
సాక్షి, అమరావతి : ‘73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంద’ని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంకిత భావంతో కూడిన రోజుగా జరుపుకుందామని ఆయన ఆకాక్షించారు. స్వతంత్ర స్వేచ్ఛా ఫలాలను ఆస్వాదించడానికి ఈ రోజును అందించిన దేశ భక్తులందరినీ జ్ఞాపకం చేసుకునే గొప్ప రోజు అని కొనియాడారు.
సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు అంకితమిచ్చే రోజుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుకుందామన్నారు. ఈ పవిత్రమైన రోజున దేశ నిర్మాణానికి కారణభూతులమవుతూ పునరంకితం అవుదామన్నారు. ఈ రోజును చిరస్మరణీయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment