breaking news
Donald Trump
-
పాక్పై ట్రంప్ మోజు!
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్హౌస్కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి. ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది. ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు. భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది. ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. -
సినిమాలపై ట్రంప్ టారిఫ్.. టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సినిమాలపై వందశాతం సుంకం విధించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదని ట్వీట్ చేశారు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకుంటుందని నిఖిల్ రాసుకొచ్చారు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా సినిమాలపై వందశాతం సుంకం అమలు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.విదేశీ సినిమాలపై ట్రంప్ టారిఫ్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. No . Trump Tariffs on Films will Not be Implemented. Since The Berman Amendment (50 U.S.C. §1702(b)(3)) explicitly Stops presidential restrictions/Tariffs under IEEPA on imported informational materials like films, as confirmed by congressional records. Combined with First… https://t.co/0d7qvItrr2— Nikhil Siddhartha (@actor_Nikhil) September 30, 2025 -
భారత సినిమా పై ట్రంప్ బాంబ్
-
ట్రంప్-నెతన్యాహు గాజా గేమ్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. శాంతి ప్రణాళిక(Gaza Peace Plan) ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్హౌజ్ వేదికగా.. ఇజ్రాయెల్ అద్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు హమాస్ గ్రూప్ అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాన్ని ఇద్దరూ వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ఫార్ములాను హమాస్ గనుక ఒప్పుకుంటే.. 72 గంటల్లో వాళ్ల చేతుల్లో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. యుద్ధ విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. హింసను వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. హమాస్ ఆయుధాలు వదిలి పాలన నుంచి తప్పుకుంటుంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు గాజాలో Board of Peace ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి గేట్లు తెరుస్తారు. ఇలా మిగిలిన అంశాలు ఉన్నాయి. అయితే.. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు హమాస్(Hamas)కు మరోసారి ఈ ఇద్దరు నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణితో ట్రంప్, నెతన్యాహులు మాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ట్రంప్-నెతన్యాహు(Trump-Netanyahu) ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. హమాస్ ఇంతదాకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. పక్షపాతంగా ఉందనే ‘గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు. గాజా శాంతి ప్రణాళిక.. ముఖ్యాంశాలుగాజా నగరాన్ని ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం.హమాస్కు పాలనా హక్కు లేకుండా, తాత్కాలిక పాలనను ఏర్పాటు చేయడం.ఇజ్రాయెల్ బంధీలను 72 గంటల్లో విడుదల చేయడం.ఇజ్రాయెల్ 250 జీవిత ఖైదీలు, మరియు 1,700 గాజా ఖైదీలను విడుదల చేయడం.ప్రతి ఇజ్రాయెల్ బంధీ మృతదేహానికి, 15 మంది గాజా మృతదేహాలను తిరిగి ఇవ్వడం.హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతిగా జీవించాలనుకుంటే, వారికి క్షమాభిక్ష ఇవ్వడం.హమాస్ సభ్యులు గాజా విడిచి వెళ్లాలనుకుంటే, భద్రతతో కూడిన మార్గం కల్పించడం.యుద్ధం ఆగిన వెంటనే, పూర్తి మానవతా సహాయం ప్రారంభించడం.జల, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం.రఫా సరిహద్దు రెండు దిశలలో తెరవడం.బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా గాజా పాలన.ట్రంప్ అధ్యక్షతన, ఈ బోర్డు పునర్నిర్మాణం, నిధుల పంపిణీ నిర్వహిస్తుంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులకు ఈ బోర్డులో భాగం.పాలనా కమిటీ apolitical, technocratic Palestinians తో ఏర్పాటవుతుంది.పాలస్తీనా అథారిటీ పునరుద్ధరణ తర్వాతే గాజా పాలన చేపట్టాలి.ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించడానికి, దశలవారీగా ప్రణాళిక.అంతర్జాతీయ మానిటర్లు ద్వారా గాజా లోని ఆయుధాల నిర్మూలన.ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ద్వారా “New Gaza” నిర్మాణం.ప్రత్యేక ఆర్థిక మండలం (Special Economic Zone) ఏర్పాటు.గాజా ప్రజలు అక్కడే ఉండేందుకు ప్రోత్సాహం, బలవంతంగా తరలింపు ఉండదు. -
గాజా ఆక్రమణ ఉండదు
వాషింగ్టన్: గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు.ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు. నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రాంతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే విషయంలో నెతన్యాహుతో చర్చలు ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్ ప్రధానమంత్రికి నెతన్యాహు క్షమాపణ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్–థానీకి ఫోన్ చేసి క్షమాపణ కోరారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం ముస్లిం దేశాల్లో అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్ తీరును ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్ ప్రధానికి ఫోన్చేశారు. దోహాపై దాడుల పట్ల విచారం వ్యక్తంచేశారు. క్షమాపణ కోరారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది. టారిఫ్ ప్రభావం ఎలా ఉంటుందంటేఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.పరిశ్రమలో ఆందోళనఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ‘అమెరికా సినిమా పరిశ్రమను రక్షించేందుకు’ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇది అంతర్జాతీయ సినిమా వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా.. రేపే..
అమెరికాలో లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆ రోజున రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవే కావడం గమనార్హం.కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలలపాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్.. -
భారత్ను దారికి తీసుకురావాలి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ను ఉద్దేశించి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను దారికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఇండియా, బ్రెజిల్ దేశాలకు హితవు పలికా రు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్లు తెరవాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బ్రెజిల్, ఇండియా, స్విట్లర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి తమకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు. అమెరికా పట్ల నిజంగా స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా పని చేస్తుండడం వల్లనే ఇండియా వంటి దేశాలతో తాము కఠినంగా ఉండాల్సి వస్తోందని లుట్నిక్ తేల్చిచెప్పారు. ‘‘మీ ఉత్పత్తులు అమెరికన్లకు విక్రయించుకోవాలని కోరుకుంటే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లా డుకోండి. సంధి చేసుకోండి’’ అని సూ చించారు. ఇండియా సహా పలుదేశాల తో వాణిజ్య చర్చలు చురుగ్గా ముందు కు సాగడం లేదని తెలిపారు. ఆయా దేశాల మొండి పట్టుదల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వివాదాలను త్వరలో పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో దురుద్దేశం ఏమీ లేదని చెబుతోంది. భారత్ వాదనను అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మీరే నిధులు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. మరోవైపు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం గమనార్హం. 2024–25లో రెండు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. -
అమెరికాకు వెళ్లాలా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్ డ్రీమ్స్’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.ఏయే వీసా మీద ఎంతమంది?ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది. యూకే తరవాత మనమేయూఎస్ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.ఈ ఏడాది తగ్గుతుందా?భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్!
అమెరికాతో అప్పటిదాకా ఉన్న భారత్ స్నేహబంధం.. ట్రంప్ 2.0 రాకతో ఒక్కసారిగా చేదెక్కింది. మిత్రదేశం అంటూనే సుంకాల మోత మోగించారాయన. అటుపై ఉక్రెయిన్ యుద్ధాన్ని వంక పెట్టుకుని రష్యాతో ఇండియా మైత్రిని తీవ్రంగా తిట్టిపోస్తూ వచ్చారు. దీనికి తోడు వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. ఈ చర్చల్లో పురోగతి, మోదీపై ప్రశంసలతో ఆయన వెనక్కి తగ్గారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన పాక్కు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దరిమిలా.. అమెరికా అధ్యక్షుడిని భారత్కు మిత్రుడిగా చూడడం ఇక కష్టమేనంటున్నారు పశ్చిమబెంగాల్లోని బహారంపూర్ ప్రజలు. మోదీ ఎంత స్నేహంగా ఉంటున్నా.. ట్రంప్ మాత్రం మోసం చేశారని రగిలిపోతున్నారు. ఆ కోపంతో అక్కడి దుర్గా పూజ మండపంలో ఏకంగా ట్రంప్ను మహిషాసురుడి అవతారంలో(Trump Demon Statue) ఏర్పాటు చేశారు. పూజా కమిటీ సభ్యుడు ప్రతీక్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఎంతో స్నేహంగా ఉంటున్నప్పటికీ ట్రంప్ సుంకాలు విధించి మోసం చేశాడు. మన దేశంపై అధర్మంగా వాణిజ్య యుద్ధానికి దిగాడు. అందుకే రాక్షసుడిగా చిత్రీకరించాం’’ అని అన్నారు. బహారంపూర్లోని ఖాగ్రా శ్మశాన ఘాట్ దుర్గాపూజా(Durga Puja Trump) కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విగ్రహాన్ని అసిం పాల్ అనే కళాకారుడు రూపొందించాడు. అయితే అది ట్రంప్ను దృష్టిలో ఉంచుకుని తానేం రూపొందించలేదని ఆయన అంటుండడం గమనార్హం. బహారంపూర్ మునిసిపాలిటీ మేయర్ నారు గోపాల్ ముఖర్జీ (టీఎంసీ) ఈ మండపాన్ని ప్రారంభించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్ అనే విషయం తెలిసి భక్త జనం ఈ మండపానికి ఎగబడిపోతున్నారు. అయితే..కిందటి ఏడాది కూడా ఇదే మండపం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్జీకర్ హత్యాచార ఘటన నేపథ్యంలో ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రూపంతో మహిషాసురుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ట్రంప్ను భారత్లో రాక్షసుడిగానే కాదు.. దేవుడిగానూ కొలిచిన సందర్భం ఉందని మీకు తెలుసా?.. తెలంగాణలోని జనగాం కోన్నె గ్రామంలో బుస్సా కృష్ణ అనే రైతు ట్రంప్ ఫొటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ వచ్చాడు(Trump Temple India). ఆ మరుసటి ఏడాది 2019లో తన ఇంటి ప్రాంగణంలో రూ. 2 లక్షల వ్యయంతో 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి నిత్యం పూలు, కుంకుమ, పాలాభిషేకం చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. అయితే 2020లో ట్రంప్ కరోనా బారినపడినప్పుడు ఆ బెంగతో మంచం పట్టి.. ఆపై గుండెపోటుతో కృష్ణ మరణించాడు. అటుపై ఆయన కుటుంబం ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వచ్చింది. అయితే.. తాజా టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ విగ్రహం గురించి పలువురు సోషల్ మీడియాలో ఆరా తీయడం గమనార్హం. -
లిసా మొనాకోను వెంటనే తొలగించండి: డొనాల్డ్ ట్రంప్
మైక్రోసాఫ్ట్ కంపెనీలో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న లిసా మొనాకో (Lisa Monaco)ను వెంటనే తొలగించాలని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) అమెరికా ప్రభుత్వంతో కలిగి ఉన్న ప్రధాన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆమె అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని అన్నారు.''లిసా మొనాకోకు మైక్రోసాఫ్ట్లో అత్యంత సున్నితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని.. ఆ రకమైన యాక్సెస్ కలిగి ఉండటం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు.మొనాకో చేసిన అనేక తప్పుడు చర్యల కారణంగా, అమెరికా ప్రభుత్వం ఇటీవల ఆమెకు ఉన్న అన్ని భద్రతా అనుమతులను తొలగించింది. అంతే కాకుండా జాతీయ భద్రతా నిఘాకు సంబంధించిన అన్ని అవకాశాలను తొలగించడం, అన్ని ఫెడరల్ ప్రాపర్టీల నుంచి ఆమెను నిషేధించింది. మైక్రోసాఫ్ట్ వెంటనే లిసా మొనాకో ఉద్యోగాన్ని రద్దు చేయాలని నా అభిప్రాయం'' అని ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు.ఇదీ చదవండి: 'ఉద్యోగ భద్రత ఒక జోక్': రాబర్ట్ కియోసాకిఎవరీ లిసా మొనాకో?ఈ ఏడాది జూలైలో లిసా మొనాకో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అఫైర్స్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె గతంలో 2021 నుంచి జనవరి 2025 వరకు నాలుగు సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ అటార్నీ జనరల్గా పనిచేశారు. 2013 నుంచి 2017 వరకు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశారు. మొనాకో.. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 2011లో జాతీయ భద్రతకు అసిస్టెంట్ అటార్నీ జనరల్గా తన కెరీర్ను ప్రారంభించి, రెండేళ్లు ఆ పదవిలో పనిచేశారు. -
మన రియల్ఎస్టేట్కు కలిసిరానున్న ట్రంప్ నిర్ణయం
పీఠం ఎక్కిన తొలి రోజు నుంచీ భారత్పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం.. దేశీయ స్థిరాస్తి రంగానికి ఊతమివ్వనుంది. ప్రత్యేకించి కార్యాలయ స్థలాలకు డిమాండ్ను కల్పించనుంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా రుసుముల పెంపు నిర్ణయంతో.. దేశీయంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు అపార అవకాశాలు ఏర్పడతాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే బహుళ జాతి సంస్థల జీసీసీలకు హాట్ ఫేవరేట్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్లకు ఇదొక వరంగా మారనుంది. అందుబాటులో అద్దెలు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ జీసీసీలకు హబ్గా మారే అవకాశాలున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీసీసీలకు ఇండియా కేంద్రంగా అభివృద్ధిచెందడంతో బహుళ జాతి కంపెనీలు ఇక దేశీయంగానే జీసీసీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తాయి. దీంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి టెక్నాలజీ హబ్ మెట్రోల్లోని ఆఫీసు స్పేస్లకు ఆదరణ ఏర్పడనుంది. ప్రస్తుతం దేశంలో 1700లకు పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో 19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 64 బిలియన్ డాలర్ల మార్కెట్గా ఉంది. 2030 నాటికి 2,400 జీసీసీలకు, 25–30 లక్షల మంది ఉద్యోగులకు, అలాగే వంద బిలియన్ డాలర్ల మార్కెట్కు విస్తరిస్తుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది.ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకత..జీసీసీలు అనేవి బహుళ జాతి సంస్థల ఆఫ్షోర్ యూనిట్లు. ఇవి ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ఏకీకృతం చేసి కేంద్రాలు. దేశంలోని మెట్రో నగరాలు ఒక్కో రంగంలో కీలక హబ్లుగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ, పరిశోధనాభివృద్ధికి, ముంబై బీఎఫ్ఎస్ఐకి, హైదరాబాద్ ఫార్మా, ఐటీ, కృత్రిమ మేధస్సుకు, పుణె ఇంజనీరింగ్కు, ఢిల్లీ–ఎన్సీఆర్ ఈ–కామర్స్, చెన్నై తయారీ రంగాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఖర్చును ఆదా చేసే కేంద్రాల నుంచి ఆవిష్కరణ, విలువ ఆధారిత సేవలకు వ్యూహాత్మక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దేశంలోని జీసీసీలు కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్ లెరి్నంగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి.అమెరికా కంపెనీలే ఎక్కువ..భారత్లో జీసీసీల ఏర్పాటుకు అమెరికాకు చెందిన కంపెనీలే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. 2021 నుంచి ఇండియాలో జరిగిన జీసీసీ లీజులలో యూఎస్ కంపెనీల వాటా ఏకంగా 70 శాతంగా ఉందంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్ –500 కంపెనీలు, గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో యూకే, యూరప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా(ఈఎంఈఏ), ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) దేశాల జీసీసీలు కూడా ఇండియాలో జీసీసీలను విస్తరిస్తున్నాయి. 2025లో జరిగిన 2.8 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలలో జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్ వంటి ఏపీఏసీ దేశాల వాటా 10 శాతంగా ఉంది.జీసీసీ స్పేస్ 10 కోట్ల చ.అ.నాలుగేళ్లలో ఇండియాలోని ఏడు ప్రధాన నగరాలలో 10 కోట్ల చ.అ. స్థలాలను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. ఇది మొత్తం ఆఫీసు స్పేస్ డిమాండ్లో 36 శాతం. జీసీసీ లీజింగ్లలో టెక్నాలజీ రంగం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 37 శాతం లావాదేవీలలో ఐటీ రంగం తొలి స్థానంలో నిలవగా.. బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్, తయారీ రంగాలు 40 శాతం స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అలాగే 2026లో 7–7.5 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలలో 2.9–3.2 కోట్ల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకుంటాయని ‘కొల్లియర్స్’ అంచనా వేసింది. అలాగే 2027లో 7.5–8.5 కోట్ల కార్యాలయ స్థల లావాదేవీలలో జీసీసీల వాటా 3.2–3.4 కోట్లతో, ఏటా 40 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరుబహుళ జాతి సంస్థల జీసీసీలకు దక్షిణాది నగరాలు హాట్ ఫేవరెట్గా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ హబ్లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు నగరాలు బహుళ జాతి సంస్థల జీసీసీలను ఆకర్షించడంలో తీవ్రపోటీపడుతున్నాయి. 2021–25 మధ్యకాలంలో ఈ రెండు నగరాలు మొత్తం జీసీసీ డిమాండ్లో 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.2021తో పోలిస్తే 2025లో చెన్నైలో జీసీసీ లీజులు 5.3 రెట్లు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్ 2021 నుంచి జీసీసీ లీజింగ్లలో 60 శాతం వాటాను నమోదు చేస్తున్నాయి. బెంగళూరులోని ఓఆర్ఆర్, హైదరాబాద్లోని సెకండరీ బిజినెస్ డి్రస్టిక్ట్(ఎస్బీడీ) ప్రాంతాలు ఎక్కువ డిమాండ్ ఉంది. ఫార్చ్యూన్–500 కంపెనీలు ఈ కారిడార్లలో జీసీసీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2021 నుంచి దేశంలోని జీసీసీ లీజులలో ఈ కారిడార్ల వాటా ఏకంగా 37 శాతంగా ఉంది.నగరంలో 355 జీసీసీలు..ప్రస్తుతం హైదరాబాద్లో 355కు పైగా జీసీసీ సెంటర్లున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సౌత్ కొరియా దేశాలకు చెందిన జీసీసీలు నగరంలో కొలువుదీరాయి. మెక్ డొనాల్డ్స్, వాన్గార్డ్, సిటిజెన్ బ్యాంక్, హీనెకెన్, బారీకేల్బాట్, డై–ఇచి, హెచ్సీఏ హెల్త్కేర్ వంటి సంస్థలు హైదరాబాద్లో జీసీసీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2021లో నగరంలో 37 లక్షల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకోగా.. 2025 నాటికి 52 చ.అ.లకు చేరాయి.5.09 కోట్ల ఆఫీసు స్పేస్..దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంలో 5.09 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 4.73 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. అలాగే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 7 నగరాలలో కొత్తగా 4.14 కోట్ల గ్రేడ్–ఏ కార్యాలయ స్థలం సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంలో సప్లయి అయిన 3.78 కోట్ల చ.అ. స్పేస్తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే.. -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్తో డొనాల్డ్ ట్రంప్ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్తో ట్రంప్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
భారత్-పాక్ యుద్ధం, సింధూ జలాలపై షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ఆపరేషన్ సిందూర్, సింధూ నదీ జలాలపై పాకిస్తాన్(Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని షరీఫ్ ఐక్యరాజ్య సమితి(UN) వేదికగా ఆరోపించారు. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని.. ఇది యుద్ధ చర్యకు సమానం అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చొరవ ప్రశంసనీయం అంటూ మెచ్చుకున్నారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ట్రంప్ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్ నిజాయతీగా కృషి చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ట్రంప్ దూరదృష్టి గల నాయకత్వంలో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది. ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్-పాక్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగేది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్.. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది’ అని చెప్పుకొచ్చారు. Pakistani Prime Minister Shehbaz Sharif about Trump: 🇵🇰❤️🇺🇸“Pakistan has nominated Trump for the Nobel Peace Prize, and this is the least we can do for his love of peace. He is truly a man of peace.”pic.twitter.com/xYPcXvmX6O— S.Haidar Hashmi (@HaidarHashmi0) September 27, 2025అనంతరం, సింధూ జలాలు, కశ్మీర్ అంశంపై షరీఫ్ స్పందిస్తూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసింది. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలి. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీటీపీ, బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం’ అని తెలిపారు.షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.. మరోవైపు షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ..‘పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఐరాసలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది. పాక్లోని ఉగ్ర స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది. Breaking:Pakistan must shut down terror camps, hand over terrorists to India, Indian Diplomat @petal_gahlot's right of reply to Pakistan PM Shehbaz Sharif at UNGAFull address pic.twitter.com/WoxZM93cBl— Sidhant Sibal (@sidhant) September 27, 2025 -
మన ఫార్మాపై ప్రభావం ఉండదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి వంద శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంతో మన కంపెనీలపై తక్షణ ప్రభావం పడే అవకాశమేమీ ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన కేవలం పేటెంట్, బ్రాండెడ్ ఉత్పత్తులకే తప్ప జనరిక్ ఔషధాలకు కాదని వివరించాయి. చౌకైన, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అంతర్జాతీయంగా ఔషధాల సరఫరా వ్యవస్థకి భారత్ మూలస్తంభంగా నిలుస్తోందని, 47 శాతం అమెరికా ఔషధ అవసరాలను తీరుస్తోందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. టారిఫ్ల ప్రభావం మన మీద ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ‘మనం చాలా మటుకు జనరిక్స్నే అందిస్తున్నందున పేటెంట్, బ్రాండెడ్ ఫార్మా దిగుమతులపై ప్రతిపాదిత 100 శాతం టారిఫ్లు భారత ఎగుమతులపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. అంతేగాకుండా పలు బడా భారతీయ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తయారీ ప్లాంట్లు లేదా రీప్యాకేజింగ్ యూనిటను నిర్వహించడంతో పాటు ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి‘ అని నమిత్ జోషి వివరించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) కూడా మన ఫార్మాపై అమెరికా టారిఫ్ల తక్షణ ప్రభావమేమీ ఉండదని తెలిపింది. ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 23 దేశీ దిగ్గజాలకు ఐపీఏలో సభ్యత్వం ఉంది. వీటికి ఔషధ ఎగుమతుల్లో దాదాపు 80 శాతం, దేశీ మార్కెట్లో సుమారు 64 శాతం వాటా ఉంది. కొత్త అవకాశాలపై ఇన్వెస్ట్ చేయాలి .. రాబోయే రోజుల్లో బల్క్ డ్రగ్స్, ఏపీఐలకు (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్) సంబంధించిన వ్యయాలను మరింతగా తగ్గించుకుంటే ఇతర సరఫరాదారుల కన్నా భారత్ వైపే అమెరికా మరింతగా మొగ్గు చూపడానికి అవకాశం ఉందని జోషి చెప్పారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, పెప్టైడ్స్, బయోసిమిలర్స్ మొదలైన విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాకు తమ ఎగుమతులు పెద్దగా లేనందున టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండదని ఎమ్క్యూర్ ఫార్మా తెలిపింది. భారత ఫార్మా కంపెనీల జనరిక్ ఔషధాల సరఫరాతో 2022లో అమెరికా హెల్త్కేర్ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు, 2013–2022 మధ్య కాలంలో 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆదా అయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఫార్మెక్సిల్ గణాంకాల ప్రకారం 2024–25లో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనరిక్స్ మన బలం.. భారత్ బలం జనరిక్ ఔషధాలని, వీటికి టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్నందున భారత్పై ప్రభావం ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వీపీ దీపక్ జోత్వానీ తెలిపారు. అయితే, అమెరికా వెలుపల ఉంటూ, ఆ దేశానికి ఎగుమతి చేసే బ్రాండెడ్ డ్రగ్ కంపెనీలతో కొన్ని భారతీయ ఫార్మా సంస్థలకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సదరు కంపెనీలకు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)లాంటివి సరఫరా చేసే మన కంపెనీలపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అటు ప్రధానంగా జనరిక్స్నే ఎగుమతి చేస్తుంది కాబట్టి భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్ ఉండదని, కాకపోతే ఈ పరిణామం, భవిష్యత్తులో దేశీయంగా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సవాళ్లు ఎదురు కావొచ్చని సూచిస్తోందని ఫౌండేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు రాహుల్ అహ్లువాలియా చెప్పారు. ఈ నేపథ్యంలో మన కంపెనీలకు పెద్ద మార్కెట్లు అందుబాటులోకి వచ్చే దిశగా అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటు అమెరికా వినియోగదారులపై టారిఫ్ల భారం మరీ ఎక్కువగా ఉండకుండా కొన్ని కేటగిరీలను మినహాయిస్తూ, తదుపరి చర్యలు ఉండొచ్చని అడ్వైజరీ సేవల సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ హెడ్ లూయీసీ లూ తెలిపారు. -
ట్రంప్ ఫార్మా షాక్
వాషింగ్టన్: టారిఫ్ల మోతతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా రంగంపై సుంకాలతో విరుచుకుపడ్డారు. విదేశాల నుంచి దిగుమతయ్యే ఫార్మా (బ్రాండెడ్, పేటెంటెడ్) ఉత్పత్తులపై ఏకంగా 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, సోఫాలు ఇతరత్రా ఫర్నిచర్పై 30% చొప్పున, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలను వడ్డించారు.తాజా సుంకాలన్నీ అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తా యని గురువారం తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. అయితే, జనరిక్ ఔషధాలకు సుంకాలు వర్తించవని, దీని వల్ల ఫార్మా టారిఫ్ల ప్రభావం భారత్పై పెద్దగా ఉండదని మన కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క, ధరలు పెరిగిపోవడంతో అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారమవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్పై సుంకాల దెబ్బకు ఇళ్ల ధరలు ఎగబాకడంతో పాటు అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందనేది ఆర్థిక నిపుణుల మాట!జాతీయ భద్రత సాకు...ఔషధాలు, కిచెన్ క్యాబినెట్లు, సోఫాలు ఇతరత్రా ఫర్నీచర్, భారీ ట్రక్కులపై దిగుమతి సుంకాల విధింపునకు జాతీయ భద్రత, ఇతరత్రా కారణాలను ట్రంప్ సాకుగా చూపడం విశేషం. అయితే, అమెరికాలో కార్యకలాపాలు మొదలుపెట్టిన, ఇప్పటికే ప్లాంట్లను నిర్మిస్తున్న ఫార్మా కంపెనీలకు ఈ టారిఫ్లు వర్తించవని ట్రంప్ పేర్కొన్నారు. మరి అమెరికాలో ఇప్పటికే ఫ్యాక్టరీలు ఉన్న విదేశీ ఫార్మా సంస్థలకు టారిఫ్లు వర్తిస్తాయా లేదా అనేది దానిపై స్పష్టత లేదు. 2024లో అమెరికా దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా, వైద్య ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ట్రంప్ టారిఫ్ దెబ్బతో కొన్ని మందుల ధరలు రెట్టింపు కావడంతో పాటు వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగి పోయే అవకాశం ఉంది.‘టారిఫ్లు అమెరికన్లకు పెను భారంగా మారతాయి. ఔషధాల ధరలు తక్షణం పెరిగిపోవడం, ఇన్సూరెన్స్ ఖర్చులు ఎగబాకడం, ఆసుపత్రుల్లో మందులకు కొరతతో ప్రజలు అల్లాడటం ఖాయం’ అని కెనడియన్ చాంబర్ ఆప్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ పాస్కల్ చాన్ హెచ్చరించారు. మరోపక్క, విదేశాల్లో తయారైన భారీ ట్రక్కులు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడం వల్ల దేశీ తయారీ సంస్థలను దెబ్బతీస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయడం వల్ల ధరలు భారీగా ఎగబాకుతాయన్న ఆందోళనలను ట్రంప్ కొట్టిపారేశారు.ఇదిలా ఉంటే, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నీచర్పై సుంకాలతో ఇళ్ల ధరలకు రెక్కలు రావడం ఖాయమని రియల్టీ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే సరఫరా సమస్యలు, అధిక వడ్డీ రేట్లతో ప్రజలకు ఇళ్ల కొనుగోలు భారమవుతున్న తరుణంలో ట్రంప్ టారిఫ్లు మరింత గుదిబండగా మారతాయని అమెరికా జాతీయ రియల్టర్ల అసోసియేషన్ పేర్కొంది. ఏప్రిల్లో వివిధ దేశాలపై సుంకాల మోతకు తెరతీసినప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం 2.3 శాతంగా ఉండగా, తాజాగా 2.9 శాతానికి ఎగబాకడం గమనార్హం.బడా ఫార్మా దిగ్గజాల అమెరికా బాట...కొన్ని నెలలుగా ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో మెర్క్, ఎలీలిలీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా, రోషె తదితర అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు ఇప్పటికే అమెకాలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. భారీగా పెట్టుబడులను కుమ్మరిస్తామంటూ ట్రంప్కు హామీ ఇచ్చాయి. బడా కంపెనీలు తయారీ ప్లాంట్లను అమెరికాకు తరలిస్తుండటం, ప్లాంట్ల నిర్మాణ పనులకు తెరతీయడంతో వాటిపై పెద్దగా ప్రభావం ఉండదని జెఫరీస్ ఎనలిస్ట్ ఆకాశ్ తివారీ అభిప్రాయపడ్డారు. చిన్న కంపెనీలకు మాత్రం టారిఫ్ల దెబ్బ తప్పదని పేర్కొన్నారు. -
నాటో చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధినేత పుతిన్కు ఫోన్చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుటే చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రుటే వ్యాఖ్యలు ఆధారరహితం అని తేల్చిచెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోదీ ఆసక్తి కనబర్చారని, ఇటీవల పుతిన్కు ఫోన్ చేసి ఆరా తీశారని మార్క్ రుటే చెప్పడం సంచలనం సృష్టించింది. జరగని సంభాషణ జరిగినట్లు మార్క్ రుటే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ«దీర్ జైస్వాల్ అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని రుటేకు హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి మోదీ తెలుసుకోలేదని స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంటామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. రష్యా నుంచి పశ్చిమ దేశాలు కూడా ముడి చమురు కొంటున్నాయని రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా గుర్తుచేశారు. -
సమస్యగా కాదు... సదావకాశంగా చూద్దాం!
హెచ్–1బీ వీసా రుసుమును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా మనల్ని నిస్పృహకు గురి చేసినా... దీర్ఘ కాలంలో మేలు చేస్తుంది. నిజానికి మన ‘ఆత్మనిర్భర్’ నినాదానికీ, ‘అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడ’మనే ట్రంప్ పిలుపునకూ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. మరి దానిమీద మనం ఇంతగా స్పందించడం దేనికి? అమెరికా నిర్ణయం సుశిక్షితులైన, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు అయిన భారతీయ వృత్తినిపుణుల సంఖ్యను ఆ దేశంలో తగ్గిస్తుంది. కొత్తగా కాలుమోపబోయే వారి సంఖ్య పరిమితమవుతుంది. అమెరికాకు వెళ్ళడాన్ని నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఆ కోవకు చెందినవారికి అమెరికాలో కొరత ఉందన్నది కూడా వాస్తవం. అమెరికా కోణం నుంచి చూస్తే అది న్యాయబద్ధమైనదే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గైకొనే హక్కు ట్రంప్కు ఉంది. దానిపై మన స్పందన తార్కికమైనదిగా ఉండాలి.భారత నిపుణులను యూరప్ బలవంతంగా..భారతీయ పత్తి పరిశ్రమను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాశనం చేశారు. నేతపనివారినీ, పత్తి పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మందినీ బ్రిటన్కు తీసుకెళ్ళారు. మాంచెస్టర్ రాత్రికి రాత్రి పత్తి మార్కెట్ కేంద్రంగా అవతరించింది. భారతీయుల్లో చాలా మంది దాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగానే పరిగణించారు. ఇంగ్లండ్ ఒక కిలో పత్తిని కూడా ఎన్నడూ పండించకపోయినా, యూరప్లోనే వస్త్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైన కేంద్రంగా మాంచెస్టర్ రూపుదిద్దు కుంది. నిపుణులైన కార్మికులను భారత్ నుంచి బలవంతంగా తీసుకెళ్ళిన కారణంగానే అది సాధ్యమైంది. వాస్తవానికి, ట్రంప్ ఇపుడు దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను లేదా నిపుణులైన సిబ్బందిని తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాకు రాకుండా నివారిస్తున్నారు. కానీ, మనవారిని తీసుకెళ్ళడం వల్ల బ్రిటిష్ వారు బాగు పడినంతగా, మనవారిని పంపించేయడం వల్ల అమెరికా లబ్ధి పొందబోవడం లేదు.ప్రతిభావంతులను ఆకర్షించే వ్యవస్థ..ట్రంప్ నిర్ణయం ఆత్మనిర్భర్ భావనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు పురికొల్పినదవుతుంది. ఇందుకు మన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, నియంత్రణలపై దృష్టి పెట్టి కీలక రంగాల్లో సత్వర సంస్కరణలు తీసుకురావాలి. సర్వవిధాలా ప్రతిభావంతులను ఆకర్షించి, అండగా నిలిచి, నిలబెట్టుకుని ప్రోత్సహించే సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠపరచాలి. హెచ్–1బీతో ట్రంప్ తాజా దాడి, ఐఐటీలు, ఐఐఎస్సీలు తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి తాజా గ్రాడ్యుయేట్లు తండోపతండాలుగా అమెరికాకు తరలిపోకుండా తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే ఆగిపోవడానికి కూడా తోడ్పడవచ్చు.కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం..అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను భారతదేశంలోనే అట్టిపెట్టుకునేందుకు, వారు భారతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేసుకునేందుకు ఇది స్పష్టంగా నిజమైన అవకాశం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు, శిక్షణలకు ప్రతి ఐఐటీ పైనా భారత్ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. కానీ, వాటి నుంచి దేశం పూర్తి ఫలాలను నిజంగానే పొందడం లేదు. అమెరికా, యూరప్లకు చెందిన అనేక సంస్థల సీఈఓలుగా మన ఐఐటీ మెరికలు పని చేస్తూంటే వారి పేర్లు, పాత్రలను గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తున్నాం. భారతీయుల ఆలోచనా శక్తి, వారసత్వం, ప్రజ్ఞాపాటవాలను ప్రపంచంలోని మిగిలిన దేశాలకు వినమ్రంగా, బలంగా, ఆత్మ విశ్వాసంతో చాటి చెప్పేందుకు, నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైంది.– ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ -
ట్రంప్ ఎఫెక్ట్.. పుతిన్తో మోదీ చర్చలు: నాటో అధికారి కీలక వ్యాఖ్యలు
వాష్టింగన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) విధిస్తున్న టారిఫ్ల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్తో రష్యా యుద్దం విషయమై పుతిన్తో భారత ప్రధాని మోదీ(Narendra Modi) చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ..‘భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై సుంకాల భారం పడటంతో పుతిన్తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. "Delhi is on phone with Vladimir Putin in Moscow, & Narendra Modi asking, hey I support you but could you explain to me the strategy bcz I have been hit with 50% tariffs. Prez Trump is implementing what he says"NATO Secretary-General Mark Ruttepic.twitter.com/63cEh4CxNZ— Sidhant Sibal (@sidhant) September 26, 2025ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్హోస్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. -
ట్రంప్ శాంతి దూత: షరీఫ్
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు. గత ఆరేళ్లలో వైట్హౌస్లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్లో పర్యటించాలంటూ ట్రంప్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్హౌస్కు రాబోతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’మారిన ట్రంప్ వైఖరి 2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్హౌస్కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. Just Now 🇵🇰🇺🇸🚨 Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025 -
భారత్కు ట్రంప్ భారీ షాక్!
