Donald Trump
-
వాషింగ్టన్ డీసీ ‘తెర’లపై ట్రంప్-ఎప్స్టీన్ వీడియోలు!
వాషింగ్టన్ డీసీ.. అమెరికా రాజధాని. ఇది చారిత్రకంగా వాస్తు శిల్ప పరంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భవనాలతో నిండిన నగరం. ముఖ్యంగా వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్ మాన్యుమెంట్ వంటి నిర్మాణాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. వాషింగ్టన్డీసీలో గోడలపై సాధారణంగా కళా ప్రదర్శనలు, రాజకీయ నినాదాలు, సామాజిక ఉద్యమాల పోస్టర్లు కనిపిస్తాయి.అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్స్టీన్ వీడియోలు వాషింగ్టన్ డీసీలో బిల్డింగ్ గోడలపై ప్రదర్శితమయ్యాయి. వాషింగ్టన్ డీసీ వెలుగుల్లోట్రంప్-ఎప్స్టీన్లు కలిసి ఉన్న వీడియోలను ప్రదర్శించారు నిరసనకారులు.అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు.. మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల సంబంధాన్ని మరింత ముడిపెడుతూ పలు దృశ్యాలను, దాంతో పాటు కొన్ని పత్రాలను వాషింగ్టన్ హిల్టన్ భవనం ముఖ భాగంపై ప్రదర్శించారు నిరసనకారులు. ఈ వీడియోలలో ఎప్స్టీన్కు సంబంధించి ఫోటోలు, పత్రాలతో పాటు, అతని ఈ-మెయిళ్లను చదివి వినిపించనట్లుగా ఉన్న ఆడియో కూడా ఉంది. వీటిని వాషింగ్టన్ డీసీ గోడలపై ప్రదర్శించిన కాసేపటికే జనం గుమిగూడిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎప్స్టీన్ ఫైళ్ల గురించి జనానికి తెలిసినా ఆ వీడియోలను మరొకసారి ఆసక్తిగా తిలకించారు జనం. అయితే వాషింగ్టన్ డీసీలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ట్రంప్ హాజరు కానున్న ఒక రోజు ముందు ఈ వీడియోలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. వాషింగ్టన్ డీసీలో అధ్యక్ష హోదాలో ఏర్పాటు చేసిన విందుకు ట్రంప్ తొలిసారి హాజరు కానున్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ నిర్వహించే ఈ విందు కార్యక్రమంలో సంప్రదాయంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఇది మీడియా స్వేచ్ఛను జరుపుకునే దీర్ఘకాలిక సంప్రదాయం. ప్రతి అధ్యక్షుడు తన పదవీకాలంలో కనీసం ఒకసారి హాజరయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన మొదటి పదవీకాలమంతా, అలాగే 2025లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. తాజాగా దీనికి హాజరయ్యే సందర్భంలో ఇలా వాషింగ్టన్ డీసీలో బిల్డింగ్ల ముఖభాగాలపై ఎప్స్టీన్తో కలిసి ఉన్న వీడియోలను నిరసన కారులు ప్రదర్శించడం ఇప్పుడు ట్రంప్కు మరింత తలనొప్పిగా మారింది. ఇటీవలే మీడియాపై ట్రంప్ చిందుకు తొక్కారు. తనపై మీడియా కక్ష కట్టిందని, చెడ్డ వాడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో రాసుకొచ్చారు ట్రంప్. Washington Hilton, where Trump will soon be arriving for the White House correspondents’ dinner. End the cover-up. pic.twitter.com/PmGZlhtRAv— Led By Donkeys (@ByDonkeys) April 25, 2026 -
చర్చల్లో ఇరాన్ బిజీ.. యుద్ధం బహుమతి అంటూ అమెరికా వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్కు చేరుకోగా, వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయల్దేరారు. మరోవైపు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇరాన్ యుద్ధంపై ఈజిప్టు, పాక్ అధికారులు చర్చించారు. అమెరికా, ఇరాన్ల మధ్య మరో విడత చర్చలు ప్రారంభించే ప్రయత్నాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.ఈ క్రమంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం ప్రపంచానికి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్ సముద్ర రవాణాపై అమెరికా దిగ్బంధనం అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక వైఖరి బలహీనపడిందని, సముద్రంలో క్రమరహిత వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడుతోందన్నారు. అవసరమైనంత కాలం ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దెబ్బతిన్న ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఐఆర్జీసీ సముద్రపు దొంగల ముఠాగా మారిపోయిందని తెలిపారు. విచక్షణారహితంగా మందుపాతరలు పాతేది, యాదృచ్ఛికంగా ఓడలపై కాల్పులు జరిపేది, కొన్ని వారాల వ్యవధిలో 45,000 మంది తమ సొంత ప్రజలను అమాయక నిరసనకారులను చంపింది వారేనని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యూఎస్ సదరన్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది.ఇరాన్ కౌంటర్.. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతలంపై తాము పూర్తి పట్టును సాధించామని ఇరాన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రజా తలాయీ నైక్ వెల్లడించారు. దాడులు చేసేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇరాన్ అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఇరాన్ స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేస్తోందని, ఇదే పేర్కొన్నారు. -
ట్రంప్ ఉత్తర్వు చట్ట విరుద్ధం
వాషింగ్టన్: సరిహద్దుల గుండా జరిగే వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాగ్దానాల్లో అత్యంత కీలకమైన వలసలకు అడ్డుకట్ట వేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వును చట్ట విరుద్ధమంటూ అప్పీల్స్ కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును శుక్రవారం సమర్థించింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్లో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లోని ముగ్గురు సభ్యుల జడ్జీల కమిటీ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘వలస చట్టాలు సరిహద్దు వద్ద ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తాయి. అధ్యక్షుడు తన అధికారంతో ఆ చట్టాలను అతిక్రమించలేరు’అని స్పష్టం చేసింది. -
ఇజ్రాయెల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారుల మధ్య వైట్హౌస్లో జరిగిన రెండో విడత చర్చల్లో ఈమేరకు ఒప్పందం కుదిరిందన్నారు. లెబనాన్కు హెజ్బొల్లా నుంచి అవసరమైన భద్రతను అమెరికా కల్పిస్తుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. -
చైనాకు షాకిచ్చిన అమెరికా!
ఇరాన్తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆచరణలోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీ సహా ఇరాన్ చమురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, ట్యాంకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్కు కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను నిలిపేయడానికి ట్రంప్ చేసిన ఎత్తుగడలో ఇదొక భాగమని చెప్పొచ్చు. అంతేకాదు ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన పర్షియన్ గల్ఫ్ జలమార్గమైన హర్మూజ్జలసంధిని అమెరికా దిగ్భంధనం చేసిన సంగతి తెలిసిందే. కాగా చైనాకు చెందిన హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీలో రోజుకు సుమారు 400,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది చైనాలోనే అతిపెద్ద స్వతంత్ర రిఫైనరీల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2023 నుంచి హెంగ్లీ రిఫైనరీ ఇరాన్ నుంచి ముడి చమురును సరఫరా చేసుకుంటూ ఇరాన్ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లకు చమురును తరలించడానికి ఇరాన్ ఆధారపడే నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారుల నెట్వర్క్ను మరింత కఠినతరం చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ మొదటివారంలో ఇరాన్తో వ్యాపారం చేస్తున్న చైనా, హాంగ్ కాంగ్, యూఏఈ, ఒమన్లోని ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తూ ఆంక్షలు విధిస్తామని లేఖలు పంపించింది. కాగా మరికొన్ని వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన కీలక రిఫైనరీపై ఆంక్షలు విధించడం ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది. -
మలి విడత చర్చలు.. పాక్కు అమెరికా ప్రతినిధులు!
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న మలి విడత శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్కు వెళ్లనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్తో జరిగే చర్చల్లో పురోగతి కనిపిస్తే వాన్స్ పాకిస్తాన్కు వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా మలి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆయన పాకిస్తాన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో వరుస హెచ్చరికలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇరాన్, అమెరికాకు చెందిన ప్రతినిధులు పాక్కు చేరుకోవడం చూస్తుంటే రెండో విడత శాంతి చర్చలు ఉంటాయనే అంచనాలు బలపడుతున్నాయి. -
‘ఓసారి భారత్ రండి’.. ట్రంప్నకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఘాటుగా స్పందించాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారత్, చైనా వంటి దేశాలను నరక కూపాలు(Hell-holes)గా అభివర్ణించడమే కాకుండా.. అక్కడి నుండి వచ్చే వలసదారులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అంటూ విమర్శించారు.ఈ క్రమంలో ‘భారత్ వచ్చి చూడండి’ అంటూ ముంబాయిలోని ఇరాన్ ఎంబసీ.. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. భారత్కు వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడాలంటూ సూచించింది ‘భారత్లోని అభివృద్ధి, సంప్రదాయాలు ట్రంప్నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకురావాలి’’ అంటూ పోస్ట్ పెట్టింది. భారత్ అందాలు ప్రశంసిస్తూ.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హెవెన్ మోడ్(స్వర్గంలా)ఉంటాయని... సాంస్కృతిక విలువలు ఎంతో గొప్పవని ఇరాన్ పేర్కొంది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా, ట్రంప్ ‘నరకం’ వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని.. అత్యంత దారుణంగా ఉన్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య ఉన్న పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే "బర్త్రైట్ సిటిజన్షిప్"(జన్మతః పౌరసత్వం) రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుండి వచ్చే వలసలను విమర్శిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే, పరిస్థితి ముదురుతుండటంతో అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ట్రంప్ గతంలో భారత్ను "గొప్ప దేశం" అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. -
హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధనౌక..!
-
ఇరాన్తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్పై ట్రంప్ క్లారిటీ
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ వాడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ దాడులద్వారానే ఇరాన్ సైన్యం చిన్నాభిన్నమైందంటూ వ్యాఖ్యానించారు. పర్మినెంట్ డీల్ కోసమే చూస్తున్నామని.. ప్రస్తుతం ఇరాన్ నేవీ, ఎయిర్ఫోర్స్ దెబ్బతిన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయిన ఇరాన్ను ఆర్థిక సుడిగుండంలో నిండా ముంచేందుకు హార్మూజ్ జలసంధిని గుప్పిట పట్టామని ట్రంప్ పునరుద్ఘాటించారు. జలసంధిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగేంచేందుకు అగ్రరాజ్య నావికాదళాలకు ఆయన గురువారం కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధిలో మన యుద్ధ నౌకలు, విదేశీ నౌకల రాకపోకలను పెను ప్రమాదంలోకి నెట్టేసే సముద్రమందుపాతరను వెనువెంటనే ఏరిపారేయండి...కొత్తగా మందుపాతరలను పెట్టేందుకు సముద్రజలాల్లో సంచరించే ఇరాన్ పడవలను వెంటనే పేల్చేయండి. అవి చిన్నపడవలు అనే కనికరం అస్సలు చూపకండి. ఇప్పటికే మన దెబ్బకు ఇరాన్ నావికాదళంలోని కీలక 159 నౌకలు మునిగిపోయి సముద్రగర్భంలోకి చేరాయి. మన మైన్ ‘స్వీపర్లు’ ఇప్పటికే సీమైన్స్ను ఏరిపారేయడంలో నిమగ్నమ య్యాయి. ఈ పనిని మూడు రెట్లు అత్యధిక వేగంతో పూర్తిచేసే బాగుంటుంది.హార్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది. ఇరాన్ మనతో ఒప్పందం కుదుర్చుకునేదాకా మన అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఐఆర్జీసీ ఆధిపత్యం, పాలకులతో విబేధాలతో తమ అసలైన అత్యున్నత నేత ఎవరు అనేది తేల్చుకోవడం ఇరానియన్లకు కష్టంగా మారింది. అతివాద నేతలేమో మన దాడుల్లో చనిపోతు న్నారు. ఉదారవాదులకు కాస్తంత గౌరవం దక్కుతోంది. ఇది నిజంగా క్రేజీ విషయం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం ఆత్రంగా ఎదురుచూడట్లేము. మాకు తొందరేం లేదు. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే జలసంధి దిగ్బంధించామని అమెరికాæ ఆర్థిక మంత్రి స్కాట్బీసెంట్ అన్నారు. ‘‘ఈ విషయంలో మా అధ్యక్షుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హార్మూజ్ సహా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తే ముడిచమురు సరఫరా ఆగిపోతుంది.దీంతో ఖర్గ్ ద్వీపంలోని ముడిచమురు నిల్వకేంద్రాలన్నీ క్రూడా యిల్లో నిండిపోతాయి. చమురుబావుల నుంచి సరఫరా అయ్యే ముడిచమురును నిల్వచేయడానికి చోటే ఉండదు. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో చమురుబావుల నుంచి వెలికితీత ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆపేస్తే మళ్లీ మొదలెట్టడం శ్రమతోకూడిన సంక్లిష్ట ప్రక్రియ. దీంతో ఆదాయం లేక ఇరాన్ చేతులెత్తేస్తుంది’’ అని హెచ్చరించారు. -
భారత్ నరకం ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.ట్రంప్ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన వివాదాస్పద లేఖను తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.కాగా దీనిపై తాజాగా భారత్ స్పందించింది " మేము ట్రంప్ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.మళ్లీ భారత్ను పొగిడిన ట్రంప్కాగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.అసలేం జరిగింది ?ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
ఇండియా గ్రేట్ కంట్రీ
న్యూఢిల్లీ: ట్రూత్ సోషల్లో తాను చేసిన రీపోస్టు వివాదాస్పదంకావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్టనివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు(నరేంద్ర మోదీ) నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అయితే, ఇండియా గ్రేట్ కంట్రీ అంటూ ట్రంప్ ఎక్కడ, ఎప్పుడు వ్యాఖ్యానించారో స్పష్టం చేయలేదు. -
ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్పై మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలుఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందనఅటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు. -
అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు
అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చలుకు రాయబారం నడుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఆ జలసంధిని బ్లాకేడ్ చేసిన నేపథ్యంలో జలసంధిలో మందుపాతరలు పెట్టడానికి యత్నిస్తున్న ఏ నౌకలైనా పేల్చిపడేయాలని తెలిపారు. ఈ మేరకు యుఎస్ నేవీని ఆదేశించినట్లు ప్రకటన విడుదల చేశారు.పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపేమో శాంతి చర్చల ప్రస్థావన తెస్తూనే మరోవైపు అమెరికా- ఇరాన్ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్నువసూలు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా బ్లాకేడ్కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సైతం హర్ముజ్ విషయంలో తీవ్రంగా స్పందిచారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో ఈ మేరకు పోస్ట్ చేశారు."హార్ముజ్ జలసంధి ప్రయాణిస్తున్న ఏ నౌకలైనా సరే ఏ బోట్లనైనా, అవి చిన్నవైనా పెద్దవైనా (వారి నౌకాదళ నౌకలన్నీ, మొత్తం 159 కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. పేల్చిపడేయాలని నేను యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించాను. ఇందులో ఎటువంటి సంకోచం ఉండకూడదు." అని ఆదేశించినట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం జలసంధిలో అమెరికా మైన్-క్లియరింగ్ (గనుల తొలగింపు) కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అదనంగా మరిన్ని మైన్ 'స్వీపర్లు' హర్ముజ్కు తరలించాలని దానిని మూడు రెట్లు పెంచాలని అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్పై విరుచుకుపడింది. చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్పై విషం కక్కిన ట్రంప్ -
భారత్పై మరోసారి విషం కక్కిన ట్రంప్
వాషింగ్టన్: వలసల విషయంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చిన ఓ లెటర్ను ట్రంప్ షేర్చేశారు. ఇండియా, చైనా దేశాలను అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్.. నరకకూపాలతో పోల్చగా.. ఆయన రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు. జన్మహక్కు పౌరసత్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ ఆ పోస్టు షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. ఆ జాత్యహంకార లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చేస్తున్న వాదనలను విమర్శిస్తూ సావేజ్ రాసిన లేఖతో పాటు వీడియోను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పంచుకున్నారు.ఇక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇచ్చే విధానంపై సావేజ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా భారత్, చైనా వలసదారులు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు.. వీళ్లు మనల్ని దోచుకున్నారు. ఈ గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది.. మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూశారు’’ అంటూ సావేజ్ రాసుకొచ్చారు. అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్పై అమెరికా మరో ట్విస్ట్..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.White House press secretary Karoline Leavitt said Wednesday that President Trump “has not set a firm deadline to receive an Iranian proposal" following another extension to the ceasefire."There's obviously a lot of internal division," Leavitt said, referring to Iran's… pic.twitter.com/zHXmKkdhrB— CBS News (@CBSNews) April 22, 2026 ఇరాన్ కౌంటర్.. మరోవైపు.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా గౌరవించక పోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హార్మూజ్ను తెరిచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. -
50 డేస్.. అమెరికా అట్టర్ ప్లాప్ షో..
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వేదిక చర్చల్లో కూడా సందిగ్ధత నెలకొంది. సీజ్ఫైర్ను ట్రంప్ పొడిగించినప్పటికీ అరకొరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇరాన్ సైతం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇరాన్పై దాడుల కారణంగా అమెరికా ఆయుధాల సంఖ్య రోజురోజుకి తరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది. ఇంతకీ అమెరికా వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు, ఆయుధాలు ఉన్నాయనే అంశం ఓ నివేదిక బయటకు వచ్చింది.అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. యుద్ధంలో ఇరాన్పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోయాయి. అయితే, అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి..టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు: యుద్ధానికి ముందు 3,100 ఉండగా.. యుద్ధం కోసం 850 వినియోగించబడ్డాయి. దీంతో, దాదాపు 25% నిల్వలు తగ్గాయి.JASSM (జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైళ్లు): 4,400 ఉండగా.. ఇరాన్ యుద్ధం కోసం 1,000 వినియోగించబడ్డాయి.THAAD ఇంటర్సెప్టర్లు: 360 ఉండగా.. 190–290 వినియోగించబడ్డాయి. ఇప్పుడు 70 మాత్రమే మిగిలి ఉన్నాయి.పాట్రియట్ PAC-3: 2,330 ఉండగా.. 1,060–1,430 వినియోగించబడ్డాయి. కేవలం 900 మాత్రమే మిగిలాయి.SM-6: 600 ఉండగా..200 వినియోగించారు. 400 వరకు ఉన్నాయి. SM-3: 150 ఉండగా.. 40 వరకు వినియోగం. ఇంకా 110 మిగిలి ఉన్నాయి.భవిష్యత్తు ప్రణాళిక.. భారీగా ఖర్చు..2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.టోమాహాక్: 55 నుంచి 785కి పెంపు( ఒక్క దానికి ఖర్చు: తయారీకి $2.6 మిలియన్ డాలర్లు).Patriot PAC-3: 357 నుంచి 3,203కి పెంపు ( $3.9 మిలియన్)THAAD: 55 నుంచి 857కి పెంపు($15.5 మిలియన్)SM-6: 166 → 540కి పెంపు($4.3 మిలియన్)SM-3: 12 → 136కి పెంపు($9–10 మిలియన్)ప్రధాన సమస్యలు..ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా వినియోగింపజేస్తున్నాయి.THAAD, Patriot లాంటి రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.ఉత్పత్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణం (టోమాహాక్ – 47 నెలలు, THAAD – 53 నెలలు, SM-36 నెలలు, SM-36 నెలలు) కావడంతో నిల్వలను తిరిగి భర్తీ చేయడం కష్టతరం అవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం.. యుద్ధంలో ప్రధానంగా షాహెడ్ డ్రోన్లు మరియు క్రూయిజ్ మిసైళ్లు వినియోగిస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటంతో అమెరికా మరియు మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. ఇరాన్ ఒకేసారి వందల డ్రోన్లను పంపి, అమెరికా THAAD మరియు Patriot వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లుShahed-136 ("కమికాజే" డ్రోన్)ఒకే దిశలో దాడి చేసే UAV (Unmanned Aerial Vehicle).ఖర్చు: సుమారు $20,000–$50,000 మాత్రమే.లక్ష్యం: శత్రు రక్షణ వ్యవస్థలను అధిక సంఖ్యలో దాడులతో అలసటకు గురి చేయడం.“పేదవాడి క్రూయిజ్ మిసైల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో క్రూయిజ్ మిసైల్ లాంటి ప్రభావం చూపుతుంది.UAE రక్షణ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభం నుండి 941 డ్రోన్లు గుర్తించబడ్డాయి, వాటిలో 65 UAEలో పడిపోయి మౌలిక వసతులకు నష్టం కలిగించాయి.Shahed-131 / Shahed-238 (అప్గ్రేడ్ వెర్షన్లు)Shahed-136 కంటే చిన్నవి లేదా వేగవంతమైనవి.కొన్ని జెట్-ఇంజిన్ ఆధారిత డ్రోన్లు కూడా వినియోగించబడ్డాయి, ఇవి మరింత వేగంగా ఉండి Patriot లాంటి రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి.ఇరాన్ క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిసైళ్లు1. Zolfaghar బాలిస్టిక్ మిసైల్700 కిమీ పరిధి.1,100 పౌండ్ల వార్హెడ్ మోసే సామర్థ్యం.ఇరాక్లోని ఎర్బిల్ ప్రాంతంలో పలు దాడుల్లో వినియోగించబడింది.2. Soumar క్రూయిజ్ మిసైల్రష్యా KH-55 ఆధారంగా అభివృద్ధి చేయబడింది.దీర్ఘదూర దాడులకు ఉపయోగపడుతుంది.3. Quds-1 / Quds-2 క్రూయిజ్ మిసైళ్లుతక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే సామర్థ్యం.గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక వసతులపై దాడులకు వినియోగించబడ్డాయి.ఇదిలా ఉండగా.. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. -
ఓ మై గాడ్.. ఇరాన్ ఎంత పని చేసింది?
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ ఆధిపత్య ప్రయత్నాలతో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఓ క్లారిటీ ఇచ్చింది.హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి కనీసం మరో ఆరు నెలల టైం పట్టవచ్చని తాజాగా పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులతో ఆ విభాగం రహస్యంగా ఓ సమావేశం నిర్వహించిందని.. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను అక్కడి సభ్యులకు వివరించిందన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఈ జాప్యానికి శాంతి చర్చలతో సంబంధం లేదని తెలుస్తోంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఈ ఆలస్యం జరగవచ్చని ఆ నివేదిక తెలిపింది. హర్ముజ్ రూట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువ మైన్స్నే అమర్చి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఇరాన్ జీపీసీ (Global Positioning Capability/Control) టెక్నాలజీ వాడింది. అందుకే వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. కాబట్టి.. వాటిని తొలగించడానికి టైం పట్టవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే..ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో వాటి తొలగింపు ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పెంటగాన్ ఈ కథనాలను ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇటీవల హర్ముజ్ జలసంధి సముద్ర మైన్స్ (Sea Mines) గురించి పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా, నౌకలు మైన్స్తో ఢీకొనే ప్రమాదం ఉందని హెచ్చరించి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పలు దేశాల వాణిజ్య నౌకలకు సూచించింది. అయితే డీల్ కుదిరాక ఇరాన్ సహకారంతోనే సీ మైన్స్ను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగే పని కాదంటూ ఇరాన్ ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేసింది. ఏయే యుద్ధాల్లో వాడారంటే..సీ మైన్స్ (Sea Mines) అనేవి సముద్రంలో ఉంచే పేలుడు పరికరాలు. ఇవి నౌకలు లేదంటే జలాంతర్గాములు (submarines) దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోతాయి. చరిత్రలో అనేక యుద్ధాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. 14వ శతాబ్దంలో చైనా సామ్రాజ్యంలో జపాన్ దొంగలపై వీటిని ఉపయోగించినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అమెరికన్ రెవల్యూషన్-సివిల్వార్ టైంలో అమెరికా తొలిసారిగా వాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో.. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొరియా, వియత్నాం యుద్ధాల్లోనూ వీటిని వాడారు. రష్యా నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్.. తాజాగా హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరులో ఇరాన్ వీటిని ఉపయోగించాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం కలుగుతూ వస్తోంది. హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం తమదేనని ఇరాన్.. అలా కుదరదు స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా వాదిస్తూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల(అణు ఒప్పందం ప్రధానంగా) కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో.. హర్ముజ్ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికా డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చడం, చర్చలకు(రెండో దఫా) ముందుకు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. -
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ అభ్యర్థన మేరకు.. ఇరాన్తో కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్టాపిక్గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు
టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.సమస్యల పరిష్కర్తగా కుక్..తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.15 ఏళ్ల ప్రస్థానం..దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్జాబ్స్ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
హర్ముజ్లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్లో వెళ్తున్న కంటైనర్ షిప్లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు. తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.భారత నౌకపై కూడా.. భారత్కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొన్నీమధ్య కూడా హర్ముజ్లో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కోరింది.ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు. -
ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా.. మొదటికే ముప్పు?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం కోసం అధ్యక్షుడు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. అయితే, సుసంపన్నం చేసిన యురేనియంను అప్పగించడానికి అమెరికా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పదార్థాన్ని దేశం నుండి బయటకు తీసుకురావడం అనేది చర్చల కంటే చాలా కష్టతరం కావచ్చు అంటూ పలు నివేదికలు చెబుతున్నారు. అమెరికాకు ఇది అంత సులభం కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో, ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా? అనే అనుమానాలు చర్చకు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మాజీ అధికారులు, అణు నిపుణులు ఈ ఆపరేషన్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన యురేనియం తొలగింపు ఆపరేషన్గా ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. ఇరాన్ యురేనియంలో అధిక భాగం ఇస్ఫహాన్ మరియు నతాంజ్ వంటి కేంద్రాలలో నిల్వ చేయబడిందని భావిస్తున్నారు. ఈ రెండూ ఇటీవలి నెలల్లో అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు గురయ్యాయి. దీంతో, అక్కడికి చేరుకోవడం కష్టమైంది. సొరంగాల ప్రవేశ మార్గాలను కూడా పూడ్చివేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయ తనిఖీ అధికారులు కొన్ని నెలలుగా ఈ ప్రదేశాలను సందర్శించలేదు.ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉంది. యురేనియం గురించిన దానిలో ఎక్కువ భాగం భారీ సిలిండర్లలో వాయు రూపంలో నిల్వ చేయబడింది. ఆ కంటైనర్లు చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో బృందాలు మొదట తనిఖీ చేయాలని నిపుణులు అంటున్నారు. అవి దెబ్బతిన్నట్లయితే, ప్రమాదాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఆ పదార్థాన్ని సురక్షితంగా అంచనా వేయడానికి మరియు వెలికితీయడానికి రిమోట్-ఆపరేటెడ్ పరికరాలు మరియు రోబోట్లతో సహా ప్రత్యేక పరికరాలు అవసరం కావచ్చు. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితులలో కార్యకలాపాలకు వారాలు పడుతుంది. దెబ్బతిన్న, దాడి అనంతర వాతావరణంలో, కాలపరిమితులు అనిశ్చితంగా మారతాయి. దాన్ని బయటకు తరలించడం సులభం కాదు. ఇక, అణ్వాయుధ పదార్థాల రవాణా ఒక సున్నితమైన పని. సంఘర్షణలతో కూడిన ప్రాంతం నుండి దీన్ని చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.ÚLTIMA HORA: Un periodista iraní afirma que se registraron nuevas explosiones en una instalación subterránea de almacenamiento de misiles en Isfahán (Irán), previamente atacada por EE.UU. antes del alto el fuego, con ondas expansivas sentidas en la zona.pic.twitter.com/RqZxZGZJL6— Isaac (@isaacrrr7) April 20, 20261990లలో కజకిస్తాన్ నుండి ఆయుధ సామగ్రిగా ఉపయోగపడే యురేనియంను తొలగించడంతో సహా, గతంలో అమెరికా చేపట్టిన మిషన్లు నియంత్రిత వాతావరణంలో జరిగాయి. అయితే, ఇరాన్ విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. భద్రత, విమాన రవాణా ఏర్పాట్లు వంటివి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.యురేనియం ఎక్కడికి పంపాలి?అయితే, శుద్ది చేసిన యురేనియాన్ని యునైటెడ్ స్టేట్స్కు పంపడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది. చర్చలో ఉన్న ప్రత్యామ్నాయాలలో రష్యా లేదా కజకిస్తాన్లో సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ఆ పదార్థాన్ని పలుచగా చేసి అంతర్జాతీయ పర్యవేక్షణలో నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఇరాన్ బదిలీకి అంగీకరించినప్పటికీ, ధృవీకరణ చాలా కీలకం. కొంత పదార్థం దాచడం లేదా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం తరలించబడిందా లేక ఉన్నచోట ఉందా అని నిర్ధారించడానికి పర్యావరణ తనిఖీలతో సహా, ఏ ఒప్పందానికైనా లోతైన తనిఖీలు అవసరం కావచ్చు.ఇరాన్ వద్ద 440 కిలోల యురేనియం..అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) గణాంకాల ప్రకారం.. 2025 జూన్లో అమెరికా దాడులకు ముందు ఇరాన్ వద్ద 60 శాతం సుసంపన్నమైన యురేనియం సుమారు 440 కిలోల వరకు ఉంది. అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ నిల్వల భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే దాడులకు గురైన ప్రాంతాల్లో తనిఖీలకు ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించడం లేదు.యురేనియం శుద్ధి ఇలా.. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది. 2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అదే విషయంలో ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారు.అయితే, కజకిస్తాన్ (1994), లిబియా (2003) యురేనియం/అణు పదార్థాల తొలగింపు ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. కానీ ఇరాన్ పరిస్థితి వాటితో పోలిస్తే చాలా క్లిష్టమైనది. యురేనియం తరలింపునకు కజకిస్తాన్, లిబియా ప్రభుత్వాలు సహకరించాయి. ఇరాన్ మాత్రం ప్రతిఘటనతో, భూగర్భ సదుపాయాల్లో పదార్థాన్ని దాచిపెట్టింది.కజకిస్తాన్ – Project Sapphire (1994)స్థితి: సోవియట్ యుగం తర్వాత 600 కిలోల weapons-grade HEU (Highly Enriched Uranium) ఉల్బా మెటలర్జికల్ ప్లాంట్లో నిల్వ.ఆపరేషన్: అమెరికా–కజకిస్తాన్ రహస్య సహకారంతో 31 నిపుణుల బృందం 6 వారాల పాటు పని చేసి, 1032 కంటైనర్లలో ఉన్న యురేనియాన్ని 448 సురక్షిత కంటైనర్లలో ప్యాక్ చేసింది.తరలింపు: 3 C-5 విమానాల ద్వారా Oak Ridge (USA)కి తరలించి, IAEA పర్యవేక్షణలో low-enriched uranium గా మార్చారు.ప్రధాన అంశం: కజకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది, అందువల్ల ఆపరేషన్ సురక్షితంగా, రహస్యంగా పూర్తయింది.లిబియా – Disarmament (2003–2004)స్థితి: గడాఫీ పాలనలో అణు, రసాయన, జీవ రసాయన ఆయుధాల ప్రోగ్రామ్లు కొనసాగాయి.తీర్మానం: 2003 డిసెంబర్ 19న గడాఫీ స్వచ్ఛందంగా WMD ప్రోగ్రామ్లను నిలిపివేస్తానని ప్రకటించాడు.ఆపరేషన్: అమెరికా, యుకే, IAEA పరిశీలకులు కలిసి యురేనియం సదుపాయాలు, సెంట్రిఫ్యూజ్లు, రసాయన ఆయుధాలను తొలగించారు.ప్రధాన అంశం: లిబియా అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు, ఇరాక్ యుద్ధం తర్వాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వచ్ఛందంగా సహకరించింది. -
ట్రంప్ ప్లాన్ బీ.. ఉక్కిరి బిక్కిరి నడుమే ఇరాన్ కౌంటర్
పశ్చిమాసియా యుద్ధంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాల పరిమితిని లేకుండా యుద్ధ విరమణను పొడిగించారు. అయితే ఇరాన్ దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని అంటోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా బాగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. ‘‘ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నౌకాదళ నిర్బంధం కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సైన్యానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతోంది. సైన్యంతో పాటు పోలీసులకు జీతాలు అందడం లేదు. నగదు కోసం ఇరాన్ ఆకలితో ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దానిని తిరిగి తెరవాలని తహతహలాడుతోంది’’ అని ట్రూత్ సోషల్ ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఇరాన్ తొలి నుంచి హర్ముజ్ మూసివేతకే మొగ్గుచూపుతూ వస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ దానిని తెరవాలని కోరుకుంటోందని అంటున్నారు. ‘‘ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించేది. ఇప్పుడు అదే మొత్తాన్ని కోల్పోతోంది. కాబట్టి తెరవాలనే చూస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటున్న మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఇప్పటికే సంకేతాలు పంపిందని.. కానీ, తగిన రాజకీయ రాయితీలు లేకుండా జలసంధి తెరిస్తే చర్చల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారాయన. ట్రంప్ వాదనలో నిజం లేదా?ఇరాన్ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అలాగే.. యుద్ధంతో సైన్య వ్యవస్థ ఘోరంగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. ప్లాన్ బీ ఇదే.. ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో ఇరాన్ యుద్ధంలో బలంగానే కనిపిస్తున్నా.. ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చర్చల కోసం ఇరాన్ మెడలు వంచాలని అమెరికా అడుగులేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాక్కు డాలర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ చర్య ద్వారా ఇరాన్ మద్దతు పొందిన మిలీషియాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని అడ్డుకోవడం.. వారి ప్రధాన ఆదాయ వనరులను కత్తిరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. చమురు ఎగుమతులే ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరు. అయితే ప్రస్తుతం అక్కడి పోర్టులపై అమెరికా నిర్బంధం కొనసాగుతోంది. దీనివల్ల చమురు బయటకు వెళ్లడం లేదు. ఈ ప్రభావంతో ఖార్గ్ దీవి (ఇరాన్ చమురు ఎగుమతుల 90% నిర్వహించే కేంద్రం) నిల్వలు నిండిపోయి ఉన్నాయి. కొత్తగా చమురు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో చమురు బావులను తాత్కాలికంగా మూసేసే పరిస్థితికి దారి తీసింది. ఇది.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అంటున్నారు. ఇరాన్ కౌంటర్సీజ్ ఫైర్ పొడిగింపు.. అమెరికా ఏకపక్ష నిర్ణయంగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ నాయకత్వం అభ్యర్థన మేరకు దాడుల్ని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ఇరాన్ కౌంటర్ వేసింది. ‘‘ సీజ్ ఫైర్ వంకతో ఈ గ్యాప్లో అమెరికా మళ్లీ దాడులు చేయాలని చూస్తోంది. అయినా ఓడిపోయేవాళ్లు నిబంధనలు పెట్టడం ఏంటి?’’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ ఖలీబాఫ్ ఓ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ పొడిగింపు కేవలం వ్యూహాత్మక ప్రయోజనం కోసమే. నౌకాదళ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పోర్టులకు వచ్చే నౌకలను ఆపడం కాల్పుల ఉల్లంఘన కాదా?. ఇది యుద్ధ చర్య కాకుండా మరేమిటి?. ఇలాంటి బెదిరింపుల మధ్య మేం చర్చలు జరపం అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలకు దూరంగా ఉండటం.. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేసుకోవడం.. ఈ రెండు పరిణామాలు కలిపి శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. -
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలపై తొలగని ఉత్కంఠ
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది మేమింకా వేచిచూస్తున్నాంఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.మరో నౌక స్వాదీనం: అమెరికా ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది. దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్ఇరాన్కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.ఆ 8 మందిని విడిచిపెట్టండిఇరాన్కు ట్రంప్ పిలుపు వాషింగ్టన్: ఇరాన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్లో అమె రికా–ఇరాన్ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు. -
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్ను ఇన్నాళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం మాత్రం ఆ దేశాన్ని ఓ కోరిక కోరారు. ఇరాన్ ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య చర్చలకు గొప్ప ఆరంభం అవుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్లో జరగాల్సిన చర్చలు అనిశ్చితిలో ఉన్న సమయంలో.. సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ చాలా కూల్గా విజ్ఞప్తి చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.‘నా ప్రతినిధులతో త్వరలో చర్చల్లో పాల్గొనబోయే ఇరాన్ నాయకులకు చెబుతున్నాను. ఈ మహిళలను విడుదల చేస్తే నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తాను. మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ మహిళలు గౌరవంగా భావిస్తారు, దానికి విలువ ఇస్తారన్న నమ్మకం ఉంది. దయచేసి వారికి ఎలాంటి హాని చేయవద్దు. ఇది మా చర్చలకు గొప్ప ఆరంభం అవుతుంది. ఈ విషయంపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా, ఎక్స్లో ఒకరు ఆ ఎనిమిది మంది మహిళల ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఈ ఎనిమిది మంది మహిళలను ఉరితీయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ సన్నాహాలు చేసుకుంటోంది. అంతర్జాతీయ సమాజం నుంచి, మానవ హక్కుల సంస్థలవారిమని చెప్పుకునే వారి నుంచి దీనిపై ఒక్క మాట కూడా రావడం లేదు’ అని అన్నారు. ఈ పోస్టుపైనే ట్రంప్ స్పందించారు.కాగా, ఇరాన్-అమెరికా మధ్య రెండో దశ చర్చలు ఇప్పటికే జరగాల్సి ఉండగా పాకిస్థాన్కు ఇరాన్ రాకపోవడంతో జరగలేదు. అసలు రెండో దశ చర్చలు జరుగుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం రాత్రిలో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ యుద్ధం జరుగుతుందా? అన్న భయాలు నెలకొన్నాయి. -
మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్ : ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణను పొడిగించేది లేదని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించాం. అద్భుతమైన డీల్తో చర్చలకు ముగింపు పలుకుతాం’అని అన్నారు. ముందస్తు ప్రకటించినట్లు ఏప్రిల్ 22తో ఇరాన్పై అమెరికా కాల్పుల విమరణ ఒప్పందం ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సీఎన్బీసీ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం విజయవంతంగా ముగిస్తాం. పశ్చిమాసియా యుద్ధ చర్చల్లో అమెరికా స్థానం బలంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశం లేదు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అమెరికా కాల్పుల విమరణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. పొడిగింపులు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ నిర్ణయం అమెరికా తన చర్చా శక్తిని తగ్గించకుండా, ప్రత్యర్థులపై ఒత్తిడి కొనసాగించడానికి తీసుకున్నదని ఆయన సూచించారు.మేము చివరికి ఒక గొప్ప ఒప్పందాన్ని సాధిస్తాం. అమెరికా భవిష్యత్తు చర్చలు విజయవంతంగా ముగుస్తాయని, దేశానికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
ఇద్దరిలో ఓ మెట్టు దిగాల్సింది ఎవరు?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.అమెరికా ఏం కోరుకుంటోందియురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై నియంత్రణ.లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.సాధ్యమైన సడలింపులు ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్కు తిరిగి ప్రవేశం కల్పించడం.మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.ఒప్పందం కుదిరితేప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.ఆర్థిక లాభం: ఇరాన్పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.చమురు మార్కెట్పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.ఒప్పందం కుదరకుంటేఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశంఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ట్రంప్కే ఝలక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. వీడియో చూశారా?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ టీ తాగుతూ ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.దీనికి డొనాల్డ్ ట్రంప్ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్సీస్లో ఎస్వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Dear NRI Simhalu… ❤️🔥#GaayaPaddaSimham Roaring Overseas Release by @SVCRelease @PrathyangiraUS 🦁🔥TRUMP’ING PREMIERES on APRIL 30 💥#GPS #TharunBhascker @JDmaxmode @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @pavansadineni @SAMWoffl @POVStoriesOffl @zeestudiossouth pic.twitter.com/7kqGeFXVl2— Prathyangira Cinemas (@PrathyangiraUS) April 21, 2026 -
పాకిస్థాన్కు ట్రంప్..? యుద్ధం ముగిసేనా..!
ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు విఫలానికి కారణంట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
Magazine Story: యుద్ద కాండ
-
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్కు షాక్ ఇచ్చే విధంగా జిన్పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్పింగ్.. హర్మూజ్ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. -
ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ మొండి పట్టుదలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ముగియనున్న డెడ్ లైన్ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్నప్పటికీ జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందాన్ని తదుపరి చర్చల కోసం పాకిస్తాన్కు పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే అమెరికా తన కఠిన వైఖరిని మార్చుకుంటే తప్ప తాము చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. ترامپ با اعمال محاصره و نقض آتشبس میخواهد تا به خیال خود این میز مذاکره را به میز تسلیم تبدیل کند یا جنگافروزی مجدد را موجّه سازد. مذاکره زیر سایهٔ تهدید را نمیپذیریم و در دو هفتهٔ اخیر برای رو کردن کارتهای جدید در میدان نبرد آماده شدهایم.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 20, 2026ట్రంప్ సంచలన హెచ్చరికచర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సైనికపరమైన చర్యలు కూడా ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. తమ లక్ష్యం కేవలం తాత్కాలిక శాంతి కాదని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని ఆయన తెలిపారు. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.బెదిరింపులకు భయపడం: ఇరాన్ఒత్తిడి తెచ్చి ఒప్పందాలకు తమకు ఒప్పించాలని చూస్తే అంగీకరించబోమని ఇరాన్ అధికారులు తేల్చిచెప్పారు. ‘అమెరికా బెదిరింపుల నీడలో మేము చర్చలు జరపబోము’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త వ్యూహాలతో బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో సోమవారం చర్చించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం -
ట్రంప్ కొత్త రాగం.. మా కండీషన్ అదే..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. -
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
-
ట్రంప్ ఆదేశాలతోనే ఇజ్రాయెల్కు
తూత్తుకుడి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడం వల్లే ఇరాన్ యుద్ధానికి ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైళ్లు, అదానీ పుణ్యమా అని ట్రంప్ దూకమంటే దూకేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ సోమవారం తూత్తుకుడిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ప్రధాని మోదీ తాను ఫోన్ చేస్తే సర్..అంటూ సంబోధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారని రాహుల్ పేర్కొన్నారు. ట్రంప్ను తాను సర్ అని సంబోధిస్తాను కాబట్టి, తమిళనాడు సీఎం కూడా తనను సర్ అంటూ గౌరవించాలని మోదీ అనుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ అలా అనకపోవడం మోదీకి నచ్చడం లేదన్నారు. అందుకే, సర్..అంటూ గౌరవించే అన్నాడీఎంకే నేతను తమిళనాడు సీఎంగా కూర్చోబెట్టాలని, రాష్ట్రాన్ని పూర్తిగా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. అలా తమిళనాడు ప్రజలు ఎన్నటికీ జరగనివ్వరని విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ మోడల్ను తమిళనాడులోనూ అమలు చేయాలని బీజేపీ ప్రయతి్నస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమిళ వ్యతిరేక సంస్థలని మండిపడ్డారు. -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
మలి విడత చర్చలు.. పాక్కు వెళ్లని జేడీ వాన్స్!
పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదురుతోంది. రెండో విడత చర్చల కోసం పాక్కు వచ్చేది లేదని ఇరాన్ మొండికేసి కూర్చుంది. మరోవైపు అమెరికా ప్రతినిధులు మాత్రం ఇరాన్తో రెండో విడత చర్చల కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకున్నట్లు వార్తలు వచ్చిన వేళ ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇరాన్తో చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్కు వెళ్లలేదనే రాయిటర్స్ తమ కథనంలో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు చెందిన కాన్వాయ్ వైట్హౌస్కు చేరుకోవడం ఈ విషయానికి మరింత బలం చేకూర్చినట్లయింది. బుధవారంతో ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జేడీ వాన్స్ అసలు పాక్కు వెళ్లలేదని వస్తున్న వార్తలతో మలి విడత చర్చలు జరగడం అనుమానమే. తొలి విడత చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్హౌస్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. మరోవైపు శాంతి చర్చలకు హాజరయ్యే విషయాన్ని తాము ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్కు పేర్కొన్నారు. -
గల్ప్ దేశాలకు గుణపాఠం..
ఇరాన్పై అమెరికా-ఉక్రెయిన్ దాడుల కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్, అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇటు ఇరాన్ ప్రతి దాడులతో గల్ప్ దేశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు అమెరికా ఇచ్చిన ప్రధాన భరోసా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ THAAD (Terminal High Altitude Area Defense) విఫలం కావడంతో గల్ప్ దేశాలకు కునుకు పట్టడం లేదు. భారీగా డబ్బులు వెచ్చించి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసినప్పటికీ ఇలా జరగడంతో పలు దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఇజ్రాయెల్-అమెరికాలతో ఇరాన్ తనకున్న పరిమితి వనరులతోనే ధైర్యంగా పోరాటం చేస్తూ వ్యూహాత్మకంగా ఎదురుదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడి, శత్రువుల ఆయుధాలను నాశనం చేసింది. ఇదే సమయంలో గల్ప్ దేశాల్లో ఉన్న రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు చేధించడం చర్చనీయాంశంగా మారింది. గల్ప్ దేశాలకు అమెరికా అందించిన అత్యాధునిక టెక్నాలజీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్, Patriot PAC-3 లాంటి వ్యవస్థలను ఇరాన్ మట్టికరిపించింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2025 మేలో రియాద్ వేదికగా గల్ప్ దేశాలతో 142 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.11.8 లక్షల కోట్)లు విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో THAAD, Patriot అప్గ్రేడ్లు, డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తయారు చేయబడ్డాయి. కానీ, ఇరాన్ క్షిపణి దాడులకు ఇవి నిలవలేకపోయాయి. అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేయగా, ఇరాన్ ప్రతీకారంగా 400 క్షిపణులు, 1000 డ్రోన్లు గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. దీంతో.. THAAD రాడార్లు (AN/TPY-2) జోర్డాన్, సౌదీ, యూఏఈలో నాశనం అయ్యాయి. Patriot వ్యవస్థలు కొంతమేర అడ్డుకున్నా, భారీ సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, క్షిపణులను తట్టుకోలేకపోయాయి. సౌదీ, యూఏఈలోని ఎయిర్బేస్లు, ఇంధన సదుపాయాలు, పట్టణాలు నేరుగా దెబ్బతిన్నాయి. రక్షణ కోసం గల్ఫ్ దేశాలు ఖర్చు చేసిన వందల బిలియన్ల డాలర్లు ఆశించిన మేరకు రక్షణ ఇవ్వలేకపోయాయి. అమెరికా కవచం “ఇనుప గోడ” అని చెప్పబడినా వ్యవస్థ వాస్తవంలోకి రాగానే తుస్సుమనిపించింది.ఇక, సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఒక్కో దాని విలువ 300 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,760 కోట్లు). ‘ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు.. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరాకో అన్నారు. థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన ఆరు లాంఛర్లు, మొత్తం 48 ఇంటర్సెప్టర్ క్షిపణులు (ప్రతి లాంచర్కు 8 వంతున), ఒక TPY-2 రాడార్తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 13 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గగనతల, రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయాలంటే ఇదొక్కటే మార్గమని పసిఫిక్ ఫోరమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుడు విలియమ్ అల్బెర్క్యూ అన్నారు.🚨⚡️ BLINDED: Iranian strikes destroy the $1.1 Billion US Radar in Qatar! 🇶🇦🇺🇸🇮🇷Al Jazeera reveals the destruction of the AN/FPS-132 system at Al Udeid.Iran successfully neutralized the "Brain" of THAAD and Patriot defenses! pic.twitter.com/m5xi4sdBDb— RussiaNews 🇷🇺 (@mog_russEN) April 10, 2026ఇదిలాఉండగా.. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ ముందు సీఎన్ఎన్ నివేదించింది. అనంతరం, ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి సైతం ధ్రువీకరించారు.THAAD బ్యాటరీ అంటే ఏమిటి? THAAD అనేది అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. స్వల్ప-శ్రేణి, మధ్యస్థ, దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనిని 'అమెరికన్ బ్రహ్మాస్త్ర' అని కూడా అంటారు. వాతావరణం లోపల, వెలుపలి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఏకైక వాయు రక్షణ వ్యవస్థ దీనికి కారణం. అందుకే అమెరికా THAAD సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుస్తుంది.THAAD ఎలా పని చేస్తుంది? THAAD అనేది ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను వాటి ఫ్లైట్ టెర్మినల్ దశలో (లక్ష్యానికి దగ్గరగా) మాత్రమే అడ్డుకునేలా రూపొందించబడింది.THAAD షార్ట్, ఇంటర్మీడియట్ , ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది.ఇందులో ఎలాంటి పేలుడు వార్హెడ్లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. ఇది గతిశక్తి (శక్తి వినియోగం) సహాయంతో లక్ష్యాలను నాశనం చేస్తుంది.THAAD ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ప్రత్యేకంగా అమెరికన్ సైనికులచే నిర్వహించబడుతుంది.THAAD ప్రధాన భాగాలు? THAADలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి, ఇందులో ఇంటర్సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్లు ఉన్నాయి.ఇంటర్సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్ని ఉపయోగించి ఇన్కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది, అయితే లాంచ్ వెహికల్స్ ఇంటర్సెప్టర్ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి.అదేవిధంగా, రాడార్ సాంకేతికతలు 870 నుండి 3,000 కి.మీ పరిధిలో బెదిరింపులను గుర్తించగలవు. అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్సెప్టర్ల ప్రయోగ, లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి. IMO, this is the best shot of an Iranian missile attack in this war so far. This was at Prince Sultan Airbase in Saudi Arabia.The US lost a THAAD radar & an E-3 Sentry AWACS at this base. Both were executed by $20K drones. pic.twitter.com/UsrpcQWfol— Dr. Syed Mohd Murtaza مرتضیٰ (@syedmohdmurtaza) April 14, 2026చర్చలే కీలకం.. THAAD, Patriot లాంటి వ్యవస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో బలహీనతలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో పొరుగు దేశాలతో శాంతి ఒప్పందాలు, చర్చలు, పరస్పర అవగాహన క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్ దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తే భద్రతా వ్యవస్థలు మరింత బలపడతాయి. ఇదే సమయంలో స్వదేశీ సాంకేతికత, స్థానిక రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తే ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
సీజ్ ఎఫెక్ట్.. ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్ నౌకలపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌకను అమెరికా సీజ్ చేసింది. దిగ్భంధనాన్ని దాటినందుకు తౌస్కా అనే వాణిజ్య నౌకపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో, ఈ చర్యకు ప్రతిస్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అనంతరం, అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను ఐఆర్జీసీ తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బెంజిమిన్ నెతన్యాహు తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ..‘ఇరాన్పై పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా మరిన్ని పరిణామాలు చోటుచేసుకోవచ్చు. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అలీ రిడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్లోని బింట్ జెబీల్ పట్టణానికి హెజ్బొల్లా కమాండర్గా అబ్బాస్ ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ హుస్సేన్ పేర్కొన్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.చర్చలు లేవన్న ఇరాన్..అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
-
‘ప్రతీకారం తీర్చుకుంటాం..’ అమెరికా-ఇరాన్ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంబన కొనసాగుతుండగా.. అమెరికా నౌకాదళం ‘‘టౌస్కా’’ అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని.. అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖాతమ్ అల్-అన్బియా ఈ చర్యను.. సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా రెండు వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో.. నౌకను అమెరికా మెరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు.మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ.. తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే, తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.చర్చలపైనా ఉత్కంఠఇరాన్–అమెరికా మధ్య ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్కు వెళ్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఇరాన్ మాత్రం ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హర్ముజ్లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇరాన్పై భగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్ దిగిరాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని.. భీకర దాడులు జరుపుతామని ట్రంప్ అంటున్నారు. -
చర్చలకు ఇరాన్ నో
వాషింగ్టన్: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొంటారని అనంతరం వైట్హోస్ పేర్కొంది. అనంతరం ఇరాన్ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఇస్లామాబాద్లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్కు ఇరాన్ అంగీకరించలేదు. విరమణకు ఇరాన్ తూట్లు: ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.హార్మూజ్ ఉద్రిక్తంహార్మూజ్లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్లో శనివారం భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్ అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.బయటకు వెళ్లిపో!హార్మూజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. ఆఫ్రికా దేశాలకు..!
అమెరికాలోని అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా థర్డ్ కంట్రీ ప్రోగ్రామ్ కింద లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వలసదారులను ఆఫ్రికా దేశమైన కాంగోకు తరలించారు. దీనిపై మానవహక్కులు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.వివాదాలకు కేరాఫ్ అడ్రసైన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే చేసిన మెుదటి పని అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం. వీరు ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో ఉండేది లేదంటు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలు రకాల పథకాలు ప్రవేశపెట్టి అమెరికా నుంచి వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న లాటిన్ అమెరికా దేశస్థుల కోసం ట్రంప్ ప్రత్యేక ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా 15 మంది వలసదారలతో కూడిన మెుదటి బృందాన్ని కాంగో రాజధాని కిన్షాసాకు తరలించారు. అక్కడ హోటళ్లలో వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరికి అవసరమైన ఖర్చులను అమెరికా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపారు. అయితే ఈ తరలింపును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే అంతర్యుద్ధం, మానవహక్కుల ఉల్లంఘన తరచుగా జరిగే దేశంలోకి వలసదారులను పంపడమేంటని ప్రశ్నిస్తున్నాయి. తమ సొంత దేశం కాని, ఎప్పుడూ చూడని దేశానికి వలసదారులను పంపడం వల్ల వారి భద్రతకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే రానున్న రోజుల్లో నెలకు సుమారు 50 మంది చొప్పున మరికొంత మందిని కాంగోకు పంపే అవకాశం ఉందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.ఏమిటి ఒప్పందం అమెరికాలోని లాటిన్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులలో తమ స్వదేశాలకు తిరిగివేళ్లేందుకు కోర్టుల ద్వారా రక్షణ పొందిన వారిని తరలించడం కోసం ట్రంప్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కాంగోతో పాటు ఆఫ్రికాలోని ఇతర దేశాలైన ఘనా, ఉగాండా, రువాండా, దక్షిణ సూడాన్ మరియు ఎస్వాతిని లతో కూడా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకుంది.దీనిని "థర్డ్-కంట్రీ డిపోర్టేషన్ అగ్రిమెంట్" గా పిలుస్తారు. ఈ తరలింపులో భాగంగా వలసదారుల వసతికి, భోజనానికి మరియు ఇతర ఖర్చులకు అయ్యే ప్రతి పైసాను అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఆశ్రయం ఇచ్చే దేశాలకు ఎటువంటి ఖర్చు ఉండదు. -
ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం
-
యుద్ధం వేళ మిత్ర దేశాలకు ట్రంప్ ఝలక్..
వాష్టింగన్: ఇరాన్, అమెరికా యుద్ధం, ఉద్రిక్తత వేళ అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్.. అమెరికాకు అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశమని కితాబు ఇచ్చారు. అమెరికాకు గొప్ప భాగస్వామి అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా.. ఇజ్రాయెల్ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా అమెరికాకు గొప్ప భాగస్వామి. అమెరికాకు ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశం. ఇజ్రాయెల్ ప్రజలు ధైర్యవంతులు, తెలివైనవారు, సాహసవంతులు. ఇరాన్ యుద్ధం వంటి సంక్షోభం లేదా ఒత్తిడి సమయంలో ఇతర దేశాలు తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుంటే, ఇజ్రాయెల్ మాత్రం గట్టిగా నిలబడి పోరాటం చేస్తోంది. విజయం ఎలా సాధించాలో ఇజ్రాయెల్కు బాగా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ఈ మద్దతు ప్రకటన వెలువడటం విశేషం.President Donald Trump strongly praised Israel, declaring:"Whether people like Israel or not, they have proven to be a GREAT Ally of the United States of America."A powerful reaffirmation of the enduring US-Israel strategic partnership.#Trump #Israel #USIsraelAlliance… pic.twitter.com/YXqqMcoo9j— News Narrative (@NewsNarrative1) April 19, 2026ఇదిలా ఉండగా.. మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ మైత్రి బలపడుతుండగా, మరోవైపు ఇరాన్ చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత వంటి నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నాయి. -
బీటా హెమ్మతిని చంపేస్తామని ఇరాన్ బెదిరింపులు.. మౌనంగా డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న మహిళ బీటా హెమ్మతికి మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. నిరసనలకు గాను మరణశిక్షకు గురైన తొలి మహిళగా బీటా నిలిచింది. ప్రస్తుతం మరణశిక్ష ఖైదీలుగా ఉన్న నలుగురిలో ఆమె ఒకరు. బీటాతో పాటు ఆమె భర్త మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్కూ మరణశిక్ష విధించాలని అధికారులు నిర్ణయించారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన, పదుల వేల మంది అరెస్టులకు దారితీసిన నిరసనలలో పాల్గొన్నందుకు ఇరాన్ ఇప్పటివరకు ఏడుగురికి ఉరిశిక్ష అమలు చేసింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త యుద్ధం నేపథ్యంలో మరణశిక్షల అమలుపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్, అతని భార్య బీటా హెమ్మతి, బెహ్రూజ్ సమనేజాద్, కౌరోష్ సమనేజాద్లకు విధించనున్న మరణశిక్షపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.అమెరికా జోక్యం తర్వాత, జనవరి నిరసనల్లో అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీ (26)కి విధించిన మరణశిక్షను ఇరాన్ తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ భద్రతకు హాని కలిగించడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ, అటువంటి నేరాలకు మరణశిక్ష విధించరాదని కొత్త వివరణ ఇచ్చారు.జనవరి 10న నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీకి జనవరి 14న ఉరిశిక్ష అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం అనూహ్యంగా వాయిదా వేసి, అతనిపై విధించిన ఆరోపణలు మరణశిక్షకు తగినవి కావని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం మరణశిక్షకు గురైన ఇతర ఖైదీల విషయంలో ట్రంప్ మౌనం వహిస్తున్నారు. -
హార్మూజ్పై ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్.. అమెరికా, ఇజ్రాయెల్పై నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. అయితే, వనరులు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలవలేరు అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అంతర్జాతీయ ఇంధన రవాణాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం. ఈ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్ను ప్రపంచ దేశాల నుంచి వేరు చేయాలని వారు చూశారు. కానీ, ఇరాన్ నౌకాదళం, క్షిపణి దళాల పహారా ముందు వారి ప్రయత్నాలు సాగలేదు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. శత్రువుల దగ్గర వనరులు ఉన్నా, వాటిని ఉపయోగించే ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. యుద్ధంలో ఇరాన్ సాధించిన పైచేయిని చూసి అగ్రరాజ్యం భయపడి ఒప్పందానికి వచ్చింది. మొదట హెచ్చరికలు జారీ చేసిన శత్రువులు, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు’ అని సెటైర్లు వేశారు.Mohammad Bagher Ghalibaf:“We are fully prepared, if they make even the slightest mistake, we will respond with force.”The message is clear: escalation won’t go unanswered. The stakes just got higher. pic.twitter.com/SuOEkhH2wj— Irfan Ahmad (@Irfuu_) April 18, 2026ట్రంప్ ఆటలు సాగవు..ఇరాన్ను బలహీనపరచాలని శత్రు దేశాలు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఇరాన్ తన పరిమిత వనరులతోనే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ కలలు కన్నారు. కానీ, ఇరాన్ గడ్డపై ట్రంప్ ఆటలు సాగవు. ఇరాన్ అంటే వెనిజులా కాదని, ఇక్కడ శత్రువుల బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం లేదు అనేది ముందుగా తెలుసుకోవాలి’ అని హెచ్చరించారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో ఇరాన్ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు హార్మూజ్ జలసంధిని మూసే ఉంటుందని స్పష్టం చేశారు.‘అమెరికా ఫస్ట్’ కాదు.. ఇజ్రాయెల్ ఫస్ట్.. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ట్రంప్ చెప్పిన అమెరికా ఫస్ట్ నినాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన.. ట్రంప్ పదేపదే చెబుతున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదం గాలికి వదిలేశారు. ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం ఆచరణలో లేదన్నారు. ఆయన ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అనే నినాదం ఎత్తుకున్నట్టు ఉన్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇచ్చే తప్పుడు సమాచారంతో అమెరికా తన విదేశీ విధానాలను నాశనం చేసుకుంటోంది అంటూ విమర్శించారు. -
‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!
అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్లో కూడా. ఆ వార్ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్... రేలంగి అంకుల్ సార్. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. ‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... ‘‘ఈ ట్రంప్ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. ‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్కు ఇంటికి గ్యాసు సిలెండర్ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద... క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. బజ్జీల బండ్లకూ, టిఫెన్ హోటళ్లకు బ్లాకులో తప్ప కమర్షియల్ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. అన్నట్టొరేయ్... ఈ వార్ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు. అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్ పూనాడు. అప్పుడా రావు రమేశ్ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... ‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!– యాసీన్ -
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ లేనంత స్నేహ బంధం కొనసాగుతోంది. పాక్ నేతలు అమెరికా వెళ్లడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కావడం, ఈ క్రమంలో పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం చూశాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్పై ట్రంప్ దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను టెన్షన్కు గురి చేస్తోంది. మునీర్తో స్నేహమంటే అమెరికాను రెడ్ జోన్లోని నెట్టేయడమేనని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఇంటెలిజెన్స్ను భయపెడుతున్న అంశాలను పరిశీలిస్తే..అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్పై కొత్త చర్చలు మొదలయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ఆయనను ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలిచారు. కానీ అమెరికా గూఢచార సంస్థలు, ప్రాంతీయ విశ్లేషకులు మాత్రం మునీర్కి ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు ఒక రెడ్ అలర్ట్గా భావిస్తున్నారు.ఇరాన్తో సంబంధాలు..మునీర్ గతంలో ఇరాన్కి చెందిన ప్రముఖ సైనిక నాయకులు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీమ్ సోలేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హొసేన్ సలామీతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించారు. అలాగే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.మధ్యవర్తిత్వం అవకాశమా? ప్రమాదమా?మునీర్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. మరోవైపు వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.చారిత్రక అనుమానాలు..అమెరికా విధాన వర్గాల్లో పాకిస్తాన్పై అనుమానం కొత్తది కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) విశ్లేషకులు, ముఖ్యంగా బిల్ రోజ్జియో, పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, లేక గూఢచార సంస్థల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధాన అంచనాలలో మునీర్ ఒక ఉపయోగకరమైన దౌత్య వారధిగా నిలుస్తారా? లేక ఒక సంభావ్య వ్యూహాత్మక భారంగా పరిణమిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇక, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా మారుతూ రావడం కొసమెరుపు. -
‘ట్రంప్తో వాదనకు ఏమాత్రం ఆసక్తి లేదు’
రోమ్: ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాదించేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని క్యాథలిక్కుల మతపెద్ద పోప్ లియో–14 స్పష్టం చేశారు. దైవ సందేశాన్ని బోధించడమనే తన కర్తవ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి అంగోలాకు విమానంలో వెళ్తూ మీడియాతో ఆయన మాట్లాడారు.తన బోధనలు ట్రంప్ను ప్రత్యక్షంగా ఉద్దేశించినవి కావని, విస్తృత శాంతి సందేశంలో అవి ఒక భాగమని వివరించారు. తన పర్యటన మొదటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఏర్పడిన రాజకీయ వాతావరణం కారణంగా.. తనపై వ్యతిరేక ప్రచారం జరిగిందన్నారు. అందులోని కొన్ని అంశాలు నిజాలు కావని చెప్పారు. -
10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ అత్యంత కీలకమైన సమాచారం తెల్సిన కనీసం 10 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు అదృశ్యం కావడం లేక మరణించడంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. అమెరికా ఏరోస్పేస్, రక్షణ, గ్రహాంతర జీవులకు సంబంధించిన విషయాలు వీరికి సమగ్రంగా తెల్సునని చెబుతున్నారు. ట్రంప్ ఉత్తర్వుల నేపథ్యంలో మరో వారం పదిరోజుల్లో వీరికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకుల అదృశ్యంపై హౌస్ ఓవర్సైట్ కమిటీలోని కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ బర్లిసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వెనుక రష్యా, చైనా, ఇరాన్ల హస్తం ఉండేందుకు అవకాశాలు లేకపోలేదన్నారు. -
మోదీ గుట్టు ట్రంప్కు తెలుసు
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు. శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు. -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ విషయం, ఇరాన్తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్ ఇరాన్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.#WATCH | On being asked if he will extend the ceasefire, US President Donald Trump says, "Maybe I won't extend it. But the blockade is going to remain. So you have a blockade, and unfortunately, we'll have to start dropping bombs again..."(Source: The White House) pic.twitter.com/6HURzpzE0s— ANI (@ANI) April 18, 2026మళ్లీ మూసివేస్తాం: ఇరాన్ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.ఐఆర్జీసీ హెచ్చరిక.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. -
ఇక చాలూ.. ఇజ్రాయెల్పై ట్రంప్ అసహనం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. మిత్రదేశం ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లెబనాన్పై దాడులు కొనసాగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో దాడులు ఇకనైనా ఆపాలంటూ ట్రంప్ సూచించారు.‘‘లెబనాన్పై ఇజ్రాయెల్ ఇక దాడులు చేయడానికి వీల్లేదు. వాళ్లు దాడులు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఇక చాలు..’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం తర్వాతే హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అంగీకరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రెండు వారాల యుద్ధ విరమణ.. శాంతి చర్చలకు ఇరాన్-అమెరికాలు ముందుకు వచ్చాయి. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దాడులు ఆగకుంటే శాంతి చర్చలు ముందుకు సాగవని చెబుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ఏమో.. లెబనాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న హెజ్బొల్లా గ్రూపులతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతూ దాడులు కొనసాగించింది. దీంతో లెబన్నాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చల కోసం అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.ట్రంప్ తాజా హెచ్చరికలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ వార్నింగ్ కంటే ముందే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. దక్షిణ లెబనాన్లో తమ సైన్యం మోహరింపు కొనసాగుతుందని ప్రకటించారు. ‘‘రాకెట్ దాడులు, డ్రోన్ల ముప్పు ఇంకా ఇజ్రాయెల్ తొలగిపోలేదు. అందుకే మేం చేయాలనుకున్నది చేస్తాం. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు చెప్పలేను’’ అని మీడియా ముందు నెతన్యాహు ప్రకటించారు.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. 38 రోజుల తర్వాత ఇరు దేశాలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. అయితే లెబనాన్ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని ఇరాన్ చెబుతుండగా.. అదసలు వేరే అంశమని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి ఇస్లామాబాద్ వేదికగా రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 22వ తేదీతో ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. -
గంటలో ట్రంప్ 7 అబద్ధాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది అసలు నోరేనా? అని అంటోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్హౌజ్ వేదికగా ఒక్క గంటలో ఆయన ఏడు ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఏ ఏడు ఏంటంటే.. ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకా దళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తాము హార్ముజ్ను మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. డోనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఎక్స్ వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధనం కొనసాగితే, హార్ముజ్ జలసంధి ఎంతమాత్రం తెరిచి ఉండదంటూ ఆయన స్పష్టం చేశారు. "వారు ఈ అబద్ధాలతో యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో కూడా ఎక్కడికీ వెళ్లలేరు. జలసంధి తెరిచి ఉందా లేదా అనేది క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయి కానీ సోషల్ మీడియా కాదు. ట్రంప్ ఒక గంటలో ఏడు ఆరోపణలు చేశారని.. అవన్నీ అబద్ధాలు’’ అంటూ ఘలీబాఫ్ కొట్టిపారేశారు. అయితే, ఆ ఏడు అవాస్తవాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా వివరించలేదు.లెబనాన్లో కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ దీనిని తెరిచినప్పటికీ, వాణిజ్య నౌకలు భద్రతా హామీల కోసం వేచి చూస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అయితే, ఇరాన్ యుద్ధంపై గతంలో ట్రంప్ ఏడు స్టేట్మెంట్లను పరిశీలిస్తే.. అవన్నీ అబద్ధాలేనని తేలింది. హార్ముజ్ పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఇరాన్.. మా అనుమతితో మాత్రమే తెరుస్తామని చెబుతోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా.. ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అంటూ అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని ఇరాన్ చెప్పింది. ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యలను ఘలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ యుద్ధంలో నిలబడిందని పేర్కొన్నారు.అలాగే, చర్చలు దాదాపు పూర్తయ్యాయని ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యురేనియం తరలింపు వంటి అంశాలు ఎప్పుడూ చర్చల్లో లేవని స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని పేర్కొంది. హార్ముజ్ ఎప్పటికీ తెరిచి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ఆంక్షలు కొనసాగితే హార్ముజ్ను మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం త్వరగా కుదురుతుందని ట్రంప్ చెప్పగా.. ఇది అవాస్తమంటూ పేర్కొన్న ఇరాన్.. చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని తెలిపింది.హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. మా అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ చెప్పిందినావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ అన్నారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతోందని ఇరాన్ అంటోందిఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసిందిచర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోందిశుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోందిహర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించిందిడీల్ త్వరలోనే అని ట్రంప్.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరణ -
ఇరాన్కు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వంమరోవైపు ఇరాన్పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.సుమారు 40 దేశాల నాయకులు హాజరుకాగా మాక్రాన్తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది. -
ఇరాన్.. హర్ముజ్.. ట్రంప్.. అంతా గందరగోళమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేందుకు రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్లు సిద్ధపడుతున్నాయి. తేదీ ఇంకా ఖరారు కాకపోయినా మళ్లీ పాకిస్తాన్ వేదికగానే చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు.. ఇటు ఇరాన్ వాటిని ఖండించుకుంటూ పోతుండడం ఈ సంక్షోభంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఓ మెట్టు కిందకు దిగింది. లెబనాన్ కాల్పుల విరమణ కుదరడంతో హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ‘హర్ముజ్ను పూర్తిగా తెరిచాం. చమువురు నౌకల రాకపోకలను అడ్డుకోం. కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకలకు సురక్షితంగా మార్గం ఉంటుంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. పది శాతం దాకా రేట్లు తగ్గాయి. అయితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన గందరగోళానికి దారి తీసింది. ఇరాన్తో జరుగుతున్న చర్చల వ్యవహారం పూర్తయ్యే వరకు హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధంనం).. అదీ ఫుల్ ఫోర్స్తో కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. చర్చల ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు అంశాలపై చర్చలు జరిగాయని, వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ అన్నింటికీ అంగీకరించిందని.. కానీ యురేనియంపై డీల్ కుదిరేవరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ‘‘అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి అని వ్యాఖ్యానించారు.అయితే.. ఇరాన్ మాత్రం ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారని అంటోంది. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ఈ లెక్కన హర్ముజ్తో పాటు యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గబోదని స్పష్టమవుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో.. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా.. ఇరాన్లో 3,000 మంది, లెబనాన్లో 2,100 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.హర్ముజ్ జలసంధి.. శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్ చేసిన నిధులు.. ఈ విషయాల్లో రెండు దేశాల మధ్య చర్చల్లో ఎటూ తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే.. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ -
అణు కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకారం
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, దీనికి ప్రతిఫలంగా అమెరికాలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను మాత్రం విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వారాంతంలో జరగనున్న శాంతి చర్చల అనంతరం తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.డబ్బు లేదు.. కేవలం శాంతి మాత్రమేట్రంప్ తన విలక్షణ శైలిలో ఈ ఒప్పందంపై స్పందిస్తూ, టెహ్రాన్తో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ప్రకటించారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవే..యురేనియంతో అణు కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా నిలిపివేయనుంది. ఇది కేవలం 10 లేదా 20 ఏళ్ల కాలపరిమితితో కూడుకున్నది కాదని, అపరిమిత కాలం పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ నొక్కి చెప్పారు.ఇరాన్కు చెందిన సుమారు 20 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు.చర్చలు తుది దశకు చేరినప్పటికీ ఇరాన్పై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని, ఒప్పందం ఖరారైన తర్వాతే దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కీలక పాత్రలో ఈజిప్ట్, టర్కీగత కొన్ని వారాలుగా తెర వెనుక జరిగిన దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈజిప్ట్, టర్కీ దేశాల మద్దతుతో జరిగిన పరోక్ష చర్చలు ఈ సానుకూల ఫలితానికి దారితీశాయి. ఒప్పందం ఖరారైతే శాంతి చర్చల ముగింపు కోసం తాను స్వయంగా పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ‘చాలా ప్రధాన అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగాలి. ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించడానికి సిద్ధంగా ఉంది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇరాన్ స్పందనఅమెరికా అధ్యక్షుడి ప్రకటనలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉంటుందని టెహ్రాన్ ధ్రువీకరించింది. ఇది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
అమెరికా - ఇరాన్ చర్చలపై.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. వారాంతం వరకు చర్చలు కొనసాగనున్నాయని తెలిపారు. ఫీనిక్స్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరు దేశాల మధ్య మంచి పురోగతి జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఇంకా పూర్తి ఒప్పందం కుదరలేదని, కానీ సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఈ చర్చల్లో ముఖ్యంగా అణు కార్యక్రమం, సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ట్రంప్ ప్రకారం, ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్పై అమలు చేస్తున్న నావికాదళ ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ నేపథ్యంలో కొంతమేర వాణిజ్య నౌకలకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.ఇరాన్ ఇప్పటికే అనేక విషయాలకు అంగీకరించిందని, ముఖ్యంగా యురేనియంను సంయుక్తంగా తొలగించి అమెరికాకు తరలించే అంశంపై కూడా అంగీకారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఈస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, యురేనియం తమకు ఎంతో విలువైనదని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించబోమని స్పష్టం చేశారు. -
ఇరాన్ యురేనియం మా చేతికి
వాషింగ్టన్/దుబాయ్/బీరూట్/ఇస్లామా బాద్: భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక కీలక పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ భూగర్భ అణు కేంద్రాల్లోని దాచిపెట్టిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలపై అమెరికా బీ2 బాంబర్లు భారీ బాంబును పడేసి సర్వనాశనం చేశాయి. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయింది. ఆ అణుమట్టి మా చేతికి రాబోతోంది. ఈ మట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది. ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదు’’అని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్గానీ ఇటు ఇరాన్గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మరోదఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధంచేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతంచేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని గురువారమే టెహ్రాన్కు చేరుకుని ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం పాక్లోని ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా–ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారముంది. కాల్పులవిరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారుచేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే, తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తానని ట్రంప్ చెప్పారు. నేరుగా చర్చలొద్దు: హెజ్భొల్లా ఇజ్రాయెల్తో నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని హెజ్భొల్లా సాయుధులు హెచ్చరించారు. ‘‘నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగితే దక్షిణ లెబనాన్ సరిహద్దు ఆక్రమిత ప్రాంతాల్లో శాశ్వతంగా తిష్టవేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుంది. అలా జరక్కుండా చూడాల్సిన బాధ్యత మీదే. అసలే మీది అసమర్థ ప్రభుత్వం. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాలు లెబనాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి’’అని హెజ్భొల్లా పార్లమెంటరీ విభాగ నాయకుడు హసన్ ఫదలల్లాహ్ హెచ్చరించారు. దక్షిణ లెబనాన్పై దాడిచేస్తే మేం చూస్తూ ఊరుకోబోమని హెజ్భొల్లా పునరుద్ఘాటించింది. మరోవైపు లెబనాన్– ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ట్రంప్ ముక్కుసూటి, దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యంచేశారు’’అని షెహబాజ్ పొగిడారు. ఒప్పందానికి తూట్లు! ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి శుక్రవారం ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బిన్ట్ జబేయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిచేసింది.ఈ ఘటనలో ఒక సిరియన్ మూలాలున్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. దాడిలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దక్షిణ లెబనాన్పై పలు చోట్ల మోర్టార్ దాడులు జరిగాయని లెబనాన్ ఆర్మీ, అమెరికా శాంతిదళ సభ్యులు శుక్రవారం తెలిపారు. దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ కాల్పులవిరమణ వేళ కవి్వంపు చర్యలకు దిగినా తాము దీటుగా దాడులతో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు రాకెట్లు, క్షిపణులతో ఉన్న సాయుధ హెజ్భొల్లాను పూర్తిగా నిర్వీర్యంచేస్తేగానీ తమ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకొచ్చామని, వెనుతిరిగే ప్రసక్తే లేదని తెలిపారు. బలగాల ఉపసంహరణ ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. కాగా లెబనాన్పై ఇప్పటికే అతిగా దాడులుచేశారని, ఇక ఆపేయాలని ఇజ్రాయెల్కు ట్రంప్ శుక్రవారం సూచించారు. తిరిగొస్తున్న స్థానికులు.. లెబనాన్లో పదిరోజులపాటే కాల్పులమోత ఆగుతుందని తెల్సి కూడా గతంలో వలసపోయిన వేలాది మంది స్థానికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లిటానీ నది మీదుగా ఖాస్మియే వంతెన మీదుగా దక్షిణ లెబనాన్కు వేలాది మంది జనం కార్లు, వాహనాల్లో బయల్దేరడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరుపులు, సూట్కేసులు, నిత్యావసర వస్తువులతో వాహనాలు నిండిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 2,294 మంది చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. -
ట్రంప్నకు... పోప్ చురకలు
కేప్టౌన్ : పొప్ లియో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేయడానికి బిలియన్లు ఖర్చు చేసి కొద్ది మంది నియంతల వల్ల ప్రపంచ తీవ్ర వినాశనానికి గురవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తిక్కరేస్తే అంతే సంగతులు. ఏవరికైనా వార్నింగ్ ఇస్తారు. ఈ దేశంపైనైనా దాడికి తెగబడతారు. ఇటీవల ఆ జాబితాలో పోప్ లియో-14 చేరారు. ఆయన బలహీన పోప్ అని అతనికి ఆ పదవి తన వల్లే వచ్చిందన్నారు. ఆయన విదేశాంగ విధానం చాలా దారుణమని మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షున్నే విమర్శించే పోప్ తమ దేశానికి వద్దని విరుచుకపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలకు పోప్ సైతం ఎక్కడా తగ్గకుండా సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పోప్ మీడియాలో ఇలా మాట్లాడారు " యుద్ధాలు చేయడానికి బిలియనల్ కొద్ది డబ్బు ఖర్చు చేసే వారి వల్ల ప్రపంచం నాశనమవుతోంది.అంతేకాకుండా తమ స్వార్థపు లక్షాలను సాధించడానికి వీరు భగవంతుని పేరు వాడుకోవడం చాలా బాధకరమన్నారు. విధ్వంసం కోసం బిలియన్లు ఖర్చు చేసే వారు విద్య, పునరావాసంపై దృష్టిసారించరు. దేనినైనా నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. కానీ సరిచేయడానికి ఒక జీవితకాలం కావాలి" అన్నారు. అయితే పోప్ పర్యటనకు అక్కడ విశేష స్పందన లభించింది. బబెండా నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇస్లామిక్, క్రైస్తవ మత నాయకులతో పోప్ లియో ఒక శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
ఇది నా పదో విజయం.. ట్రంప్ సంచలన పోస్ట్
-
ఆయనది పత్తి గింజల కలే!
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని చెప్పిన ఆయన.. అమెరికాకు ఈ డీల్ ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన గాల్లో కోటలు కట్టుతున్నాడంటూ ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది.శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ గురువారం వైట్హౌజ్లో ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని.. ఈ ఒప్పందం కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ (Islamic Republic of Iran Broadcasting) వెటకారంగా స్పందించింది.ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియోతో ఐఆర్ఐబీ ఓ పోస్ట్ చేసింది. దీనికి అదనంగా ఓ పర్షియన్ సామెతను ఉటంకించింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది. ట్రంప్ కూడా అంతే. ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నారు’’ అంటూ సెటైర్ వేసింది.Building castles in the air!Or in Persian we have a similar proverb:'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'شتر در خواب بیند پنبهدانهگهی لپلپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026సాధారణంగా.. సాధ్యంకాని విషయాలను కలలు కనే వ్యక్తులను ఎగతాళి చేయడానికి ఈ పర్షియన్ సామెతను వాడుతుంటారు. విశేషం ఏంటంటే.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఈ సామెతను ఉపయోగించారు. ఆయన 2026 ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనయుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు.యురేనియం విషయంలో ట్రంప్నకు ఎలాంటి మాట ఇవ్వలేదని ఇరాన్ మీడియా తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది. ఆయన ఏవేవో క్లెయిమ్లు చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు చెబుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీల్ కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో తానూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు.. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు కూడా తాను సిద్ధమేనని అంటున్నారు. ఈ నెల 22వ తేదీతో ఆ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. గురువారం వైట్హౌజ్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఈ డీల్ కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదన్న ఇంతకు ముందు ప్రకటించిన ట్రంప్ కాస్త చల్లబడ్డారు. పొడిగింపునకు తాను సిద్ధమేనని ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధ విరమణ గడువు ఈ నెల 22న ముగియనుంది.మరోవైపు.. ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని పొందకుండా తాము నిలువరిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉద్ఘాటించారు. తమతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం మినహా వాళ్లు ముందు మరో దారిలేదన్నారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ తన అణు శుద్ధి ప్రయత్నాలను విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని మొదటి నుంచి చెబుతున్నా.. అణ్వాయుధాల తయారీకి వీలుగా యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ సహా అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను బయటకు తీయాలని.. అణు ఒప్పందానికి ముందుకు రావాలని అమెరికా ఇరాన్ను డిమాండ్ చేస్తోంది. “ఇకపై యురేనియం ఎన్రిచ్మెంట్ ఉండదు” అన్నది ట్రంప్ తాజా మాట. దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. 2025 జూన్లో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అయితే.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) అంచనా ప్రకారం.. ఇరాన్ వద్ద దాదాపు 400 కిలోల 60% శుద్ధి యురేనియం, అలాగే 200 కిలోల 20% యురేనియం నిల్వ ఉంది. ఈ నిల్వలను సులభంగా 90% ఆయుధ స్థాయి యురేనియంగా మార్చుకోవచ్చు!.పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. ఇస్లామాబాద్లో ఈ నెల 11న జరిగిన తొలి దఫా చర్చలకు ముందు.. యురేనియం శుద్ధి పూర్తిగా ఆపే ఉద్దేశ్యం లేదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికా–ఇరాన్ ‘అణు’ వివాదం కొత్త మలుపు తిరిగే చాన్స్ ఉంది. -
అద్భుతం జరగబోతుంది.. ఇక అంతా మంచి రోజులే..
-
ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విరమణ
కైరో/వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. పదిరోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాల మధ్య అమల్లోకి రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకిరానుంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ జరిపిన చర్చలు ఫలించాయని ట్రంప్ తన సొంత సామాజికమధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్తో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఇప్పుడు చక్కటి సంభాషణ పూర్తయింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఇద్దరూ అంగీకరించారు. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డేన్ రెజీన్ కెయిన్లు ఇరుదేశాల నేతలను సమన్వయ పరుస్తూ శాశ్వత శాంతికి కృషిచేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 యుద్దాలను ఆపే అదృష్టం నాకు దక్కింది. ఇది పదోది. తదుపరి చర్చల కోసం శ్వేతసౌధానికి రావాలని ఔన్, నెతన్యాహూలను ఆహ్వానించా’’అని ట్రంప్ ప్రకటించారు. ఆగని కాల్పులు! ఓవైపు కాల్పులు మరికొన్ని గంటల్లో ఆగిపోతాయని ట్రంప్ చెబుతుంటే మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ బలగాలు పరస్పర కాల్పుల్లో బిజీగా మారాయి. గురువారం సైతం ఇరువైపులా కాల్పులు, బాంబుల మోత మోగింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులోని ప్రాంతాలపై హెజ్»ొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడిచేసింది. లెబనాన్లోని బీరూట్ సహా టైర్, నబాతేహ్, బిన్ట్ జబేయిల్లపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతంచేసింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య తొలి దఫా శాంతి చర్చలు విఫలంకావడంతో మరో దఫా చర్చలకు పాకిస్తాన్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. పాక్ సాయుధబలగాల చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గురువారం ఇరాన్లోని టెహ్రాన్కు చేరుకుని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్తో చర్చలు జరిపారు. ఈయన వెంట పాక్ అంతర్గత మంత్రి మొహ్సీన్ నఖ్వీ సైతం చర్చల్లో పాల్గొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కారŠప్స్(ఐఆర్జీసీ) ప్రధానకార్యాలయం ‘ఖాతమ్ అల్–అన్బియా’ను మునీర్ బృందం వెళ్లి ఆర్మీ కమాండర్లతో కాల్పుల విరమణపై చర్చించారు. తర్వాత మునీర్ నేరుగా అమెరికా వెళ్లి ట్రంప్తో చర్చిస్తారని వార్తలొచ్చాయి. మరోవైపు ఖతర్ ద్వారా మధ్యవర్తిత్వాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేందుకు పాక్ ప్రయతి్నస్తోంది. ఇందుకోస పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం ఖతర్కు వచ్చారు. 10వేల సైన్యంతో దిగ్బంధం 10వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హారూŠమ్జ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
'10వ యుద్ధాన్ని ఆపుతున్నా': ట్రంప్ పోస్ట్ వైరల్
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య 10 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.ట్రంప్ తన ప్రకటనలో.. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ (Joseph Aoun) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో జరిగిన చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు శాంతి దిశగా ముందడుగు వేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు లేదా భారత ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ తన పాత్రను విశేషంగా ప్రస్తావిస్తూ.. ఇప్పటివరకు ప్రపంచంలో 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన 10వ విజయంగా నిలుస్తుందని తెలిపారు. ఇది ఆయన రాజకీయ దృక్పథాన్ని, అంతర్జాతీయ వ్యవహారాల్లో తన జోక్యాన్ని ప్రతిబింబిస్తుంది.వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు '34 ఏళ్లలో తొలిసారిగా సమావేశమయ్యాయని' ట్రంప్ అన్నారు. ఆ రెండు దేశాలు "శాశ్వత శాంతి"ని సాధించేలా చూడాలని తాను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్లను ఆదేశించినట్లు కూడా ఆయన తెలిపారు. -
వారి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందోచ్..!
ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య జ్వాలాగ్ని చల్లారనుందా?, ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా? యుద్ధానికి ఇరు దేశాలు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాయా? అంటే అవుననక తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం గమనార్హం. -
ఇరాన్పై ట్రంప్ గేమ్ ప్లాన్ మారింది..!
ఇరాన్తో అంత ఈజీ కాదనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పదే పదే బోధపడుతూనే ఉంది. ఇటీవల పాకిస్తాన్లో ఇరాన్తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ట్రంప్కు ఈ విషయం బాగానే అర్థమైంది. బెదిరింపులతో ఇరాన్ను దారి తెచ్చుకోవాలనుకుంటే ఏదీ కూడా వర్కౌట్ కావడం లేదు కాదు కదా.. కనీసం మిత్ర దేశాల సహకారం కూడా లభించడం లేదు. దాంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇరాన్ను యుద్ధంతో వశపరుచుకోవడం వల్ల కాదు అనుకున్నారో ఏమో కానీ ట్రంప్ మాత్రం తన రూట్ మార్చుకున్నారు. ఇప్పటివరకూ సర్వనాశనం అంటూ ఇరాన్పై యుద్ధభేరీ మోగిస్తూ వచ్చిన ట్రంప్.. ప్రస్తుతం ఆర్థిక యుద్ధ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరాన్తో యుద్ధాన్ని పక్కకు పెట్టి వారిపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత రాత్రి వైట్హౌస్లో డచ్ రాజు, డచ్ రాణిలతో జరిగిన ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్రంప్ చెప్పినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఏకైక మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఇరాన్తో జరిగిన మొదటి విడత చర్చలు చేదు అనుభవంతో ముగిసిన తర్వాత,తి రిగి చర్చలను మళ్లీ పట్టాలు ఎక్కించాలంటే కచ్చితంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఒక్కటే మార్గమని ట్రంప్ ఓ స్పష్టతకు వచ్చారని, ఇదే విషయాన్ని డచ్ రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అనేది అత్యంత ఆందోళనకరమని, ఇది మరొక ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండటంతో డచ్ ప్రభుత్వం.. యుద్ధంలో అమెరికాకు సహకరించడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హర్మూజ్ జలసంధి విషయంలో ఓ స్పష్టతకు రావాలని, అందుకు ఇరాన్తో చర్చలు అవసరమని డచ్ ప్రభుత్వ ప్రతినిధులు.. ట్రంప్కు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సైనిక దాడులకన్నా ఆర్థిక యుద్ధం మీద దృష్టి పెట్టడమే సరైనదిగా ట్రంప్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా చమురు ఎగుమతులను అడ్డుకోవడం, బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, మరియు నావికాదళ నిర్బంధం వంటి వ్యూహాలను ఉపయోగించి వారిని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
టెహ్రాన్: మా మొదటి క్షిపణులకే మీ ఓడలు మునిగిపోతాయంటూ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తే.. ఆ నౌకలను ఇరాన్ ధ్వంసం చేస్తుందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణకు ఈ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. మొహ్సెన్ రెజాయీ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మిస్టర్ ట్రంప్.. హార్ముజ్ జలసంధికి పోలీసు కావాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనేనా? అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేసే పని ఇదేనా? మీ ఓడలు మా మొదటి క్షిపణులకే సముద్రంలో మునిగిపోతాయి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో హార్డ్లైనర్గా పేరున్న రెజాయీ.. ఒకవేళ అమెరికా ఇరాన్పై భూతల దాడికి దిగితే.. తాము వేలమందిని బందీలుగా పట్టుకుంటామని.. ప్రతి బందీకి ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలకు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు. అయితే ఆదివారం ఆ చర్చలు విఫలమయ్యాయి. తిరుగు ప్రయాణంలో గాలిబాఫ్.. ట్రంప్ను ఉద్దేశించి, ‘‘మీరు పోరాడితే.. మేము కూడా పోరాడతాం" అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులు చేసి.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన తర్వాత ఆరు వారాల పాటు యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం రెండు వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్లో వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని అమెరికా సైన్యం గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిని ఇరాన్ చట్టవిరుద్ధమంటూ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది.కేవలం 34 కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు వ్యాపారంలో 20 శాతం జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు ఇది కీలక మార్గం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా అడ్డుకుంది. కేవలం చైనా వంటి మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. -
యుద్ధం ముగిసినట్లే..! ట్రంప్ కీలక ప్రకటన
-
వార్ అప్డేట్స్: హర్ముజ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా వీడలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొసాగుతోంది. ఇరాన్ పోర్టులకు వచ్చిపోయే నౌకలపై నిఘా కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్కు సహించడం లేదు. మరోవైపు పాక్ వేదికగానే మరోసారి శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్
లండన్: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన వార్తా సంస్థగా పేరొందిన ‘బీబీసీ’ మునుపెన్నడూ లేని విధంగా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్ధిక కష్టాలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ దిగ్గజ సంస్థ, తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. దశాబ్ద కాలంలో బీబీసీ తీసుకున్న అత్యంత కఠినమైన, అతిపెద్ద లేఆఫ్స్ నిర్ణయం ఇదే కావడం గమనార్హం.ఆర్థిక లోటు.. భారీగా కోతలుద్రవ్యోల్బణం, తగ్గుతున్న వాణిజ్య ఆదాయం, లైసెన్స్ ఫీజులపై పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో బీబీసీ తన వార్షిక బడ్జెట్లో దాదాపు 10 శాతం ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లలో ఈ 2,000 ఉద్యోగాల కోతలను అమలు చేయనుంది. 2027 ఏప్రిల్ నాటికి ఈ ప్రభావం పూర్తిగా కనిపించనుంది. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి టాల్ఫన్ డేవిస్ ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలియజేస్తూ, సంస్థ ముందున్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకే అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావాఒకవైపు ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్న వేళ, బీబీసీకి భారీ చట్టపరమైన చిక్కులు తోడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జనవరి ఆరున క్యాపిటల్ దాడికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుదోవ పట్టించేలా ఎడిటింగ్ చేసిందని ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 93,359.43 కోట్లు) పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం కారణంగానే గత డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, వార్తా విభాగం అధిపతి డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో వచ్చే నెలలో మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ బ్రిట్టిన్ కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రశ్నార్థకంగా మారిన మనుగడ1922లో స్థాపించిన బీబీసీకి ప్రధాన ఆదాయ వనరు వీక్షకులు చెల్లించే వార్షిక లైసెన్స్ ఫీజు . అయితే, స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల రాకతో ప్రజల వీక్షణ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. చాలా కుటుంబాలు సాంప్రదాయక టీవీలకు దూరమవుతుండటంతో బీబీసీ ఆర్థిక నమూనా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్రిటన్ లేబర్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ లైసెన్స్ ఫీజు విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, బహుళ టీవీ, రేడియో ఛానెళ్లు నడుపుతున్న బీబీసీ భవిష్యత్తు మనుగడపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.ఇది కూడా చదవండి: ఖరగ్పూర్: సెకనుకో మలుపు.. ఓటరు నాడి ఎటు? -
యుద్ధం ముగిసినట్టే..!
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. లెబనాన్పై భీకర దాడులు టైర్ (లెబనాన్): లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్ ఇరాన్కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.ఇరాన్కు పాక్ బృందం అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. -
ట్రంప్కు కళ్లెం వేసే మార్గమేమిటి?
ఇరాన్తో 12వ తేదీన జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన గమనించదగ్గది. చాలా అంశాలలో ఇరాన్తో ఏకాభి ప్రాయం కుదిరిందనీ, అణ్వాయుధాల తయారీని ఆపటంపై వారు పట్టుదల విడవలేదనీ, అందుకే చర్చలు విఫల మయ్యాయనీ అన్నారు. వారికి అణ్వస్త్ర ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ దక్కనివ్వ బోమని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులలో ప్రపంచ నాయ కుల స్పందనలను గమనించగా, ఆయన మాటలను ఎవరూ విశ్వ సించటం లేదని అర్థమవుతున్నది. చర్చలు, ఒప్పందాల విషయమై తమను లోగడ రెండుసార్లు మోసం చేసిన ఆయన ఈసారి కూడా తమ విశ్వాసాన్ని పొందలేకపోయారన్న ఇరాన్ వ్యాఖ్యలు సరేసరి!ఒప్పందం రద్దు ట్రంప్ పుణ్యమే!చర్చల మినిట్స్ అందుబాటులో లేనందున అణుపరిశోధనలు, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై నిర్దిష్టంగా ఎవ రేమి అన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ కీలకమైన అంశంపై చర్చలకు ముందూ, తర్వాతా ఎవరేమన్నారో తెలిసిందే. అదే విధంగా గతంలో జరిగిందేమిటో కూడా. వాటన్నింటిని పరి గణనలోకి తీసుకున్నప్పుడు, ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావటా నికి కారణం ట్రంప్ వైఖరి అని తేలికగా అర్థమవుతుంది. అందుకే ఆయనకు మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించటం లేదు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు, యురేనియం శుద్ధి విష యమై ఇరాన్కు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం గల అమె రికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లతో పాటు జర్మనీకి మధ్య 2015 లోనే ఒప్పందం జరిగింది. దానిని ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ అన్నారు. దాని ప్రకారం ఇరాన్ శాంతియుత అవస రాల కోసం యురేనియంను 3.67 శాతం వరకు శుద్ధి జరపవచ్చు. అణ్వాయుధాల తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం. ఈ శుద్ధి కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయవచ్చు.ఆ ప్రకారం 2015 నుంచి 2018 వరకు సజావుగానే సాగుతుండిన ఒప్పందాన్ని ట్రంప్ తన మొదటి హయాంలో ఆకస్మికంగా రద్దు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి. అట్లా రద్దు చేసినా తమ వైపు నుంచి కొంతకాలం పాటు ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండిన ఇరాన్, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవటంవల్లనే యురేనియం శుద్ధి స్థాయిని 60 శాతం వరకు తీసుకువెళ్లి ఆపింది. అణ్వస్త్ర తయారీ మాత్రం తమ అజెండాలో లేదని అయతొల్లా ఖమేనీ ఫత్వా సైతం జారీ చేశారు. అటువంటి ఆయుధాల ఉత్పత్తి ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే గాక, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు రోజు లలో అమెరికా, ఇరాన్ మధ్య ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి చర్చలు, అవి దాదాపు ఒక కొలిక్కి రానుండగా దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యాన్నంతా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అణ్వస్త్రాలను ఆపటమే తమ అత్యంత ప్రాధాన్య లక్ష్యమనీ,అందుకు ఇరాన్ కలిసి రానందునే చర్చలు ముందుకు సాగలేదనీ ట్రంప్ వాదించబూనటం తెంపరితనం మాత్రమే అవుతుంది. ప్రపంచం అందువల్లనే ఆయనను నమ్మటం లేదు.దిగ్బంధనం– గందరగోళంఇస్లామాబాద్ చర్చలకు ముందే ఇరువురు తమ తమ షరతులు ప్రకటించారు. అవి ఇంచుమించు గత నెల షరతుల వంటివే. అయి నప్పటికీ, రాజీ అంటూ జరగాలి గనుక చర్చల సమయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయనే భావన కలిగింది. ఇటువంటి దౌత్య చర్చలు ఎపుడైనా పలు విడతలుగా సాగుతూ క్రమంగా కొన్ని రాజీ లతో అంతిమ ఒప్పందం జరుగుతుంది. ఈసారి కూడా చర్చలు 21 గంటలపాటు సాగిన తర్వాత, రాగల రోజులలో తిరిగి చర్చలు ఉండగలవనే సంకేతాలు రెండు దేశాల ప్రతినిధుల నుంచి వినిపించాయి. కానీ, ‘ఖలునికి నిలువెల్ల విషముగదరా సుమతీ’ అన్నట్లు తన నిలువెల్ల ‘ఆయుధాలు, సైనిక బలం’ అన్న మిడిసిపాటు తప్ప దౌత్యనీతి అనే మాటకు చోటులేని ట్రంప్ మాత్రం వెంటనే హార్మూజ్ దిగ్బంధం అంటూ హెచ్చరించటంతో ఆగక, దిగ్బంధనం కోసం తమ నౌకా దళాలకు ఉత్తర్వులు జారీ చేశారు.దానితో ఇరాన్ లొంగి వస్తుందని ఆయన అంచనా వేసిన ట్లున్నారు. కానీ, జరిగిందేమిటి? ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగి, స్టాక్స్ పడిపోయాయి. చర్చలు నెరవేరగలవన్న ఆశాభావా లతో తగ్గిన చమురు, పెరిగిన స్టాక్స్, ఆయన పుణ్యమా అని తిరిగి గందరగోళంలో పడ్డాయి. నిజానికి హార్మూజ్ ద్వారా రవాణా అయ్యే చమురు, ఇతర సరకులు అన్నీ ఇరాన్వేమీ కాదు. అరబ్ దేశాలవి, బయటి దేశాలవి కూడా గణనీయంగా ఉన్నాయి. అది తర్వాత బోధ పడి కావచ్చు, మొత్తం హార్మూజ్ను కాకుండా ఇరాన్ రేవులను మాత్రమే దిగ్బంధిస్తామన్నారు. అందుకు ఇరాన్ తాము ఆ ప్రాంతంలోని అరబ్ రేవులన్నింటిపై దాడులు జరపగలమని హెచ్చరించింది. ఆ జలసంధిలో మైన్స్ మరొకవైపు ఉండనే ఉన్నాయి. ఈ హెచ్చరిక లతో మళ్లీ గందరగోళం మొదలైంది.చట్టాలకు లోబడేట్టుగా...ఒప్పందాలు, ఒప్పంద చర్చలను ప్రతిసారీ భంగపరుస్తున్న ఇజ్రాయెల్ ఈసారి కూడా ఆ పని చేస్తుండటం మొదటినుంచీ కనిపించిందే. యుద్ధ విరమణ లెబనాన్కు సైతం వర్తించాలన్న షర తును ఇరాన్ మొదటనే విధించగా, అందుకు ట్రంప్ పాకిస్తాన్ ద్వారా సమ్మతి తెలిపారు. కానీ ఇజ్రాయెల్ తమకు దానితో నిమిత్తం లేదంటూ దాడులు కొనసాగించగా, ట్రంప్ కూడా అది వేరే అంశమంటూ వాదించారు. చర్చలపట్ల ట్రంప్, నెతన్యాహూల ఆంతరంగిక ఆలోచనలకు అద్దంపట్టిన విషయాలలో ఇదీ ఒకటి. అందుకు తగినట్లుగానే ట్రంప్ ఇజ్రాయెల్కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తుండగా, మధ్యవర్తి పాకిస్తాన్ చేష్టలుడిగి మిన్నకుంటున్నది.అసలు వాస్తవం ఏమంటే, అమెరికాకు గానీ, ఇజ్రాయెల్కుగానీ ఇరాన్ అణు పరిశోధనలు వట్టి సాకు మాత్రమే. అమెరికాకు కావలసింది అక్కడ ఒక సామంత రాజ్యాన్ని నెలకొల్పి చమురు నిల్వలు తమ అధీనంలోకి తెచ్చుకోవటం. వెనిజులా వలెనే ఇరాన్ చమురు గురించి స్వయంగా ట్రంప్ చెప్పిందే. ఇజ్రాయెల్కు కావలసింది గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడి, ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక శక్తిగా మిగలక పోవటం. ప్రపంచమంతా ఇప్పటికే గుర్తించిన ఈ వాస్తవాలు తిరిగి రుజువవుతున్నాయి.ట్రంప్ అరాచకానికి కళ్లెం వేయగల మార్గం ఒకే ఒకటి కని పిస్తున్నది. ఇది ఇట్లానే అందరినీ చుట్టుముట్టరాదంటే రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఆసియాన్ కూటమి, ఆఫ్రికన్ యూనియన్, బ్రెజిల్ వంటి దక్షిణ అమెరికా దేశాలు కలిసి, అమెరికా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వ్యవహరించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఒక నిర్ణీత వ్యవధిలో అందుకు అంగీకరించనట్లయితే అమెరికా, ఇజ్రాయెల్లతో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోకున్నా, సస్పెండ్ చేయగలమని హెచ్చరించాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇరాన్పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్కు ట్రంప్ భారీ ప్లాన్?
వాషింగ్టన్: చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు, ఇరాన్పై యుద్ధంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్లో యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవైపు యుద్ధం ముగుస్తుందంటూ వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు ఇరాన్పై మరిన్ని దాడులకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది.అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నివేదికల ప్రకారం.. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను ఇస్ఫాహాన్లోని భూగర్భ స్థావరాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఆ యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్ చేపట్టనున్నారని సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా పశ్చిమాసియాలో 10 వేల మంది సైనికులను పంపింది. ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న వేళ ఈ సైనిక చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఏప్రిల్ నెలలోనే 10 వేలకుపైగా సైనికులు ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. వీరిలో 6 వేల మంది సైనికులు ప్రస్తుతం నమీబియా తీరానికి సమీపంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ (CVN-77) ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగమవుతారు. మరో 4,200 మంది సైనికులు బాక్సర్ అంఫిబియస్ రెడీ దళంలో చేరి, ఏప్రిల్ చివరి నాటికి అక్కడికి చేరుకోనున్నారు. ఈ గ్రూప్లో 800కి పైగా మెరైన్లు, హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్లు ఉన్నాయి.అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్లో భూసైనిక చర్యల కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో ప్రత్యేక దళాలను ఇరాన్ భద్రపరిచిన యురేనియంను వెలికితీయడం, భద్రపరచడం, అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలోని దీవులు, తీరప్రాంతాల్లో ల్యాండింగ్ ఆపరేషన్లు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.ఇదే సమయంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఇరాన్ యుద్ధం చాలా త్వరలో ముగియబోతోంది. వచ్చే రెండు రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయన, కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం లేదని, యుద్ధం త్వరలోనే ముగుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.ఈ పరిణామాలు, ఇరాన్తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదని సూచిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ‘యుద్ధం ముగుస్తోంది’ అని చెబుతున్నా, మరోవైపు అమెరికా భారీగా సైనిక బలగాలను సమీకరిస్తోంది. ఇది కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టం కావచ్చని సంకేతాలు ఇస్తున్నాయి. -
అందుకు చైనా అంగీకరించింది.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే, తాము ఇరాన్కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు...కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
అమెరికా చమురు దిగ్బంధంపై చైనా వార్నింగ్
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50, సెన్సెక్స్ భారీగా ఎగిశాయి.నిఫ్టీ 1.63 శాతం లేదా 388.65 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద, సెన్సెక్స్ 1.64 శాతం లేదా 1,264 పాయింట్లు పెరిగి 78,111.24 వద్ద ముగిశాయి.ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20 శాతం, 2.35 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్ టాప్ గెయినర్గా నిలిచింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచింది. -
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాతో తమ దేశం యుద్ధాన్ని కాకుండా శాంతి చర్చలు కోరుకుంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్ఎన్ఏ)ధృవీకరించింది.పశ్చిమాసియా యుద్ధం. ఆ యుద్ధం కారణంగా ఇరాన్కు వాటిల్లిన నష్టం, హర్మూజ్ జలసంధిని అమెరికా మూసివేత వంటి పరిణామాలు, పాకిస్థాన్లో అమెరికా-ఇరాన్ల మధ్య జరిగిన చర్చలతో పాటు ఇతర అంశాలపై పెజెష్కియాన్ ఐఆర్ఎన్ఏతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ తమ దేశం యుద్ధాన్ని కాకుండా చర్చలను కోరుకుంటోందన్నారు. అయితే అమెరికా తన ఇష్టాన్ని మా రుద్దడానికి లేదంటే లొంగిపోయేలా చేసేందుకు అమెరికా చేస్తున్న ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందన్నారు. అదే సమయంలో ఇరాన్లో అపార ప్రాణ నష్టానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ను అంతర్జాతీయ సమాజం ఖండించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టం, మానవతా సూత్రాల ప్రకారం పౌరులను, ఉన్నత వర్గాలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక కేంద్రాలను ధ్వంసం చేయడాన్ని సమర్ధించకూడదని స్పష్టం చేశారు. -
అదే జరిగితే.. భారత్కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్కు చైనా మద్దతు.. ఇరాన్కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
‘నోరు అదుపులో పెట్టుకో’.. ట్రంప్కు ఇటలీ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటలీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఇటలీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ వ్యాఖ్యల దెబ్బకు ఒక్కటయ్యాయి. తమ దేశ ప్రధాని జార్జియా మెలోనికి మద్దతుగా నిలుస్తూ, ట్రంప్ తీరుపై ఇటలీ ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ట్రంప్ నోటి దురుసు.. మండిపడ్డ ప్రతిపక్షంఇరాన్పై అమెరికా దాడులకు మద్దతు ఇవ్వనందుకు ప్రధాని మెలోనికి ధైర్యం లేదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పందించిన ప్రతిపక్ష నేత ష్లీన్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘ట్రంప్.. మా దేశంపై, మా ప్రధానిపై నీ నోటి దురుసుతో చేసే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం’ అని ఘాటుగా హెచ్చరించారు. వెంటనే సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఏ విదేశీ అధినేతకు కూడా తమ దేశాన్ని అవమానించే హక్కు లేదని ఆమె తేల్చి చెప్పారు. BREAKING: Italy SHOCKED world 🔥🔥Schlein, the leader of the opposition DEFENDS Meloni against Trump’s attacks 🔥🔥🇮🇹She said : “Listen Trump Even as political opponents, We Italians will not accept any attacks against our country especially from your bad mouth."What a… pic.twitter.com/EKQI8TwJlE— InfoGram (@_InfoGram_) April 14, 2026పోప్పై వ్యాఖ్యలతో ముదిరిన వివాదంక్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో శాంతి కోసం చేసే పిలుపులను ట్రంప్ విమర్శించడంపై ప్రధాని మెలోని అభ్యంతరం వ్యక్తం చేశారు. మత పెద్దలు రాజకీయ నాయకుల మాట వినాలనడం సరికాదని, ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు అని ఆమె తేల్చి చెప్పారు. దీనికి ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ అణ్వాయుధాలతో ఇటలీని పేల్చేస్తామని ప్రకటించినా మెలోనికి పట్టింపు లేదని విమర్శించారు. అయితే అమెరికా తమ వ్యూహాత్మక మిత్రదేశమే అయినప్పటికీ, విభేదాలు ఉన్నప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ధైర్యం ఉందని మెలోని స్పష్టం చేశారు.ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందం నిలిపివేతఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్తో ప్రతి ఐదేళ్లకోసారి చేసుకునే రక్షణ ఒప్పందాన్ని ఇటలీ తాత్కాలికంగా నిలిపివేసింది. లెబనాన్లోని తమ ఐరాస శాంతి పరిరక్షక దళాల కాన్వాయ్పై ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిక కాల్పులు జరపడంతో ఇటలీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఇజ్రాయెల్ దాడులను ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అసహనం వ్యక్తం చేస్తూ, ఇటలీ రాయబారికి సమన్లు జారీ చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ పెట్టిన చిచ్చు: భగ్గుమంటున్న వెనెజువెలా -
మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈలోపు పోప్ లియో XIV ఇరాన్ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్ పోప్పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్ కాదు మెలోనీనే కరెక్ట్ పర్సన్ కాదంటూ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది. -
యుద్ధం ముగుస్తుంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అన్నారు. ముగింపు దశకు చాలా దగ్గరగా ఉన్నట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు. కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హార్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. -
ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
మళ్లీ చర్చలు!
వాషింగ్టన్/బీజింగ్/బీరూట్: పశ్చిమాసియాలో యుద్ధానికి తెర దించే దిశగా అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవి బహుశా వచ్చే రెండు రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తొలి దశ మాదిరిగానే ఈ చర్చలకు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాదే వేదిక కానున్నట్టు వెల్లడించారు. పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ కృషి వల్లే ఇది సాధ్యపడుతోదంటూ ట్రంప్ ప్రశంసించారు. ఆదివారం జరిగిన తొలి దఫా చర్చలు విఫలమవడం తెలిసిందే. ‘‘రెండో దఫా చర్చలకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఆ దేశ ఓడరేవులన్నింటినీ అమెరికా దిగ్బంధించిన కారణంగానే దిగొచి్చంది’’ అని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధితో పాటు ఆ దేశ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 10 వేల మందికి పైగా సైనికులు, 18 యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్టు తెలిపింది. అయితే చమురు, రసాయనాలను తీసుకెళ్తున్న రిచ్ స్టారీ అనే నౌక మంగళవారం హార్మూజ్ను దాటినట్టు సమాచారం. హార్మూజ్ జలసంధిని తెరిపించే లక్ష్యంతో శుక్రవారం పారిస్లో జరిగే సదస్సుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించనున్నారు.మరోవైపు హార్మూజ్ను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. దాన్ని ప్రమాదకరమైన, బాధ్యతారహిత చర్యగా అభివరి్ణంచింది. అమెరికా, ఇరాన్ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటించాలని సూచించింది. ఇరాన్కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది. తమపై టారిఫ్లు పెంచితే దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో అన్ని దేశాల సార్వబౌమత్వాన్నీ, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరముందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్, లెబనాన్ చర్చలు ఇజ్రాయెల్, లెబనాన్ 33 ఏళ్ల అనంతరం తొలిసారి ప్రత్యక్ష చర్చలకు దిగాయి. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు మంగళవారం వాషింగ్టన్లో సన్నాహక చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ కూడా వాటిలో పాల్గొన్నారు. నెల రోజులుగా లెబనాన్పై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తుండటం తెలిసిందే. వాటికి తెర దించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వాటి ఫలితాలకు కట్టుబడి ఉండబోనని లెబనాన్ సాయుధ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగినట్టు హెజ్బొల్లా పేర్కొంది. -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
పాకిస్థాన్లో 2 రోజుల్లో మళ్లీ..: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.“మీడియా అక్కడే ఉండాలి.. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో ఏదో జరిగే అవకాశం ఉంది. మేము అక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నాం” అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా ఇవాళ మధ్యాహ్నం పేర్కొంది. ఇటీవల పాక్లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నాయి. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.పాకిస్థాన్లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండో దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. మోదీతో ట్రంప్ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…— Narendra Modi (@narendramodi) April 14, 2026కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా యాక్టివ్గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు. -
హర్మూజ్ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్ఎస్ అబ్రహీం లింకన్ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్లో ఇరాన్ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. -
ట్రంప్ కొత్త టార్గెట్.. ప్రపంచ దేశాల్లో వణుకు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ తో తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. ‘ఇరాన్ వ్యవహారం పూర్తయిన తర్వాత క్యూబా వైపు వెళ్తాం’ అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో గుబులు రేపుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఓవల్ ఆఫీస్ బయట ఆయన చేసిన ఈ ఆకస్మిక వ్యాఖ్యలు.. అమెరికా తదుపరి లక్ష్యం క్యూబానేనా అనే తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి.ఇరాన్ తర్వాత క్యూబాపై గురిప్రస్తుత ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత అమెరికా దృష్టి క్యూబాపై పడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ వెలుపల మీడియాతో అనధికారికంగా మాట్లాడుతూ.. ‘ఇరాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగియగానే తాము క్యూబా వ్యవహారాన్ని చూసుకుంటామని’ ఆయన పేర్కొన్నారు. దీనిపై శ్వేతసౌధం నుంచి ఎలాంటి అధికారిక వ్యూహం కానీ, సైనిక చర్యల కచ్చితమైన సమయం కానీ వెలువడకపోయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్నాయి.దారుణమైన పాలన.. విఫల దేశంక్యూబా దశాబ్దాలుగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయిందని ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దానిని ఒక ‘విఫల దేశం’గా అభివర్ణించిన ఆయన, పాత కాస్ట్రో శకంలో జరిగిన పరిపాలనా లోపాలను ఎత్తిచూపుతూ.. ఆ దేశం ఎన్నో ఏళ్లుగా అత్యంత దారుణమైన పాలనలో ఉందని అన్నారు. అమెరికా విదేశాంగ విధానంలో క్యూబా ఎప్పుడూ ఒక ప్రత్యేక అంశంగానే ఉంటుందని వ్యాఖ్యానించిన ట్రంప్, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్దిష్ట దౌత్య లేదా ఆర్థిక చర్యల గురించి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉత్కంఠ1959 నాటి క్యూబా విప్లవం, ప్రచ్ఛన్న యుద్ధం సమయం నుంచి అమెరికా-క్యూబా మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు-నిప్పులాగే ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిబంధనల వంటివి నేటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అదీ ఇరాన్ వ్యవహారంలో ప్రపంచం అట్టుడుకుతున్న వేళ, ట్రంప్ క్యూబా పేరును ప్రస్తావించడం గ్లోబల్ మార్కెట్లలో, లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర అనిశ్చితికి దారితీస్తోంది. ప్రస్తుతానికి క్యూబా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోయినా, ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి.. -
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
-
పోప్ దుర్బలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి పోప్ను కూడా వదలడం లేదు. ఇరాన్పై యుద్ధాన్ని తప్పుబడుతూ పోప్ లియో–14 చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లియో ఓ బలహీన పోప్ అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడమే గాక మీడియాతో మాట్లాడుతూ కూడా పోప్పై పదునైన విమర్శలకు దిగారు. అసలు తనవల్లే ఆయనకు పోప్ పదవి దక్కిందని చెప్పుకొచ్చారు! ఈ విమర్శలపై పోప్ కూడా దీటుగా స్పందించారు. శాంతి సందేశాన్ని విన్పించే విషయంలో ట్రంప్ యంత్రాంగానికి తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘దైవ సందేశాన్ని ట్రంప్ అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయన్నో, ఇంకెవరినో నేరుగా విమర్శించడం లేదు. ట్రంప్తో వాదనకూ దిగదలచుకోలేదు. కానీ వాస్తవాలు చెప్పేందుకు మాత్రం ఎప్పుడూ వెనకాడబోను. ఒక్కటి మాత్రం నిజం. శాంతి స్థాపకులు మాత్రమే ఆశీర్వాదానికి పాత్రులు’’అన్నారు. వారి మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది! అమెరికా అధ్యక్షులకు, పోప్ స్థానంలో ఉన్నవారికి నడుమ అభిప్రాయ భేదాలు కొత్తేమీ కాకున్నా ఈ స్థాయి వాద ప్రతివాదాలు మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి పోప్ నాకొద్దు! పోప్గా లియో–14 సరిగా పని చేయడం లేదని ట్రంప్ ఆదివారం ట్రూత్ సోషల్ పోస్టులో ఆక్షేపించారు. ‘‘నేరాలపై స్పందించడంలో మరీ బలహీనుడు. ఇక ఆయన విదేశాంగ విధానమైతే మరీ దారుణం! ఇరాన్ వద్ద అణ్వాయుధమున్నా పర్లేదనుకునే, వెనెజువెలాపై అమెరికా దాడి చేయొద్దనుకునే, ఇలా అమెరికా అధ్యక్షుడినే విమర్శించే పోప్ నాకొద్దు! ఆయన మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారు. నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కన్పిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి. వామపక్షవాదానికి దన్నుగా నిలవడం మానుకోవాలి. లియో తీరు ఆయనకే గాక క్యాథలిక్ చర్చికి కూడా చాలా చేటు చేస్తోంది. ఆయన ఇప్పటికైనా రాజకీయ నాయకునిగా ప్రవర్తించడం మాని గొప్ప పోప్గా రాణించడంపై దృష్టి పెడితే మంచిది! నేనైతే పోప్ లియోకు అస్సలు అభిమానిని కాను. నావల్లే ఆయనకు పోప్ పదవి దక్కింది. లియో పేరు తొలుత చర్చి పరిశీలనలో కూడా లేదు. నన్ను ఎదుర్కోవాలంటే ఆ పదవిలో ఒక అమెరికన్ ఉండాలనే భావనతోనే పోప్గా నియమించింది’’అంటూ తూర్పారబట్టారు. ఇరాన్పై ట్రంప్ యుద్ధాన్ని పోప్ తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ‘‘తాము సర్వశక్తిమంతులమని కొందరిలో నెలకొన్న భ్రమలే ఇరాన్పై యుద్ధానికి కారణం. కానీ యుద్ధాలకు దిగేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’’అని గతంలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాగరికతనే నాశనం చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను కూడా తీవ్రంగా తప్పుబట్టారు. క్రీస్తు మాదిరిగా దివ్య శక్తులతో అమెరికాకు తాను హీలింగ్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఏఐ ఆధారిత ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. -
'అలా చేస్తే చైనాకు సమస్యలు వస్తాయి': ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల చైనాతో తమకు ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రత్యక్షంగా మాట్లాడలేదని.. అయినప్పటికీ, అమెరికా - చైనా మధ్య చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు త్వరగా ముగియాలని షీ జిన్పింగ్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇది చైనా కూడా శాంతి స్థాపనకు ఆసక్తి చూపుతున్నదని సూచిస్తుంది.చైనా ఇరాన్కు సైనిక సహాయం అందిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. “అలా చేస్తే చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-చైనా మధ్య ఎలాంటి సంబంధం ఉందో స్పష్టం చేస్తుంది.ట్రూత్ సోషల్లో ఒక వివరణాత్మక పోస్ట్లో, ట్రంప్ సవరించిన షెడ్యూల్ను ధృవీకరించి, వాషింగ్టన్ - బీజింగ్ మధ్య పరస్పర దౌత్య సంబంధాల ప్రణాళికలను వివరించారు. "ఇరాన్లో మా సైనిక చర్య కారణంగా మొదట వాయిదా పడిన కారణంగా, జిన్పింగ్తో నా సమావేశం తిరిగి షెడ్యూల్ చేయడం జరిగిందని.. ఇది మే 14, 15 తేదీలలో బీజింగ్లో జరుగుతుందని అన్నారు''.ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రంప్తో కలిసి చైనాకు వెళ్లనున్నారు. అలాగే భవిష్యత్తులో షీ జిన్పింగ్ దంపతులను అమెరికాలో ఆతిథ్యం ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సైనిక చర్యల కారణంగా ఈ సమావేశం ఆలస్యమైందని ఆమె తెలిపారు. ఈ పరిస్థితిని షీ జిన్పింగ్ అర్థం చేసుకున్నారని చెప్పారు. -
హార్మూజ్ దిగ్బంధం
కైరో/దుబాయ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్ గుండా ఇరాన్ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం! ఇరాన్ ‘ఫాస్ట్ అటాక్’షిప్లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్ 22 దాకా ఉంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. గల్ఫ్ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. ‘ట్రంప్కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగం చీఫ్ ఎస్మాయిల్ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్ను దాటాయి. అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఇరాన్ గమ్మత్తైన ‘గణిత’పోస్టు హార్మూజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్ రియాక్షన్ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా వివరించింది!‘హార్మూజ్’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్ వెల్లడి లండన్/పారిస్: పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్ రేవుల దిగ్బంధానికి బ్రిటన్ మద్దతివ్వబోదని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్ మీడియా తెలిపింది. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్పై దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. చర్చలకు సిద్ధమే: ఇరాన్న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేని భారత్లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్ ఇరాన్దేనని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా ఇరాన్కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ప్రకటించారు. -
హంగేరిలో కొత్త గాలి
పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది. ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఒర్బాన్కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం. -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ను చుట్టుముట్టిన యుద్ధనౌకలు!
ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల చుట్టూ సముద్ర నిర్బంధం అమలు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ 15కు పైగా యుద్ధనౌకలను మోహరించింది. ఈ ఆపరేషన్లో భాగంగా.. అరేబియా సముద్రంలో F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్లు, MV-22 ఓస్ప్రేలను నడుపుతున్న యాంపిఫిబియస్ దాడి నౌక USS ట్రిపోలి (LHA 7) కూడా ఉంది.ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలలోకి, అరేబియా గల్ఫ్.. ఒమన్ గల్ఫ్తో సహా అక్కడ నుంచి బయలుదేరే అన్ని నౌకలపై 1400 GMTకి దిగ్బంధనం నిష్పక్షపాతంగా అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధృవీకరించింది. అయితే.. ఇరాన్ యేతర లేదా ఇతర దేశాలకు చెందిన పోర్టులకు వెళ్లే నౌకలు హోర్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని అమెరికా స్పష్టం చేసింది.USS Tripoli (LHA 7) conducts night flight operations while sailing in the Arabian Sea. Tripoli is designed without a traditional well deck, which allows for more F-35B Lightning II stealth fighters, MV-22 Ospreys, helicopters, and extra maintenance space. During peak operations,… pic.twitter.com/zjQO1nOcmK— U.S. Central Command (@CENTCOM) April 13, 2026అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు యూఎస్ఎస్ ట్రిపోలి (ఎల్హెచ్ఏ 7) రాత్రిపూట విమాన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ నౌకలో లేటెస్ట్ F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్లు, MV-22 ఓస్ప్రే విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ నౌకల లాగా కాకుండా ఎక్కువ యుద్ధ విమానాలను మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది 20కు పైగా F-35B విమానాలను మోహరించగలదు.ఇదీ చదవండి: వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సందర్భంలో కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్కు చెందిన చిన్న వేగవంతమైన యుద్ధ పడవలు ఈ నిర్బంధానికి దగ్గరగా వస్తే వాటిని వెంటనే నాశనం చేస్తామని తెలిపారు. ఇరాన్ నౌకాదళంలోని పెద్ద భాగం ఇప్పటికే యుద్ధంలో నాశనం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు. -
హర్మూజ్ జలసంధిపై ట్రంప్ కొత్త గేమ్ ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హర్మూజ్ జలసంధిలో నౌకల్ని ఆపేస్తూ, మరో వైపు ఇరాన్ను బయపెట్టించేలా ఆ దేశంపై మరోసారి ముప్పేట క్షిపణులతో దాడి చేసే అవకాశాలపై ట్రంప్ తన సీనియర్ సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నిన్న ఇదే అంశంపై ట్రంప్ ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్లో ఫాక్స్ న్యూస్తో మాట్లాడారు. దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఇరాన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ‘హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగిస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను అలా చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ఇరాన్ది. సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే సాలినేషన్ ప్లాంట్లు వాళ్లవి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్లవి. వాటిపై సులభంగా దాడి చేయొచ్చు’ అని అన్నారు.యుద్ధం ప్రారంభ దశలో భాగమైన బాంబింగ్ దాడుల్ని మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం ఈ తరహా దాడులు చేసే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాంబింగ్ దాడులతో ప్రాంతీయ అస్థిరతను మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ట్రంప్ దీర్ఘకాలిక సైనిక యుద్ధాల్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు.మరో ప్రత్యామ్నాయం తాత్కాలికంగా ఆంక్షలను కొనసాగిస్తూ.. దీర్ఘకాలంలో హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా మిత్రదేశాలను బాధ్యత వహించేలా ఒత్తిడి చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ తెలిపారు. ‘ట్రంప్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై నావికాదళ ఆంక్షలు విధించారు. ఇరాన్ దోపిడీని ఆపారు. అదనపు అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్కు తెలిపారు.ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ ఏ చర్యలకు ఉపక్రమించనున్నారనే అంశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం ఇరాన్ తిరిగి చర్చలకు రావాలనుకుంటుందని పేర్కొన్నారు. -
ఇరాన్ సముద్ర మార్గాల్లో అమెరికా ఆపరేషన్ ప్రారంభం
వాషింగ్టన్: ఇరాన్ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ పోర్టులను అమెరికా సైన్యం నిర్బంధించడం ప్రారంభించింది. అంతేగాక, ఇరాన్ నౌకలకు ట్రంప్ హెచ్చరిక జారీచేశారు. “గల్ఫ్లో మా నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఏ నౌక వచ్చినా దాన్ని వెంటనే నాశనం చేస్తాం” అని అన్నారు.ఇరాన్ నౌకాదళం ఇక పనిచేయలేని స్థితిలో ఉందన్నట్లు ట్రంప్ అతిశయోక్తితో ట్రూత్లో పోస్ట్ చేశారు. “ఇరాన్ నౌకాదళం సముద్ర అడుగునే ఉంది. 158 నౌకలు పూర్తిగా నాశనమయ్యాయి. మేము దాడి చేయని వాటి సంఖ్య తక్కువగా ఉంది. ఇరాన్ వాటిని ‘ఫాస్ట్ అటాక్ షిప్స్’ అని పిలుస్తోంది.. కానీ, అవేమో చిన్న నౌకలు. అవి ప్రమాదమని మేము భావించడంలేదు. హెచ్చరిక చేస్తున్నాను.. ఈ నౌకల్లో ఏదైనా మేము చేపట్టిన మా నిర్బంధానికి దగ్గరగా వస్తే, సముద్రంలో పడవలపై మత్తు పదార్థాల వ్యాపారులను ఎదుర్కొనే విధానంలో వీటిని కూడా ఎదుర్కొని వెంటనే నాశనం చేస్తాం. ఈ చర్య వేగంగా, క్రూరంగా ఉంటుంది. పీఎస్ సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే మత్తు పదార్థాల్లో 98.2% ఆగిపోయాయి” అని ట్రంప్ తెలిపారు.కాగా, డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిని నిర్బంధించడానికి వేసుకున్న ప్లాన్లో తాము పాల్గొనబోమని నాటో మిత్ర దేశాలు సోమవారం తెలిపాయి. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటామని సూచించాయి, ఈ నిర్ణయం ట్రంప్కు అసహనం కలిగించి, కూటమిలో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. -
ట్రంప్ సముద్ర దిగ్బంధనం : ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ సముద్ర కార్యకలాపాలపై దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. తమ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. యుద్ధ విరమణ చర్చలు విఫలమైన తర్వాత టెహ్రాన్పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏప్రిల్ 13 (సోమవారం) నుండి ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు అమలులోకి రానున్న తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.అమెరికా సముద్ర దిగ్బంధనం (Blockade)పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దీటుగా స్పందిస్తామని, తమ వద్ద ఇంకా వాడని ఆయుధాలు/అస్త్రాలు ఉన్నాయని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. తమ దేశ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది. "పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని ఇరాన్ మిలిటరీ మరియు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల (EDT) నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోనుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా షరతులను అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24 డాలర్లకి చేరగా, బ్రెంట్ క్రూడ్ 102.29 కి డాలర్ల చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 100-135 నౌకలు వెళ్లేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్పై ఒత్తిడిని పెంచడానికే ఈ దిగ్బంధనం ఉద్దేశించినట్లుగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల కోసం ఉపయోగిస్తున్న "డార్క్ ట్రాన్సిట్స్" (రహస్య రవాణా) ను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధనం వల్ల గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియ నుండటంతో, ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందా అనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: పోప్కు కౌంటర్ : ట్రంప్ సంచలన పోస్ట్ -
ట్రంప్ అంటే నాకేమీ భయం లేదు.. పోప్ లియో సంచలన వ్యాఖ్యలు
వాటికన్,వైట్ హౌస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పోప్ లియో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటే తనకు భయం లేదని, యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పడం కొనసాగిస్తానని పోప్ స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా , ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అన్యాయం, క్రూరమైనవిగా అభివర్ణించారు. ఏ మత సిద్ధాంతం కూడా యుద్ధాన్ని సమర్థించదని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ ఎన్ని విమర్శలు చేసినా, శాంతి కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని పోప్ లియో (Pope Leo) చెప్పారు. 10 రోజుల ఆఫ్రికా పర్యటన ప్రారంభంలో భాగంగా అల్జీర్స్కు వెళ్తున్న పోప్ విమానంలో రాయిటర్స్తో మాట్లాడారు. అయితే తాను ట్రంప్తో నేరుగా ఘర్షణకు దిగబోనని, కానీ మత బోధనలను దుర్వినియోగం చేయవద్దని లియో హెచ్చరించారు. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానాలను పోప్ ఇటీవల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలో ఇరాన్పై యుద్ధాన్ని పోప్ ఇటీవల విమర్శించిన నేపథ్యంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో సంయమనం,శాంతి కోసం పిలుపునిచ్చారు లియో. "సర్వశక్తిమంతులమనే భ్రమ" ఈ యుద్ధానికి కారణం అంటూ ధ్వజమెత్తారు. స్వార్థం, డబ్బుపై ఆరాధన చాలు!", అధికార ప్రదర్శన చాలు! యుద్ధం చాలు! అని లియో గట్టిగా హెచ్చరించారు.పోప్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోప్ను నేరాల విషయంలో బలహీనమైన వ్యక్తి అని, విదేశీ విధానంపై అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడిని విమర్శించే పోప్ తనకు వద్దు, తాను ఏ పని కోసం అయితే అఖండ మెజారిటీతో ఎన్నికయ్యానో, ఆ పనిని కచ్చితంగా చేస్తున్నానని సోషల్మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోప్ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వాదోప వాదాలు, ఈ సంఘర్షణ వైట్ హౌస్ , వాటికన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి.కాగా ముంబైలో పుట్టి పెరిగి, అమెరికా పౌరసత్వం కలిగి ఉండి, గత ఏడాది (మే 2025) క్యాథలిక్ చర్చికి తొలి అమెరికన్ పోప్గా ఎన్నికైన వ్యక్తి పోప్ లియో XIV (రోబర్ట్ ప్రివోస్ట్). ప్రస్తుతం పోప్ లియో 11 రోజుల ఆఫ్రికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో అల్జీరియా, అంగోలా, కెమెరూన్, ఈక్వటోరియల్ గినియా దేశాలను సందర్శించనున్నారు. అమెరికాలోని 70 మిలియన్ల క్యాథలిక్ ఓటర్లపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం -
ఇరాన్కు మద్దతిస్తున్న దేశాలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్కు అయుధ సాయం చేస్తే 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో టారిఫ్ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో ఇరాన్కు చైనా పెద్దమొత్తంలో ఆయుధ సాయం చేయనుందంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చైనా అందించే క్షిపణులతో ఇరాన్ తన శత్రు దేశాల విమానాలను కూల్చేందుకు, ట్యాంకులను ధ్వంసం చేసేందుకు ఉపయోగించనుందని కథనాలు హైలెట్ చేశాయి.ఈ క్రమంలో ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ మరియా సారా బార్టిరోమోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పత్రికా కథనాలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్కు ఆయుధ సాయం చేసే దేశాల జాబితాలో చైనా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని రిపోర్టర్ మరియా ట్రంప్ను ప్రశ్నించారు. అందుకు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్కు ఆయుధ చేసే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. చైనా-ఇరాన ఆయుధ ఒప్పందంపై వెలుగులోకి వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం ఉండకపోవచ్చు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. అదే నిజమైతే చైనాతో పాటు ఇతర దేశాలపై 50 అంతకంటే ఎక్కువ శాతం సుంకం విధిస్తాం. మీరన్నట్లు ఇరాన్కు చైనా ఆయుధ సాయం చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే చైనాకు మాకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి వారు అలా చేస్తారని నేను అనుకోను. అలా చేయరు కూడా. బహుశా యుద్ధం ప్రారంభంలో తక్కువ మొత్తంలో పంపిస్తే.. పంపించి ఉండొచ్చు. కానీ ఇకపై అలా చేస్తారని నేను అనుకోను. ఆయుధ సాయం చేస్తూ దొరికిపోతే వారిపై 50 శాతం సుంకం విధిస్తాం’ అని స్పష్టం చేశారు.అనంతరం చైనా చమురు కొనుగోళ్ల కోసం అమెరికాకు, వెనుజువెలాకు షిప్పులు పంపుకోవచ్చు. వెనెజువెలా నుంచి చమురు కొనుక్కోమని మేమే చెప్పాం. మన దగ్గర అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మేమే వారికి వెనెజువెలా అమ్మే ధరకంటే తక్కువ ధరకే అమ్ముతాము’అని ట్రంప్ అన్నారు. -
పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్
-
చర్చలకు పిలిచి బెదిరింపులు.. హర్మూజ్ తెరవకపోతే ఇరాన్ బూడిదే..
-
రాజకీయ సంచలనం.. ట్రంప్, పుతిన్ సన్నిహితుడు ఓటమి
Viktor Orban.. హంగేరీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హంగేరీలో దశాబ్ద కాలానికి పైగా సాగిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. యువ నాయకుడు పీటర్ మాగ్యార్ ఘటన విజయం అందుకున్నారు. అయితే, విక్టర్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్ సన్నిహితుడిగా పేరుంది.తాజాగా జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అక్కడి 199 స్థానాలు గల శాసనసభలో ‘టిస్జా’ పార్టీకి చెందిన పీటర్ మాగ్యార్ ఘన విజయం అందుకున్నారు. ఓట్ల లెక్కింపు తుది దశకు వచ్చేసరికి టిస్జా పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఏకంగా 138 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బుడాపెస్ట్లోని డాన్యూబ్ నది ఒడ్డున చేరిన వేలాది మంది మద్దతుదారుల మధ్య మాగ్యార్ తన విజయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. తాము విజయం సాధించినట్టు నినాదాలు చేస్తున్నారు. కాగా, పీటర్ మాగ్యార్ ప్రభంజనంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పీటర్ మాగ్యార్ ఈ ఎన్నికల్లో విజయ కేతనంతో హంగేరీ రాజకీయాలను మలుపు తిప్పారు.భావోద్వేగ ప్రకటన..ఇక, హంగేరీలో గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా విక్టర్ ఓర్బన్కు పేరుంది. అయితే, దేశంలో పెరుగుతున్న ఆర్థిక మందగమనం ప్రజల్లో ఆయన పట్ల అసంతృప్తిని పెంచింది. ఓర్బన్ విధానాల వల్ల హంగేరీ అంతర్జాతీయంగా ఒంటరి అయిందనే భావన హంగేరీ ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా మాగ్యార్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం, ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగులు వేస్తానని హామీ ఇవ్వడంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఓటమి అనంతరం, ఓర్బన్ భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ ఫలితాలు మాకు చాలా బాధాకరమైనవి, కానీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.పుతిన్ సన్నిహితుడిగా.. ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్కు విక్టర్ ఓర్బన్ సన్నిహితుడిగా పేరుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ను శత్రువుగా చూపించారు. అంతకుముందు కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో ఆయన మార్క్ కనిపించింది. గతంలో ఉక్రెయిన్కు అందాల్సిన 90 బిలియన్ యూరోల ($105 బిలియన్) రుణాన్ని ఓర్బన్ అడ్డుకున్నారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్లో ప్రతికూల వైఖరి అనుసరించారు. తాజాగా పీటర్ మాగ్యార్ విజయంతో ఈయూలో హంగేరీ వ్యవహరిస్తున్న వైఖరికి తెరపడనుంది. దీంతో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. -
మరోసారి ఇరాన్తో చర్చలు? ట్రంప్ ఏమన్నారంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి చర్చలకు వచ్చినా.. రాకపోయినా తనకు సంబంధం లేదని అసలు ఆవిషయం తాను పట్టించుకోనని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ మాటలు మరోసారి హీట్ పెంచాయి.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదివరకే హార్ముాజ్ను దిగ్భందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే దానికి ఇరాన్ సైతం ఘాటుగానే బదులిచ్చింది. తాజాగా మరోసారి ట్రంప్ చర్చల విషయమై మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "అసలు ఇరాన్ మరోసారి చర్చలకు తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వారు చర్చలకు వచ్చినా రాకపోయినా ఆ విషయం నేనసలు పట్టించుకోను. ఇరాన్ దేశం దాదాపు నాశనమైంది. ప్రస్తుతం ఆదేశం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. చర్చలు విఫలమైనప్పటికీ వారి వద్ద అణ్వాయుధం ఉండదు. ఉండే అవకాశం లేదు". అని అన్నారు.అయితే ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా పెద్దగా దాడి చేయలేదని ఆ దేశంలోని ఒకే వంతెనను కూల్చివేసిందని, అది కూడా వారి తప్పేనన్నారు. హర్ముజ్ను తెరుస్తామని అమెరికా మాటిచ్చి ఇప్పుడు దానిని తప్పారని ఇరాన్ పెద్ద అబద్ధాల కోరు దేశమన్నారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నడుస్తున్న సీజ్ఫైర్ ఏప్రిల్ 22 వరకూ కొనసాగుతుందన్నారు. ఇరాన్ ఓడరేవుల దిగ్భందనం మెుదలవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం శాంతిస్తుందనుకున్న తరుణంలో ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి. హర్ముజ్ను దిగ్భందించాలని అమెరికా నావికాదళానికి ట్రంప్ ఆదేశాలివ్వడం.. అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
పాక్ నేతలపై ట్రంప్ ప్రశంసలు.. భారత్పై మళ్లీ అదే మాట..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో చర్చల వ్యవహారంలో పాకిస్తాన్ను ప్రశంసిస్తూ.. మధ్యలోకి భారత్ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఆపరేషన్ సిందూర్ నాటి పరిస్థితులను మళ్లీ ప్రస్తావించి వార్తల్లో నిలిచారు.కాగా, ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం, చర్చలపై ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను ప్రస్తావించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్లపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్లు అత్యంత సమర్థులు, అసాధారణ వ్యక్తులు అని అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తాను ఆపడం ద్వారా దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ పునరుద్ఘాటించారు. నేను చేసిన సహాయానికి వారు (పాక్ నేతలు) నాకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు. వారి మాటలు నాకు ఎంతో ఆనందం కలిగిస్తాయి.. అంటూ మరోసారి ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావించారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.అయితే, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి అమెరికా మధ్యవర్తిత్వం కారణం కాదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అది కేవలం రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా గతంలోనే స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యమే చర్చలకు చొరవ చూపిందని భారత ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ ట్రంప్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు సిద్ధం: రష్యా
ఇరాన్, అమెరికా చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్మూజ్ టార్గెట్గా ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... -
హార్మూజ్ను దిగ్బంధించండి
వాషింగ్టన్: శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనువెంటనే హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇరాన్కు అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరకు రవాణా నౌక కూడా జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇరాన్కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటూ మేం హార్మూజ్ను దిగ్భందిస్తాం. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను ధ్వంసంచేస్తాం’’ అని అన్నారు. జలసంధి దిగ్బంధంలో మరికొన్ని దేశాలు అమెరికాకు సాయపడనున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘ఇరాన్తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతిచర్చలకు సిద్ధపడ్దాం. చాలా అంశాల్లో వాళ్లతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదలపై ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి. సంక్లిష్టమైన, అనూహ్యమైన, ప్రమాదకర ఇరాన్ పాలకుల చేతికి అణ్వాయుధం దక్కకుండా చేస్తా. ఇరాన్ ఏనాటికీ అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించిన పాక్ ప్రస్తావనను ట్రంప్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘‘పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజంగా అసాధారణ వ్యక్తులు. భారత్తో యుద్ధాన్ని నిలువరించి ప్రత్యక్షంగా 3–5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన నన్ను మునీర్, షెహబాజ్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరాన్కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ‘సండే మారి్నంగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి విధ్వంసక మిస్సైల్ లాంచర్ను ఇరాన్కు చైనా రహస్యంగా పంపిస్తోందన్న వార్తలు చదివా. అవి నిజమని అనుకోను. ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చైనా నిజంగానే ఇరాన్కు ఆయుధ సాయం చేస్తే 50 శాతం పన్నుల భారం పడేస్తా’’ అని హెచ్చరించారు. -
‘నెతన్యాహూ ఫోన్ చేసి అంతా చెడగొట్టారు’
న్యూఢిల్లీ: తాము చర్చల మధ్యలో ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు చేసిన ఫోన్ కాల్ చేసి మొత్తం చెడగొట్టారని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్-అమెరికా ప్రతిష్టంభనలో ఒక కీలక పురోగతికి దారితీయగల చర్చలను పట్టాలు తప్పించింది మాత్రం కచ్చితంగా నెతన్యాహూ ఫోన్ కాలేనని అంటోంది. అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం చెందిన అనంతరం పాక్ నుంచి వెనుదిరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా పలు ఆరోపణలు చేశారు. మేం చర్చల్లో బిజీగా ఉన్నాం, మా చర్చలు కీలక దశకు రాబోతున్న తరుణంలో నెతన్యాహూ నుండి వాన్స్కు ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత అంతా గందరగోళమైంది. అప్పటిదాకా సజావుగా సాగిన చర్చలు ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత మొత్తం మారిపోయింది. అప్పటివరకూ అమెరికా-ఇరాన్ల మధ్య సాగిన చర్చలు మొత్తం ఇజ్రాయెల్కు లబ్ధి చేకూర్చాలనే దిశగా వెళ్లిపోయాయి. ఆ ఫోన్ కాల్తో అమెరికా-ఇరాన్ల దృష్టి మళ్లింది’ అంటూ అరాఘ్చీ పేర్కొన్నారు. తాము ఎంతో నమ్మకంతో పాకిస్తాన్కు చర్చలకు వచ్చామని, కానీ ఎటువంటి పురోగతి కనబడలేదన్నారు. ఇదీ చదవండి: ఇక నుంచి హర్మూజ్లోకి ఏ నౌక వచ్చినా..: ట్రంప్ -
ఇక నుంచి హర్మూజ్లోకి ఏ నౌక వచ్చినా.. : ట్రంప్
హర్మూజ్ జలసంధిలోకి వచ్చే ఏ నౌకనైన ఇక నుంచి తాము అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్లోకి రావడానికి ఇరాన్ అనుమతి తీసుకుని వారికి సుంకం చెల్లించిన పక్షంలో ఏ దేశ నౌకనైనా తాము బ్లాక్ చేస్తామన్నారు. ఇరాన్కు సుంకం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాతో ఇరాన్ చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ట్రంప్.. హర్మూజ్ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించే ఏ నౌకను కానీ, తిరిగి వెళ్లే ఏ నౌకనైనా తాము అడ్డుకోవడం ఖాయమన్నారు. ఇది ఇప్పట్నుంచే అమల్లోకి వస్తుందన్నారు ట్రంప్. ఇరాన్కు సుంకం చెల్లించే ప్రతీ నౌకను అమెరికా దళాలు దిగ్బంధిస్తాయన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్ ట్రంప్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవడానికి వాగ్దానం చేసింది, కానీ వారు ఉద్దేశపూర్వకంగా అది చేయలేదు. దీని వల్ల ప్రపంచంలోని అనేక మంది ప్రజలకు, అనేక దేశాలకు ఆందోళన, అవ్యవస్థ, బాధ కలిగింది. వారు నీటిలో మైన్స్ వేశారని చెబుతున్నారు, అయితే వారి నౌకాదళం మొత్తం, అలాగే ఎక్కువ భాగం మైన్స్ వేసేవాళ్లను మేము తుడిచిపెట్టేశాం. ఇంకా వాటర్ మైన్స్ ఉన్నా దాన్ని తొలగిస్తాం. ఆ సమయంలో మాపై దాడి జరిగితే విధ్వంసం సృష్టిస్తాం. అణుకార్యక్రమాన్ని వదలడానికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అందుకే చర్చలు విఫలమయ్యాయి. ఎవరైనా ఇరాన్కు సుంకం చెల్లించి హర్మూజ్ జలసంధిలోకి రావాలన్నా, అక్కడ నుంచి బయటకు వెళ్లాలన్నా వాటిని అమెరికా దళాలు దిగ్భందిస్తాయి.’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
లైట్ బ్రో.. చర్చల వేళ ట్రంప్ ఆటవిడుపు
పాకిస్థాన్ ఇస్లామాబాద్లో నిన్న (శనివారం) అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచం అంతా ఈ భేటీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే ఉద్విగ్న సమయాలలో యుద్ధానికి కారణమైన ట్రంప్ మాత్రం ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరించాడట.. తనకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఆ సమయంలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు వెళ్లారట.ఇరాన్- అమెరికా మధ్య నిన్న జరిగిన శాంతి చర్చలు ఏలాంటి పురోగతి లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా డిమాండ్లకు ఇరాన్ తలొగ్గకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అయితే చర్చల ఫలితం ఏముంటుందా అని ప్రపంచ దేశాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూశాయి. అయితే అంత కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎంతో కూల్గా ఉన్నారట. అతనికి ఏమి పట్టనట్లు ఒక క్రీడా కార్యక్రమానికి వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.మాయామిలోని ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు ట్రంప్తో తన కుటుంబంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో, భారత్లోని అమెరికా రాయభారి సెర్గియో గోర్, ఇతర అధికారులతో కలిసి గంటల సమయం గడిపారు. అధికారులు చర్చల వివరాలు తెలియజేయడానికి వచ్చినప్పటికీ ట్రంప్ పెద్దగా పట్టించుకోకుండా గేమ్ ఎంజాయ్ చేశారని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్కు ఫోన్ చూపిస్తూ ఏదో చెప్పినప్పటికీ ఆయన ముఖంలో ఏలాంటి భావాలు లేవని తెలిపారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విజేతలను అభినందించారని వారితో కలిసి గడిపారని కథనాలు పేర్కొన్నాయి.. అయితే గతంలోనూ ఈ చర్చలు గురించి తాను పట్టించుకోనని ఇరాన్ సైనికంగా ఎప్పుడో ఓడిపోయిందని అన్నారు. కాగా అమెరికాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చర్చలు జరుగుతున్నప్పుడు అధ్యక్షుడు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు కీలక ప్రకటన
జెరూసలేం: ఇరాన్తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యలు ఇంకా పూర్తికాలేదని బాంబు పేల్చారు. కాగా, ఇరాన్పై ఇప్పటికే విజయం సాధించినట్టు నెతన్యాహు చెప్పుకొచ్చారు. మరోవైపు లెబనాన్తో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించే నాటికి ఇరాన్ అణ్వస్త్రాలకు అత్యంత సమీపంలో ఉంది. రోజుకు వందల క్షిపణులు తయారు చేసే సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు అస్తిత్వ ముప్పులను ఎదుర్కోవడమే మా లక్ష్యమని అన్నారు. అలాగే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని భూగర్భంలో అణు, క్షిపణి కార్యక్రమాలను దాచిపెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోలేకపోయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణం ఇరాన్ విధానాలేనని ఆరోపించారు.ఇరాన్ బలహీనమే.. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల సమృద్ధ యురేనియం విషయంలో కూడా నెతన్యాహు స్పందించారు. దానిని దౌత్యపరంగా లేదా అవసరమైతే బలప్రయోగంతో తొలగిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా మ్యాప్ చూపిస్తూ వాళ్లు మమ్మల్ని అణగదొక్కాలని చూశారని, ఇప్పుడు తామే వారిని బలహీనపరుస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ బలహీనపడిందని, కాల్పుల విరమణ కోరుతున్నదని నెతన్యాహు అన్నారు. దేశంలో అంతర్గత సమస్యలు పెరిగాయని కూడా పేర్కొన్నారు. మమ్మల్ని నాశనం చేస్తామని బెదిరించినవాళ్లు ఇప్పుడు తమకే బతుకుబండిపై పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.శాంతి కోసం సిద్ధం..లెబనాన్తో శాశ్వత శాంతి కోసం సిద్ధమని, అయితే ఈ ఒప్పందం తరాల పాటు నిలిచేలా ఉండాలని నెతన్యాహు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రతకు హాని కలిగించే శక్తులపై చర్యలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లెబనాన్ గత నెలలో పలుమార్లు శాంతి చర్చలకు ముందుకొచ్చిందని చెప్పారు. కాగా, లెబనాన్తో వచ్చే వారం నుంచే అధికారిక చర్చలు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ రెండు ప్రధాన షరతులు విధించింది. మొదటిగా, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. రెండోది, భద్రతకు హామీ ఇచ్చేలా దీర్ఘకాలిక శాంతి ఒప్పందం ఉండాలి. -
ఇరానియన్లకు ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికాలో దీర్ఘకాలంగా నివాసముంటున్న ఇరాన్ ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల సంబంధీకుల గ్రీన్కార్డులను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా, లాస్ఏంజెలెస్కు చెందిన సైకాలజీ ఉపాధ్యాయుడు సయ్యద్ ఈసా హషేమీ, ఆయన భార్య, కుమారుడి గ్రీన్కార్డులను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.అయితే, వీరంతా ఇరాన్లో జన్మించి, అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వారని వివరించింది. వీరిని నిర్బంధంలోకి తీసుకున్న అధికారులు త్వరలోనే స్వదేశానికి పంపనున్నారని తెలిపింది. 1979లో టెహ్రాన్లోని అమెరికా ఎంబసీపై దాడి చేసిన వారికి ప్రతినిధిగా వ్యవహరించిన మసౌమె ఎబ్తెకర్ కుమారుడే హషేమీ. అనంతరం మసౌమె ఇరాన్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలయ్యారు.కాగా, 2020లో బాగ్దాద్పై అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాజీ చీఫ్ కసెమ్ సొలెమానీ కుటుంబీకుల గ్రీన్ కార్డులను గత వారం విదేశాంగ శాఖ రద్దు చేయడం తెల్సిందే. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విభిన్నమైన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత తన ప్రత్యేకమైన అభిరుచి మేరకు వైట్హౌస్ పరిసరాల రూపురేఖలు మార్చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఆయన ఏకంగా ‘మ్యాజిక్ పెయింట్’ అనే కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక అద్భుత భవనానికి ఈ రంగు వేయాలన్న ఆయన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.1888లో గ్రానైట్ రాయితో నిర్మించిన ఐసెన్హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వైట్హౌస్కు ఆనుకునే ఉంటుంది. జాతీయ భద్రతా మండలి, ఉపాధ్యక్షుడి కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 553 విశాలమైన గదులు, అద్భుతమైన చెక్క అలంకరణలు, చేతితో చిత్రించిన టైల్స్ ఉన్న ఈ సువిశాల భవనానికి పూర్తి తెలుపు రంగు వేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దీనికోసం సిలికేట్తో కూడిన మ్యాజిక్ పెయింట్ వాడాలని ఆయన సూచిస్తున్నారు. ఈ రంగు కారణంగా రాతి గోడలు మరింత దృఢంగా మారుతాయని, మరకలు పడవని, భవిష్యత్తులో మళ్లీ రంగు వేసే పని ఉండదని వైట్హౌస్ వర్గాలు చెబుతున్నాయి. 1800ల చివరి నుండి ఈ భవన నిర్వహణను నిర్లక్ష్యం చేశారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫైన్ ఆర్ట్స్ కమిషన్కు నివేదికలు సమర్పించారు.అయితే ఈ ప్రతిపాదనను చరిత్రక కట్టడాల పరిరక్షణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ చెబుతున్న సిలికేట్ మ్యాజిక్ పెయింట్ ఆ గ్రానైట్ భవనానికి ఏమాత్రం సరిపడదు. ఈ పెయింట్ వాడటం వల్ల చరిత్రక భవనానికి ముప్పు వాటిల్లుతుందని, పైగా ఇది చట్టవిరుద్ధమని సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్య పక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఎన్ని అడ్డంకులు వస్తున్నా ట్రంప్ ప్రతిపాదన మాత్రం ముందుకు సాగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి! -
అందుకే ఒప్పందం కుదరలేదు: ఇరాన్ కీలక ప్రకటన
ఇస్లామాబాద్: అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ వెల్లడించింది. యూఎస్ మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని.. చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదస్పద అంశాలు ప్రస్తావించారన్న ఇరాన్.. ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది.పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్తో డీల్ లేదని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. తాము విధించిన షరతులను ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామంటూ చెప్పుకున్న వాన్స్.. దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు.హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలని.. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదంటూ ఇరాన్ తేల్చి చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. ఇరాన్పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి’’ అని ఇరాన్ డిమాండ్ చేస్తూ వస్తోంది.మరోవైపు, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదని అమెరికా డిమాండ్ చేస్తోంది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు’’ అని అమెరికా స్పష్టం చేసింది. -
ఇరాన్ యుద్ధం.. చైనాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్న వేళ చైనాకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. చైనా ఇరాన్కు ఆయుధాలు పంపితే, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాగా, ట్రంప్.. మియామీ ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే, ఇరాన్కు మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్ప్యాడ్ ఆయుధాలను ఇరాన్కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి.#WATCH | On reports of China shipping weapons to Iran, US President Donald Trump says, "If China does that, China is going to have big problems." (Source: US Network Pool Via Reuters) pic.twitter.com/YiSlLe3TI6— ANI (@ANI) April 12, 2026నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్కు చైనా పంపిందని తెలుస్తోంది.మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్బంగా వాషింగ్టన్లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ.. “మేము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికీ ఆయుధాలు ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తోంది. -
ఇరాన్తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి జేడీవాన్స్ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా చర్చల అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఇరాన్తో డీల్ లేదు. ఇస్లామాబాద్ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్దపడట్లేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్కు కచ్చితంగా బ్యాడ్ న్యూస్’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, "...The simple fact is that we need to see an affirmative commitment that they (Iran) will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a… pic.twitter.com/elS9Q0xPz4— ANI (@ANI) April 12, 2026ఇక, ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఇరుపక్షాల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్ అద్భుతంగా పనిచేసిందన్నారు. చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్ వల్ల కలిగినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదని జేడీ వాన్స్ అన్నారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం కలిగిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాకిస్తాన్ నుంచి జేడీ వాన్స్ బృందం.. అమెరికాకు బయలుదేరింది. అయితే, హార్మూజ్ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ను తొలగించాలని ఇరాన్ కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు ముగిశాయి. దాదాపు 14 గంటలపాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం మరో విడత చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. -
ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు.. అల్టిమేటం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ముగిశాయి.. -
ముగిసిన చర్చలు.. ఇరాన్-అమెరికా కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ముగిశాయి. జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు సాగాయి. సుమారు 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఇంకా కొన్ని సాంకేతిక అంశాలు ఖరారు చేయాల్సి ఉందన్న ఇరాన్.. చర్చల్లో ఆర్థిక, సైనిక, న్యాయ, అణు కమిటీలు పాల్గొంటాయని పేర్కొంది. చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.తొలిదశ చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై సైనిక విజయం సాధించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఎలా చూసినా గెలుపు అమెరికాదే. చర్చల్లో ఏం జరుగుతుందనేది. మాకు అనవసరం. చర్చలు, ఫలించినా ఫలించకపోయినా హర్మూజ్లో మైన్స్ తొలగిస్తాం. హర్మూజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ట్రంప్ తేల్చి చెప్పారు.ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం: జేడీ వాన్స్అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్తో డీల్ లేదు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి’’ అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరిగాయి.ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. -
సానుకూలంగా చర్చలు షురూ!
ఇస్లామాబాద్/లాహోర్/దుబాయ్: పశ్చిమాసియా లో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆరంభమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రౌండ్లు చర్చలు జరిగాయి. మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటన్నది ఇరుపక్షాలు ఇంకా బయటపెట్టలేదు. ఆదివారం కల్లా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. 1979 తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు అమెరికా, ఇరాన్ బృందాలు ఒకే బల్ల వద్ద కూర్చున్నాయని, చారిత్రాత్మక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుపక్షాలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని పాకిస్తాన్ టీవీ తెలియజేసింది. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతోపాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య ఇవే తొలి ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. అంతకుముందు ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలకు నూర్ ఖాన్ ఎయిర్బేస్లో ఉప ప్రధాని ఇషాఖ్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ స్వయంగా స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి సైనిక దుస్తులు ధరించి, అమెరికా బృందానికి సూటు బూటు ధరించి అసిమ్ మునీర్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇరాన్ బృందాలతో షరీఫ్ భేటీ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇరాన్ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో శనివారం షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలకు ముందుకొచి్చన ఇరాన్ బృందాన్ని షెహబాజ్ షరీఫ్ అభినందించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఈ చర్చల్లో అర్థవంతమైన ఫలితాలను సాధించే దిశగా మధ్యవర్తిగా తమ పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగైతేనే ఒప్పందం కుదురుతుంది: రెజా అరెఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి అనుగుణంగా అమెరికా అధికారులు స్వదేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తే అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు. అలా కాకుండా ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ సిద్ధాంతానికి మద్దతిచ్చే ప్రతినిధులతో చర్చలు జరిగితే మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగుతాయని, ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ డిమాండ్లు → హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలి. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదు. → గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. → ఇరాన్పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. → స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి. అమెరికా డిమాండ్లు → ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. → యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. → హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు. చర్చలు విఫలమైతే కఠినంగా ప్రతిస్పందిస్తాం: ట్రంప్ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు పట్టు వీడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయని సంకేతాలిచ్చారు. ఇరాన్ను విఫలమవుతున్న దేశంగా అభివరి్ణంచారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
హర్మూజ్ జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: ఇస్లామాబాద్లో జరుగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్మూజ్ జలసంధిని ఎటువంటి సమస్యలు లేకుండా దాటినట్లు ఆయన వెల్లడించారు. ఈ చర్యను ‘ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నం’గా ఆయన అభివర్ణించారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ నౌకలు తూర్పు నుండి పశ్చిమ దిశగా గల్ఫ్లోకి ప్రవేశించి, తిరిగి అరేబియన్ సముద్రానికి చేరుకున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో మాట్లాడుతూ.. మేము హర్మూజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మేము చేస్తున్న ఉపకారం. వారికి ఈ పని చేయడానికి ధైర్యం లేదు” అని ఎద్దేశించారు.అదే సమయంలో ఆయన ఇరాన్కి పెద్దగా సైనిక శక్తి లేకపోయినా, సముద్రంలో ఉంచిన మైన్ల వల్లే అమెరికా నౌకలకు ప్రమాదం కలుగుతుందని సూచించారు. అంటే, ఇరాన్కి ప్రత్యక్షంగా అమెరికా నౌకలను ఎదుర్కొనే శక్తి లేదని, కానీ మైన్ల ముప్పు మాత్రం అమెరికా నౌకలకు ఒక పెద్ద సవాలుగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మార్గాన్ని తిరిగి తెరవడం ఒక ముఖ్యమైన షరతుగా ఉన్నప్పటికీ, ఇరాన్ ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి తీసుకోలేకపోయింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఇస్లామాబాద్లో కొనసాగుతున్నాయి. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ చర్చలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయి. -
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: చర్చల వేళ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ చిత్తుగా ఓడిపోతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇరాన్ గెలుస్తోందని చెప్పడానికే మీడియా మొగ్గుచూపుతోంది. కానీ, వాస్తవానికి అందరికీ ఇరాన్ ఓడిపోతుందనే విషయం తెలుసని తెలిపారు.“వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, వారికి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ లేదు, రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదు, వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లు కూడా నాశనం అయ్యాయి. ముఖ్యంగా, ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఇక లేరు’ అని తెలిపారు.సముద్రంలో ఇరాన్ మైన్లు వేసిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా ఇప్పుడు హార్మూజ్ జలసంధిని బాగు చేస్తోందని, ప్రపంచ దేశాలకు సాయంగా ఈ పని చేస్తున్నామని అన్నారు.మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్లో జరుగుతున్న చర్చలు కొన్ని భేదాలు, ముందస్తు షరతుల వల్ల ఆలస్యమయ్యాయయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, చర్చలు 5 గంటలకుపైగా ఆలస్యమయ్యాయని, ఆ తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్ యుద్ధం వేళ ఎరువుల ధరలను నిశితంగా గమనిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మార్కెట్ను నియంత్రిస్తూ ధరలను అధికంగా పెంచడాన్ని అమెరికా అంగీకరించదని చెప్పారు. కాగా, ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి ఆ దేశ స్పీకర్ మహమ్మద్ బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు.చర్చలలో అమెరికాకు ఇరాన్ ప్రతిపాదనలు ఇవే..ఇరాన్పై దురాక్రమణ చేయొద్దుహార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించడానికి అంగీకరించడంఅన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడంఅన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడంఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడంIAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడంఇరాన్కు నష్టపరిహారం చెల్లించడంఈ ప్రాంతం నుంచి అమెరికా సైనికదళాలను ఉపసంహరించుకోవడంలెబనాన్పై దాడులు విరమించుకోవడం -
చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?
-
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్తో యుద్ధం, శాంతి చర్చల మధ్య అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి ఆమె రెడీ అవుతున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన కమలా శుక్రవారం న్యూయార్క్లో జరిగిన 'నేషనల్ యాక్షన్ నెట్వర్క్' (NAN) సదస్సులో తొలిసారి ఆ విషయంపై స్పందించడం గమనార్హం.2024లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, 2028లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. న్యూయార్క్ నగరంలో రెవరెండ్ అల్ షార్ప్టన్ స్థాపించిన 'నేషనల్ యాక్షన్ నెట్వర్క్' సమావేశంలో పాల్గొన్న కమలా హారిస్ తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028లో మళ్ళీ పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు చేయవచ్చు.. దాని గురించి ఆలోచిస్తున్నాను పోటీ చేసే అవకాశం ఉంది అని హారిస్ సమాధానమిచ్చారు. 2028లో "అమెరికా ప్రజల కోసం" అధ్యక్షుడిగా ఎవరు ఉత్తమంగా పని చేయగలరు అనే దానిని బట్టి తాను పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తానని హారిస్ తెలిపారు. ఈ సమాధానంతో అక్కడికి వచ్చిన వారంతా హర్షధ్వానాలు చేశారు. 2028 నాటికి అమెరికా ప్రజల కోసం ఎవరు అత్యుత్తమంగా పనిచేయగలరు అనే కోణంలోనే తన పోటీపై నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా మంది ప్రజలకు సంతృప్తిని ఇవ్వడం లేదని, మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "స్టేటస్ కో" ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ప్రజల కోసం చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.BREAKING - Kamala Harris just now:"So while [Trump] struts around boasting about how he will annihilate a whole people, what he is in fact doing, is making us weaker, unreliable and less influential."BRAVO!! pic.twitter.com/hySsz9ZPr5— Brian Krassenstein (@krassenstein) April 10, 2026 "> ఈ సమావేశానికి కమలా హారిస్తో పాటు 2028లో అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉన్న ఇతర కీలక డెమోక్రాటిక్ నేతలు కూడా హాజరు కావడం విశేషం. వీరిలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మాజీ రవాణా శాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్ తదితరులు సహా పలువురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులున్నారు. ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ట్రంప్ ప్రజా ఓటుతో పాటు ఎలక్టోరల్ కాలేజీని కూడా గెలుచుకున్నారు. హారిస్ గతంలో అమెరికా సెనేటర్గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా పనిచేశారు. హారిస్ ఓటమి తర్వాత, డెమోక్రాటిక్ పార్టీలో కొత్త నాయకత్వం రావాలని మెజారిటీ ఓటర్లు కోరుకుంటున్నట్లు పోలింగ్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ తరపున పలువురు రేస్లో నిలిస్తే, గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధం, ఇజ్రాయెల్తో దోస్తీ కారణంగా, రాజకీయపరంగా, పరిపాలనా పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కమలా హారిస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
పాక్ ప్రధాని ముందు ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకున్న US
-
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..
ఇస్లామాబాద్: చర్చలకు పాకిస్తాన్ వచ్చిన ఇరాన్ విమానంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువచ్చారు. మినాబ్ స్కూల్ మృతుల కోసం ఒక్కో సీటు కేటాయించారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కాగా.. ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల సంభవిస్తున్న మానవ ప్రాణ నష్టానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకుంటూ, ఘలీబాఫ్ ఇలా రాశారు: "ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు వీరే.. #Minab168" అంటూ ట్వీట్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్తున్న ఈ ప్రతినిధి బృందానికి 'మినాబ్ 168' అని పేరు పెట్టారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ పేరును నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "మినాబ్ చిన్నారులను మేము ఎప్పటికీ మర్చిపోము" అని రాసింది.همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026మినాబ్లో ఏం జరిగింది?ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజున దక్షిణ ఇరాన్లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజరే తయ్యిబే' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక వైమానిక చిత్రాన్ని షేర్ చేశారు. అందులో "అమాయక" బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. అదే పోస్ట్లో అరాగ్చీ, ట్రంప్పై విమర్శలు చేస్తూ దీనిని 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్'(క్రూరమైన హత్య) గా అభివర్ణించారు. -
ట్రంప్ ఒకటి తలిస్తే.. జరిగింది మరోకటి..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్లో పాలన మార్పు కోసం తహతహలాడారు. ఇందుకోసం ఆ దేశంపై యుద్ధమే ప్రకటించి సుప్రీం లీడర్ ఖమేనీని అంతమెుందించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఖమేనీ అంతం తర్వాత టెహ్రాన్ను పాలిస్తున్న కొత్త నాయకత్వం మునుపటి కంటే మరింత కఠినమైన మత భావజాలం కలదని తెలుస్తోంది. దీంతో యుఎస్ఏ, ఇజ్రాయెల్ పరిస్థితి అయోమయంగా మారింది.ఇరాన్లో పాలన మార్పు కోసం ఆ దేశంలోని ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లెక్కారు. మతఛాందస వాదుల చేతిలో పాలన ఉందని వారు గద్దెదిగాలని నిరసనలు చేపట్టారు. దీంతో ఆ తిరుగుబాటుని అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇదే అవకాశంగా భావిస్తు వచ్చిన ట్రంప్ మెుదట నుంచి ఇరాన్ను హెచ్చరిస్తూ వచ్చారు. అణ్వయుధాలు తయారు నెపంతో పాటు అక్కడి ప్రజలు సైతం పాలన మార్పు కోరుకుంటున్నారని యుద్ధం ప్రారంభించారు. యుద్ధంలో తొలిరోజే ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమెుందించారు. అయితే ఖమేనీ మరణంతో ఆయన కుమారుడు పగ్గాలు చేపట్టారు.. ఇది అంతా తెలిసిన విషయమే అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న వారు గత ఖమేనీ కంటే ఇంకా ప్రమాదకరమైన వ్యక్తులని ఇజ్రాయెల్ రహస్య నివేదికలు ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి.అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్ పాలిస్తున్న నాయకులు అధికశాతం ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నుంచే వచ్చారని కథనాలు పేర్కొన్నాయి. . వీరికి గత పాలకులతో పోలిస్తే మతఛాందస సిద్ధాంతాలు మరింత అధికంగా ఉంటాయని కఠిన వైఖరి అవలంభిస్తారని తెలిపాయి. ఈ వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రహస్యంగా నివేదించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ట్రంప్, నెతన్యాహూ సైతం పలుమార్లు ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్లో పాలన మార్పుకు ఇది సరైన సమయమని దీన్ని అవకాశంగా తీసుకొని రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టాలని తెలిపారు.అయితే అక్కడి ప్రజలు దాన్ని తిరస్కరించి. మానవహారాలుగా ఏర్పడి అక్కడి మౌళిక సదుపాయాలకు రక్షణగా నిలిచారు. అయితే ట్రంప్, నెతన్యాహు ఒకటి తలిస్తే ఆ దైవం మరోటితలచిందన్న చెందాన ప్రస్తుత పరిస్థితి ఉందని కథనాలు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తు ఏంటో ఈ రోజు తేలే అవకాశాలున్నాయి. -
మరో 24 గంటల్లో.. ట్రంప్ హాట్ కామెంట్స్
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్లు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. శాంతి చర్చలకు ముందు లెబనాన్పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధుల్ని విడుదల చేయాలని రెండు కండీషన్లు ఉంచింది ఇరాన్. దీంతో చర్చలు ఎలా ముందుకు సాగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్లు చేశారు.శాంతి చర్చలు గనుక విఫలమైతే ఇరాన్పై గట్టి దాడులే జరుపుతామని హెచ్చరించారు. న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్పై దాడులకు రెడీగా ఉన్నాయి. ఈసారి మా యుధ్ధనౌకలను అత్యంత ఆధునిక ఆయుధాలతో నింపాం. ఒకవేళ ఒప్పందం గనుక కుదరకపోతే అత్యంత శక్తివంతంగా సైనిక చర్య ఉంటుంది. మరో 24 గంటల్లో ఏదనేది తేలిపోతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన.సోషల్ ట్రూత్లోనూ ట్రంప్ కాస్త ఘాటుగానే ఓ పోస్ట్ చేశారు. ‘‘ఇరానియన్లకు ఎలాంటి అవకాశాలు లేవు. వారు ప్రపంచాన్ని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా కేవలం బెదిరించగలరు. ఇవాళ వాళ్లు ప్రాణాలతో ఉన్నారంటే అది కేవలం తన చర్చల వల్లే’’ అంటూ రాసుకొచ్చారు.వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలుశాంతి చర్చలు విజయవంతం అవుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ వాళ్లు ఏదైనా ఆటలాడితే.. మా బృందం అదేరీతిలో వ్యవహరిస్తుంది అని అన్నారు.ఘలీబాఫ్ పోస్ట్చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్లను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి అయిన మొహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల అనే రెండు అంశాలు పరస్పర అంగీకారానికి వచ్చినప్పటికీ ఇంకా అమలు కాలేదని,, ఈ రెండు విషయాలు చర్చలు ప్రారంభం కావడానికి ముందు అమలు కావాలి అని పేర్కొన్నారు. Two of the measures mutually agreed upon between the parties have yet to be implemented: a ceasefire in Lebanon and the release of Iran’s blocked assets prior to the commencement of negotiations.These two matters must be fulfilled before negotiations begin.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026 -
చర్చలు విఫలమైతే సర్వనాశనమే: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరుదేశాల ప్రతినిధులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలని అత్యంత కీలకమైనవిగా చెప్పుకొచ్చారు. చర్చలు జరిగితే అంత సవ్యంగా సాగుతుందని లేదంటే సర్వనాశనం అవుతుందని అర్థం వచ్చేలా 'మేక్ ఆర్ బ్రేక్' అని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: US-Iran: పాక్ ప్రధానిపై ప్రశంసలు.. ఓవరాక్షన్ అవసరమా?)శనివారం నుంచి ఇస్లామాబాద్లో ఈ చర్చలు ప్రారంభమవుతాయని, ఇందులో అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారని షరీఫ్ తెలిపారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం పాకిస్తాన్కే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. తన అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు అంగీకరించి, చర్చలకు సిద్ధమైనందుకు ఇరుదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి చర్చలు విజయవంతమవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రజలు ప్రార్థనలు చేయాలని షరీఫ్ కోరారు.ఇటీవల అమెరికా-ఇరాన్ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలోనే ట్రంప్ రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. పాక్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా ఇస్లామాబాద్ వేదికగా శనివారం నుంచి శాంతి చర్చలు జరగనున్నాయి.ఇకపోతే పాకిస్థాన్ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఇంధన ధరలని తగ్గిస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. రూ.520గా ఉన్న డీజిల్ లీటర్ ధరని రూ.385కు.. రూ.378గా ఉన్న లీటర్ పెట్రోల్ లీటర్ ధరని నుంచి రూ.366కు తగ్గించారు. (ఇదీ చదవండి: ఆయుధాలతో నౌకలు సిద్ధం.. చర్చలకు ముందే ట్రంప్ వార్నింగ్) -
ఆయుధాలతో నౌకలు సిద్ధం.. చర్చలకు ముందే ట్రంప్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ యుద్ధానికి సంబంధించి రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతోంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వరస పోస్టులు పెట్టారు.మేం కొత్త మార్పు దిశగా ముందుకెళ్తున్నాం. మా నౌకల్ని అత్యుత్తమ ఆయుధాలతో లోడ్ చేస్తున్నాం. గతంలో ఉపయోగించిన వాటికంటే ఇవి శక్తివంతమైనవి. అంతర్జాతీయ జలమార్గాలని ఉపయోగించి ప్రపంచాన్ని కొన్నిరోజులు దోపిడి చేయడం తప్ప ఇరాన్ నేతలకు మరో దారి లేదు. కేవలం చర్చలు జరపడానికి మాత్రమే వాళ్లు బతికున్నారు అని ట్రంప్ వరస పోస్టులు పెట్టారు.ఇదంతా చూస్తుంటే ఒకవేళ ఇరాన్తో చర్చలు గనక విఫలమైతే భారీ సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని సంకేతాలు ఇస్తున్నట్లే. ఇప్పుడీ వ్యాఖ్యలే అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు శాంతి చర్చలకు ఏర్పాట్లు పూర్తయిన వేళ ఇరాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.లెబనాన్లో కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తుల విడుదల ముందు జరగాలని.. ఈ రెండు షరతులు నెరవేరే వరకు చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ అన్నారు. ఇప్పటికే వీటిపై ఇరుపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరినా, ఇంకా అమలు కాలేదని గుర్తుచేశారు. చర్చలు ప్రారంభమయ్యే ముందు ఈ రెండు పూర్తి కావాల్సిందేని స్పష్టం చేశారు. -
ఎప్టోస్టీన్ ఫైల్స్ పై ట్రంప్ వైఫ్ షాకింగ్ రియాక్షన్
-
అమెరికా నిఘా డ్రోన్ అదృశ్యం
-
ఎప్స్టీన్తో లింకులు.. పెదవి విప్పిన అమెరికా ఫస్ట్ లేడీ
అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు. తనపై వస్తున్న కథనాలు అబద్ధాలుగా ఆమె కొట్టిపారేశారు. మెలానియా తన పరువు తీసేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. అతని నేరాల గురించి కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను కుట్రగా ఆమె అభివర్ణించారు.ఎప్స్టీన్తో నన్ను ముడిపెడుతూ చేస్తోన్న అసత్య ప్రచారం వెంటనే ఆగాలి. నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు నైతిక విలువలు లేనివారు. వారి అజ్ఞానాన్ని నేను వ్యతిరేకించను. కానీ నా ప్రతిష్టను దెబ్బతీయాలనే వారి దురుద్దేశాన్ని నేను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఎప్స్టీన్ నేరాల బాధిత మహిళలను బహిరంగ విచారణ నిర్వహించి.. వారు తమ ఆవేదనను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పే హక్కు ఉండాలి. అప్పుడు మాత్రమే వాస్తవం వెలుగులోకి వస్తుందని మెలానియా అన్నారు.మోడల్గా ఉన్న మెలానియాను డొనాల్డ్ ట్రంప్నకు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించాడంటూ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైఖెల్ వోల్ఫ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మెలానియా ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. తాను ట్రంప్ను తొలిసారి న్యూయార్క్లోని కిట్కాట్ క్లబ్లో కలుసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరిన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భాగంగా వీటిని బహిర్గతం చేసింది. ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని తాజాగా ఆ పత్రాల్లో వెల్లడైంది. ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్కి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు.ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతడ్ని గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది. -
ఇరాన్కు అమెరికా మరోసారి వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. శాశ్వాత శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరాన్-అమెరికాలు చర్చలకు ముందుకు వచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ పాటిస్తున్న ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ చర్చలపై సందిగ్ధత నెలకొంది. -
హర్మూజ్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
నాటో తీరుపై ట్రంప్ మళ్లీ విమర్శలు
నాటో వ్యహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మనల్ని నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు, ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవి అర్థం కావు అని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. ఇరాన్తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్ని దక్కించుకునే విషయంలో నాటో కలిసి రానందుకు ఇప్పటికే నాటో దేశాలని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు.మరోవైపు మంగళవారం రాత్రికే ఇరాన్ నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు ఇచ్చిన ట్రంప్.. సరిగ్గా గంటన్నర ముందు కాల్పుల విరమణ ప్రకటించారు. రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పాక్ మధ్యవర్తిత్వం చేయగా.. ఇప్పుడు ఆ దేశంలోని ఇస్లామాబాద్లోనే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఇరు దేశాల ప్రతినిధులు.. ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం పాక్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చల కోసం వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుండగానే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు. -
ట్రంప్ తదుపరి అడుగు ఎటువైపు..?
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షునిగా కాసేపు యుద్ధం అంటారు.. మరి కాసేపు శాంతి గెలిచింది అంటారు. అమెరికా పరిపాలన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ప్రతీ అంశంలోనూ ఏదొక వివాదం లేకుండా ఆయనకు పూట ముందుకెళ్లడం లేదు. అమెరికాతో యుద్ధంలో భాగంగా చర్చలకు ఇరాన్ సిద్ధమవ్వగానే ప్రపంచ శాంతి గెలిచిందంటూ ఒక గంభీరమైన ప్రకటన ఇచ్చేశారు. ఇరాన్ చర్చలకు ఒప్పుకున్న మాట అత్యంత సంకట స్థితిలో ఉన్న ట్రంప్కు ఊపిరినిచ్చినట్లయ్యింది. అంతకుముందు వరకూ ఇరాన్ను అది చేస్తాం. ఇది చేస్తాం అన్న ట్రంప్ నోట శాంతి మాట వినిపించింది.అయితే అది కేవలం శాంతి చర్చలకు మాత్రమే ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంటే ఇక్కడ యుద్ధానికి బ్రేక్ మాత్రమే వచ్చింది.. పూర్తిగా యుద్ధాన్ని ముగించేందుకు కాదనే విషయం ఇరానే తెలపడం ద్వారా చర్చలు తర్వాతే అసలు విషయం ఏమిటన్నది తెలుస్తుందని చెప్పేసింది. చర్చల్లో లెబనానే హాట్ టాపిక్..?ఇజ్రాయెల్ బుధవారం 100 మిస్సైళ్లను ప్రయోగించడంతో లెబనాన్లో 250 వరకూ మరణించారు. ఇది ఇరాన్ అత్యంత అసహనం తెప్పించింది. ఒకవైపు పాకిస్తాన్ వేదికగా ఇరు దేశాలు చర్చలకు సిద్ధమైన తరుణంలో ఇజ్రాయెల్ మాత్రం ఇంకా లెబనాన్పై దాడులు చేస్తూనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో ఆ దేశానికి సాయం చేసిన వారిలో హెజ్బుల్లా దళం ఒకటి. మరి వారిపై దాడులు చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా?, తమతో చర్చలు అంటూ తమకు మద్దతిచ్చిన వారిపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు.సీజ్ఫైర్ అనేది కేవలం అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య మాత్రమేనని అది లెబనాన్ విషయంలో కాదని అంటున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇదే మాట అంటున్నారు. ఒకవేళ లెబనాన్ను సీజ్ఫైర్ అంశంలో చేర్చకపోతే ఇరాన్ ఒప్పుకుంటుందా? అనేదే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రశ్న. అలా జరగని పక్షంలో ట్రంప్ ముందున్నది ఏమిటి అనే చర్చ మొదలైంది. ఇరాన్ పెట్టే ఈ షరతకు ఒప్పుకోవాలంటే.. అందుకు ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ట్రంప్ ఒప్పించాలి. మరి నెతన్యాహూ ఇందుకు ఒప్పుకుంటారా? అనేది మరో ప్రశ్న. నెతన్యాహూపై ఒత్తిడి తేగలరా?లెబనాన్పై యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై ట్రంప్ ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. లెబనాన్పై దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. ఆ దాడిని ఆపాలని చర్చలకు ముందే చెప్పింది. వాటిపై అమెరికా-ఇజ్రాయెల్ పెద్దలు నో అంటున్నారు. శాంతి చర్చల్లో కూడా అదే మాట అంటే మాత్రం.. అదే సమయంలో ‘‘లెబనాన్పై దాడులు ఆపకపోతే చర్చలు లేవు.. ఏమీ లేవు’’ అని ఇరాన్ అంటే మాత్రం ట్రంప్ నోట్లో వెలక్కాయపడినట్లే. ఆ సమయంలో ట్రంప్ ముందున్నది మళ్లీ యుద్ధానికి దిగడమే. అంటే ఇక్కడ పూర్తిగా శాంతియుత వాతావరణం రావాలని కోరుకుంటే మాత్రం నెతాన్యాహూను ముందుగా ఒప్పించాలి ట్రంప్. పాక్కు జేడీ వాన్స్..!ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే ఆంక్షలకు ఒప్పుకోదనే నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడే.. రేపు(శుక్రవారం) పాకిస్తాన్కు వస్తున్నారు. పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి.. కచ్చితంగా అమెరికా పెద్ద తలకాయలు ఉండాల్సిందేనని ఇరాన్ పట్టుబట్టిన నేపథ్యంలో జేడీ వాన్స్ను పాకిస్తాన్ పర్యటన దాదాపు ఖరారైంది. తమతో చర్చల్లో భాగంగా అమెరికా పరిపాలన విభాగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయి తప్పితే మరే అధికారులు తమకు అవరసం లేదని ఇరాన్ పంతం పట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నమ్మదగిన జేడీ వాన్స్ ను పాక్కు పంపించబోతున్నారనే టాక్ నడుస్తోంది.మరి జేడీ వాన్స్.. ఇరాన్ను ఎంతవరకూ ఒప్పిస్తారనేది చూడాలి. లెబనాన్ను పక్కకు పెట్టి ఈ శాంతి చర్చలు సాగుతాయా?, ఇరాన్ పెట్టే పలు కండిషన్స్కు అమెరికా ఊ కొడుతుందా? అనేది చూడాలి. కొసమెరుపు ఎలా ఉండబోతుంది..?ఇరాన్తో కచ్చితంగా అమెరికా సుదీర్ఘ చర్చలే జరపనుంది. ఇప్పటివరకూ యుద్ధంలో అమెరికాకు ఇరాన్ అంతు చిక్కకపోవడం ఒకటైతే.. ఈ యుద్ధంలో అమెరికాలో ప్రజల నుంచి ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలో ఇరాన్తో చర్చల ద్వారానే వారిపై గెలవాలనే భావనలో ఉన్నారు ట్రంప్. జేడీ వాన్స్ చర్చల తర్వాత ‘ ప్రపంచ శాంతి వెల్లివిరిసింది’ అంటూ ట్రంప్ మళ్లీ తనదైన శైలిలో ఓ ప్రకటన ఇవ్వనున్నారా?.. .. లేక ‘‘ఇరాన్కు చుక్కలు చూపించబోతున్నాం’’ అనే మాట ట్రంప్ నోట మళ్లీ వినబడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -
ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
-
ఆక్.. పాక్.. కరివేపాక్
ఇరాన్-అమెరికా&కో మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట కాస్త క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పి పాక్ గాలి తీసేశారు. ఈలోపు.. ఇటు ఇజ్రాయెల్ ఆ మధ్యవర్తిత్వంపై ఏకంగా అనుమానాలే వ్యక్తం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్లో పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఆ దేశానికి అంత సీన్ లేదని.. అదసలు నమ్మదగిన విషయమే కాదని అంటోంది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం విషయంలో పాక్ పాత్ర ఏం మాత్రం ఉండకపోవచ్చు. అమెరికా కేవలం తమ వ్యూహాత్మక కారణాల వల్లే పాకిస్తాన్ను వాడుకుంటుందేమో అని వ్యాఖ్యానించారు.అమెరికా గతంలో ఖతర్, టర్కీ వంటి దేశాలను ముందుంచి గాజా విషయంలో హమాస్తో ఒప్పందాలు సాధించింది. అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ను ఉపయోగించుకుని ఉండొచ్చు. కాబట్టి పాక్ను విశ్వసనీయ మధ్యవర్తిగా ఏ కోణంలోనూ చూడలేం అని అన్నారాయన. అదే సమయంలో.. అమెరికాతో సమన్వయం కొనసాగించడం ఇజ్రాయెల్కు ఎంతో ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.విమర్శలు కూడా.. పశ్చిమాసియా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వంపై ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లెబనాన్ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లెబనాన్కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాక్ తొలుత ప్రకటించగా.. ఆ మాట చెప్పడానికి పాక్కు ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఇటు అమెరికా కూడా లెబనాన్కు ఒప్పందం వర్తించబోదని తేల్చేసింది. దీంతో ఈ గందరగోళానికి పాక్ తీరే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, అమెరికా తమను నమ్ముతున్నాయని పాక్ అంటోంది. అయితే ఇరాన్ మాత్రం పాక్ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే.. మధ్యవర్తిత్వాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్లో శుక్రవారం జరగబోయే చర్చలకు అమెరికా–ఇరాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. “ఇరాన్, అమెరికా- మిత్రదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శాంతి చర్చలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాం” అని ఆయన సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ చేశారు. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులకు సైతం ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అయితే చర్చలు శనివారం(11వ తేదీకి) జరుగుతాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.ఇరాన్పై భీకర దాడుల హెచ్చరికలు చేసిన ట్రంప్.. చివరి నిమిషంలో యుద్ధానికి బ్రేక్ వేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటు ఇరాన్ కూడా ఆ ప్రకటనను ధృవీకరించింది. కానీ, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో ఘర్షణలు మళ్లీ ఉధృతమయ్యాయి. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంటోంది. కీలకమైన హర్ముజ్ను తెరిచినట్లే తెరిచి.. మళ్లీ మూసేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ లెబనాన్ ఈ కాల్పుల విరమణలో ఏమాత్రం భాగం కాదని, హెజ్బొల్లా ఉనికి కారణంగా ఇది ‘వేరే ఘర్షణ’ అని ప్రకటించారు. అయితే పలు దేశాలు మాత్రం లెబనాన్కు సీజ్ఫైర్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
కాల్పుల విరమణ.. కండిషన్స్ అప్లై! ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
-
అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనికులు రెడీ: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలైనా గడవకముందే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మళ్లీ హార్మూజ్ను మూసివేయడంతో దీనిపై శ్వేతసౌధం స్పందించింది. ఇరాన్ తీరు అమోదయోగ్యం కాదని చెప్పింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ సోషల్లో స్పందించారు.‘అన్ని అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది, అదనపు గుండు సామగ్రి, ఆయుధ సామగ్రి అన్నీ ఇరాన్ దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నాయి. శత్రువు ఇప్పటికే బలహీనంగా ఉప్పటికీ పూర్తిగా నాశనం చేసేందుకు వీలుగా వాటన్నింటినీ అక్కడే సిద్ధంగా ఉంచాం. ఒప్పందం పూర్తిగా అమలు అయ్యే వరకు అక్కడే ఉంటాయి. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోయినా, అసాధ్యం అయినా, కాల్పులు ప్రారంభం అవుతాయి. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నాం. ఎవరైనా వేరేలా చెప్పినా అవి తప్పుడు మాటలు. అణ్వాయుధాలను అనుమతించబోం. హార్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి, సురక్షితంగా ఉండేలా చేస్తాం. మా సైన్యం సిద్ధమవుతూ, విశ్రాంతి తీసుకుంటోంది. తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోంది. అమెరికా ఈజ్ బ్యాక్’ అని ట్రంప్ తెలిపారు. -
నాటో నుంచి అమెరికా ఔట్? ఏం జరిగిందంటే..
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) నుంచి వైదొలిగే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆలోచన చేస్తుండడానికి ప్రధాన కారణం ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు సహకరించకపోవడమే. ఇప్పటికే నాటోపై పలుసార్లు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల భద్రతకు ప్రధాన ఆధారంగా ఉంది నాటో. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని నాటోకి ఓ పరీక్షగా అభివర్ణించారు. ఇందులో ఆ కూటమి విఫలమైందన్నారు. ట్రంప్ ఒత్తిడి చేసినప్పటికీ నాటో మిత్రదేశాలు యుద్ధానికి సైనిక బలగాలను పంపడానికి నిరాకరించాయి. లెవిట్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వైట్ హౌస్లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేను కలవడానికి ముందు వెలువడ్డాయి.“నాటో గురించి ట్రంప్ ఓ వ్యాఖ్య చేశారు. నాటోను పరీక్షించామన్నారు. ఈ పరీక్షలో నాటో విఫలమైందని చెప్పారు” అని లెవిట్ తెలిపారు. గత ఆరు వారాలుగా నాటో అమెరికా ప్రజలను విస్మరించడం బాధాకరమని అన్నారు. నాటో రక్షణ ఖర్చులను అమెరికా ప్రజలే భరిస్తున్నారని ఆమె చేర్చారు. రుట్టేతో ట్రంప్ సూటిగా, స్పష్టంగా మాట్లాడతారని ఆమె తెలిపారు.ట్రంప్ నాటో నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నారా అని మీడియా అడిగింది. లెవిట్ స్పందిస్తూ.. రుట్టేతో సమావేశం తర్వాత దీనిపై ట్రంప్ మాట్లాడవచ్చని చెప్పారు. ట్రంప్, రుట్టే మధ్య సన్నిహిత సంబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత రుట్టే పలుసార్లు వైట్ హౌస్ను సందర్శించారు. గత ఏడాది మార్చి, జూలై, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కూడా వచ్చారు.గతంలో రుట్టే అమెరికా మద్దతు లేకుండా నాటో పనిచేయదు అని హెచ్చరించారు. ట్రంప్తో సమావేశంలో పాల్గొన్న తర్వాత రుట్టే మాట్లాడుతూ.. ట్రంప్కు తన మద్దతును పునరుద్ఘాటించారు. అయితే, నాటో మిత్రదేశాలు లాజిస్టిక్స్, బేస్ల వినియోగం ద్వారా అమెరికాకు సాయం అందించాయని చెప్పారు.నాటో నుంచి బయటకు వెళ్లేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని రుట్టేను మీడియా అడిగింది. రుట్టే స్పందిస్తూ.. “ట్రంప్లో నిరాశ ఉందనేది స్పష్టమే. అదే సమయంలో నా వాదనలు ఆయన జాగ్రత్తగా విన్నారు” అని రుట్టే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించారు.సైన్యాన్ని వెనక్కి.. ఇరాన్తో జరిగిన యుద్ధానికి మద్దతు ఇవ్వలేదని ట్రంప్ భావించిన దేశాల్లోని అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించి, ఆ ఘర్షణలో సహాయకంగా ఉన్న దేశాలకు సైన్యాన్ని తరలించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నాటో సభ్య దేశాల్లో కొన్నింటిపై చర్యలు తీసుకోవాలని వైట్ హౌస్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిసార్లు ట్రంప్ నాటోకు మద్దతును ఉపసంహరించుకుంటామని బెదిరింపులు చేశారు. మరికొన్నిసార్లు మిత్రదేశాలకు మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గత ఏడాది ట్రంప్ డెన్మార్క్ స్వయం పాలిత ప్రాంతం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక శక్తి వినియోగిస్తామని బెదిరించడం అమెరికా, యూరప్ మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. ట్రంప్ గ్రీన్లాండ్ను జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్నారు. అనంతరం అమెరికా కొంత వెనక్కు వెళ్లింది. అయితే గ్రీన్లాండ్పై అమెరికా అధికారం అవసరమని ట్రంప్ మళ్లీ అన్నారు. -
‘తాత్కాలిక సంధి’ దశ!
నలభై రోజులుగా ఇరాన్ పౌరుల్ని భీతావహుల్ని చేస్తూ, ప్రపంచాన్ని సైతం అల్లకల్లోల పరుస్తున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటించటానికి అమెరికా, ఇరాన్లు అంగీకరించటంతోపాటు దాన్ని పూర్తిస్థాయి విరమణగా మార్చటానికి వీలుగా పరస్పరం చర్చించుకోవాలని నిర్ణయించాయి. పాకిస్తాన్ దౌత్యం వల్లే అంతా సాధ్యపడినట్టు కనిపిస్తున్నా ఇరాన్ను బలంగా ప్రభావితం చేయగల చైనా జోక్యమే ఫలించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇరుపక్షాల మధ్యా శుక్రవారం జరగబోయే చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయటం అంత సులభం కాదు. ఎందుకంటే, చర్చలకు ప్రాతిపదికగా అమెరికా విడుదల చేసిన 15 అంశాలకూ, ఇరాన్ ప్రతిపాదిస్తున్న 10 అంశాలకూ మధ్య చాలా విషయాల్లో పొసగటం లేదు. భూమిలో పాతిపెట్టిన 60 శాతం శుద్ధిచేసిన 440.9 గ్రాముల యురేనియంను ఇరాన్ తవ్వి తీయాల్సిందేనని అమెరికా కోరుతుండగా, ఆ విషయంలో రాజీపడబోమంటున్నది ఇరాన్. తమపై ఇన్నేళ్లుగా విధిస్తూవచ్చిన మౌలిక ఆంక్షలనూ, సెకండరీ ఆంక్షలనూ ఎత్తి వేయాలనీ, పశ్చిమాసియా నుంచి అమెరికా సేనలు వైదొలగాలనీ, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని వెనక్కివ్వాలనీ, శాంతి ఒప్పందానికి భద్రతామండలి గ్యారెంటీ ఉండాలనీ ఇరాన్ కోరుతోంది. కాల్పుల విరమణలో లెబనాన్పై దాడుల్ని నిలిపేయటం భాగమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెబుతుండగా, అమెరికా తాజా వైఖరిని అంగీక రిస్తూనే ఇజ్రాయెల్ ఆ దాడులు ఆగబోవంటున్నది. రెండుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి ఘర్షణలకు దారితీయటం అసాధారణమేమీ కాదు. ఆ ఘర్షణలు తెచ్చే తీవ్ర ఉద్రిక్తతల వల్ల సంధి కుదరటం ఓ పట్టాన సాధ్యపడదు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి ఏడెనిమిది గంటలు గడిచినా పశ్చిమాసియాలో క్షిపణి దాడులు, బాంబుల మోతలు ఆగకపోవటం ఇందుకు తార్కాణం. కొన్ని దేశాలు మధ్యవర్తి పాత్ర పోషిస్తేనే, ఘర్షణల్లోని నిరర్థకతను వైరి దేశాలకు గుర్తుచేసి ఒప్పిస్తేనే ఆ దిశగా అడుగులు పడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెను మారణహోమాన్ని సృష్టిస్తాననీ, ఇరాన్ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాననీ ట్రంప్ చేసిన హెచ్చరిక చర్చలకు దారులు పరిచింది. యుద్ధనేరాల్లో అగ్రభాగాన ఉండే ‘మారణహోమం’ బెదిరింపు చర్చల సాధనంగా మారటం అత్యంత ప్రమాదకర పరిణామం. ఇవాళ ఇరాన్కి ఎదురైన పరిస్థితే రేపన్నరోజు వేరే దేశాలకూ ఎదురుకావొచ్చు. తాను వేరే దేశాధ్యక్షుణ్ణి అపహరించవచ్చు... కానీ ఇరాన్ మాత్రం ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది ట్రంప్ నీతి. అమెరికాతో దాదాపు సమవుజ్జీలుగా ఉండి కూడా చైనా, రష్యాలు అమెరికా వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయాయి. భద్రతా మండలిలో ఒత్తిడి చేయలేకపోయాయి. ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు అమెరికా సాయం చేస్తున్నది గనుక తాము ఇరాన్కు సహకరిస్తున్నామని మాత్రం రష్యా చెప్పింది. బాధిత దేశంగా తనను తాను చిత్రించుకుంటూ రెండేళ్ల పాటు గాజాను ఇజ్రాయెల్ వల్లకాడు చేస్తున్నా నోరు మెదపని దేశాలు... ఇరాన్ విషయంలోనూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయాయి. అన్ని మర్యాదలూ మంటగలిపి, మతి చలించినట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్ ఇరాన్పై అణ్వస్త్ర దాడికి తెగబడతారన్న భయంతోనే చివరి నిమిషంలో చైనా కదిలింది. అది నచ్చజెప్పనట్టయితే ఇరాన్ అంగుళమైనా వెనక్కి తగ్గేది కాదు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ తమను ప్రాథేయపడిందని అమెరికా యుద్ధశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్వోత్కర్షకు పోతున్నారు. ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా అసహనంగా ఉన్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నారు. కానీ ట్రిగ్గర్పైన వేళ్లతోనే ఈ ఒడంబడికకు సిద్ధపడ్డామనీ, శత్రువు వైపు చిన్న పొరపాటు జరిగినా సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటిస్తామనీ ఇరాన్ ప్రకటించింది. కనుక ఈ స్వల్పకాల శాంతిపై ఎవరూ భరోసా పెట్టుకోనవసరం లేదు. ఏ క్షణంలోనైనా అది నీటి బుడగలా మటుమాయం కావొచ్చు. ఇంటా బయటా పెద్ద వినాశకారిగా పరిణమించిన ట్రంప్ను అభిశంసన ద్వారా అమెరికా సాగనంపే వరకూ శాంతి, సంధి వంటివి క్షణభంగురాలు!


