JP Nadda
-
ఫలిస్తున్న ప్రజాభాగస్వామ్య పోరాటం
క్షయవ్యాధి (టీబీ)పై పోరులో భారత్ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది. ఇటీవల విస్తృత స్థాయిలో 100 రోజులపాటు నిర్వహించిన ‘టీబీ–ముక్త్ భారత్ అభి యాన్’... వినూత్న విధానాలను ప్రవేశ పెట్ట డమే కాక, జన బాహుళ్యాన్ని మమేకం చేయడం కూడా అంతే కీలకమని స్పష్టం చేస్తోంది. టీబీ కేసులను గుర్తించడాన్ని వేగవంతం చేయడం, మరణాలను తగ్గించడం, కొత్త కేసులను నివారించడం వంటి లక్ష్యాలతో 2024 డిసెంబర్ 7న ఈ ప్రచారం ప్రారంభమైంది.ఈ ప్రచారం ద్వారా టీబీ లక్షణాలు లేనివారే కాదు, ఆ లక్షణాలు గుర్తించని వారిని సైతం తొలిదశలోనే పసిగట్టి చికిత్స అందించింది. డయాబెటిస్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, మద్యపానం సేవించేవారు, హెచ్ఐవీ రోగులు, వృద్ధులు, తక్కువ ‘బీఎమ్ఐ’ ఉన్నవారు, టీబీ రోగులతో మసిలే కుటుంబ సభ్యులు... ఇలా అధిక రిస్కున్న వ్యక్తుల చెంతకు పోర్టబుల్ ఎక్స్–రే యంత్రాలను నేరుగా తీసుకెళ్ళి చికిత్స అందించడం జరిగింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఎక్స్–రేల ద్వారా అక్కడికక్కడే అనుమానిత టీబీ కేసులను గుర్తించారు. ప్రామాణికమైన ‘న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్’ (ఎన్ఏఏటీ) ఉపయోగించి రోగ నిర్ధారణ కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు అంటువ్యాధులను గుర్తించి త్వరగా చికిత్స చేయడానికీ, అవి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికీ, ప్రాణాలను కాపాడటానికీ దోహదపడ్డాయి. దేశం నలుమూలలా చేపట్టిన ఈ ప్రచార కార్య క్రమంతో టీబీ బారిన పడటానికి అవకాశమున్న దాదాపు 12.97 కోట్ల మందికి పరీక్షలు జరిగాయి. తద్వారా సుమారు 7.19 లక్షల టీబీ రోగులను గుర్తించారు. ఇది కేవలం ఒక మైలురాయి అంటే సరిపోదు, ఒక మలుపు అనే చెప్పాలి.భాగస్వామ్య ఉద్యమంచెప్పాలంటే... నిజమైన గేమ్ ఛేంజర్ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు– జనాలను సమీకరించడం (కమ్యూనిటీల సమీకరణ). టీబీ నిర్మూలన అనేది ఇప్పుడు ‘జన్ భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) ద్వారా నడిచే ఒక ప్రజా ఉద్యమంగా మారింది. దేశమంతటా 13.46 లక్షలకు పైగా ‘ని–క్షయ్’ శిబిరాలు జరిగాయి. ఇందులో గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఆర్లు, యూఎల్బీల ప్రతినిధులతో సహా 30,000 మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’కు మద్దతు అందించారు. కార్పొరేట్ భాగస్వాములు, సాధారణ పౌరులు సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సామూహిక లక్ష్యం అనే ఆలోచనను వీరు బలోపేతం చేశారు. ఈ మిషన్లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల భాగ స్వామ్యం ఉండటం విశేషం. టీబీపై అవగాహన, న్యూట్రిషన్ కిట్ పంపిణీ, టీబీ రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేయడం వంటి 35,000కి పైగా కార్య కలాపాలను 22 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య సంఘాలు, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు 21,000కి పైగా కార్యకలాపాలను చేపట్టగా... 78,000 విద్యా సంస్థలలో 7.7 లక్షలకు పైగా విద్యార్థులు క్షయవ్యాధి అవగాహన కార్యకలాపాలలో పాల్గొన్నారు. జైళ్లు, గనులు, తేయాకు తోటలు, నిర్మాణ ప్రదేశాలు, పని ప్రదేశాల వంటి సామూహిక ప్రాంతాల్లో టీబీ బారిన పడటానికి అవకాశమున్న 4.17 లక్షలకు పైగా జనాలకు పరీక్షలు నిర్వహించారు. ‘జన్ భాగీదారీ’కి పునాది వేసిన మన ప్రధాని దార్శనికత సమాజంపై విస్తృత ప్రభావాన్ని చూపింది. ఫలితంగా రోగులకు తగిన పోషకాహారాన్ని అందించడం కోసమే కాక, వారి మానసిక – సామాజిక స్థితిగతుల్లో తోడ్పాటుకు ఎంతోమంది ముందుకొచ్చారు. టీబీ రోగుల బాగోగులు ఇప్పుడు ఆసుపత్రులకు మాత్రమే పరి మితం కాలేదు. ఇది ఇంటింటికీ, గ్రామ గ్రామానికీ, పని ప్రదే శాలకూ వ్యాపించాయి. ‘నిక్షయ్ మిత్ర’ ద్వారా వ్యక్తులు, సంస్థలు ఇప్పటికే వేలాది ఆహార బుట్టలను పంపిణీ చేసి, టీబీ బాధిత కుటుంబాలకు పోషక సహాయాన్ని అందిస్తున్నాయి. కేవలం 100 రోజుల కార్యక్రమంలో 1,05,181 కొత్త నిక్షయ్ మిత్రులు నమోదయ్యారు. పోషకాహారం అందించడం, క్షయవ్యాధి నుంచి రోగులు కోలుకునేలా చేయడం మధ్య కీలక సంబంధాన్ని గుర్తిస్తూ... ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద ఆర్థిక సహాయాన్ని నెలకు 800 నుంచి 1,000 రూపాయలకు పెంచింది. తద్వారా ఏ క్షయవ్యాధి రోగీ ఒంటరి పోరాటం చేయకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశం.ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా విభిన్న రీతిలో టీబీ కేర్ ప్రోగ్రాం కింద రోగులకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాదు, రోగిని బట్టి శ్రద్ధ తీసుంటూ చికిత్సను అంది స్తోంది. ఉదాహరణకు, ఒక టీబీ రోగి తక్కువ బరువుతో ఉన్నట్లు తేలితే (18.5 కంటే తక్కువ బీఎమ్ఐ), వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు తగిన పోషకాహారం, చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చికిత్స సమయంలో నెల నెలా వారి పురోగతిని పర్యవేక్షిస్తారు.100 రోజుల పురోగతిక్షయ వ్యాధి పై అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో సేవలను అందించే విషయంలో 22 మంత్రిత్వ శాఖలు చేతులు కలిపి ముందుకు సాగాయి. గోవా కార్నివాల్ పరేడ్లలో టీబీపై అవగాహన ఒక ప్రధానాంశంగా నిలిచింది. తమ కార్యాలయాలను సందర్శించే వేలాది మందికి ఉచిత టీబీ స్క్రీనింగ్లను చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ విభిన్న చర్యలు అపోహలను తొలగించే ప్రయత్నాలు చేశాయి. క్షయ నిర్మూలనలో ప్రజా చైతన్యానికి బాటలు పరిచాయి.100 రోజుల ప్రచారం అనేది కేవలం ప్రారంభం మాత్రమే!ప్రతి పౌరుడు... వారు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఆధునిక పద్ధతుల్లో రోగనిర్ధారణ, నాణ్యమైన చికిత్స అందించడం, అన్ని వర్గాల వారినీ భాగస్వాములను చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. కోవిడ్–19 పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎంత చురుగ్గా స్పందించిందో... అదే మాదిరి మరింత వేగవంతమైన, కచ్చితమైన అత్యాధునిక టీబీ పరీక్షలను అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ అందుబాటులోకి తేవడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.స్వచ్ఛ భారత్ మిషన్ కావొచ్చు, పోలియో నిర్మూలన కార్య క్రమాలు కావొచ్చు... యావత్ సమాజం కదలి వస్తే ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో స్పష్టంగా రుజువు చేశాయి. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కూడా ఇప్పుడు ప్రజల నేతృత్వంలో మరో ఉద్యమంగా మారుతోంది. భారత్ ఇప్పుడు కేవలం క్షయవ్యాధితో పోరాడటం మాత్రమే కాదు– దాన్ని ఓడిస్తోంది కూడా!జేపీ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి(మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం) -
పార్లమెంట్ను కుదిపేసిన డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్లు విమర్శలతో పార్లమెంట్ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.ఈ అంశం ఇటు లోక్సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్లతో సభ హీటెక్కింది. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన. -
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కఉ క్షమాపణలు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. -
బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో తెలంగాణ నేత?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కొత్త అధ్యక్షుని ఎంపికపై అధిష్టానం చురుగ్గా కసరత్తు చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడపగలిగే నేత కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు కొన్ని నెలలుగా మంతనాల్లో మునిగి తేలారు. సంఘ్, పార్టీ మధ్య సమన్వయం చేసుకోగల సత్తా ఉన్న నాయకుడికే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటి కే ఒక జాబితా సిద్ధమైందని చెబుతున్నా రు. అందులోంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారు. మార్చి 20 లోపు కొత్త అధ్యక్షుని ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.2019లో అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయ్యాక వెంటనే జగత్ ప్రకాశ్ నడ్డా తొలుత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆర్నెల్ల తర్వాత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2023 జనవరిలో ముగియాల్సి ఉన్నా 2024 లోక్సభ ఎన్నికల దాకా పొడిగించారు. ఆ తర్వాత నడ్డా కేంద్ర కేబినెట్ మంత్రి అయినా మహారాష్ట్ర సహా పలు అసెంబ్లీ ఎన్నికల వల్ల కొత్త అధ్యక్షని ఎంపిక వాయిదా పడింది. నూతన అధ్యక్షుని ఎంపికపై రెండు రకాల ప్రతిపాదనలున్నట్టు చెబుతున్నారు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున అక్కడ పార్టీని నడపడంలో సమర్థుడై ఉండటంతో పాటు ఆర్ఎస్ఎస్ నేప థ్యం కలిగి ఉన్న నేతను నియమించాలనేది ఒక ప్రతిపాదన. దక్షిణాదిలో చొచ్చుకెళ్లేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. వచ్చే మూడేళ్లలో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. కనుక దక్షిణాది నేతను అధ్యక్షున్ని చేస్తే పార్టీకి మేలన్నది.మరో ప్రతిపాదన..బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం అధ్యక్ష రేసులో ఉత్తరాది నుంచి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. దక్షిణాది నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తదితర పేర్లు షికారు చేస్తున్నాయి. -
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మార్చి 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ‘జన్ ఔషధి సప్తాహ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈమేరకు ‘జన్ ఔషధి రథ్’లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 2025 చివరి నాటికి 20,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి మరో 25,000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ..‘జన్ ఔషధి రథాలు ప్రజల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతాయి. చౌకైన జనరిక్ మందుల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఖరీదైన బ్రాండెడ్ మందులకు ప్రత్యామ్నాయాలు అందించాలని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ)లో భాగంగా ఈ చర్యలు చేపట్టాం. ప్రధాని నాయకత్వంలో 2027 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ముందుగా 80 కేంద్రాలతో వీటిని ప్రారంభించాం. ప్రస్తుతం 15 వేల కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 20 వేలకు పెంచుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ పాల్గొని మాట్లాడారు. ‘మార్చి 1 నుంచి 7 వరకు 'జన్ ఔషధి - జన్ చేతన' వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. జన్ ఔషధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మందులపై ప్రజలు చేసే ఖర్చును తగ్గించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి’ అని చెప్పారు.రూ.1కే శానిటరీ న్యాప్కిన్స్మహిళల నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ను జన్ ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.1కే అందించనున్నారు. సువిధ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ ఎంతో పరిశుభ్రమైనవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజల్లో విభిన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి వారమంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.జన్ ఔషధిప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) అనేది భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రారంభించిన ఒక కార్యక్రమం. జన ఔషధి కేంద్రాలు అనే ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బ్రాండెడ్ మందుల కంటే 50%-80% చౌకగా జనరిక్ మందులను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్వో-జీఎంపీ గుర్తింపు కలిగిన తయారీదారుల నుంచి ఔషధాలను సేకరించి నాణ్యత, భద్రతను ధృవీకరించడం కోసం ఎన్ఏబీఎల్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు.ఇదీ చదవండి: పని గంటలా..? పని నాణ్యతా..?ఈ జన్ ఔషధి అవుట్లెట్లలో 2,000 కంటే ఎక్కువ మందులు, 300 శస్త్రచికిత్సా వస్తువులు అందుబాటులో ఉంటాయి. 2024 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 13,822 జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేంద్రాలను ప్రారంభించడంలో స్థానిక యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధిని సృష్టించే అవకాశం ఏర్పడింది. ‘సుగమ్ మొబైల్ యాప్’ ద్వారా వినియోగదారులు తమ సమీపంలోని జన ఔషధి కేంద్రాలను గుర్తించవచ్చని, జనరిక్ మందుల కోసం సెర్చ్ చేయవచ్చని, బ్రాండెడ్ మందులతో ధరలను పోల్చవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
నడ్డా స్థానంలో ఎవరు.. 15 రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
ఢిల్లీ: బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని 15 రోజుల్లో నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో, జేపీ నడ్డా వారసుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులో కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త చీఫ్ను వెతికే పనిలో ఉంది కాషాయ పార్టీ. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ నాటికి కొత్త జాతీయాధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపారు. అయితే, బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పటికి 12 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయ్యింది. మరో ఆరు రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్ల ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మరోవైపు.. బీజేపీ అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే, బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు ఉన్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. 2019లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నడ్డా పార్టీ బాధ్యతను స్వీకరించారు. జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో, కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక బాధ్యతలు ఎవరికీ ఇస్తారనే చర్చ మొదలైంది. బీజేపీ హైకమాండ్ సైతం పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ఇన్ఛార్జ్లను కూడా తమ దృష్టిలో ఉన్న వారి పేర్లను పంపించాలని కోరినట్టు తెలుస్తోంది. -
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్, రాజస్థాన్కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్గఢ్కు విష్ణుదేవ్ సాయ్లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్లో ఆప్ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. జాట్ నేత అయిన పర్వేశ్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు. అతిశీ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు. పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్22 మంది ఆప్ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే! ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి. -
‘కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’
ఢిల్లీ : ‘నా మాటలు రాసిపెట్టుకోండి హస్తిన పీఠంపై కమలం జెండా ఎగురవేయబోతోంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్రిముఖ పోరులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కమలం అధిష్టానం ఉవ్విళ్లూరుతుంది. ఆ దిశగా తన ఎన్నికల ప్రచారాన్ని వేగం చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ‘ఏక్ తక్ బీజేపీ’ (బీజేపీకి అవకాశమివ్వండి) నినాదంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు.ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికలపై జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు భ్రమపడ్డారని, ఇప్పుడు భ్రమలు వీడి వాస్తవంలోకి వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. ఈసారి ఆప్ (AAP-da)కు గుణపాఠం చెప్పాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో విసిగిపోయారు.. ఇప్పుడు దేశ రాజధానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం’ అని అన్నారు. కేజ్రీవాల్ అబద్ధాల ఎన్ సైక్లోపీడియా. ఢిల్లీ ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు. ఆప్ అవినీతి చేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషించడంలో మించి పోయింది. అందులో మద్యం పాలసీ ఒకటి. ఆప్ కన్వీనర్ అవినీతి చేసేందుకు వినూత్న పద్దతుల్ని ఎంచుకున్నారు. జైలుపాలయ్యారని ఆరోపించారు.ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై నడ్డా స్పందించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో వ్యూహం ఉంటుంది. మాకు వ్యూహం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఢిల్లీలో కూడా అంతేనని’ వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా
-
‘ఇదేమి దుస్థితి.. వందలాది మంది రోగులు ఫుట్పాత్పైనే..’
ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్పాత్లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్పాత్లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది. దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భయపడాల్సిన పనిలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనస్తున్నామని జేపీనడ్డా తెలిపారు. ఈ మేరకు సోమవారం(జనవరి6) ఆయన మీడియాతో మాట్లాడారు.‘హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు.2001 సంవత్సరంలోనే దీన్ని కనుగొన్నారు. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుంది. శీతాకాలం ప్రారంభంలో ఇది బాగా వ్యాపిస్తుంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై పరిశోధన చేస్తోంది.భారత్లో శ్వాసకోశ సంబంధ సమస్యల తీవ్రత లేదు. ఈ వైరస్పై డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో జాయింట్ గ్రూప్ సమీక్ష నిర్వహించింది.సమస్య ఎదుర్కోవడానికి యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది.ఇదీ చదవండి: హలో.. హెచ్ఎంపీవీ వైరస్తో జాగ్రత్త -
కాంగ్రెస్కు కౌంటర్.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.మాజీ ప్రధాని మన్మోహన్కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్ను చించేయడం ద్వారా మన్మోహన్ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh .. Shameful act by Sonia Gandhi .. watch pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date??? Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024 -
పార్లమెంట్లో ‘సోరోస్’ రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జార్జి సోరోస్ బంధంతోపాటు అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్కు, కాంగ్రెస్ పెద్దలకు మధ్య సంబంధాలున్నాయని ఆరోపించారు.వారంతా చేతులు కలిపారని, ఇండియాను అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నడ్డా ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యులు ప్రతిస్పందించారు. సోరోస్తో సంబంధాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నడ్డా ఆరోపణలను కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ ఖండించారు. అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచి్చనట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నినాదాలు మిన్నంటాయి. దీంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్సభలోనూ అదే దుమారం సోరోస్తోపాటు భారతదేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు కొనసాగిస్తున్నారని లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజిజు ఆరోపించం దుమారం రేపింది. మంగళవారం జీరో అవర్లో ఆయన మాట్లాడారు. తర్వాతవిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలున్నాయంటూ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా లోక్సభను మరుసటి రోజుకు వాయిదావేశారు. అంతకుముందు మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మర్చంట్ షిప్పింగ్ చట్టం–1958 స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ ఫొటోలు ముద్రించి ఉన్న సంచులను ధరించారు. ఈ సంచులకు మరోవైపు ‘మోదీ అదానీ భాయి భాయి’ అని రాసి ఉంది. పార్లమెంట్ మకరద్వారం మెట్ల ముందు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంకతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు నిరసన వ్యక్తంచేశారు. మోదీ, అదానీ బంధంపై పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. -
ఇది గారడీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గారడీ ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఏడాది నుంచి ప్రజల్ని వంచిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏడాది పాలనంతా గత బీఆర్ఎస్ పాలనకు నకలుగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో ‘కాంగ్రెస్ ఏడాది పాలన–వైఫల్యాలపై బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ నడ్డా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.అన్నీ మోసపూరిత హామీలే... ‘తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ పరిస్థితు లను చూస్తే కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది. పాత పెన్షన్ స్కీం జాడలేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసులేదు. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ. 2,500 ఏ ఒక్కరికీ అందలేదు. ఆటోడ్రైవర్లకు రూ. 12 వేల హామీ ఏమైంది? రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 12 వేలు, షాదీ ముబారక్ కింద రూ.లక్ష, తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు... ఇలా వందల సంఖ్యలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నించిన మాపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని నడ్డా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయనపైనే నమ్మకం లేదని.. అందుకే పూటకోమాట చెప్పి ప్రజల్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని వివర్శించారు. అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్పై పోరాడతాం..‘కాంగ్రెస్ ఏడాది పాలనను ప్రజల ముందే ఎండగట్టేందుకు ఇక్కడికి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. మాయమాటలతో రైతులు, మహిళలు, యువకులు, కార్మికులను మోసగించిన కాంగ్రెస్పై పోరాడాలని నిర్ణయించాం’ అని నడ్డా పేర్కొన్నారు.భవిష్యత్ అంతా బీజేపీదే...ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరిగిందని నడ్డా ఉద్ఘాటించారు. ‘దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే అది శాశ్వతంగా ఉంటుంది. గత 30 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీదే అధికారం. అక్కడి ప్రజల గుండెల్లో కేవలం కమలమే ఉంది. రాజస్తాన్లో ఆరుసార్లు, గోవా మూడుసార్లు, మధ్యప్రదేశ్లో మూడుసార్లు, యూపీలో రెండుసార్లు బీజేపీ అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోనూ మూడోసారి విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో రెండు, మణిపూర్లో మూడు, అస్సాంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇకపై దేశ భవిష్యత్ అంతా బీజేపీదే. వచ్చే ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణకు ఎన్నో కేంద్ర ప్రాజెక్టులు..మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు ఎంతో అభివృద్ధి జరిగిందని. పన్నుల రూపంలో రూ. 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ. 1.12 లక్షల కోట్లు, స్మార్ట్సిటీ ప్రాజెక్టు, టెక్స్టైల్, రైల్వేకు 20 రెట్ల బడ్జెట్ కేటాయింపులు, వందేభారత్ రైళ్లు, భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్నై, హైదరాబాద్–వైజాగ్ లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్లోనూ ఎయిమ్స్ నిర్మాణం తదితర ఎన్నో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు.నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యం: కిషన్రెడ్డిబీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలకు కొత్త హామీలతో కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. నిజమైన మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మరింత ఆర్థిక సంక్షేభం ఏర్పడిందని, ఇకపై ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు సరైన నాయకుడు లేడని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలనలో భాగ్యనగర్ బంగ్లాదేశ్గా మారుతోందని ఆరోపించారు.హామీలు నెరవేర్చకుండా సంబురాలా?: డీకే అరుణ, కొండారాష్ట్రంలో ఒక నియంత గద్దె దిగాడనుకుంటే మరో నియంత వచ్చాడని సీఎం రేవంత్ను ఉద్దేశించి మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం.. ఏ ముఖంతో సంబురాలు చేసుకుంటోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల భూములను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రపంచ నేతగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని.. విదేశీ శక్తులకు తొత్తుగా మారిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. -
మాయల ఫకీర్లా రేవంత్ సర్కార్: జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం మాయల ఫకీర్లా మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారం వారి స్వార్థం కోసం వాడుకుంటోందని.. బీజేపీ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తోందన్నారు.‘‘దేశంలో వరుసగా 3వ సారి ప్రధాని అయినా ఘనత మోదీదే. విపక్షాలు బలంగా ఉన్నప్పటికీ కూడా మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ అనుకూల ఓటు వచ్చింది. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 19 రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం. గత రికార్డులను బ్రేక్ చేస్తూ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో నిలబడే ప్రయత్నం చేసి ఆ పార్టీలను ముంచేస్తోంది...ప్రాంతీయ పార్టీల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో బీజేపీఅధికారంలోకి రావడం ఖాయం. ఇతర పార్టీల బలహీనతలే.. కాంగ్రెస్ బలం’’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.రేవంత్కి ఆయన మీద ఆయనకే భరోసా లేదు. ఇక ప్రజలకు ఏమీ భరోసా కల్పిస్తారు. విద్య భరోసా కార్డు ఎక్కడ?. మహిళలకు రూ.2500 వచ్చాయా?. తులం బంగారం, లక్ష రూపాయలు అందాయా?. రేవంత్ ప్రభుత్వం మహిళ, యువత, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఒక్కసారి కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తే మళ్లీ వారిని ఆ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. ఉదాహరణకు 60 ఏళ్లుగా తమిళనాడులో, 30 ఏళ్లుగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, 25 ఏళ్లుగా బీహార్లో కాంగ్రెస్ అధికారంలోకే రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఇదే గతి రావడం ఖాయం.రేవంత్రెడ్డి అబద్దాలతో గద్దె నెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వారందరికీ బీజేపీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఉద్యమాలు చేపడుతుంది. బీజేపీ ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. 70 ఏళ్ల భారత చరిత్రలో ప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేకత పెరిగేది. మోదీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. 2019తో పోలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రూ.5 కోట్లకు పైగా ఓట్లు పెరిగాయి.తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారు. వచ్చే రోజుల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి మళ్లీ మళ్లీ అధికారంలో వస్తోంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఒంటరిగానే మెరుగైన స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ లాంటిది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రీజినల్ పార్టీలపై ఆధారపడి గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్లో ఫ్రీ కరెంట్ దేవుడు ఎరుగు.. అసలు కరెంట్ ఇవ్వడం లేదు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. -
నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ.. కీలక ఆదేశాలు
ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.ఇదీ చదవండి: జో బైడెన్లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్ -
కసబ్కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా
థానే: జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇందుకు నాటి 26/11 ముంబై ఉగ్రదాడులే ఉదాహరణ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ముంబై దాడుల్లో దోషిగా తేలి, మరణశిక్ష పడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్కు కాంగ్రెస్ బిర్యానీ వడ్డించిందని నడ్డా ఆరోపించారు.మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఉదాశీన వైఖరి అవలంబించిందని నడ్డా ఆరోపించారు. 26/11 దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు. అయితే ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ప్రశంసనీయమైనవని నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగంలోని ఏబీసీ కూడా అర్థం కావడం లేదని నడ్డా ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించదనే విషయం రాహుల్కు తెలియనట్లున్నదన్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్లలో రాజ్యాంగ ప్రతులను చూపిస్తూ, ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కోరుకుంటున్నదని ఓటర్లకు చెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. తెలంగాణ, కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రద్దు చేసి, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరిపైనా వివక్ష చూపలేదని నడ్డా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం! -
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్రెడ్డి?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగిరం చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్లను ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా అక్కడ పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటా యని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్షాప్ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. దక్షిణాదికే అవకాశమెక్కువ.. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్తో ముగిసినా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డితోపాటు సీనియర్ నేతలు శివరాజ్సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్ (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధినాయకత్వం ఉంది. -
నాయబ్సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
ఆ రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తాం: జేపీ నడ్డా
సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. ఇవాళ (శుక్రవారం) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిలాస్పూర్లోని నైనా దేవి ఆలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. నేడు తీవ్రవాదం అదుపులో ఉంది. బీజేపీ పాలన కేవలం అధికారంలో రావటామే కాదు. దేశాన్ని సురక్షితంగా ఉంచేలా చూస్తుంది. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై ఇది యుద్ధం సమయం కాదు. అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.హర్యానాలో అధికారాన్ని నిలుపుకోవడానికి.. కాంగ్రెస్ కుట్రలు ఎదుర్కొని మరీ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక.. జమ్ము కశ్మీర్లో 90 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ చెప్పుకోదగ్గ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి పనులు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశాం. బీజేపీ అంటే అభివృద్ధి అని చూపించాం. విభజించి పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.आज मुझे शारदीय नवरात्रों में नवमी के दिन मां नैना देवी का आशीर्वाद लेने का सौभाग्य प्राप्त हुआ।हम सब लोग माता के आशीर्वाद से प्रधानमंत्री मोदी जी के विकसित भारत के सपने को पूरा करने में अपनी पूरी ऊर्जा के साथ कार्य करेंगे।- श्री @JPNadda pic.twitter.com/LE0avEBDsm— BJP (@BJP4India) October 11, 2024 -
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే సభ్యత్వ నమోదును కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే లా కృషి చేయాలని సూచించారు. శనివారం బేగంపేటలోని ఓ హోటల్లో సభ్యత్వ నమోదుపై సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో నడ్డా సమావేశమయ్యారు. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానే పార్టీ పరిగణిస్తోందని చెప్పారు. అందువల్ల ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా పార్టీ పటిష్టానికి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల మందిని సభ్యులుగా చేర్చారని.. అక్టోబర్ 15 వరకు చేపడుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా 50 లక్షల మందికిపైగా సభ్యులను చేరి్పంచేలా కృషి చేయాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు రావడంతోపాటు 8 ఎంపీ సీట్లు గెలిచినందున... పడిన ఓట్లలో 75 శాతం మందిని పార్టీ సభ్యులుగా చేర్పించడం పెద్ద కష్టమేమి కాకూడదన్నారు.అత్యధిక సభ్యత్వాలను చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టానికి చేపడుతున్న చర్యలను గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని చేయనందున ఈ నెల 30న పార్టీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన పేరిట దీక్ష నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించారు. ఈ సమావేశం ముగిశాక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని నడ్డా ప్రశంసించారన్నారు. నడ్డాతో భేటీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగే‹Ù, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఖర్గే మోదీకంటే సీనియర్.. అవమానించడం తగదు: ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరిచారని, అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు.అంతేగాక మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందింస్తూ ఖర్గేకు కౌంటర్ లేక రాయడంపై ఆమె మండిపడ్డారు. ‘ఖర్గే ప్రధానమంత్రి కంటే పెద్దవారు. ఆయన్ను మోదీ ఎందుకు అగౌరపరిచారు? ప్రధాని మోదీకి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలపై గౌరవం ఉంటే ఆయనే స్వయంగా ఖర్గే ఈ లేఖకు సమాధానమిచ్చేవారు. కానీ అలాకాకుండా నడ్డా ద్వారా ఆయన లేఖ రాయించారు. అందులోనూ ఖర్గేను అవమానపరిచారు. 82 ఏళ్ల సీనియర్ నాయకుడిని అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది?ప్రశ్నించడం, సమాధానాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగం. గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదని మతం కూడా చెబుతోంది. నేటి రాజకీయాలు విషపూరితంగా మారాయి. అయితే ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకొని దీనికి భిన్నమైన ఉదాహరణను చూపాలి. ప్రధాని తమ పదవికి ఉన్న స్థాయిని దృష్టిలోపెట్టుకొని సీనియర్ నాయకుడికి సమాధానం ఇచ్చి ఉంటే ఆయనకు విలువ ఉండేది. ఆయనపై గౌరవం పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరం’ అని ప్రియాంక మండిపడ్డారు.కాగా ఇటీవల బీజేపీ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మోదీకి ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాశారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా అభివర్ణించారు.గతంలో రాహుల్ ప్రధానిని ఇదేవిధంగా అవమానపరచలేదా? అని ప్రశ్నించారు. ‘మోదీపై సోనియాగాంధీ ‘మృత్యుబేహారీ’ అని అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ రాజకీయ నైతికతను మరిచిపోయిందా? గత ఐదేళ్లలో ప్రధానిని మీ నేతలు 110 సార్లు అవమానించారు. ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।प्रधानमंत्री जी की…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024 -
ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్ ఇచ్చిన నడ్డా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖకు బీజేపీ జాతీయ అధక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తూ పీఎం మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా గురువారం ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ లేఖ రాశారు.‘‘ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి, విధానాలను మెరుగుపరిచి.. రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే మీరు(ఖర్గే) ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అనిపించింది. మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మరచిపోయినట్లు అనిపిస్తుంది. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించా. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో 'కాపీ అండ్ పేస్ట్' పార్టీగా మారిపోవటం బాధాకరం’’ అని పేర్కొన్నారు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ -
ఈసారి 10 కోట్ల మందికి బీజేపీ సభ్యత్వ నమోదు: జేపీ నడ్డా
ఢిల్లీ: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన సేవకుడు. దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణ కోసం పగలనక రాత్రనక ప్రధాని పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మనందరికీ ఆదర్శం. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈసారి బీజేపీ సభ్యత్వ నమోదు 10 కోట్లకు చేరనుంది. అంతకు ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది. ..దేశంలో 1500 వరకు పెద్దా, చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ మాత్రమే పార్టీ రాజ్యాంగం ప్రకారం కార్యక్రమాలను అమలు చేస్తుంది. బీజేపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మూడు దశల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. బీజేపీ సభ్యత్వ నమోదు మిస్డ్ కాల్, వాట్సాప్ ద్వారా, బీజేపీ వెబ్సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, నమో యాప్ ద్వారా, బీజేపీ పార్టీ రసీదు ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు’అని అన్నారు.#WATCH | Delhi: At the launch of BJP's Sanghatan Parva, Sadasyata Abhiyan 2024, Union Minister and BJP chief JP Nadda says, "Seeing your enthusiasm and the love of people of India for PM Modi as well as their faith in the BJP, I can confidently say that the Sadasyata Abhiyan this… pic.twitter.com/qsFRaD0akv— ANI (@ANI) September 2, 2024 -
వారంలో రెండో సారి.. జేపీ నడ్డాతో కంగనా భేటీ
రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ భేటీలో ఏం చర్చ జరింగిందన్న అంశంపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ వారం ప్రారంభంలో కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. రైతుల నిరసనపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ ఖండించింది.అదే సమయంలో ఆమె స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) పేర్కొంది.ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కంగనా జేపీ నడ్డాతో భేటీ అవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.दिल्ली: जेपी नड्डा के आवास पहुंचीं कंगना रनौत, किसान आंदोलन पर कंगना ने बयान से बीजेपी पार्टी के नेता नाराज़ थे। जिसके चलते बीजेपी ने पार्टी लाइन से हटकर बयानबाजी न करने की नसीहत भी दी थी। #Delhi @JPNadda #KanganaTeam pic.twitter.com/9r6nxypRnx— Ashutosh Tripathi (@tripsashu) August 29, 2024 -
మోదీ సారథ్యంలో కశ్మీర్లో బీజేపీ ప్రచారం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. -
వైఎస్ జగన్ హయాంలో మెడిసిన్కు మహర్దశ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగా వైద్య రంగాన్ని విస్తృతం చేశారు. మారుమూల ప్రజలకు కూడా అత్యాధునిక వసతులతో స్పెషాలిటీ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 వైద్య కళాశాలల్లో తరగతుల, వైద్యం ప్రారంభం కాగా, ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలు చేరువవడమే కాకుండా, వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కూడా భారీగా పెరిగాయి. ఒక్కడ 2023–24 విద్యా సంవత్సరంలోనే కొత్తగా ఏర్పాటైన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంమీద 2019–20 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 1,585 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లోక్ సభలో వెల్లడించింది. 2018–19లో (నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు 4,900 మాత్రమే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్సభలో తెలిపారు. ఆ తర్వాతి ఐదేళ్లలో (వైఎస్ జగన్ హయాంలో) 1,585 సీట్లు పెరిగి 6,485కు చేరినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. -
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ఫిగర్ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రూ.693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల బకాయి లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు రేవంత్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్వహిస్తున్నామని చెప్పారు.కేంద్రం వాటా ఆలస్యంతో మేమే చెల్లిస్తున్నాం..: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను రేవంత్ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాల కింద రూ. 323.73 కోట్లు పెండింగ్లో ఉన్నాయని.. 2024–25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ. 138 కోట్లు మంజురు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలికవసతులు, నిర్వహణ కాంపొనెంట్ కింద 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ. 231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. -
బీజేపీ రాజ్యసభ పక్షనేతగా జేపీ నడ్డా!
బీజేపీ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా ఎంపికైనట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ జాతీయ అద్యక్షుడి పదవిలోనూ కొంతకాలం పాటు ఆయన కొనసాగనున్నారు. కాగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితోపాటు రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.2020లో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ దక్కడంతో నడ్డా.. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన రాజీనామా చేయలేదు. బీజేపీ అగ్ర సంస్థాగత నేతగా కొనసాగుతున్నారు.అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇది జరగడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. కాబట్టి కొత్త అధ్యక్షుడిని డిసెంబర్-జనవరిలో జరగవచ్చు.ఇక న్యాయశాస్త్రంలో పట్టా పొందిన నడ్డా, ABVP కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1991లో పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా ఎదిగారు. 2012లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఎంపికయ్యారు.గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు; బిలాస్పూర్ నుంచి మూడుసార్లు (1993, 1998, 2007) గెలుపొందారు. 1998 -2003 మధ్య ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. -
బెంగాల్లో హింసపై బీజేపీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఎంపీలు బిప్లబ్ కుమార్ దేబ్ కన్వీనర్గా, రవిశంకర్ ప్రసాద్, బ్రిజ్ లాల్, కవితా పటీదార్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
బీజేపీ జాతీయాధ్యక్ష పదవిపై కొనసాగనున్న సస్పెన్స్!
న్యూఢిల్లీ, సాక్షి: ఇటీవల కొలువు దీరిన కొత్త కేబినెట్లో జేపీ నడ్డాకు స్థానం దక్కింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలూ చేపట్టారు. ఈ తరుణంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లి రానున్నారు. ఆయన వచ్చాక బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక అంత సులువుగా జరగదు. అందుకోసం సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్ను ఎన్నుకుంటుంది. అయితే.. కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగిశాకే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జులైలో మెంబర్షిప్ క్యాంపెయిన్ మొదలవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది కనీసం ఆరు నెలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్-జనవరి మధ్యలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.వాస్తవానికి జేపీ నడ్డా అధ్యక్ష కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే పూర్తైంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన కాలపరిమితిని ఈ జూన్ దాకా పొడిగిచింది బీజేపీ హైకమాండ్. ఇక బీజేపీలో వన్ పర్సన్.. వన్ పోస్ట్ పాలసీ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అమలు కావడం లేదు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం బీజేపీ తప్పుకుండా రూల్స్ పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేదాకా నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగమని బీజేపీ అధిష్టానం కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టి.. అప్పటిదాకా ఆయనే కొనసాగవచ్చని సమాచారం. దీంతో ఈ గ్యాప్లో పలువురి పేర్లను సైతం పరిశీలించేందుకు తమకు వీలుంటుందని హైకమాండ్ భావిస్తోంది.ఇక.. బీజేపీ తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుని.. ఆ తర్వాతే పూర్తిస్థాయి అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్తుంది. జేపీ నడ్డా ఇంతకు ముందు ఇలాగే ఎన్నుకున్నారు. 2019 జూన్లో జేపీ నడ్డాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై 2020 జనవరి 20 నుంచి పూర్తి స్థాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన కొనసాగుతున్నారు.జేపీ నడ్డా నేపథ్యం.. జగత్ ప్రకాశ్ నడ్డా.. లాయర్ వృత్తి నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బిలాస్పూర్ ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారాయన. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన.. 2003 ఎన్నికల్లో మాత్రం ఓడారు. 2007లో మళ్లీ నెగ్గి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2012లో అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పోటీ చేయలేదు. అయితే సీనియర్ కోటాలో రాజ్యసభకు మాత్రం ప్రమోషన్ దక్కించుకున్నారు. 2014లో కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా జేపీనడ్డాకు ఆరోగ్య శాఖ దక్కింది. 2019లో అమిత్ షా కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చాక.. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై తర్జన భర్జనలు జరిగాయి. ఆ సమయంలో జేపీ నడ్డాకు బాధ్యతలు తప్పగించారు. ఇక.. 2024 మార్చిలో హిమాచల్ రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేసి.. గుజరాత్ రాజ్యసభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోదీ 3.0 కేబినెట్లో మళ్లీ ఆయనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖనే దక్కింది. -
తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు...
‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి నాలుగు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్ నేత ‘మామ’ శివరాజ్సింగ్ చౌహాన్కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.నడ్డా.. వివాదాలకు దూరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి కేబినెట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజారీ్ట సాధించారు. మహారాష్ట్రలో జని్మంచిన పాటిల్ గుజరాత్లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.బిహార్ దళిత తేజం లోక్జనశక్తి పారీ్ట(రామ్విలాస్) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. చిరాగ్కా రోజ్గార్ సంస్థ ద్వారా బిహార్ యువతకు ఉపాధి కలి్పంచేందుకు చిరాగ్ కృషి చేస్తున్నారు.యాక్షన్ హీరో మాస్ ఎంట్రీ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరో 65 ఏళ్ల సురేశ్ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్కు పట్టున్న త్రిసూర్ లోక్సభ స్థానంలో 2019 లోక్సబ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్ గోపి. బిహార్ ఈబీసీ నేత ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్నాథ్ ఠాకూర్ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్నాథ్ 2014 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్ రెండు సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.ప్రతాప్ జాదవ్64 ఏళ్ల జాదవ్కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..సంజయ్ సేథ్ (64) జార్ఖండ్కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు చైర్మన్గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు!గిరిజన నేత ఉయికెమధ్యప్రదేశ్కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్లో ఈయన టీచర్గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రిమాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!వీరేంద్ర కుమార్మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్(70). ఎనిమిదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్పై తిరుగుతూ సైకిల్ రిపేర్ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.మాంఝీకి దక్కిన ఫలితంబిహార్ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్ కుమార్ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్జేడీ, జేడీయూల్లో సాగింది.టంటా.. ఉత్తరాఖండ్ సీనియర్ నేతఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ బీజేపీ ఎంపీ అజయ్ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.ఖట్టర్.. ప్రచారక్ నుంచి కేంద్ర మంత్రి 1977లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్ లాల్ ఖట్టర్(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్తక్ జిల్లా నిందానలో స్థిరపడింది.ఓరం.. ఒడిశా గిరిజన నేత63 ఏళ్ల జువల్ ఓరమ్ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్పేయీ కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్గా చేశారు.రాజీవ్ రతన్ సింగ్ ‘లలన్’లలన్ సింగ్గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్లో పలుకుబడి కలిగిన భూమిహార్ వర్గానికి చెందిన నేత. నితీశ్ కుమార్కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్ కుమార్ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్ చేశారు.జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగాఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ధార్ లోక్సభ నియోజకవర్గం(ఎస్టీ)నుంచి సావిత్రీ ఠాకూర్(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్ మధ్యప్రదేశ్లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాధేశ్యామ్ మువెల్పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు భావ్నగర్ మేయర్..తాజా లోక్సభకు గుజరాత్ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్ బంభానియా(57) ఒకరు. భావ్నగర్ నుంచి ఆప్ అభ్యర్థి ఉమేశ్ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్నగర్ మేయర్గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.సినీ నిర్మాత.. రాజకీయ నేతరెండు సాంస్కృతిక మేగజీన్లకు ఎడిటర్గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49)..అస్సామీస్ ఫీచర్, షార్ట్ ఫిల్మ్లను నిర్మించారు. జున్బాయ్ సిరీస్తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్ ఫిల్మ్ ‘మొన్ జాయ్’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. నడ్డాను కేబినెట్లోకి తీసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. మోదీతో పాటు నడ్డా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవనుంది. ఈ పదవిని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మంత్రి పదవి ఖరారావడంతో ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని నివాసంలో జరిగిన కాబోయే మంత్రుల చాయ్ భేటీకి నడ్డా హాజరయ్యారు.ఎన్సీపీకి నో చాన్స్కేంద్ర కేబినెట్ పదవుల్లో ఎన్సీపీకి షాక్ తగిలింది. కేంద్ర కేబినెట్లో అజిత్ పవార్ వర్గానికి చాన్స్ దక్కలేదు. ఎన్సీపీ నేతప్రపూల్ పటేల్కు కేంద్ర సహాయమంత్రి పదవిని ఆఫర్ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేబినెట్ మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఆఫర్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది తనను అవమానించడమేనన్నారు. -
కేంద్రంలో కేబినెట్ పదవి.. 2 సహాయ శాఖలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా కొలువుదీరనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలు అడుగుతున్నన్ని కేబినెట్ బెర్త్లు, కీలక శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 16 లోక్సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కోరుతున్నట్లుగా ఐదు కేబినెట్ పదవులతో పాటు స్పీకర్ పదవి ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు సమాచారం.టీడీపీకి ఒక కేబినెట్ మంత్రిత్వ శాఖతో పాటు రెండు సహాయక మంత్రి పదవులను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాఖల కేటాయింపుపై చంద్రబాబు శుక్రవారం రెండో దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర పెద్దలతో చర్చించినా సానుకూల ఫలితం దక్కలేదని తెలుస్తోంది.కీలక శాఖలు ఇవ్వలేం..!కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరనున్న మోదీ ప్రభుత్వంలో కీలకమైన హోం, ఆర్ధిక, రక్షణ, రైల్వే, న్యాయ, ఐటీ, రోడ్లు, రహదారుల శాఖలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ పెద్దలు నిరాకరించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖతో పాటు పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృధ్ధి, ఐటీ కమ్యూనికేషన్లు, నౌకాయాన శాఖలను టీడీపీ కోరినట్లు తెలిసింది. దీనికి అదనంగా స్పీకర్ పదవి కూడా తమకే ఇవ్వాలని అడిగినట్లు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ పెద్దలు ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.2014లో మాదిరిగానే పౌర విమానయాన శాఖతో పాటు సహాయ శాఖల్లో కీలక శాఖలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ కీలక సహాయ శాఖలు ఆర్ధిక లేదా జల శక్తి శాఖ కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. స్పీకర్ పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని అసలు కేటాయించలేదు. కేవలం స్పీకర్తోనే లోక్సభ వ్యవహారాలను నిర్వహించగా ప్రొటెం స్పీకర్లతో సభను నడిపించారు. 2014లో మాత్రం అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై, జార్ఖండ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత కరియా ముండా డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించారు. మోదీతోపాటే ప్రమాణం..!మంత్రి పదవులు, శాఖలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు విడిగా చర్చించారు. ప్రాధాన్యతలను ఆయన దృష్టికి తెచ్చారు. నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో తమ పార్టీ వారు కచ్చితంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది. -
ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు
ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్సింగ్లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు. -
పెద్ద శాఖలు ఇవ్వలేం!
న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై బీజేపీ దృష్టిసారించింది. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచి్చన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచి్చనందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పారీ్టలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ స్పీకర్ పదవిని కూడా అడుగుతోంది. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా కోరుతోంది. ఏడుగురు ఏంపీలున్న శివసేన (షిండే), ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (ఆర్వీ) కూడా రెండేసి మంత్రిపదవులు అడుగుతున్నాయి. గత రెండు ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటినందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రిపదవులు కేటాయించాల్సిన పరిస్థితిని ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రిపదవులు దక్కనున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచి్చనా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీపడకపోవచ్చని సమాచారం. రక్షణ, ఆర్థిక, హోంశాఖ, విదేశీ వ్యవహారాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే సంక్షేమం, యువజన వ్యవహారాలు, వ్యవసాయం తదితర శాఖలను అంత సులువుగా వదులుకునేలా లేదు. పేదలు, మహిళలు, యువకులు, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. రైల్వేలు, రహదారుల విషయంలోనూ గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని.. ఈ వేగం మందగించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉండాలని పేర్కొంటోంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో రైల్వే శాఖ సాధారణంగా మిత్రపక్షాల చేతుల్లో ఉంటూ వచి్చంది. కానీ బీజేపీ గట్టి ప్రయత్నంలో రైల్వే శాఖను తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంది. జేడీయూకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమల శాఖను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ఆఫర్ చేస్తోంది. అయితే ఆర్థిక, రక్షణ తదితర కీలకశాఖల్లో మిత్రపక్షాలకు సహాయమంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చర్చలకు సంబంధించిన విషయాలపై సమాచారం ఉన్న విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పర్యాటక, ఎంఎస్ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, సామాజిక న్యాయ శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశముందని సమాచారం. చంద్రబాబు నాయుడు లోక్సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వజూపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు. బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లపై పట్టుబడితే.. బీజేపీ ఎంతవరకు తలొగ్గుతుంది, ఎలా బుజ్జగిస్తుందనేది చూడాలి. -
ఓట్ల లెక్కింపు వేళ బీజేపీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన చర్యలపై బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. సోమవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్ తదితరులు హాజరయ్యారు. పోలింగ్ శాతం, బలాలు, బలహీనతలపై విశ్లేíÙంచారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ ఎన్నికలపైన, కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలాలు, బలహీనతలపై సమీక్ష జరిపాం. ఓటింగ్ శాతం, కొన్ని చోట్ల తక్కువ ఓటింగ్ నమోదుకు కారణాలపై సమగ్రంగా చర్చించాం. రాష్ట్రాల్లో కౌంటింగ్ సన్నాహాలు, అలాగే ఫలితాలు వెలువడ్డాక విజయోత్సవాల నిర్వహణపైనా చర్చించాం. హరియాణాలో బీజేపీ పరిస్థితి బాగాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా, అమిత్ షా మాజీ సీఎం ఖట్టర్తో ప్రత్యేకంగా చర్చించారు’అని తావ్డే తెలిపారు. -
ఏ పార్టీ ఓటర్లు ఉదాసీనం? జేపీ నడ్డా ఏమన్నారు?
2024 లోక్సభ ఎన్నికల్లో నేడు చివరిదశ పోలింగ్ జరుగుతోంది. నేడు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే 2019తో పోల్చి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.దీనికి ఒక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారని, అందుకే ఆ పార్టీలకు దక్కిన ఓట్లు తక్కువేనన్నారు. ఈ కారణంగానే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారన్నారు.దేశంలో అధికార ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదని, గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే అంటే 2019 మొదటి, రెండవ దశ, 2024 మొదటి, రెండవ దశలలో ఓటింగ్శాతం బాగానే ఉన్నదన్నారు. దీనిప్రకారం చూస్తే ఉదాసీనత అనేది బీజేపీ మద్దతుదారులలో లేదని, ప్రదిపక్షాల మద్దతుదారులే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు.సమాజ్వాదీ పార్టీ మద్దతుదారుల్లో ఉదాసీనత ఉందని బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు జరుతున్న ఎన్నికలపైనా, మూడోసారి రాబోయే మోదీ ప్రభుత్వంపైనా బీజేపీ మద్దతుదారుల్లో ఉత్సాహం ఉన్నదన్నారు. బీజేపీకి పోటీ లేని స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నదన్నారు. -
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలను శనివారం(మే25) ఉదయం 5 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిద్ర లేపనున్నారు. అంత మంది ఇళ్లకు నడ్డా ఒకేసారి వెళ్లలేరు కాబట్టి వారి ఫోన్లకు ఆయన తెల్లవారుజామునే ఫోన్ చేయనున్నారు.ఫోన్ ఎత్తగానే నడ్డా ఇచ్చే ఒక్క నిమిషం సందేశాన్ని వారు విననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవాలన్న నినాదాన్ని వారికి నడ్డా తన సందేశంలో గుర్తు చేయనున్నారు. ‘జన్జన్కీ యహీ పుకార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్’అని నడ్డా తన సందేశం వినిపించనున్నారు. శనివారం ఆరోవిడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
‘బుల్డాగ్’ తీరు వేరుగా ఉండేది!
ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ లేవు.’’ – ఎన్నికల కమిషన్ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్.శేషన్ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్. ఇక ఆయన ‘బుల్డాగ్’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది. ప్రధానమంత్రి బాంస్వాడా(రాజస్థాన్)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్దీప్ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?ఈ విషయంలో కమిషన్ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్లో లోపించింది. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి. మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం. అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్ మనందరినీ లోకువ చేసేసింది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మోదీ నుంచి నడ్డా వరకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ హైవోల్టేజీ ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పర్యటనలతో ప్రచారపర్వాన్ని దూకుడుగా పూర్తి చేసింది. బహిరంగసభలు, వివిధ సామాజికవర్గాల వారీగా సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమాలతో హోరెత్తించింది. ముఖ్యంగా మోదీ, అమిత్షా, నడ్డా వంటి అగ్రనేతలు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవ ర్గాలను ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టివచ్చేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాల రూపకల్పన ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు, ఇంకా కొంచెం కష్టపడితే గెలవగలిగే స్థానాలు, పోటీలో ఉన్న స్థానాలు...ఇలా వర్గీకరించుకుని తప్పకుండా విజయం సాధిస్తామనే చోట్ల అధిక దృష్టిని కేంద్రీకరించారు. ఇందుకు అనుగుణంగానే.. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు బీజేపీ నేతలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం పూర్తయ్యే ముందురోజు అంటే...శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో ఐదు ఎంపీ సీట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. అదేరోజు మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక ప్రచారం ముగిసిన శనివారం చేవేళ్ల ఎంపీ సీటు పరిధిలోని వికారాబాద్లో, నాగర్కర్నూల్లోని వనపర్తిలో నిర్వహించిన సభల్లో అమిత్షా పాల్గొన్నారు.ప్రచారంలో దూకుడుగానేప్రధానపార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడేలోగానే తొలివిడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన బీజేపీ.. మొత్తంగా రాష్ట్రంలో ప్రచార విషయంలో మాత్రం బీజేపీ‘అడ్వాంటేజ్ పొజిషన్’లోకి ప్రవేశించిందనే చెప్పాలి. పదేళ్లపాటు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, తెలంగాణకు వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు వెరసి మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తేలా చేసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆరోపించిన రిజర్వేషన్ల రద్దు అంశం, మళ్లీ బీజేపీ వస్తే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలపై ఏకంగా మోదీ, అమిత్షా సహా రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షుడు కిషన్రెడ్డి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. -
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు. -
ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
సాక్షి, పెద్దపల్లి/సాక్షి, యాదాద్రి, నల్లగొండ టూటౌన్: ‘ఏ అంటే ఏఐఎంఐఎం.. బీ అంటే బీఆర్ఎస్.. సీ అంటే కాంగ్రెస్. ఈ మూడు ఏబీసీ పార్టీలు ముస్లిం లీగ్ ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఇవి తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయి’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రజాకార్ పాలనను సమర్ధించే పార్టీలుగా వాటిని అభివర్ణించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఆ పార్టీలు నిర్వహించవని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని నల్లగొండ పట్టణంలో నిర్వహించిన జన సభల్లో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని నడ్డా దుయ్యబట్టారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలోంచి 4% కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవి దక్కేలా చూస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తొలగించబోమనే విషయాన్ని లిఖితరూపంలో ఇచ్చే దమ్ముందా..? అని ప్రధాని మోదీ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ను ప్రశ్నిస్తే.. ఇప్పటివరకు రాహుల్ స్పందించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, మతం పేరిట ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. శ్రీరాముని వ్యతిరేకి కాంగ్రెస్.. శ్రీరాముడు, సనాతన ధర్మం, దేశాన్ని వ్యతిరేకించేది కాంగ్రెస్ పార్టీ అని నడ్డా ఆరోపించారు. సనా తన ధర్మం గురించి కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే ఎన్ని విమర్శలు చేసినా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ స్పందించలేదన్నారు. దేశాన్ని ముక్కలు చేస్తామన్న వారికి రాహుల్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపితే అందుకు ఆధారాలు అడిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అలాంటి వారికి అధికారమిస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట కేసీఆర్ పేదలను మోసగించారని నడ్డా ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేసీఆర్ ఉపయోగించలేదని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా దానిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 5వ ఆర్థిక శక్తిగా భారత్.. గత పదేళ్లలో ప్రధాని మోదీ దేశం విలువను పదింతలు పెంచారని నడ్డా తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో విదేశీ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ మోదీ విధానాలతో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. అందుకే దేశాభివృద్ధికి పాటుపడుతున్న బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని నడ్డా కోరారు. ఆయా సభల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ)తోపాటు సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, పార్టీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఉగ్రవాదుల మృతిపై సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’
పట్నా: 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిహార్లోని మధుబని ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్పై మండిపడ్డారు.‘బాట్లా ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు మరణిస్తే.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆమె ఉగ్రవాదుల కోసం ఏడ్చారు. ఉగ్రవాదులతో ఏం సంబంధం ఉంది?. ఉగ్రవాదులపై సానుభూతి చూపాల్సిన కారణం ఏంటి? ఉగ్రవాదులతో ఉన్న లింక్ ఏంటి?. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దేశాన్ని బలహీనపరిచేందుకు దేశ వ్యతిరేకులకు మద్దతగా నిలుస్తుంది. దేశాన్ని బలహీనపరిచే వారిపట్ట కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రదర్శిస్తుంది. ఇండియా కూటమి ఒక అహంకారపూరితమై కూటమి. అటువంటి కూటమికి మీరు (ప్రజలు) మద్దతు పలుకుతారా?’ అని నడ్డా అన్నారు.2008లో బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్ శర్మా, ఇద్దరు ఉగ్రవాదలు మరణించారు. 2012 ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల గుర్తు చేస్తూ జేపీ నడ్డా.. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.‘బాట్లా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో నేను మంత్రిని కాదు. అయితే ఆ ఎన్కౌంటర్ విషయంలో సానియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’ అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అదే సమయంలో మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను ఖండించారు. ‘సోనియా గాంధీ కన్నీరుపెటుకోలేదు. సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా అనుకున్నవి మాత్రమే’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఈ విషయంపై జేపీ నడ్డా వ్యాఖ్యలు చేయటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
‘రాజవంశ పాలనే నమ్ముతున్నారు’.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన నడ్డా
కాంగ్రెస్ అగ్రనేత,కేరళ వయనాడ్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలనను విశ్వసిస్తున్నారని విమర్శించారు. వయనాడ్ బీజేపీ లోక్సభ అభ్యర్ధి కే సురేంద్రన్కు మద్దతుగా జేపీ నడ్డా కేరళ సుల్తాన్ బేతరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్షోలో నడ్డా రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలను నమ్ముతున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజస్వామ్య పాలన ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారని తెలిపారు. విభజించు పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఆచరిస్తున్నారని ఆరోపించారు . నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)అనుసంధానమైన రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్డీపీఐ కాంగ్రెస్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇస్తోందని, ఈ రెండు పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం) రెండూ సైద్ధాంతికంగా దివాళా తీశాయని పేర్కొన్నారు. -
Lok sabha elections 2024: వికసిత భారత్ సంకల్ప పత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ‘భాజపా కా సంకల్ప్.. మోదీ కీ గ్యారంటీ–2024’ పేరుతో అధికార బీజేపీ సార్వత్రిక ఎన్నికల సంకల్ప పత్రాన్ని (మేనిఫెస్టో) విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు (జీవైఏఎన్)లకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరు వ్యాపారులు, విశ్వకర్మలు, కారి్మకులకు భరోసా కల్పించారు. సురక్షిత, సమృద్ధ భారత్తోపాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత, నవీన ఆవిష్కరణలు వంటి హామీలు ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబి్ధపొందిన ఒక మహిళతోపాటు మరో ముగ్గురికి సంకల్ప పత్రం తొలి కాపీలను మోదీ అందజేశారు. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నివాళులరి్పంచారు. రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో 27 మంది కమిటీ సభ్యులు సుమారు 15 లక్షల మంది నుంచి సలహాలు సూచనలు స్వీకరించి, సంకల్ప పత్రాన్ని రూపొందించారు. 24 అంశాలతో కూడిన 57 పేజీలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. సంకల్ప పత్రంలోని 24 అంశాలు.. ‘2047 నాటికి వికసిత భారత్’ లక్ష్య సాధనే ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టోలో 24 కీలక అంశాలను చేర్చారు. పేద కుటుంబాల సేవ, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసం, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, రైతులకు గౌరవం, మత్యకార కుటుంబాల సమృద్ధి, కారి్మకులకు గౌరవం, ఎంఎస్ఎంఈలక చేయూత, చిరు వ్యాపారులు, విశ్వకర్మల సాధికారత, సబ్కా సాథ్ సబ్ కా వికాస్, విశ్వబంధు భారత్, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ తయారీ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, వారసత్వం–అభివృద్ధి, సుపరిపాలన, ఆరోగ్య భారత్, నాణ్యమైన విద్య, క్రీడల వికాసం, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత–నూతన ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల భారత్ వంటి అంశాలు ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ► ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం ► 80 కోట్ల మంది పేదలకు మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్ ► ఐదేళ్లలో పేదల కోసం మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం ► దివ్యాంగులకు అనుకూలంగా ఇళ్ల నిర్మాణం ► దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు ► వందేభారత్ రైళ్ల విస్తరణ ► ఇంటింటికీ పైప్లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా ► ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం ► 70 ఏళ్లుపైబడిన వయోజనులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యం ► వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు ► రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వృద్ధులకు చేయూత ► ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు ► మూడు కోట్ల మంది మహిళలను లఖ్పతీ దీదీలుగా మార్చే ప్రణాళిక ► పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేదల నివాసాలకు ఉచిత విద్యుత్ సరఫరా ► మహిళాపారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ► ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ► మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు ► ఎప్పటికప్పుడు పంటలకు కనీస మద్దతు ధర పెంపు ► ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ► సేవారంగంలో స్వయం సహాయక సంఘాల అనుసంధానం ► గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచస్థాయి హబ్ల ఏర్పాటు ► విద్యుత్తు వాహనాల రంగానికి మరింత ప్రోత్సాహం ► రక్షణ, వంటనూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి ► విదేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు పదేళ్లుగా అభివృద్థి పథంలో భారత్: జేపీ నడ్డా వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో చెప్పేదే బీజేపీ మేనిఫెస్టో అని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, వచ్చే ఐదేళ్లు కూడా ఇది కొనసాగుతుందని నడ్డా వివరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని, అందరి సహకారం, సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అవసరం: మోదీ దేశంలో ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత మేనిఫెస్టోల్లోనే ఈ హామీ ఇచి్చనప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయామని చెప్పారు. గత సంకల్ప పత్రంలో ఇచి్చన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడారు. సంకల్ప పత్రాన్ని ‘మోదీ కీ గ్యారంటీ’గా అభివరి్ణంచారు. వికసిత భారత్లో అంతర్భాగమైన యువ శక్తి, నారీ శక్తి, పేదలు, రైతులు అనే నాలుగు స్తంభాలను తమ సంకల్ప పత్రం బలోపేతం చేస్తుందని అన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా అడుగులు వేస్తామన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించారు. అవినీతిపరులు ఎంతటివారైనా కటకటాల వెనక్కి పంపిస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. గరీబ్, యువ, అన్నదాత, నారీ(జీవైఏఎన్)ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప పత్రం రూపొందించామని పేర్కొన్నారు. దేశంలోని యువత ఆకాంక్షలను ఈ పత్రం ప్రతిబింబిస్తోందన్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లను మరింత విస్తరిస్తామని తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కావొచి్చందని, ఇక ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్లో కూడా బుల్లెట్ రైలు మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తామని, దీనిపై త్వరలో అధ్యయనం ప్రారంభిస్తామని చెప్పారు. ‘140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలే మోదీ మిషన్. జూన్ 4వ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చాక వంద రోజుల్లోనే సంకల్ప పత్రాన్ని అమలు చేసే ప్రణాళికతో పని చేస్తున్నాం’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు. బీజేపీ మేనిఫెస్టోని విశ్వసించలేం: ఖర్గే బీజేపీ మేనిఫెస్టోపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఘాటుగా స్పందించారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ఏమీ చేయని ప్రధాని మోదీ ఇప్పుడు కొత్తగా హామీలు గుప్పించడం ఏమిటని ప్రశ్నించారు. అది మేనిఫెస్టో కాదు, జుమ్లా పత్రం అని మండిపడ్డారు. ‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతానని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. గడిచిన పదేళ్లలో దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేంత పెద్ద పని ఆయన ఏమీ చేయలేదు. పదేళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీకి ఏమాత్రం ఆందోళన లేదు. పేదల సంక్షేమం కోసం ఏమీ చేయని ప్రధానమంత్రిని, బీజేపీ మేనిఫెస్టోను విశ్వసించలేం’’ అని ఖర్గే పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రికి 14 ప్రశ్నలను ‘ఎక్స్’ వేదికగా ఖర్గే సంధించారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ సంగతేంటి? ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 46 శాతం ఎందుకు పెరిగాయి? మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదు? మహిళలపై అఘాయిత్యాలను ఎందుకు ఆపడం లేదు? 100 కొత్త స్మార్ట్ సిటీల సంగతేంటి? 2020 నాటికి గంగానదిని ప్రక్షాళన చేస్తామన్న హామీ ఎటుపోయింది? అంటూ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. -
Lok sabha elections 2024: నేడే బీజేపీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను బీజేపీ అగ్ర నాయకత్వం ఆదివారం విడుదల చేయనుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంకల్ప్ పత్రాన్ని ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అజెండాలుగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి హామీలను ఇప్పటికే నెరవేర్చిన తరుణంలో ఈసారి అలాంటి ఏఏ కీలకమైన హామీలకు మేనిఫెస్టోలో చోటుకలి్పస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే నాలుగు ప్రధాన కులాలు.. పేదలు, రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా హామీలను ప్రస్తావించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ ఛైర్మన్, రక్షణ మంత్రి రాజ్నా«థ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయింది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలకోసం నమో యాప్ సహా 35 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇలా లక్షలాది మంది పార్టీ మద్దతుదారుల నుంచి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ముఖ్యాంశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మార్గసూచీని ప్రకటించడంతో పాటు మోదీ గ్యారెంటీలకు సంబంధించిన హామీలను మరోమారు ప్రకటించే అవకాశాలున్నాయి. మతపరమైన అంశాలతో పాటు జాతీయవాద అంశాలను ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలున్నాయని కమలనాథులు చెబుతున్నారు. -
మోదీ విజయం జాతీయ బాధ్యత: నడ్డా
డెహ్రాడూన్: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నెగ్గడానికి సహకరించడం ప్రజల జాతీయ బాధ్యత అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మోదీని మూడోసారి గెలిపించుకోవాలని సూచించారు. నడ్గా గురువారం ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు లోక్సభ స్థానాలకు బీజేపీకి కట్టబెట్టాలని కోరారు. మోదీని మళ్లీ గెలిపిస్తే దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఘనత నరేంద్ర మోదీదే అని నడ్డా ప్రశంసించారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ!
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరికి గురైంది. ఢిల్లీలోని గోవింద్పురి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారు దొంగిలించినట్లు సమాచారం. మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వివరాలు.. టయోటా ఫార్చునర్ కారును డ్రైవర్ జోగిందర్ సర్వీసింగ్కు ఇచ్చి తీసుకొచ్చారు. నడ్డా నివాసానికి వెళ్తుండగా మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచాడు. భోజనం చేసి వచ్చే సరికి ఇంటి ముందు ఆపిన కారు కనిపించలేదు. దుండగులు కారును అపహరించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర్. రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కారుకోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. కారును గురుగ్రామ్ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన కారు హిమాచల్ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉంది. ఆరు రోజులైనా ఇప్పటి వరకూ కారు ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘కంగన’కు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్ -
బీజేపీ ఖాతాలోకే మద్యం ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు. మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. -
కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్కు సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో తమ దగ్గర ఫండ్స్ లేవంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తే ఏంటి?.. గతంలో తమ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాల ద్వారా కూడబెట్టిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవచ్చని జేపీ నడ్డా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ తన అసమర్థత, చేతకానితనాన్ని ‘ఆర్థిక ఇబ్బందులు’గా పేర్కొంటోందని విమర్శించారు. ‘నిజానికి వారు ఆర్థికంగా దివాళా తీయలేదని నైతికంగా, మేధోపరంగా దివాలా తీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్లో) పోస్టు చేశారు. చదవండి: Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు షాక్.. ‘రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారు. ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే భారత ప్రజాస్వామ్యం, ఐటీ, దర్యాప్తు సంస్థలపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా.. అధికారులను, వ్యవస్థలను నిందిస్తోంది. ఐటీ లేదా ఢిల్లీ హైకోర్టు అయినా నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. అందుకు తగ్గట్టే పన్నులు చెల్లించాలని కాంగ్రెస్ను కోరాయి. కానీ ఆ పార్టీ ఎప్పుడూ అలా చేయదు. దేశంలో ప్రతి రాష్ట్రాన్ని, అన్ని రంగాలను అన్ని విధాలా దోచుకున్న పార్టీ(కాంగ్రెస్).. ఆర్థిక నిస్సహాయత గురించి మాట్లాడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ నేతలు జీపు నుంచి హెలికాప్టర్ల వరకు బోఫోర్స్ లాంటి అన్ని స్కామ్ల ద్వారా దోచుకున్న సొమ్మును తమ ప్రచారానికి వాడుకోవచ్చు. భారతదేశం ప్రజాస్వామ్యం అనేది ఒక అబద్ధమని కాంగ్రెస్ పార్ట్టైమ్ నాయకులు అంటున్నారు. 1975 నుంచి 1977 మధ్య కొన్ని నెలలు మాత్రమే భారత్లో ప్రజాస్వామ్య పాలన లేదు. ఆ సమయంలో భారత ప్రధానిగా కాంగ్రెస్కు చెందిన ఇందిరా గాంధే ఉన్నారు.’ అంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. Congress is going to be totally rejected by the people and fearing a historic defeat, their top leadership addressed a press conference and ranted against Indian democracy and institutions. They are conveniently blaming their irrelevance on ‘financial troubles’. In reality, their… — Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) March 21, 2024 కాగా లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభించడం ద్వారా తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని సోనియా గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. తమ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేసొ మోవా క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని, డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు నిర్వహించలేకపోతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఇక బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేసి.. డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం. తమ బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్ చేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. -
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ తోపాటు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు. సీఈసీ భేటీలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పది రాష్ట్రాలకు చెందిన కోర్ కమిటీ నేతలతో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
కాళ్లబేరం ఓకే.. నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీతో చంద్రబాబు పొత్తు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు పడిన అనంతరం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో టీడీపీ – జనసేన పొత్తు కుదిరింది. ఈ మేరకు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపూర్ణ మద్దతు తమకు ఉంటుందని ఆశిస్తున్నట్లు వారు ఆకాంక్షించారు. పొత్తుల వ్యవహారంలో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు మూడు రోజుల పాటు హస్తినలో మకాం వేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు శనివారం మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తుల అంశంపై అసంపూర్తిగా ఆగిపోయిన అంశాలపై, బీజేపీ డిమాండ్లపై చర్చించారు. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 8 స్థానాలను, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు ముగ్గురి మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని టీడీపీ వర్గాల సమాచారం. కాగా, లోక్సభ, అసెంబ్లీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లో మరోసారి మూడు పార్టీల నాయకులు భేటీ అవుతారని ఆయా పార్టీలు ప్రకటించాయి. కాగా, ఎన్డీఏలో చేరాలన్న టీడీపీ, జనసేనల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జేపీ నడ్డా తెలిపారు. చకోర పక్షుల్లా ఎదురు చూపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు బీజేపీతో పొత్తు విషయంలో ఎదురుచూపులు తప్పలేదు. వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ధైర్యం లేని టీడీపీ.. జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయినా వైఎస్ జగన్పై పోటీకి బలం సరిపోదని కొద్ది రోజులుగా బీజేపీ సాయం కోరుతూ వస్తోంది. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గురువారం మొదటి దఫా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అయితే బీజేపీ, జనసేనలకు కలిపి కేటాయించే సీట్ల విషయంలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు తగ్గట్లుగా 8 నుంచి 10 లోక్సభ స్థానాలను కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేగాక పార్టీలో అంతర్గతంగా తాము చర్చించుకున్న తర్వాత మరోసారి కలుద్దామని బాబు ద్వయానికి స్పష్టం చేసింది. శుక్రవారం మొత్తం బీజేపీ పెద్దల నుంచి కబురు వస్తుందని చంద్రబాబు, పవన్కళ్యాణ్లు చకోర పక్షుల్లా ఎదురు చూశారు. అయితే శనివారం ఉదయం పొత్తుల వ్యవహారంపై చర్చించేందుకు అమిత్ షా, నడ్డాలను కలవాలని అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రాగానే ఉదయం 11:10 గంటలకు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు షా నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు జరిగిన చర్చల అనంతరం బాబు ద్వయం అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కలిసి పోటీ చేసే విషయంపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరిందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. నీతిలేని బాబు.. అనైతిక పొత్తు రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి సొంత వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో నేర్పరి అయిన చంద్రబాబు మరోసారి అదే బాట ఎంచుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. తద్వారా తాను నీతి లేని రాజకీయ నాయకుడినని, తనకు రాజకీయ అవసరాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో పని ఉండదని నిరూపించారు. పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని బిల్డప్ ఇచ్చుకుంటున్నా, అవినీతి కేసుల నుంచి తనను రక్షించుకోవడమే లక్ష్యంగా ఆయన బీజేపీ పెద్దల ఎదుట సాగిలపడినట్లు స్పష్టమవుతోంది. మూడు రోజులపాటు ఢిల్లీలోనే తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్తో కలిసి మకాం వేసి.. అమిత్ షా కరుణ కోసం పాకులాడటం స్పష్టంగా కనిపించింది. తనను కేసుల నుంచి బయట పడేయాలని, అందుకోసం తాను దేనికైనా సిద్ధమని కాళ్లావేళ్లాపడి పొత్తుకు ఒప్పించారని తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు బీజేపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సీట్ల సర్దుబాటు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. త్వరలో ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారో తేలుతుందని బీజేపీ ప్రకటించినా, చంద్రబాబు మాత్రం బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్లు ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. జనసేన, బీజేపీకి కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాలు కేటాయించినట్లు ఎల్లో మీడియాలో అదేపనిగా ప్రచారం చేయిస్తుండడం గమనార్హం. మోడీని తిట్టి.. ఎన్డీఏపై అవిశ్వాసం పెట్టి.. ఇదే చంద్రబాబు 2018లో ఏన్డీఏ నుంచి నిష్క్రమించాక బీజేపీ పెద్దలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. 2014లో తన ప్రయోజనం కోసం ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు. గెలిచాక కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. దానిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేయడంతో భయపడి 2018లో యూటర్న్ తీసుకుని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో కలిశారు. ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏను టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీఏ ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిందని, హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రధాని మోడీది విఫల ప్రభుత్వమని, ఆయన దేశాన్ని ముంచేశాడని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రకరకాల ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోడీ తనకంటే జూనియర్ అని, అదృష్టం బాగుండి ప్రధాని అయ్యారని, ఆయన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారంటూ లెక్కలేనన్ని విమర్శలు చేశారు. చివరికి ప్రధానిని ఉగ్రవాది అని కూడా దూషించారు. ఆయన తల్లిని, భార్య పేర్లను ప్రస్తావించి మరీ దిగజారుడు ఆరోపణలకు దిగారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే నల్ల చొక్కాలు, నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా తిరుపతి పర్యటనకు వస్తే టీడీపీ నేతలతో రాళ్ల దాడి చేయించారు. అంతటితో ఆగకుండా లోక్సభలో ఏన్డీఏకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మోడీని అధికారం నుంచి దించేయాలనేంత వరకూ వెళ్లారు. ధర్మపోరాట దీక్షల పేరుతో నానా హడావుడి చేశారు. కానీ ఆయన వ్యూహాలు, రాజకీయాలు తల్లకిందులై ప్రజలు చంద్రబాబును వదిలించుకున్నారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనంత ఘోర వైఫల్యాన్ని కట్టబెట్టారు. పైకి బీజేపీ, జనసేన.. లోపల కాంగ్రెస్తో.. గతంలో నోటికొచ్చినట్లు తిట్టిపోసి, విడిపోయిన ఎన్డీఏతో మళ్లీ కలిసి ప్రయాణించేందుకు చంద్రబాబు సిగ్గు విడిచి చేతులు కలపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనరాని మాటలు అని.. ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయినట్లు నటిస్తూ రాజకీయ లబ్ధే పరమావధిగా ఇప్పుడు మళ్లీ పొత్తు కుదుర్చుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికారికంగా బీజేపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకుని.. తెరవెనుక లోపాయికారిగా కాంగ్రెస్తోనూ అవగాహనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతుండడం, ఆమెకు బాబు మద్దతుగా నిలిచి మాట్లాడుతుండడం తెలిసిందే. ఇలా అపవిత్ర పొత్తులు, అవగాహనల ద్వారా తనకంటూ ఒక విధానం, ఒక పద్ధతి లేదనే విషయాన్ని చంద్రబాబు నిస్సిగ్గుగా చాటి చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే.. సీఎం వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇప్పటికే జనసేనతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. జగన్కు పోటీ ఇవ్వడానికి అది సరిపోదనే భావనతో కేంద్రంలో బీజేపీ మద్దతు కోసం చాలా కాలంగా ప్రాధేయ పడుతున్నారు. సరికొత్త గిమ్మిక్కులతో ఎట్టకేలకు ఆ కూటమితో జట్టుకట్టారు. మూడు రోజులు అమిత్షా ఇంటి వద్దే పడిగాపులు పడి, చివరికి బీజేపీ ఏం చెప్పినా చేసేందుకు సిద్ధపడి ఎన్డీఏలో చేరుతున్నారు. బీజేపీ, జనసేనతో కలిసి నడిస్తేనే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కనీస పోటీ అయినా ఇవ్వగలనని మొదటి నుంచి చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీని బతికించుకోవడంతోపాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే బీజేపీతో సయోధ్య తప్పదనే ఆలోచనతోనే సిగ్గు విడిచి ఆ పార్టీతో జట్టు కట్టారని స్పష్టమైంది. మళ్లీ ఎన్డీఏలో చేరాం బీజేపీతో పొత్తు కుదిరిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ ఎన్డీఏలో చేరుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. శనివారం ఢిల్లీ నుంచి ఆయన టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో కొన్ని సీట్లను వదులుకోక తప్పదన్నారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. సీట్ల పంపకం చివరి దశకు చేరుకుందని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. పొత్తులో భాగంగా ప్రస్తుతానికి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలకు తెలిపారు. టీడీపీ–బీజేపీ–జనసేన మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు. టీడీపీకి కేంద్రం సహకారం చాలా అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చెప్పారు. ఈ నెల 17న టీడీపీ–జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని తెలిపారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని చెప్పారు. మోడీ పాల్గొనే అవకాశం ఉందని, ఇందుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదిలా ఉండగా ‘తిరిగి ఎన్డీఏలో చేరినందుకు సంతోషిస్తున్నా. పవన్ కళ్యాణ్తో కలిసి, ఏపీలో ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు, మోడీతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఇది మూడు పార్టీల మధ్య పొత్తు మాత్రమే కాదని, దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న ముగ్గురి భాగస్వామ్యమని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో పదేళ్లగా కొనసాగుతున్న గందరగోళంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కారణంగా ఐదేళ్లుగా తలెత్తిన సమస్యలు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయిక ద్వారా తీరబోతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిని చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలుపుతూ శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. మూడు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని జనసేన పార్టీ శనివారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. కోవర్టుల సాయంతో బీజేపీ చెంతకు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక కాంగ్రెస్ను వదిలేసిన చంద్రబాబు.. వెంటనే నిస్సిగ్గుగా బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే బీజేపీ ప్రాపకం కోసం పరితపిస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు గుంట నక్క రాజకీయాలు గ్రహించిన ప్రధాని మోడీ ఆయన్ను ఇన్నాళ్లూ దరి చేరనీయలేదు. అయినా చంద్రబాబు పట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం తన బినామీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని అధికారం పోగానే బీజేపీలోకి పంపారు. వారు బీజేపీలో ఉంటూనే చంద్రబాబు కోవర్టులుగా పనిచేస్తూ ప్రస్తుతం పొత్తు కుదర్చడంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని వారి ద్వారా బీజేపీతో కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు కలిపేలా చేసి ఆయన్ను కూడా తన కోసం పని చేయించుకున్నారు. జనసేన బీజేపీతో పొత్తులో ఉండగానే, తాను జనసేనతో పొత్తు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి పని చేయాలనే దిక్కుమాలిన వ్యూహాన్ని అమలు చేశారు. అందులో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా బయటపెట్టారు. పొత్తు కుదిర్చే క్రమంలో బీజేపీ పెద్దలతో తాను ఛీవాట్లు తిన్నట్లు కూడా చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు బీజేపీతో కలిసేందుకు తెర వెనుక ఎందరిని ప్రయోగించారో, ఎన్ని కుయుక్తులు పన్నారో అర్థమవుతోంది. మొత్తంగా చంద్రబాబు కాళ్ల బేరానికి రావడంతో బీజేపీ పెద్దలు పొత్తుకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు రెండవసారి బీజేపీతో కలవడంపై రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. -
పొత్తుల పితలాటకం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల వ్యవహారంలో శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో అమిత్ షా నివాసంలో టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్లు సమాచారం. తమకు 8–10 లోక్సభ స్థానాలు, 15–20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది. ఈ సమావేశంంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా.. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో రెండుసార్లు పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిగినా ఏమాత్రం లాభం లేకపోవడంతో.. వారు విధించే ఏషరతులైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని టీడీపీ, జనసేన విశ్వప్రయత్నం చేశాయి. ఆ రెండు పార్టీల అధ్యక్షులు తమతో పొత్తు విషయంలో ఏ విధంగా అర్రులు చాస్తున్నారు అనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్లకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. దీంతో చంద్రబాబు, పవన్ గురువారం ఢిల్లీ వచ్చారు. రాత్రి 10:20 గంటలకు చంద్రబాబు, 10:35 గంటలకు పవన్ కళ్యాణ్లు అమిత్ షా నివాసానికి చేరారు. సుమారు గంట సేపు సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడకుండా చంద్రబాబు ముఖం చాటేశారు. చర్చలు ఆశాజనకంగా జరగలేదనే విషయం ఆయన ముఖ కవళికలను బట్టి తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. గతంలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబును అమిత్ షా డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇక 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వెళ్లిపోయిన తర్వాత విశాఖ, రాజంపేట. రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ వంటి లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై తాము ఏ విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్న అంశాన్ని బీజేపీ పెద్దలు చర్చల సందర్భంగా చెప్పారు. అందువల్ల తామడిగిన లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్లకు స్పష్టం చేశారని తెలిసింది. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బరిలో నిలిచే బీజేపీ అ«భ్యర్థుల జాబితాపై ఆమోదముద్ర పడనుంది. -
నేడు బీజేపీ కోర్ గ్రూప్ భేటీ.. ఏపీ అభ్యర్థులపై చర్చ!
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక చేస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం బీజేపీ హైకమాండ్ కోర్ గ్రూప్ సభ్యులు భేటీ కానున్నారు. వివరాల ప్రకారం.. నేడు బీజేపీ హైకమాండ్ గ్రూప్ భేటీ కానుంది. కోర్ గ్రూప్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంతోష్ జీ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా రెండో విడతలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ఎల్లుండి జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కోర్ గ్రూప్ అభ్యర్థులను జాబితా సిద్ధం చేయనుంది. ఇక, తొలి జాబితాలో భాగంగా బీజేపీ 194 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కోర్ గ్రూప్ భేటీలో సభ్యులు.. ఏపీ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక, ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున సభ్యులను ఎంపిక చేసి అధిష్టానానికి లిస్ట్ను పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, తదితరులు హైకమాండ్తో సమావేశం కానున్నారు. -
రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ చీఫ్ రాజీనామా
సాక్షి, ఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(63) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన హిమాచల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం లభించింది. బీహార్లో పుట్టి పెరిగిన జగత్ ప్రకాష్(జేపీ) నడ్డా.. నరేంద్ర మోదీకి సహచరుడు. లాయర్గా కెరీర్ను ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన పూర్వ మూలాలు మాత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అందుకే 1993 నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నెగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ రాష్ట్రానికి పలు శాఖల మంత్రిగానూ పని చేశారు. 2012లో హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. పెద్దల సభకు వెళ్లాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. .. 2014 నుంచి 2019 నడుమ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2019 జూన్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. 2020, జనవరి 20వ తేదీ నుంచి ఆయన బీజేపీ జాతీయాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2022లోనే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. బీజేపీ అధిష్టానం కాలపరిమితిని పొడగించింది. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బీజేపీకి పార్టీ ఫండ్గా ప్రధాని మోదీ రూ.2వేల విరాళం
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీకి రూ.2000 విరాళంగా ఇచ్చారు. ‘నమో’ యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని ప్రధాని మోదీబీజేకి పార్టీ ఫండ్గా అందజేశారు. ఈ సందర్భంగా ‘నమో’ యాప్ ద్వారా ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ పేమెంట్కు సంబంధించిన స్లిప్ను షేర్ చేశారు. ‘బీజేపీకి దోహదపడటం, వికసిత్ భారత్ నిర్మాణం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయటం సంతోషంగా ఉంది. ‘నమో’ యాప్ ద్వారా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్ ’లో పోస్ట్ చేశారు. I am happy to contribute to @BJP4India and strengthen our efforts to build a Viksit Bharat. I also urge everyone to be a part of #DonationForNationBuilding through the NaMoApp! https://t.co/hIoP3guBcL pic.twitter.com/Yz36LOutLU — Narendra Modi (@narendramodi) March 3, 2024 డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్.. ప్రచార కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఆయన కూడా రూ. 1000 విరాళాన్ని పార్టీకి అందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణం కోసం నేను బీజేపీకి విరాళం ఇచ్చాను. నమో యాప్ ద్వారా అందరూ ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో పాల్గొనండి’ అని జేపీ నడ్డా ‘ఎక్స్’ ద్వారా పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2022-2023 ఏడాదిలో బీజేపీ రూ. 719 కోట్లు సేకరించినట్లు తెలిపింది. అదేవిధంగా 2021-2022తో పోల్చితే 17 శాతం అధికం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2022 -2023 ఏడాదికి రూ. 79 కోట్లు, 2021-2022 ఏడాదికి రూ. 95.4 కోట్లు పార్టీ ఫండ్ సేకరించినట్లు పేర్కొంది. -
బీజేపీ స్ట్రాటజీ.. తొలి జాబితాపై సర్వత్రా ఆసక్తి!
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ సిద్ధమయ్యింది. ఇందుకోసం గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. భేటీ తర్వాత.. శుక్రవారం తొలి జాబితాలో వందకిపైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకు ముందు.. ఇవాళ అనేక రాష్ట్రాల నేతలతో బీజేపీ అధిష్టానం మేధోమథనం జరిపింది. బుధవారం బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో భేటీ జరిగింది. జాబితా తుది కూర్పుపై షా, నడ్డాలు వాళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రకటించబోయే తొలి జాబితాలో.. మూడొంతుల అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే.. 2019లోనూ ఇలానే అగ్రనేతల పేర్ల జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. కానీ, ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక లిస్ట్ ఇచ్చింది. అయితే.. స్ట్రాటజీ ఇలా.. ఈసారి మాత్రం ముందుగానే లిస్ట్ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు కారణం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి భిన్నంగా ముందుగానే ప్రకటించాలనుకుంటోంది. తద్వారా ఎన్నికల ప్రచారానికి సమయం దొరుకుతుందనేది బీజేపీ స్ట్రాటజీ. ఉదాహరణకు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ గెలవని 39 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సత్ఫలితాలను రాబట్టింది. అందుకే.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తొలి జాబితా కోసం అదే స్ట్రాటజీని ఫాలో కానున్నట్లు స్పష్టమవుతోంది. ఫస్ట్ లిస్ట్లో.. 2019 ఎన్నికల్లో గెలవని స్థానాలను కూడా చేర్చాలనే యోచనలో కమల అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ సంఖ్య 130 దాకా ఉండొచ్చని.. తొలి జాబితాలో దక్షిణ ప్రాంతం నుంచి అత్యధిక స్థానాల ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఆయనకు పక్కా.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ నుంచి 6 నుంచి పదిమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ రాములు గురువారం నాడే బీజేపీలో చేరనున్నారు. అయితే.. రేపటి లిస్ట్లో ఆయన పేరును కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని.. నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నారని ప్రచారం నడుస్తోంది. -
Lok Sabha elections 2024: ప్రజల సూచనలతో బీజేపీ మేనిఫెస్టో: నడ్డా
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనకు గాను ప్రజల నుంచి సూచనలు కోరుతున్నట్లు పార్టీ చీఫ్ జేపీ నడ్డా చెప్పారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను సేకరించేందుకు సోమవారం ‘వికసిత్ భారత్ మోదీ కీ గ్యారెంటీ’ వీడియో వ్యాన్లను నడ్డా ప్రారంభించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ అమలు చేసిన పనుల వీడియోలను ఈ వ్యాన్లలో ప్రదర్శిస్తారు. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు సూచనలు ఇవ్వాలనుకునే వారు 90909002024కు మిస్డ్ కాల్ ఇవ్వాలని నడ్డా కోరారు. నమో యాప్లో కూడా ప్రజలు తమ సూచనలను పంపవచ్చన్నారు. -
రాష్ట్రానికి మోదీ, షా, నడ్డా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస ఎన్నికల పర్యటనలతో హోరెత్తించనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసంగా పది ఎంపీ సీట్లు గెలుపొందాలన్న లక్ష్యం నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రచారాన్ని ప్రారంభించక ముందే బీజేపీ ఉధృత ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఆ మేరకు ఆ పారీ్టల అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ నెలాఖరులోగా బీజేపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారపర్వంలోకి దూకాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ఇచ్చేలోగానే మోదీ 2 సభలు... ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే ఆదిలాబాద్, సంగారెడ్డిల్లో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోదీ విచ్చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఆయా సభలకు ముందు రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలను మోదీ చేతుల మీదుగా చేపట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ తీరును, రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీ సునిశిత విమర్శలు చేస్తారని రాష్ట్ర పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 29న బీజేపీ తొలి జాబితా...? ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రంలోని 17 సీట్లలో మెజారిటీ (అంటే 12 స్థానాలకు) అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ 29న ఇద్దరు లేదా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఐదారుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి చేరికను బట్టి ఎవరు గట్టి అభ్యర్థులు అవుతారో వారి బలాబలాల ప్రాతిపదికన పేర్లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరింత మెరుగైన అభ్యర్థుల కోసం అన్వేషణలో భాగంగా... జహీరాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం సీట్లకు క్యాండిడేట్ల ఎంపికను పెండింగ్లో పెట్టినట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే అగ్రనేతల విస్తృత ప్రచారం ఆదిలాబాద్, సంగారెడ్డి సభలకు పీఎం మోదీ ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం 4న హైదరాబాద్లో అమిత్ షా సభ! 29న బీజేపీ తొలి జాబితా? 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు 4న అమిత్ షా రాకుంటే మోదీ? వచ్చే నెల 4న హైదరాబాద్లో సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారంలో అమిత్షా పాల్గొంటారని తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే అదే రోజున అమిత్ షా బదులు మోదీ సభ ఉండొచ్చునని సమాచారం. ఈ సభ కోసం గచ్చిబౌలి, సరూర్నగర్ స్టేడియాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు కవర్ చేసేలా (ఐదు వేర్వేరు ప్రాంతాల్లో) చేపట్టిన విజయసంకల్పయాత్రల ముగింపు సందర్బంగా హైదరాబాద్లో మార్చి 2న అమిత్షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. ఐతే 2వ తేదీకి బదులు 4న రాష్ట్రానికి వచ్చేందుకు అమిత్షా సమయం కేటాయించడంతో అదేరోజున సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు పారీ్టవర్గాల సమాచారం. -
అవినీతికి, అభివృద్ధికి మధ్య పోరు: నడ్డా
ముంబై: రానున్న లోక్సభ ఎన్నికలు ఒకవైపు వారసత్వ రాజకీయాలు, అవినీతికి, మరోవైపు అభివృద్ధికి మధ్య పోరుకు వేదికగా మారనున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ముంబైలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో నడ్డా మాట్లాడారు. ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలు, అవినీతితో కూరుకుపోయి ఉన్నాయని విమర్శించారు. ఇటువంటి పార్టీలతో జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. -
BJP National Executive Meeting: నవ భారతం నిర్మిద్దాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణం కోసం కదలి రావాలని బీజేపీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం రాబోయే 100 రోజులు ఎంతో కీలకమని, ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ మిషన్తో పనిచేద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాకుండా దేశ నిర్మాణం కోసం పనిచేద్దామని సూచించారు. అభివృద్ధి ఎజెండా లేని కాంగ్రెస్ పార్టీ నుంచి దేశాన్ని, యువతను రక్షించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. భారతదేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలంటూ చాలా దేశాలు తనను ఆహా్వనిస్తున్నాయని తెలిపారు. ఇండియాలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయా దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయని మన దేశంలో విపక్షాలు సైతం నినదిస్తున్నాయని గుర్తుచేశారు. ఢిల్లీలో భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 64 నిమిషాలపాటు ప్రసంగించారు. కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. సొంతంగా అనుభవించడానికి అధికారం కోరుకోవడం లేదని, దేశానికి మేలు చేయాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. శతాబ్దాల సమస్యలను పరిష్కరించాం దేశంలో శతాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కారించేందుకు సాహసం చేశామని మోదీ చెప్పారు. ‘‘500 ఏళ్ల నాటి అయోధ్య సమస్యను రామమందిర నిర్మాణంతో పరిష్కరించాం. ఏడు దశాబ్దాల తర్వాత ఆరి్టకల్ 370 నుంచి జమ్మూకశీ్మర్కు విముక్తి లభించింది. మూడు దశాబ్దాల తర్వాత మహిళ రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ చట్టాలు తెచ్చాం. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. నా సొంతింటి గురించే ఆలోచించుకుని ఉంటే ఇంతమందికి ఇళ్లు నిర్మించివ్వడం సాధ్యమయ్యేది కాదు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుస్తాం. సీఎంగా, ప్రధానిగా ఎంతో సాధించారు, ఇక విశ్రాంతి తీసుకోండని ఓ సీనియర్ నాయకుడు నాతో అన్నారు. నేను రాజనీతి, రాష్ట్రనీతి కోసం పని చేస్తా. ఛత్రపతి శివాజీ ఆశయాలే నాకు స్ఫూర్తి’’ అన్నారు. దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్ భాష, ప్రాంతం ఆధారంగా దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. దేశ సైనికుల నైతిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే పాపం కాంగ్రెస్ చేసిందన్నారు. సైన్యం సాధించిన విజయాలపై ప్రశ్నలు లేవనెత్తిందని విరుచుకుపడ్డారు. దేశానికి రఫెల్ యుద్ద విమానాలు రాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పారీ్టకి, ఇండియా కూటమికి అభివృద్ధి ఎజెండానే లేదన్నారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను కాంగ్రెస్ పెంచి పోషించిందని విమర్శించారు. గతంలో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఇప్పటికీ కుట్రలు చేస్తోందన్నారు. దేశాభివృద్ధి పట్ల ఎలాంటి ప్రణాళిక లేని ఆ పార్టీ విచ్చలవిడిగా హామీలు ఇస్తోందని ఆక్షేపించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే వెయ్యేళ్లలో ‘రామరాజ్యం’ అయోధ్య రామాలయమే ప్రతీక బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల బీజేపీ హర్షం వెలిబుచ్చింది. ఇది ప్రతి భారతీయుడికి ఆనందం కలిగించిందని పేర్కొంది. రాబోయే వెయ్యేళ్లలో సంవత్సరాల్లో స్థాపించబోయే రామరాజ్యానికి ఈ ఆలయం ప్రతీక అంటూ ఆదివారం జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించింది. ‘‘అయోధ్య రామాలయం జాతిని జాగృతం చేసే ఆలయం. వికసిత్ భారత్ తీర్మానాల సాకారంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. రాముడి జన్మస్థానంలో భవ్య మందిర నిర్మాణం చరిత్రాత్మక విజయం. తీర్మానంలో ప్రస్తావించారు. రాజ్యాంగ అసలు ప్రతిలో సీతా రామ లక్ష్మణుల చిత్రాలున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులకు రాముడు స్ఫూర్తి అనేందుకిదే నిదర్శనం. రామరాజ్యమనే భావన మహాత్మాగాంధీ హృదయంలోనూ ఉండేది. ఆ ఆదర్శాలను మోదీ చక్కగా పాటిస్తున్నారు’’ అంటూ కొనియాడింది. రామమందిర ప్రాణప్రతిష్టను విజయవంతంగా నిర్వహించిన మోదీకి అభినందనలు తెలిపింది. వచ్చే వంద రోజులు కీలకం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 100 రోజుల ఎంతో కీలకమని మోదీ చెప్పారు. ఈ 100 రోజులు కొత్త శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పని చేయాలని సూచించారు. ‘‘ఈ రోజు ఫిబ్రవరి 18. దేశంలో 18 ఏళ్లు నిండిన యువత 18వ లోక్సభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాబోయే వంద రోజుల్లో ప్రతి కొత్త ఓటరును, ప్రభుత్వ పథకాల లబి్ధదారును పలుకరించండి. ప్రతి ఇంటికీ వెళ్లండి. అందరి విశ్వాసం పొందండి. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. బీజేపీకి సొంతంగా 370కి పైగా స్థానాలు, ఎన్డీఏకి ‘అబ్కీ బార్, చార్సౌ పార్’ మిషన్తో పని చేద్దాం. ఇకపై భారత్ స్వప్నాలు, సంకల్పాలు విశాలమైనవిగా ఉంటాయి. ఈ పదేళ్లలో ఒక మైలురాయిని మాత్రమే చేరాం. కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చాల్సి ఉంది. తీసుకోవాల్సిన నిర్ణయాలెన్నో ఉన్నాయి. యువత, మహిళ, పేదలు, రైతుల శక్తిని ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి వినియోగించుకోవాలి. ఆయా వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చాం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే పెద్ద తీర్మానం చేసుకున్నాం’’ అన్నారు. -
బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు!
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల గెలుపే లక్ష్యంగా, పార్టీలో కీలకమైన నేతలకు లోక్సభలో ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులకు మాత్రమే తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించటం గమనార్హం. వచ్చే ఏప్రిల్ నెలలో పెద్దల సభలో బీజేపీ చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న... ఏడుగురు కేంద్ర మంత్రులకు బీజేపీ తిరిగి రాజ్యసభకు అవకాశం ఇవ్వదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారిని వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక). పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశి వ్యవహరాల శాఖ మంత్రి వి. మురళీధరన్ (మహారాష్ట్ర)లు ఉన్నారు. అయా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు తన సొంతం రాష్ట్రం అయిన ఒడిశాలోని (సంబల్పూర్ లేదా ధేక్నాల్) సెగ్మెంట్ల నుంచి లోక్సభకు పోటీకి నిలపనున్నట్లు సమాచారం. మంత్రి భూపేందర్ యాదవ్ను రాజస్థాన్లోని (అల్వార్ లేదా మహేంద్రగఢ్) నియోజకవర్గం, మంత్రి చంద్రశేఖర్ను బెంగళూరులోని మూడు నియోజకవర్గాలు (సెంట్రల్, నార్త్, సౌత్)లో ఏదో ఒక స్థానంలో బరిలో దించనుంది. మంత్రి మాండవియాను గుజరాత్లోని (భావ్నగర్ లేదా సూరత్), మంత్రి రూపాలా రాజ్కోట్ నుంచి బీజేపీ పోటీలో నిలపనుంది. మంత్రి మురళీధరన్కు తన సొంత రాష్ట్రం కేరళ నుండి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ బీజేపీకి ఉనికి లేనప్పటికీ ఈసారి గెలుపే లక్ష్యంగా మురళీధరన్ను అక్కడ నిలబెడుతుందని సమాచారం. రెండు దఫాల్లో రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రుకే తిరగి అవకాశం కల్పించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్ (మధ్యప్రదేశ్)లకు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఇప్పటివరకు అయితే కేవలం నలుగురు సభ్యులను మాత్రమే తిరిగి ఎంపిక చేయటం గమనార్హం. బీజేపీ పెద్దల సభకు కొత్తవారికి అవకాశం కల్పించటంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడుగురు మంత్రులను కూడా రాజ్యసభకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల బరి దించనున్నట్లు తెలుస్తోంది. -
సోనియా లేదా ప్రియాంకకు.. నడ్డా రాజ్యసభ సీటు !
షిమ్లా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. ఈ సీటు సోనియాగాంధీ లేదా ప్రియాంక గాంధీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్ తెలిపారు. సోనియా, ప్రియాంకలకు ఆసక్తి ఉంటే ఈ సీటుకు వారి పేర్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు కూడా ఎన్నిక జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లకుగాను 40 సీట్లతో కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ఉండటంతో ఈ సీటు కాంగ్రెస్కే దక్కనుంది. వచ్చే నెల హిమాచల్ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సమయంలో ఈ సీటుకు ఎన్నిక జరగనుంది. 2018లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3 రాజ్యసభ సీట్లుండగా మూడు ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇదీచదవండి.. ఇండియాకు తొలి ఓటమి.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ -
Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం..
పట్నా: బీహార్లో మరో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో నితీష్ కుమార్తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇక, తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. అనంతరం, ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా, నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. #WATCH | Nitish Kumar takes oath as Bihar CM for the 9th time after he along with his party joined the BJP-led NDA bloc.#BiharPolitics pic.twitter.com/v9HPUQwhl3 — ANI (@ANI) January 28, 2024 #WATCH | Nitish Kumar takes oath as Bihar CM for the 9th time after he along with his party joined the BJP-led NDA bloc. pic.twitter.com/ePGsqvusM3 — ANI (@ANI) January 28, 2024 #WATCH | Bihar: BJP leader Vijay Sinha takes oath as a cabinet minister. pic.twitter.com/Dkk9wXQHNR — ANI (@ANI) January 28, 2024 -
గ్రామాలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని బీజేపీ ఓ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ‘గ్రామాలకు వెల్లండి’(గావో చలో అభియాన్)అని శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ ప్రచారం జరగనుంది. ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పేద ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో మరింత ఎక్కువగా కార్యకర్తలు ప్రచారం చేయాలని అన్నారు. సుమారు 7 లక్షల గ్రామాల్లో బూత్స్థాయిలో బీజేపీ కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వ విధానాల వివరిస్తూ ప్రజలతో మమేకం కావాలని అన్నారు. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయటం కోసం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్థానాల్లో భారీ మేజార్టీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: కులమతాల చిచ్చు పెడుతున్నారు -
లోక్సభ ఎన్నికలపై దృష్టిసారించండి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం సుమారు 5 గంటలపాటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలు మార్గదర్శనం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన చంద్రశేఖర్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సునీల్ బన్సల్, చంద్రశేఖర్లు రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్తాన్లో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ 2017 సెపె్టంబర్ నుంచి పనిచేస్తున్నారు. ఆర్ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. 2017లో రాజస్తాన్ బాధ్యతలు తీసుకొనే ముందు చంద్రశేఖర్ పశి్చమ ఉత్తరప్రదేశ్, అంతకు ముందు వారణాశి ప్రాంతీయ సంస్థమంత్రిగా పనిచేశారు. అంతేగాక 2014లో చంద్రశేఖర్ ప్రధాని మోదీతో కలిసి వారణాశి లోక్సభ స్థానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. నెలాఖరులో రాష్ట్రానికి అమిత్షా ? వచ్చేనెలలో ఐదు క్లస్టర్లలో బీజేపీ యాత్రలు సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులో కేంద్రమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా బీజేపీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చేసరికి ఐదు క్లస్టర్లుగా విభజించారు. వీటికి నలుగురు రాష్ట్రప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ఇంకా సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఇన్చార్జ్లుగావ్యవహరిస్తారని సమాచారం. మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో క్లస్టర్ ఇన్చార్జ్లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీసంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వచ్చేనెలలో తెలంగాణలో 10 రోజులపాటు బీజేపీ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఐదు పార్లమెంట్ క్లస్టర్ల వారీగా ఈ యాత్రలు ఉంటాయి. ఇందులో భాగంగా తెలంగాణ అప్పులు తీరాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలన్న మరోసారి మోదీ అధికారంలోకి రావాలన్న అంశం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
హ్యాట్రిక్పై బీజేపీ గురి...!
వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్లో అకాలీదళ్, బిహార్లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్బరేలీ, మెయిన్పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్బరేలీ, మెయిన్పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్లో అమృత్సర్, ఆనంద్పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్పూర్ తదితర లోక్సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలిసారి లోక్సభకు జేపీ నడ్డా పోటీ?
లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు రాజ్యసభ సభ్యులు కనిపించనున్నారు. సీనియర్ నేతలను వారి సొంత రాష్ట్రాల నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం. బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నడ్డా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా జేపీ నడ్డా రాజ్యసభలో రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజ్యసభకు చెందిన సీనియర్ నేతలను రంగంలోకి దించితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. దానికి ప్రధాన కారణం ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ సభ్యులగా ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు మంత్రులు, ఎంపీలు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. కాగా రాజ్యసభ సభ్యునిగా ఒక నేతకు రెండు పర్యాయాలకు మించి అవకాశం ఇవ్వకూడదనే విధానాన్ని పార్టీ రూపొందించింది. ఈ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. నడ్డా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ విధానాన్ని కొనసాగించినట్లవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నడ్డా రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. ఇదిలావుండగా న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు మంత్రులు ఆకాంక్షిస్తున్నారు. అయితే పార్టీలోని సీనియర్ నేతలను, మంత్రులను వారి సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని నాయకత్వం అనుకుంటోంది. అప్పుడే ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. -
‘‘వాషింగ్ మెషిన్’’ కామెంట్స్.. ఎంపీపై బీజేపీ చర్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలో పడేసిన ఎంపీపై బీజేపీ చర్యలు తీసుకుంది. జాతీయ కార్యదర్శి పదవి నుంచి అనుపమ్ హజ్రాను తప్పిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పార్టీ పేరు, ప్రతిష్టలను దెబ్బ తీసే యత్నం చేయడమే ఇందుకు కారణంగా వెల్లడించింది. అనుపమ్ హజ్రా 2014 ఎన్నికల్లో బోల్పూర్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్ తరఫున నెగ్గారు. కానీ, ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. బెంగాల్లో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించడంలో బీజేపీకి అనుపమ్ ముఖచిత్రంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2020లో బీజేపీ ఆయనకు జాతీయ కార్యదర్శి పోస్ట్ కట్టబెట్టి జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. అవినీతి నేతలు ఎవరున్నా సరే.. బీజేపీలో చేరేందుకు తనను సంప్రదించాలంటూ బహిరంగ ప్రకటన చేశారు. ‘‘బీజేపీలో చేరాలని అనుకుంటున్నారా?. ఈడీ, సీబీఐ నోటీసులు అందుతాయని.. దాడులు జరుగుతాయని భయంగా ఉందా?.. మీకు ఎంతటి అవినీతి చరిత్ర ఉన్నా సరే.. ఫేస్బుక్ ద్వారా నన్ను సంప్రదించొచ్చు. మొహమాటంగా అనిపిస్తే.. నేరుగా నన్ను వచ్చి కలిసి మాట్లాడొచ్చు. బీజేపీ మీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలో అనే ఆలోచన తప్పకుండా చేస్తుంది’’ అంటూ ఆయన మాట్లాడిన మాటల వీడియో వైరల్ అయ్యింది. ఇక ప్రతిపక్షలు ఈ వీడియో ఆధారంగా చెలరేగిపోయాయి. బీజేపీ అవినీతిపరులకు అడ్డాగా మారుతుందా? అంటూ మండిపడ్డాయి. అనుపమ్ ‘‘వాషింగ్ మెషిన్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఇంతకాలం సైలెంట్గా ఉంది. అయితే టీఎంసీ ఈ ఆరోపణలపై ఇంకా విమర్శలు చేస్తుండడంతో ఇప్పుడు చర్యలు తీసుకుంది. పార్టీ గీత దాటినందుకే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేరు మీద ప్రకటన విడుదలైంది. పార్టీ అగ్రనేత, చీఫ్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా కోల్కతా పర్యటన సమయంలోనే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. -
‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన విజయ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలపులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలకంగా వ్యవహరించిన తీరును ప్రధాని కొనియాడారు. మూడు ముఖ్యమైన రాష్ట్రాల్లో బీజేపీ గెవటం కోసం జేపీ నడ్డా చూపించిన నాయకత్వ లక్షణాలు, నిరంతరం శ్రమ ఫలితాల్లో కనిపించాయని తెలిపారు. ఆయన చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలు, వ్యూహాలు పార్టీని ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చిందని మోదీ అభినందించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కుంటుంబానికి సంబంధిచిన బంధువుల్లో ఒకరు మరణించినా.. ఆ బాధను దిగమింగి మారీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు. నడ్డా రచించిన ఎన్నికల వ్యూహాలు బీజేపీకి గెలుపును సునాయాసం చేశాయని అన్నారు. బీజేపీ విజయం కోసం నడ్డా.. పూర్తిస్థాయిలో పట్టుదలతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ విజయ ర్యాలీలో జేపీ నడ్డా కూడా మాట్లాడుతూ.. ‘దేశంలో హామి ఉందంటే.. అది మోదీ హామి మాత్రమే’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వలో పని చేయటం తమ అదృష్టమని తెలిపారు. మోదీ ప్రభతో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పుడు పార్టీని ముందుండి నడిపిస్తారని జేపీ నడ్డా పేర్కొన్నారు. -
Assembly Elections 2023: మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బీజేపీ కసరత్తు!
న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్తోపాటు సీనియర్ నేత విజయ్వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్గఢ్లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్లో మహంత్ బాలక్నాథ్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్లో అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌషిక్, మాజీ ఏఐఎస్ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే. -
కమల వికాసం.. విలాపం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 2018 ఎన్నికల్లో 118 సీట్లలో పోటీచేసి కేవలం ఒక సీటు గెలిచి 7 శాతం ఓటింగ్కు పరిమితమైన స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి 14 శాతం ఓటింగ్ సాధించడం వరకే కమలదళం పరిమితమైంది. పోటీ చేసిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలుస్తామనే అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి.. బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 32.20 లక్షల ఓట్లు సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ నుంచే రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఉత్తర తెలంగాణనే బీజేపీని ఆదుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో 4, నిజామాబాద్లో 3 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో బీజేపీ అగ్రనాయకులైన మోదీ, అమిత్ షా, నడ్డా నిర్వహించిన ప్రచారం కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడిందని నాయకులు అంచనా వేస్తున్నారు. నిజంకాని అంచనాలు.. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్లలో కొన్ని సీట్లు కలిపి మొత్తం 18కిపైగానే గెలుస్తామనే బీజేపీ ముఖ్యనేతల అంచనాలు నిజం కాలేదు. హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విజయం సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఓదార్పు మిగిల్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలిచినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలేవీ ప్రతిబింబించకపోవడం పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్లో), ధర్మపురి అరి్వంద్ (కోరుట్లలో), సోయం బాపూరావు (బోథ్లో)తోపాటు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్లలో), ఎం. రఘునందన్రావు (దుబ్బాకలో) ఓడిపోవడం బీజేపీకి అంతుబట్టడంలేదు. పనిచేయని బీసీ నినాదం...ఎస్సీ వర్గీకరణ... బీజేపీ బీసీ నినాదం, అధికారానికి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం, మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకొనేందుకు పొందుపరిచిన అంశాలేవీ ఫలితాల సాధనలో బీజేపీకి కలసి రాలేదు. బీసీ నినాదం తీసుకున్నారే తప్ప ఈ వర్గాలను చేరుకొని వారి మద్దతు సాధించడంలో పార్టీ విఫలమైంది. ఎస్సీ–19, ఎస్టీ–12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటునూ పార్టీ గెలవలేకపోయింది. ఈ సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టి మిషన్–31ను ప్రారంభించినా పెద్దగా ఆ దిశగా కృషి చేయకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గెలిచిన 8 సీట్లలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు (36 మందికి సీట్ల కేటాయింపు) కాగా ఐదుగురు జనరల్ కేటగిరీకి చెందినవారు. పార్టీ గెలిచిన 8 సీట్లలో (రాజాసింగ్, మహేశ్వర్రెడ్డి మినహా) ఆరుగురు తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. అయితే మహిళలకు 12 టికెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరూ విజయం సాధించలేదు. కమలాన్ని దెబ్బతీసిన అంశాలెన్నో... రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుపై 3–4 నెలలపాటు సందిగ్ధత నెలకొనడం... ఎన్నికలకు ముందు సంజయ్ను హఠాత్తుగా మార్చడం.. బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, అధికార బీఆర్ఎస్ అవినీతిపై ఆరోపణలు గుప్పించి వాటిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ లేదా దర్యాప్తునకు ఆదేశించకపోవడం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారు బహిరంగ సభల్లో ఆరోపించినా దర్యాప్తుకు మొగ్గుచూపకపోవడం వంటివి పార్టీపై ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, విజయశాంతి వంటి అసంతృప్త నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరిన వివేక్, రాజ్గోపాల్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. -
ఫలితాలపై విస్మయం..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్ షా సమీక్ష నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్కు గురిచేసింది. అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్ హైదరాబాద్లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
గెలిపిస్తే ‘నిజాం షుగర్స్’ తెరిపిస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, కామారెడ్డి/ జగిత్యాల/రాయికల్: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే తక్షణమే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని... ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీకే కట్టబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్ట ణం, జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్లో నిర్వహించిన సభలతోపాటు జగిత్యాల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పటికే తెరిపించామన్న నడ్డా... తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ధరణి రద్దు చేసి మీభూమి పోర్టల్ తెస్తాం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు మారుపేర్లని, ప్రజల సంపదను దోచు కుంటున్న ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బడాబాబులకు మాత్రమే ఉపయోగపడిందని, డబుల్ బెడ్రూం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందడంలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ కారణంగా అవినీతి పెరిగిపోయిందని... బీజేపీని గెలిపిస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, లోపాలను సరిదిద్ది మీ భూమి పోర్టల్ తీసుకొస్తామని నడ్డా చెప్పారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమే... గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని... అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అవినీతిరహిత పాలన అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. మోదీ అంటేనే అభివృద్ధి అన్నారు. రోడ్లు, రైల్వే అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే బీబీ నగర్లో ఎయిమ్స్ కడుతున్నామని... అధికారంలోకి వస్తే రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులను జైలుకు పంపిస్తామన్నారు. -
ఈ రెండు రోజులూ కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న 111 (జనసేన 8 సీట్లు కలిపితే 119) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత వాస్తవ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. చివరి రెండు రోజుల ప్రచారం ఎంతో కీలకమని, ఉధృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్పై దృష్టి పెట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోల్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్ర పార్టీకి జాతీయనాయకత్వం చేదోడువాదోడుగా నిలుస్తుందని నడ్డా భరోసానిచ్చినట్టు చెబుతున్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నడ్డా, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిమగ్నమైన జాతీయనేతలు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, సంస్థాగత సహ ఇన్చార్జి శివప్రకాష్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్తో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు పనిచేసింది ఒక ఎత్తు.. చివరి రోజుల్లో పార్టీకి ప్రజల్లో పెరిగిన మద్దతును ఓట్ల రూపంలో పోలింగ్బూత్ల దాకా తీసుకెళ్లి విజయం సాధించడం మరొక ఎత్తు అని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షాలు నిర్వహించిన తర్వాత పరిస్థితిలో అనూహ్యంగా మార్పు వచ్చిందని, అభ్యర్థుల విజయావకాశాలు చాలా సీట్లలో మెరుగయ్యాయని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఆ సీట్లపై పూర్తిస్థాయిలో ఫోకస్ 45–50 స్థానాల్లో అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారని, వీటిలో అత్యధిక సీట్లను గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుందని నడ్డా పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో పరిస్థితి ఏమిటి అని నడ్డా ప్రశ్నించినపుడు ఆ రెండుచోట్లా కేసీఆర్కు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని, గెలిచే అవకాశాలూ ఉన్నాయని ప్రకాష్జవదేకర్, సునీల్బన్సల్ వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. -
రాష్ట్రంలో బీజేపీకి పట్టం కట్టండి
హుజూర్నగర్/చిలకలగూడ/ముషీరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని భ్రషు్టపట్టిస్తుండటంతో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు. అందువల్ల ఆ పార్టీలను ఇంటికి పంపి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభతోపాటు హైదరాబాద్లోని చిలకలగూడ, వారాసిగూడ, ముషీరాబాద్లలో చేపట్టిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. సకలజనులు ఏకమై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు పంపిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేస్తోందని నడ్డా ఆరోపించారు. ధరణి పోర్టల్ తెచ్చి నిరుపేదల అసైన్డ్ భూములను అందులో నమోదు చేయలేదని, ధరలు పెరిగాక వాటిని గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి కేసీఆర్ దోపిడీ చేశారని ఆరోపణలు గుప్పించారు. దళితబంధు పథకం సొమ్మును లబ్దిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు 30 శాతం లంచాలు తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. పీఎం ఫసల్ బీమా యోజన, గ్రామీణ్ ఆవాజ్ యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు రూ. వేలల్లో నష్టం జరిగిందని నడ్డా పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కామ్లు... కాంగ్రెస్ అంటే అవినీతికి నిలువుటద్దమని, కాంగ్రెస్ హయాంలో అనేక స్కామ్లు జరిగాయని నడ్డా ఆరోపించారు. అటువంటి పార్టీని, నాయకులను నమ్మొద్దని, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని ఆయన దుయ్యబట్టారు. ‘డబుల్ ఇంజిన్’తో మరింత అభివృద్ధి.. మోదీ పాలనలో ఒక్క స్కామ్ కూడా జరగలేదని నడ్డా చెప్పారు. దేశ సుస్థిరత, సమగ్రత, ప్రజాసంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. యువతకు, మహిళలకు, రైతులకు మేలు కలగాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీ.. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని, ఏటా ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, వరి క్వింటాల్కు రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని, ఎరువులకు సబ్సిడీ పెంచుతామని నడ్డా హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పారదర్శకంగా 6 నెలల్లోగా భర్తీ చేస్తామని, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. -
మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. దేశంలో పలు రాష్ట్రాలకు కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించామని, తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ రిజర్వేషన్లను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సంగారెడ్డి, నిజామాబాద్లలో జరిగిన బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ను భ్రష్టాచార్ రాక్షస సమితిగా అభివర్ణించారు. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి సర్కారు భూములను చెరబట్టారని, హైదరాబాద్ మియాపూర్లో 692 ఎకరాల భూకుంభకోణం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని, రూ.38 వేల కోట్ల ఈ ప్రాజెక్టును రూ.1.20 లక్షల కోట్లకు పెంచి అందిన కాడికి దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఔటర్ రింగ్రోడ్డు టెండర్లలోనూ రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయని, దళితబంధు పథకంలో బీఆర్ఎస్ నాయకులు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ సర్కారు అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ను జైలుకు పంపాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రామగుండం కర్మాగారాన్ని పునఃప్రారంభించాం: కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నడ్డా విమర్శించారు. కర్ణాటకలో నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. కాంగ్రెస్ మాదిరిగానే కేసీఆర్ కూడా హామీల పేరుతో ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ధరణి పోర్టల్ కాదు.. అది కేసీఆర్ భూములు హరించే పోర్టల్ అని చెప్పారు. మోదీ ప్రభుత్వం తెలంగాణలో ప్రత్యేకంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించిందని, వందేభారత్ రైళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నిరుపేదలకు ఏటా నాలుగు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆడపిల్ల పుడితే పెళ్లి వయస్సు వచ్చే సరికి రూ.రెండు లక్షలు వచ్చేలా బాండ్లు ఇస్తామని, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి భారత్ తెలంగాణ కోసం బలిదానాలు చేసిన, ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులను సైతం కేసీఆర్ ప్రభుత్వం వంచించిందని నడ్డా వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతితో తన కుటుంబ సభ్యులను బాగుచేసుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, కవిత పాలన నడుస్తోందన్నారు. విభజన సమయంలో ధనికంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. కేంద్ర నిధులతో పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీతోపాటు అనేక హమీలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలో 5జీ నెట్వర్క్ తెస్తే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గప్లా (అక్రమాలు), గోటాలా (కుంభకోణాలు), గూస్కోరీ (అవినీతి), గరీబీ, గూండారాజ్ తెచ్చిందన్నారు. తెలంగాణలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలను మారుస్తామని, అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరిందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పసుపు శుద్ధి యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పసుపునకు మద్దతు ధర లభిస్తుందన్నారు. -
Telangana: బీజేపీ అగ్ర నేతల క్యూ.. చాన్స్ ఉన్న చోట్ల ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చివరి 8 రోజులు పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో పలువురు బీజేపీ ముఖ్యనేతలు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు రోజు విడిచి రోజు పర్యటనలకు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీపరంగా, స్వతంత్ర సంస్థలు, ఇతర రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరుగుతోందన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని జాతీయ నాయకత్వం మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తృత పర్యటనలు, రోడ్షోలు నిర్వహించనున్నారు. 27న హైదరాబాద్ నగరంలో మోదీ రోడ్షో ఉంటుందని తెలుస్తోంది. మొత్తం ఆరు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీవర్గాల సమాచారం. చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం కాగా ఈ పర్యటన సందర్భంగా మోదీ రాజ్భవన్లో బసచేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ జూబ్లీహిల్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ నెల 23న ముథోల్, సంగారెడ్డి , నిజామాబాద్ అర్బన్లలో సభలకు హాజరుకావడంతో పాటు హైదరాబాద్లో రోడ్డు షో నిర్వహించనున్నారు. 25, 26, 27 తేదీలలో కూడా వివిధ జిల్లాల్లో నిర్వహించే సభలు, రోడ్షోలలో పాల్గొంటారు. మరోవైపు 24, 26, 28 తేదీలలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 28న రోడ్షోతో ఆయన పర్యటన ముగించే అవకాశాలున్నట్లు తెలిసింది. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ ఈ నెల 24, 25, 26 తేదీలలో 10 బహిరంగ సభల్లో పాల్గొననున్నట్టు సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రోడ్షో ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ నెల 24, 26 తేదీలలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరు సభల్లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇక ఈ నెల 22 నుంచి 27 వరకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివిధ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
కుటుంబ పాలన అంతమే!
అవినీతిపై విచారణ జరుపుతాం కేసీఆర్ ధరణి పోర్టల్ పేరుతో నిరుపేదల భూములు లాక్కున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీ కుంగడంతో భారీగా ప్రజాధనం వృథా అయింది. మియాపూర్ భూముల విషయంలో రూ.4వేల కోట్ల అవినీతి జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలోనూ అవినీతి చోటుచేసుకుంది. మా ప్రభుత్వం వస్తే ఈ అవినీతిపై విచారణ చేసి దోషులను జైలుకు పంపుతాం. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్లు తీసుకున్నారు. స్వయంగా కేసీఆరే ఈ విషయం చెప్పారు. ఈ కమీషన్ల ప్రభుత్వాన్ని ఈనెల 30న సాగనంపుదాం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ చేవెళ్ల/గౌతంనగర్ (హైదరాబాద్): ఎందరో అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో చిక్కుకుందని.. ఈ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు అయ్యారని, వేల మంది ప్రాణత్యాగం చేశారని.. కానీ సీఎం కుర్చిలో కూర్చున్న కేసీఆర్ తెలంగాణ ప్రగతిని పక్కనపెట్టి కుటుంబ సంపదను పెంచుకున్నారని ఆరోపించారు. కుటుంబ పాలన చేసే రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ యుద్ధం చేస్తోందని, తెలంగాణలోనూ కుటుంబ పాలనను అంతం చేస్తామని చెప్పారు. ఆదివారం నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో, మల్కాజిగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్షోలో జేపీ నడ్డా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు పంపిస్తే.. కేసీఆర్ కుటుంబం ఆ నిధులను అభివృద్ధికి ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేసింది. ఓట్లకోసం ఒక వర్గాన్ని సంతోషపర్చడానికి రిజర్వేçషన్లను పెంచుతామని చెప్పడం, రాష్ట్రంలో హిందూ ఆలయాల భూములను ఇతర పనులకు వాడుకోవడం ఆయనకే చెల్లింది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ. రాక్షసుల్లా తెలంగాణను దోపిడీ చేస్తున్నారు. రైతులకు ప్రయోజనకరమైన ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను దారిమళ్లించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా చూస్తే.. తెలంగాణలో కేసీఆర్ తగ్గించకుండా ప్రజల సంక్షేమాన్ని విస్మరించారు. దేశంలోనే అధికంగా తెలంగాణలో 8.5 శాతం ద్రవ్యోల్బణం ఉంది. దేశంలో ఎక్కువగా డీజిల్, పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రం తెలంగాణే. దళితబంధులో కూడా బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారు. ఎక్కడా ఇంత దౌర్భాగ్యం లేదు. మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దిట్ట మోదీ సర్కారు దేశంలో మౌలిక సదుపాయాల కోసం ఏడాదికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయిస్తే.. ఒక్క తెలంగాణలో 5.21 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.లక్ష కోట్లతో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించాం. రూ.6,038 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. మోదీ ప్రభుత్వం చెప్పింది కచ్చితంగా చేసి చూపిస్తుంది. కాంగ్రెస్ చెప్పింది చేయదు. ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ తీరు. కర్నాటకలో 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామన్నారు. ఏమైంది? నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే. అవినీతి, ప్రజలను మోసం చేయడంలో దిట్టలు. బీజేపీ గెలిస్తే బీసీ సీఎం తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తాం. ఏడాదికి నాలుగు సిలిండర్లను ఉచితంగా అందజేస్తాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఎరువులపై రూ.18వేల సబ్సిడీ అందజేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.2,500 ఇన్సెంటివ్ ఇస్తాం. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తాం. విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్ట్యాప్లు అందజేస్తాం. ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. వృద్ధులకు ఉచితంగా తీర్థయాత్రలు, నిరుపేదలకు రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం. సెపె్టంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్యారంటీలకు వారంటీలు లేవు. అదే బీజేపీ ప్రభుత్వమిచ్చే గ్యారంటీలతో వికాసం ఉంటుంది. ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతాం బీజేపీ ప్రభుత్వం ఎక్కడున్నా మహిళలకు రక్షణ ఉంటుంది. అవినీతి నిర్మూలన, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటుంది. మోదీ హయాంలో ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా భారత్ ఎదిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గెలిపిస్తే 2028 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుంది..’’అని నడ్డా పేర్కొన్నారు. ఈ సభల్లో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ‘5జీ’ కేసీఆర్ను ఇంటికి పంపాలి బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాష్ట్ర సర్కార్. ఇది తెలంగాణ ప్రజలను లూటీ చేస్తుంది. ఫోన్లలో 5జీ నెట్వర్క్ లాంటివారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే కేసీఆర్ 5జీ ఏంటంటే.. పేదరికం (గరీబీ), కుంభకోణం (గొటాలా), అహంకారం (గుస్సోడి), మోసకారి (గఫ్లేబాజ్), గూండాయిజం (గూండారాజ్). ఇలాంటి కేసీఆర్ను ఈ ఎన్నికల్లో ఇంటికి పంపాలి. ఆ సమయం వచ్చింది. -
Narayanpet: తెలంగాణ కాదు.. దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి..!
రూపురేఖలు మార్చే ఎన్నికలివి.. ‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో స్వాగతించారో.. అప్పుడే పూర్తిగా నాకు నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని.. ఎమ్మెల్యేలను గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించడమే కాకుండా.. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తో పాటు దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఒక్కసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నారాయణపేట: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు వరుసగా ఉమ్మడి పాలమూరు జిల్లా బాట పట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నారాయణపేట, మహబూబ్నగర్ కు వచ్చి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గద్వాలలో జరిగిన సభలో శనివారం పాల్గొనడంతో కార్యకర్తల్లో కదనోత్సవం కనిపిస్తోంది. ఆదివారం నారాయణపేటలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించడంతో బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహం వచ్చినట్లయింది. జాయమ్మ చెరువుకు నీళ్లేవీ? పాలమూరు– రంగారెడ్డి ద్వారా నీళ్లు తెచ్చి జాయమ్మ చెరువు నింపుతామన్న పాలకులు ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్రెడ్డి అన్నారు. నారాయణపేట ఎప్పటికై నా బీజేపీ గడ్డ అని.. ఓడినా.. గెలిచినా రతంగ్ పాండురెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారన్నారు. కొత్తగా కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు.. పెద్ద పెద్ద మాటలు చెబుతుండ్రు.. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు చూడండి.. ఏమైనా అమలవుతున్నాయా.. అన్నీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదారు లక్షల కోట్లు అప్పు చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో ఎంపీగా సైనిక్ స్కూల్ను నారాయణపేటకు తీసుకువచ్చా.. 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చూయించినా ఇప్పటి వరకు ఆ స్కూల్ ఏమైందో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండే రతంగ్పాండురెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వస్తే బూడిదే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు ఒకరిని మించి ఒకరు మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆ రెండు పారీ్టలు ఏకమై డ్రామాలు చేస్తున్నాయని, కేసీఆర్ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు బూడిదే మిగులుతుందని ధ్వజ మెత్తారు. సీఎం కేసీఆర్తోపాటు ఇక్కడ పోటీ చేసే నాయకులకు ఓటు అడిగే హక్కు లేదన్నా రు. నారాయణపేటకు జూరాల బ్యాక్వాటర్ ద్వారా పాలమూరు – రంగారెడ్డి నీళ్లు ఇవ్వాలని మొదటగా డిజైన్ చేసి తర్వాత డిజైన్ మార్చి నారాపూర్ దగ్గరకు తీసుకువెళ్లినా.. ఇప్పటి వరకు సాగునీరు అందలేదన్నారు. ఫలితంగా స్థానికులు బతుకుదెరువు కోసం సోలాపూర్, బొంబాయి ప్రాంతాలకు వలస పోతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణపేటలో రతంగ్పాండురెడ్డి, మక్తల్లో జలంధర్రెడ్డి, కొడంగల్లో బంటు రమేశ్, దేవరకద్రలో కొండా ప్రశాంత్రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ♦సాధారణ కార్యకర్త అయిన నాకు టికెట్ ఇవ్వడం అంటే అది బీజేపీ గొప్పతనం అని, కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికేతరులు అయితే.. నేను లోకల్ అని కొడంగల్ బీజేపీ అభ్యర్థి బంటు రమేశ్ అన్నారు.ఈ ప్రాంతానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ♦రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంత పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని దేవరకద్ర అభ్యర్థి కొండా ప్రశాంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, మరోదిక్కు ఆరు గ్యారంటీల పేరుతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల సకలజనులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ♦ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే అమలు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్రెడ్డి అన్నారు. రైతులకు వరి ధాన్యానికి క్వింటాకు మద్దతు ధర రూ.3,120 గొప్ప విషయమన్నారు. ♦ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా.. గెలిచిన అభ్యర్థి పాలన ఏ విధంగా ఉందో చూశారు.. ఈసారి తనకు ఒక్క చాన్స్ ఇచ్చి ఆశీర్వదించాలని నారాయణపేట అభ్యర్థి రతంగ్పాండురెడ్డి ప్రజలను కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికో ఉద్యోగం, సాగునీరు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ, పార్లమెంట్ కనీ్వనర్ పవన్కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు పడాకుల శ్రీనివాసులు, నాయకులు చంద్రశేఖర్, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
Rajasthan: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఇది అభివృద్ధికి రోడ్మ్యాప్: నడ్డా
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'సంకల్ప్ పత్ర' పార్టీ మేనిఫెస్టోని జైపూర్లో గురువారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన హామీలు ఇలా ఉన్నాయి.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: ఈ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి రూ. 12,000 లకు పెంచుతామని పార్టీ ప్రకటించింది. లాహో ఇన్సెంటివ్ స్కీమ్: ఈ పథకం పేద కుటుంబాల్లో బాలికలకు ఆర్థిక చేయూతను అందిస్తుంది. దీని కింద బాలికలు పుట్టినప్పుడు పొదుపు బాండ్ అందిస్తారు. ఈ బాండ్ కాలక్రమేణా మెచ్యూర్ అవుతూ వస్తుంది. బాలిక ఆరో తరగతికి రాగానే రూ.26,000, తొమ్మిదో తరగతిలో రూ.18,000, పదో తరగతిలో రూ.10,000, 11వ తరగతిలో రూ.12,000, 12వ తరగతిలో రూ.14,000 అందజేస్తారు. ఇక వృత్తి విద్యలోకి అడుగుపెట్టాక రెండేళ్లలో రూ.50,000, 21 ఏళ్లు రాగానే రూ. 1 లక్ష చొప్పున అందిస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ: దీని కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయడానికి ఏటా రూ. 1,200 ఆర్థిక సాయం అందిస్తారు. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్: ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ లక్ష్యంగా ఈ మిషన్లో రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్: పేపర్ లీక్ కేసులను త్వరితగతిన విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అభివృద్ధికి రోడ్మ్యాప్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ మేనిఫెస్టో అనేది ఇతర పార్టీలకు నామమాత్రపు వ్యవహారమని, కానీ బీజీపీ మేనిఫెస్టో అభివృద్ధికి రోడ్మ్యాప్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే గత ఐదేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. రాజస్థాన్లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2013 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు గెలుచుకుని రాజస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. -
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్త గంగాదేవి శర్మ(106) కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఉంటున్న ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈరోజు (సోమవారం) ఉదయం 7 గంటలకు గంగాదేవి కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం వ్యాస నది ఒడ్డున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వృద్ధురాలు గంగాదేవి శర్మ మృతితో కులులోని శాస్త్రి నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. జేపీ నడ్డా అత్త ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఆమెను సంరక్షించేందుకు ఇద్దరు కేర్టేకర్లు ఉన్నారు. నడ్డా బాల్యం అంతా అతని అత్త ఇంట్లోనే గడిచింది. అందుకే నడ్డా.. కులును తన రెండవ స్వస్థలం అని చెబతుంటారు. తాను హిమాచల్ను సందర్శించినప్పుడల్లా తన అత్త ఇంటికి వెళ్తానని నడ్డా తెలిపారు. జేపీ నడ్డా ఛత్తీస్గఢ్లోని బిలాసర్పూర్ జిల్లా నివాసి. కాగా ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ ఓటరుగా గంగాదేవి శర్మ గుర్తింపు పొందారు. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడ్డా తన అత్తను కలుసుకున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
గెలుపు గుర్రాలకు బీజేపీ గ్రీన్ సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర పడింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూ రాష్ట్ర నాయకత్వం సిద్ధంచేసిన ఈ జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించి, చర్చించిన అనంతరం గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. మొత్తంగా 55 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. సీఈసీ సభ్యులు.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, భూపేంద్రయాదవ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తోపాటు.. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించి పార్టీ రాష్ట్ర నాయకత్వం సమరి్పంచిన జాబితాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరిశీలించారని పార్టీ వర్గాలు తెలిపాయి. గెలిచే స్థానాలు.. గెలవగలిగే నేతలతో.. ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం అనుసరించిన వి«ధానాన్నే తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటనలోనూ అనుసరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులను బరిలో దింపాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనికితోడు పార్టీ బలంగా ఉండి ఒకరే ఆశావహులున్న చోట్ల అభ్యర్థుల ప్రకటనకు సీఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 60–70 మందితో తొలి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే స్థానం సాధించగా.. ఈసారి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకునే దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తోందని అంటున్నాయి. -
లూటీకి మాత్రమే కాంగ్రెస్ గ్యారెంటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. ఆ పార్టీ లూటీకి మాత్రమే గ్యారెంటీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన డబ్బు వసూళ్ల కోసం కర్ణాటకను ఆ పార్టీ ఏటీఎంలా మార్చేయడం సిగ్గు చేటన్నారు. కర్ణాటకలోని కొందరు కాంట్రాక్టర్ల నివాసాలపై దర్యాప్తు సంస్థల్లో సుమారు రూ.100 కోట్ల అక్రమసొత్తును బయటపడినట్లుగా వచ్చిన వార్తలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతి డీఎన్ఏకి ఇది ఒక చిన్న మచ్చుతునక మాత్రమేనని ఆయన సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులైన ఈ కాంట్రాక్టర్లే గత బీజేపీ ప్రభుత్వం కమీషన్లు వసూలు చేస్తోందంటూ ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పెచ్చుమీరిందని ఆరోపించారు.‘కాంగ్రెస్, అవినీతి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఛత్తీస్గఢ్, రాజస్తాన్లను కూడా కాంగ్రెస్ అవినీతికి ఏటీఎంలుగా మార్చుకుంది. ఇప్పుడు తెలంగాణ, మధ్యప్రదేశ్లను కూడా ఏటీఎంలుగా మార్చి ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన ధనాన్ని దోచుకోవాలని కలలుగంటోంది. కాంగ్రెస్ లూటీకి మాత్రమే గ్యారెంటీ ఇవ్వగలదు’అని నడ్డా ఆరోపించారు. హామీలు ఇవ్వడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి హామీలకు బదులు గ్యారెంటీలిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రిష్వత్ సమితి
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ (అవినీతి) రిష్వత్ (లంచగొండి) సమితి.. కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోంది..వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబపాలన అంతం కావడం ఖాయం. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఎన్నో పథకాలు ఇక్కడ అమలు కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కేసీఆర్ నెరవేర్చలేదు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాష్ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు సింగిల్ బెడ్రూం గతి లేదు.. కానీ బీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూం అంటున్నారని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో బీజేపీ గెలవాలి. దీంతోపాటు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి’ అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో సర్వశక్తులూ ఒడ్డి పోరాడి కేసీఆర్ కుటుంబపాలనను అంతం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట్లో కమలం వికసించేలా కృషి చేయాలి.. ‘ప్రతీ ఇంట్లో కమలం వికసించేలా కృషి చేయాలని నడ్డా కోరారు. కాంగ్రెస్ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించింది. ఆ పార్టీ కూడా సోనియాగాంధీ ఆ తర్వాత రాహుల్గాంధీ వారసుల కుటుంబపార్టీగా మారింది. దీంతో కశ్మీర్, పంజాబ్ మొదలుకొని తమిళనాడు, తెలంగాణ దాకా ప్రాంతీయపార్టీలు ఏర్పడ్డాక కుటుంబ పార్టీలుగా రూపాంతరం చెంది ప్రజల ఆకాంక్షలను విస్మరించాయి. కేసీఆర్, కేటీఆర్, కూతురు, అల్లుడు, వారే ఉంటారు. కేసీఆర్కు ఒక సందేశం ఇస్తున్నా..వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయని చెప్పారు. 9 ఏళ్లలో ఎంతో చేశాం... మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందని నడ్డా చెప్పారు. ‘తెలంగాణ వికాసం కోసం కేంద్రం 9 ఏళ్లలో రూ.9 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణలో 2 కోట్లమంది పేదలకు కేంద్రం రేషన్ ఇస్తోంది. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదు. ప్రధాని ఆవాస్ యోజన కింద దేశవ్యాç³్తంగా 4 కోట్ల ఇళ్లు కేంద్రం నిర్మించింది. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించింది’ అని ప్రశ్నించారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందని నడ్డా చెప్పారు. -
ఇది తెలంగాణ భవిష్తత్తు కోసం జరుగుతున్న యుద్ధం: నడ్డా
-
బీజేపీ కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరగాలి: నడ్డా
-
రెండో వారంలో ‘బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా’
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల రెండో వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాబోయే రెండు నెలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ పాల్గొన్న పాలమూరు సభకు విశేషమైన ప్రజాదరణ లభించిందన్నారు. ఈ నెల 10 వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. నవంబర్ మొదటి వారంలోగా 30సభలు రాష్ట్రంలో నవంబర్ మొదటి వారంలోపు 30 సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కాగా అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయని... 5వ తేదీన జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్లు, రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుందని, 6వ తేదీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కనీ్వనర్లు, ఇంచార్జ్లతో కలిపి మొత్తం 800మంది ఈ సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 5 తేదీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, 6వ తేదీ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దిశానిర్దేశం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ సభను రైతులు జయప్రదం చేయాలి నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డును మంజూరు చేసినందుకు ప్రధానికి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను సాకారం చేసిన ప్రధానికి రైతులంతా సంఘీభావం పలకాలని కోరారు. మంగళవారం నిజామాబాద్లో మోదీ పాల్గొనే బహిరంగ సభను పసుపు రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పదాధికారుల భేటీకి బీఎల్ సంతోష్ ఈ నెల 5న నిర్వహించే రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. ఈ నెల 10న అమిత్ షా పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి(మంచిర్యాల)లో భారీ బహిరంగసభకు హాజరు కానున్నారు. -
రాజస్థాన్ పై బీజేపీ ఫోకస్..
-
అధిక శాతం ఓటర్లను ఆకర్షించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్పై వివిధ వర్గా ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మా ర్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించడంతో పాటు అధిక శాతం ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాల రూపకల్పనపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో.. అధ్యక్షుడి మార్పు, ప్రత్యక్ష, పరోక్ష రూ పాల్లో ప్రభావం చూపిన ఇతర అంశాలతో పార్టీలో, కేడర్లో ఏర్పడిన స్తబ్ధత తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీపరంగా, సొంతంగా వివిధ స్వతంత్ర సంస్థలు, ఏజెన్సీల ద్వారా పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, తదితరులు నిర్వహించిన సర్వేల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా తేలిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత బలా న్ని ఇంకా సమకూర్చు కోలేదన్న విషయం కూడా స్పష్టమైన ట్టు విశ్వేశ్వర్రెడ్డి వంటి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని బీజేపీ భావిస్తోంది. మోదీ సభలతో ఊపు! అక్టోబర్ 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభల ద్వారా ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటం పార్టీకి కచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి, వివిధ వర్గాలు, రంగాలకు ప్రయోజనం చేకూర్చే చర్యలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు లాంటివి చేయడం ద్వారా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి తప్పకుండా ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఈ పాజిటివ్ ఓటింగ్ కచి్చతంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని నేతలు విశ్వసిస్తున్నారు. 6న నడ్డా దిశానిర్దేశం ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే అక్టోబర్ 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఇక్కడకు వస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ విస్తృత సమావేశంలో పాల్గొననున్న నడ్డా..పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణ విషయంలో స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు–పార్టీకి ముడిపడిన అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించడంతో పాటు రాష్ట్రంలో జాతీయ పార్టీ అనుసరించబోతున్న ఎన్నికల వ్యూహాన్ని కూడా స్పష్టం చేయనున్నట్టు తెలిసింది. ఈ భేటీ సందర్భంగా పార్టీ ఎన్నికల రోడ్మ్యాప్ ఖరారు, పార్టీ మేనిఫెస్టో, అభ్య ర్థుల ఎంపిక తదితర అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్టు ముఖ్యనేతలు తెలిపారు. పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయం, ఐక్యంగా ముందు కెళ్లడం, అసంతృప్త నేతలు కలిసి పనిచేయడంపై నడ్డా పలు సూచనలు చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పూర్తిగా అనుకూల పరిస్థితులున్నాయని, వాటిని సరైన పద్ధతుల్లో ఉపయోగించుకుని, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించే దిశలో కేంద్ర మంత్రులు మొదలు సామాన్య కార్యకర్త దాకా అంకితభావంలో పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామంటూ నడ్డా హితవు పలికే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చేనెలలో వరుసగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు పాల్గొనేలా కార్యక్రమాలు ఖరారు చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం. -
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్లోపే ముగ్గురు మూడేసి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యధాతథంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్ సారించింది. జాతీయ కీలక నేతలతో బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రధాని మోదీ మహబూబ్నగర్కు రానున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే.. బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో బహిరంగ సభల్లో పాల్గొనేలా కార్యచరణ రూపొందించింది బీజేపీ. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతలు పర్యటించాలని గతంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. షెడ్యూల్ వచ్చేలోపే ఒక్కొక్కరు మూడేసి బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ జిల్లాలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. త్వరలో ఈ ఇద్దరూ మళ్లీ తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం. ఇక 30న మహబూబ్నగర్ టూర్తో పాటు.. ఆ తర్వాతి రెండు బహిరంగ సభలు నిజామాబాద్, నల్లగొండలో ఉండొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రస్థాయి నేతలతో కొత్త జిల్లా కేంద్రాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో ఉంది బీజేపీ. ఇవాళ ఢిల్లీ టూర్లో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో ముఖ్యనేతల పర్యటనలు ఖరారు చేసుకొని ఈ రాత్రికి ఆయన తిరుగు పయనం కావొచ్చని తెలుస్తోంది. -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
Womens Reservation Bill 2023: ఓబీసీలపై కాంగ్రెస్ సవతి ప్రేమ
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఓబీసీ కోటా కూడా కలి్పంచాలన్న కాంగ్రెస్ పార్టిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దుమ్మెత్తిపోశారు. వారిపై కాంగ్రెస్ ప్రేమ మాటలకే పరిమితమన్నారు. అధికారంలో ఉండగా ఓబీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా కనీసం వారి గురించి ఆలోచించను కూడా లేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రూపంలో దేశానికి తొలి ఓబీసీ పీఎంను ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళా బిల్లుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని అన్ని పార్టిల ఎంపీలను కోరారు. బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించడం తెలిసిందే. రాహుల్ ది ట్యూటర్ తెలివిడి 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పాలనలో కేంద్రంలో ఎందరు ఓబీసీ కార్యదర్శులున్నారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. సరీ్వసుల్లో ఉన్న అధికారులకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లను కేవలం 1992లో సుప్రీంకోర్టు సూచన అనంతరం మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ట్యూటర్లను పెట్టుకుంటే చాలదు. నాయకుడు కావాలంటే చిత్తశుద్ధితో అందుకోసం ప్రయతి్నంచాలి‘ అంటూ ఎద్దేవా చేశారు. ‘303 మంది బీజేపీ లోక్ సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. ఇది కాంగ్రెస్ మొత్తం సభ్యుల కంటే కూడా చాలా ఎక్కువ! దేశవ్యాప్తంగా మా పార్టికి ఉన్న ఎమ్మెల్యేల్లో 27 శాతం, ఎమ్మెల్సీల్లో ఏకంగా 40 శాతం ఓబీసీలే. మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మాత్రం కేవలం మైనారిటీల సంతుష్టికరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను లేవనెత్తుతూ ఉంటుంది‘ అని నడ్డా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు మహిళా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ను నడ్డా తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడచుకుంటుందన్నారు. మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందడం బీజేపీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్నదే సరైన, అత్యంత దగ్గర విధానమని చెప్పారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం లాంఛనమేమని భావి స్తున్నారు. అనంతరం మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన గణన గణాంకాల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. వాగ్వాదం రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వా గ్వాదం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. బిల్లు అమలు కాలావధిపై విపక్షాల విమర్శలను నడ్డా విమర్శించడం ఇందుకు దారితీసింది. ఖర్గే జోక్యం చేసుకుంటూ, బీజేపీకి దమ్ముంటే రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని సవాలు చేశారు. -
మోదీతో జేపీ నడ్డా, అమిత్ షా కీలక భేటీ.. గంటన్నరపాటు చర్చ..
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. మోదీ నివాసంలో ప్రధానితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటన్నరపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకురావాల్సిన బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రం ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. కాగా, ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ఆదిత్య–ఎల్1 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం -
Seva Pakhwara: ప్రజాసేవలో నిమగ్నమవుదాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జన్మది నాన్ని పురస్కరించుకుని ’సేవా పఖ్వారా’ పేరుతో దేశవ్యాప్తంగా 15 రోజులపాటు ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా ప్రజాసేవా కార్యాక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల పారీ్టల శాఖలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా డ్రైవ్లు నిర్వహించాలని జేపీ నడ్డా బీజేపీ శ్రేణులను ఆదేశించారు. ఆయుష్మాన్ కార్డులు లేని వారికి వాటిని అందించడంలో సహకరించాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరుగున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మోదీ జన్మదిన వేడుకలకు నిర్వహించాలని చెప్పారు. ప్రధానిగా తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన విజయాలు, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని çకోరారు -
నాణేనికి అటు.. ఢిల్లీలో చంద్రబాబు డ్రామా!
సాక్షి, అమరావతి: పార్టీ భవిష్యత్పై ఆశలు ఆవిరవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పెద్ద డ్రామానే నడిపారు! ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని ఇందుకు వినియోగించుకున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత రెండో రోజు ఢిల్లీలో ఎంపిక చేసుకున్న విలేకరుల సమక్షంలో బీజేపీపై చంద్రబాబు ప్రేమ బాణాలు విసరడం చర్చనీయాంశమైంది. తాను మొదటి నుంచి కేంద్రంలో పొత్తులోనే ఉన్నానంటూ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ప్రత్యేక హోదా కోసమే గతంలో తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటూ తాజాగా చంద్రబాబు మరోసారి నాలుక మడతేశారు. ‘హోదా ఏమైనా సంజీవనా..? ప్యాకేజీ అంతకంటే మెరుగైనదంటూ అధికారంలో ఉండగా అర్థరాత్రి తాను ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం ప్రజలకు గుర్తుండదనే భ్రమతో తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టిన విషయం జనం మది నుంచి చెదిరిపోలేదు. రామోజీరావు, యనమల రామకృష్ణుడు వియ్యంకులను కాంట్రాక్టర్లుగా ప్రవేశపెట్టి ప్రాజెక్టు సొమ్ముని ఏటీఎంలా వాడుకుని డబ్బులు దండుకున్న విషయాన్ని ప్రజలెవరూ ఎప్పటికీ మరువలేరు! ఇవన్నీ ఎవరికీ గుర్తుండవనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడారు! ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు ఎన్డీఏ నుంచి బయటకు చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని అమరావతి పేరుతో భారీ అంతర్జాతీయ స్కామ్కు తెరతీయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజధాని ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటపడడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లి విరిసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వంపై మళ్లించడం కోసం తన పాలన చివరి సంవత్సరంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా ఎన్నికల్లో ఆయన అంచనాలు బెడిసికొట్టి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు వెంటనే బీజేపీలోకి తన కోవర్టులను ప్రవేశపెట్టారు. తన మిత్రుడైన పవన్ కళ్యాణ్ను సైతం కాషాయ ఫ్రంట్లో చేర్చారు. ఘోర ఓటమి తర్వాత మళ్లీ ఎలాగైనా బీజేపీ పంచన చేరడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలకు తోడు తాజాగా పురందేశ్వరితో రాజీ చేసుకుని బీజేపీతో పొత్తు అవసరాలకు వాడుకున్నారు. ఇటీవలే బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి కుటుంబంతో చంద్రబాబుకు రాజీ కుదిరింది. బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు సహకరించేందుకు పురందేశ్వరి అంగీకరించారు. అందులో భాగంగానే ఎనీ్టఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్రబాబును దగ్గర చేసేందుకు ఆమె తాపత్రయపడ్డారు. నాణెం విడుదల కార్యక్రమానికి సతీమణిని పిలవరా? పురందేశ్వరి చంద్రబాబు ఏజెంటులా పనిచేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమాన్ని ఆయన సతీమణిని పిలవకుండా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ను చివరి దశలో వంచించి వేధించిన కుటుంబ సభ్యులంతా ఇప్పుడు మరోసారి ఆయన భార్యను అవమానించారు. వేలాది మంది సమక్షంలో లక్ష్మీ పార్వతిని తన భార్యగా ఎన్టీఆర్ బహిరంగంగానే ప్రకటించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఆమెను కార్యక్రమానికి రానివ్వకుండా గూడుపు ఠాణి చేసి కేవలం చంద్రబాబుకు సన్నిహితులైన కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చేశారు. ఇందులో ఎలాంటి గూడుపుఠాణి లేకపోతే లక్ష్మీపార్వతిని పిలవవచ్చు కదా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఆ వంకతో నడ్డాతో చంద్రబాబు భేటీ ఇక ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం వంకతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు వంగి వంగి మంతనాలాడారు. ఈ భేటీలో టీడీపీ కోవర్టులు తప్ప మిగిలిన పాత బీజేపీ నేతలు ఎవరూ లేకపోవడం కొసమెరుపు. అక్కడ చంద్రబాబు తన పొత్తు ప్రతిపాదనలను నడ్డా ఎదుట పెట్టి ఎలాగైనా పొత్తు కుదిరేలా చూడాలని కోరారు. నడ్డా నుంచి ఆశించిన స్పందన వచ్చిందో లేదో తెలియదు గానీ రెండో రోజు చంద్రబాబు ఎంపిక చేసిన విలేకరుల కోసం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ సర్కార్పై తన ప్రేమను చాటుకున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మంచి సంబంధాలు అవసరమని తాజాగా చంద్రబాబు ప్రవచించారు. చంద్రబాబు తాను సీఎంగా ఉండగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు నల్లజెండాలు ఎగరేయడం, నిరసన తెలియచేస్తూ హోర్డింగ్లు పెట్టడం, బీజేపీ అగ్రనేత అమిత్షా కారు మీద తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన విషయాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మరోసారి ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకున్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం కార్యక్రమాన్ని తన పొత్తు చర్చల కోసం వినియోగించుకుని మరోసారి ఆయనకు వెన్నుపోటు పొడిచారు. -
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్!
సాక్షి, ఢిల్లీ: దేశంలో ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇక, గెలుపు గుర్రాల కోసం కమలదళం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. వివరాల ప్రకారం.. బీజేపీ నేతలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. దీంతో, ఎన్నికల బరిలో కమలం పార్టీ నుంచి ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులు ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లలో అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో వారి తర్వాతే లిస్ట్.. మరోవైపు.. తెలంగాణలో కూడా బీజేపీ స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. కాగా, ఈరోజు జరిగే సమావేశంలో మాత్రం తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులపై పార్టీ హైకమాండ్ ఇంకా దృష్టిసారించలేదని సమాచారం. ఇక, ఇటీవలే తెలంగాణలో బీజేపీ చీఫ్ను పార్టీ అధిష్టానం మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్రెడ్డి ఎంపికయ్యారు. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బీజేపీ లిస్ట్ను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం హైకమాండ్ ఫోకస్పెట్టినట్టు సమాచారం. మిజోరంతో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఐదు రాష్ట్రాలు మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఈసారి విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మిజోరంలో ఈ నెల లోక్సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ ఎంఎన్ఎఫ్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. కూటమిలో విభేదాలను ఎత్తిచూపుతూ మణిపూర్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ విమర్శించింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో కూడా హోరాహోరీ పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు -
'ఓటింగ్కు భయపడ్డారు.. సభ మధ్యలోనే వెళ్లిపోయారు..'
కోల్కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ రోజు బెంగాల్లో నిర్వహించిన పశ్చిమ బెంగాల్ క్షేత్రీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్లో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. #WATCH | PM Modi addressing BJP's Kshetriya Panchayati Raj Parishad in West Bengal, via video conferencing "We defeated the opposition's no-confidence motion in Parliament and gave a befitting reply to those spreading negativity in the entire nation. The members of the… pic.twitter.com/tZSgBjehkH — ANI (@ANI) August 12, 2023 అవిశ్వాస తీర్మాణంతో దేశంలో బీజేపీపై దుష్ప్రాచారం లేయాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. విపక్ష సభ్యులు సభ మధ్యలోనే వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఓటింగ్ వేయడానికి భయపడ్డారని ఆరోపించారు. అవిశ్వాసంలో ప్రతిపక్షాలను ఓడించామని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కోల్కతా ఎయిర్పోర్టులో దిగారు. రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టనున్న పంచాయత్ కాన్ఫరెన్స్లో నడ్డా పాల్గొంటారు. బెంగాల్ బీజేపీ కోర్ కమిటీ, ఎంపీల మీటింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji was warmly greeted by @BJP4Bengal State President @DrSukantaBJP Ji alongwith other party leaders and karyakartas upon his arrival in Kolkata, West Bengal. pic.twitter.com/uuu8G8ojWK — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 బెంగాల్లో ఆగష్టు 12న తూర్పు పంచాయతీ రాజ్ పరిషత్ వర్క్షాప్ను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్లతో సహా తూర్పు ప్రాంతానికి చెందిన దాదాపు 134 వర్కర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్లతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వర్చుల్గా పాల్గొననున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji's Public Programs in West Bengal on 12th August 2023. Watch Live- . https://t.co/YU8s4nWcrF . https://t.co/qpljG4G7Jz . https://t.co/NPs3aOvCXh pic.twitter.com/uxx2XD3byf — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
బండి సంజయ్కు కీలక పదవి..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మాజీ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు హైకమాండ్ కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ నాయకత్వంలో చోటు కల్పించింది.ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. - ఇదే సమయంలో తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. - అయితే, ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్ను ఇన్చార్జ్గా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30 — BJP (@BJP4India) July 29, 2023 - మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఈటల రాజేందర్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. - అయితే, తెలంగాణలో ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ను తప్పించిన విషయం తెలిసిందే. అనంతరం, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి తెలంగా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్కు ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీజేపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గేందుకే సంజయ్కు కీలక పదవి ఇచ్చినట్టు పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కారు దిగితే కష్టమే.. రేవంత్ టీమ్ ప్లాన్ వర్కౌవుట్ అవుతుందా? -
అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అందరితో చర్చించాకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులపై అధిష్టానానికి నివేదిక అందించారు. పొత్తుల గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని, ఎన్నికలకు ముందు పొత్తుల గురించి నిర్ణయం ఉంటుందని పురందేశ్వరి భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ను కలిసి ఏపీ ఆర్ధిక పరిస్థితులను వివరించానని పురందేశ్వరి తెలిపారు. ‘నేనేం తప్పులు చెప్పలేదు’ ఇటీవల మీడియా సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి తాను తప్పులు చెప్పలేదని.. 2023 జూలై నాటికి ఏపీకి రూ.10,77,006 కోట్ల అప్పు ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్రంలో చిన్న సన్నకారు కాంట్రాక్టర్లకు రూ.71 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. 15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను అనధికారికంగా వాడటంపై సర్పంచ్లకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. నిధులు దారి మళ్లించి అప్పులు తీసుకువచ్చి ఆ భారాన్ని ప్రజలపై రద్దుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదని.. అప్పులు మాత్రమే ఉన్నాయని పురందేశ్వరి విమర్శించారు. -
ఎన్డీయే బల ప్రదర్శన
న్యూఢిల్లీ: బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీకి దీటుగా అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) తన బలాన్ని ప్రదర్శించాలని ఉవి్వళ్లూరుతోంది. మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరుగనుంది. మరికొన్ని కొత్త పార్టీలు సైతం కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), ఒ.పి.రాజ్భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్సీ, హిందూస్తానీ అవామ్ మోర్చా(సెక్యులర్) వంటి పార్టీలు అధికార కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కొత్త పార్టీల రాకతో తమ కూటమి మరింత బలోపేతం కావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు భంగపాటు తప్పదని ఎన్డీయే భాగస్వామ్యపక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగే భేటీకి 38 పార్టీలు హాజరు కానున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ప్రకటించారు. ఆయా పార్టీలకు ఆహా్వనాలు పంపించామని చెప్పారు. శివసేన(ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), రా్రïÙ్టయ లోక్ జనతాదళ్(ఆర్ఎల్జేడీ) తదితర పక్షాలు సైతం తొలిసారిగా ఎన్డీయే సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఇందులో కొన్ని పార్టీలు ఇప్పటికే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. వాస్తవానికి కొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. జేడీ(యూ), శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), అకాలీదళ్ దూరమయ్యాయి. వీటి స్థానంలో కొత్త పార్టీలు తమ కూటమిలో అడుగు పెతుండడం ఎన్డీయేలో కొత్త ఉత్సాహం నింపుతోంది. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకేతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలు కూడా ఎన్డీయే సమావేశానికి హాజరు కానున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైన తర్వాత అధికార కూటమి సమావేశం భారీ స్థాయిలో జరుగుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ భేటీలో వ్యూహ రచన చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఎన్డీయే భేటీకి 38 పార్టీలు.. ప్రతిపక్ష కూటమికి 26 పార్టీల మద్దతు!
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అటు అధికార బీజేపీ, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలు పావులు కదుపుతున్న వేళ.. అధికార బీజేపీ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రధాన విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.ఎన్నికల కార్యచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్రపక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తొలుత బిహార్లోని పాట్నాలో మెగా విపక్షాల భేటీ నిర్వహించగా.. తాజాగా 26 ప్రతిపక్షాలు బెంగుళూరు వేదికగా రెండ్రోజులు(సోమవారం, మంగళవారం) సమావేశం కానున్నాయి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మిత్ర పక్షాలతో కలిసి బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే కూటమి(నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) భేటీ కానుంది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే పరిధి క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రజల్లో సానుకూల ప్రభావం ఉందని, ఇది తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. చదవండి: బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ.. లైవ్ అప్డేట్స్.. ఇక ఎన్డీయే సమావేశానికి ఇప్పటికే ఉన్న మిత్ర పక్షాలతోపాటు కొత్తగా చేరిన పార్టీలు సైతం హాజరుకానున్నాయి. ఎన్డీయే మీటింగ్కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు సైతం హాజరు కానున్నారు. అజిత్ పవార్తో కలిసి ఎన్డీయే భేటీకి వెళ్లనున్నట్లు ప్రఫుట్ పటేల్ పేర్కొన్నారు. వీరితోపాటు బిహార్లోనూ మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ ఓబీసీ నాయకుడు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కూడా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందించింది. ఇదిలా ఉండగా సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్ భర్ ఎన్డీయేలో చేరుతున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తూర్పు ఉత్తర ప్రదేశ్లోని ఓబీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఎస్బీఎస్పీ.. 2019లో ఎన్డీయే నుంచి వైదొలొగింది. తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుతుంది. చదవండి: మరోసారి శరద్ పవార్ను కలిసిన అజిత్ పవార్.. -
18న ఎన్డీఏ భేటీకి రండి
న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్కూ లేఖ అందింది. ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి. -
గులా'బీ టీమ్' గందరగోళం ఎట్లా? అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల మొర
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పట్ల బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న ప్రచారంతో పార్టీలో గందరగోళం నెలకొందని.. రెండింటి మధ్య అవగాహన కుదిరిందన్న ప్రచారం ఇబ్బందికరంగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచూ బీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలపై ఘాటుగా ఆరోపణలు చేయడానికే పరిమితమవుతూ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయని వివరించినట్టు సమాచారం. దీనిపై స్పందించిన నడ్డా.. అన్ని అంశాలూ తమ దృష్టిలో ఉన్నాయని, ఆందోళన చెందవద్దని సూచించినట్టు తెలిసింది. అవినీతికి పాల్పడే వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. తగిన సమయంలో కచ్చితంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నట్టు సమాచారం. నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లి, ప్రజల మద్దతు కూడగట్టాలని.. తాము వెంటే ఉండి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్చార్జులతో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినప్పుడు రాష్ట్ర నేతలు పలు అంశాలను లేవనెత్తగా.. జాతీయ పార్టీ తరఫున నడ్డా స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి ఉండదు! భేటీ సందర్భంగా బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఇబ్బందికరంగా మారిందని రాష్ట్ర ముఖ్యనేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు నడ్డా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం. దీనిపై స్పందించిన నడ్డా.. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పార్టీ నాయకత్వం దృష్టిలో అన్ని అంశాలు ఉన్నాయి. తగిన సమయంలో కచ్చితంగా అవసరమైన చర్యలు ఉంటాయి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. పార్టీ బలోపేతం, ప్రజల్లో మద్దతు కూడగట్టడంపై సమన్వయంతో ఐక్యంగా కృషి చేయండి’’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏపీలో పార్టీ పరిస్థితిపైనా చర్చ భేటీ సందర్భంగా ఏపీలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై చర్చకు వచ్చినట్టు తెలిసింది. అక్కడ చేపడుతున్న కార్యక్రమాలు, వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతున్నదన్న అంశాలు, ఇతర సంస్థాగత పరిస్థితులను ఆ రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి రాజకీయంగా పెద్దగా ఆశాజనకంగా లేదని.. క్షేత్రస్థాయిలో అంతగా బలపడనందున వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు తక్కువనే చర్చ జరిగినట్టు తెలిసింది. -
ఆరు గంటలు సాగిన మీటింగ్.. స్టేట్ అధ్యక్షులపై జేపీ నడ్డా సీరియస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఇక, ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు జేపీ నడ్డా క్లాస్ ఇచ్చారు. వివరాల ప్రకారం.. ఈ సమావేశంలో దక్షిణాది ఎజెండాను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై ముఖ్యంగా చర్చించారు. ఈ సందర్భంగానే పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతం ఉందని ప్రశంసించారు. పార్టీని పటిష్ట పరిచి బూత్ కమిటీలు పూర్తి చేయాలని నేతలకు నడ్డా ఆదేశించారు. దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక, ఈ సమావేశంలో బీజేపీ 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ గెలవాలని లేదా?.. హైకమాండ్ను ప్రశ్నించిన మాజీ ఎంపీ.. -
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్.. మరికాసేపట్లో 11 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షు లు, సంస్థాగత ప్రధానకార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ బేటీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరు కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో పాటు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల నుంచి గతంలో కంటే అధికంగా లోక్సభ సీట్లను గెలుచుకోవడంపై అనుసరించాల్సిన వ్యూహాలపైనా ప్రణాళికలు రచించనున్నారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శులు తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాశ్, తెలంగాణ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్రపార్టీ సంస్థాగత సహ ఇన్చార్జ్ అర్వింద్ మీనన్ హాజరవుతారు. జాతీయ కార్యవర్గసభ్యులతో జేపీ నడ్డా భేటీ! ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం నోవాటెల్ హోటల్లో తెలంగాణకు చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులతో జేపీనడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలో ముఖ్యనేత లు నిర్వహించాల్సిన పాత్ర, ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని సమా చారం. సోమవారంపార్టీ పదాధికారులు, ముఖ్య నేతలతో ప్రకాశ్ జవడేకర్, సంస్థాగత ఇన్చార్జ్ సునీల్ బన్సల్ సమావేశం కానున్నట్లు తెలిసింది. మీటింగ్ లో పాల్గొనబోయే రాష్ట్రాలివే.. 1. తెలంగాణ 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. అండమాన్ 5. లక్ష్యద్వీప్ 6. పాండిచ్చేరి 7. మహారాష్ట్ర 8. ముంబై 9. గోవా 10. తమిళనాడు 11. కేరళ చదవండి: స్వాగతానికి అధికారులు మాత్రమే.. ప్రధాని సభకు దూరంగా వివేక్ వెంకటస్వామి! -
విపక్షాల ఐక్యతకు కౌంటర్గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
జేపీ నడ్డాను కలిసిన పురందేశ్వరి
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి గురువారం కలిశారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత జేపీ నడ్డాను పురందేశ్శరి మర్యాదపూర్వకంగా కలిశారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయాన్ని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షరాలిగా నియమించినందుకు నడ్డాకు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని ఆమె వెల్లడించారు. Met @JPNadda Ji and expressed my heartfelt gratitude for the trust imposed on me. I assured him of my unwavering commitment towards the responsibility. Even as I work to strengthen BJP in AP, I shall also work towards safeguarding the interests of AP and Andhrites. #BJP pic.twitter.com/LeYCzQ8P6F — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) July 6, 2023 -
బీజేపీలో మరో బిగ్ ట్విస్ట్.. కోమటిరెడ్డికి జాతీయ పదవి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీజేపీలో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి ఇచ్చింది. కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, ఇకపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించున్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ను వీడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ హస్తం గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే, రాజగోపాల్రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వినిపించాయి. దీనిపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా, రాజగోపాల్ కూడా కొంత కాలంగా బీజేపీ హైకమాండ్పై సీరియస్గా వ్యవహరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటి చేయడంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి రాజగోపాల్రెడ్డి వెళ్లిపోకుండా ఇలా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. అంతకుమందు.. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలో పార్టీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ను తొలగించి.. స్టేట్ చీఫ్ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. అంతేకాకుండా, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు -
కమల దళపతి కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు, ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అనుభవం, అణుకువ ప్రామాణికంగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సహా పలు కమిటీల నియామకంపై బీజేపీ అధిష్టానం గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు కొనసాగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లు ఈ అంశాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే మార్పు చేర్పులు అవసరమని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించారు. రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని కొందరు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నేతల మధ్య సమన్వయ లేమిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని, సంజయ్ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కాగా ఈటల రాజేందర్, డీకే అరుణ సహా మరొకొందరి పేర్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి పార్టీలో సుదీర్ఘ అనుభవం, అణుకువ, విధేయతలు ప్రామాణికంగా తీసుకుని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. యువ మోర్చా రాష్ట్ర, జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం, మూడుసార్లు ఎమ్మెల్యే ఉండటం, గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కిషన్రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే కిషన్రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీలో జోడు పదవుల వ్యవహారం లేనందున ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. దీనిపైనా రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈటలకు బాధ్యతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలినుంచి బలమైన పోటీదారుగా ఉన్న ఈటల రాజేందర్ను అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా బీజేపీ నియమించింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారవడం, సీఎం కేసీఆర్ను ఎదిరించి పార్టీలోంచి బయటకు వచ్చి పోరాడుతున్న నేతగా పేరుండటం, అన్ని పార్టీలు, వర్గాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈటల ఎంపికకు కలిసొచ్చిందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ప్రచార బాధ్యతలు, వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై పట్టు ఉండే ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. నడ్డాతో సంజయ్ భేటీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన బండి సంజయ్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి సంజయ్ రాజీనామాను తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ఎంపికకు గల కారణాలు, మున్ముందు పార్టీలో, కేంద్ర పదవుల్లో కల్పించే ప్రాధాన్యం, ఇతర అంశాలను సంజయ్కు నడ్డా వివరించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం నడ్డాతో భేటీ అయినట్లు తెలిసింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఆయనకు కేబినెట్లో చోటు దక్కుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు అవుట్?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి మార్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం ముగిసింది. అయితే మరోసారి బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం లేదంటూ జాతీయ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. కాగా సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే.. కీలక బాధ్యతల అప్పగింత హామీని ఆయనకు అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కాషాయ పార్టీకి కొత్త బాస్ రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి, జీవీఎల్, పురందేశ్వరి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సాయంత్రం లోపు క్లారిటీ రానుంది. -
బండికి 100 కోట్లు ఎక్కడివి?
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్రావు..సోమవారం పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పత్రికల్లో రూ.100 కోట్ల విలువైన యాడ్లు ఇచ్చారని, అసలు భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. రెండు, మూడేళ్లయినా పార్టీలో పదవులను భర్తీ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఏయే పదవులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలియదని విమర్శించారు. పార్టీకి ఎల్పీ నేత లేరన్న విషయమూ నడ్డాకు తెలియదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో తనను చూసి ఓట్లేశారు తప్పితే.. పార్టీ గుర్తును చూశో, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్ను చూశో కాదని స్పష్టం చేశారు. తాను కోరిన పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే తన దారి తనదేనని అల్టిమేటమ్ ఇచ్చారు. కిషన్రెడ్డిని కలిసిన కొద్ది సేపట్లోనే .. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలో మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచిన నేపథ్యంలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు రఘునందన్రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 3 గంటల సమయంలో కిషన్రెడ్డి నిర్వహించిన ప్రెస్మీట్లోనూ ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అక్కడే ఉన్న మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. అధ్యక్షుడి మార్పు విషయంలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనని, సంజయ్ను మార్చేందుకే అధిస్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో సంజయ్ది స్వయంకృతాపరాధం అన్నారు. ‘పార్టీల ఇన్చార్జిలు తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్ల ఫొటోలు పెట్టి రూ.100 కోట్లతో పత్రికల్లో యాడ్లు వేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నా ఫోటోనో, ఈటల రాజేందర్ ఫొటోనో వేయలేదు. తరుణ్ఛుగ్నో, బన్సల్ను చూసి ప్రజలు ఓట్లేయరు కదా..’అని రఘునందన్ ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడికే తెలియదంటే ఎలా..? పార్టీ శాసనభా పక్షనేత పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా దానిపై బండి సంజయ్ నిర్ణయం తీసుకోలేక పోయారని, ఈ విషయమై నడ్డాను అడిగితే.. ’అవునా..నిజమా’అంటూ తననే ప్రశ్నించారని రఘునందన్ తెలిపారు. ‘పదవుల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడికే తెలియకుంటే ఎలా? అట్లుంది పార్టీ పరిస్థితి..’అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్లీడర్ విషయంలోనూ నాన్చుడు ధోరణినే అవలంబించారని, చివరకు ఫ్లోర్ లీడర్ పదవి అడిగిన కార్పొరేటర్ చనిపోయినా, ఇంతవరకు దానిపై నిర్ణయమే లేదని విమర్శించారు. పదేళ్లుగా కష్టపడుతున్నా.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నానని రఘునందన్ అన్నారు. మధ్యలో వచ్చిన నేతలు పదవులకు పనికొస్తారు కానీ నేను పనికిరానా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను సైతం అర్హుడనేనని అన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి, జాతీయ అధికార ప్రతినిధి పదవి, శాసనసభాపక్ష నేత పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తన దారి తనదేనంటూ వ్యాఖ్యానించారు. కీలక పదవులకు తనకు కులమే శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేక పోయారు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను పూర్తిగా సొంత బలంతోనే గెలిచానని రఘునందన్ చెప్పారు. ‘దుబ్బాకలో నేను స్వయంశక్తితో గెలిచా. నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ పార్టీ గుర్తు చివరి అంశమే. మళ్లీ నా సొంత బలంతోనే దుబ్బాకలో గెలుస్తా’అని స్పష్టం చేశారు. తన గెలుపు తర్వాతే ఈటల పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి భుజంపై చేయి వేసి మరీ నేను గెలిపిస్తానని అమిత్షా ప్రకటించారని, కానీ గెలిపించలేకపోయారని విమర్శించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని అన్నారు. -
Telangana: అసమ్మతి శ్రుతి పెంచుతున్న కమలనాథ స్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర నేతలు చేస్తున్న రచ్చ, పార్టీలో ఇటీవలి పరిణామాలతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఏర్పడి 43 ఏళ్లు గడుస్తున్నా గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదనే అభిప్రాయం కొందరు సీనియర్లలో వ్యక్తమౌతోంది. నేతల మధ్య అభిప్రాయభేదాల వంటివి ఉన్నా ఇప్పటిలా ముఖ్యనేతలు గ్రూపులుగా, వర్గాలుగా ఏర్పడటం వంటివి చోటు చేసుకోలేదు. బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగిన సందర్భాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సైతం బహిరంగంగా, ట్విట్టర్ లేదా ఏదో ఒక పరోక్ష రూపాల్లో అసంతృప్తి గళం విన్పించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. చల్లార్చలేదు..చక్కదిద్దలేదు..: వాస్తవానికి పలువురు ముఖ్యనేతల్లో అసంతృప్తి, సఖ్యత కొరవడడం, పాత–కొత్త నాయకుల మధ్య సమన్వయం లేమి, గ్రూపులు లేదా వర్గాలను ప్రోత్సహించే విధంగా కొందరు వ్యవహరించడం, రాష్ట్ర రాజకీయాల్లో తామే ఫోకస్లో ఉండేలా, మీడియాలో తమకే ప్రచారం లభించేలా కార్యక్రమాల నిర్వహణ వంటివి రాష్ట్ర బీజేపీలో కొన్నినెలలుగా సాగుతున్నాయి. అయినా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అసంతృప్తిని చల్లార్చేందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర పార్టీలో సమన్వయానికి తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాష్, అరవింద్ మీనన్లను ఇన్చార్జిలుగా నియమించినా, వారెప్పుడూ పార్టీలోని అంతర్గత సమస్యలు, నేతల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పైగా ఒకరిద్దరు ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా వత్తాసు పలకడం, మద్దతు తెలపడం వంటివి చేయడం వల్ల కూడా పార్టీలో పరిస్థితులు దిగజారాయని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత గందరగోళంగా తయారయ్యాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, సరైన విధంగా స్పష్టత ఇవ్వకపోవడం కూడా కేడర్తో పాటు ముఖ్యనేతలను సైతం అయోమయానికి గురి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఈ నెల 8న వరంగల్లో ప్రధాని మోదీ సభకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో..లేదో’ అంటూ ఆదివారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మాటల మంటలు.. ఇటీవల ఓ దున్నపోతును వెనకనుంచి తన్ని వ్యానెక్కించే వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి.. రాష్ట్ర పార్టీకి ఇదే ట్రీట్మెంట్ అవసరమంటూ వ్యాఖ్యానించడం కలకలం సృష్టించింది. అంతకు కొన్నిరోజుల ముందే.. సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో సంజయ్కు అనుకూలంగా ఉండే వారితో తన నివాసంలో జితేందర్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలకు జాతీయపార్టీ అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తం అయినట్టు వార్తలొచ్చాయి. అంతకు ముందు ఓ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి, ఓ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఇద్దరు మాజీ ఎంపీలు, ఓ ఎమ్మెల్యే విడివిడిగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలగజేశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం, రాష్ట్ర అధ్యక్షుడి వైఫల్యాలు, పార్టీలో చేరికలు లేకపోవడం, ముఖ్య నాయకత్వం ఒంటెద్దు పోకడలు, ఇతర అంశాలపై చేసిన వ్యాఖ్యలు వారిలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయని అంటున్నారు. ఇక ఢిల్లీలో అమిత్షా, జేపీ నడ్డాలతో ఈటల, రాజ్గోపాల్రెడ్డి ప్రత్యేక భేటీల సందర్భంగా, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నడ్డాతో పలువురు ముఖ్యనేతలు సమావేశమైనప్పుడు కూడా నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నడ్డాతో జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు విడివిడిగా సమావేశమై తమ అసంతృప్తికి గల కారణాలను, పార్టీలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను గురించి విడమరిచి చెప్పినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. తాజాగా ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు ఢిల్లీలో అసంతృప్తి స్వరం తీవ్రస్థాయిలో విన్పించడం బీజేపీలో మరోమారు కలకలం రేపింది. తనకు తగిన ప్రాధ్యానత, గుర్తింపు లభించడం లేదని పేర్కొంటూ ప్రధాని మోదీ మినహా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అగ్రనేత అమిత్షాల తీరుపై సైతం ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీ కేడర్ను విస్మయానికి గురి చేసింది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో నెలకొన్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నాగర్ కర్నూల్ బహిరంగ సభలో ఏం జరిగింది!,కాషాయం పార్టీలో కొత్త జోష్
కర్నాటక ఫలితాలతో డీలాపడ్డ కమలం పార్టీకి నాగర్ కర్నూల్ సభ ఊపిరి పోసిందా? తెలంగాణలో అధికారం సాధించాలన్న సంకల్పానికి జేపీ నడ్డా సభ బలం చేకూర్చిందా? చేరికలు లేక, రాష్ట్ర నాయకత్వంలో విభేదాలతో గందరగోళంగా ఉన్న బీజేపీకి పార్టీ చీఫ్ రాకతో జోష్ పెరిగిందా? టీ.బీజేపీకి నాగర్ కర్నూల్ బహిరంగసభ ఇచ్చిన సందేశం ఏంటి? సీనియర్ నేతలున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కూడా కేడర్లో ఊపు తెచ్చింది. పాలమూరు జిల్లా తమకు అత్యంత ముఖ్యమైనదని బీజేపీ పెద్దలు చాటారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డి నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పార్టీకి హైప్ తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కేడర్లో నిరాశ అలుముకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకురావడానికి పార్టీ పెద్దలు సీరియస్గానే ప్రయత్నించారు. కాని ఆయన పాతగూటికే చేరాలని నిర్ణయించుకున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణలో పార్టీ నేతలు, కేడర్ మీద ప్రభావం చూపించింది. పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. కేడర్ నిస్సత్తువకు గురైంది. మరోవైపు కర్నాటకలో సాధించిన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కర్నాటక సరిహద్దులోనే ఉన్న పాలమూరు జిల్లాలో కచ్చితంగా కాంగ్రెస్ ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ నాగర్కర్నూల్లో బీజేపీ నవసంకల్ప్ యాత్ర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకు రావడం, ప్రజలు కూడా భారీగా తరలిరావడంతో బీజేపీ కేడర్లో ఉత్సాహం ఉప్పొంగింది. తెలంగాణలో పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన ప్రయత్నం పాలమూరు జిల్లాలో మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ విజయాలపై కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడర్ మొత్తం ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర నాయకత్వం సూచించింది. జిల్లా కేడర్లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు నడ్డా. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద నిరాశలో కూరుకుపోయిన కమలం కేడర్కు నడ్డా బహిరంగసభ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. చదవండి: కాంగ్రెస్కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం.. పక్క పార్టీల నాయకులకు గాలం -
బీజేపీ కీలక సమావేశం.. ఐదు రాష్ట్రాల్లో మార్పులు ఉంటాయా?
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం తలపెట్టింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంఛార్జ్లు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇంఛార్జ్లతో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ సమావేశం కానున్నారు. కాగా, ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరుగనుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వరకు రెండు దఫాలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. మొదట జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనుంది. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలోనే మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి నేతలు.. ఒక నివేదిక రూపంలో సమర్పించనున్నారు. ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలో రాజకీయ పరిస్థితులపై ప్రత్యకంగా చర్చించనున్నట్టు సమాచారం. ఎన్నికల వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు బీజేపీ పెద్దలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. హైఓల్టేజ్ పాలిటిక్స్ -
మమ్మల్నెందుకు పట్టించుకోరు.. బీజేపీలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనేంత స్థాయి వరకు నేతలు గళం విప్పుతున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో అధికమౌతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం ఈ తరహా నేతల జాబితాలో ఉండటం గమనార్హం. వారితో మాట్లాడి.. మమ్మల్ని విస్మరించారు! పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఇటీవల వారిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్యనేతలు.. తమ అసంతృప్తిని తెలుసుకునేందుకు నాయకత్వం ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పెద్ద ఊపు తెచ్చిన తనను ఎమ్మెల్యేగా, ముఖ్యనేతగా పరిగణించకుండా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ ఫైర్.. రాష్ట్ర అధ్యక్షుడి తీరును, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి పలుమార్లు అమిత్షా, నడ్డాలకు తెలియజేసినా ఓపిక పట్టాలనే సూచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ చర్యా తీసుకోలేదనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల, రాజ్గోపాల్రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారని, తనను మాత్రం పట్టించుకోలేదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత తనకు శాసన సభాపక్షపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి తనను విస్మరించడం, పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఆశించినా అవి జరగకపోవడం రఘునందన్లో అసంతృప్తిని మరింత పెంచిందని అంటున్నారు. తన కార్యకర్తలు, అనుయాయులు వెలిబుచ్చుతున్న అసంతృప్తినే తాను బయటకు చెబుతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి రాష్ట్ర బీజేపీపై వ్యంగ్య ధోరణిలో ఓ ప్రతీకాత్మక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడం పారీ్టలో దుమారాన్నే రేపింది. దున్నపోతును వెనుకనుంచి తన్ని వ్యాన్లోకి ఎక్కించే వీడియో పోస్ట్ చేసి, రాష్ట్ర నాయకత్వానికి ఇలాంటి చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేరుగా నడ్డా దృష్టికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగానూ పలువురు నాయకులు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించక పోవడంపై అసంతృప్తిని తెలియజేశారు. జాతీయ కార్యవర్గసభ్యులు డా.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు వేర్వేరుగా నడ్డాను కలుసుకుని వివిధ అంశాలపై తమ అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారు. రాష్ట్ర పార్టీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులతో నాయకులు సమైక్యంగా లేరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీలో సమష్టి నిర్ణయాలు కొరవడడంతో నష్టం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు. తీవ్ర అసంతృప్తి.. పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సంప్రదించకుండానే ముఖ్య నేతల భేటీలో నిర్ణయమంటూ ప్రకటనలు వెలువడుతున్నాయని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. తాము జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మాజీ ఎంపీలుగా, ఉద్యమకారులుగా ఉన్నా తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వడం లేదని, నష్టం కలుగజేసేలా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి వంటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలపై జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: చర్చనీయాంశంగా.. సామేలు రాజీనామా -
అంతర్గత విబేధాలు.. సైలెంట్ మోడ్లోకి ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ, అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీలోని కీలక నేతల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బండి సంజయ్కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మధ్య పొసగటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే సైలెండ్ మోడ్లోకి వెళ్లారు. ఆయనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన ఈ మధ్య పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్ రావుకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న రఘునందన్ రావు.. ఇదే విషయంపై ఇటీవల జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో పార్టీ నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను అధిష్ఠానం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. బండిని ఆ పదవి నుంచి మార్చేసి.. కేంద్రమంత్రి బాధ్యతలు ఇవ్వనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. బండి సంజయ్ను తప్పిస్తే.. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వనున్నారన్నది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
పొద్దుపోయేదాకా బీజేపీ మేధోమథనం
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు కొందరు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం. బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్ సివిల్కోడ్ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఔ ఐదు రాష్ట్రాలపై మేదోమధనం సార్వత్రిక ఎన్నికలతో పాటు రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం మేదో మధనం చేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలలో బిజీగా ఉండడంతో నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పొద్దు పోయే వరకు ప్రధాని నివాసంలో భేటీలో కీలకంగా చర్చించారు. ప్రధానంగా తెలంగాణ సహా పలు ఎన్నికల రాష్ట్రాలలో పార్టీ నాయకత్వంలో సంస్థాగత మార్పులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న కసరత్తు ఓ కొలిక్కిరాగా.. ఏ క్షణమైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. పార్టీలో, క్యాబినెట్లో మార్పుల చేర్పులపై, విపక్ష కూటమి బలపడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ పై చర్చించినట్లు సమాచారం. -
దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి..
న్యూఢిల్లీ: అమెరికా ఈజిప్టు పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధానమంత్రి దేశంలో ఏం జరుగుతోందని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఘాటుగా స్పందించారు. దేశంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మధ్యప్రదేశ్ కాదు ముందు మణిపూర్ వెళ్ళమని సలహా ఇచ్చారు. దేశం సుభిక్షంగా ఉంది.. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతించిన జేపీ నడ్డా సహా బీజేపీ శ్రేణులను ఆయన దేశం గురించి కుశలమడిగే ప్రయత్నంలో దేశంలో ఏం జరుగుతోందని అడిగారు. ప్రధాని ప్రశ్నకు బదులిస్తూ దేశంలో తొమ్మిదేళ్లుగా అభివృద్ధి గురించి ప్రజలకు కార్యకర్తలు నివేదిక సమర్పిస్తున్నారని.. దేశమంతా సంతోషంగానే ఉందని జేపీ నడ్డా తెలిపారు. మధ్యప్రదేశ్ కాదు మణిపూర్ వెళ్ళండి.. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాత్రం ప్రధాన మంత్రి అడిగిన ప్రశ్నకు ఒక వీడియో ద్వారా స్పందిస్తూ.. దేశంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి బదులుగా మణిపూర్ వెళ్లి చూడండి. ఆ రాష్ట్రం రావణకాష్టంలా మారి తగలబడిపోతోంది. ఇక బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదానికి ముస్లింలను బాధ్యులను చేస్తూ మీ ఐటీ బృందం తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. యూఎస్ ప్రెస్ కాన్ఫరెన్సులో మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడిగినందుకు పాపం జర్నలిస్టు సబ్రినా సిద్ధిఖీని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్న మీ ప్రధాన కార్యకర్తలపై వైట్ హౌస్ వర్గాలు మండిపడుతున్నాయని అన్నారు. प्रधान मंत्री जी आप जानना चाहते हैं ना कि ‘इंडिया में क्या चल रहा है’। तो प्रधान मंत्री जी, समझ लीजिए कि ‘इंडिया में फ़ौग चल रहा है…..’ pic.twitter.com/uT1QhlHViR — Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 27, 2023 ఇది కూడా చదవండి: ఎయిరిండియా నడి విమానంలో మలమూత్రవిసర్జన.. అరెస్ట్ -
బీజేపీలో కోల్డ్వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్గా మారింది. ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్తో.. -
మోదీ ది బాస్ అని ప్రపంచ దేశాల నేతలే కొనియాడుతున్నారు: నడ్డా
-
బీజేపీ వస్తే 'ధరణి బంద్'!
సాక్షి, నాగర్కర్నూల్: ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రాష్ట్రంలో రైతులను వేధింపులకు గురిచేసేందుకే ఈ పోర్టల్ను తెచ్చారని..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్తో పాటు బీఆర్ఎస్ పోర్టల్ కూడా బంద్ అవుతుందని చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్తరాగం ఎత్తుకున్నారని విమర్శించారు. పేరు మారినంత మాత్రాన వారి గుణం మారదని, ‘ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు.. భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇళ్లలోనూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజా, రైతు వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ‘నవ సంకల్ప బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు. విపక్షాల ప్రయాస ఫొటో సెషన్లకే పరిమితం దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని, వారి ప్రయాస అంతా ఫొటో సెషన్లకే పరిమితమవుతుందని నడ్డా విమర్శించారు. కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఠాక్రే పార్టీలన్నీ తమ కుటుంబాలను కాపాడుకునేందుకే తహతహలాడుతున్నాయని, ఒక్క బీజేపీ మాత్రమే దేశ ప్రజల హితం కోసం పనిచేస్తోందని చెప్పారు. మోదీ చేసిన అభివృద్ధిపై విమర్శలు చేయలేకనే, ఆయన కులం పేరుతో చాయ్వాలా అంటూ విపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం విషాన్ని మింగినట్టుగా విమర్శలను మింగుతూ నిరంతరం దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. మోదీ ముందుచూపుతో ఆర్థిక వ్యవస్థ పటిష్టం కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను సైతం తట్టుకుని మోదీ ముందు చూపుతో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చారని నడ్డా చెప్పారు. ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానంలో నిలిపారని అన్నారు. గతంలో దేశంలో 28 శాతం ఉన్న పేదరికం, మోదీ ప్రభుత్వ పథకాల ఫలితంగా 10 శాతానికి తగ్గిందని వివరించారు. గతంలో 97 శాతం మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు 97 శాతం ఫోన్లు దేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు. ‘దునియా మే మోదీ ఈజ్ ది బాస్, యువర్ హీరో, గ్లోబల్ లీడర్’ అంటూ మోదీని ప్రపంచ నేతలు కొనియాడుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని నడ్డా చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో చేయలేని పనులను కేవలం తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. తెలంగాణలో 65 ఏళ్లలో మొత్తం 2,500 కి.మీ. మేర జాతీయ రహదారులు వేస్తే, బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలోనే 2,500 కి.మీ రహదారులను నిర్మించామని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామంటూ గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునికీకరించడంతో పాటు కొత్తగా ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖలకు రెండు వందే భారత్ రైళ్లను నడిపిస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్– నల్లగొండ, హైదరాబాద్– వరంగల్ ఇండ్రస్టియల్ కారిడార్లు, రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేశామని చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ పాలన వస్తే ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో ఆలోచించాలని కోరారు. పోరాటవీరుడు నడ్డా: బండి సంజయ్ పదిహేనేళ్ల చిరుప్రాయంలోనే దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు జేపీ నడ్డా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో పోరాడుతూ బీజేపీని ప్రతి గడపకు చేర్చి ప్రపంచంలోనే శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దారని చెప్పారు. నాగర్కర్నూల్లో బీజేపీ ఎక్కడుందీ.. అని అంటున్న వాళ్లకు ఇక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూపించాలని అన్నారు. సభలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, మహేంద్రనాథ్ పాండే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, నేతలు జితేందర్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా
-
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది: జేపీ నడ్డా
Updates.. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది దిశగా సాగుతోందని, తెలంగాణ అభివృద్ధిలో మోదీ చేయాల్సింది అంతా చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూల్లోని నవ సంకల్పసభలో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. తెలంగాణకు మోదీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. 80 కోట్ల ప్రజలకు మోదీ ప్రభుత్వం రేషన్ ఇస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను కేంద్రం ఆదుకుంటోంది. మొత్తం ఐరోపా ఖండం కన్నా ఐదు రెట్ల మందికి రేషన్ అందుతోంది. దేశంలో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్ అందిస్తున్నాం. ఆయుస్మాన్ పథకంతో ఎంతోమందికి బీమా కల్పించాం. మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. ♦సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్కు వెళ్లనున్న జేపీ నడ్డా.. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ♦ సంపర్క్ సే సమర్థన్ ప్రచారంలో భాగంగా ఫిల్మ్నగర్లో క్లాసికల్ డ్యాన్సర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర జయంత్తో జేపీ నడ్డా, కిషన్రెడ్డి భేటీ అయ్యారు. మోదీ పాలనలో అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాలను ఆనంద శంకరకు అందించారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా: ప్రొ.నాగేశ్వర్ జేపీ నడ్డాతో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. ‘‘వివిధ అంశాలపై సమావేశంలో చర్చించాం. దేశవ్యాప్తంగా అనేకమందిని కలుస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కలిశారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా. ప్రజాస్వామ్యంలో ఇలా కలుసుకోవడం శుభపరిణామం. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిది’’ అని నాగేశ్వర్ పేర్కొన్నారు. ♦ప్రొఫెసర్ నాగేశ్వర్తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకానికి నాగేశ్వర్కు ఆయన అందించారు. నడ్డా వెంట తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు. ♦ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. ♦ ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందరావు, విజయశాంతి, వివేక్ తదితరులు ఉన్నారు. ♦ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా. ♦బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలులో బీజేపీ తలపెట్టిన సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ♦ అయితే, కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. ♦ జేపీ నడ్డా.. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు. నడ్డా పూర్తి షెడ్యూల్ ఇదే.. ♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్. ♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు. ♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్నగర్లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ను కలుసుకుంటారు. ♦ 3.50కి నోవాటెల్కు చేరుకుంటారు. ♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్కర్నూ ల్కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు. ♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. ♦ 6.15కు హెలి కాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్కు చేరుకుంటారు. ♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు. -
ఢిల్లీలో నడ్డాతో ముగిసిన ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీ
-
నేడు నాగర్కర్నూల్లో నవ సంకల్ప సభ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధా న్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమ న్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్ కర్నూల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్టీ ‘నవ సంకల్ప సభ‘గా పేరుపెట్టింది. మోదీ సర్కార్ విజయాలను చెప్పడంతో పాటు తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఆయన తీవ్రస్థాయిలో ఎండగడతారని పార్టీ వర్గాల సమాచారం. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాలనా విజయాలను వారికి వివరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేస్తారు. అలాగే మధ్యాహ్నం లేదా నాగర్కర్నూల్ సభ తర్వాత రాష్ట్ర ముఖ్యనేతలతో నడ్డా భేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సభ సక్సెస్తో చరిత్ర సృష్టిద్దాం: బండి సంజయ్ ‘నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ దమ్ము చూపే అవకాశం వచ్చింది. ఆదివారం జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి సత్తా చాటాలి’అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సంజయ్ మాట్లాడుతూ ‘ఒకవైపు బీఆర్ఎస్–కాంగ్రెస్లు కలసి బీజేపీని దెబ్బతీసేందుకు ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్–కాంగ్రెస్ ఎప్పటి నుంచో కలిసే పోటీ చేస్తున్నయ్. పార్లమెంట్ లోపల, బయటా కలిసే బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు’అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నడ్డా బహిరంగ సభ పార్టీకి కీలకం కానుందని, ఒక్కో కార్యకర్త 50 మందిని తీసుకుని రావాలని సంజయ్ కోరారు. నడ్డా పర్యటన ఇలా... ♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్. ♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు. ♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్నగర్లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ను కలుసుకుంటారు. ♦ 3.50కి నోవాటెల్కు చేరుకుంటారు. ♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్కర్నూ ల్కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు. ♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. ♦ 6.15కు హెలి కాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్కు చేరుకుంటారు. ♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు. -
ఈ పరిస్థితి మనకు అనుకూలం కావాలి ‘చేతి’కి చిక్కొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు బాటలు వేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం మార్గనిర్దేశం చేసింది. ముఖ్య నేతల మధ్య గ్రూపులు, వర్గాల తగాదాలు, పాత–కొత్త పంచాయతీలు, సమన్వయ లోపం, పదవుల పంపకాల ప్రచారం వంటివాటిని పక్కనపెట్టాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఎదుగుదలకు గండికొట్టేలా ఎవరూ వ్యవహరించరాదని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చెడగొట్టుకోవద్దని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలుచుకుని పార్టీని విజయతీరాలకు చేర్చే వ్యూహాలకు పదునుపెట్టాలని సూచించింది. నేతలను ఢిల్లీకి పిలిపించుకుని.. రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు పెరుగుతుండటం, పార్టీ కార్యక్రమాలకు కొందరు నేతలు దూరంగా ఉంటుండటం నేపథ్యంలో వాటి ని చక్కదిద్దడంపై అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలను శనివారం సాయంత్రం ఢిల్లీకి రప్పించుకుంది. తెలంగాణ రాజకీయ అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కూడా పిలిపించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీలో కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు నాయకులకు సంయమనం, సమన్వయం, సర్దుబాట్లు తప్పనిసరని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై చర్చించారని.. ఎన్నికల వ్యూహాలు, ప్రచార అ్రస్తాలు, నేతల పర్యటనలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. పార్టీ అవసరాలకు తగినట్టుగా, అర్హత, పనితీరు ఆధారంగా పదవులు అవే వస్తాయని భేటీ సందర్భంగా బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ అపోహలు తొలగేలా చూడాలి! తమ అసంతృప్తికి గల కారణాలను ఈటల, రాజగోపాల్రెడ్డి అధిష్టానం పెద్దల ముందు ఉంచారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న ప్రచారం జరుగుతోందని వివరించినట్టు తెలిసింది. దీనికితోడు మంత్రి కేటీఆర్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతుండటాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మల్చుకుంటోందని చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో పథకాలు, పనుల్లో అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు నేతల వ్యవహారశైలి, సమన్వయ లేమి, తామే ఫోకస్లో ఉండేలా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన జాతీయ నేతలు.. అన్ని అంశాలపై తమకు అవగాహన ఉందని, వాటిని సరిదిద్దే బాధ్యతను తమకు వదిలేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల నియామకం అంశంపైనా చర్చ జరిగిందని, రాష్ట్ర బీజేపీలో ఏవైనా సంస్థాగత మార్పులు చేపట్టే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని హైకమాండ్ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాలి అధిష్టానానికి చెప్పామని ఈటల, రాజగోపాల్రెడ్డి వెల్లడి తెలంగాణలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే తక్షణమే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ జాతీయ నేతలకు స్పష్టం చేసినట్టు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మా ఏకైక ఆశయం రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దింపడమే. మేం పదవుల కోసమో, లావాదేవీల కోసమో ఢిల్లీకి రాలేదు. బీజేపీ ద్వారానే కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, సంకోచం లేకుండా జాతీయ నేతలకు వివరించాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని కీలక నిర్ణయాలు చేయాలని కోరాం. తక్షణ కర్తవ్యాలపై మా అభిప్రాయాలను వివరించాం’’ అని వెల్లడించారు. కేంద్ర నాయకత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అమిత్షా, నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. -
జేపీ నడ్డా పర్యటన.. మంత్రి హరీష్రావు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు రాగానే రాష్ట్రానికి టూరిస్ట్ నాయకులు క్యూ కడుతున్నారంటూ మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం గురించి మా ప్రభుత్వం తపిస్తే.. అనారోగ్య రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు అధమ స్థానంలో ఉన్నాయి. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోం’’ అంటూ మండిపడ్డారు. ‘‘అభివృద్ధి, ఆరోగ్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు నీతులు చెబుతారు. బాధతో చెబుతున్నా.. ఇన్నేళ్ల స్వతంత్రంలో తల్లిబిడ్డల ఆరోగ్యాలకు కూడా మన దేశంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి అంశాల గురించి దేశ నాయకులు ఆలోచించాల్సింది పోయి రాజకీయాల గురించి ప్రతిసారీ మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్.. ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గించి దేశానికి తెలంగాణను రోల్ మోడల్ చేశారు. మరొకరికి జన్మనిచ్చే అమ్మకు, ఊపిరిపోసుకునే బిడ్డ ఆరోగ్యానికి అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా కేసీఆర్ భరోసా ఇచ్చారు. మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో సీఎం కేసీఆర్ పని చేస్తే, ఓట్లు, సీట్లే పరమావధిగా కొందరు విమర్శలు చేస్తుంటారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్ సింగ్ సుక్కు సహా, తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చి మా నుంచి నేర్చుకొని వెళ్లండి’’ అంటూ మంత్రి హరీష్రావు హితవు పలికారు. చదవండి: ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్.. హస్తినాలో ఏం జరుగుతోంది? -
ఈటల, కోమటిరెడ్డి ఎఫెక్ట్.. వెంటనే ఢిల్లీకి రావాలని కిషన్రెడ్డికి ఫోన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఆయన హస్తినకు బయలుదేరనున్నారు. దీంతో, హైదరాబాద్లో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కిషన్రెడ్డి ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది. ఇక, అంతకుముందే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని సూచించడంతో ఇప్పటికే కోమటిరెడ్డి హస్తినకు వెళ్లారు. ఈటల కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, వీరిలో జేపీ నడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. జేపీ నడ్డా రేపు(ఆదివారం) తెలంగాణకు రానున్నారు. సంజయ్ సమక్షంలో చర్చ ఇదిలా ఉండగా.. నాగర్కర్నూల్లో నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, బూర నర్సయ్య గౌడ్ తదితరులు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల, రాజ్గోపాల్రెడ్డిల ఢిల్లీ పర్యటన చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పలువురు సీనియర్లు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు నేతలతో సంజయ్ విడివిడిగా సమావేశమైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీని వీడాలనుకుంటే ఆపొద్దు..! పార్టీలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు చర్చకు వచ్చినపుడు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని సంజయ్కు కొందరు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు కాకుండా.. లీకులిస్తున్న నాయకులకే అగ్రనేతలు అపాయింట్మెంట్లు ఇస్తున్నారంటూ ఓనేత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీని వీడాలనుకునే నాయకులను ఆపవద్దని సంజయ్కు సీనియర్లు చెప్పినట్లు సమాచారం. కాగా అధికార బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్కు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇది కూడా చదవండి: శేజల్తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్! -
దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు, సెలబ్రెటీలు
ఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురుగ్రామ్లోని టవ్దేవీలాల్ స్టేడియంలో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. Haryana | BJP chief JP Nadda performs Yoga at Tau Devi Lal Stadium in Gurugram on #9thInternationalYogaDay pic.twitter.com/zOtFwFgTJc — ANI (@ANI) June 21, 2023 ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్.. జబల్పూర్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. #WATCH | Madhya Pradesh: Vice-President, Jagdeep Dhankhar and CM Shivraj Singh Chouhan perform Yoga in Jabalpur to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/dUCixgUl5J — ANI (@ANI) June 21, 2023 భారత ఆర్మీ, వివిధ బెటాలియన్ల సైనికులు సిక్కిం, లఢక్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. #WATCH | Indian Army personnel perform Yoga in Sikkim to mark the #9thInternationalYogaDay. (Video Source: Indian Army) pic.twitter.com/kS7WWFx8Hl — ANI (@ANI) June 21, 2023 #WATCH | Indian Army personnel perform Yoga at Pangong Tso, Ladakh, to mark the #9thInternationalYogaDay. (Video Source: Indian Army) pic.twitter.com/HQRxo8mHdA — ANI (@ANI) June 21, 2023 #WATCH | Tamil Nadu: Yoga practitioners from Rameswaram perform water yoga to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/rugmjpiygA — ANI (@ANI) June 21, 2023 #WATCH | Maharashtra: CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis perform Yoga, in Mumbai to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/5zPE1fDGCv — ANI (@ANI) June 21, 2023 #WATCH | Union Minister Piyush Goyal performs Yoga in Mumbai on #9thInternationalYogaDay pic.twitter.com/z7ElFIyYGy — ANI (@ANI) June 21, 2023 #WATCH | UP: Union Minister Smriti Irani performs Yoga in Noida, to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/VaxWcs0TGA — ANI (@ANI) June 21, 2023 #WATCH | Kochi, Kerala: Defence Minister Rajnath Singh along with Chief of the Naval Staff, Admiral R Hari Kumar performs Yoga on board INS Vikrant on #9thInternationalYogaDay. pic.twitter.com/KsaYZyptiz — ANI (@ANI) June 21, 2023 -
ఖమ్మం సభ వాయిదా.. నడ్డా సభ జరుగుతుంది: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో రేపటి(గురువారం) బీజేపీ బహిరంగ సభను వాయిదాను వేసినట్టు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని పిలుపునిచ్చారు. అయితే, ఈనెల 25వ తేదీన నాగర్ కర్నూల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ యథావిధిగా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఖమ్మం బహిరంగ సభను వాయిదా వేశాం. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో బిపర్జాయ్ తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్ షాపై ఉన్నాయి. అందుకే సభను వాయిదా వేశాం. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ వద్దనుకుని నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం గ్యారెంటీ. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు అనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. బిపర్జాయ్ తుపాను కారణంగా దాదాపు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పలు రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ప్రజలను అన్ని విధాల సాయం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కార్యకర్తల నారాజ్! -
చంద్రబాబు.. సీఎం జగన్కు మరో ఆయుధం ఇచ్చినట్టేనా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా దూకుడు మరింతగా పెంచారు. ఈసారి ఆయన ఏకంగా తెలుగుదేశం దుకాణం బంద్ అవుతుందని తీవ్రమైన ప్రకటనే చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ఆయన ఎద్దేవా చేసిన తీరు ప్రజలను ఆకట్టుకుందని చెప్పాలి. పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రభుత్వ స్కూల్ విద్యార్దులకు పుస్తకాలతో కూడిన స్కూల్ కిట్లు, భూట్లు, డ్రెస్లను పంపిణీ చేసిన జగన్ మాట్లాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు పిల్లలతో ముచ్చటించడం, విద్యారంగంలో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించడం, ఇంకో వైపు తాను చేస్తున్న కృషిని అడ్డుకోవడానికి, ఇతరత్రా ఇబ్బంది పెట్డడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న వ్యూహాలను బహిర్గతం చేసి కౌంటర్లు విసరడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ధాటిగా మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు ఇంటికో బెంజ్ కారు ఇస్తానంటున్నారని, ప్రతి కుటుంబానికి కేజీ బంగారం ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ రకంగా చంద్రబాబు మిని మానిఫెస్టో రూపంలో జగన్కు మరో ఆయుధం ఇచ్చినట్లయింది. విద్యారంగానికి సంబంధించి జగన్ చేసిన కృషి ఎవరూ కాదనలేనిది. గతంలో ఎన్నడూ ఇన్ని విన్నూత్న స్కీములను ఆయన తీసుకు రాలేదు. అసలు స్కూళ్లు ప్రారంభమైన రోజునే విద్యార్దులకు కిట్లు ఇస్తున్న వైనం బహుశా జగన్ ప్రభుత్వంలోనే జరిగిందేమో! జగన్ దృష్టి అంతా పేదల పిల్లలపైనే పెడుతున్నారు. వారు సైతం బాగా చదివి ప్రపంచంతో పోటీ పడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇంతవరకు విద్యారంగంలో సమూల మార్పులు చేయడానికి అరవైవేల కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించిందని ఆయన వివరించారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గతంలో పాలకులు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కో విద్యార్ధి కిట్కు 2400 రూపాయలు వ్యయం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పిల్లలు టోఫెల్ పరీక్షలు రాయగలిగేవారిగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతులను ఆయన పిల్లలకు, తల్లిదండ్రులకు తెలియచేశారు నాడు-నేడు, సీబిఎస్ఇ, ఇంగ్లీష్ మీడియం వంటి మార్పులను ప్రభుత్వ స్కూళ్లలో పేదల కోసమే తెచ్చానని ఆయన చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా విద్యారంగంపై ఇంత శ్రద్ద చూపలేదన్నది వాస్తవం. అసలు ప్రభుత్వ స్కూళ్లను ఇలా బాగు చేయవచ్చని, అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం బోధించవచ్చని నిరూపించిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డులకు ఎక్కారని చెప్పాలి. ఇంతవరకు ఎవరైనా అభినందించాల్సిందే. అంతదాకా ఎందుకు . గత టరమ్లో పాలన చేసిన చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? కాకపోతే యూనివర్శిటీలలో రాజకీయ సదస్సులు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చేవారు. అసలు విద్యా వ్యవస్థ అన్నది ప్రైవేటు రంగానికి సంబంధించినది అని ఆయన భావించేవారు. జగన్ అందుకు భిన్నంగా కార్పొరేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పోటీపడాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టారు. అందువల్లే విద్యార్దులలో జగన్ పట్ల క్రేజ్ ఏర్పడింది. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఈ స్కూళ్లలో సీట్లు ఖాళీ లేవన్న బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు బీజేపీ అండ ఉండకపోవచ్చని, కాని ప్రజల అండ ఉందని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఏపీ పర్యటనలో చేసిన విమర్శలకు ఆయన పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తాను బీజేపీని నమ్ముకోలేదని, ప్రజలనే నమ్ముకున్నానని ఆయన పేర్కొన్నారు. ఇతరత్రా బీజేపీ అగ్రనేతలు చేసిన ఆరోపణలను జగన్ లైట్గా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే చంద్రబాబు బీజేపీతో అంటకాగడానికి తంటాలు పడుతున్న తరుణంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాను బీజేపీకి దూరం అని ప్రజలకు చెప్పగలిగారు. కొన్ని వర్గాలలో బీజేపీ అంటే ఉన్న వ్యతిరేకతను జగన్ వ్యూహాత్మకంగా కాష్ చేసుకున్నారని చెప్పవచ్చు. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ లను మాత్రం ఎక్కడ స్పేర్ చేయకుండా దంచేశారు. వారు పేదలపై పగబట్టిన పెత్తందారులని, వారు పేద పిల్లల చదువులను సహించలేకపోతున్నారని, ఈ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని, వారి చేతుల్లో టాబ్లు కనిపిస్తే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని జగన్ దాడి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నది జగన్పై యుద్దం కాదని, పేదలపై విపక్షం చేస్తున్న యుద్దమని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. చంద్రబాబు మిని మానిఫెస్టోపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు గ్యాస్ డిక్లరేషన్ తీసుకువస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న చంద్రబాబు హామీకి జగన్ ఈ రకంగా సమాధానం ఇచ్చారన్న మాట పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అంటూ మోసం చేయడానికి సిద్దం అవుతున్నారని, అప్పుడు గాడిదలు కాస్తున్నారా అని ఘాటుగా జగన్ ప్రశ్నించడం విశేషం. మరో అవకాశం ఇస్తే మయసభ నిర్మిస్తానని చంద్రబాబు అంటున్నారని, ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటున్నారని, వీటి నమ్ముతారా అని జగన్ ప్రజలను ప్రశ్నించడం ద్వారా టీడీపీ మానిఫెస్టోలోని డొల్లతనాన్ని ఆయన బయటపెడుతున్నారు. ఇదే క్రమంలో తెలుగుదేశం మూసివేతకు సిద్దమైన దుకాణం అని ఆయన కొత్త డైలాగు విసిరారు. దీంతో జగన్ వైపు అనండి.. వైసీపీ వైపు అనండి.. రాజకీయంగా మరింత క్లారిటీ వచ్చింది. తమకు బీజేపీతో కూడా సంబంధం లేదని చెప్పడానికి ఈ అవకాశాన్ని జగన్ వాడుకోగలిగారు. తాము ఒంటరిగానే, ప్రజల అండతో ఎన్నికలలో పోటీచేస్తామని ఆయన ధీమాగా చెప్పగలుగుతున్నారు. అలాగే చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంతా మోసాలమయమని, చంద్రబాబు అంటే మోసం, వెన్నుపోట్లేనని, ఇప్పుడు మరోసారి ఆయన అందుకు తయారు అవుతున్నారని జగన్ ప్రజలకు చెప్పడం ద్వారా మినీ మానిఫెస్టోని చీల్చి చెండాడారు. అది మోసఫెస్టో అని ప్రజలకు వివరించగలుగుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అటు మినీ మానిఫెస్టో విషయంలో కాని, ఇటు బీజేపీ తో పొత్తు గురించి కాని స్పష్టత ఇవ్వలేక సతమతమవుతున్నారు. చదవండి: అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత? ఒకరకంగా టీడీపీని ఆయనే గందరగోళంలోకి తీసుకువెళ్లారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు సహజంగానే ఆయన ఇప్పుడు చేసే ఏ వాగ్దానాలు అయినా నెగిటివ్గానే మారతాయి. ఆయన ట్రాక్ర్ రికార్డు ఆధారంగా వాటిని నమ్మడం కష్టం అవుతుంది. మినీ మానిఫెస్టో తర్వాత ఆయనకు కాస్తో, కూస్తో మద్దతు ఉందనుకున్న ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలలో సైతం అసంతృప్తి ఏర్పడింది. అలాగే బీజేపీ అగ్రనేతల చుట్టూ తిరుగుతూ కాళ్లా,వేళ్లా పడుతున్నారన్న భావన బలపడడం వల్ల రాజకీయంగా మరింత నష్టం కలిగింది. జగన్ తన స్కీములను, ప్రజలను నమ్ముకుంటే, చంద్రబాబు మోసఫెస్టోని, ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియని పొత్తులపై ఆధారపడి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ది అఫెన్స్ గేమ్ అయితే, చంద్రబాబుది డిఫెన్స్గా మారింది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలి
-
జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు పెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని.. ఆ హామీని గత ప్రభుత్వ హయాంలో ఎందుకు నెరవేర్చలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరు?. సీఎం రమేష్, సత్యకుమార్, సుజనా మాటలను నడ్డా తన బుర్రలో ఎక్కించుకుని మాట్లాడితే అది వారి కర్మ అంటూ దుయ్యబట్టారు. ‘‘రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని మీరు చెప్పారు. ఇసుక ప్రీ అంటూ టీడీపీ, బీజేపీ పెద్దలు దోచుకున్నారు. మీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలి. మా ప్రభుత్వ చర్యలతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచాం. గత టీడీపీ ప్రభుత్వం లిక్కర్ షాపులను ఇద్దరికే కట్టబెట్టింది. లిక్కర్ సిండికేట్ను దందాగా నడిపింది మీరు కాదా?’’ అంటూ మండిపడ్డారు. చదవండి: వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్! ‘‘ల్యాండ్ స్కామ్ అంటే విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో ఉంటుంది. మీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తే బాగుంటుంది. పేదలకు నేరుగా రూ.2.16 లక్షల కోట్లను అందించిన ఘనత సీఎం జగన్ది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగం డబ్బయినా ఇచ్చారా?. బెంగుళూరులో జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా?. పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్త టీజేపీగా మారింది’’ అని పేర్ని నాని మండిపడ్డారు. అమరావతి పాపాలకు కారణం ఎవరు? అప్పుడో మాట.. ఇప్పుడో మాటా? అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరు? రాజధానికి డబ్బులు ఇస్తే.. చంద్రబాబు దోచేశారని బీజేపీ వారే చెప్పారు. ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో దోచుకున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో రూ.4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. మరి, గతంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డా సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడు బీజేపీ పువ్వులు ఏమి మాట్లాడాయి. ఈ రోజు ఏమి మాట్లాడుతున్నారు. ఆరోజున మేనిఫెస్టోలో పాపాలు జరిగాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులు చంద్రబాబు తినేశాడని మాట్లాడారు. రాజధాని కట్టుకోమని బోలెడంత డబ్బులు ఇస్తే గేదె మేసేసినట్లు మేసేశాడని ఆనాడు బీజేపీ వారు మాట్లాడారు. ఇవాళ అమరావతిని బలపరుస్తున్నామంటే.. మరి, అమరావతిలో జరిగిన పాపాలకు బాధ్యులెవరు? బీజేపీ, టీడీపీ (2014-19) హయాంలో రూ.4,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయ్? ఆంధ్రప్రదేశ్లో స్యాండ్ స్కామ్ అని నడ్డా గారు అంటారు. 2014-19 వరకు టీడీపీ, బీజేపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని ఏలిన మాట వాస్తవం. మీ ప్రభుత్వంలో (బీజేపీ, టీడీపీ) ఇసుక ఫ్రీ పేరుతో ఆంధ్రప్రదేశ్ నదుల్లో ఉన్నటువంటి ఇసుకను అంతా బీజేపీ, టీడీపీ పెద్దలు అందరూ దోచుకున్నారు. మిద్దెలు మీద మిద్దెలు కట్టుకున్నారు. ఓడలు లాంటి కార్లలో తిరిగారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్లలో (2019-2024) వచ్చే రాబడి రూ.4,000 కోట్లు. మరి, ఈ రూ.4,000 కోట్ల రాబడి టీడీపీ, బీజేపీ హయాంలో ఎవరి జేబుల్లోకి వెళ్లింది. మేం ధైర్యంగా చెబుతున్నాం. మా హయాంలో ఇసుక మీద రాష్ట్ర ప్రజలకు రూ.4,000 కోట్ల రాబడి వచ్చింది. చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కాం లిక్కర్ స్కాం అని నడ్డా మాట్లాడుతున్నారు. ఢిల్లీ రికమెండేషన్ పేరుతో మూడు, నాలుగు కంపెనీలకు 80% అమ్మకాలు కట్టబెట్టారు. నేడు రాష్ట్రంలో 20 కంపెనీలకు అమ్మకాలను ఇవ్వటం జరిగింది. ఎవరిది స్కాం ఎవరిది? బీజేపీ, టీడీపీ హయాంలో ఊరూరా వేల బెల్ట్షాపులు ఉన్నాయి. బ్రాందీ అంతా ప్రైవేటు దందాగా బీజేపీ, టీడీపీ నడిపింది. బెల్ట్ స్కాంలు చేసింది బీజేపీ వారు కాదా? మీ పాత్ర లేదా? మీ వాటా ఉంది కదా. మా ప్రభుత్వంలో అమ్మకాలు తగ్గించాం. రేట్లు పెంచాం. ప్రభుత్వానికి రాబడిని పెంచాం. రెవిన్యూ పెరిగింది మా ప్రభుత్వంలో. సేల్స్ తగ్గింది మా ప్రభుత్వంలో. బెల్ట్షాపులు లేవు. షాపులు ప్రభుత్వమే నడిపిస్తోంది. రెవిన్యూ వస్తే.. ప్రజల ఆస్తిగా ప్రభుత్వానికి వస్తోంది. బీజేపీ, టీడీపీ హయాంలో బెల్ట్ స్కాం ఎవరిది? ప్రైవేటు దందాలు ఎవరిది? మూడు కంపెనీలతో 80% బ్రాందీ అమ్మకాలు చేయటం వల్ల ఏ పార్టీ పొందింది. ఢిల్లీ వాటా ఎంత? ఇక్కడ వాటా ఎంతో కూడా నడ్డా చెప్పాలి. రాబడి అంతా ఖజానాకు వెళ్లిపోతోంది. స్కాం అంటే.. ఏమిటో నడ్డా చెప్పాలి. ల్యాండ్ స్కామ్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఉంది మీ నోటితో అమరావతి ల్యాండ్ స్కాం అన్నారు. ఇప్పుడు మీ నోటితోనే సమర్థిస్తున్నారు. వేల కోట్ల డబ్బు ఇస్తే చంద్రబాబు హల్వా తిన్నట్లు తినేశాడు. అమరావతిలో ఏ నిర్మాణాలు చేయలేదన్నారు. ఇప్పుడు అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు. వెనకాల చీకట్లో ఏం జరిగింది నడ్డా గారు. ల్యాండ్ స్కాం ఉన్నట్లైతే విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఉక్కు పీక కోసి దాని భూమి కోసం ప్రయత్నిస్తున్నారు. ఉంటే.. దాంట్లో ల్యాండ్ స్కామ్ ఉంటుంది. ఇది హిందీలో చెబుతారా? తెలుగులో చెబుతారా? బాధ్యత గల పార్టీ అధ్యక్షుడు అయితే.. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చి ఎవరో తప్పుడు మాటలు.. చెప్పుడు మాటలు చెప్పటం కాదు. ఢిల్లీలో విపక్షాలు అనేక మోతలు మోగిస్తున్నాయి. ఆరోపణలు చేస్తున్నాయి. మీకు చేతనైతే ఢిల్లీలో కూర్చొని వాటికి సమాధానం చెప్పండి. వాటికి సమాధానం చెప్పకుండా ఏపీకి వచ్చి పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు చెవులతో విని.. పాఠం అప్పజెప్పొద్దు. బీజేపీలో ఉన్న పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు విని.. పాఠం అప్పజెప్పినట్లు చేయవద్దు. ఢిల్లీలో కేంద్రం మీద విపక్షాల ఆరోపణలకు సమాధానం చెబితే బావుంటుంది. బీజేపీ కాస్తా టీజేపీగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 2019 నుంచి నేటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలో లంచరహితంగా రూ.2.16 లక్షల కోట్లను జమ చేసింది. బీజేపీ ఏలుతున్న ఏ రాష్ట్రంలో అయినా సగం డబ్బులు పంపిన రాష్ట్రం ఏమైనా ఉందా? మాకు ఆర్థిక బాధలు ఉన్నా ఇంత గొప్పగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటైనా బీజేపీకి ఉందా? బెంగళూరులో యమమేత మేశారని ఇరగదీసి వాత పెట్టారు. ఎవరిది తప్పుడు ప్రభుత్వం. ఎవరిది అవినీతి ప్రభుత్వం. బెంగళూరులో మీది కాదా? అవినీతి ప్రభుత్వమని జనం ఊసింది నిజం కాదా? ఏతావాతా పరిస్థితి ఏమిటి అంటే.. పచ్చ పువ్వులతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏ స్థితిలో ఉందంటే.. బీజేపీ కాస్తా టీజేపీగా రూపాంతరం చెందింది. బీజేపీలో కలుపు తీస్తే తప్ప ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు రాదని హితవు పలుకుతున్నాము. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఒక సీబీఐని డైరెక్టర్ను మార్చటం కోసం ఆర్మీని దించినట్లు పరిస్థితులా. గవర్నమెంట్ పోగానే.. అ అధికారిని ఢిల్లీలో పెట్టుకున్నారు. సీబీఐ ఏ స్థితిలోకి వెళ్లిపోయిందో దేశంలో ఏ రాజకీయ పార్టీని అడిగినా చెబుతారు. బీజేపీ ఏలుతున్న రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది. ఈశాన్య భారతదేశంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో తెలీదా? పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పరిస్థితిలో నడ్డా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత హింస ప్రజ్వరిల్లుతోందో కళ్లకు కట్టినట్లు చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో హింస ఎలా జరుగుతోందో అందరూ చూస్తున్నారు. అమిత్షా వచ్చి బీజేపీ తరుపున మాట్లాడి వెళ్తారు. తేడా ఏమైనా ఉంటే మాట్లాడతాం. హరీశ్రావుకు మేనమామ (కేసీఆర్) మీద విపరీతమైన దుగ్ద, బాధ, కోపం. బామ్మర్ది మీద ఈర్ష్య. అమాంతం మామను తోసి పైన కూర్చోవాలని తపన, తాపత్రయం. మామను తిట్టలేడు. చీకట్లో బెదిరిస్తుంటాడు. బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే హరీశ్ రావును కేసీఆర్ పక్కన పెట్టాడు. 2019లో కేసీఆర్ గెలిచాక హరీశ్ రావును ఎక్కడ పెట్టారో తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు. బొటాబొటిన సీట్లు వస్తే.. ఇక్కడ నుంచి కొంతమందిని కాంగ్రెస్లోకి హరీశ్ రావు తీసుకెళ్లాలనుకున్నది తెల్సి మామ ఆస్తులు క్యాచ్ చేశాడంట. మొత్తం చిట్టా చెప్పి జాగ్రత్త అని హరీశ్రావును కూర్చొబెట్టాడని కథలు కథలుగా చెప్పారు. మా అల్లుడు చేతలు ఎక్కువ అయ్యాయని కేసీఆరే చెప్పారు. హరీశ్ రావు చేతలు.. కుట్రలు, కుతంత్రాలు. హరీశ్ రావు చంద్రబాబును ఫాలో అవుదామని అనుకున్నారు. రామారావు అమాయకుడు కాబట్టి బలైపోయాడు. కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయల్దేరిన హరీశ్రావును చాచి ఒకటి కొట్టారు. కేసీఆర్ కూడా మా జగన్ గారి గురించి మాట్లాడితే.. నీ కోరిక నెరవేర్చేట్టు మీ మామను బాగా తిడతాం. హరీశ్ కోరిక అదే కదా. ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు సర్టిఫికెట్లు అవసరం లేదు. ఆ సర్టిఫికెట్లకు ఉల్లిపాయలు అయినా వస్తాయా? మామను తిట్టలేడు. కేసీఆర్ను తిట్టాలంటే చంద్రబాబుకు భయం. ఫ్యాంటు తడసిపోతుంది. జగన్ మనుషులే దమ్ముగా తిడతారు. సమ్మగా మానసిక ఆనందం పొందాలని హరీశ్ రావు లెక్క. హరీశ్ రావు కుట్ర మనకు తెలుసు. కేసీఆర్ అల్లుడు గిల్లుడు చూస్తూ కూర్చుంటే హరీశ్ రావు కోరిక తీర్చే పని చేస్తాం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పీక కోద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భూ స్కాం ఉందేమో. లేకపోతే దానికి క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇవ్వరు. అదానీ, వేదాంతకు ఇస్తారు. మా విశాఖ ఉక్కుకు ఎందుకు ఇవ్వరని ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి అనుమానం. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రైవేటు వ్యక్తికి అయినా భూములు కేటాయించామా? ఆనాడు టీడీపీ-బీజేపీ హయాంలో ఇచ్చారు. -
ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. రహదారులు, ఇళ్లు, పలు సంస్థల నిర్మాణాలకు ఎంతగానో ఆర్థిక సాయం చేస్తోందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన సంపర్క్ అభియాన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంగళగిరిలో రూ.1,680 కోట్లతో ఎయిమ్స్ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఇదే విషయాన్ని మన్ కీ బాత్లో ప్రధాని కూడా చెప్పారంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో 8,744 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రూ.300 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్ను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్గా ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో రూ.800 కోట్లతో ఐఐటీ, రూ.1,491 కోట్లతో ఐసర్ నిర్మాణంలో ఉందని తెలిపారు. కడప–రేణిగుంట–నాయుడుపేట జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీలో పట్టణ ప్రాంత పేదలకు 21 లక్షలు, గ్రామీణ ప్రాంత పేదలకు 2.48 లక్షల ఇళ్లు ఇచ్చామని తెలిపారు. స్వచ్ఛ భారత్ ద్వారా ఏపీలో 42 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 3,273 కి.మీ మేర గ్రామీణ రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇంతగా కృషి చేస్తున్న బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే రాయలసీమ వెనుకబాటుతనం పోగొట్టడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి మరింతగా బాటలు వేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారతావని ప్రపంచ దేశాలకు దీటుగా అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సొంతం చేసుకుని ప్రపంచ ఆర్థిక రంగంలో పటిష్టంగా నిలిచిందని నడ్డా అన్నారు. ప్రధాని మోదీ రాజకీయాలకు సరికొత్త భాష్యం పలుకుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా బాధ్యత, పారదర్శకతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. గతంలో కేవలం 59 గ్రామాలకే ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ఇవాళ కేంద్రం రెండు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 19 వేల గ్రామాలకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. 3 లక్షల 28 వేల కిలోమీటర్ల గ్రామసడక్ పథకం ద్వారా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ అన్న్ కల్యాణ్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల 60 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను 22 శాతం నుంచి 10 శాతం కంటే తక్కువకు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మోదీ ముందు చూపు వల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ 5వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు. ఏపీలో అసమర్థ పాలన ఆంధ్రప్రదేశ్లో తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాష్ట్రాభివృద్ధికి నిధులు అందిస్తున్నప్పటికీ అసమర్థ పాలన కొనసాగుతోందని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందన్నారు. ఇసుక, మద్యం, ల్యాండ్, మైనింగ్ మాఫియా తారస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఆనాడు ప్రధాని శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం శోచనీయమన్నారు. చిత్తూరు జిల్లాకు కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలనలో చంద్రబాబు పక్కదారి పట్టించి అధోగతిపాలు చేశారని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. రూ.7,400 కోట్లతో కండలేరు జలాశయం నుంచి శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లికి నీరందించే బృహత్తర పతకాన్ని చంద్రబాబు రద్దు చేశారని ధ్వజమెత్తారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం బీసీసీఐ ముందుకొస్తే భూ సమస్య పరిష్కరించకుండా స్టేడియం ప్రతిపాదనను కూడా రద్దు చేశారని తెలిపారు. హైదరాబాద్ తరహా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత తిరుపతిలో శంకుస్థాపన చేయిస్తే ఆ ప్రాజెక్టునూ టీడీపీ పక్కన పెట్టిందన్నారు. నిమ్జ్ను చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని కూడా రద్దు చేశారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర పెద్దలను కాకా పట్టడం కోసం సీఎం జగన్ తరచూ ఢిల్లీ టూర్లకు వెళుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పురందేశ్వరి, సునీల్ దేవదర్, సత్యకుమార్, జీవీఎల్నరసింహరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి, విష్ణువర్థన్రెడ్డి, కోలా ఆనంద్, భానుప్రకాష్రెడ్డి, దయాకర్రెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యకర్తల కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీజేపీ తిరుచానూరు (చంద్రగిరి)/తిరుమల : ప్రతి కార్యకర్త ఎటువంటి లాభపేక్ష లేకుండా కష్టపడి పనిచేయడంతోనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జిల్లా శక్తి కేంద్ర ప్రముఖ్ కార్యక్రమాన్ని శనివారం తిరుచానూరు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా పారదర్శక పాలన అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా రామ మందిరం నిర్మిస్తున్న ఘనత కూడా బీజీపీకే దక్కిందని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ చేపిట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 20వ తేది నుంచి 30వ తేది వరకు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రధాని మోదీ కార్యకర్తలతో నేరుగా కలసే అవకాశం ఉందన్నారు. కాగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. -
శ్రీకాళహస్తి: ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు: జేపీ నడ్డా
సాక్షి, శ్రీకాళహస్తి: ఏపీలోని శ్రీకాళహస్తిలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభ జరుగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. కాగా, సభలో నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించంది. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోదీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగింది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు మౌళిక సదుపాయాలు కల్పించాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా? -
చంద్రబాబు అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన తర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడలేదు!చంద్రబాబు ఎప్పుడైనా ఇలా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారా?. తదుపరి పార్టీ నేతలతో పొత్తుల గురించి మాట్లాడవద్దని చంద్రబాబు అన్నారంటే ఏమిటి దాని అర్దం? పని జరగలేదనా?. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ అవడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. గత నాలుగేళ్లుగా బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఇప్పటికి సఫలం అయినందుకు చంద్రబాబు టీమ్లో ఆనందం తాండవించి ఉండవచ్చు. కానీ, అది తాత్కాలికమే అన్న వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అయితే టీడీపీ రెండు విధాల చెడినట్లు అనుకోవచ్చు. ✍ తిట్టిన వారు.. ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాను బండబూతులు తిట్టిన టీడీపీ వారు, ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. చంద్రబాబుకు ఆత్మగౌరవం అన్నది సమస్య కాదు. అవసరమైతే అధికారం వస్తుందనుకుంటే ఆయన ఎంతకైనా దిగజారతారన్న విమర్శలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మాట మార్చేయగలరు. కాని ఇప్పుడు పరీక్ష బీజేపీ వారికే. మోదీకి 2019లో చంద్రబాబు నల్లబెలూన్లు చూపి నిరసన చెప్పారు. కనీసం విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం చెప్పలేదు. మోదీని దేశద్రోహిగా, దేశాన్ని నాశనం చేసిన వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేసి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో రాజకీయ స్నేహం చేశారు. అయినా తెలంగాణలో కాంగ్రెస్కు అధికారం దక్కకపోవడంతో వారిని గాలికి వదలివేశారు. ✍ అది నిజమే అయితే.. మళ్లీ మోదీ, అమిత్ షాల వైపు చూడడం ఆరంభించారు. చకోరపక్షులు మాదిరి ఎదురుచూస్తూ ఉన్నారు. ఎలాగైతేనేం అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరికింది. దాంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. బీజేపీ తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు బీజేపీకి పనిచేస్తాయని చెప్పడానికి వెళ్లారని కధనాలు వచ్చాయి. అది నిజమే అయితే బిజెపి తన గోయి తాను తవ్వుకున్నట్లే అవ్వవచ్చు. ఎందుకంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తే , టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. ✍ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? అంతకుముందు ఎన్నికలలో 21 సీట్లు వస్తే , 2018లో అవి 19 కి పడిపోయాయి. అంతేకాక చంద్రబాబుతో కలిసి పరువు పోగొట్టుకుంది. తదుపరి చంద్రబాబు యధాప్రకారం కాంగ్రెస్ ను నట్టేట వదలివేశారు.ఎపి ఎన్నికలలో కాంగ్రెస్ ఊసే ఎత్తలేదు. బిజెపి ఇన్ చార్జీ సునీల్ ధియోధర్ అన్నట్లు కాంగ్రెస్ తో పొత్తును తెగతెంపులు చేసుకున్నామని చంద్రబాబు ఇంతవరకు ప్రకటించలేదు. అయినా బిజెపి పెద్దలు టిడిపితో పొత్తు పెట్టుకుంటారా? దానివల్ల ప్రయోజనం ఉంటుందా? అన్నది చర్చగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ డిల్లీలో మోడీని, అమిత్ షా ను కలిస్తే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు కేసుల గురించి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటివైతే ఆ గదులలో నక్కి కూర్చుని సమాచారం సేకరించిన చందంగా ఊహాగానాలు ఇచ్చేవి. కాని చంద్రబాబు కలిస్తే మాత్రం బిజెపి స్నేహ హస్తం అంటూ అందంగా చిత్రించారు. చదవండి: బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా? ✍ అలా ఎందుకు రాయలేదు? చంద్రబాబు పిఎస్ వద్ద పట్టుబడ్డ 2 వేల కోట్ల ఐటి స్కామ్ ముందుకు వెళ్లకుండా జాగ్రత్తపడి ఉండవచ్చని రాయలేదు. ఎపి ప్రభుత్వం అమ రావతి భూముల విషయంలోను, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోను చంద్రబాబుపై కేసులు పెట్టినందున, వాటిపై తదుపరి చర్య లేకుండా ఉండడానికి అమిత్ షాను కాకాపట్టడానికి వెళ్లారని రాయలేదు. ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఆర్దిక అవకతవకల కేసులో సాయం చేయడానికి చంద్రబాబు వెళ్లి ఉండవచ్చని ఈ పత్రికలు రాయలేదు. చంద్రబాబు కోసమే అమిత్ షా ఎదురు చూశారన్నంత చందంగా కధనాలు ఇచ్చాయి. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని కొన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి. అదన్నమాట. ఏపీపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ. ఇక తెలంగాణలో ఎన్నికల కోసం చంద్రబాబుతో మాట్లాడి ఉంటారా?. అంటే ఏమైనా కావచ్చు. కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీకి దక్షిణాదిలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ టీడీపీ మద్దతు ఇస్తే కొంత ఉపయోగం ఉంటుందేమోనని బిజెపి నేతలు కొంతమంది ఎవరైనా భావించారేమో తెలియదు. కాని తెలంగాణలో టిడిపి ఇప్పటికే దాదాపు అడుగంటింది. ఏదో నామమాత్రంగా నడుపుతున్నారు. ✍ నమ్మించే యత్నం.. ఇలాంటి బేరసారాలు చేయడానికి వీలుగా కాసాని జ్ఞానేశ్వర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారీ, చిన్న రాజకీయ వేత్తను అధ్యక్షుడుగా పెట్టుకుని కథ నడుపుతున్నారు. టీడీపీతో పాటు జనసేన కూడా కలిస్తే తెలంగాణలో కొంత ప్రభావం ఉండవచ్చని చంద్రబాబు నమ్మించే యత్నంచేసి ఉండవచ్చు. అయినా సర్వేలు చేయించుకోకుండా అమిత్ షా దీనిపై ముందుకు వెళతారా? బీజేపీలో తెలుగుదేశం వ్యక్తులను ప్రవేశపెట్టిన చంద్రబాబు వారి ద్వారా నాలుగేళ్లపాటు సాగించిన రాయబారాలకు బీజేపీ పెద్దలు సంప్రదింపులకు సిద్దం అయి ఉండాలి. తెలంగాణలో మద్దతు ఇస్తే ఏపీలో జగన్కు వ్యతిరేకంగా బీజేపీ ఉండాలని, ఆ ప్రభుత్వానికి సహకరించరాదని చంద్రబాబు కండిషన్ పెట్టే అవకాశం ఉంటుంది. ✍ చంద్రబాబుకు మైండ్ బ్లాక్.. కేంద్రం ఇటీవల పదివేల కోట్ల ఆర్ధిక సాయం ఇచ్చిన తీరుకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిఉండాలి. అలాగైతే జగన్కు ఏపీలో తిరుగు ఉండదని ఆయన భయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా అలాగే నిధులు ఇస్తే రాజకీయంగా తమకు నష్టం అని చంద్రబాబు భావిస్తుండవచ్చు. ఎపిలో బిజెపికి పెద్దగా బలం లేదు. అయినా వారి మద్దతు కోసం ఎందుకు పాకులాడుతున్నారంటే కారణం ఇదే. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎపిలో జగన్ ప్రభుత్వాన్ని ఎదో విధంగా ఇబ్బంది పెట్టాలంటే వారితో పొత్తులోకి వెళ్లడమే మార్గమని టిడిపి భావిస్తోంది. జగన్ ఎప్పుడూ కేంద్రంలోని బిజెపిపై నోరుపారేసుకోలేదు. ✍ వ్యూహాత్మక తప్పిదమా? అవసరమైన సందర్భాలలో మద్దతు ఇస్తున్నారు. అందువల్ల జగన్ తో పొత్తు లేకపోయినా, ఆయనను ఇబ్బంది పెట్టవలసిన అవసరం బిజెపికి ఉండదు. కాకపోతే బిజెపిలోని తెలుగుదేశం నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. బిజెపికి పది లోక్ సభ సీట్లు ఇస్తామని టిడిపి ఆఫర్ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో తెలియదు. ఏది ఏమైనా అమిత్ షాను వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా? రాజకీయ ప్రయోజనాల కోసం కలిశారా? అన్నదానిపై వారు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా ఒక రాజకీయనేతను కలవడం తప్పు కాదు. కాని తమను అవమానించిన చంద్రబాబు వంటి నేతతో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి బిజెపి ఆలోచన చేస్తుంటే మాత్రం అది వ్యూహాత్మక తప్పిదమే కావచ్చు. ✍ అది శరాఘాతమే.. మోదీని, అమిత్ షా లను తీవ్రంగా చంద్రబాబుకాని, ఆయన పార్టీ నేతలు కాని దూషించినప్పుడు బాధపడ్డ అభిమానులకు మాత్రం అది శరాఘాతమే అవుతుంది. టిడిపిని కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని నిన్నటిదాక ఒరిజినల్ బిజెపి నేతలు విమర్శిస్తుండేవారు. నిజంగానే బీజేపీ కనుక టీడీపీతో స్నేహం కోసం అర్రులు చాస్తే అలాంటివారికి ఎంతో చిన్నతనం అవుతుంది. అన్నిటికి మించి మోదీ, అమిత్ షా లు కూడా తమ ఆత్మ గౌరవాన్ని రాజకీయం కోసం వదలివేసుకుంటారా? అన్న ప్రశ్న వస్తుంది. ✍ కొసమెరుపు ఏమిటంటే.. ఈ చర్చ జరుగుతున్న తరుణంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిడిపితో పొత్తు ఊహాగానమేననితేల్చేశారు. తెలంగాణతో పాటు ఎపిలో కూడా పొత్తు ఆలోచన లేదన్నారు. దీంతో టిడిపి శ్రేణులు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఒక్కసారిగా డీలాపడ్డాయి. అంటే దీని అర్దం చంద్రబాబు తనపై, రామోజీ పైన ఉన్న కేసుల విషయంలో సాయం చేయాలని కోరడానికే వెళ్లినట్లయిందా! కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్లో మాట్లాడుతూ పొత్తులపై ఇప్పుడు ఎవరూ మాట్లాడవద్దని, ఎన్నికల సమయంలో చూద్దామని అన్నారట. అంటే అర్ధం అయింది కదా! అమిత్ షా వద్దకు వెళ్లినా రాజకీయంగా పెద్ద ప్రయోజనం లేకపోయిఉండవచ్చు. మరి కేసులలో అయినా ఏమైనా హామీ లభించి ఉంటుందా!అన్నది చెప్పలేం. తెలంగాణలో బిఆర్ఎస్ కు ఈనాడు బాకా ఊదుతోందన్న భావన బిజెపిలో ఉందని అంటున్నారు. ఈ నేపద్యంలో బిజెపి వద్దకు వెళ్లి చంద్రబాబు మరో సారి విశ్వసనీయత కోల్పోతే, పని జరగక పరువు పొగొట్టుకుని రెండిందాల చెడ్డట్లు అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
15 రోజుల్లోనే మోదీ, అమిత్షా, నడ్డా రాక.. తెలంగాణ బీజేపీలో జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి బీజేపీ అగ్రనాయక త్రయం పర్యటించనుంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో బహిరంగ సభలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగ్గురు అగ్రనేతలు శంఖం పూరిస్తారని భావిస్తున్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో వీరి పర్యటనలు జరగనుండటం విశేషం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన విజయాలను చాటడంతోపాటు ప్రజలను స్వయంగా కలుసుకునేందుకు ఉద్దేశించిన ‘మహా జనసంపర్క్ అభియాన్’లో భాగంగా రాçష్టంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న సభలో అమిత్షా ప్రసంగించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందనే భావనను అమిత్ షా భారీ బహిరంగ సభతో తిప్పికొట్టాలనే వ్యూహంతో రాష్ట్ర నాయకత్వముంది. అదేవిధంగా 25న నాగర్కర్నూల్ సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఈ నెలాఖరులోగా మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మోదీ రోడ్షో, ఆ తర్వాత నల్లగొండలో బహిరంగసభ నిర్వహించే అవకాశముంది. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ ప్రతిపాదనలు పంపగా, తేదీని జాతీయ నాయకత్వం ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. కర్ణాటక నైరాశ్యం నుంచి బయటపడేలా... కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రభావం తెలంగాణపై పడటంతోపాటు ఇక్కడా కాంగ్రెస్ పుంజుకుంటోందనే వాదనను తిప్పికొట్టేందుకు మోదీ, అమిత్షా, నడ్డా సభలు ఉపయోగపడతాయని రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు. తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు స్వయంగా అధినాయకత్వమే రాష్ట్రానికి వస్తుండటంతో రాష్ట్రంలో పార్టీపై మరింత ఫోకస్ పెరుగుతుందని భావిస్తున్నారు. కర్ణాటక ఓటమి నైరాశ్యంతోపాటు కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకుల్లో ఆవరించిన స్తబ్దతను బద్దలుకొట్టి అసెంబ్లీ ఎన్నికలకు చురుకుగా పనిచేసేందుకు ఈ పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. అలాగే, పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపుతాయనే ఆశాభావంతో ఉన్నారు. ప్రత్యామ్నాయమని చాటేందుకు... రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారబోయేది బీజేపీనే అనే భావన ప్రజల్లో ఏర్పడేందుకు అగ్రనేతల పర్యటనలు దోహదపడతాయని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు, జరిగే అభివృద్ధి గురించి అగ్రత్రయం వివరించడం ద్వారా ఓ సానుకూల ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. దక్షిణాదిలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్న రాష్ట్రంగా తెలంగాణను జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది. అందుకే ఆ అవకాశం చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగా ఇక్కడ నిర్వహించే వరుస కార్యక్రమాల్లో అగ్రనేతలు పాల్గొనాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు ‘మహా జనసంపర్క్ అభియాన్’కార్యక్రమాలు ముగియగానే, జూలై నుంచి మూడు, నాలుగు నెలలపాటు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తెస్తారని భావిస్తున్నారు. చదవండి: త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే! -
‘సెమీఫైనల్’ వ్యూహాలకు పదును!.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సారత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెడుతున్నారు. ఈ ఏడాది చివరన ఎన్నికలు జరిగే తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలకు కార్యాచరణను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ భవనంలో సోమవారం అర్ధరాత్రి వరకు, తిరిగి మంగళవారం ఉదయం దాదాపు పది గంటలపాటు కీలక చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీకున్న బలాబలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని వాటిని అధిగమించే అంశంపై మేథోమథనం జరిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా ఉండటం, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, రాజస్తాన్లో 25, మధ్యప్రదేశ్లో 29, ఛత్తీస్గఢ్లో 11 స్థానాలు కలిపి మొత్తంగా 82 స్థానాలు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితేనే లోక్సభ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులోభాగంగా కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను, ఇంచార్జీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఏం చేయాలి? తెలంగాణలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో ఉన్న అసమ్మతిని తమవైపు తిప్పుకునే అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటే కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో సహా ఇతర కమిటీల నియామకాలను పూర్తి చేస్తూనే, సంస్థాగత నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటల రాజేందర్కు ముఖ్యమైన బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి.. నేతల మధ్య ఐక్యత చెడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ ప్రచార కార్యక్రమాలు, ఈ నెలలో తెలంగాణలో జరిపే పర్యటనలపైనా చర్చించారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, అధికార పక్షం లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అసమ్మతి నేతలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు అవకాశాలపైనా సమాలోచనలు చేశారు. అలాంటివి సాధ్యంకాని చోట ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ముచేసుకునే అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే ఇటీవల జరిపిన భేటీలో తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ముందుంచిన ప్రతిపాదనలపైనా ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఆయా అంశాలపై ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ ఇంచార్జి సునీల్ బన్సల్ అభిప్రాయాలను కూడా ముగ్గురు అగ్రనేతలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చదవండి: పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి -
అగ్రత్రయ నేతల పర్యటనపైనే తెలంగాణ కాషాయ పార్టీ ఆశలు
సాక్షి, హైదరాబాద్: కాషాయ పార్టీ అగ్ర త్రయ నేతలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. కర్ణాటక ఓటమి.. నేతల చిట్ చాట్లతో కుంగిపోయిన కమలం పార్టీలో పునరుత్తేజం నింపేపనిలో పార్టీ హైకమాండ్ పడింది. రాబోయే పక్షం రోజుల్లో ముగ్గురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. కాషాయ అగ్రత్రయం పర్యటనలు తెలంగాణ కమలదళానికి కలిసొస్తాయా ? పార్టీ అగ్రనేతలు ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు ? నిరాశలో కురుకుపోయిన తెలంగాణ కమలం పార్టీలో నూతనోత్తేజం నింపే ప్రయత్నానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమైంది. కాషాయపార్టీ అగ్ర నేతలు తెలంగాణలో మోహరించబోతున్నారు. అటు బీఆర్ఎస్... ఇటు కాంగ్రెస్ ను దాటి ఎన్నికల రేసులో ముందు వరుసలో నిలబడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక ఓటమి పాఠాల నుంచి నేర్చుకున్న అంశాలపై కమలనాథులు దృష్టిపెట్టారు. దక్షిణాదిన అధికారపగ్గాలు చేపట్టేందుకు అవకాశమున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ మాత్రమేనని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కమల వికాసం కోసం పావులు కదుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో అక్కడే అమిత్ షాతో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నెల 15న తెలంగాణ గుమ్మం ఖమ్మం ఖిల్లాలో అమిత్ షా సభను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 25న నడ్డా పర్యటించనున్నారు. అమిత్ షా, నడ్డా పర్యటనలు ఫిక్స్ అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై తెలంగాణ కమలనాథులు డ్రాఫ్ట్ రూపొందించారు. మోదీ పర్యటన తేదీలపై పీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ రావల్సి ఉంది. నెలాఖరున మోదీతో నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా మల్కాజిగిరిలో భారీ రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా పక్షం రోజుల్లో ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. నిస్తేజంగా ఉన్న కాషాయశ్రేణుల్లో అగ్రనేతల పర్యటనలు జోష్ నింపుతాయా ? కొత్త నేతల చేరికలు పెరుగుతాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది. -ఉదయ్ కుమార్, సాక్షి, వెబ్డెస్క్ -
తెలంగాణకు అమిత్ షా, జేపీ నడ్డా.. ఎప్పుడంటే!
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ9 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈక్రమంలో వచ్చే నెలలో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సమావేశాలకు ఈ ఇద్దరు నేతలు హాజరు కానున్నారు. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలో అమిత్షా పాల్గొననున్నారు. అదే విధంగా 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. -
మెగా విద్వేష షాపింగ్ మాల్: నడ్డా
న్యూఢిల్లీ: ప్రేమ దుకాణం పేరిట రాహుల్ మెగా విద్వేష షాపింగ్ మాల్ తెరిచారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అభివృద్ధిని ప్రపంచమే గుర్తించింది. దాన్ని యువరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు సర్జికల్ స్రైక్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. హిందువులు, ముస్లింలను విడదీయడంపై మాట్లాడుతారు. సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ప్రేమ దుకాణం నడుపుతున్నానంటూ చెప్పుకుంటుంటారు. నిజానికది మెగా విద్వేష షాపింగ్ మాల్’’ అన్నారు. -
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్
సాక్షి, అనంతపురం జిల్లా: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయంగా చంద్రబాబు నడవలేని స్థితిలో ఉన్నారని.. అందుకే నాలుగైదు పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంత్రి ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎంత మందితో చంద్రబాబు వచ్చినా వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరని.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అన్నారు. చంద్రబాబు మహానటుడు అని.. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాల మ్యానిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శించారు. చదవండి: ‘వైఎస్ జగన్ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
AP: రాష్ట్రానికి 8న అమిత్ షా, 10న నడ్డా రాక
సాక్షి, అమరావతి: బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా మే 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవ తేదీన తిరుపతికి వస్తారని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిలో రెండు చోట్ల భారీ బహిరంగ సభల నిర్వహణకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా చదవండి: ఇదిగో గ్రామ స్వరాజ్యం -
ప్రపంచమంతా ఆ కుతూహలంతో ఉంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఇది బుద్ధుడు, గాంధీ లాంటి మహానుభావులు నడయాడిన నేల. శత్రువుల్ని సైతం చేరదీసే తత్వం మనది. అందుకే ‘భారత్ అసలు ఏమనుకుంటుందో?’ అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది అని అన్నారు ప్రధాన మంత్రి నరేద్ర మోదీ. గురువారం ఉదయం ఢిల్లీ పాలం(ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) వద్ద బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు. మూడు రోజల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నేటి(గురువారం) ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పాలం విమానాశ్రయం(దేశీయ) వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికాయి. భారీ గజమాలతో మోదీని సత్కరించాయి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు ప్రసంగించారు. ప్రధాని మోదీ ఏమన్నారంటే.. తమిళం మన భాష. ప్రతీ భారతీయుడి భాష. ప్రపంచంలోనే పురాతనమైంది తమిళం. అలాంటిది పాపువా న్యూ గినియాలో టోక్ పిసిన్ తర్జుమా పుస్తకం ‘తిరుక్కురల్’ను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది. నేను నా దేశ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు, నేను ప్రపంచం కళ్ళలోకి చూస్తాను. మీరు దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున ఈ విశ్వాసం వచ్చింది. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లు మోదీ మీద అభిమానంతో రావట్లేదు.. భారత్ మీద ప్రేమతో వస్తున్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లను ఎందుకు పంచాలో చెప్పాలంటూ కొందరు నిలదీస్తున్నారు. ఇది బుద్ధుడు, గాంధీ నడయాడిన నేల. శత్రువులను సైతం చేరదీసే తత్వం మనది. భారత్ అసలు ఏమనుకుంటుందో? అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది. #WATCH | Tamil language is our language. It is the language of every Indian. It is the oldest language in the world. I had the opportunity to release the Tok Pisin translation of the book 'Thirukkural' in Papua New Guinea: PM Modi pic.twitter.com/GqyyHWBZEs — ANI (@ANI) May 25, 2023 మనదేశ సంస్కృతి, సంప్రదాయం గురించి మాట్లాడేటప్పుడు, బానిస మనస్తత్వంలో ఎప్పుడూ మునిగిపోవద్దు. ధైర్యంగా మాట్లాడాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచం ఆ గొప్ప విషయాలను వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. మా పుణ్యక్షేత్రాలపై దాడి ఆమోదయోగ్యం కాదని నేను చెప్పిన సమయంలో.. ప్రపంచం నాతో ఏకీభవిస్తూ వస్తోంది. సిడ్నీలో జరిగిన భారతీయ ప్రవాసుల కార్యక్రమానికి.. ఆస్ట్రేలియా ప్రధాని మాత్రమే కాకుండా మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, అధికార పక్షం కూడా హాజరైంది. ఇదే ప్రజాస్వామ్య బలం. వాళ్లంతా మన కమ్యూనిటీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదీ మనకు దక్కిన గౌరవం. జేపీ నడ్డా ఏమన్నారంటే.. పాపువా న్యూ గినియా ప్రధాని మీ పాదాలను తాకిన తీరు.. మీకు అక్కడ ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది. మన ప్రధానికి ఇలా స్వాగతం దక్కడంపై ఇక్కడి ప్రజలు గర్వపడుతున్నారు. మీ పాలనా నమూనాను ప్రపంచం మెచ్చుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీ ఆటోగ్రాఫ్ అడిగారు. మీ నాయకత్వంలో భారత్ను ప్రపంచం ఎలా చూస్తుందో ఇక్కడే తెలిసిపోతోంది. "The way the PM of Papua New Guinea touched your feet, it shows how much respect you have there. People of India feel proud when they see that our PM is being welcomed like this," says BJP national president JP Nadda as he welcomes PM Modi at Palam airport pic.twitter.com/6eVFWKRzee — ANI (@ANI) May 25, 2023 జైశంకర్ ఏమన్నారంటే.. పాపువా న్యూ గినియా ప్రధాని, మన ప్రధాని మోదీని ‘విశ్వ గురువు’గా భావిస్తున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని అయితే ఏకంగా మన ప్రధానిని ‘ది బాస్’ అని సంబోధించారు. ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈరోజు ప్రపంచం కొత్త భారతదేశాన్ని చూస్తోంది.