సుంకాల యుద్ధంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్హోస్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. భారతంపై ప్రభావం..భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2024లో భారత్ 27.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషదాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అందులో సుమారు భారత్ 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలనే అమెరికాకు ఎగుమతి చేసింది. అయితే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలోనే దాదాపు 3.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెరికాకు వెళ్లడం గమనార్హం. ట్రంప్ విధించిన తాజా సుంకాలు బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై వర్తిస్తాయన్నది స్పష్టత వచ్చింది. సాధారణంగా భారత్ అమెరికాకు ఎగుమతి చేసే మందుల్లో జనరిక్ ఔషదాలే ఎక్కువ. అయితే ట్రంప్ తాజా నిర్ణయం స్పెషాలిటీ డ్రగ్స్ తయారీ చేస్తున్న భారత మల్టీనేషనల్ కంపెనీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిప్లా, డివిస్ లాబ్స్, అజంత ఫార్మా, అలాగే.. నిఫ్టీ ఫార్మా స్టాక్స్పై టారిఫ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరింత తప్పదు!ఇప్పటికైతే 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. భవిష్యత్తులో మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక.. అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని అన్నారు. దీంతో ఇప్పటికే ప్లాంట్లు ఉన్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందా అనే విషయంలో స్పష్టత కొరవడింది.ఇదీ చదవండి: ‘ఇడియట్ ట్రంప్’పై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే.. -
ఆ ‘మూడు విధ్వంసాల’పై దర్యాప్తు జరగాల్సిందే
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్కలేటర్, టెలీప్రాంప్టర్, ప్రసంగం సమయంలో ఆడియో ఆగిపోవటం యాదృచ్ఛికంగా జరిగిన పొరపాట్లు కాదని తన సొంత సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో బుధవారం అసహనం వ్యక్తం చేశారు. ఈ మూడు ఘటనలను ‘మూడు విధ్వంసాలు’అని పేర్కొన్న ఆయన.. ఆ ఘటనలపై లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు ఐక్యరాజ్యసమితి సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలేం జరిగింది? మూడు రోజుల క్రితం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి ట్రంప్ వెళ్లారు. ఆయన ప్రధాన హాలులోకి వెళ్లేందుకు తన సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఎస్కలేటర్ ఎక్కగానే అది ఆగిపోయింది. దీంతో వారు ఇద్దరు మెట్లు ఎక్కుతూ జనరల్ అసెంబ్లీ హాలులోకి వెళ్లారు. అక్కడ ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం ప్రారంభించగానే టెలిప్రాంప్టర్ (ప్రసంగ పాఠం కనిపించే తెర) ఆగిపోయింది. దీంతో ఆయన ప్రసంగ పాఠం లేకుండానే 57 నిమిషాలు ఉపన్యాసం కొనసాగించారు. 15 నిమిషాల్లోనే టెలిప్రాంప్టర్ను తిరిగి పునరుద్ధరించినప్పటికీ ఆయన సొంతంగానే ప్రసంగం కొనసాగించారు. అయితే, తన మాటలు హాలులోని ఎవరికీ వినపడలేదని ఆ తర్వాత తనకు తెలిసిందని ట్రంప్ తెలిపారు. ఐరాస సిగ్గుపడాలి ఈ సాంకేతిక పొరపాట్లపై ఐరాసపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ ఘటనలపై ఐరాస సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఐరాసలో నిన్న (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం) నాకు నిజమైన అవమానం జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి. అసెంబ్లీ హాలుకు వెళ్లేందుకు నేను, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే అది ఆగిపోయింది. అదృష్టంకొద్ది మేము కిందపడలేదు. ఎస్కలేటర్ మెట్ల అంచులు చాలా పదునుగా ఉన్నాయి. కిందపడి ఉంటే ముఖానికి గాయాలయ్యేవి. మేము ఎస్కలేటర్ రెయిలింగ్ పట్టుకొని తమాయించుకున్నాం. లేదంటే ఇది పెద్ద విపత్తే అయ్యేది. తర్వాత నేను జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు పోడియంపై నిలుచున్నాను.నా ప్రసంగం వినేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమందితోపాటు హాలులో ప్రపంచ దేశాల ప్రతినిధులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే నా టెలిప్రాంప్టర్ ఆగిపోయింది. నాకు ఏమీ అర్థంకాలేదు. వెంటనే నేను ఆలోచించాను. మొదట ఎస్కలేటర్, ఇప్పుడు టెలిప్రాంప్టర్.. ఏంటీ ఈ ప్రదేశం ఇలా ఉంది అనిపించింది. శుభ సమాచారం ఏమిటంటే.. టెలిప్రాంప్టర్ లేకుండానే నేను చేసిన ప్రసంగానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఇలా చాలా కొద్దిమంది మాత్రమే చేయగలరు. ఇక మూడో విధ్వంస ఘటన నేను ప్రసంగం ముగించిన తర్వాత తెలిసింది.నా ప్రసంగం హాలులో ఉన్నవారిలో ఇంటర్ప్రెటర్స్, ఇయర్పీస్లు పెట్టుకున్నవారికి తప్ప ఎవరికీ వినపడనేలేదు. ప్రసంగం పూర్తవగానే ఎలా ఉంది అని మెలానియాను అడిగాను. ఆమె ‘నాకు ఒక్క మాట కూడా వినపడలేదు’అని చెప్పారు’అని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ట్రంప్ ఆరోపణలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. జరిగిన ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక వీడియోగ్రాఫర్ పొరపాటు వల్లే ఎస్కలేటర్ ఆగిపోయిందని వివరణ ఇచ్చారు. కాగా, ఎస్కలేటర్ ఆగిపోయినప్పుడు ఐరాస సిబ్బంది ఎగతాళిగా మాట్లాడుకోవటం కనిపించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. -
ట్రంప్ ఓ ‘ఇడియట్’: గూగుల్ ఇమేజెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయన పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రంప్ పేరుతో గూగుల్లో సెర్చ్(Google search) చేస్తే ఆయనకు సంబంధించి తాజా వార్తావిశేషాలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తన పర్యటనలు... ఇలా విభిన్న సమాచారం ప్రత్యక్షం అవుతుంది. అయితే గూగుల్ ఇమేజెస్లో ఇటీవల ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తున్న వ్యూయర్లకు కూడా ట్రంప్ ఫొటోనే దర్శనమివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో అమెరికా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిటీ ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) అలా జరగడానికి కారణాలేంటో వివరించారు.ఇటీవల యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను గూగుల్ ఇమేజెస్లో ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలను ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ‘మేము కీవర్డ్ తీసుకుంటాం. మా ఇండెక్స్లోని బిలియన్లలో ఉన్న పేజీలతో సరిపోలుస్తాం. ఆ సమయంలో ఆ కీవర్డ్కు సంబంధించిన, తాజాగా ఉన్న, ప్రజాదరణ పొందిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తాం. ఇది పూర్తిగా ఇతర వ్యక్తులు సెర్చ్ చేస్తున్నదానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వాటిని ర్యాంక్ చేస్తాం’ అన్నారు.గూగుల్ బాంబింగ్‘ఈ విధానాన్ని ‘గూగుల్ బాంబింగ్’ అని పిలుస్తారు. ఇది ఒక నిర్దిష్ట పదాన్ని నిర్దిష్ట పేజీకి లింక్ చేయడం వంటి ఆన్లైన్ సమన్వయ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. గూగుల్ మాన్యువల్గా ఫలితాలను తారుమారు చేయదు. రాజకీయ పక్షపాతం వహించదు. ఈ అల్గోరిథమ్లు వినియోగదారుల ప్రవర్తన, ఇంటర్నెట్ ట్రెండ్స్ను ప్రతిబింబిస్తాయి’ అని పిచాయ్ నొక్కి చెప్పారు. ‘ఇది కొన్నిసార్లు ఊహించని లేదా వివాదాస్పద ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
ఐక్యరాజ్యసమితిలో చేదు అనుభవాలపై ట్రంప్ సీరియస్
-
అనుమానపు ట్రంప్.. రహస్య విచారణకు ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన.. జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు యాదృచ్ఛికమేమీ కాదని.. ఇందులో కుట్ర దాగి ఉందని అంటున్నారాయన. ఐక్యరాజ్య సమితిలో వరుస చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. అదేం యాదృచ్ఛికం కాదని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్, సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం.. ఈ మూడు ఘటనలు దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయన్నారు. మొదటిది.. ట్రంప్ తన సతీమణి మెలానియా, సిబ్బందితో ఎస్కలేటర్పై ఉన్న సమయంలో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. రెండోది.. ఆయన యూఎన్జీఏలో ప్రసంగించేటప్పుడు టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ప్రింటెడ్ కాపీ ద్వారా తన సందేశాన్ని చదివి వినిపించారు. మూడోది.. ప్రసంగ సమయంలో మైక్ పనిచేయకపోవడం. దీని వల్ల అక్కడున్నవాళ్లు(భార్య మెలానియాతో సహా) తన మాటలు వినలేకపోయారని.. ఇంటర్ప్రెటర్లు ద్వారా మాత్రమే వాళ్లకు వినిపించిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఆయన అక్కడికక్కడే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే..NEW: White House Press Secretary Karoline Leavitt calls for investigation after a UN escalator shut off as President Trump and First Lady Melania Trump stepped on.According to The Times, UN staff members had previously "joked" about turning off the escalator."To mark Trump’s… pic.twitter.com/UE1AFdCn2R— Collin Rugg (@CollinRugg) September 23, 2025ఇది తనపై జరిగిన కుట్రగా ఆయన భావిస్తున్నారట. వీటిపై విచారణకు రహస్య దర్యాప్తు సంస్థలను పురమాయించినట్లు, వీటి వెనుక ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు. అయితే.. ఐక్యరాజ్య సమితి(UNO) ట్రంప్ అనుమానాలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధుల బృందంలోకి ఓ వీడియోగ్రాఫర్ పొరపాటున స్టాప్ బటన్ నొక్కడంతో ఎస్కలేటర్ ఆగిపోయి ఉంటుందని యూఎన్ అధికార ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఇక.. టెలిప్రాంప్టర్ నిర్వహణ వైట్ హౌస్ బాధ్యత కాబట్టి తమపై ఆరోపణలు సరికావని అంటోంది. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్(New York City)లో ఉంది. ఇక్కడ నిర్వాహణ లోపాలు బయటపడడం తరచూ జరిగేదే. దీనికి తోడు నిధుల లేమితో ఈ అంతర్జాతీయ సంస్థ ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే హెడ్ ఆఫీస్తో పాటు జెనీవాలో ఉన్న కార్యాలయంలోనూ ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఏసీలు, లైట్లు ఆఫ్ చేయిస్తోంది కూడా. యూఎన్కు అత్యధికంగా ఆర్థిక సాయం అందించేది అమెరికానే. అలాంటి దేశం నుంచి ఫండింగ్ ఆగిపోవడంతో ఐరాసకు ఈ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: 150 దేశాలు.. ఐరాసను చీల్చి చెండాడిన ట్రంప్ -
జోక్యం చేసుకుంటే దీటుగా బదులిస్తాం.. ట్రంప్కు చైనా కౌంటర్
బీజింగ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్ యూనియన్తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్ చెప్పారు. -
కోల్పోయిన భూభాగమంతా ఉక్రెయిన్కే
ఐక్యరాజ్యసమితి: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని ముగించాలంటే కొంత భూభాగాన్ని కోల్పోక తప్పదంటూ ఉక్రెయిన్పై ఆయన ఒత్తిళ్లు చేయడం తెల్సిందే. తాజాగా, ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. నాటో సాయంతో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్నంతటినీ ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపిన అనంతరం మంగళవారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ విషయం ప్రకటించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ‘యూరోపియన్ యూనియన్ సాయంతో ఉక్రెయిన్ పోరాడి కోల్పోయిన భూభాగాన్నంతటినీ తిరిగి గెలుచుకునే స్థాయిలో ఉందన్నది నా నమ్మకం. యూరప్, ముఖ్యంగా నాటో ఆర్థిక దన్నుతో ఈ యుద్ధం మొదలైనప్పుడు ఉన్న సరిహద్దులను తిరిగి ఉక్రెయిన్ సాధించుకోవడమే ఉత్తమమైన ఆప్షన్’అని అందులో పేర్కొన్నారు. ‘లక్ష్యమంటూ లేకుండా మూడున్నరేళ్లుగా రష్యా యుద్ధం సాగిస్తోంది. ఫలితంగా భారీ సైనిక శక్తి కలిగిన ఆ దేశం కనీసం గెలవలేని పరిస్థితికి చేరుకుంది. నేడున్నది ఘనమైన రష్యా కాదు. కేవలం కాగితం పులి మాత్రమే’అని వ్యాఖ్యానించారు. పుతిన్, రష్యా తీవ్ర ఆర్థిక సమస్యల్లో మునిగి ఉన్నందున ఉక్రెయిన్కు ఇదే సరైన అదను అని తెలిపారు. ట్రంప్ తన హామీకి కట్టుబడి ఉంటే మాత్రం యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి తేవాలంటూ పదేపదే కోరుతూ వచ్చిన జెలెన్స్కీ తన ప్రయత్నాల్లో విజయం సాధించినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ గేమ్ ఛేంజర్: జెలెన్స్కీట్రంప్ నిజంగా గేమ్ ఛేంజర్ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ట్రంప్ పిలుపు మేరకు యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులను ఆపేయాలన్నారు. ఉక్రెయిన్ చేస్తున్న పోరాటాన్ని మనం గౌరవించా ల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించగా, యు ద్ధక్షేత్రం నుంచి మంచి వార్త అందిందంటూ జెలెన్స్కీ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించం: రష్యారష్యాకు కోల్పోయిన భూభాగాలను తిరిగి గెలుచుకునే సత్తా ఉక్రెయిన్కు ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమ దేశం యూరప్ భద్రతలో విడదీయరాని భాగమని రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం కారణాలు, పరిష్కారాలపై జెలెన్స్కీ చెప్పిన మాట లను విని, అవే నిజమని ట్రంప్ నమ్ముతు న్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఏ ఒక్క అంశంతోనూ తాము ఏకీభవించడం లేద న్నారు. -
ట్రంప్ అధికప్రసంగం!
అమెరికా అధ్యక్షుడై ఎనిమిది నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల మనఃస్థితి నుంచి డోనాల్డ్ ట్రంప్ ఇంకా బయటపడినట్టు లేరు. అడ్డగోలు హామీలూ, ఆర్భాటపు ప్రకటనలూ, స్వోత్కర్షలూ, శాపనార్థాలూ ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా రివాజు. కానీ న్యూయార్క్లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినబడ్డాయి. 150 దేశాల అధినేతలూ, వారి ప్రతినిధులూ ఇందులో పాల్గొంటున్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపు గంటసేపు వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, సభాసదులు ఓటర్లనే భావనలోనే ఆయనున్నారనిపిస్తుంది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించటం మొదలుకొని, తాను సాధించాననుకుంటున్న విజయాలను ఏకరువు పెట్టడం వరకూ ఆయన దేన్నీ వదల్లేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వన రులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. వాటిని అమలుచేసే వాళ్లంతా బుద్ధిహీనులని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను తగ్గించటంలో, యుద్ధా లను నివారించటంలో సమితిసహా అన్ని సంస్థలూ విఫలమైతే, తాను ఒంటిచేత్తో ఏడు యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. యధావిధిగా భారత్–పాక్ యుద్ధం కూడా ఈ జాబితాలో వుంది. దీంతో సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికీ ఆధారాల్లేవు.ఏటా సెప్టెంబర్లో సమితి సర్వసభ్య సమావేశాలు జరగటం, ధరిత్రి ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించటం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున ‘కలిసుంటేనే మెరుగ్గావుంటాం’ అనే అంశం ప్రాతిపదికగా ‘శాంతి, అభివృద్ధి, మానవహక్కులు’ తదితర విషయాలపై అధినేతలంతా ప్రసంగించాలి. ప్రాతి పదిక అంశం మొదలుకొని దేనిపైనా ట్రంప్కు ఏకీభావం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకూ, అక్కడ చర్చిస్తున్న అంశాలకూ చుక్కెదురు. మానవ నాగరికతా ప్రస్థానానికి మూలకారణమైన వలసలంటేనే ఆయనకు ఏహ్యభావం. సరిహద్దుల్ని మూసివేసి, బయటివారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేశారు. స్వాభిమానంగల దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధంలేనివారి నుంచి ప్రజలనూ, సమాజాలనూ రక్షించుకునే హక్కుండాలని ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్వీకులు జర్మన్ సంతతివారు. అసలు అమెరికాయే వలసదారుల దేశం. ఆ వలసదారులు పొట్టపోసుకోవడానికి వచ్చిన వారు కాదు. మూలవాసులైన అనేక జాతుల వారిని సమూలంగా తుడిచిపెట్టినవారు. మొన్నీమధ్యే బ్రిటన్ వెళ్లి ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి, ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ సమితి ప్రసంగంలో మాత్రం దాన్ని దుయ్యబట్టారు. వలసలను అడ్డుకోలేక పోతున్నదని ఆ దేశంపై ట్రంప్ అభియోగం. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించటం, వేరే దేశాల వారెవరూ వుండటానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడటం ఆశ్చర్యకరం. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తాను హెచ్1బి వీసాతోనే వచ్చానని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్లు సైతం ఆ వీసాతో ప్రవేశించినవారే. ఈ ముగ్గురూ లక్ష కోట్ల డాలర్ల టర్నోవర్గల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అయినా ట్రంప్కు వలసలు ససేమిరా ఇష్టం ఉండవు. గతకాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలావున్నా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు గంభీరంగా ఉండేవి. ఈ ప్రపంచానికి చోదకశక్తి తామేనన్న అభి ప్రాయం కలిగించటానికీ, తమతోనే భవిష్యత్తుందని చెప్పటానికీ ప్రయత్నించేవారు. ట్రంప్ అందుకు భిన్నం. ప్రపంచదేశాలపై నిందలేయటం, అమెరికా కష్టాలకు వారంతా కారణమన్నట్టు మాట్లాడటం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవ లోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావటంలేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్లసంస్థగా అభివర్ణించారుగానీ...నిజానికి దాని ఉన్నత లక్ష్యాలకు గండికొట్టి, ఆ సంస్థను నామమాత్రావశిష్టం చేసింది అమెరికాయే. -
ట్రంప్కు ఘోర అవమానం
-
జెలెన్స్కీ రివర్స్ గేర్ .. భారత్ సపోర్ట్పై కీలక వ్యాఖ్యలు
భారత్పై అమెరికా సుంకాల విధింపును సమర్థించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy).. యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలో.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తోందన్న ట్రంప్ విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ జెలెన్స్కీపై ప్రశంసలు గుప్పించిన వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. భారత్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి వనరులు అందిస్తోందని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలపై ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఖండించారు. భారత్ మావైపే ఉంది అంటూ అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ జెలెన్స్కీ.. ‘‘ఇంధన రంగంలో కొన్ని సమస్యలు ఉన్నా.. భారత్ ఈ యుద్దంలో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తోంది. భారత్ను వదిలిపెట్టడం అంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. భారత్ ఎప్పటికీ పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండాలి’’ అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అమెరికా, యూరప్ దేశాలకూ ఆయన ఓ కీలక సూచన చేశారు. ‘‘భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుచుకోవాలి. ఇంధన సంబంధాల విషయంలో భారత్కు సరైన పరిష్కారాలను అందించాలి’’ అని సూచించారు. ఇదిలా ఉంటే.. షాంగై సదస్సు సమయంలో ఇదే జెలెన్స్కీ భిన్నంగా స్పందించడం తెలిసిందే. భారత్పై ట్రంప్ సుంకాలు విధించడం సరైందేనంటూ అన్నారాయన. ‘‘రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారత్తోసహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించడం సబబే. రష్యా ఇంధన వాణిజ్యమే పుతిన్కి ఉక్రెయిన్పై ప్రయోగిస్తున్న ఆయుధం. అందుకే రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు. పనిలో పనిగా.. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్రదేశాలపై కూడా జెలెన్స్కీ విమర్శలు గుప్పించారు. ‘‘యూరోపియన్ల పట్ల ట్రంప్ వైఖరి సరైనదిగా తాను భావిస్తున్నా. యుద్ధంలో పుతిన్పై అదనపు ఒత్తిడి అవసరం. ఈయూ భాగస్వామ్య పక్షాలలో కొన్ని రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనసాగిస్తున్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆ దేశాలు రష్యా నుంచి ఎటువంటి ఇంధనాన్ని కొనుగోలు చేయరాదు’’ అని అన్నారు. ఆ సమయంలో.. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన కొన్నిగంటలకే జెలెన్స్కీ అలా మాట్లాడడం గమనార్హం. ఇక.. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్, చైనాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని, భారత్పై 25% పెనాల్టీ సుంకాలు విధించడాన్ని సమర్థిస్తూ సరైన చర్య అని పేర్కొన్నారు. అదే సమయంలో రష్యాను కాగితం పులిగా అభివర్ణించిన ఆయన.. జెలెన్స్కీపై ప్రశంసలు గుప్పించారు. అలాగే రష్యా విమానాలు నిబంధలను ఉల్లంఘిస్తున్నాయని, నాటో దేశాలు వాటిని కూల్చేయాలంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు.ఇదీ చదవండి: హనుమంతుడిపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
నోబెల్ బహుమతి కావాలంటే ట్రంప్ ఆ పని చేయాలి: మెక్రాన్
న్యూయార్క్: ప్రపంచ యుద్ధాలను ఆపాను.. తనకు నోబోల్ బహుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్యలు చేస్తున్నా వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్(Emmanuel Macron) కౌంటరిచ్చారు. ట్రంప్ నిజంగా నోబెల్(Nobel) శాంతి బహుమతిని గెలుచుకోవాలనుకుంటే గాజాలో యుద్ధాన్ని ఆపాలని మెక్రాన్ సూచించారు. గాజాలో యుద్ధానికి తాము ఆయుధాలు పంపించడం లేదని.. అమెరికానే ఆ సాయం చేస్తోందని విమర్శలు చేశారు.ఐరాస సమావేశంలో నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అమెరికాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ నోబెల్ బహుమతి అంశం గురించి మెక్రాన్ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గాజాలో మారణహోమాన్ని ట్రంప్ ఆపి తీరాలి. గాజాపై యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చే శక్తి ట్రంప్కు మాత్రమే ఉంది. ట్రంప్ మనకంటే ఎక్కువ చేయగలడు. ఎందుకంటే గాజాలో యుద్ధం చేయడానికి అనుమతించే ఆయుధాలను మేము సరఫరా చేయడం లేదు. గాజాలో యుద్ధం చేయడానికి అనుమతించే పరికరాలను అమెరికా సరఫరా చేస్తుంది. ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని పదేపదే చెబుతున్నారు. ఆయనకు నిజంగా నోబెల్ కావాలంటే గాజాలో యుద్దాన్ని ఆపాలి. ఈ సంఘర్షణను ఆపితేనే నోబెల్ శాంతి బహుమతి సాధ్యమవుతుంది. వెంటనే శాంతి చర్చలు జరపాలి అని చెప్పుకొచ్చారు.ఇది కూడా చదవండి: ఐరాసలో ట్రంప్కు చేదు అనుభవం..ఇదిలా ఉండగా.. అంతకుముందు మెక్రాన్కు చేదు అనుభవం ఎదురైంది. ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ను అమెరికాలో ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి ఆపేశాడు. ఐరాసలో ప్రసంగించడానికి ట్రంప్ వస్తున్న వేళ..‘‘క్షమించండి ప్రెసిడెంట్, ప్రతిదీ స్తంభించిపోయింది. ఇప్పుడొక వాహన శ్రేణి వస్తోంది. ప్లీజ్ అర్థం చేసుకోండి’ అంటూ ఆ అధికారి అధ్యక్షుని పేరు చెప్పకుండా మెక్రాన్ను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. తాను ఫ్రాన్స్ దౌత్య కార్యాలయానికి వెళ్లాల్సి ఉందంటూ ఫ్రెంచి అధ్యక్షుడు చెప్పినా ఫలితం లేకపోయింది. విషయం అర్థం చేసుకున్న మెక్రాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకే నేరుగా ఫోన్ కలిపారు. ‘‘మీ కోసం ఇక్కడ ప్రతిదీ స్తంభించిపోయింది తెలుసా’’ అంటూ మెక్రాన్ బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఇరువురు నేతలూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారని ఫ్రాన్స్ అధికార వర్గాలు తెలిపాయి.అయితే, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఐరాస నిర్వహణ కోసం అత్యధికంగా నిధులు కేటాయించే దేశం కూడా అమెరికాయే. అందుకే ఐరాసలో అమెరికా అధ్యక్షునికి ప్రత్యేక గౌరవం. ఆయన ఐరాస సందర్శించడానికి వచ్చినప్పుడు వాహనాల్ని ఎక్కడికక్కడ స్తంభింపజేస్తారు. ఈ ప్రక్రియను ఫ్రీజ్ అని పిలుస్తారు. ఈ ఫ్రీజ్లో ఇరుక్కుంటే ఎంతవారైనా ఒక్క అడుగు ముందుకేయడానికి వీలుండదు.French President Emmanuel Macron was stopped by police in NYC last night after roads were blocked for Donald Trump’s motorcade. He called Trump and said: “Guess what, I’m waiting in the street because everything is closed for you.” Macron had to walk 30 minutes through… pic.twitter.com/u1FbEYRTdb— Republicans against Trump (@RpsAgainstTrump) September 23, 2025 -
ఐరాసలో ట్రంప్కు చేదు అనుభవం.. బుర్రున్నోడంటూ జేడీ వాన్స్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిలో చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం సాధారణ అసెంబ్లీని(UNGA) ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అంతసేపు మాట్లాడకపోవడం గమనార్హం. అయితే.. న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టాక అక్కడ ఎస్కలేటర్ పని చేయకపోవడంతో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కాస్త అసౌకర్యానికి గురయ్యారు. అలాగే.. యూఎస్జీఏ ప్రసంగం చేసే సమయంలోనూ అక్కడ టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ఇబ్బంది పడతారేమోనని అక్కడి సిబ్బంది ఆందోళన చెందారు. కానీ, ఏమాత్రం తడబడకుండా 79 ఏళ్ల ట్రంప్ తన సందేశాన్ని చదువుతూ పోయారు. కాసేపటికి వ్యక్తిగత సిబ్బంది ప్రింటెడ్ కాపీని అందించగా.. అందులో సందేశాన్ని అలవోకగా చదువుతూ పోయారు. ఆ సమయంలో.. ‘‘ ఇక్కడున్న టెలిప్రాంప్టర్(Teleprompter) పని చేయడం లేదు. అయినా ఫర్వాలేదు. అది లేకుండా నేను చదవగలను’’ అని అన్నారు. అయితే.. దీనిని ఉపయోగించి ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నవాళ్లకు మాత్రం కాస్త ఇబ్బందే అని ఆయన అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఆపై అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సంస్థ కనీసం స్పందించలేదని.. ఆ సంస్థవి ఉత్త మాటలేనని, చేతల్లేవని ధ్వజమెత్తారు. ‘ఐరాసకు గొప్ప సామర్థ్యముందని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా. కానీ అది కనీసం దానికి దగ్గరికి చేరుకోవడానికీ ప్రయత్నించదు. ఇప్పటికైనా అది బలమైన పదాలతో లేఖ రాయడానికిగానీ, దానిని పాటించడానికిగానీ ముందుకు రాదు. అది ఉత్త పదాలనే రాస్తుంది. అవి యుద్ధాలను పరిష్కరించలేవు’ అని ట్రంప్ విమర్శించారు. చివరాఖరల్లో మ్తారం ఆ సంస్థకు వందకు వంద శాతం మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం కొసమెరుపు.Trump: "I ended seven wars and never even received a phone all from the UN. These are the two things I got from the UN, a bad escalator and a bad teleprompter."😭pic.twitter.com/1DuYTtzAKm— NO CONTEXT VIDEOS (@Viralvid_89) September 23, 2025మరోవైపు.. న్యూయార్క్లోని ఐరాస హెడ్ ఆఫీస్లోని నాణ్యత లేని వసతులపైనా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడైపోయిన ఎస్కలేటర్, పని చేయని టెలిప్రాంప్టర్తో తను చేదు అనుభవం ఎదురైందని అన్నారాయన. అయితే.. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. మా అధ్యక్షుడికి బుర్ర ఉంది కాబట్టి సరిపోయింది అంటూ ఓ ట్వీట్ చేశారాయన. సరదా కోణాన్ని పక్కన పెడితే..టెలిప్రాంప్టర్ లేకపోయినా ఆయన అమెరికా విదేశాంగ విధానంపై స్పష్టంగా, సమంజసంగా ప్రసంగించినట్టు అందరూ గమనించారా? అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు.. 🤣🤣🤣https://t.co/NsPSaejzLK— JD Vance (@JDVance) September 23, 2025 NEW: White House Press Secretary Karoline Leavitt calls for investigation after a UN escalator shut off as President Trump and First Lady Melania Trump stepped on.According to The Times, UN staff members had previously "joked" about turning off the escalator."To mark Trump’s… pic.twitter.com/UE1AFdCn2R— Collin Rugg (@CollinRugg) September 23, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UN ప్రధాన కార్యాలయంలో అసౌకర్యానికి గురి కావడం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఐరాస నిర్వాహకుల నిర్లక్ష్యమని రిపబ్లికన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్ ఘటనలపై విచారణ జరిపించాలని ఐరాసను వైట్ హౌస్(White House) కోరింది. అధ్యక్షుడి విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వైట్హౌజ్ పేర్కొంది. టెలిప్రాంప్టర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజ్. ఇది ప్రసంగాన్ని(చదవాల్సిన స్క్రిప్ట్) స్క్రీన్పై చూపిస్తుంది. దాన్ని చూసుకుంటూ వక్త (speaker) మాట్లాడగలుగుతాడు. ప్రపంచ దేశాధినేతలు, పొలిటికల్ లీడర్లు, న్యూస్ రీడర్లు.. వీటిని ఉపయోగిస్తుంటారు.ఇదీ చదవండి: భారత్-పాక్ సహా ఏడు యుద్ధాలు ఆపా -
7 యుద్దాలు ఆపాను.. నోబెల్ ఇవ్వాల్సిందే.. ట్రంప్ చిల్లర కామెంట్స్
-
లాటరీకి స్వస్తి.. హెచ్–1బీ కోసం కొత్త విధానం!
వాషింగ్టన్: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
ఉత్త మాటలతో యుద్ధాలు ఆగవు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు సమీపంలోకి వచ్చే మరో దేశం లేనేలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. భూగోళంపై వ్యాపారం, వాణిజ్యంలో అత్యుత్తమ దేశం తమదేనని స్పష్టంచేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, నానాటికీ మరింత బలం పుంజుకుంటోందని అన్నారు. అమెరికాకు గతంలో ఎన్నడూ దక్కనంత గౌరవం ఇప్పుడు దక్కుతోందని వివరించారు. తాను మొదటి పర్యాయం అధ్యక్షుడిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే తమ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో ఇదొక పరిణామం అని అభివరి్ణంచారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(జనరల్ అసెంబ్లీ) 80వ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ సుదీర్ఘంగా ప్రసంగించారు. పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై నేరుగా విమర్శలు గుప్పించారు. అదొక డొల్ల సంస్థగా మారిందని ఆక్షేపించారు. గొప్ప శక్తిసామర్థ్యాలు కలిగిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి ఇప్పుడు దాదాపు నిరీ్వర్యమైపోయిందని విమర్శించారు. ఆశించిన స్థాయిలో పని చేయడంలేదని, బలాన్ని ప్రదర్శించడం లేదని తప్పుపట్టారు. ఉత్త మాటలతో సమస్యలు పరిష్కారం అవుతాయా? యుద్ధాలు ఆగిపోతాయా? అని ట్రంప్ ప్రశ్నించడం గమనార్హం. ఘాటైన పదజాలంలో లేఖలు రాయడం తప్ప చేసిందేమైనా ఉందా? అని నిలదీశారు. ఐరాస ప్రధాన కార్యాలయానికి వస్తుండగా ఎస్కలేటర్ ఆగిపోవడం, టెలిప్రాంప్టర్ విఫలం కావడం గురించి మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐరాస వేదికపై ప్రసంగించడం ఇదే తొలిసారి. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఐరాస నుంచి ఫోన్ కూడా రాలేదు ‘‘అందరూ అసాధ్యం అన్నవి నేను సుసాధ్యం చేసి చూపించా. ఏడు నెలల్లో ‘ముగింపు లేని’ ఏడు యుద్ధాలు ఆపేశా. 36 ఏళ్లుగా, 31 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాలు కూడా ఇందులో ఉన్నాయి. కాంబోడియా–థాయ్లాండ్, కాంగో–రువాండా, భారత్–పాకిస్తాన్, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్టు–ఇథియోపియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసావో–సెర్బియా యుద్ధాలకు ముగింపు పలికేశా. దీనివల్ల వేలాది మంది ప్రాణాలు నిలిచినట్లే. ఈ ఏడాది మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి చొరవ తీసుకున్నా. కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించా. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పని నేను చేయాల్సి రావడం నిజంగా బాధగా ఉంది. అసలు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏమిటి? యుద్ధాలు ఆపడానికి ఐక్యరాజ్యసమితి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. యుద్ధాల్లో మునిగి తేలుతున్న దేశాల అధినేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపా. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి నుంచి నాకు కనీసం ఫోన్కాల్ కూడా రాలేదు. ఐక్యరాజ్యసమితి నుంచి వచి్చంది ఏమిటయ్యా అంటే ఎస్కలేటర్ మాత్రమే. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. నా భార్య మెలానియా ట్రంప్ చక్కటి ఆకారం(õÙప్)లో ఉంది కాబట్టి కిందపడిపోలేదు. మేమిద్దరం చక్కటి ఆకారంలో ఉన్నాం. టెలిప్రాంప్టర్ కూడా సరిగ్గా పని చేయలేదు. టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఉంటే హృదయం లోతుల నుంచి మరింత ఎక్కువగా మాట్లాడొచ్చు. రక్తపాతాన్ని ఆపేలా మా చర్యలుంటాయి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయి. కొనుగోళ్లు ఆపాలని చెబుతున్నా మొండిగా కొనసాగిస్తున్నాయి. నాటో దేశాలు సైతం రష్యా నుంచి చమురు ఉత్పత్తులు, పలు రకాల ఇంధనాలు కొనుగోలు చేస్తుండడం క్షమించరాని విషయం. ఇది నాకు చాలా అసంతృప్తి కలిగిస్తోంది. ఏమైనా ఆలోచిస్తున్నారా? మీపై యుద్ధానికి మీరే నిధులు అందిస్తారా? ఉక్రెయిన్పై దాడులు ఆపాలని చెబుతున్నా రష్యా వినడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు, టారిఫ్లు విధించక తప్పదు. రక్తపాతాన్ని ఆపేలా మా చర్యలుంటాయి. అవి కూడా అతిత్వరలోనే. రష్యాపై చర్యలు తీసుకొనే విషయంలో యూరప్ దేశాలు కూడా మాతో కలిసి రావాలి. ఎందుకంటే రష్యాకు యూరప్ దేశాలే దగ్గర. మాకు, రష్యాకు మధ్య సముద్రం ఉంది. ఒకవైపు రష్యాతో పోరాడుతూనే మరోవైపు అదే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనడం సరైంది కాదు. ఇది నిజంగా కంపరం కలిగిస్తోంది. ఈ కొనుగోళ్లు తక్షణమే ఆపండి. ఇప్పటికే మనం చాలా సమయం వృథాచేశాం. యూరప్ దేశాల అధినేతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడో ఎందుకు.. ఈ రోజే చర్చిద్దాం. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాలి ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం మాకు ఆమోదయోగ్యం కాదు. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోం. గాజాపై యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ బందీలందరినీ హమాస్ మిలిటెంట్లు ఇకనైనా విడుదల చేయాలి. యుద్ధం ఆగాలంటే ఇజ్రాయెల్తోపాటు హమాస్ ముందుకు రావాలి. నియంత్రణ లేని వలసలతో అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి అక్రమ వలసలకు ఐక్యరాజ్యసమితి వత్తాసు పలుకుతుండటం, కొన్నిసార్లు నిధులు కూడా ఇస్తుండటం దురదృష్టకరం. మరోవైపు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పేరిట కొనసాగుతున్న వలసలు యూరప్ దేశాలకు మరణశాసనం రాస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదా? టారిఫ్ల విషయంలో విదేశాలు మమ్మల్ని తప్పుపడుతున్నాయి. మా సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికే విదేశీ ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తున్నాం. ఇందులో మరోమాటకు తావులేదు. ఇక పునరుత్పాదక ఇంధన వనరులు ఒక జోక్. శిలాజ ఇంధనాలకు సరైన ప్రత్యామ్నాలు ఉన్నాయా? మా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రత పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు అక్కర్లేదు. మా రాజధాని భద్రంగా ఉంది’’ అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. -
మీకోసం ఆపేశారు
న్యూయార్క్: దేశాధ్యక్షుడి వాహన శ్రేణి వెళ్తోందంటే ఆ రహదారి మార్గంలో వెళ్లే వాహనాలను పక్కకు ఆపేసి అధ్యక్షుడి కాన్వాయ్కు మాత్రమే దారి వదులుతారు. అలా కాన్వాయ్ మొత్తం వెళ్లేంతవరకు ఆగిపోయిన ట్రాఫిక్లో సామాన్య ప్రజానీకం ఉసూరుమంటూ వేచి ఉండాల్సిందే. అదే సామాన్య ప్రజానీకం మధ్యలో మరో దేశ అధ్యక్షుడు చిక్కుకుపోవడం నిజంగా అరుదైన ఘటనే. ఈ అరుదైన ఘటనలో మరో అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ వెళ్లేదాకా ఎంతటి దేశాధ్యక్షుడైనా రహదారిపై కారులో వేచి ఉండక తప్పదని అమె రికన్ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మేక్రాన్ నడిరోడ్డుపై కారులో వెయిట్ చేశారు. ఎంతకీ ట్రంప్ వాహనశ్రేణి క్రాసింగ్ పూర్తికాకపోవడంతో విసిగెత్తిన మేక్రాన్ కారు నుంచి బయటికొచ్చి అక్కడి పోలీసులతో అసలు విషయంపై ఆరాతీశారు. ఈ ఘటనకు సోమవారం రాత్రి న్యూయార్క్ వేదికైంది.అసలేమైంది?ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు మేక్రాన్ అమెరికాకు వచ్చారు. న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని రాత్రి బసచేసేందుకు ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి బయల్దేరారు. ఇలా తన సొంత కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు న్యూయార్క్ నగర పోలీసులు ఈ కాన్వాయ్ను అడ్డుకుంది. ఇదే మార్గంలో ట్రంప్ కాన్వాయ్ వెళ్లబోతోందని, అది వెళ్లేదాకా పక్కకు ఆగి వేచి ఉండాలని వాహన శ్రేణి డ్రైవర్లను న్యూయార్క్ సిటీ పోలీసులు ఆదేశించారు. ఎదుట ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోనని కాసేపు వేచిచూసిన మేక్రాన్ ఎంతకీ ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో విసిగెత్తి కారు నుంచి కిందకు దిగి ఎదురుగా ఉన్న పోలీసుల వద్ద విషయం ఆరాతీశారు. వాళ్లు తాపీగా అసలు విషయం చెప్పారు. ‘‘ మీరు మమ్మల్ని క్షమించాలి. రహదారులపై సాధారణ ప్రజల వాహనాలన్నింటినీ ఆపేశాం. ఇదే మార్గంలో మా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ రాబోతోంది’’ అని మేక్రాన్కు ఒక పోలీస్ అధికారి వివరించారు. దీంతో చేసేదిలేక మేక్రాన్ రోడ్డు బారీకేడ్ దగ్గర నిల్చుని సరదాగా అయినా మాట్లాడదామని నేరుగా ట్రంప్కు తన మొబైల్ నుంచి ఫోన్చేశారు. వెంటనే అటు వైపు నుంచి ట్రంప్ ఫోన్ ఎత్తారు. ‘‘ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరిగిందో ఊహించగలరా? మీ కాన్వాయ్ వెళ్తోందని రోడ్లపై కార్లను ఆపేశారు. దీంతో నేను నడిరోడ్డుపై ఆగిపోయా. మీ కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఎంబసీకి వెళ్దామని వేచిచూస్తున్నా’’ అని మేక్రాన్ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న ట్రంప్ ఫక్కున నవ్వారేమో మేక్రాన్ కూడా ఫోన్లో విపరీతంగా నవ్వుతూ కనిపించారు. ఈ తతంగాన్ని∙మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించాయి. కారు వదలి కాళ్లకు పనిచెప్పి..ఇంత జరిగిన తర్వాత కొద్దిసేపటికి ట్రంప్ కాన్వాయ్ అదే మార్గంలో వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత వాహనాలకు పోలీసులు దారి విడవలేదు. పాదచారులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది చూసిన మేక్రాన్ ఇక కారు ఎక్కొద్దని నిర్ణయించుకుని తను కూడా నడుచుకుంటూ ముందుకెళ్లారు. నడుస్తున్నంతసేపూ ట్రంప్తో మేక్రాన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూసిన న్యూయా ర్క్ ప్రజలు ఒకింత ఆశ్చర్యం మరికొంత ఆనందానికి గురయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని వృథాచేసుకోవద్దని వెంటనే కొందరు పాదచారులు మేక్రాన్తో సెల్ఫీలు దిగారు. మేక్రాన్ సైతం ఏమాత్రం అసహనం వ్యక్తంచేయలేదు. సరదాగా వాళ్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగి వారి యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. ఒకావిడ ఏకంగా మేక్రాన్ నుదుటిపై ముద్దు పెట్టుకుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఒక జంటతో మేక్రాన్ ఫొటో దిగాల్సి ఉండగా అక్కడే ఉన్న ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి, రాయబారి జెర్మీ బోనాఫాంట్ ఆ ఫొటో తీయడం విశేషం. మేక్రాన్ పాదయాత్ర వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. Macro vs Trump Funny Fight 😂🚨Macron was stopped by the New York Police, because of Donald Trump.Macron called Trump and said -"I'm waiting outside right now because everything is blocked for you (motorcade)"He had to walk to the French Embassy, for 80th UNGA.Video 📷 pic.twitter.com/UHFR7ivsCg— Mayank (@mayankcdp) September 23, 2025 -
ట్రంప్నకు హమాస్ రహస్య లేఖ?
మధ్యప్రాచ్యంలో మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. 24 మంది బందీల విడుదలతో పాటు 60 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు హమాస్ రహస్య లేఖ పంపినట్లు సమాచారం. మరోవైపు, గాజా యుద్ధం ముగింపునకు శాంతి ప్రణాళికను ట్రంప్ సిద్ధం చేసినట్లు పలు వార్త కథనాలు వెల్లడిస్తున్నాయి. దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తర్వాత గాజా శాంతి చర్చలు నిలిచిపోగా.. ఈ పరిస్థితుల్లో ట్రంప్తో హమాస్ సంప్రదింపులకు ప్రయత్నం చేస్తోంది. అయితే, ట్రంప్ బృందం ఈ విషయంపై స్పందించలేదు.కాగా, గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. శుక్రవారం( సెప్టెంబర్ 19) రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ గాజా వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో సుమారుగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గాజా నగరంలోని షావా స్క్వేర్ సమీపంలో జరిగిన దాడిలో ఐదుగురు, మరో దాడిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోయారు.గత 23 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65,100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీనియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. ఇలాఉండగా, గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారంటూ యునిసెఫ్ పేర్కొంది. -
అమెరికా చదువులపై తగ్గిన ఆసక్తి
న్యూఢిల్లీ: అమెరికా చదువులపై ఏడాది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా అమెరికాలో గురించి వాకబు చేసే వారి సంఖ్య ఏకంగా 46 శాతం తగ్గిపోయిందని, అదే కెనడా విషయానికొస్తే రెండేళ్ల కాలంలో 75 శాతంపైగా ఆసక్తి క్షీణించిందని ప్రముఖ ఐడీపీ ఎడ్యుకేషన్ సంస్థ తెలిపింది. భౌగోళిక రాజకీయాల ప్రభావం కారణంగానే అమెరికా, కెనడా వెళ్లాలని భావించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని సంస్థ దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కెనడా ప్రాంతీయ డైరెక్టర్ పియూష్ కుమార్ తెలిపారు. ‘మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అమెరికా విషయం ప్రస్తావించాలి. ఇక్కడ గడిచిన 12 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడు కాకముందు గతేడాది జూన్ నుంచే అక్కడ అననుకూల వాతావరణం నెలకొంది. అప్పటి నుంచే మంజూరయ్యే వీసాల సంఖ్య తగ్గుతూ వస్తోంది’అని ఆయన విశ్లేషించారు. ‘అమెరికాలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో సాధారణంగా వీసాల జారీ సంఖ్య తగ్గుతుండటం మనం గమనించొచ్చు. ఇందుకు రకరకాల కారణాలుంటాయి. కానీ, ట్రంప్ అధ్యక్షుడయ్యాక, ఆయన ఎలాంటి చర్యలను ప్రకటిస్తారనే ఉత్కంఠ కూడా విద్యార్థుల ఆసక్తిపై ప్రభావం చూపింది’అని పియూష్ తెలిపారు. కెనడాలో ఏం జరిగింది? 2024 మేతో పోలిస్తే 2025 మే నెలకు వచ్చే సరికి అమెరికాలో విద్యావకాశాల గురించి వాకబు చేసే వారి సంఖ్య 46.4 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అదేవిధంగా, కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య రెండేళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75 శాతానికి తగ్గినట్లు వెల్లడైందన్నారు. ‘గడిచిన రెండేళ్ల కాలంలో కెనడాలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వం మధ్య విబేధం తలెత్తడం నుంచి ఈ తగ్గుదల ఒరవడి మొదలైంది. అనంతర కాలంలో కెనడాపై అమెరికా 80 శాతం టారిఫ్లను రుద్దడంతో ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఆ సమయంలో కెనడాకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని అంతా భావించారు. ఎందుకంటే, చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయన్నది వారి అంచనాగా ఉంది. చదువయ్యాక స్వదేశానికి తిరిగిరాక తప్పదని అనుకోవడం వల్లే కెనడాలో చదువులకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు’అని ఆయన వివరించారు. అయితే, కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు 2027 దాకా కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత ఆ దేశం తన విధానాలను విద్యార్థులకు అనుకూలంగా మార్చుకుంటే పరిస్థితి మెరుగవుతుందని ఆయన తెలిపారు. ఆ్రస్టేలియాలో మరిన్ని అవకాశాలు మరో వైపు, అంతర్జాతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే ఆస్ట్రేలియా, యూకేలకు డిమాండ్ యథా ప్రకారం కొనసాగుతోందన్నారు. ఈ రెండుదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో కూడా మార్పు లేదని పియూష్ చెప్పారు. పైపెచ్చు, గత ఏడాది కంటే 9 శాతం ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆ్రస్టేలియా ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆ్రస్టేలియా ముందుకు వెళుతోందన్నారు. ఆ్రస్టేలియా ప్రభుత్వం 1969 ఏర్పాటు చేసిన ఈ సంస్థ అంతర్జాతీయ విద్యార్థులకు సేవలందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీలు, కోర్సుల ఎంపికతోపాటు దరఖాస్తు చేసుకోవడం, వీసా ప్రక్రియ వంటి వాటిలో నిపుణులతో ఉచితంగా సలహాలిప్పిస్తూ సాయపడుతూంటుంది. ఇంగ్లిష్ భాషా ప్రావీణ్య పరీక్ష ఐఈఎల్టీఎస్ను సైతం ఐడీపీ ఎడ్యుకేషన్ చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మంది యూనివర్సిటీల్లో లక్ష మంది ఐడీపీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంస్థకు భారత్లోని 63 నగరాల్లో 73 కార్యాలయాలున్నాయి. -
అమెరికాలో టిక్టాక్ బాధ్యత ఒరాకిల్కు
వాషింగ్టన్: అమెరికాలో సామాజిక మాధ్యమం టిక్టాక్ బాధ్యతలను ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ చేపట్టనుంది. అమెరికా వినియోగదారుల కోసం అవసరమైన అల్గారిథమ్ను త్వరలో టిక్టాక్ అందజేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్ సంభాషణ సందర్భంగా ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి వెల్లడించారు. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ కంపెనీ యాజమాన్యంలో టిక్టాక్ పనిచేస్తోంది. తాజా ఒప్పందంతో అమెరికాలోని టిక్టాక్ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనా కంపెనీ తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ఆందోళనలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో సిల్వర్ లేక్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టిక్టాక్ను అమెరికా కంపెనీకి అమ్మేయాలని లేదా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని బైట్డ్యాన్స్ను హెచ్చరిస్తూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గత అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ట్రంప్..బైడెన్ విధించిన నిషేధం గడువును పలుమార్లు పొడిగించారు. టిక్టాక్తో చర్చలను సైతం కొనసాగించారు. తాజాగా, జిన్పింగ్తో ఫోన్ కాల్ సందర్భంగా దీనిపై ట్రంప్ ఒక అంగీకారానికి వచ్చారు. -
ట్రంప్ తెచ్చిన తంటా!
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు. అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు. నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు. వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది. -
ట్రంప్ ఎన్నడూ ప్రధాని మోదీని వ్యతిరేకించలేదు: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లాంటి ప్రపంచ అగ్రనేతలతో వ్యక్తిగత స్నేహం ఉందని, అందుకే ప్రధానిమోదీకి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ఉందని నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం భారత్పై భారీ వాణిజ్య సుంకాలను విధించినప్పటికీ, భారత్-అమెరికా సంబంధాలలో ఎటువంటి విఘాతం ఏర్పడబోదని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ల స్నేహాన్ని ఉదహరిస్తూ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన తొలి బహిరంగా సమావేశంలో పేర్కొన్నారు.భారతదేశంపై అమెరికా 50 శాతం సుంకం విధించినప్పటికీ ట్రంప్ .. మోదీ తనకు గొప్ప స్నేహితుడని చెబుతూనే ఉన్నారని, ట్రంప్ ఎన్నడూ తాను మోదీని వ్యతిరేకిస్తున్నానని చెప్పలేదని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మోదీకి ట్రంప్, పుతిన్, జిన్పింగ్ మంచి స్నేహితులేనని అందుకే ఆయన(మోదీ) అసాధ్యాలను సుసాధ్యం చేయగలరన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలుగు పుస్తకాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. సందర్భంగా ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.సమస్యల పట్ల మోదీ వైఖరిని చాలా లోతుగా ఉంటుందని, ప్రజల మనోభావాలను విస్మరించని నేత ప్రధాని మోదీ అని, ఆయన ప్రసంగాలు ఎంతో అర్థవంతమైనవని అన్నారు. ప్రపంచ శక్తిగా ఎదగాలనే మన ఆకాంక్ష ఆధిపత్యం ద్వారా సాధ్యంకాదని, ప్రపంచ సంక్షేమం అనే ఆలోచన ద్వారా సమకూరుతుందని భారతదేశం నిరూపించిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ మన అతిపెద్ద సమస్య..ఇతర దేశాలపై ఆధారపడటమేనన్నారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దార్శనికత, లక్ష్యాన్ని ప్రధాని మోదీ కలిగివుండి, ఆ దిశగా దేశాన్ని నడిపిస్తున్నారన్నారు. -
‘ఇదేందయ్యా ఇది..!’ ఒకే వేదికపై మెరిసిన ట్రంప్-మస్క్
అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో తీవ్రస్థాయి పరస్పర విమర్శలు గుప్పించుకున్న ట్రంప్-మస్క్.. మళ్లీ ఒక్కటయ్యారు!. అరిజోనా స్టేట్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ వెనుక కూర్చుని ఇద్దరూ తెగ ముచ్చటించుకున్నారు. అంటే.. పొరపచ్చాలను పక్కన పెట్టి అమెరికా కోసం మళ్లా ఒక్కటిగా కలిసి పని చేయబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ను అమెరికా స్వాతంత్ర సమర యోధుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో జరిగిన దాడిలో కిర్క్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆదివారం అరిజోనా స్టేట్ గ్లెన్డేల్ నగరంలోని స్టేట్ ఫామ్ స్టేడియంలో నిర్వహించిన కిర్క్ స్మారక సభలో ట్రంప్ పై ప్రకటన చేశారు. అయితే.. ఇదే వేదికగా కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ట్రంప్తో కరచలనం చేసి.. పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించారు. ట్రంప్ సైతం మస్క్ను టచ్ చేస్తూ ఆప్యాయంగానే మాట్లాడారు. ఆ సమయంలో మస్క్ తన చేతులను ‘‘పిరమిడ్ హ్యాండ్ సింబల్’’ రూపంలో ఉంచడమూ.. ఇంటర్నెట్ను ప్రధానంగా ఆకర్షిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.NEW: President Trump and Elon Musk were spotted sitting together and chatting during a surprise reunion at Charlie Kirk’s memorial. pic.twitter.com/5asd3mTiJF— Fox News (@FoxNews) September 21, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలు.. మస్క్ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.అయితే, కొన్నాళ్లుగా మస్క్ స్వరం మారింది. ట్రంప్లాగే చార్లీ కిర్క్తో ఎలాన్ మస్క్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన స్మారక సభలో మస్క్ భావోద్వేగంగా స్పందించారు. అదే సమయంలో ట్రంప్తో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత విభేదాలను పక్కనబెట్టి, మళ్లీ కలిసి పనిచేయబోతున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. దీనికి మస్క్ ఎక్స్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. -
41వ సారి!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పదేపదే అదే విషయాన్ని చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్లా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మారిపోయారు. ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అణ్వస్త్రపోరుకు దారితీయకుండా తానొక్కడినే అడ్డంగా నిలబడి యుద్ధానికి ముగింపు పలికానని ట్రంప్ శనివారం మరోమారు ప్రకటించుకున్నారు. ఇలా ప్రకటించుకోవడం ఇది 41వ సారి కావడం గమనార్హం. ఈ ప్రకటనకు వర్జీనియా రాష్ట్రంలోని మౌంట్ వెర్నాన్ పట్టణంలో జరిగిన ‘అమెరికన్ కార్నర్స్టోన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్స్’ డిన్నర్ కార్యక్రమం వేదికైంది. భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో మొత్తంగా 40 సార్లు ప్రకటించారని వార్తలొచ్చాయి. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల మొద లైన యుద్ధాన్ని మీరొకసారి గుర్తుచేసుకోండి. నేనాయుద్ధాన్ని ఎలా ఆపానో తెలుసా? వాణిజ్యం ఆయుధంతో భయపెట్టి ఆ రెండు దేశాలను తీవ్ర యుద్ధంలో జారిపోకుండా కాపాడా. నేను ఇలా ఎన్నో యుద్ధాలను ఆపేశా. భారత్, పాకిస్తాన్, థాయ్లాండ్, కాంబోడియా, అర్మేనియా, అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, డీఆర్ కాంగో ఇలా ఇన్ని దేశాల మధ్య ఆరంభమైన ఏడు యుద్ధాలను నిలువరించా. వీటిలో 60 శాతం యుద్ధాలను కేవలం వాణిజ్యబూచిని చూపి అడ్డుకున్నా. నెలల తరబడి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నాకు కచ్చితంగా నోబెల్ శాంతి పురస్కారం దక్కుతుందేమో. అసలు నేను ఇప్పటికే 7 యుద్దాలను ఆపానుకదా ఈ లెక్కన ఒక్కో భారీ యుద్ధానికి ఒక నోబెల్ లెక్కేసుకున్నా ఏడు నోబెల్ బహుమతులు రావాలి. కానీ కొందరు నాతో మరోలా చెప్పారు. ఏడు సంగతి పక్కనబెడితే ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే మాత్రం నోబెల్ తథ్యం అని అన్నారు. వాస్తవానికి ఏడు సమరాలకు ముగింపు పలికడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క యుద్ధం ఆపడమంటే అత్యంత సంక్లిష్ట, సాహసోపేతమైన పని విజయవంతంగా పూర్తిచేసినట్లే. వాస్తవానికి పుతిన్తో నాకున్న పాత పరిచయాల కారణంగా ఈ యుద్ధం ఆపడం అత్యంత తేలిక అని గతంలో భావించా. నా నమ్మకా న్ని పుతిన్ వమ్ముచేసి వంచించారు. ఎలాగైనా సరే ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆపి తీరుతా’’ అని ట్రంప్ అన్నారు. -
USCIS: కొత్త దరఖాస్తులకే లక్ష డాలర్లు
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల సందేహాలు తలెత్తాయి. కొత్త దరఖాస్తులకేనా? లేక వీసాల పునరుద్ధరణకు కూడా ఈ రుసుము వర్తిస్తుందా? దరఖాస్తు చేసిన ప్రతిసారీ లక్ష డాలర్లు చెల్లించాలా? అనే అనుమానాలు విదేశీ ఉద్యోగుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. హెచ్–1బీ వీసాలతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారికి భారీ ఊరట కల్పించింది. కొత్త దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్ల రుసుము వసూలు చేయనున్నట్లు తెలియజేసింది. అది కూడా ఒక్కసారి మాత్రమేనని, వారు వీసా రెన్యూవల్ చేసుకుంటే పాత రుసుములే వర్తిస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతం హెచ్–1బీ వీసాలు కలిగి ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. వారు వీసా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లక్ష డాలర్లు చెల్లించాల్సి అవసరం లేదని, పాత రుసుములే వర్తిస్తాయని వివరించింది. ఈ మేరకు యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్–1బీ వీసా కోసం తొలిసారిగా దరఖాస్తు చేసేవారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని తెలియజేసింది. ఈ నెల 21వ తేదీ కంటే ముందు సమర్పించిన వీసా దరఖాస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, లక్ష డాలర్ల ఫీజు వారికి వర్తించదని వెల్లడించింది. 21వ తేదీ తర్వాత సమరి్పంచే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని సూచించింది. ప్రస్తుతం అమెరికా బయట ఉన్న హెచ్–1బీ వీసాదారులు మళ్లీ తమ దేశంలోకి రావడానికి కొత్తగా వీసా ఫీజు చెల్లించాల్సి అవసరం లేదని స్పష్టంచేసింది. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే భారీ రుసుము లక్ష డాలర్ల ఫీజు అనేది వన్–టైమ్ చార్జీ మాత్రమేనని వైట్హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. కొత్త దరఖాస్తులకే ఇది వర్తిసుందని పేర్కొన్నారు. లక్ష డాలర్లు చెల్లించి పొందిన హెచ్–1బీ వీసాను రెన్యూవల్ చేసుకోవడానికి మళ్లీ లక్ష డాలర్లు చెల్లించాల్సిన పనిలేదని, పాత చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు పొందినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీసా రెన్యూవల్పై వారిపై అదనంగా ఎలాంటి భారం పడబోదని తేల్చిచెప్పారు. 2025లో లాటరీలో హెచ్–1బీ వీసాలు పొందినవారిపై భారమేమీ ఉండదన్నారు. త్వరలో జరగబోయే లాటరీలో పాల్గొని, మొట్టమొదటిసారిగా వీసాలు పొందేవారు లక్ష డాలర్లు చెల్లించక తప్పదని వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో స్థానిక అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానమని గుర్తుచేశారు. విదేశీయులను విచ్చలవిడిగా నియమించుకోకుండా అమెరికా కంపెనీలను నిరుత్సాహపర్చాలన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు. అత్యధిక ప్రతిభాపాటవాలు కలిగిన ఉద్యోగులే ఉద్యోగాల్లో చేరితే తమ దేశానికి లబ్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హెచ్–1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, దీనికి అడ్డుకట్ట వేసే దిశగానే కొత్త దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించినట్లు స్పష్టంచేశారు. ఈ నెల 21 కంటే ముందు హెచ్–1బీ వీసా దరఖాస్తులు సమరి్పంచినవారు, అవి ఆమోదం పొందినవారు లక్ష డాలర్లు చెల్లించనక్కర్లేదని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సైతం స్పందించారు. ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హెచ్–1బీ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో లక్ష డాలర్లు అనేది వార్షిక రుసుము కాదని, వన్–టైమ్ ఫీజు మాత్రమేనని ఉద్ఘాటించారు. ఈ వీసా కోసం ప్రతిఏటా లక్ష డాలర్లు కట్టాల్సిన పని లేదని, మొదటిసారి చెల్లిస్తే సరిపోతుందని, ఆ తర్వాత సాధారణ చార్జీలే వర్తిస్తాయని తెలియజేశారు. ఇప్పటికే హెచ్–1బీ వీసాదారులు ఉన్నవారు ఎప్పటిలాగే నిక్షేపంగా వారి స్వదేశానికి వెళ్లి రావొచ్చని సూచించారు. ఇదిలా ఉండగా, వీసా రుసుములపై అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో భారతీయ ఐటీ నిపుణులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాత వారు ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. -
‘మన టాలెంట్ చూసి భయపడుతున్నట్లున్నారు’
న్యూఢిల్లీ: అమెరికా హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు రుసుము భారీ పెంచిన నేపథ్యంలో ఒకవైపు ఆందోళన నెలకొంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయుల ఆశలకు దాదాపు గండిపడింది. సుమారు లక్ష అమెరికన్ డాలర్ల(రూ. 83 లక్షలు) రుసుము చెల్లిస్తే కానీ కొత్తగా హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిక అవకాశం ఉండదు. అంటే తమ దేశానికి రావొద్దని పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చేశారు. తమ దేశ సంపదను భారతీయులు కొల్లగొట్టేస్తున్నారనే భయం ట్రంప్లో మొదలైనట్లుంది.భారతీయుల్లో టాలెంట్కు కొదవ లేకపోవడంతో అమెరికాలోని అవకాశాలను ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుము పెంపుతో దీనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తన అసూయను బయటపెట్టేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేశారు. దీనిపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ మన దేశంలోని యువత ప్రతిభకు అమెరికా భయపడినట్లుంది’ అంటూ చమత్కరించారు. ఇదే విషయంపై ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్ మాట్లాడారు. రేపు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు గోయల్. అయితే ముందుగానే అమెరికా విధించిన హెచ్ 1 బీ వీసా రుసుముకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. టాలెంట్ పరంగా చూస్తే మనవాళ్లు మేటి అని, దాన్ని చూసే అమెరికా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును అమాంతం పెంచేసిందంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు. ‘మన ప్రతిభను చూసి వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చమత్కరించారు. పలు దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందాలకు ఎదురుచూస్తున్నాయని, భారత్తో సంబంధాలను మెరుగుపరుచకోవడానికి చాలా దేశాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. Bharat is a winner, come what may! pic.twitter.com/5MXtih8Cnr— Piyush Goyal (@PiyushGoyal) September 20, 2025 కాగా, నేటి(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదిలా ఉంచితే, పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 22న అమెరికాకు పయనం కానున్నారు. సెప్టెంబర్ 16న ఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం.. భారత ప్రతినిధి రాజేష్ అగర్వాల్ తో జరిపిన ఏడు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాలను తగ్గించడం ఈ చర్చల్లో ఒక కీలక అంశం కానుంది. -
h1b visa: ‘హెచ్1బీ’ వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గ దర్శకాల ప్రకారం.. హెచ్ 1 బీ వీసా పొందిన ఈ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. మినహాయింపులు:అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలుఅమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులువ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌసులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసా దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే దాఖలైన కానీ ఇంకా వీసా పొందని ధరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఏమిటీ హెచ్–1బీ వీసా? విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే.ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. -
వామ్మో.. లక్ష డాలర్లా.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే
-
తాలిబాన్లకు ట్రంప్ వార్నింగ్
-
తాలిబాన్లకు ట్రంప్ హెచ్చరిక: ‘బాగ్రామ్’ ఇవ్వకపోతే అంతుచూస్తాం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తాలిబాన్లపై మరింత ఒత్తిడిని పెంచారు. 2021లో అమెరికా వదిలివేసిన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలని తాలిబాన్లను డిమాండ్ చేశారు. దీనిని అప్పగించని పక్షంలో చెడు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. చైనా అణు స్థావరాల వ్యూహాత్మక స్థానాన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్ ఈ ప్రయత్నం తప్పనిసరని భావించారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరం స్వాధీనంపై సోషల్ మీడియాలో ట్రంప్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆధీనంలో ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్నియునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. రెండు మైళ్ల రన్వేను కలిగి ఉండి, గతంలో బీ-52లు, బ్లాక్ హాక్స్లను కలిగిన ఈ స్థావరం పశ్చిమ చైనా నుంచి ఎదురయ్యే ముప్పును పర్యవేక్షించడంతో సహా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. కాగా తాలిబాన్ అధికారులు ట్రంప్ హెచ్చరికను తిరస్కరించారు. బగ్రామ్ ఆఫ్ఘన్ నేల.. ఇది చైనా అవుట్పోస్ట్ కాదని ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా ఎయిర్బేస్లలో బాగ్రామ్ ఎయిర్బేస్ ప్రధానమైనదిగా ఒకప్పుడు ఉండేది. అప్పట్లో 40 వేల మంది సైనికులతో పాటు సివిలియన్ కాంట్రాక్టర్లు కూడా అక్కడ పనిచేసేవారు. అయితే, పలు కారణాలతో 2021 జులైలో అమెరికా సైన్యం బాగ్రామ్ ఎయిర్బేస్ను ఖాళీ చేసింది. తరువాత అది తాలిబాన్ల వశం అయింది. బాగ్రామ్కు అతి దగ్గరలో చైనాలోని కాఖ్గర్ ప్రాంతంలో ఓ న్యూక్లియర్ సైట్ ఉందని చెబుతారు. తాజాగా చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. బాగ్రామ్ను తిరిగి స్వాధీనం చేసుకుని, అక్కడినుంచి చైనాపై నిఘా ఉంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బాగ్రామ్ ఎయిర్బేస్ను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవని, అది సాధ్యం అవుతుందని అనుకోవడం లేదన్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా తదితర ఉగ్ర సంస్థల నుంచి దానిని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. ఇందుకోసం వందల సంఖ్యలో మిలటరీ దళాలు అవసరమవుతాయి. బాగ్రామ్ పునర్నిర్మించడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందన్నారు. -
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
భారతీయులకు శరాఘాతమే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం భారతీయ టెక్నాలజీ ఉద్యోగులకు శరాఘాతమేనని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చని చెబుతున్నారు. అత్యంత ప్రతిభావంతులపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వారి సేవలు తప్పనిసరిగా అవసరమని అమెరికా కంపెనీలు భావిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడొచ్చు. ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాను అధ్యక్షుడు ట్రంఫ్ పాటిస్తున్నారు. అమెరికన్లకే ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు.వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని ‘ప్రాజెక్టు ఫైర్వాల్’గా అమెరికా కార్మిక శాఖ అభివర్ణించింది. అమెరికన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు రక్షణఛత్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీసా ఫీజు లక్ష డాలర్లుఅంటే అది సాధారణ హెచ్–1బీ ఉద్యోగ వార్షిక వేతనంతో సమానం, కొందరి విషయంలో అంతకంటే ఎక్కువే కావడం గమనార్హం. వీసా కోసమే ఏటా లక్ష డాలర్లు చెల్లించి భారతీయులను నియమించుకోవడం చాలా కంపెనీలకు తలకు మించిన భారమే. 2023లో 1.91 లక్షల మంది, 2024లో 2.07 లక్షల మంది భారతీయులు హెచ్–1బీ వీసాలు పొందారు.ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర భారతీయ ఐటీ కంపెనీలు జూనియర్ లేదా మిడ్–లెవెల్ ఐటీ ఉద్యోగులను అమెరికాకు పంపించకపోవచ్చు. మరోవైపు వీసా రుసుము పెంపు వల్ల విదేశీ ఉద్యోగుల కంటే అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అమెరికా టెక్నాలజీ పరిశ్రమ ప్రధానంగా విదేశీయులపై ఆధారపడుతోంది. వారి రాకను అడ్డుకుంటే నవీన ఆవిష్కరణలు, ప్రగతికి ఆటంకం కలగొచ్చు. అంతిమంగా అమెరికాకే నష్టం జరుగుతుంది.అది తెలివైన నిర్ణయం కాదు భారతీయులను లక్ష్యంగా చేసుకోవడాన్ని కాటో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డేవిడ్ బియర్ తప్పుపట్టారు. ఇండియన్ హెచ్–1బీ వీసాదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని తెలిపారు. వారు పన్నుల రూపంలో ప్రతిఏటా బిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. శాంతి కాముకులు, కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు, చట్టాలను చక్కగా గౌరవించే భారతీయులను దూరం పెట్టడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. మొత్తం అమెరికాకే వన్నె తెస్తున్న భారతీయులను బయటకు పంపించాలని అనుకోవడం తెలివైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. కేవలం భారత్లో జన్మించారన్న కారణంతో వివక్ష చూపడం, వారి సేవలు వదులుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ మేరకు డేవిడ్ బియర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.భారత్కు ప్రయాణాలు బంద్ హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల వార్షిక రుసుమును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అమెరికాలోని భారతీయులు ఆందోళనకు గురయ్యారు. స్వదేశానికి పయనమైన చాలామంది హఠాత్తుగా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. పండుగలు, బంధుమిత్రుల వివాహాల కోసం భారత్కు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. విమానాలు ఎక్కాల్సిన వారు కూడా వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఇండియాకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తామో లేదోనన్న ఆందోళన వారిలో కనిపించింది. త్వరలో జరగాల్సిన ప్రయాణాలను సైతం కొందరు రద్దు చేసుకున్నారు. అమెరికాలోని భారతీయుడికి పెళ్లి కుదిరింది. త్వరలో భారత్లోనే పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం ఎయిర్పోర్టుకు చేరుకున్న అతడు ట్రంప్ ప్రకటన తెలిసి ఏం చేయాలో అర్థంకాక వెనక్కి మళ్లాడు.అంటే అతడి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే ఇండియాలో ఉన్న హెచ్–1బీ వీసాదా రుల్లో సందిగ్ధత నెలకొంది. పెరిగిన వీసా రుసుములు చెల్లించాలా లేదా అని ఆరా తీస్తూ కనిపించారు. అమెరికాలోని టెక్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పట్లో స్వదేశాలకు వెళ్లే ఆలోచన చేయొద్దని, అమెరికాలోనే ఉండిపోవాలని సూచించాయి. బయట ఉన్నవారు వెంటనే రావాలని ఆదేశించాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు రావడం భారతీయు లను నిరాశకు గురిచేసింది.ఇండియాలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలని ఆశించామని, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నామని, ట్రంప్ ప్రకటనతో తమ ఆనందం ఆవిరైపోయిందని ఓ భారతీయుడు ఆవేదన వ్యక్తంచేశాడు. చాలామంది తమ మనసులోని బాధను సోషల్ మీడియా పోస్టుల్లో వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారతీయుల్లోనూ ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు హెచ్–1బీ వీసాల ఫీజులు పెంచేశారని, ఇతర వీసాలను ట్రంప్ వదిలిపెట్టబోడని వారు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ నిర్ణయాలను కోర్టులు నిలిపివేయొచ్చని మరికొందరు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.అధ్యయనం చేస్తున్నాం: రణధీర్ జైశ్వాల్హెచ్–1బీ వీసా ఫీజు పెంపుతో భారతీయ కుటుంబాల్లో కొన్ని పర్యవసానాలు తలెత్తే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. వీసా ఫీజు పెంపు వల్ల ఏర్పడే పరిణామాలపై భాగస్వామ్య పక్షాలతో కలిసి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులు ఇక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందన్నారు. భారతీయ స్కిల్డ్ వర్కర్లతో అమెరికా లబ్ధి పొందుతోందని గుర్తుచేశారు. భారత్, అమెరికాల మధ్య ప్రతిభావంతుల బదిలీ అనేది సహజంగా జరుగుతోందని వివరించారు. రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. -
లక్ష డాలర్ల బాంబు
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా నుంచి వలస దారులను బయటకు పంపించి, అమెరికన్ల మనసులు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పెద్ద బాంబు పేల్చారు. విదేశీ వృత్తి నిపుణులు అమెరికా గడ్డపై ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకుపైగా) పెంచేశారు. ఈ మేరకు ‘నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల ప్రవేశంపై ఆంక్షలు’ పేరిట సంబంధిత ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 21వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. ప్రతిఏటా హెచ్–1బీ వీసాలు పొందుతున్నవారిలో 70% మంది భారతీయులే కావడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ డ్రీమ్స్ వదులుకోవాల్సి రావొచ్చని అంటున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తూ విదేశీయులను నియమించుకొనే కంపెనీలు వారికి హెచ్–1బీ వీసాలు జారీ చేయడానికి ప్రతి సంవత్సరం రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని మోయలేని కంపెనీలు విదేశీ ఉద్యోగులను పక్కనపెట్టి, స్థానిక అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. సరిగ్గా ట్రంప్ ఆశిస్తున్నది కూడా ఇదే. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వెంటనే ప్రభావం చూపింది. గడువు దాటితే రూ.88 లక్షలు చెల్లించక తప్పని పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు తక్షణమే అమెరికాకు చేరుకోవాలని కంపెనీలు ఆదేశించాయి. దాంతో విమానాశ్రయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్తర్వు అమల్లోకి వచ్చే నిర్దేశిత గడువులోగా అమెరికాలో అడుగుపెట్టడానికి హెచ్–1బీ వీసాలు కలిగిన విదేశీ ఉద్యోగులు పరుగులు తీశారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు: ట్రంప్ అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలన్నదే తమ విధానమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. హెచ్–1బీ వీసా కార్యక్రమం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆయన ఆక్షేపించారు. నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి విదేశాల నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ వీసా దుర్వినియోగం అవుతోందని అన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి హెచ్–1బీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఈ వీసాలపై ఆధారపడిన ఔట్సోర్సింగ్ కంపెనీలు వీసా మోసాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. విదేశీయులను అడ్డదారుల్లో అమెరికాకు చేరవేస్తున్నట్లు కనిపెట్టాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టడానికి కంపెనీలపై వీసా దరఖాస్తు ఫీజులు పెంచక తప్పడం లేదని వివరించారు. విదేశీ నిపుణుల్లో అత్యంత ప్రతిభావంతమైన నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతి ఇస్తున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించారు. తమ నిర్ణయం పట్ల టెక్ కంపెనీల సీఈఓలు కచ్చితంగా సంతోషిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వీసాల ముసుగులో కొనసాగుతున్న విచ్చలవిడి వలసలకు కళ్లెం వేయక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. కంప్యూటర్ సంబంధిత రంగాల్లో కంపెనీలు హెచ్–1బీ వీసాలతో విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తూ అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని తప్పుపట్టారు. 2003లో హెచ్–1బీలు పొందిన విదేశీయుల్లో ఐటీ ఉద్యోగులు 32 శాతం మంది ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 65 శాతానికి చేరడం గమనార్హం. ట్రంప్ తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిపుణులైన విదేశీ మానవ వనరులను అమెరికాకు దూరంచేసే ప్రయత్నం మానుకోవాలని ట్రంప్ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభలేనివారు మనకెందుకు?: హోవార్డ్ లుట్నిక్ అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో హెచ్–1బీ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం అత్యధికంగా ఉల్లంఘనకు గురవుతోందని వైట్హౌస్ స్టాఫ్ సెక్రెటరీ విల్ స్కార్ఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వీసా అసలు ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. అమెరికా కామర్స్ సెక్రెటరీ హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. అమెరికన్ల అవకాశాలు దోచుకొనేవారు తమకు అవసరం లేదన్నారు. అత్యధిక నైపుణ్యాలు కలిగినవారికే అమెరికాలో ఉద్యోగాలు దక్కాలని చెప్పారు. అలాంటి నిపుణులు అమెరికాలో వ్యాపారాలు చేసి, ప్రతిభతో అమెరికన్ల కోసం కొత్త ఉద్యోగాలు సృష్టించగలరని తెలిపారు. దీనివల్ల అమెరికా ఖజానాకు 100 బిలియన్ డాలర్ల మేర లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఒక విదేశీ ఉద్యోగి కచ్చితంగా అవసరమని భావిస్తే అతడి కోసం ఏటా లక్ష డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాలని, లేకపోతే అమెరికా పౌరుడినే నియమించుకోవాలని కంపెనీలకు సూచించారు. ప్రతిభ లేని విదేశీయులు మనకెందుని ప్రశ్నించారు. స్థానికులకే శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కంపెనీలకు స్పష్టంచేశారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్స్తోపాటు కొత్త దరఖాస్తులకు కూడా లక్షల డాలర్ల రుసుము వర్తిస్తుందని హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. మరోవైపు ఒక విదేశీ ఉద్యోగి గ్రీన్కార్డు పొందడం కోసం కంపెనీ ఇప్పటికే స్పాన్సర్ చేస్తే అతడి వీసాను రెన్యూవల్ చేయడానికి ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అది భారంగా భావిస్తే రెన్యూవల్ చేయడం ఆపేయొచ్చు. ఫలితంగా గ్రీన్కార్డు ఆశలు సైతం వదులుకోవాల్సిందే. గ్రీన్కార్డుల కోసం ఇప్పటికే వేలాది మంది విదేశీయులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు.ఏమిటీ హెచ్–1బీ వీసా? విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే. ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. -
కొత్తవాళ్లకు మాత్రమే
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుము పెంపుపై సర్వత్రా గగ్గోలు రేగిన నేపథ్యంలో ఈ పెంపు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుందని ‘వైట్హౌస్’ అధికారి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ శనివారం పేర్కొంది. ‘హెచ్1బీ ఫీజు పెంపునకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సవాళ్లను అధిగమిస్తే అంతర్జాతీయ వృత్తి నిపుణులను తీసుకొనే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏటా లక్ష డాలర్ల ఫీజు చొప్పున ఆరేళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ఫీజు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుంది’ అని ‘వైట్హౌస్’ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురించింది. మరోవైపు స్వదేశాలకు వెళ్లిన ప్రస్తుత హెచ్1బీ వీసాదారులు నిర్దేశిత గడువులోగా హడావుడిగా తిరిగి అమెరికా చేరుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది. -
గోల్డ్ కార్డ్ వచ్చేసింది
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత స్థిరనివాసానికి బాటలువేసే అత్యంత ఖరీదైన ‘గోల్డ్ కార్డ్’పథకానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఎవరైనా 10 లక్షల డాలర్లు చెల్లించి ఈ గోల్డ్కార్డ్ను తమ వశంచేసుకోవచ్చు. ఎంచక్కా అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవచ్చు. తమ సంస్థ పురోభివృద్ధికి అక్కరకొస్తారని భావించే అత్యంత నైపుణ్యమున్న సిబ్బంది, ఉన్నతాధికారులను అమెరికాకు తీసుకురావాలని భావించే కార్పొరేట్ సంస్థలు మాత్రం ఒక్కో వ్యక్తి కోసం 20 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు అమెరికా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వును రూపొందించగా దానిపై ట్రంప్ సంతకం చేశారు. ద్రవ్యలోటును తగ్గిస్తూ అమెరికా ఖజానాకు వందల కోట్ల డాలర్లను జమచేసే ఈ కీలక పథకాన్ని స్వయంగా ట్రంప్ రూపొందించారని తెలుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న పెట్టుబడి వీసా(ఈబీ–5)కి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్ను తాజాగా తీసుకొచ్చారు. హెచ్–1వీ వీసాదారులు మొదలు ఎలాంటి వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవాళ్లయినా నేరుగా అమెరికా స్థిరనివాసం కావాలంటే ఈ గోల్డ్కార్డ్ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ప్రపంచంలోని ఏ దేశంలోని సంపన్నులైనా అమెరికాలో శాశ్వత స్థిరనివాస హోదా సంపాదించాలంటే వీసా పొంది తర్వాత గ్రీన్కార్డ్ కోసం ఆతర్వాత పౌరసత్వం కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి సంపన్నులు, లక్షల డాలర్లు గుమ్మరించే స్తోమత ఉన్న ఉన్నతాధికారుల కోసమే ప్రత్యేకంగా ఈ గోల్డ్కార్డ్ను అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఖజానాకు ఆదాయ వరద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశాక ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘గోల్డ్కార్డ్ సాయంతో ఇకపై మేం వందల కోట్ల డాలర్లను ఒడిసిపట్టబోతున్నాం. ఖజానాకు గోల్డ్కార్డ్ ఆదాయ వరదను పారించనుంది. తమకు అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు, నిపుణులు అనుకున్న వాళ్లను కంపెనీలు ఈ గోల్డ్కార్డ్తో అమెరికాకు రప్పించుకోవచ్చు. గోల్డ్కార్డ్ అనేది నిజంగా అత్యద్భుతం. ఈ కార్డ్ల విక్రయాలతో వచ్చే నగదుతో మా ద్రవ్యలోటు భారం తగ్గిపోతుంది. ఖజానా నిండిపోతే మేం పన్నులు కూడా తగ్గిస్తాం. అప్పుల గుదిబండను కాస్తంత దించుకుంటాం. గోల్డ్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అడిగిన ప్రతి డాక్యుమెంట్ను సమయానికి ఇవ్వాలి. కార్డ్ మంజూరైతే 10 లక్షల డాలర్లను ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అమెరికాకు ప్రయోజనం చేకూరేలా మసలుకుంటామని మాటివ్వాలి’’అని ట్రంప్ చెప్పారు. ‘‘కార్డ్ పొందిన వాళ్లు చట్టబద్ధ శాశ్వత స్థిరనివాస హోదా పొందేందుకు అర్హత సాధిస్తారు. వీసా అందుబాటులో ఉంటుంది. గోల్డ్కార్డ్దారులు ఇచ్చే 10 లక్షల డాలర్లను వాణిజ్యమంత్రి ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు. ఈ నగదును అమెరికా వాణిజ్యం, దేశీయ పారిశ్రామికాభివృద్ధి కోసం ఖర్చుపెడతారు. అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న పెట్టుబడిదారులు, అంకుర సంస్థల అధినేతలు, నైపుణ్య సిబ్బందికి గోల్డ్కార్డ్ సులువైన చక్కటి మార్గం’’అని ట్రంప్ అన్నారు. పౌరసత్వానికి గోల్డ్కార్డ్ అనేది సుగమం చేస్తుందని గతంలో వాణిజ్యమంత్రి హోవర్డ్ లుట్నిక్ అన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా అనే తేడాలేకుండా లక్షలు చెల్లించే ఏ దేశ పౌరునికైనా ఈ కార్డ్ను అమెరికా విక్రయించి స్థిరనివాసానికి సాదరస్వాగతం పలుకుతోంది. ట్రంప్ నిర్ణయంతో సంపన్న భారతీయులకు వేగంగా యూఎస్ పౌరసత్వం లభించే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. కార్డ్ వస్తే వెంటనే పౌరసత్వం ఇచ్చినట్లుగా భావించకూడదని ప్రభుత్వం గతంలోనే స్పష్టంచేసింది. -
పరాదీనతే ప్రబల శత్రువు
భావ్నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు. శనివారం గుజరాత్లోని భావ్నగర్లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి తర్వాత ‘సముద్రం నుంచి సమృద్ధిదాకా’కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘విశ్వబంధు భావనతో భారత్ దూసుకుపోతోంది. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరా«దీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుంది. విశ్వశాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పాటుపడే దేశం కచి్చతంగా స్వయంసమృద్ధిని సాధించాలి. స్వావలంబన సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడితే జాతీయ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది’’అని మోదీ అన్నారు. 140 కోట్ల ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టబోం ‘‘140 కోట్ల ప్రజల భవిష్యత్తును విదేశీ శక్తుల చేతుల్లో పెట్టబోం. విదేశీ పరా«దీనత అనేది మన జాతీయాభివృద్ధిని నిర్దేశిస్తుందంటే అస్సలు అంగీకరించబోం. మన భావితరాల భవిష్యత్తును ఇతరుల చేతికి అందించబోం. ఏకంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇతర దేశాలపై ఆధారపడితే జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. ఒక సామెతలాగా చెప్పాలంటే 100 సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు.. భారత్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అదే ఆత్మనిర్భరత’’అని మోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్పై మళ్లీ విమర్శల నిప్పులు పనిలోపనిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీలపై, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత్లో నిగూఢంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నాలు స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలదాకా జరగనేలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచిపోషించిన లైసెన్స్రాజ్ వ్యవస్థలో దేశాభివృద్ధి పడకేసింది. లైసెన్స్–కోటా రాజ్యంలో భారత్ విశ్వవిపణిలోకి అడుగుపెట్టలేక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణ శకం మొదలైనప్పుడు గత ప్రభుత్వాలు తప్పిదాలే చేశాయి. దేశావసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించాల్సిందిపోయి కేవలం దిగుమతులపైనే దృష్టిపెట్టాయి. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. తప్పుడు విధానపర నిర్ణయాల కారణంగా ప్రభ కోల్పోయిన రంగాల్లో నౌకల తయారీ పరిశ్రమ కీలకమైంది. గతంలో భారతీయ తయారీ నౌకలనే మనం ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు విదేశాలపై ఆధారపడుతున్నాం. అప్పట్లో ఎగుమతిదిగుమతి సరుకుల్లో 40 శాతం భారతీయ నౌకల్లో జరిగేవి. ఇప్పుడు కేవలం 5 శాతం నౌకల్లో జరుగుతోంది. మిగతావన్నీ విదేశీ నౌకలే. అందుకే ఏటా ఏకంగా రూ.6 లక్షల కోట్లను వినియోగ ఖర్చుల కింద విదేశీ నౌకల కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడు దశాబ్దాల్లో ఎంత చెల్లించామో లెక్కేసుకోండి. ఇంత సొమ్ము విదేశాలకు వెళ్లడంతో ఆయా దేశాల్లో ఉపాధి పెరిగింది. ఇదే సొమ్ములో కొంత అయినా దేశీయంగా పెట్టుబడిగా మార్చి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగేవో ఊహించుకోండి. దేశీయ నౌకలనే వినియోగించి ఉంటే ఏటా భారత్ లక్షల కోట్ల ఆదాయాన్ని చవిచూసేది’’అని మోదీ వివరించారు. షిప్ అయినా చిప్ అయినా ఇక్కడిదై ఉండాలిచిప్(సెమీకండక్టర్) కావొచ్చు షిప్ కావొచ్చు. ఏదైనా భారత్లోనే తయారుకావాలి. వాటిని మనమే తయారుచేద్దాం. సముద్రవిపణిలో అగ్రగామిగా మారితే అంతర్జాతీయంగా పరపతి ఇనుమడిస్తుంది. ఇందుకు దేశీయనౌకాశ్రయాలే వెన్నుముక. దేశీయ సముద్రనౌకారంగం నవతరం సంస్కరణల దిశగా దూసుకుపోతోంది. పలు రకాల డాక్యుమెంట్లు, పత్రాల సమర్పణ, తనిఖీ వంటి సుదీర్ఘ ప్రక్రియకు దేశంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో చెల్లుచీటీ రాసేశాం. దీంతో ఒకే దేశం–ఒకే డాక్యుమెంట్, ఒకే దేశం–ఒకే నౌకాశ్రయం విధానంలో వాణిజ్యం, వ్యాపారం సులభతరమవుతుంది’’అని అన్నారు. రుణాలు ఇక సులువు ‘‘నౌకల తయారీ సంస్థలకు ఇప్పుడు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్ల నుంచి రుణాలను పొందగల్గుతున్నాయి. మౌలికవసతుల ఫైనాన్సింగ్ సదుపాయం ఇప్పుడు అన్ని నౌకలతయారీ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. మరో మూడు కీలక పథకాలపై ఎన్డీఏ సర్కార్ దృష్టిసారించింది. భారత్ను సముద్రయాన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రుణలభ్యతతో నూతన సాంకేతికత, ఆధునిక డిజైన్, అత్యున్నత ప్రమాణాలను సంస్థలు అందిపుచ్చుకుంటాయి. త్వరలో ఈ రంగంలో ప్రభుత్వం రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’’అని మోదీ అన్నారు. కార్యక్రమాల్లో భాగంగా రూ.7,870 కోట్ల విలువైన సముద్రయానసంబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికితోడు గుజరాత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రూ.26,354 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. అహ్మదాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్రీన్ఫీల్డ్ పారిశ్రామికప్రాంతమైన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో హెలికాప్టర్లో విహంగవీక్షణం చేశారు. అహ్మదాబాద్లోని లోథల్లో భారతీయ సముద్రయాన వారసత్వాన్ని చాటే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణపనులనూ మోదీ పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన భావ్నగర్కు చేరుకోగానే రోడ్షోలో పాల్గొన్నారు. -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
H-1B వీసాలపై ట్రంప్ పిడుగు
-
భారతీయులకు ఘోర అవమానం.. యూఎస్ హోవార్డ్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనికి రాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన భారతీయులనే టార్గెట్ చేసి ఇలా అవమానించారని కామెంట్స్ చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ సందర్భంగా ప్రతీ హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో, హెవార్డ్ మాట్లాడుతూ..‘ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే. కేవలం అత్యుత్తమైన, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి రావాలి. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.“Stop this nonsense of letting people come to America on visas for free. Only valuable people are welcome,” says US Commerce Secretary Howard Lutnick hiking H1B visa fee pic.twitter.com/SwGh3D9sih— Shashank Mattoo (@MattooShashank) September 19, 2025దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, హెచ్1బీ వీసాలపై భారతీయులే ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తారు. ఈ నేపథ్యంలో హోవార్డ్.. భారతీయులను ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేశారని, అవమానించే విధంగా మాట్లాడరని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్య 28లక్షలుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా ద్వారా.. ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ప్రతీ ఏడాది 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. -
హెచ్1 బీ వీసా.. భారతీయులకు బిగ్ షాక్
-
H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. భారతీయులకు బిగ్ షాక్
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది.2025 జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం ఈ క్రమంలోనిదే. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్య అత్యంత కీలకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. ‘మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారికే ఇవ్వండి. ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావడం ఆపేయండి’ అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు.అమెరికా సర్కారు హెచ్1బీ కింద కొన్ని రంగాల్లో తాత్కాలికంగా విదేశీ కార్మికులను తీసుకువచ్చేందుకు కంపెనీలకు ఏటా 65 వేల వీసాలు ఇస్తుంటుంది. అడ్వాన్స్డ్ డిగ్రీలు కలిగిన కార్మికులకు మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడున్న విధానంలో వీసా కోసం లాటరీలో ప్రవేశించేందుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోయేది. దీనికి ఆమోదం పొందిన తర్వాత, తదుపరి రుసుములు వేల డాలర్లలో ఉంటాయి. ఇది ఇప్పుడు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల కన్నా చాలా చాలా తక్కువని చెప్పుకోవచ్చు. కాగా అన్ని వీసా రుసుములను కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసాలకు మూడు నుంచి ఆరేళ్ల కాలానికి ఆమోదం లభిస్తుంది. హెచ్1బీ వీసా కలిగినవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడాది హెచ్1బీ వీసాల లబ్ధిదారుల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. మొత్తం వీసాలలో 71 శాతం భారతీయులకే లభించగా, చైనా 11.7శాతంతో తరువాతి స్థానంలో ఉంది. 2025 మొదటి ఆరు నెలలో అమెజాన్.కామ్, దాని క్లౌడ్-కంప్యూటింగ్ విభాగం ఏడబ్ల్యూఎస్ 12 వేలకుమించిన హెచ్1బీ వీసాలను ఆమోదింపజేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు ఒక్కొక్కటి ఐదువేలకు మించినహెచ్1బీ వీసాలను పొందేందుకు ఆమోదం పొందాయి. ఇదిలాఉండగా అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఒక మిలియన్ డాలర్లు చెల్లించగలిగేవారికి గోల్డ్ కార్డ్ను తీసుకువచ్చేందుకు ట్రంప్ తాజాగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఒక లక్ష అమెరికన్ డాలర్లు భారతీయ కరెన్సీలో సుమారు రూ.88 లక్షలకు సమానం -
షీ జిన్పింగ్కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. వచ్చే నెలలో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ జిన్పింగ్తో మాట్లాడానని, టిక్టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్పింగ్ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు. -
సాదిక్ ఖాన్ చెత్త మేయర్
లండన్: లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ప్రపంచంలోనే పరమ చెత్త మేయర్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు. బ్రిటన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రాజ విందుకు.. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ను ఆహ్వానించవద్దని తానే వ్యక్తిగతంగా కోరానని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్ చార్లెస్–3 ఆతిథ్యమిచ్చిన రాజ విందులో ట్రంప్ పాల్గొన్నారు. రాజ విందులో బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ఉన్నత స్థాయి అతిథులు పాల్గొన్నారు. విందు అనంతరం ట్రంప్.. గురువారం బ్రిటన్ నుంచి బయలుదేరుతూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ఖాన్ గైర్హాజరీ గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. సాదిక్ ఖాన్ అక్కడ ఉండటం తనకు ఇష్టం లేదని, అతన్ని ఆహా్వనించవద్దని తానే కోరానని స్పష్టం చేశారు. -
అలాస్కా నుంచి అయోమయంలోకి!
రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆగస్టు 15న అలాస్కాలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు యూరోపియన్ నాయకు లతో 18న వైట్హౌస్లో ముఖాముఖి చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇక యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతున్నదనే సూచనలు ప్రపంచానికి ఇచ్చారు. సరిగ్గా మూడు వారాలు గడిచేసరికే పరిస్థితి అయోమ యంగా మారగా, ఆయన సెప్టెంబర్ 6న అదే వైట్హౌస్లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ, యుద్ధాన్ని ఆపలేకపోతున్నట్లు అంగీకరించారు. ప్రయత్న లోపం లేకపోయినా...దాని అర్థం ట్రంప్ ప్రయత్నాలు నిలిచిపోతాయని కాదు. ఇందులో తన ప్రయత్న లోపం ఏమీ లేదు. సైద్ధాంతికంగా, భౌగోళిక రాజకీయాల దృష్ట్యా తక్కిన అమెరికన్ అధ్యక్షుల వలెనే ట్రంప్ కూడా రష్యా వ్యతిరేకి. అది తన మొదటి పదవీ కాలంలో (2017–21) స్పష్టంగానే కనిపించింది. కానీ ఈ రెండవ విడతకు వచ్చేసరికి యుద్ధాలకు వ్యతిరేకినని ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే ఆ వైఖరి తీసుకుని 24 గంటలలోనే ఆ స్థితిని ముగింపజేస్తానన్నారు. ఆ మాటను అక్షరాలా తీసుకుని నిందించనక్కరలేదు గాని, ఆ దిశలో ప్రయత్నాలను మాత్రం 24 గంటలలోనే మొదలుపెట్టారు. అప్పటి నుంచి గత ఎనిమిది మాసాలలో తన ప్రతినిధులను మాస్కో, కీవ్, బ్రస్సెల్స్లకు పలుమార్లు పంపారు. కొందరిని వైట్హౌస్కురప్పించి చర్చించారు. పుతిన్, జెలెన్స్కీ తదితరులతో పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి వర్గాల మధ్య ఇస్తాంబుల్లో చర్చలు జరిగేట్లు చూశారు. యుద్ధ విరమ ణకు, సమస్య పరిష్కారానికి ఉభయ పక్షాలు తమ తమ ప్రతిపాద నలను ప్రకటించేట్లు చూశారు. ఆంక్షల రూపంలో రష్యాను, ఆయు ధాల సరఫరా నిలిపివేత రూపంలో ఉక్రెయిన్ను ఒత్తిడి చేశారు.ఇంత తక్కువ కాలంలో ఇన్నిన్ని ప్రయత్నాలన్నది సాధారణమైన విషయం కాదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మూల కారణం ఎక్కడుందనే అవగాహన ట్రంప్కు ఉంది. నాటో సైనిక కూటమిని రష్యా సరి హద్దు వరకు విస్తరించజూడటం వల్లనే అభద్రతాభావానికి గురైన పుతిన్ ఈ యుద్ధాన్ని సాగిస్తున్నారని అనేకమార్లు అన్నారాయన. ఉక్రెయిన్, యూరోపియన్ నాయకులకు ముఖాముఖిగా చెప్పటమే గాక, ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు. మొదట 20 ఏళ్లపాటు అని, తర్వాత ఎప్పటికీ జరగదన్నారు. క్రిమియా, దోన్బాస్లను రష్యాకు వదలివేయాలనీ చెప్పారు. ఈ ప్రతిపాదనలకు జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులు సుముఖత చూపకపోవటంతో, ఇక మీ ఖర్మ మీదన్నట్లు మాట్లాడారు. పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి, నాటో సైనిక కూటమికీ నాయకత్వ స్థానంలోగల ఒక దేశాధినేత ఇటువంటి వైఖరి తీసుకోవటం మామూలు విషయం కాదు.యూరప్ మొండితనంఇంతకూ పరిస్థితి అలాస్కా నుంచి అయోమయంలోకి వెళ్లటా నికి కారణాలేమిటి? అందుకు బాధ్యత యూరోపియన్ నాయకు లది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్లది. జెలెన్స్కీని అడుగడు గునా రెచ్చగొట్టి రాజీలు జరగకుండా చేస్తున్నది వారే. భూభాగా లను వదులుకునేందుకు జెలెన్స్కీ పరోక్షంగా సిద్ధపడగా, ఆ మాటను వారు మార్పించారు. తమకు పూర్తి రక్షణ హామీలు చాలు నన్న ప్రతిపాదనను జెలెన్స్కీ ఒక దశలో చేయగా, అందుకు పుతిన్ను ట్రంప్ ఒప్పించారు. నాటో ఛార్టర్లో 5వ నిబంధన అనేది ఒకటుంది. ఒక నాటో సభ్య దేశంపై ఇతరులు దాడి జరిపితే మొత్తం అందరిపై దాడి జరిపినట్లుగా పరిగణించి అందరూ ఆ దేశానికి రక్షణగా ముందుకు రావాలని ఆ నిబంధన చెప్తున్నది. ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకపోయినా ఆ నిబంధనను పోలిన రక్షణలు ఇచ్చేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. అందుకు కూడా అలాస్కాలో అంగీకరించిన పుతిన్, ఉక్రెయిన్ ప్రజలకు రక్షణ అవసరమేనన్నారు. ఈ ప్రస్తావనలన్నీ ఆగస్టు 18 నాటికి వైట్హౌస్ చర్చలలో వచ్చాయి. ఇక త్వరలో పుతిన్, జెలెన్స్కీల ముఖాముఖి సమావేశం జరిగి వారొక అంగీకారానికి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ సమావే శానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారని, వారిద్దరి చర్చల తర్వాత ఒకవేళ ఆహ్వానించినట్లయితే తాను కూడా వెళ్ళగలనని అన్నారు.అటువంటి ఆశావహమైన సూచనల మధ్య అంతలోనే అంతా బెడిసిపోయింది. ఆ పరిణామాల మధ్య నుంచే ట్రంప్ సెప్టెంబర్ 6 నాటి నిస్పృహతో కూడిన వ్యాఖ్యలు వినిపించాయి. ‘నాటో’ విస్తరణ ఆగితేనే...అట్లా బెడియటానికి కనిపించే తక్షణ కారణం, ఉభయ పక్షాల మధ్య ఒప్పందం కుదిరే వరకు దాడులు కొనసాగించగలమనీ, అట్లాగాక ఉక్రెయిన్ పక్షం పట్టుబడుతున్నట్లు ముందుగానే కాల్పుల విరమణ జరిగితే ఆ వ్యవధిని ఉపయోగించుకుని సైన్యాన్ని, ఆయుధాలను సమీకరించుకోగలరనీ రష్యా వాదిస్తుండగా, అటు వంటిదేమీ చేయబోమనే హామీని ఇవ్వని ఉక్రెయిన్ తన దాడులు తాను సాగిస్తుండటం. ఇందులో ట్రంప్ రష్యా వైఖరినే సమర్థించారు. ఇది తక్షణ కారణం కాగా, కనీసం ట్రంప్ ప్రతిపాదించిన ప్రకారమైనా భూమిని రష్యాకు వదలుకోవటానికి ఉక్రెయిన్ నిరాకరిస్తుండటం ప్రధానమైంది. ఉక్రెయిన్ రక్షణ కోసం యుద్ధ ఆరంభంలో జరిగిన ఒప్పందం మేరకు అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ హామీగా నిలిస్తే సరిపోతుందని పుతిన్ అంటుండగా, యూరోపియన్ దేశాలు ఉమ్మడి సేనలను పంపగలవన్నది బ్రస్సెల్స్ వాదన. ఉక్రెయిన్ భూభాగంలో అటువంటి సేనల ప్రవేశాన్ని ఎంతమాత్రం సమ్మతించబోమని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. అలాస్కా వైట్హౌస్ చర్చల అనంతరం విషయమంతా ఇక్కడ స్తంభించిపోయింది. అక్కడి నుంచిముందుకు ఎట్లా, ఎప్పటికి కదిలేనో ట్రంప్కు బోధపడుతున్నట్లు లేదు. ఆ నిస్సహాయతలో తను చేయగల పని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఇండియా వంటి దేశాలపై సుంకాలు పెంచటం ఒక్కటే గనుక అది మాత్రం అర్థంపర్థం లేకుండా చేస్తున్నారు. నాటో విస్తరణ సమస్య ఇపుడు కొత్తగా తలెత్తింది కాదు. 1991లో సోవియెట్ యూనియన్ వార్సా కూటమి రద్దయినాక కూడా, ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా వ్యతిరేకతను లెక్కచేయకుండా నాటోను అయిదుసార్లు విస్తరించారు. యుద్ధం మొదలైనాక ఆ పని మరో రెండుసార్లు చేశారు. ఆ చర్యలను రష్యా అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, ఆ తర్వాత పుతిన్ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షులు ముఖ్యంగా క్లింటన్తో మొదలుకొని బైడెన్ వరకు వేగంగా విస్తరిస్తూ పోయారు. ఇపుడా దేశాల సంఖ్య 32కు చేరింది. ట్రంప్ మినహా ఆ నాయకుల లక్ష్యమంతా ఉక్రెయిన్ను కూడా చేర్చుకుని రష్యాను చుట్టుముట్టడం. ఇది పుతిన్కు తెలుసు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
వార్ ఆపుతానని వంచించాడు
లండన్: ఉక్రెయిన్పై దురాక్రమణ జెండా ఎత్తి భీకరయుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల వేళ సమరానికి స్వస్తి పలుకుతానని చెప్పి తనను నమ్మించి మోసంచేశాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిటన్లో రెండ్రోజుల పర్యటనలో రాజు ఛార్లెస్ కుటుంబం, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్లతో వరుస భేటీలతో బిజీగా గడిపిన ట్రంప్ మరోవైపు ‘ఎక్స్’లో పుతిన్పై విమర్శలుచేశారు. ‘‘పుతిన్ ఎంతో మందిని చంపేస్తున్నారు. అంత కంటే ఎక్కువ మందిని దూరంచేసుకుంటున్నారు. మోసం చేసి నన్ను కూడా ఆయన దూరం చేసుకుంటున్నారు. చర్చల వేళ యుద్ధం ఆపేస్తానని చెప్పి పుతిన్ నన్ను దారుణంగా మోసంచేశారు. ఎంతో మనస్తాపానికి గురయ్యా’’అని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో అలాస్కా భేటీలో ట్రంప్, పుతిన్ అత్యంత ఆర్భాటంగా కలిసినా ఎలాంటి సంయుక్త ప్రకటన విడుదలచేయకపోవడంతో ప్రపంచదేశాలు ఉసూరుమన్న విషయం తెల్సిందే. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్పై టారిఫ్ల భారం మోపడాన్ని ట్రంప్ సమరి్థంచుకున్నారు. ‘‘సులభమైన పద్ధతిలో చెప్పాలంటే ఒకవేళ ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోతే చమురును అమ్ముకుంటున్న రష్యాకు లాభాలు అడుగంటిపోతాయి. ఆయుధాలకు డబ్బుల్లేక చివరకు యుద్ధాన్ని ఆపుతుంది. చమురు ధర అంతర్జాతీయంగా దిగివస్తోంది. మరింతగా దిగవచ్చేలా నేను చేస్తా’’ అని అన్నారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో భేటీ తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపుతారన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేసి పాత కయ్యాలకు రాజీ కుదిర్చానని చెప్పారు. ‘‘ పరిష్కారం కనుగొనడం అసాధ్యం అనుకునే 7 సంక్షోభాలకు ముగింపు పలికా. ఇకమీదటా మరో శుభవార్త వినగలమనే అనుకుంటున్నా. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా అమెరికాపై పడట్లేదు. ఉక్రెయిన్ యుద్ధం అంతానికి ఒక అవరోధం అడ్డుపడుతోంది’’ అని అన్నారు. స్టార్మర్తో చర్చలు బకింగ్షైర్లో చెకర్స్లోని 16వ శతాబ్దినాటి పురాతన భవంతిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో చర్చలు జరిపాక మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇంగ్లిష్ ఛానల్, సరిహద్దు గుండా అక్రమ చొరబాట్లపై స్టార్మర్కు మీరేం సలహా ఇస్తారని ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ‘‘అమెరికాలోకి అయితే చట్టవ్యతిరేకంగా లక్షలాది మంది చొరబడుతున్నారు. ఇలాంటి అక్రమవలసదారులు ఎన్నో దేశాలను నాశనంచేశారు. అలా చూస్తూ ఊరుకోలేను. వాళ్లను బహిష్కరించి పంపేయడం తప్ప మరో మార్గంలేదు. స్టార్మర్కూ అదే చెప్పా. సైన్యాన్ని సరిహద్దులకు రప్పించి అక్రమ వలసలను కట్టడిచేయండి. సైన్యాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నామనేదే ముఖ్యం’’అని అన్నారు. మోదీ, భారత్తో నాకెంతో సాన్నిహిత్యం బుధవారం మోదీ బర్త్డే వేళ ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ మరుసటి రోజు సైతం పొగిడారు. ‘‘భారత ప్రధాని మోదీ, ఇండియాతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. హ్యాపీబర్త్డే చెప్పేందుకు నిన్ననే ఫోన్చేసి మాట్లాడా. మా మధ్య సత్సంబంధాలున్నాయి. అయినాసరే భారత్పై అధిక టారిఫ్ మోపాల్సి వచి్చంది’’అని అన్నారు. బ్రిటన్తో టెక్ డీల్ ట్రంప్ పర్యటన వేళ బ్రిటన్తో అమెరికా సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సాంకేతికత శ్రేయస్సు ఒప్పదం అని పేరు పెట్టారు. కృత్రిమమేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, అణువిద్యుత్ రంగాల్లో సహకారంతోపాటు బ్రిటన్లో సాంకేతికరంగాల్లో బడా అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఒప్పందం బాటలు వేయనుంది. మైక్రోసాఫ్ట్ ఏకంగా 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించింది. మరో రెండేళ్లలో ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాల రంగాల్లో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తానని గూగుల్ తెలిపింది. అఫ్గానిస్తాన్ స్థావరాన్ని తిరిగి సాధిస్తాం ‘‘అఫ్గానిస్తాన్లోని బాగ్రామ్ వైమానికస్థావరాన్ని తిరిగి చేజిక్కించుకుంటాం. అది జరిగితే నిజంగా ఇది సంచలన వార్తే అవుతుంది. దానిని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం వెనుక పెద్ద కారణం ఉంది. అక్కడి నుంచి కేవలం గంట సేపు విమానంలో ప్రయాణిస్తే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని చేరుకోవచ్చు’’అని ట్రంప్ అన్నారు. 1950దశకంలో సోవి యట్ రష్యా ఈ స్థావరాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. 1980లలో అది ప్రధానస్థావరంగా వెలుగొందింది. 2001లో తాలిబన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసి ఆ స్థావరాన్ని తమ వశంచేసుకుంది. చిన్నబేస్ను దశలవారీగా ఏకంగా 77 చదరపు కిలోమీటర్ల స్థాయికి పెంచింది. ఇటీవల అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా ని్రష్కమించడం తెల్సిందే. -
ట్రంప్తో బ్రిటన్కు మేలేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటన గురువారం పూర్తయింది. ఇరు దేశాల మధ్యా సుదీర్ఘకాలంగా ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని, ట్రంప్ హయాంలో అది మరింత విస్తరించిందని ఉమ్మడి మీడియా సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కొనియాడారు. అది నిజమే. ఎందుకంటే వేరేచోట పెట్టుబడులు పెట్టొద్దని తమ దిగ్గజ సంస్థల్ని డిమాండు చేస్తున్న ట్రంప్ బ్రిటన్లో దాదాపు 15,000 కోట్ల పౌండ్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన ఒప్పందా లపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. అలాగే రక్షణ సాంకేతిక ఒప్పందం కూడా కుదిరింది. బ్రిటన్ తన డిమాండ్లన్నిటికీ తలొగ్గి అందరి కన్నా ముందు మొన్న ఫిబ్రవరి లోనే వాణిజ్యం ఒప్పందానికి సై అనటం, మరో మూడు నెలల్లో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటం ట్రంప్కు నచ్చింది. దానికితోడు ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లినప్పుడు అధికారిక పర్యటనకు రావాలంటూ బ్రిటన్ రాజు చార్లెస్... స్టార్మర్ ద్వారా ఆహ్వానం పంపటం ఆయన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసివుంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని రాజసౌధం రెండోసారి అధికారిక పర్యటనకు ఆహ్వానించటం, ఘనమైన విందునీ యటం ఇదే తొలిసారి. గత ఏలుబడిలో ట్రంప్ 2019లో బ్రిటన్లో అధికారిక పర్యటన జరిపారు. జార్జి డబ్ల్యూ బుష్, ఒబామాలకు ఆ అదృష్టం మొదటి దఫాలో మాత్రమే దక్కింది. రెండోసారి నాటి బ్రిటిష్ రాణి నుంచి విందు ఆహ్వానాలు మాత్రమే అందాయి.కానీ ట్రంప్ షరతులన్నిటికీ తలొగ్గటం ద్వారా బ్రిటన్ ప్రయోజనాలను స్టార్మర్ దెబ్బతీశారని జనం ఆగ్రహించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా సరుకులపై 10 శాతం మించి సుంకాలు విధించబోమని ఒప్పుకుని, తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై మాత్రం 25 శాతం సుంకాలు విధించినా మౌనంగా ఉండిపోయారని ఆ విమర్శల సారాంశం. దీన్ని పునఃపరిశీలించాలని బ్రిటన్ కోరినా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పటం తప్ప 25 శాతం సుంకాలపై ట్రంప్ మరే హామీ ఇవ్వలేదు. బహుశా ఆయన దృష్టిలో ఆదుకోవటమంటే 15,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టడం కావొచ్చు. వీటి ద్వారా దేశంలో 7,600 ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్ ఆశిస్తోంది. ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాటో, ఉక్రెయిన్, పశ్చిమాసియా, చైనా తదితర అంశాల్లో రెండు దేశాలకూ ఏకీభావం ఉన్నా విభేదాలు కూడా ఉన్నాయి. లోగడ స్టార్మర్ ప్రకటించిన ప్రకారం వచ్చేవారం పాలస్తీనాను బ్రిటన్ గుర్తించాల్సి ఉంది. ఆ పనిచేస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతు పలికినట్టే అవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల హెచ్చరించారు. ట్రంప్ పర్యటనలో కూడా దీనిపై ఇరు దేశాధినేతల మధ్యా చర్చ జరిగింది. ఈ విషయంలో విభేదాలున్నాయని ఇద్దరూ అంగీకరించారు. బ్రిటన్ తాజా నిర్ణయమేమి టన్నది చూడాల్సి ఉంది. రెండు దేశాలూ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేవి. ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యత భారం తమదేనని భావించేవి. కనీసం అలా చెప్పుకొనేవి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవి సమష్టిగా పనిచేశాయి. ధిక్కరించిన దేశాలపై నాటో మాటున దాడులు కూడా చేశాయి. ప్రపంచంలోనే చైనా రెండో శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగాక పరిస్థితి తలకిందులైంది. పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచమంతటా ఎటుచూసినా విధ్వంసం, నిరాశా నిస్పృహలు ఆవరించాయి. యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వలసదా రులపై ఆంక్షలు, ప్రజాస్వామ్య దేశాల్లో నియంతల హవా తదితరాలు వర్తమాన దుఃస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలొస్తే ఇప్పుడెవరూ అమెరికా, బ్రిటన్ల వైపు చూడటం లేదు. అవి చక్కదిద్దుతాయన్న భ్రమలేవీ లేకపోగా... చాలా సమస్యలకు అమె రికా కారణమైతే, బ్రిటన్ వైఖరి కూడా అందుకు దోహదపడుతోందన్న అభిప్రాయమే అనేకుల్లో ఉంది. పైగా నిలకడ లేని ట్రంప్కు విశ్వసనీయత తక్కువ. భారత్ తమకు అత్యంత సన్నిహితమని, ప్రధాని మోదీ కావాల్సినవారనీ మీడియా సమావేశంలో చెప్పిన ట్రంప్... ఉక్రెయిన్ విషయంలో ఆ దేశంతో కఠినంగా ఉండక తప్పడంలేదని గొప్పగా చెప్పుకొన్నారు. ఇలా మాట్లాడేవారిని ఏ దేశ ప్రజలైనా విశ్వసిస్తారా? మొత్తానికి ట్రంప్ తాజా పర్యటన వల్ల బ్రిటన్కు లాభించేది అంతంత మాత్రమేనని చెప్పాలి. -
భారత్కు గుడ్న్యూస్.. టారిఫ్పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్?!
న్యూఢిల్లీ: భారత్పై 50శాతం టారిఫ్ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్ 30 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50శాతం టారిఫ్లో 25 శాతం పెనాల్టీ టారిఫ్ను రద్దు చేయనున్నట్లు సమాచారంరష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్పై ట్రంప్ టారిఫ్తో పాటు పెనాల్టీ టారిఫ్ 25శాతం విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్ విషయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై.. పెనాల్టీ టారిఫ్ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (సీఈఏ)వీ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం కోల్కతా మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ)సమావేశంలో వీ. అనంత నాగేశ్వరన్ మాట్లాడారు. మనదేశం నుంచి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై 25శాతం ప్రతీకార సుంకం చెల్లించడంతో పాటు పెనాల్టీ కింద మరో 25శాతం.. మొత్తంగా 50శాతం టారిఫ్ చెల్లించేందుకు సిద్ధపడ్డాం. కానీ ఇకపై మనకు ఆ అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.25 శాతం పెనాల్టీ సుంకానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 తర్వాత 25శాతం జరిమానా సుంకం ఉండదని నేను నమ్ముతున్నాను. రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకంతో పాటు జరిమానా పరస్పర సుంకాలపై పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్పై టారిఫ్ల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1977లో రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ (ఐఈఈపీఏ) చట్టాన్ని ప్రస్తావిస్తూ, విదేశీ అత్యవసర పరిస్థితుల సమయంలో ఆర్థిక నియంత్రణలు, శిక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగా మనదేశంపై మొదట 25శాతం టారిఫ్లు విధించగా, ఇప్పుడు వాటిని 50శాతానికి పెంచారు. -
ఈ వేలంవెర్రికి తెర పడదా?
సింపుల్గా.... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్కు సన్నిహితుడూ, కరడు గట్టిన జాతీయవాదీ అయిన చార్లీ కిర్క్ హత్యోదంతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికాలో యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా, ఈ నెల 10న ఓ ముష్కరుడు జరిపిన ఆ కాల్పులతో అమెరికాలోని తుపాకీల సంస్కృతిపై మరో మారు చర్చ రేగింది. అలనాటి అబ్రహామ్ లింకన్ నుంచి నేటి కిర్క్ దాకా అనేక హత్యా ఘటనలు, స్కూళ్ళలో కాల్పులు, రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. తుపాకీ లపై వ్యామోహం, వినియోగాన్ని నియంత్రిస్తూ కట్టుదిట్టమైన చట్టం తీసుకువచ్చేందుకు గతంలో పలు అమెరికన్ ప్రభుత్వాలు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయి ఇప్పుడేం జరిగింది?అమెరికాలో తుపాకీల పిచ్చి ఎంతంటే... ఆ దేశ జనాభా కన్నా తుపాకీల సంఖ్యే ఎక్కువ. ప్రపంచ జనాభాలో అక్కడున్నది 5 శాతం కన్నా తక్కువే. కానీ, భూమిపై సామాన్యుల దగ్గరున్న గన్స్లో 45 శాతం పైగా అక్కడే ఉన్నాయి. తుపాకీ లైసెన్సును దేవుడిచ్చిన హక్కుగా సంబోధిస్తూ, ఆ సంస్కృతిని సమర్థిస్తూ వచ్చిన 31 ఏళ్ళ వీర జాతీయవాది చార్లీ కిర్క్. ఆయన తన 18వ ఏటనే టర్నింగ్ పాయింట్ అనే సంస్థను నెలకొల్పి, తన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వచ్చారు. ఉదారవాద అమెరికన్ కాలేజీల్లో జాతీయ వాద ఆదర్శాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. గన్స్ నియంత్రణను వ్యతిరేకించిన ఆయన చివరకు ఓ స్నైపర్ దూరం నుంచి గురిచూసి కాల్చిన తూటా మెడకు తగిలి, ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!నేపథ్యం ఏమిటి?అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం గన్స్ హక్కు పౌరులకుంది. అదే ఆ దేశ సంస్కృతినీ తీర్చి దిద్దింది. సాక్షాత్తూ నలుగురు దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల దాకా ఎందరో బలయ్యారు. అమెరికన్ రాజకీయాలనూ, నిత్యజీవితాన్నీ ప్రభావితం చేసిన ఈ తుపాకీల సంస్కృతి నియంత్రణకు సంబంధించి ఏళ్ళుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ అంశం కేవలం విధానపరమైనదే కాదు. రాజ్యాంగంలోని వివిధ అంశాల వ్యాఖ్యానం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత భద్రతలతోనూ ముడిపడిన విషయం. నియంత్రణ సమర్థకులు, వ్యతిరేకులుగా అమెరికన్ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. కిర్క్ హత్యా ఘటన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.గత చరిత్రఅమెరికాలో మొదట వేట, స్వీయ రక్షణ కోసం గన్స్ వచ్చాయి. 1791లో తెచ్చిన ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఆయుధాలను కలిగివుండే రాజ్యాంగ రెండో సవరణ కూడా చోటుచేసుకుంది. క్రమంగా తుపాకీలను స్వేచ్ఛకు ప్రతీక అనుకోవడం మొదలైంది. అయితే, గన్స్ వినియోగం దోవ తప్పి నేరాలకు దారితీసింది. 1934లో ప్రధానమైన తొలి ఫెడరల్ ఆయుధ చట్టం తెచ్చారు. దశాబ్దాల అనంతరం జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల హత్యల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ తుపాకీ నియంత్రణ చట్టం 1968 చేసింది. అయినా దుర్వినియోగం ఆగలేదు. తర్వాతా సంస్కరణలు తేవాలని పలు వురు అమెరికన్ అధ్యక్షులు యత్నించి, విఫలమయ్యారు. ఒబామా అలాంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని 17 సార్లు ప్రయత్నించారు.వర్తమానం... భవిష్యత్తు...అమెరికాలో ప్రతి 10 మందిలో నలుగురి ఇంటి వద్ద తుపాకీలు ఉన్నాయట. యుద్ధ పీడిత యెమెన్తో పోలిస్తే ఇక్కడే రెట్టింపు కన్నా ఎక్కువగా తలసరి 1.2 గన్నులున్నాయి. సగటున రోజూ 128 గన్ డెత్స్ సంభవిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి 11 నిమిషా లకూ ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా గన్ రైట్స్పై అమెరికా ఒక్క తాటి మీద లేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి బలమైన లాబీలూ దీని వెనుక పనిచేస్తున్నాయి. మునుపు 1980, 90లలో ఆస్ట్రేలియాలో ఇలానే తుపాకీలు రాజ్యమేలుతుంటే, కఠినమైన నియంత్రణతోఅదుపు చేశారు. అమెరికాలోనేమో అలాంటిది కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ బిట్కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటుయూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025 -
ఎవరీ జిమ్మీ కిమ్మెల్?.. ట్రంప్కు కోపం ఎందుకొచ్చింది?
ప్రముఖ మీడియా సంస్థ ఏబీసీ తన లేట్-నైట్ టాక్ షో ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ను నిరవధికంగా నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్పై వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్లు ఈ హత్యపై దర్యాప్తులో నిర్వహించిన తీరుపై జిమ్మీ కిమ్మెల్ విమర్శలు గుప్పించారు. కాగా జిమ్మీ లేట్ నైట్ షోను రద్దు చేయాలన్న ఏబీసీ నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాకు ఇది గొప్ప వార్త అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తుపాకీ కాల్పులకు బలయ్యాడు. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో చార్లీ కిర్క్ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. అతనిని ఈవెన్ లెజెండరీ అంటూ ప్రశంసించారు. కాగా సోమవారం కిమ్మెల్ తన ప్రముఖ లేట్ నైట్ షో లో మోనోలాగ్లో జరిగిన కాల్పుల గురించి మాట్లాడారు. చార్లీ కిర్క్ను హత్య చేసిన టైలర్ రాబిన్సన్ ను వలసవాదిగా చిత్రీకరించేందుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మెగా) గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించిందని, తద్వారా రాజకీయ లబ్ధకోసం తాపత్రయపడిందని కిమ్మెల్ ఆరోపించారు. ట్రంప్కు అందుకే కోపం..అధ్యక్షుడు ట్రంప్ తన స్నేహితుడు చార్లీని కోల్పోయినందుకు ఎలా బాధపడ్డారనేదానిపై కిమ్మెల్ వ్యంగ్యంగా మాట్లాడారు. ట్రంప్ దుఃఖించే విధానాన్ని ఎగతాళి చేస్తూ ఆయన దుఃఖంలో నాల్గవ దశలో ఉన్నారన్నారు. తన స్నేహితుని హత్యపై అతను బాధపడటం లేదని, నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిష్ పోతే ఎలా బాధపడతాడో అలా దుఃఖించారని కిమ్మెల్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ షోలో ట్రంప్.. కిర్క్ మరణంపై మాట్లాడిన క్లిప్పింగ్ను కిమ్మెల్ ప్లే చేశారు.ఈ షోలో ట్రంప్ వైట్ హౌస్లో అత్యంత ఖరీదైన బాల్రూమ్ను నిర్మించడంలోని ఉద్దేశ్యాన్ని కూడా ప్రశ్నించారు.అయితే ఇంతలో నెక్స్స్టార్ బ్రాడ్కాస్టింగ్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఆల్ఫోర్డ్ ఒక ప్రకటనలో కిమ్మెల్ వ్యాఖ్యలను కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కిర్క్ మరణంపై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి తాము భావిస్తున్నామన్నామని ప్రకటించారు. కిమ్మెల్కు ప్రసార వేదికను అందించడం ప్రస్తుత సమయంలో ప్రజా ప్రయోజనం కోసం కాదని భావిస్తూ, జిమ్మీ షో ప్రసారం నిరవధికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా జిమ్మీ కిమ్మెల్ లేట్-నైట్ షో రద్దును అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఇందుకు ధైర్యం చూపినందుకు ఏబీసీని అభినందించారు.జిమ్మీ కిమ్మెల్ ఒక ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు.. ప్రొడ్యూసర్ కూడా. ఆయన "Jimmy Kimmel Live!" అనే లేట్ నైట్ టాక్ షోను 2003 నుండి ABC ఛానల్లో హోస్ట్ చేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యం.. సెలబ్రిటీలతో చేసే చమత్కార సంభాషణలతో టీవీ రంగంలో ఎంతో ప్రసిద్ధి పొందారీయ. తాజాగా చార్లీ కిర్క్ హత్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆపై షో నిలిచిపోవడం.. అమెరికాలో భావ స్వేచ్ఛ ప్రకటపై చర్చకు దారితీసింది. అయితే వ్యంగ్యంగా రాజకీయ విమర్శలు గుప్పించే జిమ్మి కిమ్మెల్తో పాటు జిమ్మీ ఫాలోన్, సెత్ మేయర్స్లాంటి హోస్టులనూ కూడా ట్రంప్ ఇంతకు ముందు తిట్టిపోశారు. -
Antifa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన. The United States of America will be designating ANTIFA as a Terrorist Organization.— Donald J. Trump (@realDonaldTrump) May 31, 2020ఏంటీ ఎంటిఫా.. Antifa అంటే ఫాసిస్ట్ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. ట్రంప్ గత టర్మ్లోనే ఈ గ్రూప్ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. కిర్క్ మరణంకన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్తో కాల్చి చంపారు. ఒకే భావజాలం ఉన్న ట్రంప్ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్ కేసింగ్లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్సన్ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం. -
దోస్త్ అంటూనే డ్రగ్స్ జాబితాలోకి భారత్ను చేర్చిన ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: మంచి మిత్రదేశం అంటూనే వివాదాస్పద, అపఖ్యాతి పాల్జేసే జాబితాలో భారత్ను అమెరికా చేర్చింది. మాదకద్రవ్యాల కట్ట డిపై ఉక్కుపాదం మోపే భారత్ను ప్రధాన డ్రగ్స్ రవాణా, ఉత్పత్తి దేశాల జాబితాలో అమెరికా అధ్య క్షుడు ట్రంప్ చేర్చారు. ఈ మేరకు ‘అధ్యక్షుడి సంకల్పం’ పత్రాన్ని సోమవారం అమెరికా కాంగ్రెస్కు ట్రంప్ సమర్పించారు. భారత్, బహమాస్, బెలీజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికా రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హైతీ, హోండురాస్, జమైకా, లా వోస్, మెక్సికో, నికరాగ్వా, పాకిస్తాన్, పనామా, పె రూ, వెనెజువెలా సహా 23 దేశాలతో జాబితాను సిద్ధంచేసి కాంగ్రెస్కు ట్రంప్ సమర్పించారు. ‘‘విదే శాల్లో ఉత్పత్తయి ఈ దేశాల గుండా అమెరికాకు డ్రగ్స్ రావడం, లేదంటే ఈ 23 దేశాలు ఆ జాబితా లో ఉన్నాయి. -
మళ్లీ అమెరికాతో నెయ్యం
ఇది స్పీడ్ యుగం. కరచాలనాలైనా, కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానూ కనుమరుగవుతాయి. భారత్–అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. నెల్లాళ్ల క్రితం దాదాపు ఛిద్రమయ్యాయనుకున్న ఈ సంబంధాల్లో మళ్లీ సుహృద్భావం మొగ్గ తొడుగుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గంతో మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరింది. అంతేకాదు... ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పటం, దాన్ని ఎక్స్లో మోదీ ప్రస్తావించి రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించటం గమనించదగ్గవి. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పరిస్థితి వేరు. రష్యా దురాక్రమణ యుద్ధం కొనసాగటానికి భారత్ వైఖరే ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు. అంత క్రితం ఆగస్టు మొదటి వారంలో విధించిన 25 శాతం సుంకాలతో పాటు రష్యా ముడిచమురు కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో 25 శాతం అదనంగా వడ్డించి దాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. కేవలం భారత్పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్యమంత్రి హొవార్డ్ లుత్నిక్ వరకూ ఇష్టానుసారం మాట్లాడారు. వీరిలో నవారో మిగిలినవారికన్నా భిన్నం. ఆయన ఆశువుగా అబద్ధాలాడగలరు. ఆధారాలతోగానీ, ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో గానీ ఆయనకు పనిలేదు. ఫలానా కులానికి లబ్ధి చేకూర్చటం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోందని వ్యాఖ్యానించగలరు. ఇరు దేశాల మధ్యా చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్ను ‘ట్యారిఫ్ల మహారాజు’ అనగలరు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించగలరు. మన దేశం ఎంతో సంయమనం పాటించబట్టే అయిదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో అనవసరంగా పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే!భారత్పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భారత్ రష్యా చమురుకొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది. ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది.ట్రంప్కు దౌత్యపరమైన మర్యాదలు తెలియవు. తన చర్యల వల్ల అవతలి దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పని ఒత్తిళ్లేమిటో అర్థం కావు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే సుంకాల్లో 95 శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ 43 శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న సాగు రంగాన్ని పణంగా పెట్టడానికీ, చిన్న వ్యాపారుల, పాడిపరిశ్రమ రంగ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకూ తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. జన్యుపరంగా మార్పిడి చేసిన మొక్కజొన్న మాకొద్దని చెబుతోంది. ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక ధూర్త వ్యాపారిలా ట్రంప్ ప్రవర్తించారు. ఇప్పుడు తామే వెనక్కి తగ్గక స్థితిని సృష్టించుకున్నారు.తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దక్షిణ కొరియా, జపాన్లు సాగిలపడటాన్ని చూసి అందరిపైనా ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించటమే ఇందుకు కారణం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో చెట్టపట్టాలేసుకున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో భారత్ బెంబేలు పడుతుందని భావించారు. కానీ షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశానికి మోదీ చైనా వెళ్లటం, అక్కడి పరిణామాలూ గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు. భారత్కు తాను తప్ప దిక్కులేదనుకోవటం ఘోర తప్పిదమని గ్రహించారు. పర్యవసానంగానే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్న వైఖరిని ట్రంప్ విడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది. అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయే! -
బంగారంపై బిగ్ న్యూస్ అంటున్న రిచ్డాడ్ కియోసాకి
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్ న్యూస్ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అద్భుతమంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో రాబర్ట్ కియోసాకి ఓ పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.BIG NEWS: According to friend Andy Schectman….on August 7, 2025….President Trump signed an Executive Order “Democratizing Access to Alternative Investments for 401k Investors.”As some of you know I do not invest in mutual funds or ETFS. To me Mutual funds and ETFS are for…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 17, 2025 -
ప్రధాని మోదీకి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మాదిరిగానే తానూ భారత్-అమెరికా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో.. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోనులో మాట్లాడాను. ఆయనకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.PM Modi posts, "Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH— Press Trust of India (@PTI_News) September 16, 2025దీనికి బదులుగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ‘అధ్యక్షుడు ట్రంప్ నా 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందుకు నా మిత్రునికి ధన్యవాదాలు. మీ మాదిరిగానే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేపట్టిన చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 17 తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్ స్వల్ప ధరలకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే భారత్పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. అలాగే భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ పలుమార్లు ఖండించింది. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ పరువు నష్టం దావా
వాషింగ్టన్: ‘ద న్యూయార్క్ టైమ్’ పత్రిక తనను అవమానించడమే పనిగా పెట్టుకుందని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాకుండా విపక్ష డెమెక్రటిక్ పార్టీకి కరపత్రికగా మారిపోయిందని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి, వ్యాపారానికి వ్యతిరేకంగా తప్పుడు సేŠట్ట్మెంట్లు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పత్రికపై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తనకు జరిగిన నష్టానికి గాను ఆ పత్రిక 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్లు) పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ ఈ మేరకు సోమవారం రాత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ట్రంప్ డిమాండ్ చేస్తున్న సొమ్ము ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక మార్కెట్ విలువ కంటే అధికం కావడం గమనార్హం. పాత్రికేయ రంగంలో ప్రమాణాలను పునరుద్ధరించడం, సమగ్రతను కాపాడడం తన ఉద్దేశమని ట్రంప్ చెబుతుండడం విశేషం. అయితే, నిపుణుల వాదన మరోలా ఉంది.న్యూయార్క్ టైమ్స్పై పరువు నష్టం దావా వేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించాలని, వ్యతిరేక గళాలను అణచివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపడితే కోర్టుకు లాగడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ వేసిన పరువు నష్టం దావాలో పుస్తక ప్రచురణ సంస్థ పెంర్విన్ రాండమ్ హౌస్తోపాటు న్యూయార్క్ టైమ్స్లో పనిచేసే నలుగురు జర్నలిస్టుల పేర్లు కూడా చేర్చారు. వీరిలో ఇద్దరు ట్రంప్పై ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని పెంర్విన్ ప్రచురించింది.ఆ దావాలో పస లేదుకోర్టులో ట్రంప్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక యాజమాన్యం స్పందించింది. ఆ దావాలో ఏమాత్రం పస లేదని, అది చెల్లదని, న్యాయ పరీక్షకు నిలవదని తేల్చిచెప్పింది. మీడియా స్వతంత్రను దెబ్బతీయడమే ట్రంప్ ఉద్దేశమని విమర్శించింది. ప్రసార మాధ్యమాలను అణచివేయడం మానుకోవాలని సూచించింది. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాము లొంగబోమని స్పష్టంచేసింది. నిజాలు నిర్భయంగా బహిర్గతం చేస్తూనే ఉంటామని, తమను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. న్యాయం తమవైపే ఉందని ఉద్ఘాటించింది. -
థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చిచెప్పారు. అంటే ట్రంప్ చెప్పినదంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేశారు. తాజాగా అల్జజీరా మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.కీలకం అంశాలపై పొరుగుదేశంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, తమతో చర్చలపై భారత్ స్పందించడం లేదని చెప్పారు. భారత్తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇషాక్ దార్ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని అన్నారు. రెండు దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు.భారత్–పాక్ల నడుమ మధ్యవర్తిత్వం వహించానని, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరామని ఇషాక్ దార్ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోవడం లేదంటూ ఆయన తమతో చెప్పారని వివరించారు.భారత్ను అడుక్కోలేం కదా!‘‘కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ ఆమెరికా నుంచి మే 10వ తేదీన ఆఫర్ వచి్చంది. ఒక తటస్థ వేదికపై అతిత్వరలో చర్చలు ప్రారంభిద్దామని మార్కో రూబియో మాకు చెప్పారు. కానీ, ఆ చర్చలేవీ జరగలేదు. జూలై 25వ తేదీన వాషింగ్టన్లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్ తేల్చిచెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు.భారత్, పాక్ల సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్ చెబుతుండగా ఇక మేము ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్ను అడుక్కోలేం కదా! శాంతిని కోరుకొనే దేశం పాకిస్తాన్. చర్చల ద్వారాపై సమస్యలు పరిష్కారం అవుతాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకు రెండు దేశాలూ ముందుకు రావాలి. చర్చలకు భారత్ ఒప్పుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థికం, జమ్మూకశీ్మర్ తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దాం. థర్డ్ పార్టీని అనుమతించాలని మేము కూడా పట్టుబట్టడం లేదు’’ అని ఇషాక్ దార్ సూచించారు.ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించిన భారత్ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఆపరేషన్ ముగిసింది. భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ రెండు దేశాల ప్రభుత్వాల కంటే ముందే ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. దీనిపై విమర్శలు వచి్చనప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.భారత్, పాక్లపై వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆగేలా చేశానని, ఆ క్రెడిట్ తనకే దక్కాలని, అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై భారత్ స్పందిస్తూ ట్రంప్ వాదనను పలుమార్లు తిప్పికొట్టింది. రెండు దేశాలతో సంబంధం లేని మూడో వ్యక్తి చెబితే కాల్పుల విరమణకు తామెందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించింది. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశామని స్పష్టంచేసింది. నోబెల్ శాంతి బహుమతికి తన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని ట్రంప్ విజ్ఞప్తి చేయగా, భారత్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. -
ట్రంప్ మరో హెచ్చరిక: ఇక ‘కార్టెల్స్’పై ఉచ్చు బిగిస్తాం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవ దఫా అధికారం చేపట్టినది మొదలు తన పాలనలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. తాజాగా వెనిజులా నుండి మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్నట్లు భావిస్తున్న పడవను లక్ష్యంగా చేసుకుని, అమెరికా సైన్యం దాడి చేసిందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆ నౌకలో ముగ్గురు మృతిచెందారని, ఈ తరహా‘కార్టెల్స్’ను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడులు మరింతగా విస్తరిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాదులు అంతర్జాతీయ జలాల్లో అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఏర్పడిన ‘కార్టెల్స్’ అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, కీలకమైన అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నాయన్నారు. ఇటీవల అమెరికా సైన్యం వెనిజులా నుండి మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్న స్పీడ్బోట్పై దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ తమ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తాజా ‘కార్టెల్స్’ దాడికి సంబంధించిన ఫుటేజ్ చూపించినట్లు తెలిపారు.ఆ నౌకలో మాదకద్రవ్యాలున్నాయని అమెరికా దగ్గర ఎలాంటి రుజువు ఉందని విలేకరులు అడగగా ట్రంప్ ‘మా దగ్గర రుజువు ఉంది. మీరు చేయాల్సిందల్లా సముద్రం అంతటా చెల్లాచెదురుగా ఉన్న సరుకును గమనించడమే.. పెద్ద సంచుల కొకైన్, ఫెంటానిల్ అక్రమ రవాణా జరుగుతోంది. సముద్రంలో మాదకద్రవ్యాల స్మగ్లర్లపై ఎలా దాడులు జరుగుతున్నాయో అవి భూభాగంపైన కూడా కొనసాగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. -
టిక్టాక్పై డీల్ కుదిరింది
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ సోషల్మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్మీడియా ఖాతా లో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. ‘అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవా రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడుతా’అని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ బైట్డ్యాన్స్ సృష్టించిన టిక్టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
వలసదారులపై మొదటి నుంచే కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించారు. అంతే కాకుండా.. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ చర్య విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.ఓడలు, కంప్యూటర్లు, రైళ్లు, సెమీకండక్టర్లు వంటి క్లిష్టమైన ఉత్పత్తులను నిర్మించే విదేశీ కంపెనీలు.. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సొంత దేశాల నుంచి నిపుణులను తీసుకురావాలని ట్రంప్ అన్నారు. మనం ఇలా చేయకపోతే.. భారీ పెట్టుబడులను అమెరికా కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఇతర దేశీయలను.. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. మేము కంపెనీలను మాత్రమే కాకుండా.. వారి ఉద్యోగులను కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. క్లిష్టమైన రంగాల్లో కూడా మన దేశం రాణిస్తుంది. ఇది దేశ భవిష్యత్ కూడా అని పేర్కొన్నారు. -
భారతీయుడు నాగమల్లయ్య దారుణ హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
‘ఆ పప్పులు ఉడకవు.. శభాష్ భారత్’
రష్యా చమురు, ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్పై ట్రంప్ కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈయూ, జీ7, నాటో సహా పలు దేశాలపైనా ఆయన ఒత్తిడి చేస్తుండడం చూస్తున్నాం. అమెరికాలాగే ఆ దేశాలకు భారతీయ వస్తువులపై సుంకాల మోత మోగించాలంటూ సూచిస్తున్నారాయన. అయితే ఈ విషయంలో ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది!. తాజాగా ఈ పరిణామంపై రష్యా స్పందించింది. భారత్తో తమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని.. ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమెరికాకు మెత్తగా మొట్టికాయలు వేసింది. ‘‘ఇండియా-రష్యా సంబంధాలు స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ బంధాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ఇండియాను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఇండియా వైఖరి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇండియా-రష్యా స్నేహబంధం స్ఫూర్తి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ఇండియా నిర్ణయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇరు దేశాలు మిలిటరీ ఉత్పత్తులు, అంతరిక్ష మిషన్లు, అణు శక్తి, రష్యన్ చమురు పరిశోధనలో భారత పెట్టుబడులు వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. నూతన చెల్లింపు వ్యవస్థలు, జాతీయ కరెన్సీల వినియోగం, పరస్పర రవాణా మార్గాల అభివృద్ధి వంటి అంశాల్లో కూడా సహకారం కొనసాగుతోంది అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై తొలుత 25% ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అటుపై రష్యా చమురు, రక్షణ సామాగ్రి కొనుగోళ్ల నేపథ్యంతో పెనాల్టీ కింద మరో 25% శాతం విధించారు. ఈ టారిఫ్లను భారత్ అన్యాయంగా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం జాతీయ ప్రయోజనాల, మార్కెట్ అవసరాల ఆధారంగా జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రష్యా భారత్ ఆర్థిక వ్యవస్థలు డెడ్.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ సంచలన కామెంట్ చేశారు. అయినప్పటికీ.. అమెరికా ఒత్తిడికి తలవంచే ప్రసక్తే లేదని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు తమ దేశానికి ఉందని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా అలస్కాలో పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ స్వరం కాస్త తగ్గింది. ఉక్రెయిన్ డీల్ కుదిరితే భారత సుంకాల విషయంలో ఆలోచన చేయొచ్చని అన్నారాయన. అయితే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరాలంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై రాయితీలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో.. ఈ రంగాలను రెడ్ లైన్స్గా red linesగా అభివర్ణించింది. మరోవైపు.. ఎగుమతిదారులపై ప్రభావం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతు ప్యాకేజీలు ప్రకటించే అవకాశముందనే విశ్లేషణ నడిచింది. ఈలోపు ట్రంప్-మోదీల పరస్పర సోషల్ మీడియా సంభాషణతో ఈ చర్చలు ముందుకు సాగవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. -
భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టెక్సాస్లోని డల్లాస్లో చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.టెక్సాస్లోని డల్లాస్ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో పేర్కొన్నారు.నిందితుడు కోబో మార్టినెజ్పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.ఇలాంటి అక్రమ వలస నేరస్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్ దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి. -
రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్ హెచ్చరిక.. డ్రాగన్ కౌంటర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా విషయంలో దూకుడు పెంచుతూ నాటో దేశాలు, చైనాలను హెచ్చరించారు. చమురు కొనుగోలును వెంటనే నిలిపేయాలని.. లేదంటే చైనాపై 100 శాతం పన్నులు విధిస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..‘యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్దం చేయడం లేదు.. యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, చైనాపై ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసిన కొద్దిసేపటికే వాంగ్ యి ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.అంతకుముందు ట్రంప్.. చైనాపై భారీ సంఖ్యలో సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతోపాటు అమెరికా డబ్బునూ వృథా చేస్తున్నట్లేనని అన్నారు.China hits back at Trump's 100% tariff call.Chinese Foreign Minister Wang Yi said that war cannot solve problems and sanctions only complicate them— CivilBuzz (@NetiNeti24) September 14, 2025అంతటితో ఆగకుండా.. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని.. సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. ఈ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. -
'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు. -
‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను’.. చార్లీ కిర్క్ భార్య భావోద్వేగ ప్రసంగం..
వాషింగ్టన్: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్ వింగ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.తన భర్త పాడ్కాస్ట్ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.ఎరికా 2021లో చార్లీ కిర్క్ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్కాస్ట్ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ, ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని ఎరిక్ అధ్యక్షుడు ట్రంప్తో అన్నారు. -
భారత్పై సుంకాలు.. అతి పెద్ద సవాల్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్పై సుంకాల విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై 50 శాతం సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని చెప్పుకొచ్చారు. ఈ అతి పెద్ద చర్య కారణంగానే భారత్, అమెరికా మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ ప్రారంభమైంది. భారత్పై సుంకాలను తగ్గిస్తారా? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యాకు భారత్ అతి పెద్ద చమురు వినియోగదారు. రెండు దేశాల మధ్య ఎంతో మిత్రుత్వం ఉంది. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి మేము సిద్ధమయ్యాం. రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే కారణంతోనే భారత్పై నేను భారత్పై 50 శాతం సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్తో విభేదాలు వచ్చాయి. అయినా నేనా చర్య తీసుకున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేశాను. కేవలం ఇది మాకు మాత్రమే సమస్య కాదు. యూరప్కు సైతం ఇదే ప్రధాన సమస్యే’ అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో పాత పాటే మళ్లీ పాడారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-పాక్ ఘర్షణ సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఏడు యుద్ధాలను తాను నివారించినట్టు ట్రంప్ తెలిపారు. కాంగో, రువాండా మధ్య గత 31ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తానే పరిష్కరించానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించలేని యుద్ధాలను నేను పరిష్కరిస్తాను ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
టారిఫ్ల వల్లే విభేదాలు: ట్రంప్
న్యూయార్క్: భారత్పై విధించిన టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఈ సుంకాల కారణంగా భారత్తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద కస్టమర్గా మారిందని ఆక్షేపించారు. దానికారణంగానే 50 శాతం టారిఫ్లు విధించక తప్పలేదని పునరుద్ఘాటించారు. నిజానికి అది చాలా పెద్ద నిర్ణయమని, దాన్ని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై మొండిగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా అధినేత పుతిన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. రష్యా మిత్రదేశమైన భారత్పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒకరకంగా చర్యలు తీసుకున్నట్లేనని వివరించారు. -
విద్వేషాలను పెంచే హత్య
ఆయనేమీ అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తున్నవాడు కాదు. కనీసం రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సైద్ధాంతిక ఉపకరణాలు అందిస్తున్నవారిలో... ‘అమెరికాను మళ్లీ మహోత్కృష్టంగా మారుద్దాం’ (మాగా) ఉద్యమానికి తోడ్పడుతున్నవారిలో అతి ముఖ్యుడు. మూడు పదుల వయసు లోని మితవాద క్రియాశీల కార్యకర్త చార్లీ కిర్క్ను యూటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో బుధవారం దుండగుడు కాల్చి చంపిన వైనం ఇప్పుడు అమెరికాను ఊపిరాడకుండా చేస్తోంది. ప్రముఖులను, ఉన్న పదవుల్లోని వారినీ భౌతికంగా నిర్మూలించాలని చూసే సంస్కృతి అమెరికాకు కొత్తగాదు. కానీ ఈమధ్య అది పెరిగింది. ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మిన్నెసోటా ప్రతినిధుల సభ స్పీకర్ ఎమెరిటా మెలిసానూ, ఆమె భర్తనూ ఇటీవలే కాల్చి చంపారు. అమెరికాలో తుపాకుల పరిశ్రమ పలుకుబడి అధికం. తుపాకి సంస్కృతిని రద్దుచేయటం మాట అటుంచి, కనీసం పరిమితులు విధించాలని చూసినా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తుపాకి కలిగివుండటం పౌరుల హక్కని, దాన్ని రద్దు చేయటమంటే జీవించే హక్కును కాలరాయటమేనని వాదిస్తారు. రిపబ్లికన్ పార్టీలో ఇలాంటివారు ఎక్కువున్నా, డెమాక్రటిక్ పార్టీలో కూడా తక్కువేం లేరు. కిర్క్ తుపాకులకు అనుకూలం. దానిపై ఒక విద్యార్థి ప్రశ్నకు జవాబు చెబుతుండగానే ఆయన హత్యకు గురయ్యారు. అమెరికాలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరిగింది. ఒక అంశంపై వాదం, ప్రతివాదం సంస్కృతి కనుమరుగవుతోంది. వినాలన్న యోచన లేదు. ఉన్నా వాదనకు జవాబు చెప్పలేక, అతనికి/ఆమెకు దురుద్దేశాలు అంటగట్టడం, అభాండాలేయటం, దౌర్జన్యానికి దిగటం పెరిగింది. ఏకీభవించకున్నా ఆ వాదనను గౌరవించాలన్న స్పృహ కొరవడింది.ఒక విశ్వాసాన్ని కలిగివున్న వ్యక్తిని హతమార్చినంత మాత్రాన ఆ విశ్వాసాన్ని నిర్మూలించటం అసాధ్యం. కానీ దురదృష్టవశాత్తూ దీన్ని నమ్ముకునే ధోరణి ప్రబలుతోంది. కిర్క్ డ్రాపౌట్ అన్న మాటేగానీ అసాధారణ ప్రతిభావంతుడు. కేవలం 18 యేళ్ల వయసులోనే ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ సంస్థ నెలకొల్పి తన మితవాద భావాలను బలంగా చెప్పగలిగే ఉపన్యాసకుడిగా రూపొందాడు. ఖజానా బాధ్యతాయుత నిర్వహణ, స్వేచ్ఛాయుత మార్కెట్లు, పరిమిత పాలనా వ్యవస్థ తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చాడు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడే 22 ఏళ్ల వయసులో ‘మాగా’ ఉద్యమానికి అంకితమై పనిచేశాడు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదై రిపబ్లికన్లకు ఓటేయటం వెనక కిర్క్ కృషిని గురించి చెబుతారు. అరిజోనా వంటి డెమాక్రటిక్ ప్రభావిత ప్రాంతం రిపబ్లికన్ల వైపు మొగ్గటంలో అతనిపాత్ర ప్రధానమైనది. మహిళలు, గర్భస్రావాలు, ట్రాన్స్జెండర్లు తదితర అంశాల్లోఅతని వైఖరిని చాలామంది జీర్ణించుకోలేరు. జాతి, మత, వర్ణ, లింగ వివక్షను నిషేధించే 1964 నాటి పౌర హక్కుల చట్టం పెద్ద తప్పిదమని కిర్క్ భావన. భారతీయులకు కిర్క్ తీవ్ర వ్యతిరేకి. ‘శ్వేత జాతీయులకు ఉద్యోగాలు రావాలి... మీరంతా ఖాళీ చేసి పొండి’ అని పిలుపునిచ్చాడు.తన భావాలపై ప్రశ్నించవచ్చంటూ కాలేజీలు, వర్సిటీల సందర్శన మొదలు పెట్టాడు. ఆ భావాలను పూర్వపక్షం చేస్తే అతని వాదన బలహీనపడుతుంది. కానీ భౌతిక దాడికి దిగటం వల్ల కిర్క్ భావాల బలం పెరుగుతుంది. ఈ మరణం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యలే చెబుతాయి. ‘మనది యుద్ధం. కిర్క్ నేలకొరిగిన యుద్ధ వీరుడు. వ్యక్తిగత భేదాలు పక్కనబెట్టి ఒక్కటై పోరాడాలి’ అని మితవాద వ్యూహకర్త స్టీవ్ బేనన్ పిలుపునిచ్చారు. ‘మనల్ని ప్రశాంతంగా బతకనీయకపోతే మనకున్న ప్రత్యామ్నాయాలు రెండే– పోరాడటం లేదా మరణించటం’ అని ఎలాన్ మస్క్ అన్నారు. ‘వామపక్షవాదులారా... మనం సంభాషించుకుందాం లేదా యుద్ధానికి దిగుదాం. మీ నుంచి మరో బుల్లెట్ బయటికొస్తే ఇక ఆఎంపిక మిగలదు’ అని నటుడు జేమ్స్ వుడ్స్ హెచ్చరించారు. ఏదేమైనా ఈ వాతావరణంలో అక్కడివారే కాదు... వలసపోయినవారూ అప్రమత్తంగా ఉండక తప్పదు. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసు.. నిందితుడి మగ్షాట్ విడుదల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్(31) హత్య కేసులో ఎఫ్బీఐ అధికారులు పురోగతి సాధించారు. 48గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎఫ్బీఐ నిందితుడు టైలర్ రాబిన్సన్ మగ్షాట్ (అరెస్టు సమయంలో తీసిన ఫోటో)ను విడుదల చేసింది. టైలర్ రాబిన్సన్ అనే 22 ఏళ్ల యువకుడు. యుటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చార్లీ కిర్క్ను కాల్చి చంపాడు.ఈ ఘటన పట్టపగలు 3వేల మంది ప్రజల సమక్షంలో జరిగింది. రాబిన్సన్ అరెస్ట్ అనంతరం, అతని ఫోటోను ఎఫ్బీఐ అధికారికంగా విడుదల చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడమే కాకుండా,కేసు విచారణలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఎఫ్బీఐ స్థానిక పోలీసు శాఖలతో కలిసి ఈ కేసును విచారిస్తోంది. చార్లీ కిర్క్ను హత్య చేయడానికి నిందితుడి మోటివ్, తుపాకీని ఎక్కడి నుంచి సేకరించారు. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలపై దృష్టి పెట్టారు. రాబిన్సన్ను ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ ప్రాణం తీసిన నిందితుడు దొరికాడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) ప్రాణాలు తీసిన నిందితుడు దొరికాడు. నిందితుడికి చాలా దగ్గర వ్యక్తులే అతడిని పట్టించినట్లు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ట్రంప్కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు.నిందితుడు కాల్పులు జరపడంతో కూర్చొని ప్రసంగిస్తున్న చార్లీ కిర్క్ మెడ భాగంలో తూటా దిగింది. తీవ్ర గాయం కావడంతో చార్లీ నేలకొరిగాడు. చార్లీ కిర్క్ బుధవారం యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులు, అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో హత్యకు గురయ్యాడు. యుటా వ్యాలీ యూనివర్సిటీ పోలీస్ అధికారి చార్లీకిర్క్ హత్య అనంతరం మీడియాతో మాట్లాడారు.చార్లీ ఈవెంట్లో మూడువేల మందిచార్లీ కిర్క్ ఈవెంట్లో సుమారు 3వేలమంది పాల్గొన్నారు. మాటీంలో ఆరుగురు సభ్యులు ఈవెంట్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చార్లీకి సెక్యూరిటీగా తన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఈవెంట్ జరిగే సమయంలో చార్లీ క్యాంపస్లో లోతట్టు ప్రదేశంలో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు చార్లీ కూర్చున్న ప్రదేశం నుంచి సుమారు 200 అడుగుల దూరంలో ఉన్న బిల్డింగ్ పైకప్పు నుంచి కాల్పులకు తెగబడ్డారని అన్నారు. లక్ష డాలర్ల రివార్డుకాల్పుల ఘటనపై అప్రమత్తమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు 48 గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకుంది. ఇందుకోసం సుమారు 20కిపైగా ఏజెన్సీలు,వందల మంది వందలాది మంది అధికారులు.. 7వేల మందికి పైగా ప్రజల సహాయంతో రంగంలోకి దిగారు.నిందితుణ్ని అరెస్ట్ చేశారు.నిందితుడి ఆచూకీ, అరెస్ట్ చేసేలా సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల రివార్డు ఇస్తామని ఎఫ్బీఐ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. The FBI is offering a reward of up to $100,000 for information leading to the identification and arrest of the individual(s) responsible for the murder of Charlie Kirk on September 10, 2025, at Utah Valley University in Orem, Utah. Contact 1-800-CALL-FBI and submit photos and… pic.twitter.com/ReuzFhdm0H— FBI (@FBI) September 11, 2025 -
ట్రంప్ సన్నిహితుడి హత్య.. వెలుగులోకి సంచలన వీడియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడు చార్లీ కిర్క్పై జరిగిన కాల్పుల ఘటనలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాలేజీ భవనం పైకప్పు నుంచి దూకి పరారైన దృశ్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తాజాగా విడుదల చేసింది. కిర్క్ను చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్బీఐ ప్రకటించింది.దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు.చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కార్మికుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు. -
భారత్–అమెరికా చర్చల్లో పురోగతి
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.అమెరికా, భారత్ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్ -
ఆయన్ని పట్టించుకోకండి.. ట్రంప్-మోదీ మధ్యే గొడవలు పెట్టబోయాడు
టారిఫ్ వార్తో మొదలైన అమెరికా-భారత్ ఉద్రిక్తతలు.. ట్రంప్-మోదీ పరస్పర సోషల్ మీడియా స్నేహపూర్వక సందేశాలతో కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్(John Bolton) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత.. సోషల్ మీడియా విమర్శలు పక్కనపెట్టి వాస్తవిక వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారాయన.అంతేకాదు.. ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవారో(Peter Navarro) వల్లే భారత్, అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బోల్టన్ అంటున్నారు. తాజాగా భారత్కు చెందిన ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలే వెల్లడించారు.పీటర్ నవారో అనే వ్యక్తి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య గొడవను ప్రేరేపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నవారో అనే వ్యక్తి ఎలాంటి వారంటే.. ఒక గదిలో ఆయన్ని మాత్రమే ఉంచండి. ఓ గంట తర్వాత వచ్చి చూడండి. ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అయితే..భారత్పై నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవే అయినప్పటికీ.. ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలి. అసలు వాణిజ్య చర్చలు ప్రామాణిక ప్రతినిధుల మధ్య జరగాలి. అలాగే.. భారత్ సోషల్ మీడియా తరఫున బెదిరింపులు, గందరగోళం లాంటివి లేకుండా ఉంటే మరీ మంచిది. అప్పుడే.. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో ఒప్పందానికి అవకాశం ఉంటుంది.అలాగని ఈ సమస్యలు తేలికగా.. త్వరగా పరిష్కారమవుతాయన్నది నేను అనుకోవడం లేదు. కానీ రెండు పక్షాల్లోనూ మంచి నమ్మకం ఉంటుందని.. అదే మార్గం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది అని భావిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంతర్జాతీయ సంబంధాలను తన వ్యక్తిగత సంబంధాలతో పోల్చుకుంటారు. ఉదాహరణకు.. ట్రంప్ మోదీ(modi) మధ్య మంచి సంబంధం ఉంటే.. ఆయన దృష్టిలో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నట్లే అని బోల్టన్ చెప్పారు. కాబట్టి ఇరు దేశాధినేతల మధ్య ప్రజాస్వామ్యానికి హాని కలిగించే గొడవలు కాకుండా.. నిజమైన వ్యూహాత్మక చర్చలు జరగాలని బోల్టన్ ఆశించారు.ఇదిలా ఉంటే.. భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ టారిఫ్లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.అయినప్పటికీ రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. భారత్ను టారిఫ్ మహారాజా అని పిలుస్తూ.. రష్యా చమురు కొనుగోలుపై బ్లడ్ మనీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన ఆరోపణలు అబద్ధమని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. అంతేకాదు.. భారతీయ సోషల్ మీడియా యూజర్లను కీబోర్డ్ మినియన్స్(తెలివి తక్కువ, పనికి మాలిన అని నానార్థాలు వస్తాయి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు భారతీయులు నవారోని టార్గెట్ చేస్తూ పోస్టులతో తిట్టిపోస్తున్నారు. -
భారత్, అమెరికా వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం
-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
-
Charlie Kirk: ట్రంప్ మిత్రుడు చార్లీ కిర్క్ దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం. యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ తేల్చిచెప్పారు. కిర్క్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి ఇదొక చీకటి రోజు, దేశానికి విషాదభరిత దినమని అని చెప్పారు. హంతకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అతడికి మరణశిక్ష తప్పదని పేర్కొన్నారు. తొక్కిసలాట.. విషాద ఛాయలు కిర్క్ హత్య తర్వాత యూనివర్సిటీలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. బుల్లెట్ పేలిన శబ్దం వినిపించడం, వెంటనే కిర్క్ కింద పడిపోవడం చూసి విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 3,000 మంది ఉన్నారు. అరుపులు, రోదనలతో విషాదం అలుముకుంది. ఈ గందరగోళం మధ్యే నల్లరంగు దుస్తుల్లో ఉన్న హంతకుడు అందరి కళ్లుగప్పి సులభంగా తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, ఈ ఘటనతో వారికి సంబంధం లేదని తేలింది. అనంతరం వారిని వదిలేశారు. హత్యకు సంబంధించి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. యూనివర్సిటీ పోలీసు డిపార్టుమెంట్కు చెందిన ఆరుగురు అధికారులతోపాటు కిర్క్ సొంత భద్రతా సిబ్బంది ఘటనా స్థలంలోనే విధుల్లో ఉన్నా వేలాది మంది సమక్షంలో హత్య జరగడం గమనార్హం. మహోన్నత వ్యక్తి: ట్రంప్ తన మద్దతుదారుడైన చార్లీ కిర్క్ మృతిపట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అతడొక మహోన్నత వ్యక్తి అని శ్లాఘించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఒక పోస్టుచేశారు. వైట్హౌస్ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. సత్యం, స్వేచ్ఛ కోసం కిర్క్ అమరుడయ్యాడని కొనియాడారు. కిర్క్ హత్యకు విప్లవæ వామపక్షవాదులే కారణమని ఆరోపించారు. కిర్క్కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను ట్రంప్ గురువారం ప్రకటించారు.ఎవరీ కిర్క్? చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కారి్మకుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు.ఇదీ చదవండి: ఆయనతో జాగ్రత్త.. ట్రంప్ మనవరాలికి నెటిజన్ల సూచనతుపాకీ స్వాదీనం కిర్క్కు చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్ను స్వా«దీనం చేసుకున్నట్లు ఎఫ్బీఐ గురువారం ప్రకటించింది. దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అతడు కాలేజీ విద్యార్థి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలియజేసింది. -
మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా..
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా మంచి మిత్రుడని, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే కొన్ని వారాల్లోనే మోదీతో సంభాషిస్తానని తెలిపారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. ఈ చర్చలు విజయవంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చర్చలను సానుకూలమైన ముగింపునకు తీసుకురావడంలో ఇబ్బందులేవీ లేవని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్, అమెరికా నడుమ వాణిజ్యపరమైన అవరోధాలు కచ్చితంగా తొలగించుకుంటామని పేర్కొన్నారు. భారత్తో సంబంధాలను బలహీనపర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని ట్రంప్ తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. ‘‘మోదీ గొప్ప ప్రధానమంత్రి. ఆయన నాకు ఎప్పటికీ మంచి మిత్రుడే. మేము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాం’’ అని ట్రంప్ శుక్రవారం వైట్హౌస్లో వ్యాఖ్యానించారు. -
ట్రంప్ పోస్ట్ను రీట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Trump: అశ్వత్థామ హతః.. కుంజరః!
కురుక్షేత్ర యుద్ధంలో.. అశ్వత్థామ అనే ఏనుగు మరణిస్తుంది. అయితే.. ద్రోణాచార్యుడిని మట్టుబెట్టడానికి ఇదే మంచి తరుణమని శ్రీకృష్ణుడు భావిస్తాడు. ఆయన సూచన మేరకు అశ్వత్థామః హతః అని గట్టిగా.. కుంజరః(ఏనుగు)అని ధర్మరాజు నెమ్మదిగా విలపిస్తాడు. తన కుమారుడే చనిపోయాడని భావించి యుద్ధాన్ని వదిలిపెట్టి ధ్యానంలోకి వెళ్తాడు ద్రోణుడు. అదను కోసం ఎదురు చూస్తున్న ధృష్టద్యుమ్నుడు (ద్రుపదరాజు కొడుకు) ద్రోణుడ్ని హతమారుస్తాడు. అమెరికా మిత్రదేశం ఖతార్ విషయంలోనూ ట్రంప్ ఇదే తరహా స్ట్రాటజీ ఫాలో అయ్యారా? అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు.. 2025 సెప్టెంబర్ 9న.. ఇజ్రాయెల్ సైన్యం ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు జరిపింది. హమాస్ నేతలే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాల డబుల్ గేమ్ బయటపడింది.గాజా కాల్పుల విమరణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా.. ట్రంప్ హమాస్కు చివరి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హమాస్ అగ్రనేతలు హుటాహుటిన దోహాలో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే దాడి జరిగింది. ఫలితంగా.. హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.. దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చాం: టెల్అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని) వర్గాలుఅవును.. ఇజ్రాయెల్ సమాచారం అందించిన వెంటనే.. దాడి గురించి ఖతార్(Qatar)కు సమాచారం ఇచ్చాం: అమెరికాదాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత యూఎస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పేలుళ్లు కొనసాగుతుండగానే అమెరికా అధికారి ఒకరు ఆ సమాచారం అందించారు: ఖతార్ విదేశాంగ శాఖ అధికారిఅమెరికా- ఖతార్ల మధ్య బంధం ఇటీవల బలపడింది. అధ్యక్ష హోదాలో తొలిసారి గల్ఫ్ దేశంలో పర్యటించిన ట్రంప్.. 400 మిలియన్ డాలర్ల విలువ చేసే విలాసవంతమైన విమానాన్ని ఖతార్ నుంచి బహుమతిగా అందుకున్నారు. ప్రతిగా.. ఆ దేశ పర్యటనలో 243 బిలియన్ డాలర్ల కీలక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పైగా ట్రంప్ కొడుకు ఎరిక్ కూడా అక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటునకు ఒప్పందం చేసుకున్నాడు. పైగా ఇరాన్కు ఖతార్ మిత్రదేశం కావడంతో.. టెహ్రాన్ బ్యాక్ చానెల్ కమ్యూనికేషన్లాగా ట్రంప్ పరిగణిస్తున్నారు. వీటన్నింటికి తోడు.. పశ్చిమాసియాలో తన దౌత్య ప్రయత్నాలకు ఈ గల్ఫ్ దేశం కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటప్పుడు.. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేయడం, శాంతిదూత ట్రంప్ దానిని చూస్తూ ఉండిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో.. ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి గందరగోళమైన ప్రకటనలు వెలువడ్డాయి. దాడి గురించి తాము సమాచారం ఇచ్చామని.. తమకు సమాచారం అందిందని చెప్పిన ఇజ్రాయెల్, అమెరికాకు కొద్దిగంటలకే మాట మార్చాయి. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ దాడి గురించి తెలియజేయాలని పశ్చిమాసియా రాయబారి విట్కాఫ్ను ట్రంప్ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. దాడి గురించి ముందే చెప్పామంటూ హడావుడిగా వివరణ ఇచ్చారు. అనంతరం దాడికి సంబంధించిన నిర్ణయం తాను తీసుకోలేదని.. మరోసారి ఇలాంటి దాడులు జరగవని హామీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక.. ఈ దాడి పూర్తిగా తమ చర్యేనని, ఇందులో యూఎస్ ప్రమేయం లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటమార్చారు.మెహ్దీ హసన్ అనే జర్నలిస్టు.. ‘ట్రంప్ ఖతార్ నుంచి విమానం తీసుకున్న తర్వాత అదే దేశంపై బాంబింగ్కు అంగీకారం ఇచ్చాడా?’’ అంటూ విమర్శించారు. డాక్టర్ అండ్రెస్ క్రెయిగ్ అనే విశ్లేషకుడు: ‘‘ఖతార్కు ముందుగా సమాచారం ఇచ్చినట్లైతే, ప్రాణనష్టం జరగకుండా చూసుకునేవారు’’ అని ట్వీట్ చేశారు.ఏది ఏమైనా.. ఈ దాడి నేపథ్యంలో అరబ్ దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఖతార్పై జరిగిన దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాయి. ఇది అమెరికాకు ఒకరకంగా మింగుడు పడని విషయమే. మరోవైపు.. ఖతార్లో గాజా చర్చల కోసం హమాస్ నేతలు భేటీ అయినప్పుడే ఈ దాడి జరిగింది. దీంతో.. శాంతి చర్చలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. -
భారత్ పట్ల ట్రంప్ మరో ట్విస్ట్.. 100 శాతం సుంకాలు విధించాలని..
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ తనకు మిత్రుడు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్పై 100 శాతం సుంకం విధించాలని ఈయూ దేశాలకు సూచించినట్లు తెలుస్తోంది.కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి వాణిజ్యం చేస్తున్న పలు దేశాలను ట్రంప్ చేశారు. భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలుచేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు.మరోవైపు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
ద్వైపాక్షిక ఒప్పందానికి కృషి
న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇరుపక్షాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యపరమైన అవరోధాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మోదీ ప్రతిస్పందించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్రకటనను పరోక్షంగా స్వాగతించారు. India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl— Narendra Modi (@narendramodi) September 10, 2025 భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. రెండు మిత్ర దేశాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి వాణిజ్య చర్చలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల పౌరులకు మేలు జరిగేలా, ఉజ్వల భవిష్యత్తు ఉండేలా తాము కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. మోదీ–ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో అనుసంధానం గత నాలుగో రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం. భారత్–అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పగా, అందుకు మోదీ ఈ నెల 6న హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల బంధంపై ట్రంప్ అభిప్రాయాన్ని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత్పై ట్రంప్ సర్కార్ మండిపడుతోంది. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సంబంధాలను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం త్వరలో ఇండియాకు రానుంది. అమెరికా నుంచి భారత నావికాదళం పీ–8ఐ లాంగ్ రేంజ్, మల్టిమిషన్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్లు కొనుగోలు చేస్తోంది. దీనిపై త్వరలో ఇరుపక్షాల మధ్య తుది చర్చలు జరుగనున్నాయి. -
మోదీతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. -
జీన్ కరోల్ పరువు నష్టం కేసు.. ట్రంప్కు ఎదురు దెబ్బ
కాలమిస్ట్ ఈ. జీన్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ 8.33 కోట్ల డాలర్లు(సుమారు రూ.733 కోట్లు) చెల్లించాలంటూ సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును న్యూయార్క్లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ట్రంప్ చేసిన అప్పీల్ను తోసిపుచ్చింది. జ్యూరీ పేర్కొన్న పరిహారం సహేతుకంగానే ఉందని సోమవారం రూలింగ్ వెలువరించింది.అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ చేసిన వాదనను తిరస్కరించింది. 1996లో మన్హట్టన్ డిపార్టుమెంట్ స్టోర్లో జీన్ కరోల్పై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై కోర్టు ఆయనకు 5 మిలియన్ డాలర్ల(రూ.400 కోట్ల) జరిమానా విధించింది. గత డిసెంబర్లో అప్పీల్స్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా.అయితే, సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పదేపదే జీన్ కరోల్ లక్ష్యంగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. -
ట్రంప్ తీరుతో ఇబ్బందిపడ్డ మనవరాలు!
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ క్వీన్స్ వేదిక వద్దకు ట్రంప్ రాక సందర్భంగా భద్రతా తనిఖీలతో అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో.. అర్థర్ యాష్ స్టేడియం రోల్స్ బాక్స్ వద్దకు వచ్చి అభివాదం చేసిన ఆయనకు.. చీర్స్తో పాటు బూస్(నిరసనగా చేసే నినాదాలు) స్వాగతం పలికాయి. తమను ఇబ్బందిపెట్టినందుకు టెన్నిస్ అభిమానులు ఆయన్ని తిట్టిపోశారు. ఈ క్రమంలో.. మరో ఆసక్తికరమైన అంశమూ తెర మీదకు వచ్చింది.ట్రంప్ మనవరాలు అరబెల్లా కుష్నర్(18) ఆయన తీరుతో ఇబ్బందిపడినట్లుగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కాగా.. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు అరబెల్లా. ట్రంప్ కుటుంబంతో తరచూ ఈమె మీడియా కంట కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్ కోసం ట్రంప్ అల్లుడిని, మనవరాలిని, వైట్హౌజ్ సిబ్బందినీ వెంటపెట్టుకుని వచ్చారు. ఆ సమయంలో అరబెల్లా ఆందోళనగా కనిపించగా.. ట్రంప్ ఆమెతో ఏదో అన్నారు. దీంతో ఆమె ముఖం చిన్నబోయింది. ఆపై ట్రంప్ పక్కన నిల్చునేందుకు కూడా ఆమె అయిష్టంగా కనిపించింది. అప్పటి నుంచి ఈవెంట్ అయ్యేదాకా ఆమె ముభావంగా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. లిప్ రీడర్ నికోలా హిక్లింగ్ చెబుతోంది ఏంటంటే.. అరబెల్లా తన బ్యాగ్, ఫోన్ కోసం ఆందోళన వ్యక్తం చేసింది. Where is my bag?(నా బ్యాగ్ ఎక్కడ?) అని అడిగింది. దానికి ఆమె తండ్రి కుష్నర్ I don’t have it(నాకు తెలియదు) అని సమాధానమిచ్చారు. ఈలోపు.. తాత ట్రంప్ను తనకు దారి ఇవ్వమని కోరగా.. ఆయన నువ్వు అక్కడే ఉండు అని చెప్పారు. దీంతో ఆమె అయిష్టంగా అలా నిలబడి పోయారు. ఇదిలా ఉంటే.. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్రంప్ అక్కడ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను టెలికాస్ట్ చేయొద్దని బ్రాడ్కాస్టర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్నకు తగిలిన నిరసన సెగ, అంతకుమించి అరబెల్లా వైరల్ వీడియో బయటకు వచ్చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రంప్ కుటుంబ సంబంధాలపై చర్చ ప్రారంభించారు. ఆమె ముఖంలో ఆందోళన, అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని.. పాపం అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. అరబెల్లాకు ట్రంప్ పక్కన నిలబడడానికి ఇష్టపడలేదని.. అందుకే తండ్రి చెంతకు చేరిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ట్రంప్ కుటుంబం నుంచి ఆమె బయటకు రావడం ఖాయమంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. Arabella Kushner aged 13 in the green dress does not want to stand next to the pedophile. pic.twitter.com/seJ35nY1SB— KT "Special MI6 Operation" (@KremlinTrolls) September 7, 2025 -
భారత్పై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు అయ్యింది.భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై అడిగిన ప్రశ్నకు జెలెన్స్కీ సమాధానం ఇస్తూ.. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్యే. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి ఉక్రెయిన్కు ఆహ్వానించకపోవడం విచారకరమని కామెంట్స్ చేశారు. అయితే, మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా ఆయన నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.కాగా.. ఇటీవల కాలంలో ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నుంచి భారత్పై ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యేలా చూసే బాధ్యత తమదే అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
మోదీజీ.. ట్రంప్ అవమానాలు మర్చిపోయారా?: శశిథరూర్
ఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త మాటల మర్మమేమిటో తెలుసుకోవాలన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతించాలని.. ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీకి సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు.భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. భారత్ అనుకూల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం.రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేం అని కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Thiruvananthapuram: On PM Modi's response to US President Donald Trump speaking positively on India-US relationship, Congress MP Shashi Tharoor says, "The Prime Minister was very quick to respond, and the Foreign Minister has also underscored the importance of the basic… pic.twitter.com/Iju3uZUkzl— ANI (@ANI) September 7, 2025ఇదిలా ఉండగా.. భారత్పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మోదీ వెంటనే స్పందిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత-అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు. -
ట్రంప్కు టెన్షన్.. అదే జరిగితే వసూలు చేసిందంతా కక్కాల్సిందే!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తూ ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. సుంకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన బిలియన్ డాలర్ల ఆదాయం రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా మీట్ ది ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల విషయమై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. కోర్టు తీర్పును ట్రంప్కు అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం.. మేము దాదాపు సగం సుంకాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా ట్రెజరీకి భయంకరంగా మారుతుంది. తిరిగి చెల్లింపులను జారీ చేయడానికి పరిపాలన సిద్ధంగా ఉందా లేదా? అనేది తేలాలి. అదే జరిగితే పలు దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందంతా అమెరికా కక్కాల్సి ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టులో ట్రంప్ అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్కు భారీ సుంకాలను విధించే అధికారం లేదని రెండు ఫెడరల్ కోర్టులు తేల్చిన తర్వాత బెసెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు బ్రేకులు పడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని పేర్కొంటూ ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. ఎమర్జెన్సీ అధికార చట్టం ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని ఇటీవల అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొనడంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీం తలుపుతట్టింది.నవంబర్ ప్రారంభంలోనే ఈ కేసుపై వాదనలు వినాలని సొలిసిటర్ జనరల్ డి.జాన్ సావర్ న్యాయమూర్తిని కోరారు. ‘అప్పీల్స్ కోర్టు నిర్ణయం అధ్యక్షుడు ఐదు నెలలుగా విదేశాలతో కొనసాగిస్తున్న చర్చలను అనిశ్చితిలోకి నెడుతుంది. ఇప్పటికే పూర్తయిన చర్చలను, జరగబోయే చర్చలను ప్రమాదంలో పడేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వాదనను లిబర్టీ జస్టిస్ సెంటర్ వ్యాజ్య డైరెక్టర్, సీనియర్ న్యాయవాది జెఫ్రీ ష్వాబ్ తోసిపుచ్చారు. ‘చట్టవిరుద్ధమైన సుంకాలు చిన్న వ్యాపారాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఈ కేసులో మా క్లయింట్లకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై వ్యాపార వర్గాలు ఇప్పటికే రెండు న్యాయస్థానాల్లో పైచేయి సాధించాయి. -
‘బందీ ఒప్పందం’పై హమాస్కు ట్రంప్ తుది హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో రాశారు.‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి ఇప్పటికే హమాస్ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్ అన్నారు. .@POTUS: "I think we're going to have a deal on Gaza very soon. It's a hell of a problem... I think we're going to get [all the hostages]." pic.twitter.com/KZmYAEFLQn— Rapid Response 47 (@RapidResponse47) September 7, 2025గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అన్నారు. హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు. -
షికాగోపై ట్రంప్... రణన్నినాదం!
వాషింగ్టన్/షికాగో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం చివరికి సొంత దేశాన్ని కూడా వదలడం లేదు. అమెరికాలో మూడో అతి పెద్ద నగరమైన షికాగోపై ఆయన అక్షరాలా యుద్ధమే ప్రకటించారు! విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆధిపత్యమున్న షికాగో నుంచి వలసదార్లను వెళ్లగొట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికా రక్షణ శాఖ పేరునే ఏకంగా యుద్ధ శాఖగా మారుస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. 1979లో వియత్నాం యుద్ధం సమయంలో తెరకెక్కించిన ‘అపోకలిప్స్ నౌ’ చిత్రం పోస్టర్ను అనుకరిస్తూ ‘షిపోకలిప్స్ నౌ’ పేరిట ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రంప్ స్వయానా పోస్టు చేశారు. షికాగోపై ఎగురుతున్న హెలికాప్టర్లు, నీటిపై ప్రజ్వరిల్లుతున్న మంటలు అందులో కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో యుద్ధోన్మాది అయిన లెఫ్టినెంట్ కల్నల్ కిల్గోర్ పాత్రలో ట్రంప్ దర్శనిమిస్తున్నారు. అందులోని ఫేమస్ డైలాగ్ను గుర్తుకు తెస్తూ ‘ఈ ఉదయం డిపోర్టేషన్ల వాసనను ఆస్వాదిస్తున్నా’ అంటూ పోస్టు చేశారు. ‘డిపార్టుమెంట్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటున్నామో షికాగో తెలుసుకోనుంది’ అని పేర్కొన్నారు. బాల్టిమోర్, న్యూ ఆర్లీన్స్కు సైతం ఇలాంటి ట్రీట్మెంట్ తప్పదంటూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. పోర్ట్ల్యాండ్, ఒరెగాన్పైనా గురిపెట్టారు. షికాగోకు నేషనల్ గార్డ్ దళాలు, ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను కూడా పంపించబోతున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ విపక్ష డెమొక్రటిక్ పార్టీకి బలమున్న ప్రాంతాలే కావడం గమనార్హం. లాస్ ఏంజెలెస్లో ఇ్పటికే నేషనల్ గార్డ్ దళాలను రంగంలోకి దించడం తెలిసిందే. ఇప్పుడు షికాగోలో వాటితో పాటు ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించబోతున్నారు.భయం గుప్పెట్లో షికాగో ట్రంప్ హెచ్చరికలతో షికాగోలోని విదేశీయులు, ప్రధానంగా లాటిన్ మూలాలున్న వాళ్లు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ పౌరసత్వాన్ని ధ్రువీకరించుకోవడానికి అమెరికా పాస్పోర్టులను నిత్యం దగ్గరే ఉంచుకుంటున్నారు. ట్రంప్ తీరును నిరసిస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో జనం కదం తొక్కుతున్నారు. ఉడుత ఊపులకు బెదరం: ప్రిట్జ్కెర్ ట్రంప్ తీరును ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి.ప్రిట్జ్కెర్ తప్పుపట్టారు. ఆయన నియంతగా మారజూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘సొంత దేశంలోని నగరంపై యుద్ధోన్మాదం ప్రదర్శిస్తున్నారు. ఇది జోక్ కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. ట్రంప్ బలమైన నాయకుడు కాదు. పిరికి వ్యక్తి అలాంటి వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడబోరు’’ అని తేల్చిచెప్పారు. -
శ్రుతి మించుతున్న ట్రంప్... వెనెజువెలాపై యుద్ధం!
వాషింగ్టన్: ఆసియా, యూరప్ అనంతరం అమెరికా ఖండాన్ని సైతం యుద్ధ మేఘాలు వేగంగా కమ్ముకుంటున్నాయి. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. వెనెజులాలో డ్రగ్స్ కార్టెళ్ల విధ్వంసం ముసుగులో అక్కడి అపార చమురు నిక్షేపాలను చేజిక్కించుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో భీకర, భారీ క్షిపణులను వెనెజువెలాపైకి ఎక్కుపెట్టింది. ట్రంప్ ఊ అన్న మరుక్షణమే విరుచుకుపడేందుకు అమెరికా యుద్ధనౌకలు, అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ బాహుబలి దాడిని కాచుకునేందుకు నిరుపేద వెనెజువెలా కాలూ చేయీ కూడదీసుకుంటోంది. యుద్ధాలను ఆపేస్తానంటూ ఆదర్శాలు వల్లించి రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ ఈ ఎనిమిది నెలల్లో ఏ యుద్ధాన్నీ ఆపలేకపోగా ఇలా పొరుగు ఖండంలోనే స్వయంగా రణన్నినాదాలకు దిగుతుండడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనెజువెలా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకూ వెనుకాడబోమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనెజువెలాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యూఎస్ఎస్ గ్రేవ్లీ, యూఎస్ఎస్ జాసన్ డన్హమ్ ఆగమేఘాలపై దక్షిణ కరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి వెనెజువెలాపైకి గైడెడ్ మిసైల్స్ ఎక్కుపెట్టాయి. అప్పటికే అక్కడున్న డి్రస్టాయర్ నౌక యూఎస్ఎస్ సామ్సన్ వాటికి తోడైంది. ఇవి చాలవన్నట్టు పసిఫిక్ మహా సముద్రం నుంచి యూఎస్ఎస్ లేక్ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ సాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడెర్డేల్ వంటి యుద్ధ నౌకలూ యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనెజువెలా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను అష్టదిగ్బంధనం చేశాయి. 4,000 మంది సెయిలర్లు, మెరైన్ కమెండోలు సిద్ధంగా ఉన్నారు. వెనెజువెలా డ్రగ్స్ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకు తరలించి ఉంచింది!వెనెజువెలా ‘తగ్గేదే లే’! సైనికపరంగా అమెరికాతో వెనెజువెలా ఏమాత్రం తూగలేదు. అమెరికా, యూరప్ కఠిన ఆంక్షల దెబ్బకు నికొలాస్ మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ, సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. ఉన్నవల్లా కాలం చెల్లిన పాతకాలపు ఎఫ్–16 యుద్ధ విమానాలే! సైన్యం కూడా 1.5 లక్షల కన్నా లేదు. అన్ని విభాగాలూ కలిపినా 3.5 లక్షల లోపే! అయినా సరే, అమెరికా వంటి తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరతామని మదురో ఇటీవలే ప్రకటించారు. అతి త్వరగా ఏకంగా 50 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తానని చెప్పారు! చమురు నిక్షేపాలపై కన్ను పేద దేశమైనా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు వెనెజువెలా కేంద్రం. దేశంలో దాదాపు 48 వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. అమెరికా కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. వెనెజువెలా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామన్నారు! మరోవైపు కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచివేశారు. దాంతో మదురోను పట్టించినవారికి రూ.450 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలాలో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 90 శాతం చమురు కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. -
‘మోదీజీ దేశం మొత్తం మీ వెనకే ఉంది.. మీ దమ్మేంటో ట్రంప్కు చూపించండి’
న్యూఢిల్లీ: ‘మోదీజీ..ట్రంప్కు మీ దమ్మేంటో చూపించండి. యావత్దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్కు మీ దమ్మేంటో చూపించండి. దేశం మొత్తం మీ వెనుక ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తలవంచుతాడో లేదో చూడండి’అని అన్నారు.ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్లో రూ.900 కన్నా తక్కువ ధర వస్తుంది. అమెరికా రైతులు ధనవంతులు అవుతారు, గుజరాత్ రైతులు బీదవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పత్తి పంట చేతికొచ్చే సమయం అక్టోబర్-నవంబర్లో ఉండటంతో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అప్పుల బారిన పడతారని, చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు వారు అప్పు ఎలా తీర్చాలి?’అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి దాసోహమైందని ఆరోపించిన కేజ్రీవాల్ .. ట్రంప్కు మోదీ తలవంచారు. ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. మోదీ 100 శాతం సుంకం విధించాలని సూచించారు. -
‘నోబెల్ బహుమతి కావాలంట’.. ట్రంప్పై విరుచుకుపడ్డ సల్మాన్ ఖాన్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బిగ్బాస్ 19వ (Bigg Boss 19) సీజన్ తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్గా వ్యవహరిస్తున్న సల్మాన్.. హౌస్లో ఉన్న కంటెస్ట్ల తీరును ప్రశ్నించారు. కొంతమంది కంటెస్టులు వివాదాలకు ఆజ్యం పోస్తుంటారు.పైకి మాత్రం శాంతిదూతలుగా నటిస్తుంటారని అని మండిపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే? ఈ ప్రపంచంలో ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్న వారే తమకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటుంటారు’అని ఎద్దేవా చేశారు.ఇంతకీ ఏం జరిగిందంటే?సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ ఫర్హానా భట్ గురించి మాట్లాడారు.‘తనను తాను శాంతి దూతగా చెప్పుకునే ఫర్హానా.. అందుకు అనుగుణంగా లేదు. ఆమె తరచుగా కంటెస్టెంట్ల మధ్య తగాదాలను ప్రేరేపించడం,అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది. అంటూ (‘యే హో క్యా రహా హై? పూరీ దునియా మే జో సబ్సే జ్యాదా ట్రబుల్ ఫైలా రహే హైం, ఉంకో హై శాంతి బహుమతి చాహియే’). శాంతి దూతలని చెప్పుకునే తిరేవారు గొడవలు పరిష్కరించి,ప్రజలను కలిపే వ్యక్తి కావాలి. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా?. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సమస్యలు సృష్టించే వాళ్లే శాంతి బహుమతులు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ పేరును సల్మాన్ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా అధ్యక్షుడిపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Megastar #SalmanKhan trolling Donald Trump 😂😭 #BiggBoss19"Is Dunia me jo sabse jyada trouble faila rahe h, unhe hi peace prize chahiye" pic.twitter.com/Z4SfUNm1Lb— MASS (@Freak4Salman) September 7, 2025 నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ఆశలపై భారత్ నీళ్లు చల్లింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందనే అక్కుసతో భారత్పై టారిఫ్లు మోపుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారత్పై ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవని హైలెట్ చేసింది. -
సుంకాల వివాదం.. రంగంలోకి భారత్ తరపున జాసన్ మిల్లర్
వాషింగ్టన్: భారత్- అమెరికా మధ్య సుంకాల వివాదం నడుస్తున్న తరుణంలో భారత అనుసంధానకర్త జాసన్ మిల్లర్ వాషింగ్టన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు అధికారులను కలుసుకున్నారు. ట్రంప్ యంత్రాంగంతో దౌత్యపరమైన సంబంధాలను నెరవేర్చేందుకు భారత్ కొన్ని నెలల క్రితం జాసన్ మిల్లర్ను అనధికారిక అనుసంధానకర్తగా నియమించుకుంది.అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకున్న మిల్లర్ ‘ఎక్స్’లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకునే అవకాశం లభించింది. పలువురు అధికారులను కూడా కలుసుకున్నాను. గొప్ప పనికి ఇది నాంది కానుంది’ అని రాశారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఎజెండాను మిల్లర్ వెల్లడించనప్పటికీ, అమెరికా-భారత ద్వైపాక్షిక ఆర్థిక వ్యూహాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. అలాగే ట్రంప్, మిల్లర్ల భేటీ కీలకంగా మారింది. ట్రంప్కు సన్నిహితుడైన మిల్లర్ భారత్కు దౌత్యపరమైన అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. Fantastic week in Washington with so many friends being in town, topped off of course by having the opportunity to stop in and see our President in-action!Keep up the great work, @POTUS @realDonaldTrump! pic.twitter.com/G28hsKTUgd— Jason Miller (@JasonMiller) September 6, 2025రాజకీయ వ్యూహకర్త, జాసన్ మిల్లర్ 2016, 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో డోనాల్డ్ ట్రంప్కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. కాగా పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఈ పరిణామాల గురించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మిల్లర్కు పరిస్థితి గురించి నిశితంగా వివరించింది. మిల్లర్ ఈ పరిణామాలను అమెరికా అధికారులకు తెలియజేశారు. ఈ నేపధ్యంలో అమెరికా కాంగ్రెస్లోని 100 మందికి పైగా సభ్యులు భారతదేశానికి మద్దతు ప్రకటించారు. -
భారత్కు ‘ఎలాన్ మస్క్’ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్
వాష్టింగన్: ఇటీవలి కాలంలో భారత్ను టార్గెట్ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు, యూఎస్కు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాట్లాడుతున్న వారి లిస్టులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్పై నవాలో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. నవారో ఆరోపణలు అబద్ధమని ‘ఎక్స్’ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. దీంతో, నవారోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితమ నవారో ట్విట్టర్(ఎక్స్) వేదికగా..‘భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా.. ‘రష్యాకు భారత్ లాండ్రోమ్యాట్లా పనిచేస్తోంది. మీకు తెలుసా.. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. మనం దానిని అడ్డుకోవాలి. అది ఉక్రెయిన్ వాసులను చంపుతోంది. మనం (అమెరికన్లు) చెల్లింపుదారులుగా ఏం చేయాలో అది చేయాలి’ అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.Trump aide Peter Navarro lashes out at India over Russian oil, accuses it of “profiteering” & fueling Moscow’s war machine. Musk’s X fact-checks him, calling out US double standards. Navarro fumes: “Elon is letting propaganda in.” https://t.co/0Bq0SIgPGm via @indiatoday pic.twitter.com/r4jCnATbBm— Ashok Upadhyay (@ashoupadhyay) September 7, 2025ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని తేల్చింది. అనంతరం, ఈ ఫ్యాక్ట్ చెక్పై నవారో భగ్గుమన్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ పిచ్చి ప్రేలాపణలు చేశారు. దీనిపై కూడా ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఇక, భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. -
మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్
-
భారత్ దెబ్బకు భయంతో వణికిపోతున్న బ్లాక్ మెయిల్ ట్రంప్!
-
త్వరలో దక్షిణ కొరియాకు ట్రంప్.. జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశంలో చర్చలు జరిపే అవకాశాలున్నాయిని, ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 🚨#BREAKING | US President Donald Trump is planning a visit to South Korea for the APEC summit in October, with a potential high-stakes meeting with China's Xi Jinping being discussed.Details Here: https://t.co/6mmh7wwhNa#DonaldTrump #SouthKorea #XiJinping #China— The Headliner (@TheHeadliner_in) September 7, 2025అక్టోబర్ చివరి నుండి నవంబర్ ప్రారంభం వరకూ జియోంగ్జు నగరంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ తో పాటు ఆయన అగ్ర సలహాదారులు కూడా హాజరుకానున్నారు. గత నెలలో ఈ ఇద్దరు అధినేతల మధ్య ఫోనులో సంభాషణ జరిగింది. ఈ నేపధ్యంలో ట్రంప్, అతని భార్య మెలానియాలను జిన్పింగ్ చైనా సందర్శనకు ఆహ్వానించారు. అయితే ఈ పర్యటన అక్టోబర్లో జరగనున్నప్పటికీ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ విదేశీ పర్యటనను ముగించే ముందు ఇతర దేశాలు వెళతారా లేదా అనేది కూడా ఇంకా వెల్లడికాలేదు.ట్రంప్ తన విదేశీ పర్యటన సందర్భంగా అమెరికాకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని యోచిస్తున్నారు. ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా పలు దేశాలలో పర్యటించినప్పుడు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.మరోవైపు జిన్పింగ్ ఇటీవల కిమ్, వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆతిథ్యం ఇచ్చారు. దీనిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. -
‘ట్రంప్కు అభినందనలు’.. దోస్తీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ రియాక్షన్
న్యూఢిల్లీ: అమెరికా- భారత్ల సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ భావాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నానని అన్నారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ‘మా బంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తపరిచిన భావాలను, ఆయన సానుకూల అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను. భారత్- అమెరికాలు సానుకూల, దార్శనిక, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అని అన్నారు. సుంకాల విషయంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించడం ఆసక్తకరంగా మారింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025దీనికిముందు ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవని అనడమే కాకుండా, తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామన్నారు. అయితే భారత్ రష్యన్ చమురు దిగుమతులను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ప్రస్తుతం చేస్తున్న దానిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో వాణిజ్య చర్చలు చక్కగా జరుగుతున్నాయని కూడా అమెరికా అధ్యక్షుడు అన్నారు. కాగా భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు ఇప్పుడు 50 శాతానికి మించి ఉన్నాయి. భారతదేశం ఈ చర్యను ఖండించింది. దీనిని అన్యాయం, అసమంజసమైనదని పేర్కొంది. -
దోస్త్ మేరా దోస్త్!
న్యూయార్క్/వాషింగ్టన్: నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికీ మారుతూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. రష్యా, చైనాతో పాటు భారత్పైనా ఒంటికాలిపై లేచి ఒక్కరోజైనా గడవకుండానే షరామామూలుగా ప్లేటు ఫిరాయించారు. భారత్పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్తో అమెరికాకు ‘ప్రత్యేక బంధ’ముంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది కూడా’’ అని శుక్రవారం (అమెరికా కాలమానం ప్ర కారం) వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మీడియా భేటీ సందర్భంగా మీడియా ప్రశ్నలకు బదులుగా చెప్పుకొచ్చారు. మోదీ కూడా అందుకు అత్యంత హుందాగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షుని తాలూకు ఈ మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత–అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు. భారత్, అమెరికాలది అత్యంత సానుకూల, ప్రగతి శీల, సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వా మ్యం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూన్ 17 నాటి ఫోన్ సంభాషణల అనంతరం ట్రంప్, మోదీ పరస్పరం స్పందించడం ఇదే తొలిసారి. ప్రతీకార సుంకాల కారణంగా దిగజారిన ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు అమెరికా, భారత్ సంసిద్ధతకు ఇది నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. నిమిషానికో మాట... భారత్, రష్యాలను దుష్ట చైనాకు కోల్పోయామంటూ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ ఘాటుగా పోస్టు పెట్టడం తెలిసిందే. ఆ మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ‘యుద్ధమా, శాంతా అమెరికాయే తేల్చుకోవా’లన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలకు స్పందనగా ట్రంప్ పెట్టిన ఆ పోస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయన ఒంటెత్తు పోకడల కారణంగా అమెరికాతో భారత సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోవడం తెలిసిందే. వాటిని పూర్తిస్థాయిలో చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు. అందుకాయన రకరకాలుగా స్పందించారు. ‘‘ఇరుదేశాల సంబంధాల విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. ఏదో, అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది’ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. ‘‘మోదీతో నేను చాలా చనువుగా ఉంటా తెలుసా! ఆయన చాలా గొప్ప వ్యక్తి. రెండు నెలల క్రితమే అమెరికాలో పర్యటించారు కదా!’’ అంటూ ప్రధానిపై మరోసారి పొగడ్తలు కురిపించారు. ‘‘ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి రోజ్ గార్డెన్లో వ్యాహ్యాళికి వెళ్లాం. అక్కడి గడ్డి చెప్పలేనంత తడిగా ఉంది. మీడియా కాన్ఫరెన్స్కు అస్సలు సరైన ప్రదేశం కాదది. అలాంటి చోట ప్రెస్మీట్ పెట్టడం నాకదే చివరిసారి’’ అని చెప్పుకున్నారు. అంతలోకే, ‘మోదీ ప్రస్తుతం చేస్తున్న పనే నాకస్సలు నచ్చడం లేదు’ అంటూ రష్యా, చైనాలతో భారత మైత్రిపై తన ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ‘అయినా సరే, భారత్తో అమెరికాకు అత్యంత ప్రత్యేక బంధముంది’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘అంతలోకే, రష్యా నుంచి భారత్ అంతంత భారీగా చమురు కొనేస్తుండటం నాకస్సలు నచ్చడం లేదు. ఇది నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది’’ అంటూ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు. ‘‘ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలి. అందుకేగా భారత్పై అతి భారీగా 50 శాతం సుంకాలు విధించా!’’ అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మోదీపై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత్ను చైనాకు కోల్పోయామంటూ మీరు చేసిన పోస్టు నిజమేనా అని మీడియా ప్రశ్నించగా, అలా జరిగిందని తాను అనుకోవడం లేదని ట్రంప్ చెప్పడం విశేషం!వాణిజ్య చర్చలు సూపర్ భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని మీడియా ప్రశ్నకు బదులుగా ట్రంప్ చెప్పారు. ‘‘అన్ని దేశాలతోనూ చర్చలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే గూగుల్ తదితర అతి పెద్ద అమెరికా టెక్ దిగ్గజాల పట్ల యూరోపియన్ యూనియన్ వైఖరి విషయంలోనే బాగా నిరాశకు లోనయ్యాం’’ అని బదులిచ్చారు.మళ్లీ నవరో నోటిదురుసు! భారత్ పట్ల విద్వేషానికి పెట్టింది పేరుగా మారిన ట్రంప్ సలహా బృందం సీనియర్ సభ్యుడు పీటర్ నవరో మరోసారి నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్ కొంటున్న చమురు ద్వారా సమకూరుతున్న ఆర్థిక వనరులే ఉక్రెయిన్పై యుద్ధానికి ఆదరువుగా మారాయంటూ మరోసారి ప్రేలాపనలకు దిగారు. -
డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు) రాయని డైరీ
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని అంటారు. అందాన్ని వేరు చేసి చూడమంటారు! అందం, వికారం పక్కపక్కనే ఉంటే వేరు చెయ్యొచ్చు. పైనొకటి, కిందొకటి ఉంటే వేరు చెయ్యొచ్చు. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటే ఎలా వేరు చేయటం?నేను టీవీ చూస్తుంటానని తెలిసి,జిన్పింగ్ నాకోసం బీజింగ్లోని తియానన్మెన్లో చేయించిన మిలిటరీ పరేడ్; తియాంజిన్లో పుతిన్, మోదీలతో కలిసి జిన్పింగ్ కలిసి చేసిన చిరునవ్వుల ప్రదర్శన (అది కూడా నేను టీవీ చూస్తుంటానని తెలిసే) రెండూ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మిలిటరీ పరేడా, లేక చిరునవ్వుల ప్రదర్శనా... ఏది ఆ రెండింటిలో బ్యూటిఫుల్గా ఉందంటే మాత్రం, చిరునవ్వుల ప్రదర్శనే అంటాన్నేను. చిరునవ్వుల్లో కేవలం చిరునవ్వులే ఉండవు. చేతులు కలుపుకోవడం ఉంటుంది. భుజాలు తాకించుకోవటం ఉంటుంది. హత్తుకోవటం ఉంటుంది. ఆలింగనం చేసుకోవటం ఉంటుంది. అదోలా చూసు కోవటం ఉంటుంది. ఏదైనా ఇచ్చిపుచ్చు కోవటం ఉంటుంది. కలిసి నాలుగు అడుగులు వేయటం ఉంటుంది. పరవశం కలిగించే చిన్న మాట ఉంటుంది. పెద్దపెట్టున నవ్వేయటం ఉంటుంది. లోకం దృష్టిలో పడాలన్న తహతహ ఉంటుంది. ఆ లోకంలో మళ్లీ పర్టిక్యులర్గా ఫలానా వ్యక్తి కంట పడుతున్నామా లేదా అనే దొంగచూపు ఉంటుంది. ఇన్ని ఉంటాయి చిరునవ్వుల్లో! గర్జించే శతఘ్నులను మించిన మారణాయుధాలు ఈ చిరునవ్వులు. వావ్!! చిరునవ్వుల మారణాయుధాలు! వండర్ ఫుల్ థాట్. నోబెల్ను పెద్ద పెద్ద పనులకే ఇవ్వక్కర్లేదు. నాకొచ్చే ఇలాంటి చిన్న చిన్న థాట్స్కు కూడా ఇవ్వొచ్చు.జిన్పింగ్ నన్ను టీవీలోంచి దొంగ చూపులు చూడటం నేను గమనించాను. తనేంటో నాకు చూపించుకోవటం అది. నా దగ్గర పుతిన్ ఉన్నారు, మోదీ ఉన్నారు, కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు అని చెప్పుకోవటం! ఏం మనిషి అతను?! చైనాకు జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయిందని బీజింగ్లో పరేడ్ చేయించి ఆ పరేడ్కు అమెరికాను పిలవలేదు! పరేడ్ అందంగా ఉంది. జిన్పింగ్ మైండే... వికారంగా ఉంది.అమెరికా బెదిరిస్తేనే కదా జపాన్ వెళ్లి చైనాకు లొంగిపోయింది! ఫారిన్ గవర్నమెంట్స్కి థ్యాంక్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అంటారే గానీ, అమెరికాకు థ్యాంక్స్ చెప్పటానికి ఏమైంది జిన్పింగ్కి! చరిత్రను మరిచిపోయారా లేక, చేసిన మేలునే మరిచిపోయారా? చూస్తుంటే రష్యా, ఇండియాలు కూడా అమెరికాను మర్చిపోయేలా చేసేలా ఉన్నారు జిన్పింగ్! ఇలాంటప్పుడే నాకు మరింతగా ఎవరికైనా, ఏదైనా చేయాలనిపిస్తుంది. కాల్ బటన్ నొక్కి, ‘‘పీటర్ కెంట్... మనం ఇండియా మీద ఎంత వేశాం, రష్యా మీద ఎంత వేశాం, చైనా మీద ఎంత వేశాం?’’ అని అడిగాను. నా ట్రేడ్ అడ్వైజర్ ఆయన. ‘‘ఎస్, మిస్టర్ ప్రెసిడెంట్. ఇండియా మీద 50, చైనా మీద 30, రష్యా మీద 10’’ అని గుర్తు చేశారు పీటర్ కెంట్.‘‘వెల్, మిస్టర్ కెంట్. ఇండియా మీద ఇంకో 25 వేస్తే ఎలా ఉంటుంది? మొత్తం కలిపి 75’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా మిస్టర్ ప్రెసిడెంట్. మైండ్–బ్లోయింగ్’’ అన్నారు పీటర్ కెంట్. ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆత్మీయులే కదా ముందుగా మనకు గుర్తుకొస్తారు. మోదీతో నేను బాగా కలిసిపోతాను. ఫిబ్రవరిలో ఆయన ఇక్కడే ఉన్నారు! మళ్లీ సెప్టెంబర్ 23న యూఎన్ఓ సమావేశానికి ఇక్కడే ఉంటారు. -
డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం.. సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని, సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వులో పేర్కొన్నారు.ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జెనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం.కొన్ని రోజుల క్రితం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తరువాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్నసుంకాలు మాత్రమే కాకుండా.. కొన్ని ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ సంచనలం సృష్టించారు. ఇవి దేశంలోని కీలకమైన మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికాలో పండించలేని లేదా ఉత్పత్తి చేయలేని వస్తువుల ధరలను పెంచుతాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ట్రంప్.. అంతరిక్షం, కొన్ని ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించే కీలకమైన పదార్థాలతో సహా అనేక ఖనిజాలపై పరస్పర సుంకాలను ఎత్తివేయడం మొదలుపెట్టారు.సూడోఎఫెడ్రిన్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల వంటి ఫార్మాస్యూటికల్స్ వంటివన్నీ.. ఇప్పటికే వాణిజ్య శాఖ దర్యాప్తుకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సుంకాల నుంచి ఉపసమయం పొందుతున్నాయి. అయితే.. సిలికాన్ ఉత్పత్తులతో పాటు, రెసిన్, అల్యూమినియం హైడ్రాక్సైడ్లపై సుంకాలను విధిస్తున్నారు. -
ట్రంప్ వ్యాఖ్యలను అభినందించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. అంతకు ముందు.. భారత్, రష్యాలు అమెరికాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తోందంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిగంటలకే ఆయన ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్తో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయా? అని రిపోర్టర్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. మోదీ గొప్ప ప్రధాని. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అన్నారు. ఈ నేపథ్యంలో ఐరాస కీలక సమావేశానికి మోదీ గైర్జారు అవుతారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్ వైఖరికి నిరసనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుండగా.. మోదీ తాజా ట్వీట్తో ఇరు దేశాధినేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారానికి పుల్స్టాప్ పడినట్లయ్యింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025 -
ట్రంప్ కామెంట్లు.. మోదీ కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ప్రధాని మోదీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ(UNGA) వార్షికోత్సవ హైలెవల్ సెషన్కు హాజరై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగ కర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీంతో మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది.సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ‘‘ఒక్కటిగా ఉన్నప్పుడు మెరుగ్గా ఉంటుంది.. శాంతి, అభివృద్ధి & మానవ హక్కుల కోసం 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ’’(Better together: 80 years and more for peace, development and human rights )అనే థీమ్తో ఈ ఏడాది సెషన్ జరగనుంది. ఇక.. హైలెవల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 తేదీల మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్లో మొదట ప్రసంగించనుంది. అటుపై యూఎన్జీఏ పొడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. రెండో దఫా అధ్యక్షుడు అయ్యాక ఐరాస నుంచి ఆయన ప్రసంగించడం ఇదే తొలిసారి కానుంది. జులైలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్లో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్ట్లో ఆయన పేరుకు బదులు జైశంకర్ పేరు చేరింది. సెప్టెంబర్ 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించనున్నారు. అంతకు ఒక్కరోజు ముందుగానే.. ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ అధినేతలు ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అయితే.. 50 శాతం సుంకాల విధింపు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంతో ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే కొనుగోళ్లు ఆపాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. తాజా షాంగై సదస్సులో పుతిన్, జిన్పింగ్తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై.. కుటిలమైన చైనాకు దగ్గరవుతున్నారనే ఆరోపణ గుప్పించారు. అయితే కొన్నిగంటలకే మాటమార్చా.. అలాంటిదేం లేదన్నారు. భారత్తో బంధం ప్రత్యేకమైందన్నారు.అదే సమయంలో.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే ఫోన్ కాల్ చేసి చల్లార్చానంటూ ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తుండగా.. భారత్ ఆ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ వ్యవహారం భారత్లో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగిన జీ7 సదస్సు నుంచి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి.. ప్రధాని మోదీ భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇప్పుడు ఐరాస కార్యక్రమానికి మోదీ గైర్హాజరు అవుతుండడం ట్రంప్ వైఖరికి నిరసనగానే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. -
మోదీ గొప్పే.. కానీ పనులే నచ్చడం లేదు: ట్రంప్
భారత్తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను కోల్పోయామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా నాలుక మడతేసేశారు. నిజంగా అలాంటిదేమీ జరగలేదని భావిస్తున్నాను అంటూ ట్రంప్ గత వ్యాఖ్యలను తిరస్కరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రక్షణశాఖ పేరును యుద్ధశాఖగా మారస్తూ అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటా. మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్తో మాకు ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదించాయి’’ అని ట్రంప్ అన్నారు. భారత్ రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోదీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు. ఇదిలా ఉంటే.. చైనా టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్, రష్యా, చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ట్రంప్ సీనియర్ కౌన్సిలర్ పీటర్ నవారో భారత్పై విమర్శలు చేశారు. రష్యా చమురు కొనుగోలుతో లాభాలు పొందుతున్నదని, భారత టారిఫ్లు అమెరికన్ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఇంకోవైపు.. అమెరికా వైట్హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య సంబంధిత అంశమని భావిస్తున్నాం. త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం’’ అని పేరొన్నారు. అయితే.. తాజాగా తన వ్యాఖ్యలను ట్రంపే తోసిపుచ్చడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య అంశాలపై భారత్ చర్చలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. భారత్-రష్యా సంబంధాలను మూడో దేశం దృష్టికోణంలో చూడకూడదని భారత ప్రభుత్వం అంటోంది. -
జార్జియాలో నిర్బంధంలోకి 475 మంది విదేశీయులు
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారి కోసం వేట కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని గుర్తించి, వెనక్కి పంపించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని జార్జియాలో 475 మంది అక్రమవలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి స్టీవెన్ ష్రాంక్ శుక్రవారం వెల్లడించారు. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంటారు. ఇందులో దక్షిణ కొరియా పౌరులు అక్రమంగా పని చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తాజాగా నిర్బంధంలోకి తీసుకున్నవారి అక్రమ వలసదార్లతో ఎక్కువ మంది దక్షిణ కొరియా పౌరులే ఉన్నట్లు స్టీవెన్ ష్రాంక్ తెలిపారు. జార్జియాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులకు దక్కాలి తప్ప అక్రమంగా వలసవచ్చినవారు సొంతం చేసుకోవడం సరైంది కాదని అన్నారు. ఒకేచోట 475 మంది అదుపులోకి తీసుకోవడం హోంల్యాండ్ సెక్యూరిటీ ఆపరేషన్ల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికాలో తమపౌరులను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే, ఎంతమంది అనే విషయం బయటపెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సోదాలు ముమ్మరంచేశారు. ప్రధానంగా విదేశీయులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. -
డేంజరస్ చైనాతో.. దోస్తీయా?
చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్మీడియాలో షేర్చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రిక్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మాయమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. ట్రంప్ నిష్టూరాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎస్సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధమా? శాంతా? ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్పింగ్ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.జిన్పింగ్ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్ ప్రకటన సంచలనంగా మారింది.ఎందుకంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్ దేశాలన్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నాటో బలగాలు ఉక్రెయిన్లోని అడుగుపెడితే.. వాటితో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతే కీలకం దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వస్తోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.అయితే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ జనరల్ అనిల్ చౌహాన్ మాటలను గుర్తుచేస్తున్నారు. -
ట్రంప్ విందులో టెస్లా బాస్ మిస్: స్పందించిన మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓల బృందాలకు ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఈ విందులో ట్రంప్ సన్నిహితుడు.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' మిస్ అయ్యారు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ట్రంప్ విందుకు బిల్గేట్స్ను ఆహ్వానించారు, కానీ ఎలాన్ మస్క్ను పిలవలేదంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మస్క్.. ''నన్ను ట్రంప్ విందుకు ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను హాజరు కాలేకపోయారు. నా ప్రతినిధి ఒకరు అక్కడ ఉన్నారు'' అని అన్నారు. కానీ ఈ కార్యక్రమానికి మస్క్.. ప్రతినిధి ఎవరైనా హాజరయ్యారా లేదా అనేది వెల్లడికాలేదు.ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తరువాత.. కొంత కాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.I was invited, but unfortunately could not attend. A representative of mine will be there.— Elon Musk (@elonmusk) September 4, 2025ట్రంప్ విందుకు హాజరైన సీఈవోలుట్రంప్ విందుకు.. సుందర్ పిచాయ్ (గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ), వివేక్ రణదివే (టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్), శ్యామ్ శంకర్ (పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు), టిమ్ కుక్ (యాపిల్ సీఈఓ), మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈఓ), సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు), సామ్ ఆల్ట్ మన్ (ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు), గ్రెగ్ బ్రోక్ మన్ (ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు), సఫ్రా కాట్జ్ (ఒరాకిల్ సీఈఓ), డేవిడ్ లింప్ (బ్లూ ఆరిజిన్ సీఈఓ), అలెగ్జాండర్ వాంగ్ (స్కేల్ ఏఐ సీఈఓ), జారెడ్ ఐజాక్ మన్ (షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ) హాజరయ్యారు. -
పడవలో తెగిపడిన తలలు యుద్ధం ఆరంభం
-
ఈసారి ఆ ముగ్గురి ఫోటో.. ట్రంప్లో వణుకు మొదలైంది..!
డొనాల్డ్ ట్రంప్.. నిన్న, మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేశారు. సుంకాల విధింపుతో పలు దేశాలకు నిద్ర లేకుండా చేసిన ట్రంప్కు ఇప్పుడు నిద్ర కరువైనట్లుంది. చైనా వేదికగా జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సు తర్వాత ట్రంప్ నోటి మాటలు కచ్చితంగా రావడం లేదు.. వెన్నులో వణుకు పుట్టిన మనిషి ఎలా బాధ పడతాడో అలా వ్యవహరిస్తున్నారు ట్రంప్.చైనా, భారత్, రష్యాల మైత్రిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే.. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అంటూనే, తాము భారత్, రష్యాలను కోల్పోయామన్నారు. అదే సమయంలో కుట్ర పూరిత చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం విచారకమరన్నారు. తమతో దాదాపు ఆ రెండు దేశాల సత్సంబంధాలు తెగిపోయినట్లేనని మరొకవైపు విచారం వ్యక్తం చేశారు. చైనా వేదికగా జరిగిన షాంఘై సదస్సు, ఆ దేశం నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. చైనా సైనిక పరేడ్కు పుతిన్తో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరు కావడం కూడా ట్రంప్ నోటిలో ఎలక్కాయ పడ్టట్లు అయ్యింది. నోటి మాట రాక, తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’ వేదికగా వరుస పోస్ట్లు పెడుతున్నారు ట్రంప్. ముందుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలు పెట్టి.. తన అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. మళ్లీ గంటల వ్యవధిలోనే చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షులతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా సైట్లో పెట్టి మూడు దేశాల మైత్రిపై స్పందించారు. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగుతుందంటూనే ఎక్కడో తెలియని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక భారత్, రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక అన్న చందంగా పంచుకున్నారు. ట్రంప్పై వ్యతిరేక స్వరంఇక అమెరికాలో ట్రంప్పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది. ట్రంప్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా ఆయన చర్యలను తప్పుబడుతోంది. చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం కచ్చితంగా ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకుడు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు. చైనాలో జరిగిన షాంఘై సదస్సు మూడు దేశాల(చైనా, రష్యా, భారత్)ల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూడు దేశాలు భారీ ఒప్పందాల దిశగా అడుగులు వేశాయి. మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం. ఇక్కడ ఇరాన్, నార్త్ కొరియాలు కూడా కలిశాయి. ఇది ప్రతీ అమెరికన్కు వెన్నులో వణుకుపుట్టించే అంశం’ అంటూ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా సెటైర్లు వేశారు వేన్ జోన్స్ట్రంప్లో అది పశ్చాత్తాపమేనా?ఈసారి జరిగిన షాంషై సదస్సు ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకే పుట్టించేది అన్న వేన్ జోన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ట్రంప్ పదే పదే పోస్టులు పెట్టడం ఇప్పుడు ఆయనకు వెన్నులో వణుకు మొదలైందనడానికి సంకేతంగా చెప్పొచ్చు. అటు భారత్పై కాలు దువ్వి, ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తాపడుతున్నట్లే ఉన్నారు. తాము లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్లు వ్యవహరించిన ట్రంప్కు చైనా, భారత్, రష్యాలు గట్టి షాక్ ఇవ్వడంతో ‘ వాట్ నెక్స్ట్’ అనే ఆలోచనలో పడ్డారాయన. అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్! -
టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం బయట పెట్టుబడులు పెట్టడం ఆపాలని, ఇక్కడే (అమెరికా) ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమక్షంలో జరిగిన సంభాషణలో.. ట్రంప్ కుక్ను, "టిమ్, యాపిల్ అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతుంది? అని అడిగారు. దీనికి స్పందించిన టిమ్ కుక్ 600 బిలియన్ డాలర్లు అని అన్నారు. అంతే కాకుండా.. అమెరికాలో యాపిల్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడిని కూడా ప్రశంసించారు.ఇతర సీఈఓలను కూడా ట్రంప్ ఇదే ప్రశ్న అడిగారు. దీనికి జుకర్బర్గ్ 600 బిలియన్ డాలర్లు అని చెప్పగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాబోయే రెండేళ్లలో 200 బిలియన్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బదులిస్తూ.. మేము 75 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లు అని అన్నారు. వీరందరికీ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.డొనాల్డ్ ట్రంప్ విందుకు దేశంలోని దాదాపు దిగ్గజాలందరూ హాజరయ్యారు. కానీ అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ మాత్రం హాజరు కాలేదు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది..@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States... That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025 -
‘చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి’
రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్పై సుంకాలు, యూరప్పై ఒత్తిడిట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు.యూరప్ తీరుపై అసహనంయూరప్ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు -
వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి వైట్హౌజ్లో ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓలతో హైప్రొఫైల్ విందును నిర్వహించారు. రోజ్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా ప్రతిష్టాత్మక కంపెనీ అధినేతల సరసన అక్కడి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతి సీఈఓలు సైతం పాల్గొన్నారు.విందుకు హాజరైన భారత సంతతి సీఈవోలుసుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓసత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈఓసంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్ టెక్నాలజీ సీఈఓవివేక్ రణదివే - టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్శ్యామ్ శంకర్ - పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ఈ విందుకు సంబంధించిన పూర్తి అజెండాను వైట్ హౌజ్ విడుదల చేయనప్పటికీ కింది కీలక అంశాలపై చర్చించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రతసెమీకండక్టర్, చిప్ తయారీలో అమెరికా పోటీతత్వంఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, హైస్కిల్డ్ వీసాలు (హెచ్1-బీ)సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యతయూఎస్-ఇండియా టెక్ సహకారం, సరఫరా గొలుసులపై ప్రభావంఅతిథుల జాబితాలోని ప్రముఖ కంపెనీ సీఈవోలుపేరుకంపెనీబిల్ గేట్స్మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడుటిమ్ కుక్యాపిల్ సీఈఓమార్క్ జుకర్బర్గ్మెటా సీఈఓసెర్గీ బ్రిన్గూగుల్ సహ వ్యవస్థాపకుడుసామ్ ఆల్ట్ మన్ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడుగ్రెగ్ బ్రోక్ మన్ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడుసఫ్రా కాట్జ్ఒరాకిల్ సీఈఓడేవిడ్ లింప్బ్లూ ఆరిజిన్ సీఈఓఅలెగ్జాండర్ వాంగ్స్కేల్ ఏఐ సీఈఓజారెడ్ ఐజాక్ మన్షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ ఎలాన్ మస్క్ గైర్హాజరుటెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విందుకు గైర్హాజరయ్యారు. ఒకప్పుడు ట్రంప్తో సన్నిహితంగా మెలిగిన మస్క్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొద్దికాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఇటీవల అమెరికా దిగ్గజ కంపెనీలకు ట్రంప్ దేశీయంగా పెట్టుబడులు పెంచాలని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో కాకుండా యూఎస్ చేసే పెట్టుబడులు, మూలధన వ్యయాలు పెంచాలని సూచించారు. అందుకు ఇతర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకునే కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గి యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా కంపెనీల సీఈఓలకు విందు ఏర్పాటు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం -
అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్!
పుతిన్, కిమ్ సహా 26 దేశాధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అద్భుతంగా ఉంది అంటూనే అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన నాటకీయ ప్రదర్శన మాత్రమేనని సెటైర్ వేశారు. ఓవల్ ఆఫీస్లో మీడియాతో ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి అది అందమైన.. అత్యంత అద్భుతమైన కార్యక్రమం. కానీ, వాళ్లు అలా ఎందుకు చేశారో నేను అర్థం చేసుకోగలను. నేను చూస్తున్నాననే వాళ్లు అనుకుని ఉంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆధ్వర్యంలో తియానన్మెన్ స్క్వేర్ వద్ద రెండో ప్రపంచ యుద్ధ విక్టరీ పరేడ్ జరిగింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ సహా 26 దేశాల అధినేతలు హాజరయ్యారు. దాదాపు 50 వేల మందికి పైగా వీక్షకులు హాజరైన ఈ పరేడ్లో శక్తివంతమైన క్షిపణులనూ చైనా ప్రదర్శనకు ఉంచింది. అయితే.. తన ప్రసంగంలో జిన్పింగ్ అమెరికాను ప్రస్తావించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ను ఓడించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని చైనాకు గుర్తు చేశారాయన. షీ(జిన్పింగ్) స్నేహితుడే. కానీ, ఆయన అమెరికా పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చైనాకు స్వాతంత్రం దక్కడంలో మా సాయం కూడా ఉంది. అలాంటిది క్రెడిట్ కోరుకోవడం తప్పేం కాదు కదా అని ట్రంప్ అన్నారు.అంతకు ముందు.. ఈ ముగ్గురు దేశాధినేతల కలయికపై ట్రంప్ Truth Socialలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అమెరికా వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారాయన. అయితే.. అయితే, వైట్హౌస్లో జరిగిన ప్రెస్మీట్లో మాత్రం స్వరాన్ని మార్చారాయన. వాళ్లతో తన సంబంధం బాగానే ఉందని.. వచ్చే రెండు వారాల్లో అది ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజింగ్ పరేడ్కు ఆహ్వానం రాకపోవడంపై ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన.. ఆ విషయం గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని బదులిచ్చారు. అంతేకాదు.. త్వరలో షీ జిన్పింగ్ను కలిసే అవకాశం ఉందని బదులిచ్చారాయన. -
‘డిఫెన్స్ కాదు.. ఇకపై యుద్ధమే’.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఎగ్గిక్యూటీవ్ ఆర్డర్ను పాస్ చేయనున్నారు. అనంతరం, ప్రస్తుతం రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్గా పిలిపించుకోనున్నారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం.. ట్రంప్ త్వరలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నారు. తద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పేరొందిన పెంటగాన్ (Pentagon) రక్షణ కార్యాలయం అధికారిక పోర్టల్స్, సైన్య సంబంధిత బోర్డులు, మీడియా రూమ్లు కూడా ఈ మార్పుకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్తా.. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతో అమెరికా గతంలో ప్రపంచ యుద్ధాల్లో విజయాలు సాధించింది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’ అనే పేరు మారిన తర్వాత ఆ పోరాట స్పూర్తి తగ్గిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెగ్సెత్ కూడా ఈ మార్పును సాంస్కృతిక మార్పుగా అభివర్ణించారు. మేము కేవలం రక్షణ మాత్రమే కాదు.. దాడులు కూడా చేస్తాం. వాటికి అనుగుణంగా పేర్లు ఉండటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.పేరు మార్పు దేనికి సంకేతం1949 వరకు అమెరికా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. తరువాత నేషనల్ సెక్యూరిటీ చట్టం ద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్పు జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మార్పు అమెరికా రాజకీయాల్లో, సైనిక విధానాల్లో కొత్త దిశకు సంకేతమా? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.ట్రంప్ వ్యూహమారక్షణ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్) పేరును యుద్ద శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ వార్)గా మార్చడంలో ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్లో ‘వార్’ అనే పదం రక్షణ కంటే దాడి, శక్తి సూచిస్తుంది. అదే సమయంలో ప్రపంచదేశాల ఎదుట తమ దేశ యుద్ధ సామర్థ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లేనని భావించవచ్చు. ఈ పేరు మార్పు రాజకీయ నాయకుడిగా దేశ భద్రతపై అతని దృష్టిని ప్రతిబింబించవచ్చు. ట్రంప్ ఈ మార్పును ప్రతిపాదించినప్పుడు, ఆయన ఉద్దేశం అమెరికా సైన్యానికి మరింత దృఢత్వాన్ని ఇవ్వడమే అని చెప్పారు. మరికొందరు మాత్రం.. ట్రంప్ యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగమేనంటూ పెదవి విరుస్తున్నారు. -
ట్రంప్, మోదీ బంధం.. ఇది అందరికీ గుణపాఠం: బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
వాష్టింగన్: భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. నేతలు మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వ్యక్తిగతంగా ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మాయమైపోయిందని యూఎస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్నకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణం కావచ్చు. అమెరికా-భారత్ సంబంధాలను వైట్ హౌస్ దశాబ్దాల వెనక్కి నెట్టింది. మోదీని రష్యా, చైనాకు చేరువ చేసింది. అమెరికా, ట్రంప్నకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుంది.అయితే, ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్తో సత్సంబంధాలు ఉంటే.. అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. కానీ.. వాస్తవానికి ఇది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు.. కానీ, అన్ని వేళలా రక్షించవు. ప్రస్తుతం భారత్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా- భారత్ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే.. ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా బోల్టన్కు చెందిన నివాసం, వాషింగ్టన్ కార్యాలయంలో ఎఫ్బీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. -
యుద్ధం ఆగాలంటే భారత్పై టారిఫ్ల మోత తప్పదు!
న్యూయార్క్/వాషింగ్టన్: టారిఫ్ల బూచి చూపి పలు దేశాలను భయపెడుతున్న ట్రంప్ సర్కార్ చివరకు యూఎస్ సుప్రీంకోర్టును సైతం టారిఫ్లు తగ్గిస్తే అమెరికా వాణిజ్యలోటు సంక్షోభంలో కూరుకుపోతుందని భయపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉక్రెయిన్లో శాంతిస్థాపనే జరగాలంటే భారత్పై టారిఫ్ల మోత మోగాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వితండవాదానికి దిగింది. భారత్సహా ఇతర దేశాలపై అధిక టారిఫ్ల భారం మోపకపోతే ఆర్థికలోటు సుడిగుండంలో అమెరికా చిక్కుకోక తప్పదని ట్రంప్ సర్కార్ అనవసరంగా ఆందోళన వ్యక్తంచేసింది. అప్పీళ్ల కోర్టులో తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో ఇతర దేశాలతో టారిఫ్ల చర్చల్లో ప్రతిష్ఠంబన నెలకొందని, అందుకే కేసును వీలైనంత త్వరగా తేల్చాలని యూఎస్ సుప్రీంకోర్టులో గురువారం డిమాండ్చేసింది. ఈ మేరకే ఏకంగా 251 పేజీల అఫిడవిట్ను కోర్టుకు ట్రంప్ సర్కార్ సమరి్పంచింది. ‘‘ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగడంతో ప్రత్యక్షంగా అమెరికాలో జాతీయ అత్యయిక పరిస్థితి ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకే భారత్పై టారిఫ్ల మోత మోగించాల్సి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు తన ‘1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ను ప్రయోగించారు. అధిక టారిఫ్లతో భారత్పై ఆర్థికపరంగా ఒత్తిడి తెస్తేనే భారత్ మరో గత్యంతరంలేక చివరకు రష్యా యుద్ధవిరామం చేసేలా ఒప్పించగల్గుతుంది. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు, అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్టతకు భారత్పై 50 శాతం టారిఫ్ అవశ్యం’’అని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ‘‘టారిఫ్ల విధింపును కోర్టులు అడ్డుకుంటే, అన్ని దేశాలపై టారిఫ్లు విధించే అసాధారణ అధికారం అధ్యక్షుడికి లేదని మీరు తేలిస్తే వాణిజ్యలోటు కష్టాల నుంచి అమెరికా బయటపడటం చాలా కష్టమవుతుంది. చివరకు అమెరికా ఆర్థికవినాశనం సంభవిస్తుంది’’అంటూ తమకు వ్యతిరేక తీర్పు రావొద్దనే ధోరణిలో ఏకంగా యూఎస్ సుప్రీంకోర్టునే భయపెట్టేలా ట్రంప్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది. ఆరు కీలక దేశాలు దారికొచ్చాయి ‘‘టారిఫ్ల కొరడా ఝుళిపించడంతో ప్రపంచంలోనే ఆరు ప్రధాన ఆర్థికవ్యవస్థలు(దేశాలు) మా దారికొచ్చాయి. అమెరికాతో 27 సభ్యదేశాలున్న ఐరోపా సమాఖ్యసైతం టారిఫ్ల ఒప్పందంచేసుకుంది. ఈ ఒప్పందం అమెరికాకు భారీగా మేలు చేకూర్చేదే. దీంతోపాటు 2 ట్రిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి భారీ పెట్టుబడులు సాధ్యంకానున్నాయి. ఆయా దేశాలపై మేం విధించే టారిఫ్లు అనేవి అమెరికా మరింతగా 1.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యలోటు అగాధంలో పడకుండా కాపాడే రక్షారేకులు. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదన్న ‘అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ కోర్టు’అభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఇతర దేశాలపై అధిక టారిఫ్లు మోపితేనే అమెరికా సంపన్న దేశంగా కొనసాగుతుంది. లేదంటే పేదదేశంగా పతనమవుతుంది. ట్రంప్ అధికారంలోకి రాకమునుపు అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది. ఇప్పుడు అధిక టారిఫ్లతో బిలియన్ల కొద్దీ డబ్బు వచ్చిపడుతోంది. ఇప్పుడు అమెరికా మళ్లీ బలపడుతోంది. ఆర్థికంగా పటిష్టమవుతూ విశ్వవ్యాప్తంగా గౌరవమర్యాదలను పొందుతోంది’’అని ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ డి. జాన్ సాయెర్ వాదించారు. నవంబర్లోపు కేసులో వాదోపవాదనలను ముగించి తీర్పు చెప్పాలని కోర్టును సాయెర్ కోరారు. -
‘భారత్తో రష్యాకు భారీ డ్యామేజ్.. అది చాలదా?’
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్హౌజ్లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్లో జరిగిన జాయింట్ ప్రెస్మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?.. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.నిజంగానే చమురు ఆగిందా?ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్తో అలా మాట్లాడాల్సింది కాదుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు. -
ఆంక్షలతో లొంగదీసుకోలేరు
మాస్కో: భారత్, చైనాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్లు, ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుపట్టారు. ఆ రెండు దేశాలను ఆంక్షల కొరడాతో లొంగదీసుకోవాలని చూడడం సరైంది కాదని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలతో మాట్లాడే విధానమే సరిగ్గా లేదని, వలసవాద పాలన కాలం నాటి మాటలను ట్రంప్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పుతిన్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా సర్కార్ వైఖరిపై ఘాటుగా స్పందించారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచి, దారికి తెచ్చుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత్, చైనాలు చక్కటి భాగస్వామ్య దేశాలని పుతిన్ గుర్తుచేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్లను ఆ రెండు దేశాల్లో నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. భారత్, చైనాలు కలిసి అమెరికాను శిక్షిస్తాయని ఎవరైనా చెబితే ఆ విషయం సీరియస్గా ఆలోచించాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. 140 కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండియాను, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను బలహీన దేశాలుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వలసవాద ప్రభుత్వాల హయాం ఎప్పుడో ముగిసిపోయిందని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అప్పుటి పదజాలం ఉపయోగిస్తామంటే కుదరదని, ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని హితవు పలికారు. అమెరికా, భారత్, చైనాల మధ్య మళ్లీ సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న నమ్మకం తనకు ఉందని పుతిన్ స్పష్టంచేశారు. 🚨🇷🇺 'YOU CANNOT TALK TO INDIA OR CHINA LIKE THAT:' Putin on economic pressure against partners"Attempting to weaken their leadership, built through difficult histories, is a mistake." pic.twitter.com/GsiU3K3mnZ— Sputnik India (@Sputnik_India) September 3, 2025కారులో మోదీతో సంభాషణ రహస్యం కాదు చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కారులోనే 45 నిమిషాలకుపైగా మాట్లాడుకున్నారు. దీనిపై వస్తున్న ఊహాగానాలపై పుతిన్ స్పందించారు. మోదీతో కారులో సంభాషించడం వెనుక రహస్యం ఏమీ లేదన్నారు. అది రహస్య సంభాషణ కాదని స్పష్టంచేశారు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన భేటీ విశేషాలను మోదీకి వివరించానని చెప్పారు. -
దశాబ్దాల కృషిని ట్రంప్ నాశనం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా విమర్శలు గుప్పించారు. భారత్పై భారీ సుంకాలు విధించి దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నాశనం చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చేసిన కృషి ఒక్క సుంకాల వల్ల తుడిచి పెట్టుకుపోయిందన్నారు. అరుదైన అత్యవసర పరిస్థితి అంటూ హెచ్చరించారు. పాకిస్తాన్ చేసినట్లుగా, తనను నోబెల్ శాంతి బహుమతికి భారత్ నామినేట్ చేయనందునే ట్రంప్ అలా చేస్తున్నారని ఆరోపించారు. ‘నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడానికి మోదీ నిరాకరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన 30 ఏళ్ల కృషిని నాశనం చేశారు. చైనా కంటే భారతదేశంపై ఆయన 50% ఎక్కువ సుంకాలను విధించారు. ఇవి బ్రెజిల్, చైనా కంటే ఎక్కువ’ అని ఖన్నా పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు భారత్ను చైనా, రష్యాల వైపు నడిపిస్తున్నాయనే అనేక మంది మాజీ దౌత్యవేత్తలు, అధికారుల ఆందోళనను ఆయన పునరుద్ఘాటించారు. సుంకాలు అమెరికాలోకి భారత తోలు, వస్త్ర ఎగుమతులను, అలాగే అమెరికన్ తయారీదారుల నుంచి భారత్లోకి ఎగుమతులను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ అమెరికన్లు స్పందించాలి... రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్లే భారత్పై సుంకాలు విధించినట్టు ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. సుంకాలకు నోబెల్ కోణమే ప్రధానమని భావిస్తున్నారు. భారత్తో సంబంధాన్ని నాశనం చేసే ట్రంప్ అహంకారాన్ని అమెరికా అనుమతించబోదని, భారతీయ అమెరికన్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ట్రంప్కు ఓటు వేసిన భారతీయ అమెరికన్లందరూ ఇప్పుడు ఆయనను ప్రశ్నించాలని సూచించారు. ట్రంప్కు తాను ఓటు వేయలేదని ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా చేసిన పోస్ట్ను కూడా షేర్ చేస్తూ ఖన్నా తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఆయనకు నోబెల్ వస్తే ఆ తరువాత నోబెల్ ఎవరికిచ్చినా నేను పట్టించుకోను. ఎందుకంటే అది అపవిత్రం అవుతుంది’ అని వినోద్ ఖోస్లా తన పోస్ట్లో పేర్కొన్నారు. -
టారిఫ్లతో చంపుతోంది
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ అత్యధిక టారిఫ్లతో అమెరికాను చంపుతోందని మండిపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాతోపాటు చైనా, బ్రెజిల్లు భారీగా టారిఫ్లు విధిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన తాజాగా స్కాట్ జెన్సింగ్స్ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి టారిఫ్లు విధించబోమంటూ ఇండియా తమకు ఆఫర్ ఇచి్చందని అన్నారు. భారతదేశ ఉత్పత్తులపై తాము టారిఫ్లు భారీగా పెంచాం కాబట్టి అలాంటి ఆఫర్ వచ్చిందని, లేకపోతే వచ్చేదేకాదని తేలి్చచెప్పారు. కాబట్టి ఇండియాపై టారిఫ్లు వేయడంలో అన్యాయం ఏమీ లేదని పరోక్షంగా స్పష్టంచేశారు. తమ చర్యల వల్లే ఇతర దేశాలతో బేరమాడే శక్తి పెరిగిందని పేర్కొన్నారు. భారత్–అమెరికా బంధం ఏకపక్షమే భారత వాణిజ్య విధానాలను ట్రంప్ మరోసారి తప్పుపట్టారు. భారత్–అమెరికాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలన్నీ ఏకపక్ష బంధంగా అభివరి్ణంచారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఇండియాతో చాలా బాగా కలిసి పోయాం. కానీ, మా బంధం చాలా ఏళ్లుగా ఏకపక్ష బంధంగానే ఉంది. భారత్ అపారమైన సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై వందశాతం సుంకాలు విధించింది. అందుకే ఇండియా నుంచి దిగుమతులు ఆపేశాం. వాణిజ్యం చేయడం లేదు. కానీ, ఇండియాకు అమెరికాలో భారీగా మార్కెట్ ఉంది. ఎందుకంటే ఇండియా నుంచి మేము మూర్ఖంగా సుంకాలు వసూలు చేయడం లేదు. వారు తయారు చేసిన ప్రతి వస్తువును అమెరికాకు పంపగలుగుతున్నారు. వారి ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. భారత్ వాణిజ్య విధానాలు అమెరికాలోని తయారీదారులకు భారీ నష్టాన్ని కలిగించాయి’’ అని ట్రంప్ ఆరోపించారు. హార్లీ–డేవిడ్సన్ బైక్లు అమ్మలేకపోయాంఅమెరికాలో అత్యంత గుర్తింపు పొందిన మోటార్సైకిల్ బ్రాండ్లలో ఒకటైన హార్లీ–డేవిడ్సన్ భారత్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ట్రంప్ ప్రస్తావించారు. ‘హార్లీ–డేవిడ్సన్ బైక్లను భారత్లో అమ్మలేకపోయాం. మోటార్ సైకిల్పై 200 శాతం సుంకం విధించారు. దాంతో సుంకాలను తప్పించుకోవడానికి హార్లీ–డేవిడ్సన్ సంస్థ భారత్లోనే ప్లాంట్ నిర్మించాల్సి వచి్చంది. ఈ అన్యాయమైన సుంకాల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికా వెలుపల చేస్తున్నాయి. నేను అధికారంలోకి వచ్చాక ఈ వాణిజ్య విధానాలను తిప్పికొట్టడం ప్రారంభించా. అందులో భాగమే ఈ పరస్పర సుంకాలు’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమెరికా వైపే మొగ్గు తమ నూతన విధానాలతో అనేక సంస్థలు అమెరికాలో కంపెనీలను, ప్లాంట్లను స్థాపించడానికి ముందుకు వస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. ‘‘మా వాణిజ్య విధానాల వల్ల కార్ల కంపెనీలు, ఏఐ సంస్థలు ఇప్పుడు అమెరికా వైపు మొగ్గుచూపుతున్నాయి. చైనా, మెక్సికో, కెనడా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్న అనేక కార్ల కంపెనీలు ఇప్పుడు మా దేశంలోనే ఏర్పాటవుతున్నాయి. దానివల్ల ఆయా కంపెనీలపై సుంకాల మోత తప్పుతోంది. వాటికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది’’ అని ట్రంప్ తెలిపారు. ఏడు యుద్ధాలను ఆపేశా.. ప్రపంచ యుద్ధాలను ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ట్రంప్ మరోమారు అదే విషయం చెప్పారు. తన వాణిజ్య విధానాలతో ఏడు యుద్ధాలను పరిష్కరించానని స్పష్టంచేశారు. ‘‘సుంకాల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఏడు యుద్ధాలను పరిష్కరించడానికి సహాయపడింది. అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. టారిఫ్లు మా దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మార్చాయి. ఈ టారిఫ్లతోనే ఏడు యుద్ధాలను ఆపాను’’ అని వ్యాఖ్యానించారు.అవన్నీవదంతులు..తన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ‘‘మీరు చనిపోయారంటూ వార్తలు మీ దృష్టికి వచ్చాయా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. తన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నానని తెలిపారు. అవి కూడా పుకార్లేనని ఖండించారు. తాను చాలా చురుగ్గా ఉన్నానని, ముందే చెప్పినట్టుగా ఇప్పుడున్నంత ఆరోగ్యంగా మరెప్పుడూ లేనని స్పష్టం చేశారు. -
భారత్కు ట్రంప్ మరోసారి భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఉత్పత్తుల విభాగంలో 50శాతం టారిఫ్ను విధించారు. ఇప్పుడు అదే బాటలో సేవల విభాగంపై టారిఫ్లు విధించేందుకు సిద్ధమైంది. వాణిజ్య పరంగా భారత్పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లపై సుంకాలు విధింనుంది. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ.. అన్ని ఔట్సోర్సింగ్ సేవలపై టారిఫ్ విధించాలి’ అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. దీంతో విదేశీ సేవలపై కూడా వస్తువుల్లాగే టారిఫ్ విధించాలి అనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధానాలు అమలైతే అమెరికా కంపెనీలు ఔట్సోర్సింగ్ ఖర్చులు పెరగడంతో.. భారత్ సంబంధిత కంపెనీలతో కుదుర్చుకునే కాంట్రాక్ట్ల విషయంలో వెనక్కితగ్గుతాయి. ప్రాజెక్టుల ఆలస్యం, లాభాల తగ్గుదల, సరఫరా గొలుసుల అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికా ఆధారిత వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఇంజినీర్లు, కోడర్లు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు ఎక్కువ మంది వెళుతుంటారు. ఇన్ఫోసిస్,టీసీఎస్,విప్రో,హెచ్సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాల ప్రధాన స్పాన్సర్లు. ఈ వీసాల ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు..హెచ్1బీ వీసా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ పరిణామాలు భారత్ తన ఐటీ రంగాన్ని విస్తరించేందుకు,వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచేందుకు, అమెరికా ఆధారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య దృశ్యాన్ని మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నాయి. -
భారత్పై మళ్లీ బురద జల్లిన ట్రంప్.. సుంకాలపై అసంబద్ధ వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోమారుతీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారతదేశంతో చాలా బాగానే కలిసిపోతుంది.. కానీ న్యూఢిల్లీ వాషింగ్టన్ నుండి విపరీతమైన సుంకాలు వసూలు చేస్తున్నందున చాలా ఏళ్లుగా ఇరుదేశాల సంబంధం ఏకపక్షంగా ఉందని వ్యాఖ్యానించారు.వైట్హౌస్లో భారతదేశంపై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా? అని మీడియా అడినప్పుడు.. తాము భారత్తో బాగానే కలిసిపోతామని, కొన్నేళ్లుగా భారత్- అమెరికా మధ్య సంబంధం ఏకపక్షంగా ఉందని పేర్కొన్నారు. అయితే తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అది మారిందని వ్యాఖ్యానించారు. భారత్ తమ నుండి అపారమైన సుంకాలను వసూలు చేస్తోందని, అది ప్రపంచంలోనే అత్యధికమని అని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే అమెరికా.. భారత్తో పెద్దగా వ్యాపారం చేయడం లేదన్నారు.అయితే తాము వారి నుండి భారీ సుంకాలు వసూలు చేయడం లేదు కాబట్టే వారు మాతో వ్యాపారం చేస్తున్నారు. వారిలా మూర్ఖంగా మేము వసూలు చేయడం లేదన్నారు. ఇక్కడ తయారవని ఉత్పత్తులను భారతదేశం యూఎస్లోకి ‘తరలిస్తోందని’ ట్రంప్ ఆరోపించారు.వారు తమ నుండి 100 శాతం సుంకాలను వసూలు చేస్తున్నందున తాము ఏమీ పంపడం లేదని పేర్కొన్నారు. ఇందుకు హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లే ఉదాహరణ అన్నారు. మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం ఉన్నందున భారతదేశంలో వీటిని విక్రయించలేమన్నారు.అయితే ఇప్పుడు హార్లే డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి అక్కడ మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు వారు మన మాదిరిగా సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఏకాకిని చేయడమే ట్రంప్ లక్ష్యం
కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. రష్యన్ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?ఇది ప్రతీకారం కాదా?ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించడం. భారత్పై ఆంక్షలు విధించాలని యూరప్ను బిసెంట్ కోరారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్కు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?భారత్పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్ఫర్ సంస్థ మాజీ చైర్మన్ జార్జ్ ఫ్రైడ్మ్యాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన చేర బోమనే ట్రంప్ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. ట్రంప్ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.ఫ్రైడ్మ్యాన్ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అసహనంలో అమెరికా.. భారత్కు రష్యా బంపరాఫర్!
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025 -
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
యుద్ధం ముగింపునకు ట్రంప్తో అంగీకారం: పుతిన్
మాస్కో: గత నెలలో అలాస్కాలో అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిగిన భేటీలో ఉక్రెయి న్తో యుద్ధానికి ముగింపు పలికే విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ వెల్లడించారు. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో ఉక్రెయిన్లో శాంతి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెడెన్ స్కీతో శాంతి చర్చలకు అంగీక దించారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధా సమివ్వలేదు. ఈ విషయమై మధ్యవర్తిత్వం వహిస్తున్న ట్రంప్ సోమవారం కల్లా. జెలెన సీతో శాంతి చర్చలకు అంగీకరించేదీ లేనిదీ స్పష్టత ఇవ్వాలంటూ పుతిన్కు గడువు ఇవ్వడం తెల్సిందే. చైనాలోని తియాంజిన్లో ఎస్సీవో శిఖరాగ్రానికి యాత్రను ఈ సందర్భంగా మ యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని నిందించారు. -
సుంకాలను భారత్ పూర్తిగా ఎత్తేస్తామంది!
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు. భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్సోషల్లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది. మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. -
భారత్ మూడంచెల ప్లాన్..
భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టారిఫ్ల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక ఉపశమనం కోసం దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి మూడంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు భారత్పై అమెరికా తీసుకున్న ఈ టారిఫ్ చర్య 60 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదర్, రసాయనాలు వంటి కార్మిక ఆధారిత రంగాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో చాలా వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) పరిధిలోకి రానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్వల్పకాలిక చర్యలు..చాలా సంస్థలకు వడ్డీ రాయితీ పథకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేయాలని యోచిస్తోంది. సెజ్ యూనిట్ల ఆర్డర్ వాల్యూమ్లను నిర్వహించడానికి, ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, వేర్హౌజింగ్, లాజిస్టిక్స్పై పట్టుసాధించేందుకు సాయం అందించాలని చూస్తోంది. టెక్స్టైల్స్, హస్తకళల్లో చిన్న ఎగుమతిదారులకు లిక్విడిటీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్య పరిష్కరించేందుకు స్వల్పకాలిక చర్యలు కీలకం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.మీడియం స్ట్రాటజీరాబోయే 12-24 నెలల్లో అమెరికాకు చేసే ఎగుమతులను వైవిధ్య పరచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను పొందేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇప్పటికే చర్చలు వేగవంతం చేసింది. ఎగుమతి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను రిఫండ్లను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. యూరప్, ఆఫ్రికా వంటి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి ట్రేడ్ ఫెయిర్లను ఏర్పాటు చేస్తుంది.దీర్ఘకాలిక దృష్టిఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రారంభించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్లను వైవిధ్య పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. సరళీకృత లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ రిఫండ్ విధానాలతో డిజిటల్ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలకు మరింత అవకాశాన్ని కల్పించాలని చూస్తుంది. భారతీయ ఎగుమతులకు గ్లోబల్ బ్రాండ్ విశ్వసనీయతను పెంచడానికి స్కిల్లింగ్, ఆర్ అండ్ డీ, క్వాలిటీ సర్టిఫికేషన్లో పెట్టుబడులు పెంచాలని చూస్తుంది.ఇదీ చదవండి: రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం! -
ట్రంప్, మోదీ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు