాధవన్ త్వరలోనే సెట్స్లో జాయిన్ అవుతారు’’ అని పేర్కొన్నారు కంగనా. ఈ సందర్భాన్ని ఉద్దేశిస్తూ..‘‘అద్భుతమైనప్రారంభం’’ అని మాధవన్ ట్వీట్ చేశారు. ఇక హిందీ చిత్రం ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ (2015) తర్వాత మాధవన్, కంగనా రనౌత్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. -
సౌత్ పాపులర్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళంలో నటించిన చంద్రముఖి–2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది. చంద్రముఖి–2 చిత్రం ప్రచారం అంతా ఈమైపెనే జరిగినా, చిత్రంలో కనిపించింది మాత్రం ఇంటర్వెల్ తరువాతనే. ఇదే ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం. కాగా తరచూ వార్తల్లో ఉండే కంగనారనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్తో పాటు విజయ్సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే విజయ్సేతుపతి ఇప్పుడు హిందీలోనూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
బ్రేకప్తో మంచే జరిగింది.. నా పెళ్లి అలా జరగాలి: కంగనా
ఎలాంటి విషయాన్ని అయినా కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పడం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు అలవాటు. కేవలం సినిమా విషయాల్లోనే కాకుండా..రాజకీయ అంశాలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. అందుకే కంగనాకు ఫైర్బ్రాండ్ అనే ముద్ర పడింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ తన లవ్ బ్రేకప్ విషయంతో పాటు పెళ్లిపై తనకున్న అభిప్రాయం ఏంటో చెప్పింది. కంగనా నటించిన తాజా చిత్రం తేజస్ అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో బ్రేకప్ అయిన తన రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. ‘ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ప్రేమ విషయంలో అందరూ విజయం సాధించలేరు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాం. బ్రేకప్ వల్ల నాకు మంచే జరిగింది. ఒకవేళ నేను ఇప్పటికీ ప్రేమలో ఉన్నట్లయితే.. నా సమయం అంతా దానికే కేటాయించాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు నాకు బ్రేకప్ జరిగింది. లవ్ ఫెయిల్యూర్ వల్ల జరిగే లాభాలేంటో చాలా మందికి ఆలస్యంగా తెలుస్తాయి’అని కంగనా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది.