
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎడ్సెట్-2018 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు. ఫలితాలను ఆర్టీజీఎస్ వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన వారిలో 96.75 శాతం విద్యార్థులు ఉతీర్ణత సాధించినట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment