
న్యూఢిల్లీ: భారత్ లో యాపిల్ ఫోన్లు తయారీ అనవసరం అన్న రీతిలో ఆ సంస్థ సీఈవో టిమ్ కుమ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ స్పష్టం చేసిన తరుణంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై వ్యవహారశైలిలో కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు కంగనా. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కంగనా రనౌత్ కు ఫోన్ చేసి ఆ ట్వీట్ డిలీట్ చేయించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ పై పెట్టిన పోస్ట్ ను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆదేశించారు. దాంతో ఆ ట్వీట్ ను కంగనా వెంటనే డిలీట్ చేశారు.
దీనిపై కంగనా మరొక ట్వీట్ చేస్తూ.. ‘ మా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఆ ట్వీట్ డిలీట్ చేశాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను. కానీ నడ్డా జీ.. వివాదాల జోలికి వెళ్లొద్దు అని విషయం చెప్పారు. ఆయన మాట మీద గౌరవంతో ఆ ట్వీట్ ను వెంటనే తొలగించాను. ఆ పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో కూడా పెట్టడంతో అక్కడ నుంచి తొలగించాను’ అని చెప్పుకొచ్చారు కంగనా.
Respected national president Shri @JPNadda ji called and asked me to delete the tweet I had posted regarding Trump asking Apple CEO Tim Cook not to manufacture in India.
I regret posting that very personal opinion of mine, as per instructions I immediately deleted it from…— Kangana Ranaut (@KanganaTeam) May 15, 2025

ఇది కూడా చదవండి: