స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: బిశ్వభూషన్‌ | AP Governor's message on the 72nd Independence Day | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్‌

Published Wed, Aug 14 2019 8:58 PM | Last Updated on Wed, Aug 14 2019 9:12 PM

AP Governor's message on the  72nd Independence Day - Sakshi

సాక్షి, అమరావతి : ‘73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంద’ని  ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంకిత భావంతో కూడిన రోజుగా  జరుపుకుందామని ఆయన ఆకాక్షించారు. స్వతంత్ర  స్వేచ్ఛా ఫలాలను ఆస్వాదించడానికి ఈ రోజును అందించిన దేశ భక్తులందరినీ జ్ఞాపకం చేసుకునే గొప్ప రోజు అని కొనియాడారు.

సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు  అంకితమిచ్చే రోజుగా  స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుకుందామన్నారు. ఈ పవిత్రమైన రోజున దేశ నిర్మాణానికి కారణభూతులమవుతూ  పునరంకితం అవుదామన్నారు. ఈ రోజును చిరస్మరణీయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement