ganta srinivasa rao
-
లోకేశ్ సీఎం కావాలని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే అతిథి
-
‘గంటా’ ఆస్తుల వేలం!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు రూ.వందల కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో వారికి అప్పులిచ్చిన ఇండియన్ బ్యాంకు ఆస్తుల వేలానికి ఉపక్రమించింది. రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు జారీచేసినా గంటా బ్యాచ్ పట్టించుకోకపోవడంతో తనఖా పెట్టిన వాటిలో పలు ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బ్యాంకు వాటి వేలానికి రంగం సిద్ధంచేసి అందుకు సంబంధించిన తేదీని తాజాగా ప్రకటించింది. గంటా రుణాల ఎగవేత కేసులకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..విశాఖపట్నం వన్టౌన్లోని లక్ష్మీటాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్ నం.047165తో 2005 ఆగస్టు 18న రిజిస్ట్రర్ అయ్యింది. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ కాపిటల్తో ఈ సంస్థ ఏర్పడింది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడైన పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య, ప్రభాకరరావు ఉన్నారు. ఈ కంపెనీకి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నే అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబా గార్డెన్స్ శారదా వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఇవి పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం తాలుకా బకాయిలు అక్షరాలా రూ.390.58 కోట్లుగా బ్యాంకు అధికారులు లెక్కగట్టారు. మరో దఫా రుణానికి సంబంధించి వడ్డీతో కలిసి రూ.141.68 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయని ఇండియన్ బ్యాంకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. నోటీసులిచ్చినా బేఖాతరు.. ఆస్తుల స్వాధీనం..ఈ నేపథ్యంలో.. 2016 అక్టోబరు 4 నుంచి పలు దఫాలుగా బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేసి వడ్డీతో సహా కలిపి బకాయిలు చెల్లించాలని కోరారు. అయినాసరే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం.. మరోపక్క గడువు ముగియడంతో బ్యాంకు ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ గంటా ముందుకు రాకపోవడం.. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి ఏడు స్లాట్స్లో పూచీకత్తుగా పెట్టిన మరికొన్ని స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి 18న బ్యాంకు నోటీసులు జారీచేసింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్లయిన పరుచూరి వెంకట భాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతో పాటుగా కంపెనీకి హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్య ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు మరికొన్ని ఆస్తుల వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటన జారీచేసింది. కాగా, గతంలోనే బ్యాంకు కొన్ని ఆస్తులను వేలం వేయగా.. ఇప్పుడు రూ.390 కోట్ల రికవరీకి బ్యాంకు మరిన్ని ఆస్తుల వేలం ప్రకటన జారీచేసింది.ఆగస్టు 8న ఈ–వేలం..ఈ ప్రకటనలో.. పద్మనాభం మండలం ఐనద గ్రామం వద్ద ఉన్న సర్వేనెం.12లో వీరికి స్టార్ విలేజ్ పేరున వుడా లేఅవుట్లోని 5,326.54 చ.గజాల విస్తీర్ణంలో ఏడు స్లాట్స్లో ఉన్న 33 ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసుల్లో స్పష్టంచేసింది. వీటి విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, బ్యాంకు హెచ్చరిక జారీచేసింది. అదేవిధంగా రూ.390.58 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు గతంలో స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల విక్రయానికి కూడా మార్చి 18న బ్యాంకు మరోసారి నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో శనివారం ఇండియన్ బ్యాంకు ప్రకటనలిచ్చింది. మెస్సర్స్ ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో నగరంలోని గంగులవారి వీధిలో ఉన్న 274.65 చ.గజాల వాణిజ్య భవనం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి రిజర్వ్ ధరగా రూ.2.56 కోట్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ద్వారకానగర్లోని అదే సంస్థ పేరుతో శ్రీశాంత కాంప్లెక్స్లో ఉన్న ప్లాట్ నం.138సీ లోని 2,500 చ.గజాల విస్తీర్ణంగల రెండు ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి రిజర్వ్ ధరగా 1.26 కోట్లుగా నిర్ణయించారు. ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా.. ప్రాతిపదికన వేలంలో విక్రయిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఆగస్టు 8వ తేదీన గంటా అండ్ కో ఆస్తుల ఈ–వేలం పాట జరుగుతుందని ఇండియన్ బ్యాంకు పేర్కొంది.సంస్థకు డైరెక్టర్గా గంటా..నిజానికి.. పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఎమ్మెల్యే గంటా స్వయంగా తన బంధువులతో కలిసి ఈ కంపెనీ ప్రారంభించారని.. మొదట్లో గంటా కూడా డైరెక్టర్గా కొంతకాలం కొనసాగారని తెలుస్తోంది. ఈ కంపెనీకే జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణ బాధ్యతలను అప్పగించగా.. వ్యతిరేకత వ్యక్తంకావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో.. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. -
గంటా ఆస్తులు వేలానికి పెట్టిన ఇండియన్ బ్యాంక్
-
బ్యాంక్కు బురిడీ.. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రెడీ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియన్ బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయడానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 409 కోట్లు రుణం తీసుకున్న గంటా అండ్ కో ఎగ్గొట్టింది.తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేస్తామని పత్రిక ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. లోన్కు టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా మరో 8 మంది హామీదారులు ఉండగా, రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని టీడీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారు. -
అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు
కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సీనియర్లకు షాక్ ఇచ్చింది. పార్టీకి సుదీర్ఘ సేవలందించిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఒక్కరికే స్థానం కల్పించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పలుదఫాలుగా మంత్రులు పనిచేసిన గంటా, అయ్యన్నతో పాటు మూడో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి ఆశలపైనా నీళ్లు చల్లారు. మరోవైపు జనసేన నాయకులకూ ఇదే పరాభవం ఎదురైంది. గ్లాస్ కోటాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నాయకుడు కొణతాల ఆశలూ గల్లంతయ్యాయి.సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 24 మంది మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మాత్రమే చోటు లభించడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుండగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు ప్రాధాన్యమివ్వడంపై టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.అయ్యన్న, గంటాకు చెక్ !టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఒకసారి ఎంపీగా, ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడుసార్లు మంత్రిగా వ్యవహరించారు. ఈసారీ మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్న అయ్యన్నకు బాబు తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవడంపై అయ్యన్న కినుక వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒకసారి ఎంపీగా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు రిక్తహస్తాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటాకు చంద్రబాబు చెక్ పెట్టారు. అదేవిధంగా.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశించిన వెలగపూడి రామకృష్ణబాబుకు పరాభవం ఎదురైంది. పలుమార్లు పార్టీ కోసం త్యాగాలు చేసి.. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గం కోటాలో పల్లాకు రావాల్సిన మంత్రి పదవి కొలుసు పార్థసారధికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అయ్యన్నకు ఇవ్వాలా.. అచ్చెన్నకు ఇవ్వాలా అనే లెక్కల్లో చంద్రబాబు అచ్చెన్న వైపే మొగ్గు చూపడంతో అయ్యన్నపాత్రుడి వర్గం అధిష్టానం వ్యవహారశైలిపై గుర్రుగా ఉంది. మరోవైపు.. ఒకసారి మంత్రిగానూ, ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారు సత్యనారాయణమూర్తిని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. మూడోసారి గెలిచిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు మొండిచెయ్యి చూపించారు. పార్టీ కోసం విధేయంగా ఉన్న వారితోపాటు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విశాఖ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.గాజు గ్లాసులోనూ అసంతృప్తి జ్వాలజనసేనలోనూ అదే అసంతృప్తి కనిపిస్తోంది. సీనియర్లుగా ఉన్నవారికి కాకుండా కొత్తగా ఎంపికై న వారికి ప్రాధాన్యమివ్వడంపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. నలుగురిలో ఒక్కరికై నా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఒక్కరికి ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతునివ్వాలని భావించారు. కానీ.. నలుగురికీ చంద్రబాబు, పవన్ ద్వయం మొండి చెయ్యి చూపించింది. సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు, పంచకర్ల రమేష్బాబులో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని భావించారు. కానీ.. వారిద్దరికీ అవకాశం కల్పించలేదు.అదేవిధంగా ఆరేళ్లు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉన్నా రాజీనామాతో త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొత్తంగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విశాఖ జిల్లాను విస్మరించడంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కాపులతో వ్యవహరించిన తీరును... కాపు నేతలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. నాడు చెప్పుతో కొట్టి కేసులు పెట్టి వేధించిన అనిత... ఇప్పుడు ఓట్లు కావాలంటూ పైరవీలు చేస్తుండటం విమర్శలపాలవుతోంది. తమ సొంత సామాజికవర్గాన్ని వేధించిన అనితకు మద్దతుగా భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అనితను వ్యతిరేకించినందుకు ఏకంగా పార్టీ నుంచి కొద్దిమంది నేతలు సస్పెండ్ అయ్యారు.తమ వెనుక ఉండి నడిపించిన గంటా... తీరా తన సీటు కోసం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మళ్లీ అనితకు మద్దతివ్వాలంటూ పాయకరావుపేట నియోజకవర్గానికి వచ్చి మరీ చెప్పడాన్ని కాపులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు గంటా కాపు కాదని కాపునాడు తీవ్రంగా విమర్శలు చేసింది. కాపు సామాజికవర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకే తమ మద్దతని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంగా తమ సామాజికవర్గాన్ని తీవ్రంగా అవమానించిన అనితతోపాటు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన గంటాకూ తమ దెబ్బ రుచి చూపిస్తామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనిత బాధితులెందరో...! ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత నియోజకవర్గంలోని నేతలందరిపైనా అధికారం చెలాయించారు. కాపు నేతలపై మరింత కక్షపూరితంగా వ్యవహరించారు. ఏకంగా కాపు నేతలను చెప్పుతో కొట్టడమే కాకుండా కేసులు బనాయించి మరీ వేధించారు. కాపుల మద్దతుతో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత మంగవరం గ్రామానికి చెందిన ఒక కాపు యువకుడ్ని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టారు. తనపై తప్పుగా వ్యాఖ్యలు చేశాడన్న ఆగ్రహంతో చెప్పుతో కొట్టి కాపు జాతిని ఘోరంగా అవమానించారు. మహిళా ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పే కానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఆ సామాజిక వర్గం పెద్దల సమక్షంలో మందలించడం దీనికి పరిష్కారం. ఇవేమీ చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో వ్యవహరించారు.చెప్పుతో కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అదే విధంగా ఆనాడు ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిన కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన సీనియర్ నేత గెడ్డం బుజ్జిపై అత్యాచారం కేసు పెట్టించింది. అతన్ని అరెస్టు చేయించడానికి తన అధికారాన్ని అంతా ఉపయోగించింది. బుజ్జికి చెందిన భూములపై సిట్కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బుజ్జికి అండగా నిలబడటంతో ఆయన అరెస్టు నుంచి బయటపడ్డారు. తన గెలుపునకు సహకరించిన మరో కాపు నేత తోట నగేష్ పట్ల కూడా ఆమె నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అనిత ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నారు. అలాగే పట్టణానికి చెందిన మరో ఇద్దరు కాపు టీడీపీ నాయకులు గొర్లె రాజబాబు, మజ్జూరి నారాయణరావుల పట్ల కూడా అనిత కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఈ ఇద్దరు నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం, వారు వేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంగా వారిద్దరినీ గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది.గంటా మధ్యవర్తిత్వంపై కాపుల్లో ఆగ్రహం అనిత చేతిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న గెడ్డం బుజ్జి పలుసార్లు జనసేన సమావేశాలు ఏర్పాటు చేసి అనితకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, ఓడించి తీరుతామంటూ గతంలో ప్రకటనలు చేశారు. కాపులను చెప్పుతో కొట్టి... తమ నేతపై రేప్ కేసు పెట్టిందని పదే పదే బుజ్జి అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. బుజ్జి మెత్తబడడాన్ని కూడా ఆయన అనుచరులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తోట నగేష్ జనసేనలో చేరి అనితకు మద్దతుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటివరకు గంటా వర్గంగా ముద్రపడి... అనితను తీవ్రంగా వ్యతిరేకించిన గొర్లె రాజబాబు, నారాయణరావులు ఏకంగా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు.అయితే గంటా వీరి మధ్య రాజీ కుదిర్చారు. ‘నీకు సీటు ఇవ్వాలంటే పాయకరావుపేటలో నీ వర్గాన్ని అనితకు మద్దతు ఇచ్చేలా చేయాల్సిందే’నంటూ చంద్రబాబు నుంచి గంటాకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వారి మనోభావాలను సైతం పట్టించుకోకుండా గంటా వ్యవహరించాడంటూ ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గంటాది అసలు కాపు సామాజికవర్గమేనా అని కాపునాడు నేతలు నేరుగా ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు అత్యధిక సీట్లను కేటాయించిన వైఎస్సార్సీపీకి మద్దతిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. -
రఘురామ, గంటాకు బ్యాంకుల షాక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇండ్ భారత్ థర్మల్కు చెందిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది. -
రఘురామ, గంటాకు బిగ్ షాక్
విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్లకు భారీ షాక్ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించిన భూములు, ప్లాంట్ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది. ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘గంట’కు రూ.100.!
‘రండి బాబూ రండి.. గంటా వారి ప్రచారానికి వస్తే.. గంటకు వంద రూపాయలు. ఆలోచించినా ఆశాభంగం.. వచ్చి.. జై గంటా అంటే చాలు.. మీ చేతిలో వంద నోటు పెడతాం.. రండయ్యా.. ప్లీజ్..’ భీమిలిలో గంటా వర్గం తీరిదీ.. సాక్షి, విశాఖపట్నం : ఎవరైనా సరే.. ఎలాగైనా సరే.. నోటిస్తే.. ఓటేస్తారు.. ఇదే సిద్ధాంతంతో గత ఎన్నికల్లో మంది రాజకీయాలు చేసిన గంటా శ్రీనివాసరావుకు ఈ సారి భీమిలిలో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఒక రేటు కట్టి గంపగుత్తగా బేరమాడి దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన గంటాకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రచారానికి ప్రజలే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలు.. జతకట్టిన బీజేపీ, జనసేన శ్రేణులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరో గంటలో ప్రచారం మొదలు పెట్టాల్సి ఉండగా.. గంటా గ్యాంగ్ రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. ఎవరు కనిపించినా.. బాబూ.. రండి.. గంట సేపు జెండా పట్టుకొని మా ప్రచారంలో నడవండి. గంటకు ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండొద్దు. గంట కొట్టగానే.. మీ చేతిలో వంద పెడతాం.. మీకు ఇచ్చిన జెండా మా చేతిలో పెడితే చాలూ.. బాబ్బాబూ.. అమ్మా.. రండమ్మా.. అంటూ బతిమాలుకుంటూ తీసుకొస్తున్నారు. గంట సేపు ప్రచారం మరో పావుగంటలో ముగుస్తుందనగా.. సెకండ్ బ్యాచ్ కోసం వెతుకులాటలు ప్రారంభిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండటంతో గంటా గ్యాంగ్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వచ్చిన వారితో గంపగుత్త బేరాలు కూడా మాట్లాడుకుంటున్నారు. చెప్పిన టైమ్కి ప్రతి రోజూ వస్తే.. రోజూ డబ్బులిస్తామని బతిమాలుకుంటున్నారు.నోటు చూపిస్తే.. వాళ్లే వస్తారులే.. ప్రచారానికి జనం దొరకడం లేదనీ.. గంటా శ్రీనివాసరావు ప్రచారానికంటే మేము రామంటే రామని తెగేసి చెబుతున్నారని గ్యాంగ్ లీడర్లు.. గంటా దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ‘ఎందుకు రారు.. నోట్లు చూపించండి.. వాళ్లే.. తోకలూపుతూ వచ్చేస్తారు. గంటకు వంద కాకపోతే.. మరో యాభై కలపండి.. అప్పటికీ కాదంటే.. ఇంకో వంద ఇస్తామని చెప్పండి.. గెలిచిన తర్వాత.. భీమిలి మొత్తం మనదే కదా.. ఇచ్చిన వందకు వందరెట్లు లాగేద్దామని’ తన అనుచరులతో గంటా చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎరవేస్తున్నా ప్రచారానికి రాకపోవడంతో గంటా ప్రలోభాలు మితిమీరేలా చేస్తున్నాడు.కేసులు నమోదవుతున్నా... మరోవైపు ప్రచారానికి జనం రాకపోవడంతో కొడుకు, తన గ్యాంగ్ను వివిధ ప్రాంతాలకు పంపించి ప్రచారం చేయిస్తున్నారు. జనం తనతో కలిసి నడవకపోవడంతో దేవాలయాలు, మసీదుల దగ్గరికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రోడ్లను బ్లాక్ చేసి దారినపోతున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్.. గంటా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా.. పదే పదే కోడ్ ఉల్లంఘిస్తూ.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు అడ్డమైన వ్యవహారాలు నడిపిస్తున్నారు. గెలుపు కష్టమని తెలిసినా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న గంటా ప్రలోభాల పర్వంపై భీమిలి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. -
గంటా శ్రీనివాసరావుకి షాక్ భీమిలి వైఎస్సార్సీపీ లో భారీ చేరికలు
-
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
గంటా కుమారుడిపై కేసు నమోదు
మధురవాడ : భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, టీడీపీ నాయకులు నమ్మి శ్రీను, జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ తండ్రి, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు తదితరులపై పీఎంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా గురువారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపే నెపంతో శివశక్తినగర్ రోడ్డులోని సద్గురు సాయినాథకాలనీలోలో ఉన్న మసీద్–ఇ– ఫిర్ధౌస్లో పార్టీ కండువాలు ధరించి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ల ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించి స్వీట్స్బాక్స్లు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా గంటా కుమారుడు రవితేజ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను తదితరులు పంపిణీ చేశారు. దీనిపై‘సాక్షి’ దినపత్రికలో ‘టిడీపీ బరితెగింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. భీమిలి హారి్టకల్చర్ ఆఫీసర్, నియోజకవర్గ ఎంసీసీ టీమ్–4 ఇన్చార్జ్ ఆర్పీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గంటా బావమరిదిపై చర్యలు తీసుకోవాలి ఈ పంపిణీ వ్యవహారంలో గంటా బావమరిది జీవన్ కుమార్తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వీరు పేర్లు ఫొటోలు కూడా పత్రికలో ప్రచురితమయ్యాయి. అయితే వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదని విమర్శలు వస్తున్నాయి. మరింత లోతుగా విచారణ చేసి కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
Bheemili: భీమిలి భూములపై కన్నేసిన గంటా శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : భీమిలి భయపడుతోంది.. 2014 నుంచి ఐదేళ్ల పాటు వారి చెరలో చిక్కుకున్న భూమాత మళ్లీ.. చిగురుటాకులా వణికిపోతోంది. భూచోళ్లు అంతా కలిసి వస్తున్నారని సంకేతాలతో జనం గుండెలు అదురుతున్నాయి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అక్రమార్కులు అధికారం అండ ఉన్న బంధువులు కుమ్మక్కై కనిపించిన జాగాలన్నీ కబ్జా చేసిన ఘనులకు సూత్రధారిగా నిలిచిన గంటా శ్రీనివాసరావు కన్ను ఇప్పుడు భీమిలిలో మిగిలిన భూములపైనా పడింది. అందుకే పట్టుబట్టి మరీ భీమిలి టికెట్ సాధించి ఇప్పుడు భూ కబ్జారాయుళ్లనంతా పోగేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశంలోనే రెండోదిగా, ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి పురాతన మున్సిపాలిటీగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత భీమిలికి 2014–19 కాలంలో కొత్త పేరుని తీసుకొచ్చారు గంటా అండ్ కో. కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ, భీమిలికి ఉన్న మంచి పేరుని కాస్తా చెరిపేసి.. భూకబ్జాల భీమిలిగా మార్చేసి.. నియోజకవర్గ పరువుని బంగాళాఖాతంలో కలిపేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు భీమిలి నియోజకవర్గంలో పాగా వేసిన గంటా ఆక్రమించిన భూముల లెక్క రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సహజంగా ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా నిజమైనా... అనిపిస్తుంది.. కానీ ఆయన అల్లుడుతో పాటు బినామీలు, టీడీపీ తోడేళ్లు ఐదేళ్ల పాటు ఇదే పనిలో ఉండి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మింగేశారనేది ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా బయటకు వచ్చే వాస్తవం. వాటిలో కొన్ని మచ్చుకు పరిశీలిద్దాం.. సీలింగ్ భూముల కథ ఇదీ.. నిరుపేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ భూములను చుట్టేసేలా గంటా అండతో అతని అల్లుడు, బినామీలు కలిసి భూదందా చేశారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన కోరాడ వెంకటస్వామినాయుడు 1973 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం తమ కుటుంబం పేరిట ఉన్న 45.59ఎకరాల మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. 1975వ సంవత్సరంలో ఆయన ఇచ్చిన భూ వివరాలను పరిశీలించిన ల్యాండ్ సీలింగ్ అథారిటీ ఆ భూముల అప్పగింతపై ట్రిబ్యునల్ తీర్పు (ఎల్సీసీ 230బై75) ఇచ్చింది. ఈ మేరకు విశాఖ రూరల్ మండలం మధురవాడలో సర్వే నంబర్ 262/4, 263/æ2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 277/1కి సంబంధించి 28.84ఎకరాలు, ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో 1.66ఎకరాలు, ఆనందపురం గ్రామంలో 6.81ఎకరాలు, వెల్లంకి గ్రామంలో 8.28ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఇక్కడ వరకు అంతా సాఫీగానే జరిగినా కోరాడ వెంకటస్వామినాయుడు మృతి తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుటుంబీకుల్లో కొందరు ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను సైతం అడ్డగోలుగా విక్రయించేశారు. మధురవాడ పంచాయతీ పరిధిలో ఇచ్చిన 28.84ఎకరాల భూమిని కోరాడ వారసులు కృష్ణా కో–ఆపరేటివ్ సొసైటీకి విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పటి చినగదిలి ఎమ్మార్వో ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కోరాడ వారసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఆ భూములను విక్రయించేశామని, అందుకు బదులుగా తమకు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ బంటుపల్లి వారి కల్లాలు గ్రామంలో ఉన్న 28.80ఎకరాల (సర్వే నంబర్లు 39/1, 39/2) భూమిని అప్పజెబుతామని కోర్టును అభ్యరి్థంచారు. ఈమేరకు కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుచేసి ఆ భూమిని స్వా«దీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేశారు. దీంతో ఆ వారసులు మరోసారి ఆ భూముల్లో కొన్ని ఎకరాలను 2006లో విక్రయించేశారు. సర్వే నంబర్ 39/1, 39/5ఏలో 11.8ఎకరాల భూమిని విక్రయించేశారు. అదేవిధంగా వెల్లంకి గ్రామంలో ప్రభుత్వానికి ఇచ్చేసిన 1.14ఎకరాల భూమిని తిరిగి గారిపేట వాస్తవ్యుడు కోరాడ అప్పలస్వామి, రాములకు విక్రయించేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా, ఆ భూమికి బదులు సర్వే నంబర్ 263/2, 264/16లోని 1.14 ఎకరాలు అప్పగించారు. మళ్లీ 263/æ2 లోని 0.34ఎకరాల భూమిని అమ్మేశారు. మొత్తంగా 30 ఎకరాల పంపిణీకి సంబంధించిన పక్కా వివరాలు లేకున్నా కోరాడ కుటుంబీకులు మాత్రం ఇప్పటికే తాము 34.45ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి అప్పగించామని లెక్క కట్టేశారు. ఇంకా తాము 11.14ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని తేల్చేశారు. ఆ 11.14ఎకరాల భూపంపిణీకీ ఇంకో మతలబు పెట్టారు. గతంలో తాము ఆనందపురం గ్రామంలో అప్పజెప్పిన 4.15ఎకరాలు రెండుపంటలు పండే భూమి అని పేర్కొన్నారు. పంటలు పండే భూమి, మిగులు భూముల నిష్పత్తి 1:2 ప్రకారం.. 11.14 ఎకరాల్లో 4.15 ఎకరాలను మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ లెక్కన తాము కేవలం 6.63ఎకరాల భూమి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఆ భూమి కూడా నర్సీపట్నం పరిసరాల్లోని భూములను ఇస్తామని ప్రతిపాదించారు. ఈ లెక్కన కల్లాలు గ్రామంలోని 11.14ఎకరాల భూమిని తమకు మినహాయించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ జిల్లాకోర్టులో కేసు వేశారు. అల్లుడు రంగప్రవేశంతో.. కోర్టు విచారణ పూర్తికాకున్నా ఈలోగా గంటా అల్లుడు రంగంలోకి దిగారు. కోరాడ వారసులకు, అల్లుడికి మధ్య టీడీపీ నాయకులు కోరాడ నాగభూషణం, గాడు వెంకటప్పడు, ఇతర నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. అధికారికంగా పేర్కొంటున్న 11.14ఎకరాలతో సహా తొక్కిపెట్టిన 30ఎకరాలపైగా భూమికి సంబంధించి ఒక్క గజం కూడా ఎవ్వరికీ పంపిణీ చేయకుండా వీళ్లే పంచేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. అంతే కాదు.. గంటా భీమిలి ఎమ్మెల్యేగా.. మంత్రిగా నియోజకవర్గానికి ఏమీ వెలగబెట్టకపోయినా.. అడ్డగోలు సంపాదనకు మాత్రం తెరతీశారు. అనుచరగణంతో కలిసి భూ దందాలతో రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.కోట్ల రుణాలు పొందినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. వెలుగులోకి రాని భూబాగోతాలెన్నో.. మళ్లీ.. అదే గ్యాంగ్తో హల్ చల్.! భీమిలిలో గంటా గ్యాంగ్ చేసిన అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలతో ప్రజలంతా విసిగిపోయారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని భూ కబ్జాల కేంద్రంగా మార్చిన గంటాకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రజలంతా డిసైడైపోయారు. విషయం తెలుసుకున్న గంటా.. నియోజకవర్గం నుంచి పారిపోయి ఉత్తరం పంచన చేరారు. ఆయన అనుచరగణం.. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా వేరైపోయారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ప్రజలు అంతా మర్చిపోయి ఉంటారని భావించిన గంటా.. తిరిగి భీమిలికి చేరుకున్నారు. వచ్చిందే తడవుగా.. తన కబ్జాల అనుచరగణాన్ని చేరదీసుకుంటున్నారు. టీడీపీలో సస్పెండ్కు గురైన కబ్జా గ్యాంగ్పై సస్పెన్షన్ను ఎత్తివేసేస్తూ.. మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. గాడు వెంకటప్పడు, కోరాడ నాగభూషణరావు తదితర బ్యాచ్ను పోగేసుకుంటున్నారు. గంటా బాబా.. అరడజను దొంగల మాదిరిగా.. దొంగల ముఠా అంతా ఒక చోట చేరుతుండటంపై భీమిలి ప్రజలు మళ్లీ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇంక ఆక్రమించేందుకు ఏమున్నాయని వాపోతున్నారు. అయినా డబ్బులు ఎరవేసి, భయపెట్టి.. బెదిరించి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న గంటా.. గెలిస్తే భీమిలిలో ఉన్న కొద్ది పాటి భూములను సైతం తన గ్యాంగ్తో కలిసి కాజేయ్యాలన్న కుట్రతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అందలం ఇస్తే.. భీమిలిని సర్వనాశనం చేస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. -
భలే మంచి లంచ్ బేరం
సాధారణంగా ఒక హోటల్లో లంచ్ చేస్తే సుమారు రూ.500 బిల్లు అవుతుంది.. అదే స్టార్ హోటల్ అయితే రూ.1000 నుంచి రూ.1500. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతల ఇళ్లల్లో మాత్రం లంచ్ ఖరీదు రూ.లక్షల్లోనే ఉంటుంది. లంచ్ ఒక్కటే కాదు.. టీ, టిఫిన్, డిన్నర్ ఏదైనా చాలా ఖరీదు చేసేశారు. ఇంతకీ ఈ లక్షల రూపాయల లంచ్ గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓట్ల రాజకీయంతో పనికాదని గ్రహించి.. నోట్ల రాజకీయాలకు తెర తీసింది. ప్రత్యర్థి పార్టీ నేతలను లంచ్, డిన్నర్కి పిలిచి బేరాలు పెడుతోంది. సర్పంచ్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి వరకూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేస్తోంది. ఇందులో సిద్ధ హస్తుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని.. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు ఇదే ఫార్ములా అవలంబిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను సంతలో పశువుల్లా బేరాలాడి కొనేస్తే చాలని లెక్కల్లో తలమునకలయ్యారు. లంచ్, డిన్నర్ పేరుతో లక్షలు ముట్టజెబుతున్నారు. గంటా రూటే సేపరేట్ టీడీపీ పెద్దల కాళ్లా వేళ్లా బతిమాలి ఎట్టకేలకు భీమిలి టికెట్ సాధించుకున్న గంటాకు ఎన్నికలంటే డబ్బుతో గెలవడమే అనే నైజం. ప్రజలన్నా నాయకులన్నా ఆయన దృష్టిలో ఓటును, వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనస్తత్వం కలవారు. రూ.500కి వెయ్యకపోవచ్చు.. రూ.వెయ్యికి వెయ్యకపోవచ్చు.. రూ.2 వేలు.. ఇలా.. ఏదో ఒక నంబర్ దగ్గర ఓటరు తనకు లొంగుతారనే విర్రవీగే మనస్తత్వంతో రాజకీయాలు చెయ్యడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఇదే మాదిరిగా చోటా మోటా నాయకులకు సైతం వెలకడుతున్నారు. గంటా ఒక్కరే కాదు టీడీపీ నుంచి టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్క నాయకుడూ ఇదే రీతిలో ఆలోచిస్తూ రాజకీయాలి్న, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. విలువలు అమ్ముకుంటూ రాయ‘బేరాలు’ వెన్నుపోటు రాజకీయాలు మొదలైనప్పటి నుంచి విలువలను విడిచిపెట్టి అడ్డగోలుకు కేరాఫ్గా మారిపోయింది టీడీపీ. అంతా ఆ తాను ముక్కలే అన్నట్లుగా పార్టీలలో ఉన్నవారంతా కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. డబ్బుతోనే ఏదైనా సాధ్యమనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు తమ ఇంటికి లేదా సమీపంలో ఉన్న ఓ హోటల్కి భోజనానికి ఆహ్వానించడం.. రాయ‘బేరాలు’ మాట్లాడుకోవడమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. బేరం కుదిరిన వెంటనే చోటా నేతలు కండువాలు కప్పేసుకుంటున్నారు. ►చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు ఇటీవలే పలువురు ప్రత్యర్థి పార్టీ నేతలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసుకున్నారు. ►పాయకరావుపేటలో వంగలపూడి అనిత.. ఓ హోటల్లో సామాజికవర్గ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులను ఆత్మీయ సమావేశం పేరిట ఆహా్వనించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతూ సర్పంచ్కు రూ.2 లక్షలు, ఎంపీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు, 100 ఓట్లు ప్రభావితం చేసే సామాజికవర్గ నాయకుడికి రూ.5 లక్షలకు బేరం పెట్టేసుకున్నారు. ►పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు సైతం అదే రాయబేరాలు సాగిస్తున్నారు. ఈయన రూ.లక్ష నుంచి తన బేరాలు మొదలు పెడుతున్నారు. ►ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ప్రజలకు ఇంకా అందించాల్సిన మౌలిక సదుపాయాలు, వారి అభిప్రాయాలు సేకరిస్తుంటే.. టీడీపీ అభ్యర్థులు మాత్రం.. నేతల కొనుగోలులో బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.2 కోట్లకు డీల్..! భీమిలి నియోజకవర్గంలో జరిగిన బేరం ఖరీదు అక్షరాలా రూ.2 కోట్లు. ఇక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుడి మద్దతును టీడీపీ నేతలు కోరారు. అతడు ఒప్పుకోలేదు. బతిమలాడారు.. లంచ్, డిన్నర్కు ఆహా్వనించారు. పనవ్వలేదు. స్వయంగా వాళ్లే భోజనానికి వెళ్లారు. అర కోటి నుంచి బేరం మొదలైంది... చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే భీమిలిలో ఓ జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షల ధర పలికింది. మరికొందరు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు బేరాలు కుదిరినట్లు తెలిసింది. కొంతమంది మాజీ నేతలు, పలుకుబడి ఉన్న నేతలకు కూడా మరో రేటు ఫిక్స్చేసినట్లు సమాచారం. సీఎం రమేష్ రాకతో పెరిగిన రేట్లు 300 మంది రౌడీ మూకలను వెంటబెట్టుకొని అనకాపల్లిలో అడుగుపెట్టిన మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్ రాకతో.. ఆయా ప్రతినిధులు తమ రేట్లను అమాంతం పెంచేసుకుంటున్నారు. తమను నమ్ముకొని ఉన్న ప్రజలను పక్కన పెట్టేసి.. తమకింత ఇస్తే చాలు.. మీ పార్టీ కండువా కప్పేసుకుంటామంటూ బేరాలాటలో మునిగితేలుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులకు అమ్ముడుపోయి.. పార్టీ కండువాలు మార్చేసుకుంటూ.. టీడీపీ పంచన చేరుతున్న నేతలను చూసి జనం ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపించామా అని అసహ్యించుకుంటున్నారు. -
ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం ఆయన స్పెషల్
ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకర్గాన్ని మారుస్తుంటారు. గెలిచిన చోట ప్రజలకు ఏమీచేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు. టీడీపీలో ఓ నేత ఉన్నాడు. దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం, అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు. బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంటా 2004లో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీని వదిలేసి..ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్ళీ టీడీపీ గూటికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. చదవండి: ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు? రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు. ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 2014లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు. దీంతో భీమిలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక భీమిలిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంటా 2019లో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2019లో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న గంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. అయినా సరే అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. తనకున్న ఏరుదాటాక తెప్ప తగలేసే అలవాటు ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంను మర్చిపోయారు. ఐదేళ్ళ కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు. పదేళ్ళ క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్ళీ కన్నేశారు. అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు. సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం.. గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది. తీసుకున్న అప్పు.. వడ్డీతో కలిపి 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో గంటా తనకా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన, టిడిపిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు. దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా చంద్రబాబు, పవన్లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకుపోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఔ పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు భీమిలిలో గంటాకు..అటు టీడీపీ నుంచి..ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
Bheemili: టీడీపీలో సీట్లకు వేలంపాట.. చంద్రబాబుపై కోరాడ రాజబాబు ఫైర్
సాక్షి, విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మండిపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా పాల్పడ్డారని దుయ్యబట్టారు. గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు. టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు. యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు. స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు’’ అని రాజబాబు ప్రశ్నించారు. -
‘ఉత్తర’ కుమారుడు.. మళ్లీ భీమిలికి..
సాక్షి, విశాఖపట్నం: ఆయనో రాజకీయ సంచారజీవి.. పిల్లిపిల్లలను మార్చిన చందంగా ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ.. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని ఏమారుస్తూ.. గెలిచిన తర్వాత.. ఓటర్లను మోసం చేస్తూ.. చివరి నిమిషంలో అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఎన్నికలకో సెగ్మెంట్ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్థులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు. నిన్న మొన్నటి వరకూ టికెట్ కోసం అధిష్టానం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే స్థితికి చేరుకున్న గంటాకు.. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పగా.. చివరికి బతిమాలుకొని భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన వలస రాజకీయంతో మరోసారి భీమిలి ప్రజలను మోసం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్గా జీవితాన్ని ప్రారంభించాడు. చిరుద్యోగిగా ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా.. ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. 1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టినా.. కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ పరాకాష్టకు చేరుకుంది. అంతులేని గంటా గ్యాంగ్ దందాలు ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లెక్క చెయ్యకుండా.. అవినీతిని కొనసాగించడమే గంటా స్టైల్. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతితో పాటు.. ప్రత్యూష పేరుతో కంపెనీ స్థాపించి.. రూ.200 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టేశారు. దీంతో సదరు ఇండియన్ బ్యాంకు గంటా అండ్ కో అడ్డగోలుగా సంపాదించిన పలు స్థలాల్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని స్థలాల్ని స్వా«దీనం చేసుకుంది. గంటా దోపిడీ పర్వాన్ని మొత్తం లెక్క కడితే రూ.వందల కోట్లపైనే ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకూ గంటా గ్యాంగ్ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ మొఖం చూపించలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. నమ్ముకొని ఓటేసిన భీమిలి ప్రజలకు ఏమాత్రం మంచి చెయ్యకుండా కనిపిస్తే కబ్జా పేరుతో దందా సాగించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో విశాఖలో భూ దందాలకు తెగబడినప్పుడు కీలక సూత్రధారి గంటాయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావే భూదొంగ అంటూ అదే పారీ్టకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా సిట్కు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టడంతో తరుణంలో భీమిలి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంటా నిర్ణయించుకున్నారు. ఓటేసిన జనాన్ని లెక్క చేయని గంటా.. తాను చేసిన అక్రమాలు, అవినీతి పనులు బట్టబయలు కావడంతో 2019 ఎన్నికల్లో భీమిలి ప్రజలు ఛీకొడతారని ముందుగానే ఊహించిన గంటా.. వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్ తెచ్చుకున్న గంటా.. ఎన్నికల సమయంలో ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని మోసపూరిత హామీలతో మభ్యపెట్టారు. పోలింగ్ సమయంలో చివరి నిమిషంలో బర్మాక్యాంపు తదితర కొండవాలు ప్రాంతాల్లో దొంగ ఓట్ల వ్యవహారంతో గట్టెక్కి విజయం సాధించారు. అంతే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేటి వరకూ ఉత్తర ప్రజలకు ఒక్కసారైన మొహం చూపించకుండా ఎంవీపీలోనే తిష్టవేసుక్కూర్చున్నారు. తాము ఓటేసి గెలిపించిన పాపానికి తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన చెందుతున్న నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు అండగా నిలబడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈసారి ఉత్తరంలో పోటీ చేస్తే.. ఓటమి తప్పదని భావించిన గంటా.. మరోసారి భీమిలికి వెళ్లిపోవాలని అక్కడి నేతలతో మంతనాలు ప్రారంభించారు. గెలుపొందిన చోట్ల దోపిడీకి పాల్పడే గంటా చేతిలో మరోసారి తాము మోసపోయే స్థితిలో లేమని భీమిలి ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినా నిస్సిగ్గుగా భీమిలిని దోచుకునేందుకు గంటా మళ్లీ బయలుదేరడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆస్తుల వేలంకు... గంట కొట్టేశారు
చీపురుపల్లి: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్న చందగా చీపురుపల్లి టీడీపీ శ్రేణుల పరిస్థితి మారింది. గంటా వస్తారు.. డబ్బు సంచులు తెస్తారు.. వాహనాలు ఇస్తారు.. కావాల్సినవన్నీ సమకూర్చుతారని ఆశగా ఎదురు చూశారు. ఊహాలోకంలో విహరించారు. ఇప్పుడు గంటా ఆస్తుల వేలంపాటకు బ్యాంకులు గంట మోగించడంతో.. ఎదురు చూపులన్నీ గాలిలో కలిసినట్లేనా.. సంభాషణలన్నీ నీటి మీద రాతలేనా... అయ్యో ఎంతపనైపోయిందంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చీపురుపల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై పోటీకు విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వెళ్లమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గంటా వస్తే.. డబ్బుకు కొదవ ఉండదు.. ఎంతకావాలంటే అంత నొక్కేయవచ్చు అని గత కొంత కాలంగా కొందరు నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూశారు. తాజాగా గంటాకు చెందిన ఆస్తుల వేలంకు ఇండియన్ బ్యాంక్ శుక్రవారం నోటీసులు ఇచ్చిందన్న వార్త తెలియడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఏదో అనుకున్నాం గానీ పారాచ్యూట్ నేత ఇంతటి ఘనుడా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. బయటకు పెద్ద మనిషిలా కనిపించినా బ్యాంకులకు సకాలంలో డబ్బులు చెల్లించని పెద్ద మనిషి అనుకోలేదంటూ రచ్చబండలపై మాట్లాడుకోవడం గమనార్హం. ‘గంటా’ ఆస్తుల వేలంకు నోటీసులు.... విశాఖపట్టణంలోని వన్టౌన్లో ప్రత్యూష రిసోర్స్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్రారంభ సమయంలో డైరెక్టర్గా కొనసాగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం హామీదారునిగా ఉన్నారు. ఈ కంపెనీ ఇండియన్ బ్యాంక్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం రూ.390.58 కోట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. తిరిగి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆస్తులను ఏప్రిల్ 16న వేలం వేయనున్నట్టు ఈ నెల 18న ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ఐవీఆర్ఎస్తో ఫేక్ సర్వేలకు దిగిన పారాచ్యూట్ బ్యాచ్.. ఇదిలా ఉండగా బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి, ఆస్తుల వేలం వరకు వచ్చిన పారాచ్యూట్ బ్యాచ్ రాజకీయాల్లో కూడా ఫేక్ సర్వేలకు దిగింది. పారాచ్యూట్ నేత గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేసే ధైర్యం లేక సర్వేలు ద్వారా మంత్రి బొత్స ఇమేజ్ను తెలుసుకునేందుకు పన్నాగం పన్నారు. దీని కోసం పారాచ్యూట్ బ్యాచ్ ఫేక్ ఐవీఆర్ఎస్ సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులు ఐవీఆర్ఎస్ ద్వారా బొత్స సత్యనారాయణకు ఓటు వేయాలంటే ఒకటి నొక్కండి.. లేదంటే రెండు నొక్కండి అంటూ ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మంత్రి బొత్సకు సంపూర్ణ మద్దతు లభించడంతో పారాచ్యూట్ బ్యాచ్తో బాటు నేత కూడా కంగుతిన్నట్టు సమచారం. ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ ఒకటే నొక్కడంతో ఏం చేయాలో వారికి తోచలేదు. మొత్తానికి చీపురుపల్లిలో గంట మోగించలేమన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. -
భీమిలిలో గంటాపై IVRS సర్వే
-
గంటా శ్రీనివాస్ దారెటో తేలిది ఇవాళే!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారా?.. లేదంటే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చే ప్రధానంగా నడుస్తోంది. చీపురుపల్లిలో పోటీ తన వల్ల కాదని గంటా చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చేశారు. దీంతో ఆయన ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు నన్ను సరైన అభ్యర్థిగా పార్టీ భావించింది. చీపురుపల్లిలో సీనియర్ లీడర్పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టింది’’.. ఫిబ్రవరి 23వ తేదీ ప్రెస్మీట్లో గంటా శ్రీనివాసరావు చెప్పిన మాట. అయితే వెంటనే ఆయన వెనకడుగేశారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెబుతూనే.. అక్కడ నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు. ‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో అదీ బొత్స లాంటి పవర్ఫుల్ లీడర్పై పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు కనికరించడం లేదు. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచే చేయాలని.. లేకుంటే మీ దారి మీరు చూస్కోండంటూ చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం. తాజాగా బుధవారం కూడా ఆయన చంద్రబాబును కలిసినా.. అదే సమాధానం వచ్చింది.దీంతో.. గంటా శ్రీనివాస్ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. -
వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్ అండ్ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం. సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు. జలవనరులను దోచి ఇచ్చినా ఉమాను పక్కన పెట్టిన బాబుఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు నిరాకరించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సుదీర్ఘకాలం కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నా ఎవరూ ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టును దోపిడీకి ఉపయోగించుకున్నారు. ఇతర సాగు నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతిని పారించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అందిన కాడికి దండుకుని వేల కోట్లు పోగేశారు. ఆ అక్రమ సంపాదనను చంద్రబాబు, లోకేశ్కి కట్టబెట్టి వారి మెప్పు పొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో అవినీతి పిచ్చిలో మునిగిపోయిన ఉమ తన కేడర్, నేతలను వదిలేశారు. జిల్లాలో ఇతర నాయకులు, సీనియర్లను కూడా ఇబ్బంది పెట్టారు. జిల్లా పార్టీలో తానే సర్వం అయ్యారు. పని మీద వెళ్లిన పార్టీ నేతలను అవమానించారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో బాబు ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో తనకు ఎంత సహకరించినా, అవినీతి సొమ్ములో కమీషన్లు కట్టినా చంద్రబాబు కనికరించలేదు. గంటాతో భూకుంభకోణాలు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవకాశవాద రాజకీయానికి, అవినీతికి నిలువెత్తు రూపమైనా చంద్రబాబుకు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. గంటా ద్వారా చంద్రబాబు విశాఖలో ఊహించని రీతిలో భూ దందాలు చేయించారు. విశాఖ జిల్లావ్యాప్తంగా నానా బీభత్సం సృష్టించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిన ప్రతిచోటా గంటా పేరు వినిపించేది. దీంతో పార్టీలో, జనంలోనూ ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇక గంటాతో ఉపయోగం లేదనుకున్న చంద్రబాబు ఈసారి విశాఖలో సీటు లేదని కరాఖండిగా చెప్పారు. ఏకంగా జిల్లా దాటించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. దీంతో గంటా ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నారు. అన్ని విధాలుగా వాడుకుని చింతమనేనికే ఎసరు టీడీపీలోని పాపులర్ నాయకుల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూసేందుకే నేతలు, ప్రజలు భయపడేవారు. పోలవరం కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టిని తవ్వి అమ్మేసి డబ్బు దండుకున్నారు. తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తవ్వి కనీవినీ ఎరుగని రీతిలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అనధికారిక మంత్రిగా వ్యవహరించారు. అంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడికి చింతమనేని క్రమం తప్పకుండా కప్పం కట్టారు. వారి అండ చూసుకుని చింతమనేని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అల్పులుగా చూశారు. ఇసుకను అక్రమంగా తవ్వద్దని అడ్డపడినందుకు మహిళా తహసీల్దార్పైనే దాడి చేసిన ఘనుడు. దానికి చంద్రబాబు వంతపాడి తహశీల్దార్నే తప్పుపట్టి రాజీ చేశారు. ఇలా అనేక దౌర్జన్యాలకు పాల్పడిన చింతమనేనిపై 40కిపైగా కేసులున్నాయి. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా గొడవలకు వెళ్లడం, రౌడీయిజంతో భయపెట్టడంతో జనం ఆయన్ని 2019లో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు సీటిస్తే పని చేసేది లేదని చెప్పడంతో చంద్రబాబూ ఆయన్ని వదిలించుకోవాలనుకున్నారు. దెందులూరు సీటు ఇవ్వనని చెప్పేశారు.యరపతినేనితో గనుల దోపిడీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ డాన్గా పేరుపొందారు. లోకేశ్ అండతో ఆయన అక్రమ మైనింగ్లో రికార్డులు సృష్టించారు. గనులను కొల్లగొట్టి ఆ సొమ్మును లోకేశ్, చంద్రబాబుకు పంచిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఆయన అక్రమ మైనింగ్ చూసి నివ్వెరపోయారు. అధికారులను కూడా బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లాలో తానే హోంశాఖ మంత్రి అనేలా పరిస్థితిని తయారు చేశారు. చంద్రబాబు ఇచ్చిన అధికార బలంతో పోలీసు అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ఆయన పాపం పండి అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇవన్నీ చూసి పార్టీ కేడరే విసుగెత్తిపోయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు, కేడర్ వ్యతిరేకం కావడంతో చంద్రబాబుకు యరపతినేని కరివేపాకు అయ్యారు. ఆయనకు సీటును డౌటులో పెట్టారు. టికెట్టు ఇస్తారో లేదో తెలియక యరపతినేని గందరగోళంలో ఉన్నారు. -
భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా
-
సీటు లేక పాట్లు
సాక్షి, అమరావతి: సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడటంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అలక పాన్పు ఎక్కిన నేతలను పిలిచి సర్దిచెబుతున్నారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బొడ్డు వెంకట రమణలతో విడివిడిగా చర్చలు జరిపారు. ► తొలి జాబితాలో సీటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు. తనను ఓడిపోయే చోటకు ఎందుకు పంపుతున్నారని గంటా ప్రశ్నించడంతో గెలుస్తావంటూ ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. గంటా ఇందుకు ససేమిరా అంటూ భీమిలి లేదా విశాఖ జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని కోరారు. జి.మాడుగుల, చోడవరం స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ► మైలవరం సీటు తనకే ఇవ్వాలని దేవినేని ఉమామహేశ్వరరావు కోరగా ఆ సీటు వసంత కృష్ణప్రసాద్కి ఇస్తున్నానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయం చూస్తానని దేవినేనికి సర్దిచెప్పారు. ఆయన పేరును పెనమలూరుకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ► తెనాలిని జనసేనకు కేటాయించడంతో సీటు గల్లంతైన మాజీ మంత్రి ఆలపాటి రాజాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన్ను బుజ్జగించినట్లు తెలిసింది. అయితే గుంటూరు జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ► తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీటును ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తితో నిష్క్రమించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తానని పేర్కొనగా గోవింద్ అసంతృప్తిగా వెళ్లిపోయినట్లు సమాచారం. -
టీడీపీ తొలి జాబితాలో పార్టీ విధేయులకు మొండి చెయ్యి
సాక్షి, విశాఖపట్నం : నమ్మిన వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి నిరూపితమైంది. పార్టీని అంటిపెట్టుకొని.. భూజాలపై మోస్తున్న సీనియర్లను కరివేపాకులా తీసి పడేశారు. పొత్తులో భాగంగా జనసేనతో కలిసి తొలి విడత విడుదల చేసిన జాబితా.. సీనియర్లలో కుంపటి రాజేసింది. సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయని భావించిన వారంతా.. చంద్రబాబు కుతంత్ర రాజకీయాలకు బలయ్యారు. మొత్తం 94 మంది అభ్యర్థుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో కంగుతిన్నారు. నిన్నా మొన్న పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు కేటాయించడంపై సీనియర్లు అవాక్కయ్యారు. అందరిదీ అదే పరిస్థితి..! ► ముందుగా ఊహించినట్లుగానే గంటా శ్రీనివాసరావును పొమ్మనలేక పొగపెట్టినట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. సీటు మార్పు అంటూ ఊహాగానాలు వచ్చినా.. చివరికి ఆయన పేరు ప్రస్తావన లేకుండానే తొలి జాబితా సాగిపోయింది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ అన్నీ తానై వ్యవహరించిన గంటాకు మొండిచెయ్యి చూపించడంతో కేడర్ భగ్గుమంటోంది. జాబితా విడుదలైన తర్వాత గంటా ఇంట్లో ఒంటరిగా ఉండిపోయారు. ఒకరిద్దరు సన్నిహితులతో మాత్రమే మాట్లాడిన గంటా.. కేడర్, పార్టీ శ్రేణులు ఇంటికి వచ్చినా.. తర్వాత కలుద్దామని చెప్పి పంపించేశారు. ► విశాఖ టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన మొహం చాటేశారు. పెందుర్తి సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ముందుగానే ప్రచారం చేశారు. అయితే.. పెందుర్తి సీటు కచ్చితంగా తనకు గానీ, కుమారుడికి గానీ ఇవ్వాలని ఇటీవల పర్యటించిన చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ బండారు విజ్ఞప్తి చేశారు. కానీ.. ఈ సీనియర్ని కూడా పక్కన పెట్టేలా వ్యవహరించడంతో.. కేడర్ మూగబోయింది. ముఖ్యనేతలతో సమావేశమైన బండారు.. మరోసారి అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ► విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుదీ అదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో పల్లాని చంద్రబాబు పోటీలో నిలబెట్టినా.. గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తున్నందున ప్రచారం కూడా చెయ్యొద్దంటూ హుకుం జారీ చేశారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. గాజువాక రాకపోయినా పట్టించుకోని పల్లా.. పార్టీని కాపాడుకునేందుకు నాలుగున్నరేళ్లుగా కష్టపడుతున్నారు. అయినా.. పల్లాకు సీటు గ్యారెంటీ లేదని అధిష్టానం చెప్పకనే చెప్పింది. మరోసారి అధిష్టానంతో మాట్లాడి.. సీటు ఉంటుందా.. లేదా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది నిర్ణయించుకుందామని తన అనుచరగణంతో పల్లా చెప్పినట్లు తెలుస్తోంది. ► పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని గణబాబుకు మరోసారి పశ్చిమ సీటు కేటాయించడంపై పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. గణబాబుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ సీనియర్లు తిరుగుబావుటా ఎగరేసినా.. పట్టించుకోకుండా టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. టీడీపీలో అడ్డగోలు రాజకీయాలు జరుగుతున్నాయంటూ సన్నిహితుల వద్ద వాపోయారు. ఏ పార్టీలో చేరుతాననేది త్వరలోనే చెబుతానని ప్రకటించారు. ► అనకాపల్లిలో పార్టీకి పునాదిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన నియోజకవర్గ సమీక్షలోనూ పీలాకే టికెట్ అన్నట్లుగా చంద్రబాబు సంకేతాలిచ్చి.. చివరి నిమిషంలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణకు టికెట్ కేటాయించడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితా ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. అధిష్టానం పునరాలోచన చేయకుంటే తమ నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ► వలస పక్షుల్లా.. ఆ గూటికీ.. ఈ గూటికీ తిరుగుతూ ఉండే దాడి వీరభద్రరావు కుటుంబం.. నెల రోజుల క్రితం చంద్రబాబు హామీతో టీడీపీ పంచన చేరారు. బాబు చేసే మోసాల గురించి పూర్తిగా తెలిసినా.. దాడి ఫ్యామిలీ మరోసారి భంగపాటుకు గురైంది. తనకు గానీ.. కుమారుడు రత్నాకర్కు గానీ టికెట్ ఇస్తానని చెప్పి.. నమ్మించి గొంతు కోశారంటూ దాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైరి వర్గంగా భావించే కొణతాలకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ●నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అంటూ టీడీపీ సీనియర్ నాయకులు అనుచర వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బాబు కొట్టిన దెబ్బకు భవిష్యత్తు కార్యాచరణపై సీనియర్లంతా సమాలోచనలు చేస్తున్నారు. -
యూజ్లెస్ ఫెలో.. గెటవుట్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్గా చెలామణి అవుతున్న టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చేతిలో ఘోరమైన అవమానం జరిగినట్లు తెలియవచ్చింది. గంటాను ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఎత్తు వేయగా... తనకు ఓడిపోయే సీటిచ్చి పొమ్మనలేక పొగ పెడుతున్నారని గ్రహించిన గంటా దీన్ని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. తనను విశాఖ జిల్లా నుంచి పంపేయాలని చూస్తున్నారని, అలాంటిదేమీ కుదరదని బయటక్కూడా చెప్పారు. ఇదే విషయంలో ఆయనకు, పార్టీ అధినేత చంద్రబాబుకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి, మాటా మాటా పెరగడంతో ‘యూజ్లెస్ ఫెలో.. గెటవుట్’ అంటూ గంటాపై చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలిసింది. అవమానాన్ని భరించలేని గంటా... మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారని, ఇంతటి అవమానం జరిగాక ఇక ఆ పార్టీలో కొనసాగటమెలాగంటూ సన్నిహితుల వద్ద వాపోయారని తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. అంతదూరం వెళ్లి పోటీ చేయలేనని కరాఖండిగా చెప్పేశారు. ‘మనుషులు కాదు.. పార్టీ ముఖ్యం. పార్టీ అధినేతగా చెబుతున్నా... చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాల్సిందే’ అని బాబు కూడా అంతే స్పష్టంగా చెప్పటంతో... ‘నన్ను ఓడించేందుకే కంకణం కట్టుకున్నట్టున్నారు’ అని గంటా బిగ్గరగా బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో బాబు సహనం కోల్పోయి కొన్ని మాటలనటం... గంటా కూడా ఎదురు తిరగటంతో ‘యూజ్లెస్ ఫెలో.. గెటవుట్’ అంటూ గంటాకు చంద్రబాబు గేటు చూపించారని సమాచారం. అవమానభారంతో బయటకు వచ్చిన గంటా... తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, తానైతే భీమిలి నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. జిల్లా వెలుపల ఎప్పుడూ పోటీ చెయ్యలేదు: గంటా చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం తనకు సూచించడం నిజమేనని గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఆయన గురువారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘చీపురుపల్లిలో పోటీపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాక నిర్ణయాన్ని ప్రకటిస్తా. నేను గతంలో చాలా నియోజకవర్గాలు మారినా ఎప్పుడూ జిల్లా దాటలేదు. కాబట్టే చీపురుపల్లిలో పరిస్థితులను సమీక్షించి... నా నిర్ణయాన్ని అధిష్టానానికి చెబుతా’ అని గంటా అన్నారు. ఉద్దేశపూర్వకంగానే లీకులు..! విశ్వసనీయ సమాచారం మేరకు... వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఎక్కడా సీటు లేదని, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు టీడీపీ సలహాదారు రాబిన్ శర్మ మొదట చెప్పారు. అయితే, అంతదూరం వెళ్లి తాను పోటీ చేయలేనని గంటా బదులిచ్చారు. దీంతో కొద్దిరోజుల క్రితం అనుకూల మీడియాలో టీడీపీ పెద్దలు చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేయనున్నట్టు లీకులిచ్చారు. దీనిపై గంటా తన అనుచరుల వద్ద తీవ్రంగా మండిపడ్డారు. తనను ఓడించేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబుతో గంటా భేటీ అయ్యారు. ‘ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే మీరు.. ఈసారి చీపురుపల్లికి వెళ్లండి’ అని బాబు ఆదేశించారు. తాను అక్కడకు వెళ్లి పోటీ చేయలేనని, భీమిలి సీటు కావాలని గంటా కోరారు. దీంతోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. -
AP Assembly Elections 2024: గంట మోగింది.. వినబడుతోందా బాబూ?
-
గంట మోగింది.. వినబడుతోందా బాబూ?
విశాఖపట్నం, సాక్షి: నాకు మాత్రం ఈసారి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉంది.. ఎన్నికలొచ్చినప్పుడల్లా నియోజకవర్గం మారే గంటా శ్రీనివాస రావు ఆవేదన ఇది. అయితే మరోస్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించడంపై గంటా గరం గరంగా ఉన్నారు. ‘‘నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది. నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150కిలోమీటర్ల దూరం. పైగా జిల్లా కూడా వేరు కావడంతో ఆలోచనలో పడ్డా. .. ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు. కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది. వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?. పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను.రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తాను. ప్రతీ ఎన్నికల్లో నేను నియోజకవర్గం మారుతున్నా. కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది అని గంటా అంటున్నారు. -
గంటాకు సీటు తంట!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికలు వచ్చిన ప్రతీసారి సీటు మార్చి బరిలో నిలిచే గంటాకు ఇప్పుడు తన సీటు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. భీమిలి నుంచి పోటీ చేయాలని గంటా భావిస్తుండగా.. చీపురుపల్లికి పంపాలంటూ టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని ఎంపిక చేసిన మీడియా సంస్థలకు టీడీపీ పెద్దలే లీకు చేయడం గంటాకు కునుకులేకుండా చేస్తోంది. ఎలాగూ ఎన్నికలకు ఒకసారి సీటు మార్చే అలవాటు ఉన్న గంటాను ఈసారి చీపురుపల్లికి పంపాలని భావిస్తున్నట్టు రాబిన్ శర్మ ద్వారా సందేశం పంపినట్టు సమాచారం. ఇది తనను ఓడించేందుకే ఆడుతున్న నాటకమని కూడా గంటా మండిపడినట్టు తెలుస్తోంది. చీపురుపల్లిలో తాను గెలిచే అవకాశం లేదని గంటాకు స్పష్టంగా తెలుసు. అందుకే చీపురుపల్లి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలకు తేల్చిచెప్పినట్టు సమాచారం. గత వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ గంటా మాటను ఖాతరు చేయకుండా టీడీపీ పెద్దలే తమ అనుకూల మీడియాకు తాజాగా లీకులివ్వడంతో ఏమీ చేయాలో గంటా కాస్తా తేల్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా గంటా కోరుతున్న భీమిలి సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు కూడా టీడీపీ పెద్దలు లీకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు గంటా సిద్ధమవుతున్నట్టు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. నెల్లిమర్ల.. చోడవరంలోనూ వ్యతిరేకత...! వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి కాకుండా తన సామాజికవర్గం అధికంగా ఉండే నెల్లిమర్లలో పోటీ చేయాలని గంటా మొదట భావించారు. అయితే, అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత చోడవరం నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయసేకరణ చేశారు. అయితే, గతంలో గెలిచి అక్కడ తన గెలుపునకు కృషిచేసిన వారిని ఏ మాత్రమూ పట్టించుకోకపోవడంతో పాటు నియోజకవర్గాన్ని గాలికివదిలేశారన్న విమర్శలున్నాయి. దీంతో చివరకు భీమిలి నుంచి బరిలో దిగేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రస్తుతం భీమిలి ఇన్చార్జిగా ఉన్న కోరాడ రాజబాబుకు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. కార్పొరేటర్లతో నాటకాలు...! వాస్తవానికి భీమిలి సీటు నుంచి పోటీ చేయాలని గంటా భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ నుంచి ఉన్న కోరాడ రాజబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నేరుగా లోకేష్ను కలిసి సదరు కార్పొరేటర్లు కోరాడ రాజబాబు వద్దని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాజబాబు ఉంటే తాము పనిచేయలేమని కూడా తేల్చిచెప్పారు. అయినప్పటికీ లోకేష్ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఈ కార్పొరేటర్ల వెనుకుండి నాటకాలు ఆడిస్తున్నది గంటా శ్రీనివాసరావు అని భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా వారి ఫిర్యాదును సైతం అంతగా పట్టించుకోకుండా ముందుకు సాగినట్టు సమాచారం. దీంతో చేసేదిలేక సదరు కార్పొరేటర్లు అదే విషయాన్ని గంటాకు వివరించినట్టు తెలుస్తోంది. అంతకుముందే చీపురుపల్లికి పోవాలని సంకేతాలు ఇచ్చినప్పటికీ.. భిన్నంగా ఉన్న ఆయన వ్యవహారశైలిపై టీడీపీ పెద్దలు మండిపడుతున్నారు. ఇదే అదునుగా గంటాను చీపురుపల్లికి పంపనున్నట్టు కొన్ని మీడియా సంస్థలకు టీడీపీ పెద్దలు లీకులిచ్చారు. అంతేకాకుండా భీమిలి సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు కూడా ఇరు పార్టీలు లీకులిచ్చుకుంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ప్రతీ ఎన్నికలకు సీటు మార్చే అలవాటున్న గంటాకు చివరకు పోటీ చేసేందుకు నియోజకవర్గమే దొరకకపోవడం విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. -
గంటా ఉన్నా లేకున్నా నేనుంటా.: భరత్
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల సంచార జీవి.. కనీసం ఏనాడైనా ప్రజలకు ముఖం చూపించాడా?.. ఈ కామెంట్లు బయట జనాలు కాదు.. సొంత పార్టీ టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, గంటాను తీవ్రంగా అవమానించాడనే చర్చ నడుస్తోంది. అదీ నారా లోకేష్ సమక్షంలోనే కావడం గమనార్హం!. విశాఖ పర్యటనలో భాగంగా శంఖారావం సభ సాక్షిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తీవ్ర అవమానం ఎదురైంది. టీడీపీ నాయకుడు నారా లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బిర్లా జంక్షన్ వద్ద సోమవారం నిర్వహించిన శంఖారావం సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సభలో టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్చార్జి, లోకేష్ తోడల్లుడు భరత్ .. గంటాపై ప్రత్యక్షంగానే విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీకు అందుబాటులో లేకపోయినా మేం అండగా ఉంటామని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చుతామంటూ వేదికపైనే గంటా సమక్షంలోనే వ్యాఖ్యలు చేశారు. దీంతో గంటా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేదికపై ఉన్న నేతలతో పాటు కార్యకర్తలు సైతం భరత్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, ఉత్తర నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం భరత్ వ్యాఖ్యలు సమంజసమైనవేనని చర్చించుకోవడం కొసమెరుపు. ఇప్పటికే క్యాడర్లో గంటాపై పూర్తిగా విశ్వాసం పోయింది. మరోవైపు ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జిగా తమకు బాధ్యతలు అప్పగించాలంటూ ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత స్వయంగా గంటాకే వినతిపత్రం అందించారు. ఈ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే.. గంటాపై ఉత్తర నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం గుర్రుగా ఉన్నట్లు అర్థమవుతోంది. -
భీమిలీ కోసం జనసేన టీడీపీల మధ్య బిగ్ ఫైట్...!
విశాఖపట్నం: భీమిలిలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య మూడు ముక్కలాటకు తెరలేచింది. భీమిలి టికెట్ తమకంటే తమకని టీడీపీ నుంచి ఇన్చార్జి కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జి పంచకర్ల సందీప్ ప్రకటించుకుని.. పార్టీల క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారు. భీమిలిలో పోటీపై చంద్రబాబు, పవన్లు ఏకాభిప్రాయానికి వచ్చినా.. తగ్గేదేలేదని ఇక్కడి ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికివారు యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కోరాడ, గంటా, పంచకర్ల వర్గాలు నిర్వహించే కార్యక్రమాలకు మరొక వర్గం గానీ, పార్టీల నాయకులు గానీ హాజరుకావడం లేదు. 2019 ఎన్నికల సమయంలో భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వలస వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు నాలుగున్నరేళ్లుగా ఇక్కడి కార్యకర్తలు, నాయకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాగే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినా కలవడానికి వెళ్లలేదు. ఈ నెల 10న విశాఖ వచ్చిన లోకేష్ను కూడా గంటా కలవకపోవడం విస్మయపరుస్తోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మరణంతో ఇక్కడ పార్టీ దాదాపు దిక్కులేనిది అయిపోయింది. దీంతో చాలా వరకు వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. టీడీపీలో మిగిలిన వారు సైతం రెండుగా విడిపోయి కోరాడ, గంటా వర్గీయులుగా చలామణి అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో దూరంగా వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని కోరాడ వర్గీయులు అంటున్నారు. చంద్రబాబు, లోకేష్లు గంటాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని కోరాడకే టికెట్టు ఇవ్వనున్నట్టు అతని వర్గీయులు అంటున్నారు. ఇటీవల ఆ పార్టీ చేసిన సర్వేలో కూడా కోరాడ పేరు ఒక్కటే ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15 లోగా గంటాకు పార్టీ అధినాయకత్వం భీమిలి టికెట్టు కేటాయిస్తుందని అతని వర్గం ఇటీవల భోగాపురం సమీపంలోని సవరవిల్లి వద్ద సమావేశంలో ప్రకటించింది. ఆటలో అరటి పండు 2019 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో నాలుగో వంతు ఇక్కడ జనసేన అభ్యర్థికి వచ్చాయి. ఇటీవల సేన తరఫున సందీప్ పాదయాత్ర పేరుతో వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాలకు పొత్తు కుదరలేదనేది స్పష్టమయింది. ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు సేన వెంట వెళ్లేందుకు ఇష్టపడలేదు. సందీప్ పోటీకి డబ్బులు సిద్ధం చేసుకున్నారని, ఈ నెల 14న సందీప్ను అభ్యర్థిగా ప్రకటిస్తారని సేన కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలను.. టీడీపీ వర్గీయులు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. భీమిలిలో నూకాలమ్మ జాతరకు ముందే జరుగుతున్న ఈ పొలిటికల్ మూడు ముక్కలాటను ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. -
అసెంబ్లీలో టీడీపీ రగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అచ్చెన్న వెల్లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు. ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు. దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. -
గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం
-
గంటా రాజీనామా వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లతో పాటు గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను, ఇతర ఆధారాలను తమ ముందుంచాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ సెక్రటరీ జనరల్ను ప్రతివాదిగా చేర్చాలని గంటా శ్రీనివాసరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. తన రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ఈనెల 23న జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ శాసనసభ సెక్రటరీ జనరల్ అదే రోజు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం విచారణ జరిపారు. గంటా వ్యాజ్యానికి విచారణార్హతే లేదు.. గంటా తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, 2021లో సమర్పించిన రాజీనామాను స్పీకర్ మూడేళ్ల తరువాత ఆమోదించారన్నారు. రాజీనామా ఉపసంహరణకు గంటా ఎలాంటి లేఖ ఇవ్వలేదని అంగీకరించారు. రాజీనామాను ఆమోదించడం వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే, స్పీకర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజీనామా ఆమోదించారని, ఆ ఎన్నికల్లో గంటా ఓటు కీలకమని ఆయన వివరించారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేసినప్పుడు, దానిని జారీ చేసిన సెక్రటరీ జనరల్ను ప్రతివాదిగా చేర్చాలని, అయితే ఈ పిటిషన్లో సెక్రటరీ జనరల్ను ప్రతివాదిగా చేర్చలేదన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. విధి విధానాల ప్రకారమే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు. తరువాత అసెంబ్లీ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. స్పీకర్ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకునే రాజీనామాను ఆమోదించారన్నారు. శాసనసభ్యుడిగా కొనసాగాలన్న ఉద్దేశం గంటాకు ఉంటే, ఈ మూడేళ్లలో తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉండాల్సిందని, ఈ పని చేయకుండా ఆయనను ఎవరూ ఆపలేదని వివరించారు. రాజీనామాను ఆమోదించే విషయంలో నిర్ధిష్టంగా ఎలాంటి నిబంధనలు లేవన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని రిట్ ద్వారా ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు. -
Ganta Srinivas: గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం
-
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ఆమోదించారు. గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కు గంటా శ్రీనివాస్ లేఖ రాసిన విషయం తెలిసిందే. గంటా శ్రీనివాస్ స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ను కలిసి రాజీనామా ఆమోదించాలని కూడా గంటా శ్రీనివాస్ గతంలో కోరిన సంగతి తెలిసిందే. స్పీకర్ తమ్మినేని సీతారాం గంటా శ్రీనివాసరావు కోరిక మేరకు తన రాజీనామాను ఆమోదించారు. చదవండి: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! -
టీడీపీ కకావికలం.. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి రాజకీయం అంతా నాటి నుంచి నేటి వరకు డబ్బుతోనే ముడిపడి సాగుతోంది. అభ్యర్థులను డబ్బు మూటలతో తూకం వేస్తుండటం ఆ పార్టీ సీనియర్ నేతలను నివ్వెర పరుస్తోంది. ఒక్కచోట కూడా గెలవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తుండటం పట్ల అత్యధిక నియోజకవర్గాల్లో నేతల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. దీనికి తోడు మాలోకం లోకేశ్ తీరు కలవర పెడుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడటం.. త్వరలో గుడ్బై చెప్పేందుకు పెద్ద సంఖ్యలో నేతలు సిద్ధపడుతుండటం బాబును ఆందోళనకు గురిచేస్తోంది. నష్ట నివారణ కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపినా ఫలితం కనిపించక తండ్రీ కొడుకులు తలలు పట్టుకున్నారు. సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ఎంపికకు డబ్బు మూటలనే ప్రధాన అర్హతగా నిర్ణయించడం ఆ పార్టీలో సీనియర్ నేతలను కలవరపరుస్తోంది. ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న వారిని కాదని.. డబ్బు మూటలను చూపుతున్న వారినే సమన్వయకర్తలుగా నియమిస్తుండటంతో సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ఆ పార్టీని వీడారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. సీఎం వైఎస్ జగన్తో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రూ.20 కోట్లు డిపాజిట్ చేసిన వారికే టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు తెగేసి చెప్పడంతో మాజీ మంత్రి పీతల సుజాత ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తనను కాదని పక్కన పెట్టి.. కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తుండటంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మవరం సుబ్బారెడ్డి గందరగోళంలో పడ్డారు. డబ్బు మూటలే ప్రాతిపదికగా సమన్వయకర్తలను చంద్రబాబు మార్చేస్తుండటం.. కేశినేని నాని బాటలోనే సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుండటంతో ‘దేశం’ కకావికలమవుతోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ముందే పార్టీ బలహీనంగా మారడంతో తెలుగు తమ్ముళ్లలో హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దాంతో ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం కోసం జనసేనతో పొత్తుకు చంద్రబాబు పాకులాడారు. కానీ.. క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు కుంపట్లను రాజేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత కందుల దుర్గేష్.. తెనాలిలో జనసేన నేత నాదేండ్ల మనోహర్, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. టీడీపీ బలహీనంగా మారడం.. టీడీపీ–జనసేన పొత్తు కుంపట్లను రాజేస్తుండటంతో 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమికి ఘోర పరాజయం తప్పదనే భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అన్నమయ్య టీడీపీలో ఆధిపత్య పోరు సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నేనే ఉండాలి.. నేనే పోటీ చేయాలి.. అంటూ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న తరుణంలో ఉన్నవాళ్లు కూడా జారిపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అధిష్టానం కూడా చోద్యం చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక క్యాడర్ అయోమయంలో ఉంది. అన్నిచోట్ల ఇదే తంతు ► రాయచోటిలో ఆర్.రమేష్ కుమార్రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో నాలుగో వర్గం ముందుకు వచ్చింది. ► రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు, గంటా నరహరి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా.. జనసేన కలయికతో క్యాడర్ అయోమయంలో పడింది. ► రైల్వేకోడూరులో టీడీపీ నేత కస్తూరి విశ్వనాథనాయుడు, గతంలో పోటీ చేసిన అభ్యర్థి నరసింహప్రసాద్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. గతంలో చిట్వేలిలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. n మదనపల్లెలో దొమ్మలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు వర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతుండగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్బాషా చేరికతో మూడు వర్గాలు అయ్యాయి. ► తంబళ్లపల్లెలో టీడీపీ నేత శంకర్యాదవ్తో పాటు మరో ఇద్దరు చక్రం తిప్పుతుండటంతో అక్కడ కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. విశాఖ నుంచి ‘గంటా’ జంప్! ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏకంగా విశాఖ జిల్లా నుంచే మకాం ఎత్తివేత విజయనగరం జిల్లా నెల్లిమర్లపై కన్ను సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక నియోజకవర్గం తరిమేస్తే.. మరో నియోజకవర్గం.. ఆ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం.. ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తూ.. ప్రజలను ఏమారుస్తూ వస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని విశాఖ జిల్లా నుంచే మకాం మార్చేస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన నియోజకవర్గాల్లో ఎక్కడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో.. ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతో.. జిల్లా నుంచే జంప్ అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈసారి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టు సమాచారం. నెల్లిమర్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై సర్వే కూడా చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజలు నిలదీస్తారనే భయంతో..! ఒకసారి పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ తిరిగి పోటీ చేయకపోవడానికి గంటా వైఖరే కారణమన్న విమర్శలున్నాయి. గెలవకముందు అనేక హామీలిచ్చి ఆ తర్వాత మిన్నకుండిపోవడం ఆయనకు అలవాటు. పోటీ చేసిన స్థానంలో మరోసారి పోటీ చేస్తే ఎక్కడ తనను ప్రజలు నిలదీస్తారోననే భయం గంటాను వెంటాడుతోంది. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా ప్రజలకు కనిపించకుండాపోయారు. కనీసం ఏ ఒక్కరినీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో మళ్లీ గొంతు విప్పారు. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే ఇటువంటి నాయకులను పెట్టుకున్న తెలుగుదేశం పారీ్ట.. ఇప్పుడు వైఎస్సార్సీపీ మీద విమర్శలు చేయడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భీమిలిలోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో.. టీడీపీ నుంచి 1999లో రాజకీయరంగ ప్రవేశం చేసిన గంటా అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2004లో చోడవరం ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో అనకాపల్లికి మకాం మార్చి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 2014లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో విశాఖ ఉత్తరం నుంచి బరిలో నిలిచి గెలిచారు. తాజాగా భీమిలి నుంచి పోటీ చేద్దామని భావించినా.. గతంలో అక్కడి ప్రజలను పట్టించుకోకపోవడంతో పాటు ఏ రంగంలోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో భీమిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో తాను భీమిలిలో పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన గంటా విజయనగరం జిల్లాపై కన్నేశారు. టికెట్ మాదంటే మాది అనంతపురం టీడీపీలో కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక కళ్యాణదుర్గంలో పయ్యావుల అనుచరుడికి టికెటిస్తే ఓడిస్తామంటున్న తమ్ముళ్లు ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు టికెట్ల కేటాయించకముందే కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్లు అనంతపురం టీడీపీలో అభ్యర్థుల్ని ప్రకటించకముందే నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి వైరి వర్గాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టికెట్ మాదంటే మాది అని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇంత జరుగుతున్న టీడీపీ అధినాయకత్వం చోద్యం చూస్తుండడంపై పార్టీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో టీడీపీలో రెండు మూడు గ్రూపులు తమదే టికెట్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించేసుకుంటుండగా.. చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మాకు కాదని టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల వేళ ఉమ్మడి అనంతపురం టీడీపీలో టికెట్ల ఎంపిక అభ్యర్థుల మధ్య చిచ్చు పెడుతోంది. రేసులో ఉన్న నాయకులు గ్రూపులుగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఫలానా వారికే టికెట్ అని కొన్ని గ్రూపులు ట్రోల్ చేస్తున్నాయి. కళ్యాణదుర్గంలో ఉమా మహేశ్వరనాయుడికి ఎమ్మెల్యే టికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన పయ్యావుల కేశవ్కు అనుచరుడు. దీంతో ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం కత్తులు నూరుతోంది. మేం 2014లో గెలిచాం.. 2019లో ఓడిన ఉమాకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశి్నస్తోంది. వీళ్లెవరూ కాకుండా బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అతనికి టికెట్ ఇస్తే ఉమా, ఉన్నం వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ప్రతి నియోజవర్గంలోనూ గ్రూపులు పోషించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సూరి వర్సెస్ శ్రీరాం 2019లో ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. దీంతో పరిటాల శ్రీరాం–సూరి వర్గాల మధ్య ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. ‘పల్లె’త్తు మాట అనను.. పోరు బాటే ఇన్నాళ్లూ తనకే టికెట్ అంటూ ధీమాగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఇప్పుడు మండిపడుతున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు టికెట్ అంటూ ప్రచారం జరగడంతో ‘పల్లె’ వర్గం కత్తులు దూస్తోంది. ఇన్నాళ్లూ కనిపించని కిష్టప్పకు ఇప్పుడే ప్రజలు గుర్తుకొచ్చారా? అంటూ మండిపడుతున్నారు. కదిరిలో కందికుంటకు టికెట్ ఇస్తే ఆయనకు మద్దతు ఇచ్చేదే లేదంటూ అత్తర్ చాంద్బాషా బహిరంగంగా చెబుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య నలిగిపోవడమెందుకని చాలామంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలకబూనిన పార్ధసారథి పెనుకొండలోనూ తాజాగా సవితమ్మకు టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో బీకే పార్ధసారథి అలకబూనారు. ‘నేను ఎంపీగా వెళ్లను.. నేనూ ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’ అంటున్నారు. మడకశిరలో రెండువర్గాల మధ్య చిచ్చురేపి తిప్పేస్వామి చలికాచుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు భావిస్తున్నారు. తాడిపత్రిలో జేసీకి సహకరించం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి కొడుకు అస్మిత్రెడ్డికి టికెట్ దాదాపు ఖరారైంది. జిల్లాలో ఏ ఒక్క నేత కూడా జేసీకి మద్దతు ఇవ్వడం లేదు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జేసీ సోదరుల పేరు చెప్పడానికి కూడా ఏ నాయకుడూ ముందుకు రాలేదు. శింగనమలలో పోటీచేసి ఓడిపోయిన బండారు శ్రావణికి ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అవమానం జరిగింది. శ్రావణి తండ్రిపై దాడి చేసినా లోకేశ్ పట్టించుకోలేదు. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. దళితులపై దాడి చేసినా టీడీపీ అధినాయకులు పట్టించుకోలేదని, మళ్లీ టికెట్ కోసం పాకులాడటం అవమానంగా ఆ వర్గాలు భావిస్తున్నాయి. -
జగన్ అభివృద్ధి మంత్రానికి టీడీపీ కకావికలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా. వైఎస్సార్సీపీ రాకతో గత ఎన్నికల్లోనే ఈ కోటకు బీటలు వారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం, ఈ ప్రాంతాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి, పలు ఐటీ కంపెనీల ఏర్పాటు, బడుగు బలహీనవర్గాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ ఇక్కడ కకావికలైంది. ఆ పార్టీకి కార్యకర్తలూ చేజారిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు. దీంతో పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారు. దీంతో ఓ నియోజకవర్గం.. వంద గ్రూపుల్లా ఆ పార్టీ వ్యవహారం ఉంది. ఈ గ్రూపుల మధ్య సంక్రాంతికి ముందే కోళ్ల పందేలకు దీటుగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. యువగళం ముగింపు సభకు జనసమీకరణ కోసం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారడమే ఇందుకు ఉదాహరణ. యువగళం సభకు వచ్చేది లేదని ఆయనకు తేల్చి చెప్పినట్టు సమాచారం. గంటా తీరుతో విసిగిపోతున్న విశాఖ నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు. గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవలి వరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు మూడు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు మృగ్యమైపోవడంతో ఆయన భీమిలి వైపు చూస్తున్నారు. భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంటా హాజరవుతున్నారు. ఇది భీమిలి టికెట్ ఆశిస్తున్న కోరాడ రాజబాబుకు మింగుడుపడటం లేదు. ఆయన గంటా రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటాను నమ్మరంటూ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. భీమిలిలోనే కాదు.. గంటా శ్రీనివాసరావు పాయకరావుపేట నియోజకవర్గంలోనూ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలోనూ ఆయన జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరూ రాకుండా కూడా అడ్డుపడుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీని కూడా సాగనంపి.. ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలను పొగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అనకాపల్లిలో అయ్యన్న కినుక అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించేకొద్దీ అయ్యన్న వర్గం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా, మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు. మాడుగులలో మూడు ముక్కలాట మాడుగుల నియోజకవర్గం టీడీపీలో మూడు పందెం కోళ్లు కొట్టుకుంటున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి పీవీజీ కుమార్తో పాటు రామనాయుడు, పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని, ఆయనకు మాడుగులలో ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే మాడుగుల బరిలో నలుగురు ఉన్నట్టే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్టు దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదు. అరకు నియోజకవర్గం ఇన్చార్జిగా దొన్ను దొరను నియమించడంపై అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దొరకు సహకరించబోమని అబ్రహం వర్గం కరాఖండిగా చెబుతోంది. -
భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం!
విశాఖ జిల్లాలో టిడిపి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది. చంద్రబాబు నాయుడు అక్రమాలు ఒక్కొక్కటి బయటపడడంతో ఇప్పటికే పార్టీ బ్రష్టు పట్టింది. ఈ దశలో ఎన్నికలు వస్తున్న పరిస్థితుల్లో పార్టీ నేతల నిర్ణయాలు పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేతలను కాదని ఎన్నికల ముందే హడావిడి చేసే నేతలను అందలం ఎక్కించాలన్న పార్టీ అధినేత ఆలోచనల పట్ల కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై భీమిలి పార్టీ క్యాడర్ భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి గెలిచి చంద్రబాబు నాయుడి కేబినెట్ లో మంత్రి పదవి అనుభవించిన గంటా శ్రీనివాస్ అయిదేళ్ల పాలనలో నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి పోటీ చేస్తే ప్రజలు ఓడించడం ఖాయమని గమనించిన గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజక వర్గంపై కన్నేశారు. ఇలా నియోజక వర్గాలు మార్చడం గంటాకు కొత్త కాదు. ప్రతీ ఎన్నికలోనూ నియోజక వర్గాన్నో పార్టీనో మార్చడం ఆయనకు అలవాటే. అయితే గత ఎన్నికల్లో బీమిలిలో పార్టీ ఓటమి అనంతరం అయిదేళ్ల పాటు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నియోజక వర్గ ఇన్ ఛార్జ్ రాజబాబు వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండి పోటీ చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటించినపుడు కూడా గంటా హాజరు కాకుండా తన ఇంటికే పరిమితం అయ్యారు. అటువంటి గంటా ఇపుడు భీమిలినియోజక వర్గంపై కర్చీఫ్ వేస్తున్నారు. కొంతకాలం గంటాపై కోపంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా గంటాకు భీమిలి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే రాజబాబుకు మంట తెప్పిస్తోంది. గంటాకు టికెట్ ఇస్తే నియోజక వర్గంలో పార్టీ క్యాడర్ ఎవ్వరూ కూడా గంటా కోసం పనిచేసే పరిస్థితిలేదని రాజబాబు అధిష్టానానికి సమాచారం పంపారు.ఈ క్రమంలోనే తాజాగా గంటా శ్రీనివాసరావు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమిలి వచ్చారు. ఆ కార్యక్రమ వేదికపై ఉన్న రాజబాబు గంటా రావడంతోనే లేచి వేదిక దిగి వెళ్లిపోయారు. గంటాపై తన నిరసనను ఆ విధంగా వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన గంటా డబ్బులు వెదజల్లి అయినా భీమిలి టికెట్ కొనుక్కోగలరని భావిస్తోన్న రాజబాబు ..పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న తనవంటి వారిని పక్కన పెట్టి అవకాశ వాద రాజకీయాలు చేసే గంటాకు టికెట్ ఇస్తే పార్టీ ఓటమి చెందడం ఖాయమని అంటున్నారు. ► తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు రెండు దశాబ్దాల పాటు భీమిలి నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వెలిగింది. ► 2004 ఎన్నికల్లో దివంగత వై.ఎస్.ఆర్. ప్రభంజనంలో భీమిలి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ► 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగిన అవంతి శ్రీనివాస్ గెలిచారు. ► 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ టిడిపి అభ్యర్ధిగా భీమిలిలో గెలిచారు. గత ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగ పోటీ చేసి విజయం సాధించారు. -
చంద్రబాబుకు పొలిటికల్ షాక్ విశాఖ టీడీపీలో వర్గ విభేదాలు
-
చంద్రబాబు చేలో మేస్తే.. ఈయన గట్టున మేస్తాడా?
తప్పుడు సర్వేలతో ముదపాక భూముల వ్యవహారంలో బండారు.. మోసపూరిత విధానంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ ‘స్కిల్’ కనబరిచారు. ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయని తన సతీమణి పేరుతో ఏకంగా రూ.92 లక్షలకుపైగా నగదుతో గంటా భీమిలిలో కొనుగోలు చేసిన భూ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా భారీ నగదుతో జరిపిన లావాదేవీల్లో పేర్కొన్న పాన్ నంబర్ కూడా తేడాగా ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! అన్న చందంగా.. తెలుగుదేశం పార్టీ నేతలు తమ నాయకుడి తరహాలోనే కనికట్టు చేయడంలో ఆరితేరిపోయారు. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో బోగస్ కంపెనీలతో కోట్లు కొట్టేసి జైలులో చంద్రబాబు ఉన్నారు. తాను తక్కువేమీ కాదన్నట్టు... భీమిలిలో తన సతీమణి పేరు మీద కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో గంటా కూడా అదే తరహా ‘స్కిల్’ కనబరిచారు. ఆదాయపన్నుశాఖ నిబంధనలకు విరుద్ధంగా కేవలం నగదు రూపంలో రూ.92 లక్షలకుపైగా చెల్లింపులు ఆయన సతీమణి పేరు మీద చేసినట్టు లెక్కల్లో చూపారు. అయితే, ఆమె తరపున ఐటీ రిటర్న్స్ను ఎక్కడా దాఖలు చేయకపోవడం గమనార్హం. గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే... భీమిలి ప్రాంతంలో 1,936 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందంలో గంటా వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్ట ప్రకారం రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేపట్టరాదు. ఈ నిబంధనలేవీ తెలియని వ్యక్తి కాదు గంటా శ్రీనివాసరావు. అయితే తన సతీమణి పేరుతో 2018లో భూముల కోనుగోలులో నగదు రూపంలోనే మెజార్టీ వ్యవహారం నడవడం విమర్శలపాలవుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ విధంగా జరగడం బహుశా యాదృచ్ఛికం కాకపోవచ్చు. రూ.92.98 లక్షలు కేవలం నగదు రూపంలో ఇచ్చినట్టు చూపారు. మరో రూ. 25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి.. సర్వే నెంబరు.. టీఎస్ నెంబరు 1490, బ్లాక్ నెంబరు 17, వార్డు నెంబరు 24లోని 1936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఒకవేళ ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్నెంబరు పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు తన అఫిడవిట్లో గంటా శారద 2014–15 నుంచి 2018–19 మధ్య ఒక్కసారి కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు చూపించలేదు. మరోవైపు గంటా శ్రీనివాసరావు మాత్రం 2014–15 నుంచి ఐటీ రిటర్న్స్ను దాఖలు చేసినప్పటికీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,39,338 ఆదాయంగా చూపడం గమనార్హం. ఆదాయపన్నుశాఖ సెక్షన్ 271 డి ప్రకారం... రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలను నిర్వహిస్తే శిక్షార్హుడు అవుతారు. ఆదాయపన్నుశాఖ సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం అంతే మొత్తాన్ని పెనాల్టీ రూపంలో వసూలు చేసే అధికారం ఉంది. రెండు పాన్కార్డులు ఉండొచ్చా..! భీమిలిలో భూములు కొనుగోలు చేసిన సందర్భంలో ఆయన సతీమణి పేరు మీద పేర్కొన్న పాన్కార్డు నెంబరు ఏబీపీపీజీ2216ఏ. అయితే, ఆయన అఫిడవిట్లో మాత్రం తన సతీమణి పాన్ నెంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. వాస్తవానికి ఐటీశాఖ నిబంధనల ప్రకారం రెండు పాన్కార్డు నెంబర్లను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. రెండు పాన్కార్డులు ఏ సమయంలో ఉంటాయంటే... ► అప్పటికే ఉన్న పాన్కార్డులో ఏవైనా తప్పులు ఉంటే... వాటిని సరిచేసుకోకుండా కొత్త దానికి దరఖాస్తు చేయడం. ►పాన్కార్డు కోసం పలుమార్లు దరఖాస్తు చేయడం ►పెళ్లికి ముందు ఒక పాన్కార్డు... పెళ్లి తర్వాత మరో పాన్కార్డుకు మహిళలు దరఖాస్తు చేసిన సమయంలో... ►ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో అక్రమంగా రెండు పాన్కార్డులను కలిగి ఉండటం. ► ఇందులో ఏదైనా చట్టరీత్యా నేరమే. తమకు ఉన్న రెండు పాన్కార్డులను వెంటనే తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆదాయపన్నుశాఖ చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవహారంలో నిజంగా రెండు పాన్కార్డులు ఉన్నాయా? ఒకే సిరీస్లో కేవలం నెంబరు మార్చి తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిచిందా? అనేది లోతుగా విచారిస్తే మినహా తెలిసే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదీ ఏమైనా తెలుగుదేశం నేతలు అవినీతి వ్యవహారంలో చూపుతున్న ‘స్కిల్’ మాత్రం కొంగొత్త పుంతలు తొక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు. -
ఏపీ అప్పులు.. గంటా శ్రీనివాసరావు, యనమలపై మంత్రి బుగ్గన సెటైర్లు..!
-
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట త్రీ మెన్ కమిటీ.. టీడీపీలో కలకలం!
ఆ నియోజకవర్గంలో ఊసరవెల్లి భయపడే స్థాయి నేత ఒకరు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారనే భయం ఆయన్ను వెంటాడుతోంది. ఆ భయంతోనే పక్క చూపులు చూస్తున్నారు. అక్కడ పోటీ చేయడానికి పచ్చ పార్టీలో ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో అభ్యర్థిని ఎంపిక చేయడానికి కమిటీ వేయబోతున్నారట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నేత ఎవరో చూద్దాం. విశాఖ నగరం నార్త్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. తమ పార్టీ ఓడిపోవడంతో..ఎమ్మెల్యేగా గెలిచినా గంటా గత నాలుగేళ్ళుగా ఇంటికే పరిమితమయ్యారు. తనను అసెంబ్లీకి ఎన్నుకున్న ప్రజలను పట్టించుకోవడం మానేశారు. అయితే తొలి నుంచీ ఊసరవెల్లి రాజకీయాలు చేసే గంటా శ్రీనివాసరావుకు ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీలోనే ఉండటం అలవాటు. కాని ప్రస్తుతం గతిలేక ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. ప్రజలకు దూరం కావడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కేకే రాజునే కలుస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందజేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి సక్రమంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం నార్త్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకు బలపడుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా నార్త్ నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో విశాఖ నార్త్ నియోజకవర్గం అంటేనే టీడీపీ నేతలు వణికి పోతున్నారు. టీడీపీ నేతలు అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం వైఎస్సార్సీపీ అభ్యర్థి నార్త్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వెల్లడయ్యింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3,500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. రోజు రోజుకీ వైఎస్ఆర్సీపీ బలపడుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా గంట మరో నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం మారితే అక్కడ టీడీపీ పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశం మీద టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో ఎవరిని పోటీ చేయమన్నా విశాఖ నార్త్ అంటే భయపడి ముందుకు రావడంలేదు. దీంతో పక్క పార్టీల్లో పోటీచేయగలవారు ఎవరైనా ఉన్నారా అని టీడీపీ నేతలు వెతుకుతున్నారు. తనను గెలిపించిన నియోజకవర్గాన్ని గంటా పట్టించుకోకపోవడంతో నార్త్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఆ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడైనా ఎమ్మెల్యే లేని చోట, నియోజకవర్గ ఇన్చార్జిలేని చోట, త్రీ మెన్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తుంటారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సెగ్మెంట్లో త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేస్తుండటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతుంది. మరోవైపు నార్త్ నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించిన విష్ణుకుమార్ రాజు పరిస్థితి కూడా అలాగే ఉంది. విష్ణుకుమార్ రాజు నార్త్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిజెపిలో ఉంటే వైయస్సార్సీపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేమని గ్రహించిన విష్ణు కుమార్ రాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దయతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖ నార్త్లో పోటీ అంటేనే ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. -
విశాఖ నార్త్ లో పోటీకి టీడీపీలో ఎవరూ ముందుకు రాని స్థితి
-
Fact Check: తప్పులో కాలేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఓ పోస్టు పెట్టి టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పులో కాలేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ ఎదుట సెల్ఫీ దిగి టీడీపీ హయాంలో ఇలాంటివి ఎన్నో అద్భుత భవనాలు నిర్మించాం.. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కటైనా నిర్మించారా అంటూ శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ భవన నిర్మాణంలో అసలు వాస్తవాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు బయటపెట్టారు. గంటా చెప్పింది అవాస్తవమని తేల్చిచెప్పారు. ఇదీ వాస్తవం.. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్కు 14 ఏళ్ల కిందటే బీజం పడింది. భవిష్యత్ అవసరాల కోసం భారీ సీటింగ్ సామర్ధ్యంతో ఓ అధునాతన కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటి వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి (ప్రస్తుత వీసీ) నిర్ణయించారు. బీచ్ రోడ్డును ఆనుకొని ఉన్న వర్సిటీ భూమిలో 2,500 సీటింగ్ సామర్థ్యంతో దాదాపు రూ.10 కోట్లతో కన్వెషన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో నగరంలోనే అతి ఎక్కువ సీటింగ్ సామర్ధ్యంతో చూపరులను ఆకట్టుకొనేలా అత్యాధునిక డిజైన్తో దీని నిర్మాణం చేపట్టారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ భవన నిర్మాణం తొలి దశ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత వచ్చిన యూనివర్సిటీ వీసీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీని నిర్మాణంలో రాజకీయ పారీ్టలకు ఎలాంటి ప్రమేయం లేదు. అయినా గంటా శ్రీనివాసరావు టీడీపీనే ఈ భవనాన్ని నిర్మించిందంటూ అబద్ధపు ప్రచారం చేయడంపై ఆంధ్ర విశ్వవిద్యాలయ వర్గాలు మండి పడుతున్నాయి. చదవండి: చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు? గంటాకు మతిభ్రమించింది.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మతి భ్రమించిందని వీఎంఆర్డీఏ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. 2009లో అప్పటి సీఎం రోశయ్య ఈ భవనానికి శంకుస్థాపన చేసిన ఫొటోను ఆమె శనివారం విడుదల చేశారు. -
విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీలో ముసలం!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయల నడుమ చిచ్చు ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు. అలాగే తన తనయుడు విజయ్కి ఎంపీ టికెట్.. తమ ఎమ్మెల్యే టికెట్పైనా స్పష్టత ఇవ్వాలని అయ్యన్న అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటాకు ఉన్నపళంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపైనా అయ్యన్న వర్గీయులు టీడీపీని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు బయటపడ్డాయి. వంగలపూడి అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో ఇద్దరు నేతలపై వేటు పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం
దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి.. విశాఖ మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్ ‘ది పామ్స్’ అపార్ట్మెంట్లో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. -
బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? విశాఖ పర్యటనలో చంద్రబాబు కనీసం గంటా వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడలేదా? పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కింద సీటుకే పరిమితమవ్వాల్సి వస్తుందన్న భయంతోనే పార్టీ సమావేశానికి మాజీ మంత్రి దూరంగా ఉన్నారా? గంటాను బాబుకు దగ్గర చేసేందుకు మాజీ మంత్రి నారాయణ చేసిన యత్నాలు విఫలమయ్యాయా? మొదలైన ప్రశ్నల పరంపరకు టీడీపీలోని వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో గంటా, అయ్యన్న ఉత్తర దక్షిణ ధ్రువాలు. సాధారణంగా అధినేతకు ఒకరు దగ్గరైతే మరొకరు దూరంగా ఉంటారు. విచిత్రంగా ఈసారి చంద్రబాబు పర్యటనలో ఇద్దరి పాత్ర పరిమితంగానే కనిపించింది. ఇది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు చేపట్టిన విశాఖ పర్యటన మొత్తంలో ఎక్కడా గంటా వాసన లేకుండా పార్టీ కార్యక్రమం నడిచింది. మరోవైపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కార్యక్రమంలో ఎక్కడా యాక్టివ్గా కనిపించకపోవడం గమనార్హం. కేవలం చంద్రబాబుతో కరచాలనానికే ఆయన పరిమితమవ్వడం ఆ పార్టీ వర్గాలను ఆశ్చర్యచకితులను చేసింది. తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలంటూ అయ్యన్న పెట్టిన ప్రతిపాదనపై చంద్రబాబు నుంచి సానుకూలత రాకపోవడంతోనే అయ్యన్న కాస్త దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బాదుడే బాదుడంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ధరల పెరుగుదల అంశంపై కార్యక్రమం చేపట్టడంపై అంతర్గతంగా ఇష్టం లేకపోవడమూ ఒక కారణమని తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధ్యవర్తిగా నారాయణ....! వాస్తవానికి విశాఖ సిటీలో ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. అయినప్పటికీ గత మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అంతేకాకుండా కాపు మేధావుల సమావేశంలో మాత్రం ప్రత్యక్షమవుతున్నారు. హైదరాబాద్తో పాటు విశాఖలో జరిగిన సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు జనసేనతో పొత్తుకు బాబు ప్రయత్నిస్తుండగా.... మరోవైపు కొత్త కేంద్రాన్ని గంటా ప్రోత్సహిస్తున్నారనే కోపంలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తాజా పర్యటనలోనూ పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంటాను బాబుకు దగ్గరకు చేసేందుకు మాజీ మంత్రి నారాయణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నట్టు సమాచారం. బురదలోంచి వానపాములంటూ...! బురదలోంచి వానపాములు వస్తున్నాయంటూ పరోక్షంగా గంటా గురించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో గత మూడేళ్లుగా బయటకు రాలేదని... ఇప్పుడు తిరిగి వస్తున్నారని మండిపడ్డారు. ఇదే నేపథ్యంలో తాజాగా చంద్రబాబు పర్యటన సందర్భంగా పాల్గొనేందుకు గంటా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయానికి చంద్రబాబును పలకరించేందుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, కనీసం చంద్రబాబు మాట వరుసకు కూడా గంటా మొహం చూడలేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అంతేకాకుండా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా గంటా పాల్గొనలేదు. ఒకవేళ గంటా పాల్గొన్నప్పటికీ కేవలం కింద సీటుకే పరిమితమవ్వాలన్న సంకేతాలు రావడంతోనే వెళ్లలేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు గంటా శ్రీనివాసరావుపై అవకాశం వచ్చినప్పుడల్లా అయ్యన్న విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. గతంలోనూ గంటా భూకబ్జాలపై పరోక్షంగా అయ్యన్న విమర్శలు చేశారు. తాజాగా టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలోనూ బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.... బురద పాములు ఎవరో మీకు తెలుసంటూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా గంటాను దూరంగా పెడుతున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అయినప్పటికీ అయ్యన్న కూడా తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి సానుకూలంగా సంకేతాలు రాకపోవడంతో అలక వహించి అంటీముట్టనట్టు ఉన్నట్టు సమాచారం. ఏదీఏమైనప్పటికీ చంద్రబాబు విశాఖ పర్యటనతో ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. -
బురదపాములు బయటకొస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సొంత పార్టీలోని నేతలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడేళ్లుగా పుట్టలో దాక్కున్న బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబును హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మూడేళ్లుగా ఈ బురదపాములు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిస్తున్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరుగుతున్న తెలుగునాడు స్టూడెంట్ ఫ్రంట్ (టీఎన్ఎస్ఎఫ్) శిక్షణ తరగతుల సందర్భంగా రెండు రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి బయటకు రాగా చర్చనీయాంశమయ్యాయి. -
చంద్రబాబూ.. ‘గంటా’ మాటలు వినండి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనునిత్యం రాష్ట్ర ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్ది రోజులుగా గంజాయి సాగు, రవాణాపై అసత్యాలు ప్రచారం చేస్తున్న తరుణంలో నాలుగేళ్ల క్రితం అప్పటి టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 2017లో విలేకరుల సమావేశంలో గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గంజాయి సాగు వైజాగ్కు ఒక మచ్చలా మారింది. ఈ విషయం అందరినీ కలచి వేస్తోంది. విదేశాల్లో కావచ్చు.. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు.. ఇతర ప్రాంతాల్లో కావచ్చు.. గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు వైజాగ్లో ఉండటం చాలా బాధాకరం. దీనిని చివరకు ఏ స్టేజీకి తెచ్చారంటే.. స్కూల్ బస్సుల్లో కూడా రవాణా చేస్తుండటం దారుణం. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లే బస్సుల్లో గంజాయి రవాణా అవుతుందంటే ఇవాళ పరిస్థితి ఎక్కడకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీలు గంజాయికి అడ్డాగా ఉన్నాయి’ అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో టీడీపీ నేతల అసలు రంగు ప్రజలకు అర్థమవుతోంది. ‘ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో గంజాయి సాగు 1970కి ముందు నుంచే ఉందనే విషయం ఎవరికి తెలియదు? ఇకనైనా తమ పార్టీ పెద్దలు ఆ విషయం జోలికి వెళ్లక పోవడం ఉత్తమం’ అని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. -
చూడవయ్యా నీ మంత్రే ఏమన్నాడో..
-
టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్
-
టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్
సాక్షి, అమరావతి: అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ విషం చిమ్ముతోంది. గంజాయి సాగు, రవాణాకు తమ నిర్వాకమే కారణమని బయటకు చెప్పుకోలేక రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టి రాజకీయ దిగజారడుతనానికి పాల్పడుతోంది. రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ ఆ మూలాలన్నీ టీడీపీ హయాంలోనే ఉన్నాయనే విషయం మరిచిపోయి.. దుష్ప్రచారం చేస్తోంది. (చదవండి: ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు) గత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో గంజాయిపై గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా అవుతుందని స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడేమో తమకు ఏపాపం తెలియదంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ బురద చల్లి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఏవోబీలో భౌగోళిక స్థితిగతుల దృష్ట్యా దశాబ్దాల తరబడి గంజాయి సాగవుతోందన్నది బహిరంగ రహస్యం. కానీ గంజాయిపై వాస్తవాలకు ముసుగేసి గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు పచ్చనేతలు. -
కేటీఆర్తో గంటా భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో కొద్ది నిమిషాల పాటు ఇద్దరి భేటీ సాగింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు పరిరక్షణ ఉద్యమానికి కేటీఆర్ సంఘీభావం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చినట్లు గంటా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రుల బృందంతో కలసి విశాఖపట్నం వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపైనా వారు చర్చించారు. -
విశాఖలో వందలాది మంది వైఎస్సార్సీపీలో చేరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర పార్టీల నుంచి వందలాది మంది వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీ విశ్వనాథం సహా వంద మందికి పైగా టీడీపీ నేతలు పార్టీలో చేరారు. వీరికి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె.రాజు కార్యాలయంలో జనసేన, ఇతర పార్టీ నాయకులు 200 మందికి పైగా వైఎస్సార్ సీపీలో చేరగా, వీరికి విజయసాయిరెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారంటే.. ప్రజలు ఎంతగా వైఎస్ జగన్ పాలనను స్వాగతిస్తున్నారో అర్థమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జీవీఎంసీ ఎన్నికల్లోను పునరావృతమవుతాయని.. గ్రేటర్ పీఠంపై వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుందని అన్నారు. కాశీ విశ్వనాథం మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగానని, ఎమ్మెల్సీ, వుడా చైర్మన్ ఇస్తానని మోసం చేశారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన విధానం నచ్చి వైఎస్సార్ సీపీలోకి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు తదితరులు పాల్గొన్నారు. -
మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..
’’ఇల్లు కాలి ఒకాయన బాధ పడుతుంటే చుట్ట కాల్చడానికి నిప్పు అడిగాడట ఓ ప్రబుద్ధుడు.. ’’.. మోటు సామెతను కాస్త నీటుగా చెప్పామనుకోండి.. అది వేరే విషయం.. అయితే సరిగ్గా ఈ సామెత మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వందశాతం వర్తిస్తుంది. ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ గత ఎన్నికల్లో ’ఉత్త’ర కుమారుడిగా ప్రయాస పడి ఎట్టకేలకు స్వల్ప ఓట్లతో బయటపడ్డ గంటా.. నాటి నుంచి ఇంటి గుమ్మం దాటి బయటకు రావడం లేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాను ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 20 నెలలుగా ఎక్కడా పర్యటించలేదు. నియోజకవర్గ సమస్యలపై ఏనాడూ స్పందించలేదు. అసెంబ్లీకి సైతం మొక్కుబడిగా హాజరు వేయించుకుని వస్తున్నారు. ఇక తెలుగుదేశం పారీ్టపై గెలిచిన సదరు గంటా... ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్లలేదు. పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొన్న దాఖలాల్లేవు. ఆ పార్టీ సంగతి వదిలేస్తే కనీసం బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఈ 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా వ్యవహరించలేదు. అడపాదడపా పార్టీ మార్పు అంటూ అనుకూల మీడియాల్లో వార్తలు వేయించుకోవడం తప్పించి ఎక్కడా ’గంట’ మోగింది లేదు. (చదవండి: టీడీపీ డీలా: బరిలో దిగే వారేరీ..?) సరిగ్గా ఈ నేపథ్యంలోనే స్టీల్ప్లాంట్ ఉద్యమం రావడంతో ఇదే వేదికగా హడావుడి చేయాలని గంటా భావించినట్టున్నారు. అంతే.. చిత్తం వచ్చిన భాషలో ఓ లేఖ రాసి మీడియాకు వదిలేశారు. తాను శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి మొత్తం ఉక్కు ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తానని భీకర ప్రతిజ్ఞ కూడా చేసేశారు. కానీ స్పీకర్ ఫార్మాట్కు విరుద్ధంగా వదలిన ఆ రాజీనామా లేఖతోనే గంటా వ్యూహాత్మక ప్రచార ఎత్తుగడ బట్టబయలైంది. ఇరవై నెలలుగా గడప దాటి బయట రాని ఆయన ఇప్పుడు ఉక్కు ఉద్యమ ముసుగులో మళ్లీ జనానికి మొహం చూపించాలనే ఆరాటం తప్పించి... నిజమైన పోరాటానికి కాదని ఆ లేఖతో అర్ధమైంది. అందుకే ఆయనపై విమర్శల జడి మొదలైంది.(చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు) లైట్ తీసుకున్న విశాఖ నేతలు.. ఓ సారి ఎంపీగా చేసి.. నాలుగో దఫా ఎమ్మెల్యేగిరీ వెలగబెడుతున్న గంటాకు కనీసం శాసన సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో కూడా తెలియలేదంటూ అన్ని పక్షాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. స్పీకర్ ఫార్మాట్లో కాకుండా తన లెటర్ హెడ్పై ఏదో నాలుగు ముక్కలు గీకి పారేసి.. అదే రాజీనామా అంటూ ప్రచారపర్వంలో మునిగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే వామపక్ష నేతలు మిన హా మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నాయకులూ గంటా రాజీనామాను చాలా ’లైట్’ తీసుకున్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత విష్ణుకుమార్ రాజు. జనసేన నేతలతో పాటు దళిత సంఘాల నేతలు ఆ రాజీ నామాను ఓ ప్రసహనంగా పేర్కొని గంటా వ్యవహారశైలిని ఎండగడుతున్నారు. ఇక టీడీపీలో కొనసాగుతూ... ఆ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కనీసమాత్రంగా చెప్పకుండా రాజీనామా చేశానంటున్న గంటా నిర్వాకంతో నగరంలోని మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు. గంటా రాజీనామా హాస్యాస్పదం పదవి లేకుండా బతకలేని మనిషి గంటా... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు పదవి ఉండాలి. రాష్ట్రంలో జరుగుతున్న చాలా పోరాటాలపై నోరు మెదపని గంటా స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారంటే వ్యక్తిగత స్వార్ధమే ఎక్కువ ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా చేయడం హాస్యాస్పదం – కొత్తపల్లి వెంకటరమణ, విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కో–కన్వీనర్ -
టీడీపీలో ‘గంటా’ టెన్షన్
సాక్షి, అమరావతి: విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా టీడీపీలో కాక రేపుతోంది. తమది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే టీడీపీలో కనీసం అధినేతకు తెలియకుండా ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీతో సంబంధం లేకుండా రాజీనామా చేసిన గంటా విశాఖ ఉక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తానని, జేఏసీ కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పార్టీకి చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని పలువురు విశాఖ నాయకులు ప్రశ్నించినా గంటా పట్టించుకోలేదని చెబుతున్నారు. విశాఖలో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో వాసుపల్లి గణేష్బాబు టీడీపీకి దూరంగా ఉంటుండగా వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు పార్టీలో కీలకంగా ఉన్నారు. గంటా ఆకస్మిక రాజీనామాతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. పార్టీపరంగా పోరాటం చేద్దామని, సరైన సమయంలో నిర్ణయం చెబుతానని, అప్పటివరకూ ఆగాలని అంతకుముందు చంద్రబాబు కోరినా గంటా పట్టించుకోలేదని చెబుతున్నారు. రెండేళ్లుగా గంటా పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడంలేదు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనడం లేదు. -
తప్పుడు పత్రాలతో ఆక్రమించారు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, విజయరామపురం ఆగ్రహారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావుకు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. విజయరామపురం ఆగ్రహారం సర్వే నెంబర్ 13(పార్ట్)లో ఉన్న తన 4.84 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా, తదుపరి చర్యలు తీసుకోకుండా రెవిన్యూ అధికారులను నియంత్రించాలంటూ ప్రత్యూష కంపెనీ అధీకృత అధికారి పరుచూరి వెంకయ్య ప్రభాకర్ ఆదివారం రాత్రి హైకోర్టులో హౌస్మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ అధికారులు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ నెల 15న అకస్మాత్తుగా ప్రహరీ కూల్చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ చెబుతున్న ఇనాం గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నెంబర్లు లేవని, అలాంటప్పుడు వారిది సర్వే నెంబర్ 13(పార్ట్) అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇవన్నీ పిటిషనర్ సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ భూమి విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఫ్యూజన్ రెస్టారెంట్ కేసులోనూ స్టేటస్ కో... భూమి లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్పై మహా విశాఖ ప్రాంతాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకోవడంపై ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్మోషన్ రూపంలో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫ్యూజన్ ఫుడ్స్ లీజుకు తీసుకున్న భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
విశాఖలో ఆక్రమణలపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వ భూముల్ని అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని గుర్తించిన జిల్లా రెవిన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. ఏకంగా 66.5 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన వారిపైనా అధికారులు చర్యలు చేపట్టారు. గంటా బంధువు చెరలోని భూమి స్వాధీనం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తోడల్లుడు.. ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్రావు ఆక్రమణలో ఉన్న భూముల్ని ఆర్డీవో పెంచల్ కిషోర్ నేతృత్వంలో అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్ మండలం అడవివరం – శొంఠ్యాం రోడ్డులో ఉన్న విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లో మొత్తం 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4.86 ఎకరాలు పరుచూరి భాస్కర్రావుకు చెందినవని తేలింది. ఈ భూమి సహా ఇతర ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న మొత్తం 64 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత భూముల్లో ఉన్న రక్షణ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.256 కోట్లు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ని సీజ్ చేస్తున్న వీఎంఆర్డీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధీనంలో... ఆనందపురం మండలంలోని వేములవలస, ఆనందపురం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూముల్లోని కొంత జిరాయితీ భూమిని విశ్వనాథ ఎడ్యుకేషనల్ సంస్థ 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేసింది. ఆ స్కూల్ని ఆనుకొని ఉన్న ఆనందపురం సర్వే నంబరు 283–3 లోని 1.68 ఎకరాల గయాళు భూమిని, వేములవలస సర్వే నంబరు 123 లో 34 సెంట్లు, 122–1, 122–2, 122–3లలో 76 సెంట్లు వాగు పోరంబోకుని సంబంధిత యాజమాన్యం కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా క్రీడా ప్రాంగణంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టింది.. శనివారం ఈ నిర్మాణాల ప్రహరీ గోడలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని, హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్లీజ్కు.. లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సిరిపురంలోని ఫ్యూజన్ çఫుడ్స్ అండ్ రెస్టారెంట్ను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్ధ (వీఎంఆర్డిఏ) ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన టి.హర్షవర్ధన్ ప్రసాద్.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పద్ధతిలో వీఎంఆర్డీఏ కి చెందిన 10,842 చదరపు అడుగుల స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. 2015లో ఏటా రూ.33 వేల చొప్పున చెల్లించేలా ఫ్యూజన్ ఫుడ్స్ పేరుతో తొమ్మిదేళ్ల లీజుకు తీసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నం.56 ప్రకారం మూడేళ్లు మాత్రమే లీజుకి ఇవ్వాల్సి ఉండగా.. అప్పటి వుడా అధికారులు టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో ఏకంగా తొమ్మిదేళ్లకు రాసిచ్చేశారు. ఇదిలావుండగా ఈ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా శ్రీ కన్య కంఫర్ట్స్ అనే సంస్థకు సబ్ లీజుకు ఇచ్చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన లీజు కారణంగా వీఎంఆర్డీఏకి ప్రతి నెలా లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని భావించిన కమిషనర్ పి.కోటేశ్వరరావు చర్యలకు ఆదేశించారు. ఆదివారం ఉదయం వీఎంఆర్డీఏ కార్యదర్శి గణేష్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు హోటల్ను సీజ్ చేశారు. ఆక్రమణలపై చర్యలు కొనసాగిస్తాం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తిస్తున్నాం. సర్వే నంబర్లు, పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఆక్రమణలుంటే అక్కడ భూములు స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు దీనిని ప్రత్యేక డ్రైవ్లా ఇకముందు కూడా కొనసాగిస్తాం. –– ఆర్డీవో పెంచల్ కిశోర్ -
గంటా ఆస్తుల వేలం..
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పటి ఆయన మానసపుత్రిక ప్రత్యూష కంపెనీ కోసం తీసుకున్న రుణం వడ్డీ సహా రూ.248.03 కోట్లు అయ్యింది. దీన్ని చెల్లించడానికి ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేయడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలకు ఉపక్రమించింది. విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈనెల 25న వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఇ–ఆక్షన్ సేల్ నోటీసును హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంకు సామ్(ఎస్ఏఎం) బ్రాంచ్ జారీ చేసింది. (గడువులోగా పోలవరం పూర్తి కావాల్సిందే) పదవి నుంచి తప్పుకున్నా సరే.. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి రూ.141.68 కోట్లు మేర బకాయి పడింది. దీన్ని చెల్లించాలని ఇండియన్ బ్యాంకు 2016, అక్టోబరు 4వ తేదీన తొలుత నోటీసులు పంపించింది. కానీ రుణ చెల్లింపుల్లో కంపెనీ చేతులెత్తేసింది. తదుపరి వడ్డీ సహా ఆ బకాయి రూ.248.03 కోట్లకు (రూ.248,03,85,547) చేరింది. దీంతో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. రుణాల చెల్లింపునకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ లిమిటెడ్ సంస్థలను ఇండియన్ బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. తాను సంస్థ డైరెక్టర్ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. వేలం వేయనున్న ఆస్తుల జాబితాలో ఆయనకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. (బెయిల్ ఇప్పించి నిరసనలా?) వేలం వేయనున్న ఆస్తులివే.. ►నగరంలోని గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ఉన్న వాణిజ్య భవనం (దీని రిజర్వు విలువ రూ.154.72 లక్షలు) ►గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్లో త్రివేణి టవర్స్లోనున్న ఫ్లాట్, అదేచోట పి.రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోనున్న మరో ఫ్లాట్ (వీటి విలువ రూ.150.75 లక్షలు) ►ఎండాడ రెవెన్యూ గ్రామ పరిధిలో రుషికొండ గ్రామం వద్ద కేబీ సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న 503.53 చదరపు గజాల స్థలం (దీని రిజర్వు విలువ రూ.171.21 లక్షలు) ►ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ద్వారకానగర్ మొదటి లైన్లోని శ్రీశాంతా కాంప్లెక్స్లో ఉన్న ఆస్తి (రిజర్వు విలువ రూ.94.19 లక్షలు) ►పీవీ భాస్కరరావు పేరుతో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ నల్లూరులో 6వేల చదరపు గజాల భూమి (రూ.240 లక్షలు) ►ప్రత్యూష అసోసియేట్స్ షిప్పింగ్ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలోనున్న ఆస్తి (రూ.308.46 లక్షలు), అదే సంస్థకు అక్కడే ఉన్న మరో 333.33 చదరపు గజాల విస్తీర్ణంలోని ఆస్తి (రూ.66.67 లక్షలు) ►ఆనందపురం మండలం వేములవలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమి (రూ.2103.07 లక్షలు) ►ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్లోని మణికొండలోని ల్యాంకో హిల్స్లో ఉన్న ఫ్లాట్ (రూ.247.69 లక్షలు) -
12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో ఉచిత సైకిళ్లు పంపిణీలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్ట్ చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!' అంటూ ట్వీట్ చేశారు. కాగా మరో ట్వీట్లో.. 'పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. 'విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం విచారకరం. సకాలంలో స్పందించి ప్రాణనష్టం నివారించిన అధికారులకు ధన్యవాదాలు. దర్యాప్తులో అన్ని వివరాలు తేలుతాయి' అంటూ మరో ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: మల్లేష్ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి -
ఈ సోషల్ తీవ్రవాదం.. టీడీపీ ఉన్మాదం!
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను మేనేజ్ చేయడం.. వ్యక్తుల అవసరానికి వాడుకొని కరివేపాకు చందంగా తీసిపారేయడం టీడీపీ అధినేతతో సహా ఆ పార్టీ పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య అనేది ఎన్నోసార్లు వ్లెలడైన వాస్తవం.అధికారాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు తెగబడిన ఆ పార్టీ పెద్దలు.. అధికారం కోల్పోయాక సామాజిక మాధ్యమాల వేదికగా మరింత దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఆ పార్టీ, ప్రభుత్వ పెద్దలపై అశ్లీ, అసభ్యక సమాచారం, చిత్రాలతో అసత్యాలను వండివార్చి సమాజం మీదికి వదులుతున్న తీరు.. ప్రభుత్వంపై బురదజల్లుతున్న తీరు.. జగుప్స కలిగిస్తోంది.సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్న వ్యక్తులను సీఐడీ అరెస్టు చేయడంతో టీడీపీ బండారం బట్టబయలవుతోంది.సీఐడీ సోషల్ మీడియా తీగ లాగుతుంటే.. టీడీపీ డొంక కదులుతుండటం కలకలం రేపుతోంది.(గంటా గ్యాంగ్ హల్చల్) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలో ఉన్న ఐదేళ్లూ భూకుంభకోణాలు, దందాలతో విశాఖపట్నాన్ని చెరబట్టిన తెలుగుదేశం నాయకులు .. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడం, వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిత్వాలపై విషం చిమ్మడం, వారి గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం.. వంటి కుట్రలను సీఐడీ బట్టబయలు చేసింది. విశాఖ కేంద్రంగా.. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న పచ్చశ్రేణుల తీగ లాగితే ప్రతిపక్ష పెద్దల డొంక కదులుతుండటం ఇప్పుడు విశాఖలో కలకలం రేపుతోంది. విశాఖలో భూకబ్జాలకు అడ్డుకుట్ట వేస్తూ.. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటకు తీస్తున్న ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై కుట్రపూరిత కథనాల సృష్టికర్తలను సీఐడీ అరెస్టు చేయడంతో దీని వెనుకనున్న ప్రతిపక్ష నేతల ముసుగు తొలగుతోంది. ఏడాది కాలంగా సోషల్ మీడియా కుట్రపూరితకథనాలు వండివార్చుతున్న టీడీపీ సానుభూతిపరులు.. ఇటీవల మరింత రెచ్చిపోయి విశాఖ కేంద్రంగా ముఖ్యనేతలపై ఫేస్బుక్, వాట్సాప్లలో అశ్లీల, అసభ్యకర పోస్టులతో విష ప్రచారాన్ని పరాకాష్టకు చేర్చారు. మొదట్లో పెద్దగా పట్టించుకోని వైఎస్సార్సీపీ నేతలు ఈ దారుణ విష ప్రచారాలకు చెక్ పెట్టాలని నిర్ణయించి సీఐడీ దృష్టికి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన సీఐడీ కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై లోతైన విచారణ చేపట్టి పూర్తి ఆధారాలు సేకరించింది. విశాఖ కేంద్రంగా ఈ తప్పుడు కథనాలను, విష ప్రచారాలను అందరికీ చేరవేస్తున్న వ్యక్తి టీడీపీ క్రియాశీల కార్యకర్త అయిన నలంద కిశోర్గా గుర్తించింది. మూడురోజుల కిందట అతన్ని తమ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపి పంపేసిన సీఐడీ అధికారులు.. ఆధారాల నిగ్గు తేలడంతో మంగళవారం తెల్లవారుజామున కిశోర్ను అరెస్టు చేశారు. ఇంకా ఎవరెవరున్నారు..? ఈ అసత్య పోస్టులను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న నలంద కిశోర్ వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై కూడా సీఐడీ లోతైన దర్యాప్తు చేపట్టింది. అసత్య కథనాల సృష్టికర్తలు, వారి వెనుక ఉన్న పెద్దలు, వాటిని షేర్ చేస్తున్న వారి వివరాలపై ఆరా తీసింది. ఫేస్బుక్లోనే కాకుండా, టీడీపీకి మద్దతు పలికే సోషల్ మీడియా మిషన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా విదేశాలకు సైతం షేర్ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే.. ప్రభుత్వ పెద్దల ప్రతిష్టను మంటగలిపే కథనాలను షేర్ చేస్తుండడం వెనుక భారీ కుట్ర ఉందనేదానికి అవసరమైన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పెద్దలపై తప్పుడు కథనాలు సృష్టించడం ద్వారా ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించడమే ధ్యేయంగా ఈ కుట్రకు తెర తశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో నలంద కిశోర్ ల్యాండ్ మాఫియా హస్తం ఈ కుట్ర వెనుక రాజకీయ కారణాలతో పాటు ల్యాండ్ మాఫియా హస్తం ఉందన్న కోణంలో కూడా సీఐడీ దర్యాప్తు సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిన విషయాన్ని అప్పట్లో సహచర అమాత్యుడే స్వయంగా ఆరోపణలు చేశాడు. దీనిపై గత ప్రభుత్వం సిట్ విచారణ జరిపించినప్పటికీ.. అందులో వాస్తవాలను, అక్రమాలకు పాల్పడిన వారి వివరాలను, సిట్ నివేదికలోని అంశాలను బయట పెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణకు మరో సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనన్న భయంతో.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై తప్పుడు కథనాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కుట్ర పన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి,. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వంపైన, ప్రభుత్వ పెద్దలపైన తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్న విషయంపై సీఐడీ ఫోకస్ చేసింది. భూదందాల్లో కిశోర్ పాత్రపై ఆరా విశాఖలో జరిగిన భూదందాల్లో నలంద కిశోర్ పాత్రపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలను వారు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ముఖ్యంగా దసపల్లా భూముల వ్యవహారంలో తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించడంలో కిశోర్ పాత్ర ఉందని సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దల భూ వ్యవహారాల్లో కిశోర్ క్రియాశీలకంగా వ్యవహరించారన్న విషయాన్ని సీఐడీ పూర్తి ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ సానుభూతి పరుడునలంద కిశోర్ అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను షేర్ చేసిన టీడీపీ సానుభూతిపరుడు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు యలమర్తి నలంద కిశోర్ను సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫేస్బుక్, వాట్సాప్లతో పాటు టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్న విషయంపై నలంద కిశోర్కు సీఐడీ అధికారులు మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. దీనిపై మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సంపత్ వినాయక ఆలయం వెనుక ఉన్న ఆయన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఆరిలోవ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి ఐపీసీ సెక్షన్ 505బీ, 120బీ కింద కేసు నమోదుచేసి విచారించారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు కిశోర్ తరఫు న్యాయవాది సుమన్ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. ఆయన సమక్షంలోనే నిందితుడ్ని కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. -
స్వాగతిస్తున్నా: గంటా
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ వాసిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటనపై తాను స్పందిస్తున్నానని, ఇది మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని తెలిపారు. ఈ విషయంలో పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నా.. విశాఖవాసిగానే తన స్పందన తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరం సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జీఎన్ రావు కమిటీ సిఫారసులవల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. విశాఖను పరిపాలనపరమైన రాజధానిని చేస్తే మరెంతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రజలు నివాసముంటున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నగరమని తెలిపారు. రాజధానికి అన్ని విధాల అనువైన నగరం విశాఖ అని, పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో విశాఖలో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. అమరావతి రైతులకి తగిన న్యాయం చేయాలని కోరారు. -
సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. అధికారమే పరమావధిగా గంటా పనిచేస్తారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు గంటా పార్టీ మారుదామని అనుకుంటే సిట్ దర్యాప్తులో ఆయన పేరు ఉందని చంద్రబాబు బెదిరించారట. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వంటివారు విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన అపరాధి గంటా శ్రీనివాసరావే అని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లు, మచ్చ లేనోళ్లు ఎవరైనా బీజేపీ లోకి రావచ్చు. గంటా శ్రీనివాసరావు ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులను కలుస్తున్నారు. అధికారమే పరమావధిగా ఆయన పని చేస్తున్నారు. అధికారం మాత్రమే కావాలా? సిద్ధాంతాలు వద్దా? వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీలు మారితే ప్రజలు క్షమించరు. అమిత్ షా, సీఎం జగన్ మధ్య జరిగిన సమావేశంలో ఏం జరిగిందో మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది’అని రఘురాం అన్నారు. -
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా వీరు పొందుపర్చలేదన్నారు. అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్రెడ్డి వివరించారు. -
నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాది
-
‘నాతో పెట్టుకుంటే విశాఖలో తిరగలేవ్..’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన తర్వాత నియోజకవర్గం (విశాఖ ఉత్తరం)లో కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే గంటా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అవంతిని మంత్రిగా పరిగణించడంలేదన్న గంటా వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. తనతో పెట్టుకుంటే గంటా విశాఖలో తిరగలేరని మంత్రి హెచ్చరించారు. ఇక దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని చిన బజార్, తగరపు వలసల్లో అవంతి వైఎస్సార్ విగ్రహాల్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో అవంతి పాల్గొన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్కు నివాళులర్పించారు. -
టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశం ఇది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు, ఎంపీ కేశీనేని నాని గైర్హాజరయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడం పట్ల గంటా కోపంగా ఉండగా.. జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు వ్యహరశైలిపై ఎంపీ నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఈ ఇద్దరు అగ్ర నేతలు హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
విశాఖ తీరం: మునిగిపోతున్న నావలా టీడీపీ
తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏదైనా ఒక్క జిల్లా పాలిటిక్స్ను పరిశీలిస్తే చాలు. సువిశాల తీరం ఉన్న విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మునిగిపోయే నావలా తయారైంది. ప్రజాప్రతినిధులు ఎవరి దారిలో వారు నడుస్తూ.. పార్టీని దారిలో పెట్టేవారే లేనట్టు కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేల చూపులు చూస్తోంది. తీరంలో సైకిల్ తిరోగమనంలో పయనిస్తోంది. 2004 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో కేవలం నలుగురితో సరిపెట్టుకుంది. అందులో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు గెలుపు అంత ఈజగా రాలేదు. చివరి నిమిషంలో చావుతప్పి కన్నులొట్టబోయినట్టు ఆయన ఒడ్డునపడ్డారు. ఇక, పార్టీలో గెలిచిన నలుగురైనా.. చెయ్యీ చెయ్యీ కలిపి ముందుకెళ్తున్నారా అంటే అదీ లేదు. నలుగురూ నాలుగు దారుల్లో వెళ్తూ.. పార్టీని ఏ తీరానికి తేర్చాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి పూర్తిస్థాయిలో తేరుకోలేకపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికీ లోకల్ సమస్యలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడికక్కడ లోకల్ అధికార కేంద్రాలుగా మారేందుకు.. విశాఖ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. విశాఖ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా ఎస్ఏ రెహ్మాన్ను నియమించారు. అయితే.. రెహ్మాన్కు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంది. రెహ్మాన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తాను పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టనని భీష్మించుకొని కూర్చున్నారు వాసుపల్లి గణేష్. అంతేకాదు, రెహ్మాన్ను బాహాటంగానే ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి గణేష్కు షోకాజ్ నోటీసులు ఇస్తానని రెహ్మాన్ ప్రకటించారు కూడా. ఇటు వాసుపల్లి ధోరణి మాత్రం ఏం చేసుకున్నా పర్వాలేదు.. టీడీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసేది లేదనేలా ఉంది. ఇటీవల అధికార పార్టీని విమర్శించడానికి వాసుపల్లి గణేష్ పార్టీ కార్యాలయంలో కాకుండా.. ఒక హోటల్లో ప్రెస్మీట్ పెట్టడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా.. సొంత ఖర్చుతో ప్రెస్మీట్ పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయం ఉండగా ప్రెస్మీట్ బయట ఎక్కడో పెట్టడం ఏంటని రెహ్మాన్ రగిలిపోతున్నారట. వాసుపల్లి గణేష్ అధికార పార్టీ కంటే తననే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా మెలుగుతున్నారని తెలుస్తోంది. స్వయంగా అధ్యక్షుడు ఆదేశించినా.. ఆయన మాత్రం ఆచరించడానికి మొగ్గుచూపడం లేదని అంటున్నారు. ఇక.. కాకలు తీరిన గంటా శ్రీనివాసరావు గురించి చెప్పనవసరమే లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆయన పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదట. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు అనుభవించి అధికారం చెలాయించడాన్ని బాగా వంటబట్టించుకున్న గంటా... ఇప్పుడు ఆ అధికారానికి దూరంగా జస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్న విశాఖ జిల్లా టీడీపీ నేతలు.. కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేస్తారు.. పార్టీని ఏ తీరానికి చేరుస్తారనేది నాయకులకే అర్థంకాని మిస్టరీగా మారింది. -
మునిగిపోతున్న నావలా టీడీపీ
-
గంటా శ్రీనివాస్తో తోట త్రిమూర్తులు భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గం నాయకులు తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వీరు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ వీరి భవిష్యతు కార్యచరణపై స్పష్టత రాలేదు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్తో తోట త్రిమూర్తులు హైదరాబాద్లో భేటీ అయ్యారు. కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశానికి త్రిమూర్తులు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ నాయకుల సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. మరోవైపు తోట త్రిమూర్తులుతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో త్రిమూర్తులు గంటాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గంటా బీజేపీలోకి వెళ్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీపై టీడీపీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. -
ఉత్తరంలో టీడీపీ నేతల బరితెగింపు
విశాఖసిటీ: నోట్ల కట్టలతో ఓట్లు కొంటూ రాజకీయాలకు పాల్పడిన టీడీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అనుచరులు.. చివరి రోజు సైతం అదే పంథా కొనసాగించారు. తాయిలాలతో ఓట్లు రాలట్లేదని నిర్థరించుకున్న ఉత్తర నియోజకవర్గ టీడీపీ నాయకులు.. ఆఖరి బ్రహ్మాస్త్రంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే స్థితికి దిగజారారు. కుటిల రాజకీయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన ప్రతి చోటా ప్రజలను పట్టించుకోని గంటా.. కేవలం నోట్లతో ఓట్లు కొనొచ్చనే దుస్సంప్రదాయాన్నే అలవర్చుకున్నారు. పోటీ చేసిన చోట ఇక గెలవలేమని తెలిస్తే మాత్రం సామదాన బేధ దండోపాయాలను ఉపయోగించి.. ప్రజాస్వామ్యం ఓడిపోయినా ఫర్వాలేదు.. తమ నేత నెగ్గాలనీ.. పదవీ కాంక్షతో అరాచక రాజకీయాలకు తెరతీసే ప్రయత్నాలూ చేస్తారు. ఈ ఎన్నికల్లోనూ సరిగ్గా అదే తరహాలో వ్యవహరించారు టీడీపీ నేతలు. ఏ ఇంటి గడప తొక్కకుండా, ఎవరినీ అభ్యర్థించకుండా.. గంప గుత్తగా ఓట్లను కొనుగోలు చేసేసిన గంటా వర్గీయులు.. పోలింగ్కు ముందురోజూ అదే దుర్నీతి కొనసాగించారు. రాంజీ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న మూడు పోలింగ్ బూత్లను బుధవారం రాత్రి రూ.4 కోట్లకు బేరం పెట్టేశారు. అపార్ట్మెంట్, రేకులషెడ్, పక్కా ఇల్లు, పూరిగుడిసెలు.. ఇలా వర్గాలుగా విభజించి.. ఓట్లను బేరం పెట్టేశారు. అయితే.. పోలింగ్ మొదలైన సమయంలో ఆ ప్రాంతమంతా వైఎస్సార్కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని తెలిసిన తర్వాత టీడీపీ వర్గీయులు తమ అసలు రంగుని బయటపెట్టారు. అప్పటి వరకూ తనకు అనుకూలంగా ఓట్లు పడటం లేదని గ్రహించిన గంటా బ్యాచ్.. అక్రమాలకు తెరతీశారు. 209, 204 పోలింగ్ బూత్ల వద్ద పోలింగ్ కేంద్రానికి రాకుండా మధ్యాహ్నం వరకూ అడ్డుకున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు.. ధైర్యం చేసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాయంత్రం సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా బయటకు రావడంతో పోలింగ్ కేంద్రం కిక్కిరిసిపోయింది. ఆ సమయంలోనూ.. పోలింగ్ బూత్లోకి గంటా అనుచరులు చొచ్చుకుపోయారు. సైకిల్ గుర్తుకే ఓటు వెయ్యాలంటూ ఓటర్లను బెదిరింపు ధోరణులతో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో.. కొంతమంది ఓటు వెయ్యకుండానే వెనుదిరిగిన పరిస్థితులు దాపురించాయి. 34వ వార్డులోనూ అదే పరిస్థితి తనకు అనుకూలంగా లేని వార్డుల్లో టీడీపీ అనుచరగణం రెచ్చిపోయింది. పోలింగ్ బూత్ల వద్ద అక్రమాలకు తెరతీశారు. ఓటర్లను సాయంత్రం వరకూ బయటకు రానీకుండా చేసి.. పోలింగ్ గడువు ముగుస్తుందన్న సమయంలో బయటకు వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు వినియోగించనీకుండా చేసిన ఘనతనూ మూటగట్టుకున్నారు టీడీపీ వర్గీయులు. 34వ వార్డు ప్రజలకు 31వ వార్డులోని రైల్వే న్యూ కాలనీ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ఆ స్కూల్లో ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బెదిరించడంతో.. అక్కడికి చేరుకున్న ప్రజల్ని గేటు బయటకు పంపించి.. ఖాళీ అయిన తర్వాత పిలుస్తామని చెప్పడంతో.. ఓటర్లంతా గేటు బయటకు వచ్చేశారు. కానీ... ఆరు గంటల తర్వాత గేట్లను మూసి వేసి.. ఓటు వేసే అవకాశం లేదని చెప్పడంతో.. చాలా మంది ఓటర్లు నినదించారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు.. తమ దిగ జారుడు రాజకీయాల్ని ఆఖరి నిమిషం వరకూ కొనసాగించారు. పదవి కోసం.. ఎలాంటి పనికైనా ఒడిగడతారని మరోసారి నిరూపించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. ఓటర్లకు మద్దతుగా కేకేరాజు ధర్నా తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైల్వే న్యూకాలనీ బూత్ నెంబర్ 58 వద్ద పలువురి ఓటర్లకు ఓటు వేయడానికి అవకాశం కల్పిం చక పోవడంతో వైఎస్సార్సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు బూత్ దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి నానా ఇబ్బందులు పడ్డామని ఓటర్లు ఆయనకు తెలిపారు. చాలామంది మహిళలు చీరలు చిరిగిపోయి, ఒళ్లంతా గాయాలై చాలా కష్టాలు పడినట్లు వివరించారు. బూత్లు చిన్నవి కావడంతో ఊపిరాడక సాయంత్రం వేళ అందర్నీ బయటికి పంపించేసినట్లు తెలిపారు. మరళా లోనికి అనుమతిస్తామని చెప్పి, 6 గంటలకు కేవలం 250మందిని మాత్రం లోనికి పంపి, సుమారు 200 మందిని బూత్ బయటే నిలిపేయడంతో వీరంతా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇదంతా తెలుగుదేశం వారి పనేనని, వైఎస్సార్సీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న రామచంద్రనగర్, చిట్టిబాబుకాలనీ వాసులు ఎవరూ ఓటేయలేదని కె.కె.రాజుకు తెలిపారు. దీని విషయమై కె.కె.రాజు వెంటనే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల వరకు అక్కడే ఓటర్లు నిరీక్షించినా ఫలితం దక్కలేదు. కె.కె.రాజు మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా, అడ్డదారుల్లో గెలవాలని ఇక్కడ టీడీపీ అభ్యర్థి నానా ప్రయత్నాలు చేస్తున్నారని,అందులో భాగంగానే ఓటర్లను బయటకు పంపేశారని ఆరోపించారు. దీనిపై ఓటర్ల తరఫున న్యాయపోరాటం చేస్తామని, రీపోలింగ్ జరిపేలా చూడాలని కోరతామని తెలిపారు. -
సైకిల్ పంక్చర్.. గంటా స్థానమదే..!
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని.. సైకిల్ పంక్చర్ అయిందని బీజేపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. గంటా శ్రీనివాసరావు కబ్జా దాహానికి నియోజవర్గంలో కొండలు, గుట్టలు మాత్రమే మిగిలాయని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడ్డానని తనపై వచ్చిన ఆరోపణలకు విష్ణుకుమార్ రాజు ఖండించారు. నియోజకవర్గంలో కొందరు పచ్చనేతలు తనపై బురద జల్లుతున్నారని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ నార్త్ బీజేపీ క్యాడర్లో కొంతమందిని లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎన్ని చేసినా ఇక్కడ గంటా మూడో స్థానంలోనే ఉంటారని జోస్యం చెప్పారు. -
కుయుక్తుల ‘గంట’ గణగణ
ఎన్నికలంటే.. ప్రజాస్వామ్యయుతంగా గత పదవీకాలంలో చేసిన మేలు చెప్పాలి లేదా కొత్త అభ్యర్థులైతే తమను ఎన్నుకుంటే ఏం చేస్తామో చెప్పి.. ప్రజలను ఓట్లు అభ్యర్థించాలి.. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ అ అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యాంగా మార్చేశారు. ఎలక్షనీరింగ్కు కొత్త నిర్వచనం చెప్పారు. ప్రజలిచ్చిన పదవిని స్వార్థానికి.. ఆదాయార్జనకు దుర్వినియోగం చేయడం.. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి నోట్ల కట్ల తెంచడం.. ప్రలోభాల ఎర వేయడం.. మద్యం వరద పారించడం.. చోటా మోటా నేతలను కొనేయడం.. హోల్సేల్గా ఓట్లు రాబట్టుకోవడం.. ఇదీ ఆయనగారి ఎలక్షనీరింగ్.. ఈ విధానాలతో ప్రజలకు దూరమైన ఆయన ప్రతి ఎన్నికకూ నియోజకవర్గాన్ని మార్చేయక తప్పడం లేదు.. ఆ విధంగానే ఈసారి భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తరలివచ్చిన మంత్రి, టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడా అదే వ్యూహం అమలు చేయాలనుకున్నారు. కానీ పట్టణ ప్రాంతం కావడంతో ఇక్కడ ఆ పప్పులు ఉడకడం లేదు. పైగా ప్రధాన ప్రత్యర్థి ప్రచారంలోనే చుక్కలు చూపిస్తుండటంతో.. గంటా వారు వ్యూహం మార్చి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకేరాజుపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లూ నోట్ల కట్టలు, విలువైన వస్తువులతో ప్రలోభపెట్టడం తరహా ఎలక్షనీరింగ్నే నమ్ముకుని.. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఈసారి పోటీ చేస్తున్న ఉత్తర నియోజకవర్గంలోనూ ప్రలోభాలతోనే గట్టెక్కాలని వ్యూహరచన చేశారు. కబ్జాలు, భూ దందాల ద్వారా సంపాదించిన అక్రమార్జనను కుమ్మరిస్తున్నారు. పెద్దగా ప్రచారం చేయకుండానే గెలుస్తానన్న ధీమాతో డబ్బులు విరజిమ్ముతున్నారు. ప్రచారం కంటే సంఘాలు, కులాల వారీగా భేటీలు జరుపుతూ కోట్లు ఎర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఎక్కువ మంది విద్యావంతులు, మేధావులు కావటంతో గంటా ప్రలోభాలకు లొంగే అవకాశం కూడా కనిపించటం లేదు. మంత్రిగారి అవినీతి గురించి ఇప్పటికే ఊరూవాడా తెలిసిపోవటంతో ఓటమి తప్పదన్న నిర్ధారణకు వచ్చేసిన ఆయన త్త కుయుక్తులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. ప్రచారంలో చుక్కలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకేరాజు గత ఆర్నెల్లుగా నియోజకవర్గంలో బలమైన క్యాడర్తో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలనూ కలుపుకొని వెళుతుండటంతో పార్టీలో చేరికలు బాగా పెరిగాయి. గంటా అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత టీడీపీతో పాటు జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రచారంలో గంటాపై కేకే రాజు స్పష్టమైన ఆదిక్యత కనబరుస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో పార్టీ నుంచే సహకారం లేకపోవడం, ప్రచారానికి వెళ్తే ప్రజల్లో కనీస స్పందన లేకపోవడంతో గంటా దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్న గంటా కొత్త ఎత్తుగడ వేశారు. ఓపైపు కోట్లు కుమ్మరిస్తూ ఓట్లు కొనుగోలు చేస్తూనే మరో వైపు ప్రత్యర్థులపై మైండ్గేమ్ ఆడుతున్నారు. తన అనుచరులతో కలిసి ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు తనకు లొంగిపోతున్నారంటూ విషప్రచారం మొదలెట్టారు. విషప్రచారం కేకేరాజుతో సన్నిహితంగా ఉండే పలువురు నేతలు తమ వైపు వచ్చేస్తున్నారని..వాళ్లంతా ఒకేరోజు రాజీనామాలను చేసేస్తున్నారంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి పెద్ద సంఖ్యలో చేరికలతో వైఎస్సార్సీపీ రోజురోజుకు నియోజకవర్గంలో బలపడుతూ.. విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంటోంది. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉత్తర నియోజకవర్గ జనసేన నేతలు గుంటూరు భారతి దంపతులు శుక్రవారం వై.ఎస్.జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ షాక్ల నుంచి తేరుకోవటానికి గంటా ఫైనల్గా కోవర్టు ఆపరేషన్ మొదలæట్టారు. పోలింగ్కు ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ఫలానా పార్టీ వార్డు అధ్యక్షుడు మా పార్టీలోకి వచ్చేస్తున్నాడు. ఫలానా అభ్యర్థి నాకు లొంగిపోయారు, కోట్లకు అమ్ముడు పోయారంటూ గోబెల్స్ ప్రచారానికి తెరతీయడంతో బరిలో నిలిచిన అభ్యర్థులే కాదు.. నియోజకవర్గ ప్రజలు సైతం గంటా తీరుపై మండిపడుతున్నారు. ఇదేంరాజకీయమని ప్రశ్నిస్తున్నారు. నిజంగా దమ్ముంటే నేరుగా తలపడాలే తప్ప ఇలా దొడ్డిదారి కుయుక్తులు, కుట్రలకు పాల్పడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓటమి పాలవడం ఖాయమని ఉత్తర నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
జి.ఎస్.టి.. గంటా స్పెషల్ ట్యాక్స్
జీఎస్టీ.. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్.. దీనిలోనూ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సీజీఎస్టీ), స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(ఎస్జీఎస్టీ) అని ఉంటాయి... దేశంలో అందరికీ తెలిసిన అర్ధాలు ఇవే.. కానీ విశాఖ జిల్లాలో మాత్రం జీఎస్టీ అర్ధం వేరు.. ఇక్కడ జీఎస్టీ అంటే గంటా స్పెషల్ ట్యాక్స్.. ఔను.. ఇది ముమ్మాటికీ నిజం.. అది మంత్రి గంటా శ్రీనివాసరావు స్పెషల్ టాక్సే..! ఇంకా ఏమైనా అనుమానముందా?.. అయితే గతంలో ఆయన ప్రాతిని«ధ్యం వహిం చిన అనకాపల్లి, చోడవరం.. ప్రస్తుతం ప్రాతి నిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గాల్లో ఎవరినైనా అడగండి.. గంటా పురాణం ’గరుడ’ పురాణం కంటే పెద్దదని చెబుతారు. ఇంతకీ గంటావారి జీఎస్టీ ఏమిటంటే.. ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో గంటా గ్యాంగ్గా చెప్పుకొనే అనుచరగణం నిర్మాణదారులు, భూయజమానులు.. ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ వసూళ్లు, భూకబ్జాలకు పాల్పడుతూ అడ్డంగా దోచేసుకోవడాన్నే ఆయా ప్రాంతాల్లో జీఎస్టీగా పరిగణిస్తున్నారన్నమాట. అందుకే ఒకసారి పోటీ చేసిన చోట మళ్లీ ముఖం చూపించలేని పరి స్థితిలో గంటా నియోజకవర్గాలు మారుతుంటారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గంటా గ్యాంగ్ జీఎస్టీ దెబ్బ తాజాగా ఆయన్ను విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తరిమింది. వాస్తవానికి తొలుత భీమిలి నుంచే పోటీ చేయాలని ఆయన భావించారు. స్వయంగా ఎల్లో మీడియానే భీమిలిలో ఆయన పరిస్థితి బాగోలేదని, ఐదేళ్ళకాలంలో భూ కుంభకోణాలతో అప్రతిష్ట మూటకట్టుకున్నారని పుంఖాను పుంఖాలు రాసేసింది. అప్పట్లో చంద్రబాబే స్వయంగా అలా రాయించాడని నొచ్చుకుని అలకపాన్పు ఎక్కిన గంటా తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి అప్పటికి పార్టీ అధిష్టానంతో ఓకే అనిపించుకున్నారు. ప్రత్యర్ధి ఎవరైనా సరే లక్ష మెజారిటీతో గెలుస్తానని సీట్ల ఖరారు ముందు వరకూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. ఎప్పుడైతే అవంతి శ్రీనివాసరావు భీమిలి బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారో.. అప్పుడే గంటా భీమిలి నుంచి మూటాముల్లే సర్దేసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ అధిష్టానం కూడా ఈయన్ను విశాఖ ఎంపీగా పంపించి జిల్లా రాజకీయాల నుంచి పక్కకు తప్పించాలని చూసింది. కానీ సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పంతం పట్టి మరీ విశాఖ ఎంపీ సీటు సాధించుకోవడంతో గంటాకి విశాఖ ఉత్తర నియోజకవర్గ సీటుకు మారారు. గంటా అవినీతిపై విష్ణుచక్రం ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు.. గంటాపై నిప్పులు చెరుగుతున్నారు. గంటా వంటి నేతను ఎన్నుకుంటే ఉత్తర నియోజకవర్గాన్ని మొత్తం ఊడ్చేస్తారని ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారు. గంటా అక్రమాలు, భూదందాలే ప్రధాన అజెండాగా విష్ణుకుమార్రాజు ప్రచారం సాగిస్తున్నారనేది ప్రస్తుత ’ఉత్తర’ రాజకీయాలు పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక గంటా సామాజికవర్గానికి చెందిన జనసేన అభ్యర్ధి పసుపులేటి ఉషాకిరణ్ పోటీ పెద్ద లెక్కలోకి రాదనే వాదనలు ఉన్నాయి. జనసేన, టీడీపీ రహస్య పొత్తులో భాగంగానే ఆమెకు అక్కడ సీటు ఇప్పించారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ మేరకు ఆమె పెద్దగా ఓట్లు చీల్చే పరిస్థితి లేదన్న ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఉషాకిరణ్, ఆమె భర్త మురళీ తీవ్రంగా ఖండిస్తూ.. ‘గంటా ఓటమి.. మా విజయమే ధ్యేయంగా పని చేస్తామని’ ప్రకటిస్తున్నారు. మురళీ మాటల్లో వాస్తవాలేమిటో కొద్దిరోజుల ప్రచారసరళి చూస్తే తేలిపోతుంది. ఇక టీడీపీ శ్రేణులూ గంటా భారాన్ని తట్టుకోలేకమనే అంటున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.. 2024లో ఎక్కడుంటాడో.. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో.. ఈయన్ని నమ్ముకుంటే మన పరిస్థితి ఏమిటి... అని తెలుగుదేశం క్యాడర్ సైతం గంటాకు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదనే చెబుతున్నారు. ఐదేళ్ళుగా ఈ సెగ్మెంట్ నుంచి పార్టీ టికెట్ ఆశించి కోట్లు ఖర్చు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు గంటా దిగుమతిని జీర్ణించుకోలేక పైకి బాగానే ఉన్నా.. అంతర్గతంగా సహకరించడం లేదనే వాదనలే ఉన్నాయి. మొత్తం గా.. చూస్తే గంటా ‘దిగుమతి’ రాజకీయంపై మొహంమొత్తిన ప్రజలు ఈసారి ‘ఉత్త’చేతులతోనే పంపిం చేసే పరిస్థితే బలంగా ఉంది. ఉత్తరంలోచుక్కలు ప్రతి ఎన్నికల్లోనూ కుల లెక్కలు బేరీజు వేసుకుని బరిలోకి దిగే గంటా ఈసారి కూడా తన సామాజికవర్గ ఓట్లు గణనీయంగానే ఉన్న ఉత్తర నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. కానీ ఇప్పటివరకు రూరల్ నేపథ్యమున్న నియోజకవర్గాల్లో తన ’మార్కు’ రాజకీయాలు చూపించి ఎలాగోలా నెట్టుకొచ్చిన గంటాకు పూర్తిగా నగర వాతావరణం కలిగిన ఉత్తర నియోజకవర్గంలో చుక్కలు కనిపిస్తున్నాయి. యువకుడిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా, మచ్చలేని వ్యక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కేకే రాజు తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందంజలో ఉన్నారు. ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే జరిగే ప్రయోజనాలను, నవరత్నాల పథకాలను వివరిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు భూదందాలతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి. అరాచకాలను నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకువస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మీకు ‘జీఎస్టీ(గంటా స్పెషల్ టాక్స్) కావాలా.. అభివృద్ధి కావాలా’.. ’అరాచకం కావాలా.. ప్రశాంతత కావాలా..’ అని కేకే రాజు చేస్తున్న ప్రచారానికి కుల, మత, వర్గాలు.. చివరికి పార్టీలకతీతంగా ఉత్తర నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. -
మీడియా ముందు పరువు తీస్తారు, రాను: గంటా
సాక్షి, విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం వైజాగ్ జర్నలిస్టు ఫోరమ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం అభ్యర్థుల ముఖాముఖికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఉంటే తాను రానని, మీడియా ముందు తన పరువు తీస్తారంటూ మంత్రి గంటా ముఖం చాటేశారు. ఈ మేరకు ఆయన వీజేఎఫ్ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. కాగా విశాఖ నార్త్ నుంచి వైఎస్సార్ సీపీ నుంచి కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్, కాంగ్రెస్ అభ్యర్థిగా గోవిందరాజు బరిలో ఉన్న విషయం తెలిసిందే. వీజేఎఫ్ ముఖాముఖికి మిగతా వారంతా హాజరు కాగా, ఒక్క గంటా శ్రీనివాసరావు మాత్రం గైర్హజరు కావడం విశేషం. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. గంటా ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కాకపోవడం నియోజకవర్గ ప్రజలను, వీజేఎఫ్ను అవమానపరచడమే అని అన్నారు. ఏపీలో బీజేపీది ఎప్పుడు ప్రతిపక్ష పాత్రేనన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కాగా గంటా శ్రీనివాసరావు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో నెంబర్వన్ అని, ఓటును రూ.10వేలకు కొంటున్నారంటూ ....విష్ణుకుమార్ రాజు ఇప్పటికే ఘాటు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి మరోపేరు అయిన గంటా పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి అని, ఆయన గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో గంటా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నా చివరి శ్వాస వరకు వైఎస్ఆర్సీపీలోనే
సాక్షి, పశ్చమ గోదావరి: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయాన మీడియాతో మాట్లాడుతూ... నా చివరి శ్వాస ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని అన్నారు. కొంత మంది టీడీపీ నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దాన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
అవినీతి ‘గంటా’ను ఓడించడమే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి అవినీతి చక్రవర్తి రాష్ట్రంలో మరొకరు ఉండరని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక్క హుదూద్ ఇళ్ల స్కాంలోనే సుమారు ఏడున్నర కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం భాగంగా పలు ప్రాంతాలు పర్యటించిన విష్ణుకుమార్ రాజు.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాస్పై విరుచుకపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ నియోజకవర్గంలోనూ అక్రమాలు, దోపిడీలు చేయడం గంటాకు అలవాటని విమర్శించారు. దీంతో భీమిలి ప్రజలు వెళ్లగొడితే.. విశాఖపై పడ్డారని మండిపడ్డారు. ఆయనకు ఇదే ఆఖరి నియోజకవర్గం అవుతుందని జోస్యం చెప్పారు. (ఇక ‘ఉత్త’ర గంట) గంటా అవినీతిపై సిట్ రిపోర్టు బయటపెట్టి ఉంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా పోయేదని పేర్కొన్నాడు. పేదలను దోచుకునే స్థాయికి మంత్రి దిగజారడం సిగ్గుచేటన్నారు. అన్ని పార్టీలు గంటాకు టికెట్ నిరాకరించాయని.. దీంతో గత్యంతరం లేకే టీడీపీని పట్టుకొని వేలాడుతన్నారన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద శాతం అతడిని ఓడించడానికే ఇక్కడి నుంచి పోటీ చేస్తునాన్నని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రానికి పట్టిన అవినీతి చీడ పురుగును ఓడిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపాడు. -
టీడీపీలో సీట్లు.. సిగపట్లు
నిన్న మొన్నటి వరకు ఎంపీ సీటు నీదేనన్నారు.. తీరా అభ్యర్థుల ప్రకటన సమయం వచ్చేసరికి తూచ్.. అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటు నాకివ్వాల్సిందేనని ఆ యువనేత పట్టుపడుతున్నారు.. మరోవైపు ఎమ్మెల్యే సీటు నీదే.. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారు. ఇప్పుడేమో అసెంబ్లీ కాదు.. ఎంపీగా పోటీ చేయాలని పోరు పెడుతున్నారు.. దాంతో అవాక్కయిన ఆ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. నా నియోజకవర్గానికే నన్ను పరిమితం చేయండి బాబూ.. అని మొత్తుకుంటున్నారు.. ఇదీ అధికార టీడీపీలో పరిస్థితి.. జిల్లాలో ఐదు అసెంబ్లీ, మూడు లోక్సభ సీట్లకు ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆయా స్థానాలు ఆశిస్తున్న నేతలు టెన్షన్తో నలిగిపోతున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్నారు. పరిస్థితి చేయి దాటుతోందన్న భయంతో ఆశావహులు, అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు జిల్లా మంత్రులు చేస్తున్న మంత్రాంగం పెద్దగా ఫలించడం లేదు. ఆదివారం విశాఖ వచ్చిన చంద్రబాబు వద్దకు అటువంటి కొందరు నేతలను అయ్యన్నపాత్రుడు తీసుకెళ్లి మాట్లాడించేందుకు ప్రయత్నించినా సీఎం ఆ అవకాశం ఇవ్వలేదు. మరో మంత్రి గంటా సోమవారం తన నివాసంలో అసంతృప్త నేతలతో సమావేశమై చర్చించారు. ఇండిపెండెంటుగా నామినేషన్ వేస్తానని ప్రకటించిన నరవ రాంబాబును మాత్రం ప్రస్తుతానికి ఆపగలిగారు. సాక్షి, విశాఖపట్నం: రాని సీటు వస్తుందో రాదో తెలియదు.. నామినేషన్ల సమయం గడుస్తున్న కొద్దీ, ఆ టెన్షన్ ఊరికే ఉండనివ్వదు. అభ్యర్థిత్వాన్ని అధినేత ఎప్పుడు ఖరారు చేస్తారో, తమ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమీ అర్థం కాదు. సిట్టింగ్లకు, సీనియర్లకు సీన్ అర్థం కాదు. సందట్లో సడేమియాలా మంత్రులు మరేం ఫర్వాలేదంటూ ఇస్తున్న హామీల వల్ల ఆందోళన పెరుగుతుందే తప్ప ఉపశమించదు. ఇదీ ప్రస్తుతం టీడీపీలో పరిస్థితి. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పక్షం దుస్థితి. జిల్లా టీడీపీలో ఆశావహులు, సీనియర్లకు మాచెడ్డ ఇబ్బంది వచ్చి పడింది. అపార అనుభవం తన సొంతమని గొప్పలకు పోయే బాబు గారు ఏదీ తేల్చకపోవడంతో వీరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉంది. ఇదిగో అదిగో అంటూ సిట్టింగ్లు.. ఆశావహులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆడుకుంటున్న తీరు వారిలో కాక పుట్టిస్తోంది. అసలే టెన్షన్లో ఉంటే.. ఆ ఒత్తిడి చాలదన్నట్టు మంత్రులు ఆశావహులతో ఓ రకంగా ఆడుకుంటున్నారు. మీకు సీటిప్పించే బాధ్యత మాదంటూ లేనిపోని ఆశలు రేకెత్తిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటును ఆశిస్తున్న ఎంవీవీఎస్ మూర్తి మనుమడు భరత్కు కూడా వారు ఇదే విధంగా ఊరిస్తున్నారు. అయితే చంద్రబాబు ఏ మాటా చెప్పకపోవడంతో మూర్తి అనుచరులు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన బాబు వద్దకు తీసుకు వెళ్తానని, టిక్కెట్లు ఇప్పించే బాధ్యత తనదని మంత్రి అ య్యన్నపాత్రుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడుతో పాటు మి గిలిన ఆశావహులను ఊరించారు. అందుకు తగ్గ ట్టే తాను దగ్గరుండి మరీ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు వీళ్ల ఆశల మీద నీళ్లు చల్లేశారు. ఆశావహుకాదుకదా.. కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాటమాత్రంగానైనా కూడా సీఎం మాట్లాడలేదు. సీఎంను చూడగానే మంత్రి అ య్యన్న మాట్లాడే ప్రయత్నం చేయగా.. ‘చూద్దాం. ఫోన్లో మాట్లాడతాలే అంటూ సీఎం ఫ్లైట్ ఎక్కి చెక్కేశారు. దీంతో సీనియర్లమైన తమను ఇంత హీనంగా చూస్తారా అంటూ ఎమ్మెల్యేలు బండారు, కేఎస్ఎన్ఏస్ రాజు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే బండా రు... సీనియర్ ఎమ్మెల్యేనైన తనకు సీటు కేటా యింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ అ సహనం వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పరిస్థితికూడా అంతే. ఆయన కూడా టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. ఎయిర్పోర్టులోతమకు జరిగిన అవమానాన్ని త ట్టుకోలేక మంత్రి అయ్యన్నవద్దే తమ అసహనా న్ని వ్యక్తంచేసినట్టుగా పార్టీనేతలు చెబుతున్నారు. మరో వైపు మరోమంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం సిట్టింగ్లు, ఆశావహులతో బుజ్జగింపు నాటకమాడారు. తన ఇంట్లో గాజు వాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ మూర్తి మనుమడు భరత్ ఇతర ఇతర ఆశావహులతో భేటీ అయ్యారు. సీఎంతో తాను మాట్లాడతానని, ఆయన దగ్గరకు తీసుకెళ్తానని కొత్తపల్లవి అందుకున్నారు. ‘మీ ఇద్దరికి మీరు కోరుకున్న సీట్లు ఇచ్చే బాధ్యత నాది.. నన్ను నమ్మండి’ అం టూ అభయమిచ్చారు.విశాఖ ఎంపీసీటు తనకు ఇవ్వాల్సిందేనని భరత్ పట్టుబడుతుండగా, తాను ఎంపీగా పోటీచేయనంటూ పల్లా తేల్చి చెబుతున్నారు. గాజువాకనుంచి బరిలోకి దిగనున్న పవన్కళ్యాణ్ కోసం తమ భవిష్యత్ను బలిచేయొద్దం టూ వారిద్దరూ మంత్రి గంటాకు తేల్చి చెప్పారు. లేదంటే తమ దారితాముచూసుకోవల్సి వస్తుం దని హెచ్చరించినట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ విశాఖ ఎంపీతో పాటు భీమిలితో పాటు గాజు వాక, పెందుర్తి, మాడుగుల, చోడవరం సీట్ల పం చాయతీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది.మరో పాటు ఇప్పటికే ఖరారైన పలువురు అభ్యర్థులు సైతం తమకు బి.ఫారం చేతికి అందుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చివరి నిముషంలో మళ్లీ ఒకటి రెండు మార్పులు ఉండవచ్చునని పార్టీ అధిష్టానం నుంచిసంకేతాలు వస్తుండడంతో టికెట్ దక్కిన వారిలో కూడా ఆందోళన నెలకొంది.