Biswabhusan Harichandan
-
గన్నవరం ఎయిర్పోర్ట్లో గవర్నర్కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు (ఫొటోలు)
-
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆత్మీయ వీడ్కోలు
-
గన్నవరం ఎయిర్ పోర్టులో గవర్నర్ కు సీఎం జగన్ వీడ్కోలు
-
గన్నవరం ఎయిర్పోర్ట్లో గవర్నర్కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్లో బుధవారం ఉదయం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన బిశ్వభూషణ్.. మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్గా కొనసాగారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కాగా, హరిచందన్కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకమని బిశ్వభూషణ్ ప్రశంసించారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురమన్నారు. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారని గవర్నర్ అన్నారు. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్.. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో నూతన గవర్నర్కు సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఎల్లుండి ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన -
గవర్నర్ కు ఆత్మీయ వీడ్కోలు
-
సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన
సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశానికి ఆదర్శప్రాయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దారని అభినందించారు. రాజకీయ నేతల అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమాజ శ్రేయస్సే కావాలని, సీఎం జగన్ దీన్ని ఆచరణలో చూపిస్తున్నారని చెప్పారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీపై వెళ్తున్న హరిచందన్కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. అందరికీ సంక్షేమ ఫలాలు ఆశ్చర్యమే రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకం. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురం. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఆర్బీకేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శప్రాయం. ఆయన కోరికపై ఓసారి వాటిని సందర్శించి ముగ్దుడినయ్యా. సమాజంలో దాదాపు 70 శాతం ఉన్న రైతుల అన్ని అవసరాలను ఒకేచోట తీర్చేలా ఆర్బీకేలను తీర్చిదిద్దారు. భూసార పరీక్షలు నిర్వహణ నుంచి విత్తనాలు, ఎరువుల పంపిణీ వరకు అన్ని సేవలు అక్కడే అందిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు తమ పంటలను ఆర్బీకేల ద్వారా సరైన ధరకు విక్రయించగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు చెప్పా. కోవిడ్ సమర్థంగా కట్టడి కోవిడ్ మహమ్మరిని సమర్థంగా కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారు. అన్ని వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలను సమర్థంగా సమన్వయపరిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది, సమాజంలో వివిధ వర్గాలు స్పందించిన తీరు అమోఘం. ఆరోగ్యశ్రీ ఓ అద్భుతమైన పథకం. అదే తరహాలో కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు సీఎం జగన్ సదా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రం, దేశం అభివృద్ధి, సమాజానికి మేలు చేయడమే రాజకీయ నేతల అంతిమ లక్ష్యం కావాలి. అవన్నీ ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. గవర్నర్తో సత్సంబంధాలను కొనసాగించి గొప్ప రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు. ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై మేం తరచూ సంప్రదింపులు జరిపాం. ప్రజల శ్రేయస్సే అత్యంత ప్రాధాన్యత అంశంగా మేమిద్దరం భావించాం. అందుకే సమస్యల పరిష్కారం కోసం మెరుగైన రీతిలో చర్యలు తీసుకోగలిగాం. ముఖ్యమంత్రి జగన్తో అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయన్ను మా కుటుంబ సభ్యుడిగా భావిస్తా. ప్రజా ప్రభుత్వం సజావుగా పని చేసేలా.. గవర్నర్ హోదాలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావపూర్వక వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ప్రభుత్వం సజావుగా సాగేలా చొరవ తీసుకున్నా. అందులో చాలావరకు సఫలీకృతమైనట్లు భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను విడిచివెళ్లడం కాస్త బాధగానే ఉంది. విధి నిర్వహణలో భాగంగా చత్తీస్గఢ్ వెళ్తున్నా. ఏపీ ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాలు, ఆదరణను ఎప్పటికీ మరవలేను. ఆంధ్రప్రదేశ్ను నా రెండో ఇల్లుగా భావిస్తున్నా. నాకు సహకరించిన సీఎం జగన్, మంత్రులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు. ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ► గవర్నర్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమంలో సీఎం జగన్ ► రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారు ► వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్గా మూడేళ్ల పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారన్నారు. ఓ ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్ వ్యవస్ధకు నిండుతనం తెచ్చారని ప్రశంసించారు. చత్తీస్గఢ్ గవర్నర్గా వెళుతున్న విశ్వభూషణ్ హరిచందన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం తరపున శుభాకాంక్షలతోపాటు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్కు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. గవర్నర్ వీడ్కోలు సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విద్యావేత్త, న్యాయ నిపుణుడు, స్వాతంత్య్ర సమరయోధుడు.. గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలపై ఈమధ్య కాలంలో చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నం. ఓ తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి మన గవర్నర్ సంపూర్ణంగా సహకరించి వాత్సల్యం చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు. వీటన్నింటికీ మించి ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పని చేసి తాను బాధ్యతలు నిర్వహించిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర చూపారు. ఒడిశా అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికైన ఆయన 2000 ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించి న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు. ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ వెన్నుదన్నుగా నిల్చి ఎన్నో విజయాలకు కారణమయ్యారు. ఆమెకి కూడా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు నిండు నూరేళ్లు జీవించి ఇంకా ఎంతో సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఆయనతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వెంకన్న చిత్రపటం బహూకరణ వీడ్కోలు సందర్భంగా తంజావూరు శైలిలో రూపొందించిన తిరుమల శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల చిత్రాలతో కూడిన మెమెంటోను గవర్నర్ హరిచందన్కు సీఎం జగన్ బహూకరించారు. జ్ఞాపికను అందించే ముందు సీఎం జగన్ తన పాదరక్షలు విడిచి పెట్టి చిత్రపటాన్ని అందించగా గవర్నర్ కూడా తన పాదరక్షలను వదిలేసి జ్ఞాపికను స్వీకరించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. -
గవర్నర్ బిశ్వభూషణ్కు ఆత్మీయ వీడ్కోలు సభ (ఫొటోలు)
-
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
-
గవర్నర్తో నాకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. మూడు సంవత్సర కాలంలో రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్ వ్యహరించారని అన్నారు. గవర్నర్తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని సీఎం పేర్కొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా గవర్నర్ ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు. ‘గవర్నర్ విద్యావేత్త, న్యాయ నిపుణులు, వీటన్నింటిని మించి ఆయన స్వాతంత్ర్య సమరయోధులు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించారు ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ ఒడిశా హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం కోసం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు. గవర్నర్ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. ప్రజలకు మరింత సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. బిశ్వభూషణ్ హరిచందన్కు ప్రజలు, ప్రభుత్వం, నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చత్తీస్గఢ్ గవర్నర్గా వెళ్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం బిశ్వభూషణ్ హరిచందన్ను ఆత్మీయంగా సత్కరించారు. చదవండి: నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ ప్రజలను మరవను: బిశ్వభూషణ్ హరిచందన్ -
ఏపీ నాకు రెండో ఇల్లు.. సీఎం జగన్ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా: గవర్నర్ బిశ్వభూషణ్
-
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు: సీఎం జగన్
-
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ ప్రజలను మరవను: గవర్నర్
సాక్షి, విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివని తెలిపారు. గవర్నర్, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. ‘ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగా. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనది. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. సీఎం జగన్ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’ అని గవర్నర్ ప్రసంగించారు. కాగా బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్గా సేవలందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్: జోగి రమేష్ -
గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన సీఎం వైఎస్ జగన్
-
గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్గఢ్కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా సుప్రీకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్ హరిచందన్ను చత్తీస్గఢ్ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లనున్నారు. చదవండి: జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర -
ఏపీ కొత్త గవర్నర్గా అబ్దుల్ నజీర్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్నెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కొత్త గవర్నర్లు వీరే.. - ఏపీ.. సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్. అబ్దుల్ నజీర్ - అరుణాచల్ ప్రదేశ్.. త్రివిక్రమ్ పర్నాయక్ - సిక్కిం.. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య - ఛత్తీస్ఘఢ్.. బిశ్వభూషణ్ హరిచందన్ - మహారాష్ట్ర.. రమేష్ - మేఘాలయ.. చౌహాన్ -
ఆలయాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణులు..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉందని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో దీనిపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 610 ఆలయాలకు త్వరలో నియామకం! హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం దేవదాయ శాఖ పరిధిలో ఐదు లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.ఐదు లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది. నాడు అవమానం.. నేడు సముచిత స్థానం ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో తాము అవమానాలు ఎదుర్కొనగా ఇప్పుడు సముచితం స్థానం దక్కిందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆలయాల నిర్వహణలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరిన నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను అధికారంలో ఉండగా చంద్రబాబు తీవ్రంగా అవమానించారని గుర్తు చేస్తున్నారు. నాడు సచివాలయంలో తనను కలసి సమస్యలు వినిపించిన సంఘాల నేతలనుద్దేశించి ‘తోకలు కత్తిరిస్తా.. ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశ చరిత్రలోనే అరుదు దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కింది. మా వినతిని ఆలకించి ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించింది. సీఎం జగన్కు నాయీ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది. – సిద్దవటం యానాదయ్య (ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్), గుంటుపల్లి రామదాసు (కేశ ఖండనశాల నాయీ బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు) -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. టీడీడీ ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్గా ఆయా జిల్లాలలో తనదైన ముద్ర వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కేఆర్ పురంలలో, సబ్ కలెక్టర్గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్గా వ్యవహరించారు. -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాంప్రకాష్ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
యూనివర్సిటీల్లో పరిశోధనల్ని ప్రోత్సహించాలి
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు బోధనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, పరిశోధనలకు దూరంగా ఉండటం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ ఉపకులపతుల సదస్సు–2023ని ఏయూ కన్వెన్షన్ హాల్లో గవర్నర్ మంగళవారం ప్రారంభించారు. రెండురోజుల సదస్సులో తొలిరోజు ‘రీసెర్చ్ అండ్ ఎక్స్లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై గవర్నర్ ప్రసంగించారు. ఉన్నతవిద్యలో పరిశోధనల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాల్ని చేసుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలు బోధనకే పరిమితం కాకూడదని సూచించారు. పరిశోధన రంగంవైపు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని, ఇందుకనుగుణంగా రీసెర్చ్ రంగంలో పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచస్థాయి ర్యాంకింగ్లలో అత్యుత్తమ స్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశంగా భారత్ ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందని, 2022 నాటికి దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలో అమెరికా, చైనా, యూకే సహా 50 దేశాలకు మనదేశం మార్గదర్శిగా నిలవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. ఏయూ వీసీ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల్ని సాకారం చేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు. ఏఐయూ అధ్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు పరిశోధనలకు అనుగుణంగా ఉన్నతవిద్యని ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యని పటిష్టం చేసేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి ఐదు లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో తొలుత ఏఐయూ ప్రత్యేక సంచికని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్, 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
హిందూధర్మానికి ఉనికి ఆదిశంకరాచార్యులే..
సింహాచలం: హిందూ ధర్మానికి ఉనికి జగద్గురు ఆదిశంకరాచార్యులే అని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. శ్రీశారదాపీఠంలో ఐదురోజులుగా జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శాస్త్ర, శ్రౌతసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. ఆచార్యుల పేరుతో మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రచారం పొందినా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులే తెలుసని చెప్పారు. శంకరాచార్య తత్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా వార్షికోత్సవాల్లో శాస్త్ర, శ్రౌతసభలు నిర్వహిస్తున్నామని, బిరుదులిచ్చి స్వర్ణకంకణధారణ చేస్తున్నామని తెలిపారు. హిందూధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అని సామాన్యులు భావిస్తారని, కానీ శాస్త్రం ఉంటేనే హిందూధర్మం నిలుస్తుందని తమ పీఠం నమ్ముతుందని చెప్పారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదన్నారు. అంగదేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు రాజశ్యామల కృపను పొందారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రసభలో ప్రతిభకనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి వ్యాకరణ భాస్కర బిరుదు ప్రదానం చేసి స్వర్ణకంకణధారణ చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో షట్శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్లాల్, మణిద్రావిడ శాస్త్రి, ఆర్.కృష్ణమూర్తి శాస్త్రి, ప్రముఖ శ్రౌత పండితులు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు. ఆశీస్సులందుకున్న గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ల్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వైభవంగా మహాపూర్ణాహుతి వైభవంగా జరిగిన రాజశ్యామలయాగం, శ్రీనివాస చతుర్వేద హవనం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్రాజ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, తెలంగాణకు చెందిన కంపెనీస్ లా ట్రిబ్యునల్ చైర్మన్ బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు ఎంతో గొప్పవని చెప్పారు. -
విశాఖ: దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం అయ్యింది. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సదస్సును ప్రారంభించారు. సదస్సుకు ఏడు రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ట్రాన్స్ఫర్ మెటీవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై జరగనుంది ఈ సదస్సు. మరోవైపు ఈ సదస్సుకు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతుండడం విశేషం. -
ఏపీ ప్రగతి దేశానికి ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు 73 ఏళ్ల రాజ్యాంగ సారాన్ని మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి పథంలో నిలిపిందని, మనం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మన ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని 43 నెలల్లోనే సాకారం చేశామన్నారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ అందుకు దోహదం చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.1.82 లక్షల కోట్లు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు చేరాయన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్ వ్యవసాయంలో ముందడుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 29.77 లక్షల మంది రైతుల నుంచి 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.54,140 కోట్లు చెల్లించింది. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు కూడా మేలు చేస్తోంది. మూడున్నరేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.25,971 కోట్లు అందచేసింది. దేశంలో సార్వత్రిక పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గుర్తించిన అన్ని పంటలకు రైతుల తరపున ప్రీమియం వాటాను ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,684 కోట్ల విలువైన క్లెయిమ్లను పరిష్కరించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల ద్వారా రూ.1,442.66 కోట్ల వడ్డీ రాయితీని నేరుగా 73.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. విజయవాడలో జాతీయజెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గ్రామీణ పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి నెలకు రూ.2,750 చొప్పున చెల్లిస్తోంది. ప్రతినెలా రూ.1,765 కోట్లను 64.06 లక్షల మంది లబ్ధిదారులకు ఒకటో తేదీన ఇంటివద్దే అందజేస్తోంది. మూడున్నరేళ్లలో పింఛన్ల కోసం రూ.63,303 కోట్లు ఖర్చు చేసింది. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారి కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం సహాయక సంఘాలకు రూ.25,517 కోట్లను చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళల జీవనోపాధి కోసం రూ.18,750 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు చెందిన 3,56,143 మంది మహిళలకు రూ.1,518 కోట్లను అందించింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3,93,537 మందికి రూ.590 కోట్ల మొత్తాన్ని నేరుగా పంపిణీ చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో 17.44 లక్షల ఎస్సీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాజ్యాంగ నిర్మాతకు నివాళిగా విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో రూ.268 కోట్ల అంచనా వ్యయంతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామ స్వరాజ్యం, పారదర్శక సేవలు లక్ష్యంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థతో 2.65 లక్షల మంది వలంటీర్లు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా ఇప్పటివరకు రూ.33,544 కోట్లతో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా 2.3 లక్షల గృహాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు రూ.34 వేల కోట్లతో వైఎస్సార్ జగనన్న లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పథకాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని అన్ని ఇళ్లను సందర్శించేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. గవర్నర్తో ఆప్యాయంగా సీఎం వైఎస్ జగన్ పరిశ్రమలు – వాణిజ్యం రాష్ట్రంలో 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ 31 వరకు పెట్టుబడుల ప్రవాహం బలంగా ఉంది. రూ.54,236 కోట్ల పెట్టుబడితో 109 పెద్ద పరిశ్రమలను స్థాపించారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.72,608 కోట్లతో 1,45,496 యూనిట్లు వచ్చాయి. వీటిద్వారా 11,19,944 మందికి ఉపాధి లభిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ‘టాప్ అచీవర్’గా ఎంపికైంది. జూన్ 2022లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తలసరి ఆదాయం రూ.1,70,215కి పెరిగింది. మత్స్యకారుల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, మూడు ఓడరేవులను అభివృద్ధి చేస్తోంది. ఉపాధిలో మిన్న.. ఉపాధిహామీలో భాగంగా 1,871 లక్షల పనిదినాలను కల్పించి ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉంది. రోడ్లు భవనాల శాఖ 5,181 కి.మీ పొడవైన వివిధ రహదారుల అభివృద్ధి పనులను రూ.2173 కోట్లతో చేపడుతోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏడాది కాలంలో 992 కి.మీ. బీటీ రోడ్లు వేశారు. జీవనాడికి ప్రాధాన్యం.. ఏపీకి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.15,448 కోట్లతో బాబు జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. పటిష్టంగా శాంతి భద్రతలు.. రాష్ట్ర పోలీసుల సమర్థతతో 2022లో నేరాలు గణనీయంగా తగ్గాయి. వినూత్న పోలీసింగ్ చర్యల ద్వారా ఇది సాధ్యమైంది. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం దిశ యాప్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 1.11 కోట్ల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. శాంతి భద్రతలను సమర్థంగా పరిరక్షించేందుకు 14 కొత్త పోలీసు సబ్ డివిజన్లు, 19 కొత్త సర్కిళ్లు, రెండు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు 21 స్టేషన్లను అప్గ్రేడ్ చేసింది. వికేంద్రీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరింది. కొత్తగా ఏర్పాటైన వాటితో రెవెన్యూ డివిజన్లు 76కి పెరిగాయి. వందేళ్ల తరువాత భూముల సర్వే దేశంలో 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టిన తొలి రాష్ట్రం మనదే. 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 85 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో విస్తరించిన 17,584 గ్రామాల్లో రీసర్వే ప్రాజెక్టు కొనసాగనుంది. కనువిందుగా కవాతు గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. బెస్ట్ ఆర్డ్మ్ కంటింజెంట్గా ఇండియన్ ఆర్మీ నిలవగా, ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్ రెండో స్థానంలో నిలిచింది. నాన్ ఆర్డ్మ్ కంటింజెంట్ విభాగంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్) తొలి రెండు స్థానాలు సాధించాయి. ఈ ఏడాది నుంచి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పరేడ్లో పాల్గొన్న ఒడిశా స్టేట్ పోలీస్ విభాగానికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాలు గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన 13 శకటాలు రాష్ట్ర ప్రగతి, సంక్షేమానికి నిదర్శనంగా నిలిచాయి. గృహ నిర్మాణ శాఖ శకటం ప్రథమ బహుమతిని కైవశం చేసుకోగా పాఠశాల విద్యాశాఖ (డిజిటల్ విద్యాబోధన) శకటం రెండో స్థానంలో నిలిచింది. ఊరూరా అభివృద్ధి– ఇంటింటా సమృద్ధి నేపథ్యంతో రూపుదిద్దుకున్న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శకటం మూడో స్థానం దక్కించుకుంది. మొదటి, మూడో ఉత్తమ శకటాలకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి గవర్నర్ చేతుల మీదుగా బహుమతులను అందుకోగా రెండో ఉత్తమ శకటానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులతో కలసి స్వీకరించారు. చదువులకు చేయూత పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదని అమ్మ ఒడితోప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఇప్పటి దాకా రూ.19,617 కోట్లను నేరుగా 44.49 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసింది. 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతోంది. మన బడి – నాడు నేడు ద్వారా 45,484 ప్రభుత్వ పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 55,607 అంగన్వాడీల్లో రూ.17,835 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించింది. జగనన్న గోరుముద్ద కోసం ఇప్పటిదాకా రూ.3,239 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.2,368 కోట్లు వెచ్చించింది. జగనన్న విద్యా దీవెన కింద మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తూ ఇప్పటివరకు 24,74,544 మంది విద్యార్థులకు రూ.9,051 కోట్లు చెల్లించింది. డిజిటల్ లెర్నింగ్ ఆవశ్యకతను గుర్తించి 4,59,564 మంది 8వ తరగతి విద్యార్థులకు రూ.778 కోట్ల విలువైన ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో పాటు రూ.688 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లను పంపిణీ చేసింది. విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం – కుటుంబ సంక్షేమం రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆసుపత్రులు, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్, ఇతర స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా సేవలందిస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు ఉండేలా కొత్తగా 88 ఆస్పత్రులను మంజూరు చేసింది. నాడు – నేడుతోపాటు కొత్త వైద్య కాలేజీల కోసం రూ.16,823 కోట్లు వ్యయం చేస్తోంది. వచ్చే రెండేళ్లల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 28కి పెరగనుంది. 16 హెల్త్ హబ్స్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించనుంది. వైద్య శాఖలో ఖాళీలు లేకుండా 48,639 పోస్టులను భర్తీ చేసింది. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటిన అన్ని సేవలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 95 శాతం మంది పథకం పరిధిలో ఉన్నారు. 104, 108 సేవలను పునరుద్ధరించి 1,444 వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. -
ఎట్హోం కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
ఎట్హోం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్భవన్కు వెళ్లారు. ఎట్హోం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటుగా హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు (ఫొటోలు)
-
రిపబ్లిక్ డే వేడుకలు.. హాజరైన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. వేడుకల్లో గవర్నర్ ప్రసంగిస్తూ ఏపీలో ప్రభుత్వ పథకాలు భేష్ అని ప్రశంసించారు. డీబీటీ ద్వారా నవరత్నాలు, అమ్మ ఒడి పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని గవర్నర్ అన్నారు. ‘‘జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్ కిట్ అందిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సీబీఎస్ఈ సిలబస్ అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’’ అని బిశ్వభూషణ్ అన్నారు. ‘‘వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రూ.2750 సాయం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. త్వరలో సంచార పశువైద్య క్లినిక్లు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాం. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నాం’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ‘‘కుల,మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికీ వెళ్తున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది’’ అని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, అమరావతి: ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల అస్త్రం ఓటు హక్కని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారందర్నీ ఓటర్లుగా నమోదు చే యించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా 3.03 లక్షల మంది ఓటర్ల నమోదుతో పాటు, మొత్తం 3,99,84,868 మంది ఓటర్లున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాశాల విద్య కమిషనర్ పి.భాస్కర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదా వరి జిల్లాల కలెక్టర్లు కేవీఎన్ చక్రధర్బాబు, ఎం.హరినారాయణ, ఎ.మల్లికార్జున, పి.ప్రశాంతి, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్.హరేంద్ర ప్రసాద్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు, శాసనమండలి డిప్యూటీ సెక్రటరీ కె.రాజ్కుమార్లతో పాటు ఏఆర్వోలు, బీఆర్వోలకు గవర్నర్ ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. -
గణతంత్ర ‘వెలుగులు’
సాక్షి, అమరావతి: 74వ గణతంత్ర దిన వేడుకలకు ఏపీ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. శాసన సభ భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది. ప్రజలను ఈ దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కాగా, స్టేడియంలో ఏర్పాట్లను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా బుధవారం పరిశీలించారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. -
గిరిజన గూడెల్లో ప్రభుత్వం అన్ని రకాల వైద్యసేవలు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-
నంద్యాల జిల్లాలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పర్యటన
-
ప్రజలకు ఏపీ గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ శుభవేళ తెలుగు లోగిళ్లలో ఆనంద సిరులు వెల్లివిరియాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినట్లు రాజ్భవన్ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. భోగి మంటలు, హరి దాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ధాన్యపు సిరులు సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే తెలుగు పండుగ అని అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వ దినాలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలన్నారు. -
ఆర్థికాభివృద్ధికి విద్య బలమైన సాధనం: గవర్నర్ హరిచందన్
సాక్షి, విజయవాడ: ఏ సమాజమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య అత్యంత బలమైన సాధనమని, విద్య, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామం కౌండిన్యపురంలో సోమవారం నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఎఎస్ అకాడమీని గవర్నర్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని అర్హులైన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మంచి విద్యాధికునిగా మారినప్పడు గణనీయమైన ఆదాయార్జనతో పేదరికం నుండి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలలో సుమారు 4,500 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.96 లక్షల ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో అర్హులైన బలహీన వర్గాల విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఔత్సాహిక విద్యార్థులకు మేలు చేకూర్చుతుందన్నారు. జాతీయ విద్యా విధానం-2020 విద్యారంగంలో పెద్ద సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చగలదని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ట్రస్టు వ్యవస్ధాపకులు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఇ.వి. నారాయణ, వాణిజ్య పన్నుల శాఖ మాజీ అదనపు కమిషనర్ వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
7న గవర్నర్ విశాఖ జిల్లా పర్యటన
పద్మనాభం: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 7న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పద్మనాభం మండలంలోని పాండ్రంగి పంచాయతీ బర్లపేటలో దివ్యాంగ బాలబాలికల ఉచిత విద్య శిక్షణ కేంద్రం, వృద్ధాశ్రమం, యోగా కేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని రాజీవ్గాంధీ మానవ సేవ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ గురువారం తెలిపారు. 7న ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బర్లపేటకు వచ్చి అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం విగ్రహాలకు పూలమాల వేస్తారు. అనంతరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగిస్తారు. గాయత్రి, వెల్ఫేర్ అండ్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాజరుకానున్నట్లు రవికుమార్ తెలిపారు. సభా ప్రాంగణాన్ని, శిలాఫలకం ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని డీసీపీ సునీల్ సుమిత్ గరుడ్, ఆర్డీవో భాస్కరరెడ్డి, సీఐ సన్యాసినాయుడు గురువారం పరిశీలించారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: అనాధీనం, ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో (ఆర్ఎస్ఆర్) నమోదైన వేలాది ఎకరాల భూముల సమస్యను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రకాల భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందుకోసం 2017 చుక్కల భూముల చట్టాన్ని సవరించింది. ఈ మేరకు 2022 ఏపీ చుక్కల భూముల (సవరణ) ఆర్డినెన్స్ను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జారీ చేశారు. దీంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించి దాదాపు 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతారు. అనాధీనం భూములు అనకాపల్లి, శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉండగా, ఖాళీ (కాలమ్) భూములు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, రిమార్కుల కాలమ్లలో చుక్కలు ఉన్నట్లుగానే అనాధీనం, ఖాళీ (చుక్కల బదులు ఖాళీగా వదిలేసిన) భూములు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఈ కేటగిరీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలూ లేవు. ఈ తరహా భూములు ఎక్కువగా ఉన్నట్లు పలు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ఆ భూముల రైతులు చుక్కల భూముల చట్టం ప్రకారం వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తులు పెడుతున్నట్లు తెలిపారు. కానీ, చుక్కల భూముల చట్టంలో అనాధీనం, ఖాళీ భూముల ప్రస్తావన లేకపోవడంతో ఆ దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో ఈ భూముల సమస్య పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానిపై దృష్టి సారించి చుక్కల భూముల చట్టం ద్వారా వాటికి పరిష్కారం చూపింది. అనాధీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టంలో చేర్చింది. కొత్తగా ఈ చట్టంలో చుక్కల భూములతోపాటు అనాధీనం, ఖాళీ భూములు (బ్లాంక్ ల్యాండ్స్) అని రెండు కాలమ్స్ను అదనంగా కలిపారు. ఇకపై ఈ భూములను చుక్కల భూముల మాదిరిగానే కచ్చితమైన రికార్డులు ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు భూములుగా నిర్ధారించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించవచ్చు. అలాగే 2017 చుక్కల భూముల చట్టాన్ని కేవలం రాయలసీమ ప్రాంతంలోని భూములకే పరిమితమయ్యేలా కాలమ్ 16, 17 అని పేర్కొన్నారు. ఆ కాలమ్లు రాయలసీమ జిల్లాల్లో మాత్రమే ఉండేవి. కోస్తా జిల్లాల్లోని ఆర్ఎస్ఆర్లో 11, 12 కాలమ్ వరకే ఉండటంతో ఈ చట్టం అక్కడి జిల్లాలకు వర్తించడంలేదు. తాజా సవరణ చట్టంలో ఏ కాలమ్లో చుక్కలు ఉన్నా, అనాధీనం, బ్లాంక్ ఉన్నా దానికి ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. -
అందంగా రాయడం ఒక కళ
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): చేతిరాత ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించొచ్చని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బాగా చదవడంతోపాటు అందంగా రాయడం ఒక కళ అని పేర్కొన్నారు. కాలిగ్రఫీ నిపుణులు భువనచంద్ర తరఫున జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను విజయవాడ రాజ్భవన్లో గురువారం గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు ఎంపికైన కలెక్టర్ ఢిల్లీరావు కుమారుడు జివితేష్ చేతిరాతను గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కురసాల సిరి కృష్ణ సంహిత అంజలి, విశాఖ మనుశ్రీ ప్రభుత్వ పాఠశాల, ఏలూరుకు చెందిన జేఎన్ జె.స్కూల్, జయశ్రీ హోలీ ట్రినిటీ, డమరేష్ శుభోదయ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, శ్రావ్యాంజలి చైతన్య స్కూల్, స్ఫూర్తి సిద్ధార్థ స్కూల్, హర్షిత నేతాజీ స్కూల్ విద్యార్థులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. -
దేశాభివృద్ధిలో రాజీలేని తత్వం వాజ్పేయిది
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశ రక్షణ అవసరాల పరంగానూ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్పేయి రాజీ పడలేదని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి విషయంలో ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవహరించారన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా రాజ్భవన్లో ఆదివారం సుపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి వాజ్పేయి చేసిన కృషి మరువలేనిదని ‘స్వర్ణ చతుర్భుజి’ కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం చూపారన్నారు. నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసిన హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ ఫలాలను ఇప్పుడు ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు. 60 ఏళ్లు పైబడిన పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి సంక్షేమ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. గ్రామాలను కలుç³#తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రాథమిక, మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించేందుకు సర్వశిక్షా అభియాన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వాజ్పేయి హయాంలో ప్రారంభమయ్యాయన్నారు. అణుపరీక్షల వేళ ప్రపంచంలోని పెద్ద శక్తులు వాజ్పేయిపై విరుచుకుపడగా ఐదు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత అణుశక్తి దేశంగా భారత్ను ప్రకటించారని గుర్తు చేసారు. వాజ్పేయి ధైర్యవంతమైన చర్యల ఫలితంగా ప్రవాస భారతీయులు గర్వంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉపకార్యదర్శి నారాయణస్వామి, పలువురు మాజీ సైనికాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే ప్రముఖ చర్చిల్లో ఏసుక్రీస్తు జనన దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి కేక్లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఫాదర్లు పండుగ సందేశాన్ని వివరించారు. విజయవాడలోని గుణదల మేరి మాత పుణ్యక్షేత్రంలో రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సమష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు నడిచిన మార్గంలో పయనించాలని గుంటూరు జిల్లా మేత్రాసన గురువులు చిన్నాబత్తిన భాగ్యయ్య పిలుపునిచ్చారు. భక్తి గీతాలాపనలు, క్రిస్మస్ సందేశాలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో బాల ఏసు నగరోత్సవం ఆద్యంతం పలు ప్రాంతాల్లో కన్నుల పండువగా సాగింది. ఏసు జనన నాటిక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సాక్షి, అమరావతి : శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్ భవన్ దర్బార్ హోలులో ఆదివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయం అన్నారు. మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడమే నిజమైన సంతోషమన్నారు. శాంతి, స్వేచ్ఛ, ఆనందానికి ఏకైక మార్గం ప్రేమ మాత్రమేనని.. ద్వేషాన్ని ప్రేమతో, కోపాన్ని దయతో భర్తీ చేసినప్పుడు జీవితంలో మరింత శాంతిని పొందగలుగుతారని వివరించారు. బిషప్ రాజారావు సందేశం ఇచ్చారు. అనంతరం మత పెద్దలు పాకలపాటి ప్రభాకర్, మట్టా జయకర్, ఎబినేజర్ తదితరులు గవర్నర్ను ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్.. మదర్ థెరిస్సా మెమోంటోలను బహూకరించారు. -
భవిష్యత్ భారత్దే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానున్న భారతదేశానిదే భవిష్యత్ అని, మరో ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన వర్చువల్ విధానంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి నైపుణ్యం కలిగిన విద్యార్థుల భాగస్వామ్యం అవసరమన్నారు. నైపుణ్య విద్యను అందించడంలో సెంచూరియన్ వర్సిటీ ముందుందని ప్రశంసించారు. సెంచూరియన్ చాన్సలర్ డాక్టర్ దేవీప్రసన్న పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సేవ్లానాయక్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. సెంచూరియన్ అధ్యక్షుడు డాక్టర్ ముక్తికాంత్ మిశ్రా, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డి.ఎన్.రావు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు, ఒడిశా క్యాంపస్ వైస్ చాన్సలర్ డాక్టర్ సుప్రియా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ ప్రగతికి 'ఏపీ దిక్సూచి'
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చోదక శక్తిగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళా సాధికారత సాధన, దేశ ప్రగతిలో ఏపీ ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమైందని చెప్పారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రాష్ట్రంలో ఆదివారం పర్యటించారు. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పౌర సన్మానం చేసింది. విజయవాడ శివారులోని పోరంకిలో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఘనంగా సన్మానించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా రాష్ట్రపతిని సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తిరుమల–తిరుపతి నుంచి దేశ ప్రజలను ఆశీర్వదిస్తున్న శ్రీవెంకటేశ్వరుడు కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఆధునిక ప్రగతి వైపు పయనించేందుకు దేశ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందన్నారు. వందేళ్ల క్రితమే మానవాళికి అవసరమైన ఎన్నో ఔషధాలను సృష్టించిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావును యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. అందుకోసం నూతన జాతీయ విద్యా విధానం–2020లో మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునిక ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించేలా కార్యాచరణను రూపొందించారని చెప్పారు. ఆధునిక సమాచార విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు వరుసలో ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా దేశ కీర్తి పతాకను ఎగుర వేస్తున్నారని ఆమె కొనియాడారు. శ్రీహరికోటలోని ఇస్రో.. అంతరిక్ష పరిశోధనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స జీవనాడులైన నదీనదాలను సంరక్షించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. అభివృద్ధిని, మన వారసత్వంతో జోడించే అద్భుతమైన ఘట్టం నాగార్జునసాగర్ నిర్మాణమని ఆమె ప్రశంసించారు. కూచిపూడి నాట్యంతో మన సంస్కృతి, సంప్రదాయాలు, భారతీయ కళాత్మక శక్తిని ఆంధ్రప్రదేశ్.. ప్రపంచానికి చాటడం ద్వారా ఆలంబనగా నిలుస్తోందన్నారు. మాట్లాడుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులు తదితరులు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’గా ప్రఖ్యాతిగాంచిన తీయనైన భాషలో కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు అద్భుతమైన అభివ్యక్తీకరణ ద్వారా భారతీయ భాషల విశిష్టతను చాటి చెప్పారన్నారు. మహిళలను గౌరవించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పారు. ఐదున్నర శతాబ్దాల క్రితమే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన కవయిత్రి మొల్ల రాసిన మొల్ల రామాయణం భారతీయ సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. గురజాడ అప్పారావు 125 ఏళ్ల క్రితమే రాసిన కన్యాశుల్కం నాటకం ఓ సామాజిక సంస్కరణగా ఆమె అభివర్ణించారు. వందేళ్ల క్రితమే దుర్గాభాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభను ఏర్పాటు చేసి మహిళా సాధికారత, సమాజహితం కోసం కృషి చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కోడలైన సరోజినీనాయుడు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడంతోపాటు దేశంలో తొలి మహిళా గవర్నర్గా నియమితులయ్యారన్నారు. తాను జార్ఖండ్ గవర్నర్గా నియమితులైనప్పుడు సరోజినీ నాయుడు అనుసరించిన ఆదర్శాలను పాటించాలని, ధైర్యంగా ప్రజా సేవలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇతరులతో పోలిస్తే ఆంధ్ర మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారని, భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆనాడే చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి పథంలో ఏపీ పురోగమించాలి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డిలు పాటించిన విలువలు తన కర్తవ్య పాలనలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగస్వామ్యం చిరస్మరణీయమని కొనియాడారు. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు, 25 ఏళ్ల వయసులోనే భరత మాత కోసం ప్రాణాలు అర్పించిన బిర్సాముండా వంటి వారి త్యాగాలను యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం హర్షణీయమన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల సమయంలో జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకు నివాళి అర్పించడం మన కర్తవ్యమన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏపీ ఇలాగే అభివృద్ధి పథంలో పురోగమించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ప్రగతిపథంలో ఆంధ్రప్రదేశ్ : గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించి, దేశంలో వ్యాపార అనుకూల వాతావరణానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. రాష్ట్రపతికి పౌర సన్మాన సభలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తూ సమృద్ధికర సహజ వనరులు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, దార్శనికమైన నాయకత్వం రాష్ట్రాన్ని పురోగామిపథంలో నిలుపుతున్నాయన్నారు. సాంస్కృతిక, కళా రంగాల్లో విశిష్టత చాటుతూ ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను నిలుపుకుంటోందని చెప్పారు. దేశంలో కీలకమైన అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని, మరింత వృద్ధి రేటును సాధించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్రపతి ప్రతిబింబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిబింబమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆమె నిష్కళంకమైన రాజకీయ జీవితం, కష్టాలకు ఎదురొడ్డి మరీ అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు ప్రతి మహిళకు ఆదర్శనీయమన్నారు. రాష్ట్రపతి స్ఫూర్తితో ప్రతి మహిళా స్వయం సాధికారత సాధించాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని కాంక్షిస్తూ తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రపతికి పౌర సన్మాన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ద్రౌపది ముర్ము జీవితం నుంచి రాష్ట్ర మహిళలు మరింత చైతన్యం పొందాలన్నారు. అందుకు తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాయని నమ్ముతున్నానన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ప్రతి మహిళకూ ఆదర్శం ► ఇవాళ చాలా గొప్ప రోజు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టడం దేశంలో ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్య వాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే ఒక గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము ఉదాత్తమైన జీవితం దేశంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. ► రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అనేందుకు ద్రౌపది ముర్ము గొప్ప ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతారు. ఆమె జీవితంలో పడ్డ కష్టాలను చిరునవ్వుతో స్వీకరించి, సంకల్పంతో ముందుకు సాగిన తీరు ప్రతి మహిళకు ఆదర్శంగా నిలుస్తుంది. ► ఒడిశాలో అత్యంత వెనుకబడిన మయూర్భంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించి భువనేశ్వర్ వెళ్లి బీఏ పూర్తి చేశారు. ► ద్రౌపది ముర్ము గ్రామంలో డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ కావడం అప్పట్లో ఓ విశేషం. తర్వాత ఇరిగేషన్, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం కౌన్సిలర్గా, 2000లో తొలిసారి రాయరంగపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకు అదే పదవిలో కొనసాగారు. ► ఒడిశా ప్రభుత్వంలో వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా, స్వతంత్ర హోదాలో మత్స్య శాఖ మంత్రిగా చేశారు. ప్రజా సేవలో చిత్తశుద్ధి, కార్యదీక్ష, నిజాయితీతో ముందుకు వెళ్లి 2015లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత దేశ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం.. తొలిసారిగా మన రాష్ట్రానికి రావడం సంతోషం కలిగించే విషయం. ► రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము వన్నె తీసుకు వస్తారనడంతో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్య పటిష్టతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశ ఖ్యాతిని మరింత పెంచడానికి ఆమె తప్పక దోహదపడతారు. -
ప్రజాయుధం రాజ్యాంగం
అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం మన రాజ్యాంగమే. నిరుపేదలు, అణగారిన వర్గాలు, నిస్సహాయులకు ఇది రక్షణగా ఉంది. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన, ఆకాశమంతటి మహా మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్కు అంజలి ఘటిస్తూ 2023 ఏప్రిల్లో విజయవాడలో మహా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాం. అంబేద్కర్ భావజాలాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని మనసా, వాచా, కర్మణా గౌరవించే ప్రభుత్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో ముందడుగు వేశాం. రాజధాని కోసం సేకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చు. ఇలాంటి వాదాలు, వాదనలతో కూడా మనం యుద్ధం చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విభిన్న వర్గాలకు చెందిన భారతీయులను ఒక్కటిగా ఉంచే గొప్ప గ్రంథం భారత రాజ్యాంగమని, నిస్సహాయులకు దైవమిచ్చిన ప్రజాయుధం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నూరు శాతం పాటించి అమలు చేస్తున్నది మన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో కలిసి పాల్గొన్న సీఎం జగన్.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 3 వేల కులాలు, ఉప కులాలతో కలిపి 25 వేల కులాలు, ఏడు ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపి 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి వేర్వేరు చరిత్రలు, భిన్న భౌగోళిక స్వభావాలున్నాయని చెప్పారు. మన రాజ్యాంగం.. ప్రభుత్వాలకు, దేశంలోని 140 కోట్లకు పైగా ఉన్న ప్రజలకు క్రమశిక్షణ నేర్పే రూల్బుక్గా కొనసాగుతోందన్నారు. మనకు దిశానిర్దేశం చేసే గైడ్, ఫిలాసఫర్, టీచర్గా దారి చూపుతోందని వివరించారు. దాదాపు 80 దేశాల రాజ్యాంగాల అధ్యయనం తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వాల మాగ్నాకార్టా మన రాజ్యాంగమని తెలిపారు. ప్రపంచ మానవ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో, సమానత్వ చరిత్రలో, సామ్యవాద చరిత్రలో, సంఘ సంస్కరణల చరిత్రలో అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంథం అని అభివర్ణించారు. దీనిని 1949 నవంబర్ 26న మన కోసం మనం సమర్పించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 72 ఏళ్లుగా మన సంఘ సంస్కర్త ► పుస్తకం ముట్టుకోవడానికి వీలులేని సమాజంలో జన్మించి, ఎన్నో డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకుని.. ఈ దేశం మారడానికి, నిలబడడానికి, ప్రపంచంతో సైతం పోటీ పడేందుకు, ప్రగతిపథంలో పరుగెత్తడానికి కావాల్సిన ఆలోచనలతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంత గొప్పదైన రాజ్యాంగాన్ని రచించారు. ► 72 ఏళ్లుగా మన సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది.. రాస్తూనే ఉంది. ఈ పుస్తకం మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, మహిళా చరిత్ర గతిని మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. మన భావాలను, భావజాలాల్ని మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. 72 ఏళ్లుగా మన రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త. మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా, ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టింది. ఇక మీదట కూడా నిలబెడుతూనే ఉంటుంది. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన ► రాజ్యాంగంలో చెప్పిన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసి, దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్న ప్రభుత్వం బహుశా మనదే. ప్రభుత్వ బడుల్లో పేదలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాం. ► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల పట్ల పాటిస్తున్న నయా అంటరానితనం మీద సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంతో మొదలు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, డిజిటల్ క్లాస్రూముల వరకు విద్యా రంగంలో సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం మనది. ► నామినేటెడ్ పదవులు, పనులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే. మహిళా సాధికారతకు నిజమైన అర్థం ► జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ తదితర అనేక విధాలుగా ముందడుగులు వేసిన మహిళా ప్రభుత్వం కూడా మనదే. ► వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ కానుక, ఆసరా, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా కానుక, గోరుముద్ద, బడులలోనూ, ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు.. పథకాలు అమలుచేస్తున్నాం. తద్వారా పేదలు పేదరికం నుంచి బయట పడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేస్తున్నాం. కార్పొరేషన్ల చైర్మన్లుగానూ వారే అధికం ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 58% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. బీసీలకు 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్నూ నియమించాం. ఈ 35 నెలల్లో సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసుపెట్టి తీసుకువచ్చిన మార్పులివి. రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం మనది. ► మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, తానేటి వనిత, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ కె.సురేష్రెడ్డి, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ బి.శ్యాంసుందర్, జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, జస్టిస్ డి.వెంకటరమణ, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామ్మూర్తి, కమిషన్ సభ్యులు దండే సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం: గవర్నర్ సమాజంలో సామరస్యతను నెలకొల్పేందుకు రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రజలు ఎప్పటికీ మరువలేరని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వేదకాలం నుంచి ప్రజాస్వామ్య భావన ప్రబలంగా ఉందని చాటిచెప్పేందుకు ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని ‘భారత్: ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేద కాలం నుంచి భారతీయులు సమానత్వ స్ఫూర్తితో ఉంటున్నారని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు. ధర్మం, నైతికత, వేదాల నుంచి ఉద్భవించిన మన దేశం భారతీయ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించిందని చెప్పారు. పౌరుల హక్కులను పరిరక్షించడం ద్వారా రాజ్యాంగం వారికి అధికారం ఇస్తోందని, పౌరులు తమ విధులకు కట్టుబడి రాజ్యాంగానికి సాధికారత కల్పించారన్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజుల్లోనూ రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడిందని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచ వేదికపై భారతదేశం శక్తివంతమైన క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇది యుద్ధాల యుగం కాదని కౌన్సెలింగ్ ద్వారా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ప్రధాని చొరవ చూపించారన్నారు. మన పాలనలో రూ.3,18,037 కోట్ల పంపిణీ ► మన 35 నెలల పాలనలో డీబీటీ ద్వారా అంటే నేరుగా బటన్ నొక్కి, ప్రజల బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్లే గొప్ప వ్యవస్థను తీసుకువచ్చాం. లంచాలకు, వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటి వరకు రూ.1,76,517 కోట్లు. గత 35 నెలల్లో డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా రూ.3,18,037 కోట్లు అందించాం. ► ఇందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు అందినది 79 శాతం. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యం. నా మంత్రివర్గ సహచరులనే తీసుకుంటే మొత్తం మంత్రిమండలిలో దాదాపు 70 శాతం ఈ సామాజిక వర్గాలవారే. రెండు మంత్రివర్గాలలోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నలుగురు.. అంటే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించాం. ► శాసనసభ స్పీకర్గా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, శాసనమండలి చైర్మన్గా ఒక ఎస్సీని నియమించాం. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చోబెట్టాం. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. ► ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు బీసీలే. శాసన మండలికి అధికార పార్టీ నుంచి 32 మందిని పంపిస్తే అందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం మనది. మున్సిపల్ కార్పొరేషన్లలో 86 శాతం, మున్సిపాల్టీలలో 69 శాతం, మండల ప్రజా పరిషత్ చైర్మన్లలో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకే కేటాయించాం. -
అంబేద్కర్ స్పూర్తిని అందరం కొనసాగించాలి: బిశ్వభూషణ్ హరిచందన్
-
విజయవాడలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
-
ఆయనే మన జేమ్స్బాండ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూతతో సినీ జగత్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. ‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022 ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం ప్రకటించిన వాళ్లలో ఉన్నారు. ఇదీ చదవండి: నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి -
వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా నిలిచారు: గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్
-
రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ విశేషమైన కృషి చేశారు: గవర్నర్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ తన మార్క్ పాలనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. అలాంటి మహానేత పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుసగా రెండో ఏడాది 'వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య-2022' పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగింది. బహుళ ప్రతిభలు కలగలిసిన రాష్ట్రం మనది. కళలు, చేతివృత్తులు, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. వెయ్యేళ్లు పైబడ్డ తెలుగు భాష చరిత్ర కలిగి ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, గొప్ప వ్యక్తులు కలిగిన నేల ఆంధ్రప్రదేశ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారు. 4 సార్లు ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. దేశ చరిత్రలోనే వైఎస్సార్ అరుదైన నాయకుడిగా నిలిచారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న గొప్ప నాయకుడు వైఎస్సార్. సీఎం అవ్వగానే సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మేలు చేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. గ్రామీణ పేదరికం నిర్మూలనకు కృషి చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా కృషి చేశారని' గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. చదవండి: (అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు: సీఎం జగన్) -
ఏపీ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్
-
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ: చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ చేసిన చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు అసెంబ్లీ చేసిన చట్ట సవరణను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సవరించిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయగా, ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం
నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. తిండిలేని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... పిన్న వయస్సులోనే ప్రతిభ చూపే వారు కొందరైతే... తమ ప్రతిభ ను సమాజ హితం కోసం, దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు ఇంకొందరు. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు మరికొందరు! ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... గౌరవించి సత్కరిస్తోంది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి సాక్షి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో అక్టోబర్ 21, శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు. మరుప్రోలు జస్వంత్ రెడ్డి : (తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి శ్రీనివాసులురెడ్డి) – స్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) బాపట్లలోని దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ 18 ఏళ్ల వయసులోనే మద్రాస్ రెజిమెంట్లో శిక్షణ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జమ్ముకాశ్మీర్కు వెళ్లాడు. 2021 జులై 8న జమ్మూకాశ్మీర్లోని సుందర్ బని సెక్టార్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టులతో తలపడ్డ జశ్వంత్, ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచాడు. అమ్మా! కంగారు వద్దు... అవే చివరి మాటలు!! మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసినా ‘అమ్మా! నేను బాగున్నాను. మీరు జాగ్రత్త’ అని చెప్పేవాడు. గతేడాది సరిహద్దులో ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో... జూలై 6న ఫోన్ చేసినప్పుడు కూడా ‘ఇక్కడ (జమ్ము) బాగుంది. నా నుంచి ఫోన్ లేకపోయినా మీరేం కంగారు పడకండి. మీరు జాగ్రత్త’ అన్నాడు. అవే చివరి మాటలు. ఎనిమిదవ తేదీ ప్రాణాలు వదిలాడు. డాక్టర్ డి. పరినాయుడు : జట్టు సంస్థ – ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది జట్టు సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు పదివేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడంతోపాటు స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు నాచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ. సేద్యానికి సేవ చేశాను: పదహారేళ్లుగా వ్యవసాయ పద్ధతుల్లో ఆచరణీయమైన ప్రయోగాలు చేశాను. అవార్డులు అందుకున్నాను. నాచురల్ ఫార్మింగ్కి ప్రచారం బాగానే ఉంది. కానీ రైతులు రావాల్సినంత స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇలాంటి గుర్తింపులు, అవార్డులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. సహదేవయ్య–విక్టోరియా : ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ – నవజీవన్ సంస్థ, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం 1996లో ఏర్పడిన ఈ సంస్థ అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తోంది. సాధికారత, స్వయంసమృద్ధి, సహజ వనరుల సంరక్షణ, సమాన అవకాశాలు, రక్షిత మంచినీరు, బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది. ప్రచారం లేకుండా పని చేశాం: ప్రచారం చేసుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి మా సేవలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదం చేస్తాయి. బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి: ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బొల్లంపల్లి ఇంద్రసేన్రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్షాప్లు నిర్వహించారు. యునైటెడ్ నేష¯Œ ్స ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీ¯Œ రెవల్యూష¯Œ నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం. అనిల్ చలమలశెట్టి, భార్య స్వాతి : గ్రీన్ కో గ్రూప్ – ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్రీన్కోగ్రూప్. ఈ కంపెనీ అధినేతలు అనిల్ చలమలశెట్టి, ఆయన భార్య స్వాతి. 2030 నాటికి ఒక గిగా వాట్ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, 2040 నాటికి పర్యావరణ సమతుల్యతను నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఈ సంస్థ కర్నూలులో 15 వేల కోట్ల వ్యయంతో 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ని ఉత్పత్తి చేయడం వీరి ప్రాజెక్టు ప్రత్యేకత. పర్యావరణం కోసం పనిచేస్తాం: ఈ పురస్కారం మా టీమ్లో అందరికీ కలిపి సంయుక్తంగా ఇచ్చిన గౌరవం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కార్య క్రమాలను ఇంకా ఇంకా కొనసాగిస్తాం. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలోని జనగామ గ్రామం. తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి. భవన నిర్మాణ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సుభాష్రెడ్డి ఆరు కోట్ల రూపాయలతో బీబీపేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారు. సీతారాంపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాణ్యతకు నా పనే గీటురాయి: దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాటి నాయకులలా మనం జీవితాలను త్యాగాలు చేయలేకపోయినా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలనేది నా అభిమతం. రోడ్డు, స్కూలు బిల్డింగ్... ఏ పని చేసినా సరే... నాణ్యతకు నేనే గీటురాయి అన్నట్లుగా చేశాను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఈ సర్వీస్ని ఇలాగే కొనసాగిస్తాను. అక్షత్ సరాఫ్ : (రాధా టీఎమ్టీ) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ 1960లో శ్రీ రాధేశ్యామ్ జీ షరాఫ్ టి.ఎమ్.టి. సంస్థను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు రాధా టి.ఎమ్.టి. కంపెనీ డైరెక్టర్ అక్షత్ షరాఫ్.హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఈ సంస్థ శంకరంపేట్, చిన్న శంకరంపేట్ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొక్కలు నాటించడం, స్టీల్ ప్లాంట్లలో కాలుష్య నివారణకు కృషి చేస్తోంది. ఇదే బాధ్యతను కొనసాగిస్తాం: మా వంతు సామాజిక బాధ్యతగా విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్నాం. ఈ అవార్డు స్ఫూర్తితో... మా సేవలను నాణ్యత తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను. పి.జ్ఞానేశ్వర్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తాను పుట్టిపెరిగిన గ్రామంలో పచ్చదనం తగ్గిపోవడం, మంజీరా నదీతీరం కళ తప్పడం చూసి పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తున్నారు. పిల్లలను గ్రీన్ బ్రిగేడ్గా తయారుచేసి వారి చేత మొక్కలు నాటిస్తున్నారు. ఎర్త్ లీడర్లను తయారు చేస్తాను: మంజీర నది ఎండిపోయి నీరు లేక పక్షులు చనిపోయాయి. చెట్లు ఎండిపోయాయి. నా వంతుగా పరిరక్షణ బాధ్యత చేపట్టాలనుకుని, పర్యావరణవేత్తల సహకారంతో పనిచేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మంది ఎర్త్ లీడర్లను తయారు చేయాలనేది నా లక్ష్యం. నిఖత్ జరీన్ : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ బాక్సింగ్ రింగులో పవర్ ఫుల్ పంచ్లతో విజృంభిస్తూ ఒక్కో పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన నిఖత్ జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులో తండ్రి వద్ద బాక్సింగ్లో ఓనమాలు నేర్చుకున్న నిఖత్, ఇస్తాంబుల్లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణపతకాన్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. తల్లిగా గర్వపడుతున్నాను: మా అమ్మాయికి అవార్డు రావడం తల్లిగా నాకు ఎంత సంతోషంగా ఉంది. తను హైదరాబాద్లో లేదు. ఆమె తరఫున నేను అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) బ్యాడ్మింటన్లో అద్భుతాలు సృష్టిస్తు్తన్న ఈ అమలాపురం కుర్రాడు అంతర్జాతీయ పోటీల్లో రాకెట్లా దూసుకుపోతూ పతకాల పంట పండిస్తున్నాడు. చిరాగ్ శెట్టితో కలిసి భారత పురుషుల డబుల్స్ టీమ్లో సత్తా చాటుతున్నాడు. 2022లో జరిగిన థామస్ కప్లో స్వర్ణ పతకాన్ని, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకంతోపాటు ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యపతకాన్నీ గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు. సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథం, తల్లి రంగమణి సాక్షి ప్రోత్సాహాన్ని మరువలేం: మా అబ్బాయికి అర్జున అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడూ అంతే సంతోషిస్తున్నాను.. మా సాత్విక్ క్రీడాప్రస్థానంలో తొలి నుంచి సాక్షి పత్రిక అండగా వెన్నంటే ఉందని చెప్పాలి. మా బాబు ఫైల్ తిరగేస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. షేక్ సాదియా అల్మాస్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ పవర్ లిఫ్టింగ్లో సత్తా చాటుతోంది. పవర్ లిఫ్టింగ్లో నేషనల్ చాంపియన్ అయిన తండ్రిని చూసి ప్రేరణ పొందిన సాదియా పదవ తరగతి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఒక్కో పతకం గెలుచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. మన దేశంలో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మన నేల మీద నాకు వచ్చిన గుర్తింపు, అందుతున్న గౌరవం ఇది. ఎంతో మంది క్రీడాకారులున్నారు. అంతమంది నుంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.∙ డాక్టర్ రామారెడ్డి కర్రి : ఎక్సలెన్స్ ఇన్ హెల్త్కేర్ రాజమండ్రిలో మానస ఆస్పత్రిని స్థాపించి మానసిక వైద్యుడిగా దాదాపు 40 ఏళ్లుగా వైద్యం చేస్తూనే మరోవైపు పలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళాసంస్థల్లో వివిధ పదవులు నిర్వహించారు రామారెడ్డి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అవార్డులు శక్తినిస్తాయి: మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరైన అవగాహన లేని రోజుల్లో నా సర్వీస్ మొదలుపెట్టాను. నలభై రెండేళ్లలో దాదాపుగా ఒకటిన్నర లక్షల మంది తెలుగు వాళ్లకు స్వస్థత చేకూర్చగలిగాను. తెలుగు మీడియా సంస్థ నుంచి గుర్తింపు లభించడం సంతోషం. అవార్డులు మనసు మీద మనిషి మీద చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా బాగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి. సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లి: యంగ్ అచీవర్ ఆఫ్ ఇది ఇయర్ (ఎడ్యుకేషన్) తెనాలికి చెందిన ప్రియ మానస, రాజ్కుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్థ్ శ్రీవాత్సవ్, పసి వయసులోనే కంప్యూటర్స్లో ఆరితేరడంతో మాంటెగ్న్ కంపెనీ ఏడో తరగతిలోనే నెలకు 25 వేల జీతంతో ఐటీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్టుగా పార్ట్టైమ్ జాబ్ చేస్తూనే అమెరికన్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో భూకంపాల రాకను ముందుగానే పసిగట్టే ప్రాజెక్టులో సీనియర్ ప్రొఫెసర్లతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు. ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకుంటాం: డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఈ తరానికి చాలా అవసరం. మనం ఎంత నేర్చుకుంటామనేది... నేర్చుకోవడానికి మనం పెట్టిన శ్రద్ధాసక్తులను, ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఆసక్తి కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి : తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ఒకవైపు పేషంట్లకు చికిత్సలు, మరోవైపు పరిశోధనలతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణకు ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు ఎ.ఐ.జీలో అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇస్తున్నారు. వైద్యుల త్యాగాలకు అంకితం: ఈ గౌరవం నాకు మాత్రమే దక్కుతున్న గుర్తింపు కాదు. మా డాక్టర్లందరికీ అందిన పురస్కారం. కోవిడ్ సమయంలో లక్షలాది పేషెంట్లకు వైద్య సేవలందించడంలోనూ, వ్యాక్సిన్ తయారీకి సహకారంలోనూ డాక్టర్ల భాగస్వామ్యం మరువలేనిది. ఈ అవార్డు... కోవిడ్ విధుల్లో భాగంగా అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలిన డాక్టర్లకు, వారి త్యాగాలకు అంకితం. రవి పులి: తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్కి వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇండియాలోని వారికి సేవలందిస్తున్నారు. వీటి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా.. ఎంట్రప్రెన్యూర్గా మారడానికి గైడె¯Œ ్స, మెంటార్షిప్ ఇవ్వడంతోపాటు కావాల్సిన పెట్టుబడి అందేలా సహకరిస్తున్నారు. కరోనా కాలంలో రవి చేసిన సాయం ఎంతోమంది తెలుగు వారిని సొంతగూటికి చేర్చింది. అంత కష్టం వద్దు: పాతికేళ్ల కిందట నేను యూఎస్కి వెళ్లినప్పుడు వీసా వంటి ఇతర వివరాల కోసం గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేక చాలా కష్టపడ్డాను. అందుకే విదేశాలకు వచ్చే విద్యార్థులకు ఇరవై ఏళ్లుగా సలహాలిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నాను. దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. సాక్షికి కృతజ్ఞతలు. కారింగుల ప్రణయ్: యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) అదిలాబాద్ జిల్లాకు చెందిన కారింగుల ప్రణయ్ సామాజిక స్పృహ కలిగిన తనలాంటి యువకులతో కలిసి స్వాస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం.. వారి చదువులకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. మా గ్రామాలకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం: పోషకాహారలోపంతో బతుకీడ్చే ఆదివాసీ మహిళలు, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనిపించి స్వాస్ను స్థాపించాం. మొదలు పెట్టేనాటికి మా బృందంలో ఉన్నది పదిమందికి లోపే. ఇప్పుడు 700 మంది సేవలందిస్తున్నారు. ఇది మా అందరి సేవలకు అందిన పురస్కారం. సుంకరి చిన్నప్పల నాయుడు, సుజాత : బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) షీమాక్స్ ఎక్స్పర్ టెక్నోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎండీ సుంకరి చిన్నప్పల నాయుడు. పట్టణ యువతతో సమానంగా గ్రామీణ యువతకూ ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 300 మంది గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు. ఈ జ్ఞాపిక ఉత్తేజాన్నిస్తుంది: చిన్న చిన్న సంస్థలకు ఆదర్శంగా మమ్మల్ని చూపించాలనుకోవడమే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు నాలో ఉత్సాహాన్ని పెంచింది. భవిష్యత్తులో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనా సరే ఈ జ్ఞాపికను చూడగానే ఉత్తేజం వస్తుంది. కె. లీలా లక్షా్మరెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ గ్రీన్ రివల్యూషన్) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థ కె.లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన 2010లో ఏర్పాటైంది. నాటినుంచి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో కలిపి 12,485 గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. ఇప్పటివరకు 3,500 పాఠశాలలు, సుమారు 9 లక్షల మంది విద్యార్థులు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సేవకు పట్టం కడుతోంది: సమాజంలో సేవ చేసే వాళ్లను గుర్తించి, గౌరవించడం చాలా కష్టమైన విషయం. క్లిష్టమైనది కూడా. అలాంటిది ‘సేవకు పట్టం’ కట్టడాన్ని బాధ్యతగా తలకెత్తుకుంది. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా çకొనసాగిస్తున్న సాక్షికి అభినందనలు. చిన్నాలమ్మ: స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ఫార్మింగ్ కొండ మీదినుంచి పారుతున్న నీటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించిన 75 ఏళ్ల ఈ బామ్మ పేరు చిన్నాలమ్మ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిమిడిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాదాపు 500 కుటుంబాల కోసం తన పెన్షన్ డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువపెట్టి తెచ్చిన సొమ్ముకు గ్రామస్థుల భాగస్వామ్యంతో కాలువకు ఇరువైపులా కాంక్రీట్తో గట్లు నిర్మించుకునేలా చేసింది చిన్నాలమ్మ. ఈ చెక్డ్యామ్ వల్ల ఆ పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. నీటిని నిలుపుకున్నాం: ఊరందరికీ వ్యవసాయమే ఆధారం. పంట పండేనాటికి తుపానులొచ్చి వరదలో పంట కొట్టుకుపోతూ ఉంటే ఎన్నాళ్లని చూస్తూ ఉంటాం; నీళ్లు నిలుపుకునే వీల్లేకపోవడంతో పొలాలు బీడు పెట్టాల్సి వచ్చేది. దాంతో మా సొంత డబ్బుతో చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. మరో ఐదారు ఊళ్ల వాళ్ల పంటలూ నిలిచేటట్లు డ్యామ్లు కట్టాం. అందుకు గుర్తుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. కూరెళ్ళ విఠలాచార్య : జ్యూరీ ప్రత్యేక గుర్తింపు ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం. పుస్తకాలు కొనలేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఉద్యోగ విరమణ తరువాత 2014లో వెల్లంకి గ్రామంలో ప్రారంభించిన ఈ లైబ్రరీలో రెండు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య చేసిన కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఆశ్చర్యం కలిగించింది: నేను స్థాపించిన ఈ గ్రంథాలయానికి రీసెర్చ్ స్కాలర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వస్తుంటారు. ఎక్కడో మారుమూల పల్లెలో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో ఏమో గానీ ప్రధాని నా గురించి మాట్లాడటం, సాక్షి పత్రిక వాళ్లు అవార్డుతో సత్కరించడానికి ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎనభై ఐదేళ్ల వయసులో ఇంతకంటే పెద్ద సంతోషాలు ఇంకేం కావాలి? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రెడ్క్రాస్ సేవలు అమూల్యం.. కోవిడ్ సమయంలో అద్భుత సేవలు
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): సమాజ శ్రేయస్సు కోసం రెడ్క్రాస్ సభ్యులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకూడదని, ఇందుకోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన సూచించారు. రెడ్క్రాస్ సొసైటీ ఏపీ శాఖ వార్షిక అవార్డుల (2019–20, 2021–22 సంవత్సరాలకు) ప్రదానోత్సవం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు మానవతా దృక్పథంతో సేవలు అందించడంలో రెడ్క్రాస్ ముందంజలో ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెడ్క్రాస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రక్తం, ఆక్సిజన్, మాస్కులు, మందులు వంటివి అందించడం ద్వారా వేల మంది రోగుల ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. రోగులకు, తలసేమియా బాధిత పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంగా రెడ్క్రాస్ పని చేయడం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల కలెక్టర్లు, మేనేజింగ్ కమిటీలు సేవలు అందించడం ద్వారా రెడ్క్రాస్ మరింత బలోపేతమైందని తెలిపారు. జిల్లా శాఖలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువకావడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిరుపేదలకు సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రెడ్క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ శ్రీధర్రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్పీ సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరంఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, పి.రంజిత్బాషా, శ్రీకేష్.బి.లతకర్, ఎ.సూర్యకుమారి, గుంటూరు జేసీ ఎ.దినేష్కుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ డాక్టర్ పి.మహేష్కుమార్తోపాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా, సింగపూర్ రెడ్క్రాస్ సొసైటీ, జిల్లాస్థాయిలో విస్తృతంగా సేవలు అందించిన 94 మంది నిస్వార్థ సేవకులకు అవార్డులను, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘నాటా’కు ప్రశంశలు కోవిడ్–19 సమయంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 150 ఆక్సిజన్ సిలిండర్లను రెడ్క్రాస్ ద్వారా సహాయం చేసినందుకు అప్పటి నాటా అధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి గండ్ర నారాయణరెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా నాటా పీఆర్ అండ్ మీడియా కో–ఆర్డినేటర్ డీవీ కోటిరెడ్డి, ఎం.పార్థసారథిరెడ్డి, కె.సాంబశివారెడ్డికి గవర్నర్ మెడల్, అవార్డులను ప్రదానం చేశారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్కు రెడ్క్రాస్ గోల్డ్మెడల్ సాక్షి, హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను రెడ్క్రాస్ గోల్డ్మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్గ్రిడ్కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్గ్రిడ్ ఈ రెడ్క్రాస్ గోల్డ్ మెడల్ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్గ్రిడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. (క్లిక్ చేయండి: ఐటీ హబ్గా విశాఖలో అపారమైన అవకాశాలు) -
స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది
సాక్షి, హైదరాబాద్: విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ వీసీ ఎస్వీ కోటారెడ్డి పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్పర్సన్గా రెయిన్బో ఆస్పత్రి డైరెక్టర్ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కె అగర్వాల్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ సభ్యులుగా వ్యవహరించారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు. చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు రాజ్భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సీఎం జగన్ సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై పురోగతిని గవర్నర్ హరిచందన్కు వివరించారు. దాదాపు అరగంటకు పైగా వీరిరువురు సమావేశం అయ్యారు. రాజ్ భవన్లో ముఖ్యమంత్రిని స్వాగతించిన వారిలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఉప కమీషనర్ విశాల్ గున్ని, విజయవాడ నగర పాలక సంస్ధ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి తదితరులు ఉన్నారు. -
గాంధీ అహింస విధానం విశ్వజనీనమైంది : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున కనకదుర్గమ్మ.. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. తొలి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నిర్వహించిన నగరోత్సవం భక్తులకు కనువిందుచేసింది. అమ్మవారి సేవలో గవర్నర్ దంపతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కల్టెకర్ ఢిల్లీరావు, సీపీ టీకే రాణా, ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. దుర్గమ్మను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీజే తెలిపారు. నేడు బాలాత్రిపురసుందరిగా.. బెజవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ(మంగళవారం) నాడు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారమే శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
-
బ్రహ్మోత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం
-
సాగులో మార్పులు తేవాలి
సాక్షి, బాపట్ల: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, రైతుల సమస్యల పరిష్కారానికి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవం గురువారం నిర్వహించారు. వర్చువల్గా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక యూనివర్సిటీ శ్రీకారం చుట్టిందని, డ్రోన్ల వినియోగ పరిశోధనలో దేశంలోనే యూని వర్సిటీ ముందుండటం గర్వకారణమన్నారు. తలసరి ఆదాయంలో ఏపీ అగ్రగామి : ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో 38.6 శాతం అధికంగా నమోదైందని, ఇది రాష్ట్ర అరి్థక ప్రగతికి సూచికని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,07,771 కాగా, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 మాత్రమే అని తెలిపారు. 2011 నుంచి 2021 వరకు జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల 5.48 శాతం కాగా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.08 శాతం ఉందన్నారు. కేవలం వ్యవసాయ అనుబంధ రంగాలు 8 శాతం వృద్ధి నమోదు చేశాయని, ఇది భారతదేశ వృద్ధికి రెండు రెట్లు అధికంగా ఉందని వివరించారు. దేశ వృద్ధి రేటు 3.28 మాత్రమేనని వివరించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై నివేదిక సమర్పించారు. గిరిజన వ్యవసాయ విధానాలపై అత్యుత్తమ పరిశోధనలు చేసిన విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన ఫకృద్దీన్ అలీ అహ్మద్కు యూనివర్సిటీ పురస్కారం ప్రదానం చేసినట్లు తెలిపారు. 722 మందికి డిగ్రీ, 102 మందికి పీజీ, 40 మందికి పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. -
ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. చదవండి: ‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు -
సీఎం జగన్ దంపతులకు గవర్నర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం వారికి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దంపతులపై జగన్నాథస్వామి, తిరుమల బాలాజీ ఆశీస్సులు కురిపించాలని ఆకాంక్షించారు. సీఎం దంపతులకు కలకాలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించి.. సుసంపన్నమైన జీవితాన్ని అందించాలని గవర్నర్ అభిలషించారు. -
ఏపీ గవర్నర్తో హరియాణ గవర్నర్ భేటీ
సాక్షి, అమరావతి/మంగళగిరి/గుంటూరు మెడికల్ : రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్భవన్కు చేరుకున్న బండారు దత్తాత్రేయకు రాజ్భవన్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు గవర్నర్లు సమకాలీన రాజకీయ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను విశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. 51 అడుగుల శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన దత్తాత్రేయ గుంటూరు జిల్లా మంగళగిరిలోని గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం (శివాలయం)వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపీకృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఆయన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు రంగరాజు కుటుంబానికి పరామర్శ గుంటూరు రైలుపేటలోని బీజేపీ నేత జూపూడి రంగరాజు నివాసానికి బండారు దత్తాత్రేయ ఆదివారం వచ్చారు. రంగరాజు తల్లి హైమావతిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దత్తాత్రేయను జూపూడి కుటుంబ సభ్యులు యజ్ఞదత్తు, వనమా పూర్ణచంద్రరావు, మాజేటి ముత్యాలు, పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని సూచించారు. -
రాజ్భవన్లో ఎట్హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్
-
రాజ్భవన్లో ఎట్హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏర్పాటు చేసిన తేనీటి విందు (ఎట్హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాజ్భవన్ చేరుకున్న సీఎం జగన్ దంపతులకు గవర్నర్ దంపతులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. -
స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు గాంధీజీ ప్రేరణ
సాక్షి, అమరావతి/విజయవాడ సెంట్రల్: దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు మహాత్మా గాంధీ ప్రేరణగా నిలిచారని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సర్వోదయ ట్రస్ట్ నేతృత్వంలో విజయవాడలోని స్వాతంత్య్ర సమర యోధుల భవన్లో గాంధీజీ 30 అడుగుల కుడ్య చిత్రాన్ని ఆదివారం గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో ఆగస్టు 15 వరకు తమ నివాసాలపై ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఇది దేశాన్ని ఐక్యత దిశగా నడిపే ‘ఏక్ భారత్–శ్రేష్ట భారత్’దిశగా పయనింపచేస్తుందన్నారు. జాతీయ జెండా ఎగురవేస్తున్న గవర్నర్ హరిచందన్.30 అడుగుల మహాత్మాగాంధీ కుడ్య చిత్రం దేశభక్తుల భూమి ఆంధ్రా స్వాతంత్య్ర సమర వీరులు, దేశభక్తుల భూమి ఆంధ్రప్రదేశ్ అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం గాంధేయ తత్వానికి నాడీ కేంద్రంగా పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించే లక్ష్యంతో సర్వోదయ ట్రస్ట్ పనిచేస్తుండటం ముదావహమన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె లింగయ్య పేరిట గ్రంథాలయం నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, సర్వోదయ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ జీవీ మోహనప్రసాద్, కలెక్టర్ ఢిల్లీరావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, స్వాతంత్య్ర సమరయోధురాలు మనోరమ, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ ఎంసీ దాస్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
మన లక్ష్యం ఆత్మనిర్భర్ భారత్
సాక్షి, అమరావతి: స్వాతంత్యోద్రమ స్ఫూర్తితో దేశాభివృద్ధికి అంతా పునరంకితం కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్ది ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం మనలక్ష్యం కావాలన్నారు. సాక్షి మీడియా గ్రూప్ శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు చేసిన ఉద్యమాలు, త్యాగాల ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలని గుర్తుచేశారు. మహనీయుల ఆశయాలను సాధించడమే మన కర్తవ్యం కావాలన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం అలుపెరగని పోరాటం చేశారని గవర్నర్ పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందన్నారు. పింగళి వెంకయ్య స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీక గా జాతీయ జెండాను రూపొందించి దేశానికి అం దించారన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో జాతీ య జెండాను ఈ నెల 15వరకు ప్రతి ఇంటిపై ఎగు రవేసేలా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును జయప్ర దం చేయాలని కోరారు. ఈ ఉత్సవా లను నిర్వహిం చిన సాక్షి మీడియా గ్రూప్ను అభినందించారు. కలసి పనిచేద్దాం స్వాతంత్య్రోదమ స్ఫూర్తితో దేశాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కోరారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య రాష్ట్రానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను సత్కరించి మహనీయుడి సేవలకు సముచిత గౌరవం కల్పించారని తెలిపారు. సదా స్ఫూర్తిదాయకం దేశ ప్రజలు 75 ఏళ్లుగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం అందుకు రెండింతల కాలం పాటు ఉద్యమించాల్సి వచ్చిందని సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి గుర్తు చేశారు. 150 ఏళ్ల స్వాతంత్య్ర పోరాటంలో వివిధ దశలను ఆయన వివరించారు. మొదటి 50 ఏళ్లు ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు చేయగా అనంతరం మరో వందేళ్ల పాటు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నిర్వహించిన తరువాతే దేశానికి స్వేచ్ఛ లభించిందన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, నెహ్రూ లాంటి నేతలు ఒకవైపు ఉద్యమించగా సమాంతరంగా మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవ వీరులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు దేశ ప్రజలకు సదా స్ఫూర్తిదాయకమన్నారు. స్వాతంత్య్ర ఫలాలు కేవలం కొందరికే కాకుండా పేద, నిమ్న వర్గాలకు అందించాలన్న సత్సంకల్పంతో బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించారన్నారు. గొప్ప పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సమరయోధుల కుటుంబాలకు సన్మానం ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సాక్షి మీడియా గ్రూప్ సన్మానించింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా వారిని సత్కరించింది. సత్కారం అందుకున్నవారిలో పింగళి వెంకయ్య మనవరాలు సుశీల, కొప్పల్లి హనుమంతరావు మనవడు కొప్పల్లి హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనవడు విజయ్కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు మనవడు మహాబలేశ్వరరావు, చింతకాయల బుల్లెమ్మ, సత్యన్నారాయణ దంపతుల కుమారుడు చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి, అంజిలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి, పెనుమత్స సుబ్బన్న సతీమణి పెనుమత్స శ్యామల ఉన్నారు. గవర్నర్ వారిని సత్కరించి మెమెంటో బహూకరించారు. విద్యార్థులకు బహుమతులు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గవర్నర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గవర్నర్ వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కాంతిరాణా, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ తదితరులతోపాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
సాక్షి ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్’ వేడుకలు (ఫొటోలు)
-
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులకు ఏపీ గవర్నర్ ఘన సత్కారం
సాక్షి, విజయవాడ: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు’లో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబసభ్యులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సన్మానించారు. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనుమరాలు సుశీల, స్వాతంత్ర సమరయోధులు కోపల్లె హనుమంతరావు మనుమడు హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనుమడు కాకాని విజయ్ కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు మనుమడు ఇవటూరి కృష్ణకుమార్.. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చింతకాయల చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పెనుమత్స సుబ్బన్న భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. పింగళి వెంకయ్య.. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారంతా వివిధ జాతీయ జెండాలను ఉపయోగించేవారు.. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించి మహాత్మా గాంధీ విజయవాడ పర్యటనలో వారికి అందించారు. "పింగళి వెంకయ్య వ్యవసాయవేత్త, మచిలీపట్నంలోనూ విద్యాసంస్థను స్థాపించిన విద్యావేత్త. 1963లో పేదరికంతో మరణించారు. 2009 లో పింగళి స్మారకార్థం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" ప్రారంభోత్సవం సందర్భంగా గంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. వారి మనుమరాలు సుశీలను గవర్నర్ నేడు ఘనంగా సత్కరించారు. కోపల్లె హనుమంతరావు కోపల్లె హనుమంతరావుగారు 1879, ఏప్రిల్ 12 న మచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరు చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాదిగా బందరులో పనిచేసారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు. హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఎం.ఏ, లా డిగ్రీ చదివి ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసారు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు. 1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపుతో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల ఇప్పటీకీ నడుస్తున్నాయి. వీరు కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగక ప్రయత్నించి అప్పట్లోనే లక్షలాది రూపాయల ధనంతో ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ కళాశాల 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది. వీరి మనుమడు హనుమంతరావుగారు ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం ఉన్న ప్రాంతానికే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.. వారిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. కాకాని వెంకటరత్నం ప్రముఖ స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు కాకాని వెంకటరత్నంగారు ఉక్కు కాకాణిగా పేరుగాంచారు.. 1900 సంవత్సరం ఆగస్టు 3న తేదీన కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో జన్మించారు, మహాత్మాగాంధీ ఉపదేశాలకు స్ఫూర్తి చెంది 1924లో కాంగ్రెస్ లో పనిచేశారు, 1930 ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1955 లో శాసనభ్యులుగా తొలి అడుగులువేసి మంత్రిగా పనిచేసారు. 1972 లో జైఆంధ్రా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.. ఆ ఉద్యమంలో విద్యార్థుల పై పోలీసులు కాల్పుల్లో మరణించారు అన్న వార్త విని డిసెంబర్ 25 న గుండెపోటు తో మరణించారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వారి మనుమడు కాకాని విజయ్ కుమార్ను గవర్నర్ ఘనంగా సత్కరించారు. అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావుగారు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకర్.. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాడిన మలితరం మహా నాయకులలో డా.పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారున్నారు. కాళేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసి. 1881 జనవరి 22వ తేదీన జన్మించిన కాళేశ్వరరావు బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో విశేష కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను పనిచేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు. వారి మనుమడు ఇవటూరి క్రిష్ణకుమార్ గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు విజయవాడవాసులు.. మొదటినుండి జాతీయ భావాలు కలిగిన వీరు జాతీయ ఉద్యమంలో ఈ ప్రాంతంనుండి ప్రాతినిధ్యం వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసారు. అనేకమార్లు అరెస్ట్ కాబడి బ్రిటిష్ పోలీసులచేత దెబ్బలు తిన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారికి ఆరోజుల్లో వారిచేతులతోనే భోజనాలు వండి పెట్టేవారు. వీరి కుమారులు చింతకాయల చిట్టిబాబు గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి వీరు ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మిలకు జైలు శిక్ష పడగా వారికి కారాగారంలో పసల కృష్ణభారతి జన్మించారు. 1921లో గాంధీ సమక్షంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వీరిని 1931లో ఆంగ్లేయ సర్కారు జైలుకు పంపించింది. నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను ఒడిలో పట్టుకొనే జైలుజీవితం గడిపారు. పదినెలల గర్భంతోనే జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పసల కృష్ణభారతి గారి పాదాలకు నమస్కరించి ఆమెను సన్మానించారు. పసల కృష్ణమూర్తి అంజ లక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. పెనుమత్స సుబ్బన్న సుబ్బన్న గారు.. ప్రముఖ స్వతంత్ర పోరాట సమరయోధుడు స్వాతంత్రం కోసం జైలుజీవితం గడిపిన వ్యక్తి.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బన్న గాంధీజీ ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిసారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశమంతా ప్రజల తిరుగుబాటుతో ఆంగ్ల ప్రభుత్వ పరిపాలనను స్తంభించే విధంగా పనిచేశారు. ఆంగ్లేయులు ఆయనను ఏలూరు, బళ్లారి జైళ్లల్లో పలుసార్లు బంధించారు. ఆ జైలలో పొట్టి శ్రీరాములు వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహా నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. 2007 సెప్టెంబర్ 22న అనారోగ్యంతో మరణించారు. పెనుమత్స సుబ్బన్నగారి భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. -
సాక్షి ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాలు
సాక్షి, అమరావతి: సాక్షి మీడియా గ్రూప్ విజయవాడలో శుక్రవారం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు’ ఘనంగా నిర్వహించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ఉత్సవాల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్కు రాఖీ విషెష్ చెప్పాలనుకుంటున్నారా.. అయితే.. గవర్నర్ మాట్లాడుతూ, దేశమంతా పండుగ జరుపుకోవాల్సిన సందర్భంగా పేర్కొన్నారు. ఎందరో మహనీయుల పోరాటంతో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యిందని.. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామని విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబసభ్యులను సన్మానించారు. దేశ స్వాతంత్య్రోద్యమ అంశంపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్’ పేరుతో సాక్షి మీడియా గ్రూప్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే తిరుపతిలోను, తెలంగాణలోని వరంగల్లోను ఈ ఉత్సవాలను నిర్వహించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: గవర్నర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరవాణి ద్వారా గవర్నర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ జీవితం గడపాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. గవర్నర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు. చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే గవర్నర్ @governorap శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు జీవితం గడపాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2022 -
రాష్ట్రపతితో భేటీ అయిన ఏపీ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం భేటీ అయ్యారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో.. రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు ఆయన. ఈ ఇద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖులే కావడం గమనార్హం. సమకాలీన రాజకీయాలపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు ఏపీ రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. భేటీ అనంతరం తిరిగి ఆయన ఏపీకి వచ్చేశారు. -
రక్తదానానికి ముందుకు రండి
సాక్షి, అమరావతి: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏపీ శాఖకు సమకూర్చిన రక్తదాతల శకటాలను (బ్లడ్ డోనర్ వ్యాన్స్)ను విజయవాడ రాజ్భవన్ నుంచి గవర్నర్ జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఒక కరోనా పరీక్ష శకటంతో సహా ఐదు రక్తదాతల వాహనాలను సేవకు అంకితం చేశారు. వీటిని విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు నగరాల్లో అందుబాటులో ఉంచనున్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఎక్కడ దాతలు సిద్ధంగా ఉంటే అక్కడికే వెళ్లి రక్తసేకరణ చేస్తున్నారని.. ఇందుకోసం 18004251234లో సంప్రదించవచ్చన్నారు. రెడ్క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల అభిమానం మరువలేనిది ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఏపీ గవర్నర్గా పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లోనూ ఇదే విధంగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందగలనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప సంపద యోగా: గవర్నర్ బిశ్వభూషణ్
-
కృష్ణా తీరంలో కొలువైన తిరుమలేశుడు.. (ఫోటోలు)
-
కృష్ణా తీరంలో తిరుమలేశుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది. ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలోనే స్వామి వారి దర్శనం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. సాయంత్రం కార్యక్రమాలు.. ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?) -
రైతుల ఆదాయం పెంచేలా కృషి జరగాలి
తిరుపతి (ఎడ్యుకేషన్): దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 52, 53వ స్నాతకోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గవర్నర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విజ్ఞానం అందించాలని సూచించారు. 2019–20లో జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17.8 శాతం నమోదు కాగా, 2021 సంవత్సరానికి 19.9 శాతం సాధించడంలో మన రైతులు చేసిన కృషి అభినందనీయమన్నారు. జాతీయ వరి ఉత్పత్తిలో మూడోవంతు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలు ఉండటం విశ్వవిద్యాలయం సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరవమన్నారు. రాష్ట్రంలో పండించే వేరుశనగలో 95 శాతం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు ఉండగా.. రాష్ట్ర వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో దీని వాటా 1.06 శాతంగా ఉండటం గర్వకారణమన్నారు. ఆర్బీకేల పనితీరు భేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అమోఘమని గవర్నర్ అభినందించారు. ఆర్బీకేలకు సాంకేతికంగా సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవాల సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు గౌరవ డాక్టరేట్ను వర్సిటీ ప్రకటించింది. 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1,544 మందికి, పీజీ పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. డాక్టర్ వి.రామచంద్ర రావు జాతీయ అవార్డును ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్, డాక్టర్ ఎన్వీ రెడ్డి జాతీయ అవార్డును రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, వైస్ చాన్సలర్ డాక్టర్ ఏ.విష్ణువర్ధన్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్కృష్ణ పాల్గొన్నారు. -
ఏపీ: గవర్నర్తో సీఎం జగన్ దంపతుల మర్యాదపూర్వక భేటీ (ఫొటోలు)
-
గవర్నర్తో సీఎం జగన్ దంపతుల భేటీ
-
ఏపీ: గవర్నర్తో సీఎం జగన్ దంపతుల భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు కలిశారు. సోమవారం సాయంత్రం రాజ్భవన్ వెళ్లి గవర్నర్ దంపతులను.. సతీసమేతంగా సీఎం జగన్ కలిశారు. రాజ్భవన్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతిరెడ్డికి.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. ఆపై సీఎం జగన్ సతీసమేతంగా గవర్నర్ దంపతులను సత్కరించారు. ఆపై దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం జగన్ ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి.. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వివరించినట్లు సమాచారం. అమరావతిలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ నిర్మించిన, ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్ను సీఎం జగన్ ఆహ్వానించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆ సందర్భంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్తో సీఎం జగన్ చర్చించారు. Andhra Pradesh Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy along with his wife Smt. Y.S. Bharathi Reddy, called on me and Lady Governor Smt. Suprava Harichandan at Raj Bhavan on Monday on a courtesy visit.@AndhraPradeshCM @ysjagan pic.twitter.com/NcUI7qbBCF — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) June 6, 2022 -
భువనేశ్వర్లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతి అలిపిరి/పెందుర్తి/భువనేశ్వర్: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో గురువారం మహాసంప్రోక్షణ కనుల పండువగా జరిగింది. ఆలయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామీజీ ప్రశంసించారు. -
వీఎస్యూ లోగిలి.. ఆనందాల కేళి
నెల్లూరు (అర్బన్): కొత్తకొత్త స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్, ఉపాధి కోర్సులను ప్రవేశ పెడుతూ నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు కేంద్ర బిందువుగా మారి జిల్లాకే ప్రతిష్టాత్మకమైన విక్రమసింహపురి యూనివర్సిటీలో మంగళవారం స్నాతకోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో 6, 7వ స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్రెడ్డి హాజరయ్యారు. ప్రపంచీకరణకు అనుగుణంగా నైపుణ్యం మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణతో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేటి యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందరవల్లి మాట్లాడుతూ వర్సిటీ పరంగా సాధించిన ప్రగతిని వివరించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసిన ఆచార్యులను అభినందించారు. రవీంద్ర సన్నారెడ్డికి గౌరవ డాక్టరేట్ శ్రీసిటీ సృష్టికర్త, మేనేజింగ్ డైరెక్టర్గా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రవీంద్ర సన్నారెడ్డికి విక్రమసింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తాను చిట్టమూరు మండలంలోని ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టపడి పైకి వచ్చానన్నారు. నేటి విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. ముగిసిన పర్యటన నెల్లూరు (క్రైమ్): అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం గవర్నర్ ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం నుంచి బయలుదేరి విక్రమసింహపురి యూనివర్సిటీలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన పొదలకూరురోడ్డులోని కేన్సర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పోలీసు కవాతుమైదానంలో హెలిప్యాడ్ నుంచి విజయవాడుకు బయలుదేరారు. దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు కీలకం : గవర్నర్ వీఎస్యూ చాన్సలర్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణ జరగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడితో పాటు ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారన్నారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారన్నారు. ఇలాంటి స్వాతంత్య్రయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశమన్నారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు, సమాజ ప్రగతి కోసం, మాతృభూమి గొప్ప తనం కోసం విద్యార్థులు పాటు పడాలన్నారు. అందుకు విద్య చక్కటి మార్గమన్నారు. విద్యార్థులు పట్టా అందుకోవడం జీవితంలో మధుర జ్ఞాపకమన్నారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ప్రయాణంలో కాన్వొకేషన్ ఒక మైలు రాయి అన్నారు. మానవత్వం మెలగడానికి ప్రాథమిక విలువలు విధిగా పాటించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా అన్ని ప్రోగ్రాంల పాఠ్యాంశాలను ప్రభుత్వం సవరించిందన్నారు. 2025 నాటికి 1.20 కోట్ల మంది నైపుణ్యం ఉన్న యువత అవసరమన్నారు. అందుకనుగుణంగా యూనివర్సిటీలు విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు అందజేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అత్యధిక మార్కులు సాధించి గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్గా పట్టాలు పొందిన 18 మందికి 26 గోల్డ్ మెడల్స్, కాన్వొకేషన్ పట్టాలు అందించారు. వీరితో మరో 250 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్కు పట్టాలు అందించా రు. 1. పెనుమాల మనీషా, 2.దారా మాధవి, 3. ఎర్రగుడ్ల శ్రావ్యసుహిత్, 4. కారుమంచి వాసవి, 5. మూర్తి లోహిత (మూడు గోల్డ్ మెడల్స్), 6. షేక్ అఫ్సానా (మూడు గోల్డ్ మెడల్స్), 7. టాటా శ్రీనాథ్గౌడ్ (రెండు గోల్డ్ మెడల్స్), 8. పంచకట్ల జ్యోతి (రెండు గోల్డ్ మెడల్స్) 9. దేవరకొండ కల్పన, 10. పోలు అపర్ణ (రెండు గోల్డ్ మెడల్స్), 11. బొరిగి కిరణ్కుమార్, 12. రేవిల్ల వర్షిణి సాయిమమత, 13.తన్నీరు మల్లిక, 14. షేక్ ఫజులున్, 15. పోలిరెడ్డి శ్రీదేవి, 16.పల్నాటి సంధ్య (రెండు గోల్డ్ మెడల్స్), 17. పి.లిల్లీ, 18. గొల్లపల్లి సునీత అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి, గవర్న ర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడి యా, కలెక్టర్ చక్రధర్బాబు, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, జేసీ హరేందిరప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, అధికారులు, డీన్ లు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి) -
విరబూసిన విద్యావనం
చారిత్రక సింహపురి పేరుతో పురుడు పోసుకున్న విక్రమసింహపురి యూనివర్సిటీ అనతికాలంలో పేరెన్నిక వర్సిటీల సరసన నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేర్చాలన్న సమున్నత సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సృష్టించిన వర్సిటీ సత్ఫలితాలను సాధిస్తోంది. వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ సగర్వంగా స్నాతకోత్సవాల పండగ చేసుకుంటోంది. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను అందించనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి విద్యావనంలో విద్యా కుసుమాలు విరగబూస్తున్నాయి. ఉన్నత సంకల్పంతో నెలకొల్పిన యూనివర్సిటీ సత్ఫలితాలు సాధిస్తోంది. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ దేశంలోనే అగ్రగామి వర్సిటీగా పరిణతి చెందుతోంది. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలో విద్యా వర్సిటీ లేకపోవడాన్ని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో విక్రమసింహపురిగా పేరొందిన నెల్లూరులో అదే పేరుతో వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలుత పరాయి పంచన ప్రారంభించిన వర్సిటీకి నెల్లూరుకు కూతవేటు దూరంలోని కాకుటూరులో 87 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ హంగులతో వర్సిటీ సొంత భవనానికి పునాదులు వేశారు. పుష్కర కాలంలోనే వైభవంగా వెలుగొందుతున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 6, 7 స్నాతకోత్సవాలను మంగళవారం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని వీఎస్యూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గవర్నర్ బిశ్వభూషణ్, మంత్రి బొత్స సత్యనారాయణ, హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 26 గోల్డ్మెడల్స్ అందజేత వర్సిటీ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ చాటిన 19 మంది విద్యార్థులకు 26 గోల్డ్ మెడల్స్ను అందించనున్నారు. 252 మందికి ప్రత్యక్షంగా, 4,071 మంది విద్యార్థులకు తపాలా ద్వారా పట్టాలు అందించేందుకు ప్రణాళికలు చేపట్టారు. శ్రీసిటీ సృష్టికర్తకు గౌవర డాక్టరేట్ పల్లెటూళ్లను పరిశ్రమల గూళ్లుగా మార్చిన శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందిస్తోంది. తడ–సత్యవేడు మండలాల మధ్య 5,700 ఎకరాల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో చేపట్టిన శ్రీసిటీకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. 28 దేశాలకు చెందిన 200 పరిశ్రమలు పైగా శ్రీసిటీలో నెలకొల్పారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తోంది. అందుకు కారకులైన ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించనున్నారు. సామాజిక బాధ్యతలో ప్రత్యేకత వర్సిటీ సామాజిక బాధ్యతను గుర్తెరిగింది. కరోనా కారణంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్, గూగుల్ మీట్ వంటి మొబైల్ అప్లికేషన్లు ద్వారా బోధన చేసి, సకాలంలో పరీక్షలు నిర్వహించి సత్ఫలితాలు సాధించింది. 2019లో ఎన్ఎస్ఎస్ విభాగంలో భారతదేశంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వీఎస్యూ నిలిచింది. 2020లో రాష్ట్ర ఉత్తమ వలంటీర్ అవార్డు, 2021లో యూత్ ఐకాన్ అవార్డు దక్కించుకుంది. వర్సిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు సంబంధించి 19 జట్లలోని 164 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా వర్సిటీని తీర్చిదిదేందుకు వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ ఎల్వీ కృష్ణారెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వర్సిటీలో 17 విభాగాలు ఉన్నాయి. జిల్లాకు అనువుగా మరిన్నీ సబ్జెక్ట్లు ప్రవేశ పెట్టేందుకు నిపుణుల కమిటీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నాం. రీసెర్చ్కు ప్రాధాన్యం ఇçవ్వనున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం. అవసరమైన మేరకు దాతల సహకారం కోరుతున్నాం. సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని అనుగుణంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రచించుకున్నాం. – ఎల్ విజయకృష్ణారెడ్డి -
రెడ్క్రాస్ సేవలు శ్లాఘనీయం
సాక్షి, అమరావతి/పాడేరు రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): రెడ్క్రాస్ సొసైటీ అనుసరిస్తున్న మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తిలోకి తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని, పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన థలసేమియా, సికిల్సెల్ ఎనీమియా చికిత్సా కేంద్రాన్ని రాజ్భవన్ నుంచి వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. అడ్వాన్స్డ్ లైఫ్సపోర్ట్ సిస్టం అంబులెన్స్ను ప్రారంభించారు. రెడ్క్రాస్ ఏపీ చైర్మన్ శ్రీధర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు. -
పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి
సాక్షి, అమరావతి: గుణాత్మక పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రాధాన్యమివ్వాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. పరిశోధన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిశోధన మండలిని ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగని చెప్పారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లతో విజయవాడ రాజ్భవన్లో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తోందన్నారు. ఉన్నత విద్యావ్యవస్థ సంస్థాగత స్వయం ప్రతిపత్తి దిశగా పయనించేందుకు నూతన జాతీయ విద్యావిధానం సహకరిస్తుందని చెప్పారు. అందుకోసం పాఠ్యాంశాల పునరుద్ధరణ, బోధన, మూల్యాంకనం, విద్యార్థుల అనుసరణీయత, ఉత్తమ బోధకుల పాత్ర వంటి అంశాలు మిళితమై ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీ కోర్సుల రీడిజైన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు విధానాన్ని ప్రవేశపెట్టి ఒక ఏడాది పరిశోధనలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసేలా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ యువత ఆధునిక వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యేలా కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీకి తగినట్టుగా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. సదస్సుకు హాజరైన 23 విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు గవర్నర్కు నివేదికలు సమర్పించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ కె.రామమోహనరావు, కార్యదర్శి బి.సుధీర్ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్, సీఎంల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా సమాలోచించారు. కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని సీఎం గవర్నర్కు వివరించారు. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: (పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సజ్జల) తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతీ రాణా టాటా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ.. సంచలన విషయాలు వెలుగులోకి) -
రాష్ట్రపతి, సీజేఐతో ఏపీ గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారని సమాచారం. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షాలను గవర్నర్ విడివిడిగా కలిశారు. సీజేఐను కలిసిన గవర్నర్.. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా గవర్నర్ హరిచందన్ కలిశారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీ వచ్చిన గవర్నర్ 23వ తేదీన ప్రధాని మోదీని కలవగా, 24న నేషనల్ వార్ మెమోరియల్ను తన సతీమణితో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. గవర్నర్ దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారని సమాచారం. -
జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ఏపీ గవర్నర్
ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు ఆదివారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్, జాతి సేవలో ప్రాణాలర్పించిన వీర యోధులను మననం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 26,000 మందికి పైగా భారత సాయుధ దళాల సైనికులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడే క్రమంలో అసువులు బాసి అత్యున్నత త్యాగం చేశారు. వారి త్యాగ నిరతి కి గుర్తుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. స్మారక చిహ్నం పౌరుల్లో ఉన్నతమైన నైతిక విలువలు, త్యాగం, జాతీయ భావాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చోటు చేసుకున్న వివిధ సంఘర్షణలు, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలు, మానవతా సహాయం, విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల సమయంలో మన సైనికులు చేసిన త్యాగాలకు ఇది సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. స్మారక చిహ్నం లోతైన అనుభవాలకు ప్రతీక కాగా, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. గవర్నర్ హరిచందన్ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సందర్శన నేపథ్యంలో అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని నమోదు చేశారు. గవర్నర్తో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి గౌరవ ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమకాలీన రాజకీయ అంశాలను చర్చించారు. -
నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించిన ఏపీ గవర్నర్
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేషనల్ వార్ మెమోరియల్ను గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. సోమవారం.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో గవర్నర్ భేటీ కానున్నారు. మంగళవారం విజయవాడ రాజ్భవన్కు గవర్నర్ చేరుకోనున్నారు. కాగా, గవర్నర్ బిశ్వభూషణ్.. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు -
ప్రధానితో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 26 వరకు ఢిల్లీలోనే ఉండనున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఉదయం వార్ మెమోరియల్ను సందర్శించనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను గవర్నర్ కలిసే అవకాశముంది. చదవండి👉: రైళ్లకు సమ్మర్ రష్..! -
ఆరోగ్యశ్రీ చాలా గొప్ప పథకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎంతో గొప్పదని.. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రిలో ‘న్యూ రివిజన్ నీ రీప్లేస్మెంట్ బ్లాక్’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఈహెచ్ఎస్ లబ్ధిదారులతో సంభాషించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ధైర్యాన్ని ఇస్తోందన్నారు. రూ.25 లక్షల విలువైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఇంప్లాంట్లను ప్రభుత్వానికి విరాళంగా అందించడమే కాకుండా, ఉన్నతి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ నరేంద్రరెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. గుంటూరు సర్వజన వైద్యశాలలో డాక్టర్ నరేంద్రరెడ్డి 100 ఉచిత మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఎస్పీ ఆరిఫ్హఫీజ్, జేసీ రాజకుమారి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎస్ఎం జియావుద్దీన్, హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
స్వేచ్ఛ, సమానత్వమే అంబేడ్కర్ జీవిత సూత్రాలు
సాక్షి, అమరావతి: స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కుల, మత రహిత భారతదేశం కోసం జీవితకాలం పాటు పోరాటం చేశారన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం విజయవాడలోని రాజ్భవన్లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వర్ధమానుడి బోధనలు సదా ఆచరణీయం వర్ధమాన మహావీరుడు ప్రబోధించిన అహింసా మార్గం సదా ఆచరణీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గురువారం రాజ్భవన్లో జరిగిన వర్ధమాన మహావీరుడి జయంతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జైన్ సమాజ్ ప్రతినిధులు గవర్నర్ను సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జైన్ సమాజ్ ప్రతినిధులు మనోజ్ కొఠారి, పబ్నాలాల్, సుక్రజ్, దినేష్, కిశోర్, నరేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
AP: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార ఘట్టంలో భాగంగా మొదట సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు అంబటి రాంబాబు ఏపీ కేబినెట్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో చివరగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్లో పాత మంత్రులను 11 మందిని కొనసాగించగా.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ప్రమాణస్వీకారం చేసినవారిలో మొదటి నుంచి చివరకు.. ►అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పి. రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం) -
AP: కొలువు తీరిన నూతన మంత్రివర్గం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందుకు హాజరయ్యారు. కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు పంపించింది. అంతకు ముందే గవర్నర్ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. కొత్త వారు 14 మందికి స్థానం సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు. -
ఏపీ నూతన కేబినెట్కు గవర్నర్ ఆమోదం
సాక్షి, విజయవాడ: నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం (ఏప్రిల్ 11) ఉదయం 11 గంటల 31 నిమిషాలకు వెలగపూడి సచివాలయం ఆవరణలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రి వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
ఏపీ: మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. ఈ ఖాళీలకు సంబంధించి కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో 24 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది: సజ్జల) -
AP: గవర్నర్ కార్యాలయానికి మంత్రుల రాజీనామాలు
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులు చేసిన రాజీనామాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. కాసేపట్లో గెజిట్ విడుదల కానుంది. చదవండి: (రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు) -
ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలోనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. చదవండి: (పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు) -
పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 11న ఏపీ మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందులో పాల్గొననున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛ్మైరన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు. -
AP: టీమ్ 24.. కొత్త జట్టు రెడీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ తొలుత పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన కొత్త జిల్లాల గురించి వివరించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఈ సందర్భంగా గవర్నర్తో చర్చించినట్లు తెలిసింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార తేదీల గురించి కూడా గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. ఈ నెల 11వతేదీన నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. నేడు మంత్రివర్గ భేటీ నూతన మంత్రివర్గంపై తుది కసరత్తు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించనున్నారు. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కానుందని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ తర్వాత మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ఆదిలోనే స్పష్టత.. 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్సీపీ ఆఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లకు ఒకసారి చొప్పున ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట.. మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐదుగురికి, బీసీల నుంచి ఏడుగురికి, ఎస్టీల నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురికి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురికి, క్షత్రియుల నుంచి ఒకరికి, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురిని నియమించగా వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారే కావడం గమనార్హం. తొలిసారిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను హోంమంత్రిగా నియమించారు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్తో సీఎం వైఎస్ జగన్ భేటీ సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమయ్యారు. ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్య్వవస్థీకరిస్తారన్న సమాచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలోని రాజ్భవన్కు బుధవారం సాయంత్రం 5.15 గంటలకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్కి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ దాదాపు 50 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ గురించి సీఎం గవర్నర్కు వివరించినట్టు సమాచారం. ఇటీవల చేపట్టిన జిల్లాల పునర్విభజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు వివరించారు. -
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు
-
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్తో సీఎం జగన్ చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ గవర్నర్కి వివరించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం వైఎస్ జగన్ గవర్నర్ను కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రాజ్ భవన్ వద్ద సీఎం వైఎస్ జగన్కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒరిస్సా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 3 గంటలకి క్యాబినెట్ సమావేశం కానుంది. చదవండి: (‘మాది సంక్షేమ ప్రభుత్వం.. గర్వంగా చెప్పగలం’) -
సీఎం జగన్ కు గవర్నర్ అభినందనలు
-
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్కు గవర్నర్ అభినందనలు
సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవటం అనుసరణీయమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని ఇది రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుందన్నారు. నూతన జిల్లాలతో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, పథకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం మంచి ఆలోచన అని గవర్నర్ పేర్కొన్నారు. -
‘స్వామి వారిని దర్శించుకోవడం అనుభూతి కలిగించింది’
విశాఖ: ప్రత్యేక విమానంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విశాఖ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి విశాఖ పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా ఎయిర్పోర్ట్కు చేరుకున్న బిశ్వభూషణ్కు ఘనస్వాగతం లభించింది.ఎయిర్పోర్ట్ నుంచి కాన్వాయ్లో నేరుగా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయానికి గవర్నర్ దంపతులు చేరుకున్నారు. ఈ మేరకు మాట్లాడిన ఆయన..సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాలా అనుభూతి కలిగించిందని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్యపై చర్చించి , తన వంతు కృషి చేస్తానని గవర్నర్ తెలిపారు. అంతకుముందు సింహగిరికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ఉన్న కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని , అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
రాజమండ్రి(తూ.గో): రాజమండ్రి ఆర్ట్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిలు హాజరయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రి తో పాటు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వేణుగోపాల కృష్ణ, అవంతి శ్రీనివాస్లు హాజరయ్యారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత ఇనుమడింప జేస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర సాంస్కృతిక శాఖ అనేక రకాల ఉత్సవాలను నిర్వహిస్తోందని, దేశ ప్రజల్లో జాతీయతను పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించిన నేతల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరని కొనియాడారు. కాగా, దేశ మహోన్నత సంస్కృతి, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా జరగనున్న ఈ వేడుకల్లో తేట తెలుగు సంస్కృతి, కళల కనువిందు, పలు రకాల ప్రసిద్ధ వంటకాల ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి వైభవం, విశిష్టతను చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. -
‘ఎర్త్ అవర్’తో పర్యావరణానికి మేలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: రాత్రిపూట ఓ గంటపాటు కరెంటు నిలిపేస్తే.. పర్యావరణానికి, భూమికి మేలు జరుగుతుందంటున్నారు పర్యావరణ నిపుణులు. కర్బన ఉద్గారాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం తగ్గించకుంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఏటా మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్ సహా ఇతర రకాల ఇంధనాల వినియోగం నిలిపేసి భూమికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు ‘ఎర్త్ అవర్’ను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు. కాలనీలు, రెసిడెన్షియల్ అసోసియేషన్ల సహకారంతో ఎర్త్ అవర్’పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలగజేసే అంశాలను తెలియజేసి భూతాపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజ్భవన్లలోనూ ‘ఎర్త్ అవర్’ సందర్భంగా గంటపాటు విద్యుత్ దీపాలు, ఉపకరణాలను ఆపేయాలని గవర్నర్లను కోరినట్టు తెలిపారు. శనివారం రాత్రి 8.30 నుంచి గంట పాటు ఎర్త్అవర్ను పాటిస్తున్నట్టు ఫరీదా తంపాల్ ‘సాక్షి’తో చెప్పారు. ఎర్త్ అవర్ ప్రచారంలో పాల్గొనండి: గవర్నర్ ఆంధ్రప్రదేశ్లోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ విజయవాడ రాజ్భవన్ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. -
ఆర్బీకేల సేవలు ఆదర్శనీయం
సాక్షి, అమరావతి: ఏకగవాక్ష విధానంలో రైతులకు అవసరమైన సేవలన్నీ అందిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దళారుల పాత్ర లేకుండా చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం రైతులకు భరోసాను ఇస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్తో గురువారం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య భేటీ అయ్యారు. ఆర్బీకేల పనితీరు నివేదికను గవర్నర్కు సమర్పించారు. త్వరలో తాను ఆర్బీకేలను సందర్శిస్తానని గవర్నర్ చెప్పారు.5 రాష్ట్రాల ప్రతినిధులు ఏపీలోని ఆర్బీకేలను సందర్శించి అధ్యయనం చేశారని గవర్నర్కు పూనం మాలకొండయ్య వివరించారు. చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్తో ఆప్కో చైర్మన్ మోహనరావు గురువారం భేటీ అయ్యి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను వివరించారు. గన్నవరం, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో ఆప్కో కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. చేనేత రంగాన్ని కేంద్రం జీఎస్టీ నుంచి మినహాయింపునకు చొరవ చూపాలని గవర్నర్ను కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందిస్తూ జీఎస్టీ మినహాయింపు అంశంలో పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు మోహనరావు తెలిపారు. సుహృద్భావాన్ని పెంపొందించే హోలీ హోలీ పండుగ సమాజంలో సహృద్భావం, సద్భావనను పెంపొందిస్తుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచే హోలీ పండుగ సామాజిక నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ సూచించినట్టుగా రాజ్భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
Andhra Pradesh: గవర్నర్పై దాడి సరికాదు..!
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేసి సభలో అనాగరికంగా వెదజల్లడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసం వికృత చేష్టలకు పాల్పడటాన్ని ఖండించారు. ఇదేనా విపక్షం విధానం? అని నిలదీశారు. సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం నిర్వహించిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో టీడీపీ సభ్యుల అనుచిత ధోరణి పట్ల సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘గవర్నర్ది రాజ్యాంగబద్ధమైన పదవి.. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదు. అందువల్ల ఆయన్ను విమర్శించడం సరికాదు. చర్చలో పాల్గొంటే విపక్షాలకు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.. ’ అని సూచించారు. రాజీనామాలకు రెడీనా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గవర్నర్పై దాడి చేసినట్లే తామూ చేశామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్పై ప్రసంగం ప్రతులను విసిరేసి దాడి చేసినట్లు నిరూపిస్తే నాతోపాటు మా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేస్తాం. లేదంటే చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారా?’ అని సీఎం జగన్ సవాల్ చేయడంతో అచ్చెన్నాయుడు నీళ్లు నమిలారు. మన రాష్ట్ర శాసనసభలో కాదు.. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్పై దాడి చేసిన ఘటనలున్నాయంటూ దాటవేసే యత్నం చేశారు. శాసనసభలో జరగనిది జరిగినట్లుగా ప్రతిపక్షం సత్యదూర ప్రచారం చేస్తున్నట్లు మరోసారి రుజువైందని సీఎం జగన్ పేర్కొనడంతో అచ్చెన్న మౌనం దాల్చారు. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ.. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది. ఆ తరువాత స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, టీడీపీ తరఫున ఆపార్టీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఇందులో పాల్గొన్నారు. తప్పుదోవ పట్టించడం సబబేనా? శాసనసభలో అధికారపక్షం తరఫున చర్చించేందుకు 25 అంశాలను మంత్రులు బీఏసీలో ప్రతిపాదించారు. టీడీఎల్పీ పక్షాన కూడా 25 అంశాలను ప్రతిపాదిస్తున్నామని, వాటిపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని అచ్చెన్న వ్యాఖ్యానించటాన్ని సీఎం జగన్ ఖండించారు. శాసనసభ గత సమావేశాల్లో ఒక అంశంపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాక మంత్రి వివరణ ఇచ్చారని, ఆ తర్వాత కూడా అదే అంశంపై సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతిపక్షం మాట్లాడేందుకు ప్రయత్నించడంతో స్పీకర్ మైక్ కట్ చేశారని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార పక్ష సభ్యులు సభలో అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను ఎవరూ దూషించకపోయినా.. దూషించినట్లుగా దుష్ప్రచారం చేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం సభను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు. అదే నిజమైతే.. మైక్ కట్ చేసేవారు అధికార పక్ష సభ్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించినట్లు రికార్డుల్లో ఉందా? అని ఈ సందర్భంగా అచ్చెన్నను సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరుస్తూ అధికారపక్ష సభ్యులు మాట్లాడి ఉంటే స్పీకర్ మైక్ కట్ చేసేవారని, చర్యలూ తీసుకునేవారని చెప్పారు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు డ్రామా ఆడారని సీఎం జగన్ నిలదీయగా.. చంద్రబాబు కుటుంబ సభ్యులను అధికారపక్ష సభ్యులు దూషించినట్లు ఎవరో తమ చెవిలో చెప్పారని అచ్చెన్న తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. అనని మాటలను అన్నట్లుగా ఊహించుకుని.. సభను తప్పుదోవ పట్టించి.. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఎవరు ప్రయత్నించినా తక్షణమే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ను సీఎం జగన్ కోరారు. ప్రజా సమస్యలపై ఎన్ని రోజులైనా చర్చిద్దాం.. ప్రజాసమస్యలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అధికారపక్షం ప్రతిపాదించిన 25 అంశాలను కాకుండా ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన 25 అంశాలనే చర్చకు తీసుకోవడానికి సిద్ధమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే సత్యదూరమైన ఆరోపణలు చేయకుండా వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. ► గతంలో గవర్నర్పై వైఎస్సార్సీపీ సభ్యులు దాడి చేశారు ► ప్రజా సమస్యలపై చర్చించేందుకు మాకు మైక్ ఇవ్వటం లేదు –అచ్చెన్నాయుడు ► నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం. లేదంటే చంద్రబాబుతో సహా మీరంతా రాజీనామాలకు సిద్ధమా? మీ అసత్య ప్రచారం మరోసారి రుజువైంది. ► గత సమావేశాల్లో అధికారపక్ష సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఊహించుకుని రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాటకం ఆడారా? లేదా? అవాస్తవాలు ఎలా మాట్లాడతారు? ప్రజా సమస్యలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేం సిద్ధం. – సీఎం జగన్ అధికార పక్షం చర్చకు ప్రతిపాదించిన అంశాలివీ.. 1. జిల్లాల విభజన – పరిపాలనా వికేంద్రీకరణ 2. ప్రత్యేక హోదా – విభజన హామీలు 3. విద్యారంగంలో సంస్కరణలు. నాడు – నేడు, అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, కొత్త యూనివర్శిటీల ఏర్పాటు, ఉన్నత విద్య సిలబస్లో మార్పులు. 4. వైద్య ఆరోగ్య రంగం, ఆరోగ్యశ్రీ, నాడు – నేడు, నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన 5. కరోనా నియంత్రణ, ప్రభుత్వ చర్యలు, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు 6. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కొత్త పీఆర్సీ అమలు, ఉద్యోగాల భర్తీ 7. పెన్షన్ల పెంపు, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2,500 అమలు 8. ఉపాధి హామీ అమలు, మౌలిక వసతుల కల్పన 9. పోలవరం ప్రాజెక్టు – గత ప్రభుత్వం తప్పిదాలు 10. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద పథకాల అమలు 11. రాష్ట్రంలో రోడ్డు నెట్వర్క్ అభివృద్ధికి చర్యలు 12. శాంతి భద్రతలు 13. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ 14. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ 15. ఇళ్ల పట్టాల పంపిణీ–ఇళ్ల నిర్మాణం 16. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం 17. వ్యవసాయ రంగం–ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈ–క్రాప్, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ 18. మహిళా సాధికారత–దిశ చట్టం–వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, నామినేటెడ్ పదవులు. 19. గ్రామ సచివాలయాలు–వలంటీర్లు, ప్రజలకు జరుగుతున్న మేలు 20. ప్రభుత్వ సంక్షేమ పథకాలు–డీబీటీ, పారదర్శక పాలన 21.పారిశ్రామిక అభివృద్ధి 22. అవినీతి నిర్మూలన– పారదర్శక పాలన 23. వ్యవసాయానికి 9 గంటల ఉచిత కరెంట్– విద్యుత్ రంగంలో సంస్కరణలు, గత సర్కారు నిర్వాకాలు, భారీ బకాయిలు. 24. అమూల్ ప్రాజెక్టుతో పాడి రైతులకు మేలు 25. ప్రభుత్వ హామీలు–అమలు తీరు -
సభ సాక్షిగా.. గవర్నర్కు అగౌరవం
సాక్షి, అమరావతి: ఉభయసభల సంయుక్త సమావేశం వేదికగా ప్రతిపక్ష టీడీపీ రాజ్యాంగ వ్యవస్థపై దాడికి బరి తెగించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను తీవ్రంగా అవమానిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. మర్యాదను మంటగలిపి.. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తిస్తున్న పెద్ద మనిషి పట్ల కనీస గౌరవం కూడా లేకుండా టీడీపీ మరోసారి తెంపరితనాన్ని ప్రదర్శించింది. సోమవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ఉపక్రమించగా ప్రతిపక్షం ఆటంకాలు సృష్టించి సభా మర్యాదలను కాలరాసింది. అందుకోసం టీడీపీ సభ్యులు ముందస్తు పన్నాగంతో వచ్చినట్టు స్పష్టమైంది. జాతీయగీతం ఆలాపన తరువాత గవర్నర్ ప్రసంగించేందుకు ఉద్యుక్తులు కాగానే టీడీపీ సభ్యులు ఒక్కసారిగా తన స్థానాల నుంచి లేచి ‘గవర్నర్ గో బ్యాక్...’ అంటూ నినాదాలు చేయడంతో ఒక్క క్షణం ఖిన్నుడైన ఆయన అంతలోనే తేరుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్తోపాటు ఇతర సభ్యులు అంతా గవర్నర్కు వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుడు బాల వీరాంజనేయస్వామి ముందుగా తన స్థానాన్ని వదిలి ముందుకు వచ్చి కేకలు వేశారు. అయినప్పటికీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో అచ్చెన్నాయుడు తన చేతిలో ఉన్న గవర్నర్ ప్రసంగం కాపీలను చించివేసి గాల్లోకి విసిరారు. అది ఒక సంకేతంగా భావించినట్లుగా టీడీపీ సభ్యులు అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. వెల్లోకి దూసుకువచ్చి ‘గవర్నర్ గో బ్యాక్... రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, చినరాజప్ప, రామానాయుడు... టీడీపీ సభ్యులంతా పోడియం సమీపంలోకి దూసుకువచ్చారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ వేలు చూపిస్తూ గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం నివ్వెరపరిచింది. ప్రతులను చింపి గవర్నర్పైకి విసిరి.. టీడీపీ సభ్యులు పోడియం మీదకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ ముందు జాగ్రత్తగా వారి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. పోడియం వైపు వస్తున్న టీడీపీ సభ్యులకు సర్దిచెప్పేందుకు మార్షల్స్ ఎంతో ప్రయత్నించాల్సి వచ్చింది. ఇంతలో టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి నేరుగా ఆయనపైకే విసరడం విభ్రాంతికి గురిచేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడంతో మిగిలిన సభ్యులు నిశ్చేష్టులయ్యారు. గవర్నర్ హోదానుగానీ కనీసం వయసును కూడా గౌరవించాలన్న కనీస స్పృహ లేకుండా టీడీపీ సభ్యులు ఆయన్ని తూలనాడటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది. ఒక దశలో ఏకంగా పోడియంపైకి దూసుకువెళ్లేందుకు కొందరు సభ్యులు మార్షల్స్ను తోసుకుంటూ వెళ్లేందుకు యత్నించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు మంతెన సత్యనారాయణరాజు, బీటీ నాయుడులను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటకు తరలించాల్సి వచ్చింది. దీనిపై అచ్చెన్నాయుడు,బుచ్చయ్య చౌదరి తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరోసారి పోడియం వైపు ఉరికేందుకు యత్నించగా మార్షల్స్ వారిని అతికష్టం మీద అడ్డుకున్నారు. అందుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగాన్ని ముగించుకుని అసెంబ్లీ లాబీ గుండా వెళ్తున్న సమయంలో కూడా టీడీపీ సభ్యులు కనీస సంయమనం పాటించలేదు. గవర్నర్ వెళ్లే మార్గం వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ పట్ల టీడీపీ సభ్యులు అమర్యాదకరంగా వ్యవహరించి అవమానించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవపరచడం, రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారడం టీడీపీకి అలవాటేనని పేర్కొంటున్నారు. -
AP: వినూత్నం.. విప్లవాత్మకం
సాక్షి, అమరావతి: వికేంద్రీకృత, సమ్మిళిత పరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా నిరంతర కృషి చేస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రతికూలతను ఎదుర్కొని మరీ ఆర్థికాభివృద్ధి సాధించి జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. నేరుగా నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,32,126 కోట్లను పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, నాడు–నేడు ద్వారా విప్లవాత్మక మార్పులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ► వికేంద్రీకృత, సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్య్వవస్థీకృతం చేస్తున్నాం. ఉగాది నుంచి కొత్త జిల్లాల పరిపాలన వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది. ► ఉద్యోగులకు ఐదు విడతల కరువు భత్యాన్ని ఒకేసారి విడుదల చేయడంతోపాటు 23 శాతం ఫిట్మెంట్తో 11వ వేతన సవరణ అమలు చేశాం. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాం. ► కోవిడ్తో రాబడులు తగ్గిపోయినా అభివృద్ధి ఆగకుండా చూశాం. 2020–21లో రాష్ట్రం 0.22 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి సాధించింది. ఇదే సమయంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.3 శాతం తగ్గింది. 2021–22లో రాష్ట్ర జీడీపీ స్థిర ధరలలో 9.91 శాతం వృద్ధి సాధించింది. 2021–22లో ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలతో 16.82 శాతం సమగ్ర అభివృద్ధిని చూపిస్తున్నాయి. తలసరి ఆదాయం గత ఏడాది రూ.1,76,707 ఉండగా 15.87 శాతం అధిక ఉత్తేజకర వృద్ధిరేటుతో ఇప్పుడు రూ.2,04,758కు పెరిగింది. ► నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మూడు దశల్లో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థుల చేరికలు పెంచేందుకు జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నాం. ► సార్వత్రిక వైద్య బీమా పథకం కింద 2020–21లో ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి ర్యాంక్ సాధించింది. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు 11 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులను కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్తో సహా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ఉప ప్రణాళిక కింద ఐదు ఐటీడీఏ ప్రాంతాల పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పనున్నాం. ► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో రక్త హీనత, పోషకాహార లేమి సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం ఏటా రూ.1,956.34 కోట్లు వెచ్చిస్తున్నాం. ► వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాం. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు 52.38 లక్షలమంది రైతులకు రూ.20,162 కోట్లు అందించాం. అటవీ హక్కుల రికార్డుల సాగుదారులు, కౌలు రైతులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో 31 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలిచిందని నీతి ఆయోగ్ గుర్తించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,218 కోట్లు అందించాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన ఇండెక్స్ 2020–21లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ► 2019 నుంచి ఇప్పటివరకు 19.02 లక్షలమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,541.80 కోట్లు చెల్లించాం. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి లాంటి మరో ఆరు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. వైఎస్సార్ జలకళ కింద 3 లక్షలకుపైగా బోరుబావులు రైతులకు ఉచితంగా తవ్వేలా చర్యలు చేపట్టాం. 9 గంటల ఉచిత విద్యుత్తు పథకం కోసం ఇప్పటివరకు రూ.19,146 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న జీవ క్రాంతి పథకం కింద రూ.1,867.50 కోట్లు వెచ్చించి 2.49 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా రైతులకు గొర్రెలు, మేక పిల్లలను పంపిణీ చేశాం. అమూల్ పాలవెల్లువ ద్వారా పాడి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. వైఎస్సార్ మత్య్సకార భరోసా ద్వారా రూ.331.58 కోట్లు అందచేశాం. డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.9కి పెంచాం. జగనన్న పచ్చ తోరణం కింద ప్రభుత్వం 2021–22లో 9.39 కోట్ల మొక్కలు నాటింది. 646.9 చ.కి.మీ. అదనపు అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ► పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. మొదటిదశలో 15.60 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా రెండో దశలో 15 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం. ► వైఎస్సార్ పింఛన్ కానుక కింద 61.74 లక్షల మందికి ఇప్పటివరకు రూ.48,957 కోట్లు అందచేశాం. పింఛన్ మొత్తాన్ని నెలకు రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. ► వైఎస్సార్ నేతన్న పథకం కింద రూ.577.47 కోట్లు అందించాం. ► జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశాం. రూ.32.51 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేశాం. ► వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా రూ.770.50 కోట్లు పంపిణీ చేశాం. ► వైఎస్సార్ న్యాయ నేస్తం కింద రూ.23.70 కోట్లు పంపిణీ చేశాం. ► వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.75 లక్షలమంది పొదుపు మహిళలకు రూ.12,758 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రెండేళ్లలో 98 లక్షల మంది పొదుపు మహిళలకు రూ.2,354.2 కోట్లను అందించాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 24.95 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.9,179 కోట్లు పంపిణీ చేశాం. ► వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,27,349 మంది లబ్ధిదారులకు రూ.981.88 కోట్లు అందించాం. ► ఈబీసీ నేస్తం ద్వారా మొదటి దశలో 3,92,674 మంది లబ్ధిదారులకు రూ.589 కోట్లు అందించాం. ► మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ 3 వేల కి.మీ. మేర రూ.6,400 కోట్లతో రెండు లైన్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.2,205 కోట్లతో 8,100 కి.మీ. మేర పునరుద్ధరణ పనులు చేపట్టాం. గ్రామీణ రోడ్లను మెరుగుపరిచేందుకు ఏపీఆర్ఆర్పీ కార్యక్రమం కింద రూ.6,319 కోట్లతో 8,715 కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టాం. రూ.1,073 కోట్లతో 9,200 కి.మీ.మేర గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నాం. ► ఉపాధి హామీ ద్వారా రూ.7,395.54 కోట్లతో 22.34 కోట్ల పనిదినాలు కల్పించాం. ► పోలవరం నిర్మాణాన్ని 77.92 శాతం పూర్తి చేశాం. 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నాం. జలయజ్ఞం కింద 14 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. మరో రెండు పాక్షికంగా పూర్తికాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ► శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా డోన్లలో రూ.1,477 కోట్లతో రక్షిత తాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేశాం. ► వ్యవసాయ అవసరాలకు సోలార్ ప్రాజెక్టుల ద్వారా 25 ఏళ్లలో దాదాపు రూ.3,750 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది. ► చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు, టెక్స్టైల్స్ రంగానికి ప్రభుత్వం రూ.2,363.2 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించింది. రూ.36,304 కోట్ల పెట్టుబడితో 56,611 మందికి ఉపాధి కల్పిస్తూ 91 భారీ, మెగా ప్రాజెక్టులను ప్రారంభించింది. రూ.1,61,155.85 కోట్లతో 70 భారీ, మెగా ప్రాజెక్టులు(పీఎస్యూ)లతో స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తద్వారా 1,80,754 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.7,015.48 కోట్లతో 22,844 ఎంఎస్ఎంఈలను ప్రారంభించడం ద్వారా 1,56,296 మందికి ఉపాధి కల్పించాం. ► విశాఖ, తిరుపతిలలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, మరో 26 నైపుణ్యాభివృద్ధి కళాశాలలు నెలకొల్పుతున్నాం. ► 2020–21లో 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి సాధించింది. ► స్పందన ద్వారా 2.98 లక్షల ఫిర్యాదులకుగాను 2.87 లక్షల ఫిర్యాదుల పరిష్కారం. ► శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం. 92.27 శాతం లైంగిక దాడుల కేసుల విచారణను 60 రోజుల్లో పూర్తి చేయడం ద్వారా ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. -
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వికృత చేష్టలు.. సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సాక్షిగా తొలిరోజే టీడీపీ సభ్యులు వికృత చేష్టలతో నీచ సంప్రదాయానికి తెరలేపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో పాటు, గవర్నర్ ప్రసంగ పత్రులను చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చదవండి: ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ను దూషిస్తూ, ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి ఆయనపై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. -
టీడీపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి
-
ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించిన వేళ.. సభలో టీడీపీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. గవర్నర్ను అగౌరవపర్చేలా టీడీపీ వ్యవహరించింది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ నుంచి మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో రుజువైందని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ‘‘గవర్నర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా!. ఆయన వయసును కూడా చూడకుండా వ్యవహరించారు. అసలు బడ్జెట్ పత్రాల్లో ఏముందో కూడా వారు చూడకుండా చించేశారు. గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడి చేసినట్టే!. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు ఎంతోహుందాగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ఆ పని చేయట్లేదు. సంస్కార హీనులుగా వ్యవహరించడం టీడీపీ నేతలకు ఎంత వరకు సమంజసం’’ అని ప్రశ్నించారు. రైతుల ముసుగులో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారాయన. టీడీపీ నేతలు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. బీఏసీ లో అచ్చెన్నాయుడు వ్యవహారశైలి చూశాం. వారు సభని కొనసాగించ కూడదన్నట్టే ఉన్నారు. సభను, వ్యవస్థలను అగౌరవపరచవద్దని టీడీపీ వారికి చెప్తున్నాం’ అని విజ్ఞప్తి చేశారు గడికోట శ్రీకాంత్రెడ్డి. -
సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది: మంత్రి బొత్స
-
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడిగా ఉంది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-
గవర్నర్ పెద్ద వయసు వారు.. మనం గౌరవం ఇవ్వాలి: సీఎం జగన్
అప్డేట్స్: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ►ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉద్యోగుల వయో పరిమితి వయస్సు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజనపై కేబినెట్ చర్చించింది. ►ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 25 వరకూ కొనసాగించాలని నిర్ణయం ►దివంగత గౌతమ్ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9వ తేదీన సభకు సెలవు ► వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు సీఎం వైఎస్ జగన్, మంత్రులు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ను దూషిస్తూ, గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్పై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదనే సంగతిని సీఎం జగన్ గుర్తుచేశారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. ►స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ► హాజరైన సీఎం జగన్, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ ►టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు ►భోగాపురం ఎయిర్పోర్టును వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రూ. 2363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించామని అన్నారు. వైఎస్సార్ జగన్ బడుగు వికాసం కింద షెడ్యూల్ కులాల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొసారిగా మైక్రోసాఫ్టు అప్స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 2.98 లక్షలకు గాను 2.87 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. ► వైఎస్సార్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. కాపు నేస్తం కింది ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు అందించామని తెలిపారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలో మీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ► పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడిగా ఉందిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ►రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు. ► 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజంన చేకూర్చినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2021-2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్ల తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు. ► జగనన్న తోడు ప్రథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేసినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 770 కోట్ల సాయం చేశామని చెప్పారు. వైఎస్సార్ ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్ల సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.2,354 కోట్లు అందించామని అన్నారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ► ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. ► రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్ తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు. ► గవర్నర్ను దూషిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి గవర్నర్పై విసిరేసిన టీడీపీ సభ్యులు. ► ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు. ► ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. -
వ్యవసాయ విద్య ఆధునీకరణతోనే పూర్తిస్ధాయి ఆహార భద్రత
సాక్షి, విజయవాడ/తిరుపతి: పోషకాహార లోపం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన క్రమంలో ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ విద్య ఆధునికతను సంతరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి యువతను ఈ రంగంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ వృత్తిలో వారు నిలదొక్కుకోవటానికి మంచి శిక్షణ అవసరమని సూచించారు. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. చదవండి: సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్.. ఆచార్య ఎన్.జి వ్యవసాయ విశ్వవిద్యాలయం 51వ స్నాతకోత్సవం శుక్రవారం తిరుపతి వేదికగా నిర్వహించారు. విజయవాడ.. రాజ్భవన్ నుండి కులపతి హోదాలో హైబ్రీడ్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఐఎఎస్ అధికారిగా ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని నేషనల్ రెయిన్-ఫెడ్ ఏరియా అథారిటీ సిఇఓ డాక్టర్ అశోక్ దల్వాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావటం విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రథమ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని “వ్యవసాయ విద్యా దినోత్సవం”గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విధులలో ఒకటిగా ఉండాలన్నారు. పాఠశాల చదువులను ముగించుకున్న వారికి వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలలో శిక్షణ ఇవ్వడం, వ్యవసాయ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్, సేంద్రీయ వ్యవసాయంలో డిప్లొమాలు అందించడం కోసం విశ్వవిద్యాలయం చొరవ తీసుకోవటం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగంలో పుష్కలంగా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. విద్యార్ధులు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని, రైతు సంఘం పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు. ఆహార భద్రతపై పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా, సాంకేతికత స్వీకరణ వేగవంతం కావాలన్నారు. భారతీయ వ్యవసాయం డిజిటల్ సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందన్న గవర్నర్ స్మార్ట్ టెక్నాలజీతో రైతులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉందన్నారు. యువత శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం సాధన చేయాలని, జీవితాంతం నేర్చుకునే అలవాటును పెంపొందించుకుంటే విజయం సుసాధ్యమని బిశ్వభూషణ్ అన్నారు. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువత, ఇతర భాగస్వాములకు దూరవిద్య ద్వారా వ్యవసాయ విద్యను విస్తరించాలనే నినాదంతో "ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్"ను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీ, జియో-స్పేషియల్ టెక్నాలజీ, నానో-టెక్నాలజీ వంటి వ్యవసాయ సాంకేతికతలను ఉపయోగించడంలో విశ్వవిద్యాలయం మంచి పురోగతిని కనబరిచిందని,సుస్థిర వ్యవసాయాన్ని సమర్ధించడంలో జరుగుతున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. స్నాతకోత్సవంలో విజయవాడ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తిరుపతి నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఈ నెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అదే రోజున శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు బుధవారం జారీ చేశారు. ఈ నెల 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో 2022–23 బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు. -
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్తో సీఎం వైఎస్ జగన్ భేటీ (ఫొటోలు)
-
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్భవన్లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా స్వాగతం పలికారు. దాదాపు అరగంట పాటు సమకాలీన రాజకీయ అంశాలపై గవర్నర్, సీఎం చర్చించారు. చదవండి: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం: సీఎం జగన్ అతి త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ను ఆహ్వానించారు. మరో వైపు ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన చేపట్టనుండగా ఆవిషయాన్ని కూడా సీఎం.. బిశ్వ భూషణ్కు వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని సీఎం వివరించారు. మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైద్యులు పరిశోధనలపై దృష్టి సారించాలి
తిరుపతి తుడా: అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు సమాజానికి మేలుకలిగేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆవరణలోని ప్రేమసాగర్రెడ్డి భవనంలో ఎస్వీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఐ.ఎం.ఎ. సహకారంతో ‘న్యూరో సైన్సెస్’పై నిర్వహించిన 15వ అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, పరిశోధకులు, ప్రాక్టీస్ చేసే న్యూరాలజిస్టులు, వర్థమాన విద్యార్థులు తమ పరిశోధన ఫలితాలను ప్రపంచ నిపుణులతో పంచుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్లకు అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం వల్ల వారిలో కొత్త ఆలోచనలను ప్రేరేపించవచ్చని చెప్పారు. న్యూరాలజీ స్పెక్ట్రమ్ అంతటా న్యూరోలాజికల్ సమస్యలతో జీవిస్తున్న వారి జీవితాలను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్య శాస్త్రవేత్తలు, అభ్యాసకుల వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రపంచ ఆరోగ్యానికి కొత్త సాంకేతికత అప్లికేషన్లు, డయాగ్నస్టిక్ టెక్నిక్ల అభివృద్ధికి కొత్త శాస్త్రీయ విధానాలు ఎంతైనా అవసరమని చెప్పారు. వైద్యులు పరిశోధనలపై దృష్టిసారించాలని కోరారు. సుమారు 1,500 మంది వైద్యులు పాల్గొంటున్న ఈ సదస్సులో మనదేశం నుంచి 12 మంది వక్తలు, విదేశాల నుంచి ఏడుగురు అంతర్జాతీయ ప్రసిద్ధ వక్తలు తమ వైద్య వృత్తిలోని జ్ఞానాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి నుంచి నిర్వాహక కమిటీ చైర్మన్, ఐఎంఏ ఎస్వీఎంసీ ప్రెసిడెంట్ డాక్టర్ రాయపు రమేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సతీష్ పాల్గొన్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సహజానంద్ ప్రసాద్సింగ్, ఏపీడీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ, డాక్టర్ థామస్ మాథ్యూ, డాక్టర్ అతుల్ గోఝల్, తదితరులు వర్చువల్గా పాల్గొన్నారు. -
విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆదివారం ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం (21వ తేదీ) విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. అంతకుముందే విశాఖకు చేరుకున్న గవర్నర్, సీఎంలు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సందడి చేస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పీఎఫ్ఆర్లో ప్రెసిడెన్షియల్ యాచ్గా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. పీఎఫ్ఆర్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఏపీ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్ట్నెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఉన్నారు. ‘ఐఎన్ఎస్ విశాఖ’కు అరుదైన గౌరవం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై మొదటిసారిగా విశాఖకు వచ్చిన ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. పీఎఫ్ఆర్ ప్రారంభమైన వెంటనే ప్రెసిడెన్షియల్ యాచ్ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి తొలుత ఈ యుద్ధ నౌక వద్దకు చేరుకుంటారు. అక్కడ నౌకాదళ అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఈ నౌకను గతేడాది నవంబర్ 21న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్–15బి పేరుతో పూర్తి దేశీయంగా నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను తయారు చేయాలన్న భారత నౌకాదళ నిర్ణయంలో భాగంగా ఈ నౌకను తయారు చేశారు. 2013లోనే ఈ నౌక తయారీ పనులను ముంబయిలో ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్గా సేవలందించనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం పరిధిలో చేరింది. దీంతో పాటు వివిధ నావికాదళాల 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పీఎఫ్ఆర్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ చెన్నై, అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి ఐఎన్ఎస్ ఢిల్లీ, విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాయద్రీ, కొచ్చి కేంద్రంగా ఉన్న దక్షిణ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాపుత్ర పాల్గొంటున్నాయి. శివాలిక్ క్లాస్ కింద ఉన్న 4 నౌకలు, కమోర్టా క్లాస్లో ఉన్న 3 నౌకలు, చేతక్, ఏఎల్హెచ్, సీ కింగ్స్ హెలికాప్టర్స్తో పాటు కామోవ్స్, డార్నియర్స్, ఐఎల్–38ఎస్డీ, పీ8ఐ, హాక్స్, మిగ్ 29 కే యుద్ధ విమానాలు కూడా పీఎఫ్ఆర్లో విన్యాసాలు చేయనున్నట్టు భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వెల్లడించారు. పీఎఫ్ఆర్కు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా, ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకపై నుంచే ఈ నెల 18న బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. -
విశాఖకు ప్రముఖల తాకిడి.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్ఆర్) కోసం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం విశాఖ రానున్నారు. ప్రముఖుల రాకతో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సాయంత్రం 5.55 గంటకు సీఎం తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహన్, కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి రూపాల పురుషోత్తమ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్నెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్కుమార్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి (ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్) బి.ఆనంద్, కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, గవర్నర్ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెకట్రరీ ఆర్.పి.సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాధరావు, బి.కృష్ణమోహన్ తదితరులు వస్తున్నారు. -
రాష్ట్రపతి పర్యటనలో మార్పులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీ మ.1.45 గంటలకు రావాల్సి ఉంది. కానీ, సా.5.30కు విశాఖ ఐఎన్ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూ ట్)కి వెళ్లి బసచేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్ యార్డుకు చేరుకుని గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత 9గంటల నుంచి 11.45 వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మ.12.15 గంటల నుంచి పీఎఫ్ఆర్ గ్రూప్ ఫొటో సెషన్లో.. అనంతరం విందులో పాల్గొంటారు. 22న ఉ.10.20 గంటలకు విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈనెల 20న మ.3.10కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని నోవోటెల్ హోటల్కు వెళ్తారు. సా.5.05 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తిరిగి నోవోటెల్కు వచ్చి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 21న ఉదయం రాష్ట్రపతితో కలిసి పీఎఫ్ఆర్లో.. మధ్యాహ్నం ఫొటో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి నవోటెల్కు చేరుకుంటారు. 22న ఉ.10.20కి రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం ప్రత్యేక విమానంలో గవర్నర్ తిరిగి విజయవాడ వెళ్తారు. -
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. 'లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Deeply anguished to know that Lata Mangeshkar ji is no more with us. Her melodious voice will continue to echo for eternity. May her soul rest in peace. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 6, 2022 గవర్నర్ సంతాపం ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం తెలియజేశారు. 'తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నా' అని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. చదవండి: (గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత) -
ఏపీ: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. కాగా ఇటీవల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. చదవండి: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స -
ప్రత్యేక ఆకర్షణగా సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాల ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలో శకటాలపై ఉన్న చిన్నారుల అభివాదానికి చిరునవ్వుతో తిరిగి అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. ముందుగా అక్కడికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వస్తున్నారని తెలిసి కారు దగ్గరే వేచి ఉండి, గవర్నర్ను సాదరంగా ఆహ్వానించి కార్యక్రమానికి తోడ్కోని వచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శాసన మండలి చైర్మన్ మోషేన్రాజు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి రథం పరుగులు
సాక్షి, అమరావతి: రైతుల శ్రేయస్సు, విద్యారంగ సంస్కరణలు, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నవరత్నాల పథకాలతో సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళుతోందని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తెలిపారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా దక్కాలన్న రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ, అభివృద్ధి అజెండాను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని చెప్పారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం, ఉద్యోగుల హక్కుల్లో సమతుల్యతను పాటిస్తూ కోవిడ్ ఆర్థిక ఇబ్బందుల్లోనూ మెరుగైన పీఆర్సీ ప్రకటించామని గవర్నర్ స్పష్టం చేశారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉగాది నాటికి రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని తెలిపారు. గత 32 నెలల్లో రికార్డు స్థాయిలో నేరుగా నగదు బదిలీ, నగదేతర పథకాల ద్వారా 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని వెల్లడించారు. 6,80,62,804 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,27,173 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేశామన్నారు. 2,48,52,366 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ తోడ్పాటుతో రూ.40,625 కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్ ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం ఉద్యోగులు మా ప్రభుత్వంలో అంతర్భాగం. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నడూ లేని విధంగా 27% ఐఆర్ మంజూరు చేసింది. దీనివల్ల రూ.17,265 కోట్ల ఆర్థిక భారం పడింది. రెవెన్యూ లోటు, కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు తలెత్తినా 11వ వేతన సవరణను 23 శాతం ఫిట్మెంట్తో అమలు చేయడంతో రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతోంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం. రైతుల శ్రేయస్సే లక్ష్యం.. 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు గ్రామాల్లోనే అందిస్తున్నాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 22.78 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేశాం. లాక్డౌన్లోనూ రైతుల నుంచి రూ.35,396 కోట్ల విలువైన 1.91 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. రూ.6,499 కోట్ల విలువైన ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు రైతులకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.19,126 కోట్లు పంపిణీ చేశాం. పంటలు నష్టపోయిన రైతులపై ఒక్కపైసా భారం పడకుండా 31.07 లక్షల మందికి రూ.3,788 కోట్ల మేర పంటల బీమాను ప్రభుత్వం చెల్లించింది. పెట్టుబడి రాయితీ కింద 13.96 లక్షల మందికి రూ.1,071 కోట్లు చెల్లించాం. రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం. ► సహకార డెయిరీ వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసేందుకు అమూల్తో ఒప్పందం చేసుకున్నాం. 9,899 గ్రామాలను గుర్తించి మహిళా డెయిరీ సహకార సంఘాలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాం. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.332 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాం. నరసాపురంలో మత్స్య యూనివర్సిటీ, 27 చోట్ల ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ► రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. రూ.558 కోట్లతో 70 ఆక్వా హబ్లు, 14,000 స్పోక్స్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ నెలకొల్పనున్నాం. విద్యా విప్లవం.. వివిధ విద్యా పథకాల ద్వారా 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మనబడి నాడు–నేడు ద్వారా దాదాపు 56,703 ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కళాశాలను దశల వారీగా రూ.16,025 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చాం. ► జగనన్న విద్యా కానుక కింద 50,53,844 మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏటా రూ.731.30 కోట్లు ఖర్చు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మందికి రూ.13,023 కోట్లు అందచేసింది. జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద 21,55,298 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,260 కోట్లు జమ చేసింది. జగనన్న వసతి దీవెన కింద 18,77,863 మంది లబ్ధిదారులకు రూ.2,305 కోట్లు అందజేసింది. ఆరోగ్యానికి భరోసా.. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు ఉండేలా అదనంగా 172 పీహెచ్లను నిర్మిస్తున్నాం. రూ.7,880 కోట్లతో 16 కొత్త అదనపు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వైద్య రంగంపై రూ.16,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడేళ్లలో జిల్లా కేంద్రాల్లో 16 హెల్త్ హబ్లు ఏర్పాటవుతాయి. 40,000 మంది వైద్య సిబ్బంది నియామకాలు కూడా చేపట్టాం. ► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,446 ప్రొసీజర్లకు సంబంధించి వైద్య సేవలను అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద 6,77,559 మందికి రూ.445 కోట్ల మేర సాయం చేశాం. 104 వాహన వైద్య సేవలను మండలానికి ఒకటి చొప్పున విస్తరించి 20 రకాల సేవలను అందిస్తున్నాం. రూ.561 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు కూడా అందిస్తున్నాం. కోవిడ్పై సమష్టి యుద్ధం.. కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోంది. 629 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53,533 బెడ్లను అందుబాటులో ఉంచాం. ఇప్పుడు 35 దఫా పీవర్ సర్వే ఇంటింటికీ జరుగుతోంది. ఆస్పత్రుల్లో 176 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసి 24,419 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. 81 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ► జనవరి 21 నాటికి వంద శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. 86 శాతం మంది ప్రజలకు రెండు డోసులు ఇచ్చాం. 15–18 ఏళ్ల వారికి 93 శాతం ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైంది. మహిళా సాధికారత... మహిళల సమగ్ర అభివృద్ధి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. 98 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ కింద రూ.2,354 కోట్లు చెల్లించాం. రూ.25,517 కోట్ల పొదుపు సంఘాల బకాయిలను ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12,758 కోట్లు తీర్చింది. వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. రెండేళ్లలో 25 లక్షల మందికి రూ.9,308 కోట్లు జమ చేసింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద 45–60 ఏళ్ల కాపు, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల మహిళలకు ఏడాదికి రూ.15,000 చొప్పున 3,27,349 మంది లబ్ధిదారులకు రూ.982 కోట్లు అందచేసింది. కొత్తగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణ పేద మహిళలు 3.92 లక్షల మందికి రూ.589 కోట్లు అందచేశాం. 50 శాతం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మహిళల రక్షణకు దిశ బిల్లు తీసుకొచ్చాం. వైఎస్సార్ పింఛన్కానుక ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం రూ.2,500కి పెంచింది. ప్రతి నెలా 62 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,570 కోట్లు అందచేస్తోంది. ఇప్పటి వరకు రూ.45,837 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ చేసింది. ► చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కింద ఏటా రూ.24 వేలు అందిస్తున్నాం. ఐదేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.20 లక్షల మేర ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందజేశాం. ► వైఎస్సార్ బీమా కింద ఏటా రూ.510 కోట్ల బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 1,03,171 బాధిత కుటుంబాలకు రూ.1,682 కోట్లు బీమా పరిహారంగా అందించాం. ► వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2,74,105 మంది లబ్ధిదారులకు రూ.771 కోట్లు ఆర్థిక సాయం చేశాం. పారిశ్రామీకరణకు పెద్దపీట సులభతర వాణిజ్యంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈలకు రూ.2,029 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. కడప జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 75 వేల ఉద్యోగాలు కల్పించనున్నాం. దీనికి అనుబంధంగా 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి చేశాం. తద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 25 వేల ఉద్యోగాలు కల్పించనున్నాం. రూ.13 వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. భోగాపురం, దగదర్తిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. పేదల సొంతింటి కల సాకారం... ప్రభుత్వం ఇప్పటి వరకు 32 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం. 17 వేల వైఎస్సార్ జగన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేశాం. ► మధ్య తరగతి కుటుంబాలకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకం కింద నివాస స్థలాలను లాభాపేక్ష లేకుండా అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం స్థలాలను 20 శాతం రాయితీతో కేటాయిస్తున్నాం. పెన్షనర్లకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాం. జలయజ్ఞం.. 2023 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఆర్ అండ్ ఆర్ కింద నిర్వాసితులకు సత్వర న్యాయం చేస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తయింది. నల్లమల సాగర్ రిజర్వాయర్ పూర్తి చేశాం. 2022 ఖరీఫ్ నాటికి ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందిస్తాం. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలను మార్చిలోగా ప్రారంభిస్తాం. వంశధార ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకు నీటి వసతిని మెరుగుపరుస్తాం. అవుకు టన్నెల్ను ఈఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రూ.15,448 కోట్లతో చేపట్టాం. కరువు నివారణతోపాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేలా 54 కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయాల శకటానికి ఫస్ట్ ప్రైజ్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏపీ స్పెషల్ బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ శంఖభ్రాత బాగ్చీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు పరేడ్కు విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఎస్ సతీష్కుమార్ నేతృత్వం వహించారు. కవాతు ప్రదర్శనలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ (విజయనగరం) ప్రథమ బహుమతి సాధించింది. 3వ బెటాలియన్ (కాకినాడ) ద్వితీయ బహుమతి పొందగా, కర్నాటక ఉమెన్ ఆర్మ్డ్ పోలీస్లకు స్పైషల్ ప్రైజులు, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శకటాలకు సంబంధించి బహుమతులను అందజేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ నవ రత్నాలతో శకటాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన 16 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవరత్నాల వెలుగులను నలుదిశలా ప్రసరిస్తున్న వైనాన్ని వివరిస్తూ శకటాలు ముందుకు సాగాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూపొందించిన శకటం ప్రథమ బహుమతి సాధించింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటం ద్వితీయ బహుమతి, వైద్య, ఆరోగ్యశాఖ శకటం తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా మాత్రమే అతిథులను ఆహ్వానించినందున శకటాలను ప్రజలంతా తిలకించేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ సూచనల మేరకు విజయవాడ వీధుల్లో ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శకటాలను జెండా ఊపి ప్రారంభించారు. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, కంట్రోల్ రూమ్ మీదుగా ప్రయాణించి శకటాలు తిరిగి స్టేడియం వద్దకు చేరుకున్నాయి. -
ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
పుడమితో చెలిమి.. సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నా
సమస్త జీవులకు ఆధారమైన పుడమి, సంక్షోభంలోకి జారుతోంది. పర్యావరణ సమస్యలతో ప్రకృతి తల్లడిల్లిపోతోంది. దీనంతటికీ కారణమైన మనిషి, మేల్కొని ఈ దురవస్థను చక్కదిద్దుకోవాల్సిన అత్యయిక పరిస్థితి ముంచుకొచ్చింది. అందుకే, బాధ్యత కలిగిన సాక్షి మీడియా గ్రూప్ ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పుడమి సాక్షిగా! ‘వాతావరణ మార్పు’ ప్రమాద పరిస్థితులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవశ్యకత, పర్యావరణ సమతుల్యత సాధనలో ప్రభుత్వాల, కార్పోరేట్ల, పౌర సమాజాల, గ్రామాల, కుటుంబాల, వ్యక్తుల బాధ్యతలేమిటో అవగాహన కల్పించేలా‘పుడమి సాక్షిగా’ రెండో ఎడిషన్ (2022) నిర్వహించాం. ఈ కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు, విధాన నిర్ణేతలు, సినీ నటులు, కవి–గాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ, పత్రిక, వెబ్సైట్ వేదికలుగా... గత కొద్ది రోజులుగా మెగా క్యాంపెయిన్ రూపంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 8 గంటల ‘మెగా టాకాథన్’ జరిగింది. నాలుగు ప్రధాన అంశాలు గాలి, నీరు, నేల, శక్తిపై లోతైన చర్చలు ప్రత్యేక ఆకర్షణ! పుడమి సమస్యలు, తీవ్రత, ప్రతికూల ప్రభావాలు, పరిష్కారాలు... ఈ కృషిలో ఆదర్శంగా నిలుస్తోన్న వ్యక్తులు, వ్యవస్థలను ఇందులో ప్రస్తావించారు. అంతులేని కాలుష్యాలు, పాలనా వైఫల్యాలు, పౌర సమాజ నిర్లక్ష్యం వంటి లోపాలను ఎత్తి చూపారు, ప్రకృతిని కాపాడే ఆదర్శ విధానాలు, పద్ధతులను ఎలుగెత్తి చాటారు. అన్ని స్థాయుల్లో ఎవరు... ఏం చేస్తే... పుడమిని కాపాడుకోవచ్చో... విలువైన సమాచారం, ప్రేరణ, స్ఫూర్తి...‘పుడమి సాక్షిగా’ మీ కోసం. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి.. పుడమి సాక్షిగా పేరుతో సాక్షి మీడియా గ్రూప్ చేపడుతున్న పర్యావరణ కార్యక్రమం హర్షించదగింది. సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ప్రకృతిని మనం ఇప్పుడు కాపాడకపోతే.. భవిష్యత్తు తరాలకు దాన్ని స్వచ్ఛంగా అందించలేం. బాధ్యతాయుతమైన పౌరులుగా భూమాతను కాపాడుకునే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మనందరం ప్రతి సందర్భంలో మొక్కలు నాటితే.. అవి మనకు స్వచ్ఛమైన గాలిని, ఆహారాన్ని ఇస్తాయి. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి. – బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్, ఏపీ. పుడమిని కాపాడేందుకు సాక్షి మీడియా గ్రూప్ చక్కటి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మన వంతుగా పాల్గొందాం. మూడు సులభమైన మార్గాలను ఎంచుకుందాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ప్రకృతి వనరులను ఇబ్బంది పెట్టకుండా జీవించడం నేర్చుకోవాలి. నీటి వృథాను నివారించడంతోపాటు వర్షపు నీటిని కాపాడుకోవాలి. అలాగే విద్యుత్తును కూడా. చెట్లు మనకెంతో మేలు చేస్తాయి. వాటిని కాపాడుకోవాలి. మరిన్ని చెట్లను పెంచాలి. – పద్మభూషణ్ పి.వి.సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణ పరిరక్షణ. దీన్ని గ్లోబల్ అల్టిమేటంగా చూడాల్సిందే. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరమే కానీ దానికోసం భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టొద్దని మా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మా రాష్ట్రంలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. అది ప్రకృతికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడతామని తెలియజేస్తున్నాను. పెరిగిపోతున్న జనాభా, తరిగి పోతున్న వనరులు, మనిషిలో నిర్లక్ష్యం.. ఇవన్నీ పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం వల్లే. అందుకే పర్యావరణాన్ని పాఠశాల విద్యలో భాగం చేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి , ఏపీ అందరూ ఈ ఉద్యమంలో కలిసి వస్తే అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను వద్దని చెబితే.. ఎంతో మేలు జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు పర్యావరణ కాలుష్యం పై ప్రజలకు అవగాహన పెంచడానికి ‘పుడమి సాక్షిగా’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి అభినందనలు. ప్రకృతిలో జీవిద్దాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఏసీ వినియోగాన్ని తగ్గిద్దాం. చెట్లు నాటితే అవి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. ఫలాలను ఇవ్వడంతోపాటు ఆక్సిజన్నూ అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు పుడమి సాక్షిగా ముందుకు కదులుదాం. – శ్రీకాంత్ కిడాంబి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఒకవైపు అభివృద్ధి, మరో వైపు పర్యావరణం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత తీసుకు రావాలన్న సీఎం ఆశయంలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రీస్కు ప్రాముఖ్యత ఇస్తున్నాం. సామాజిక స్పృహకలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దని చెబుతున్నాం. ప్రజలలో అవగాహన కల్పించేందుకు సాక్షి మీడియా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. -విజయ్కుమార్, మెంబర్ సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ -
ఉగాది నుంచి 26 కొత్త జిల్లాల్లో పరిపాలన: గవర్నర్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విజటర్స్కు అనుమతి నిరాకరించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. 'నవరత్నాల ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయి. డీబీటి ద్వారా ఇప్పటి వరకు 1,67,798 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తన, ఎరువుల సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.19,126 కోట్ల రైతు భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందించినట్టు గవర్నర్ పేర్కొన్నారు. అమూల్ పాల వెల్లువ ద్వారా 9,899 పాల కేంద్రాల ద్వారా పాల సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. రూ.3,177 కోట్ల వ్యయంతో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యం 'విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్యను భవిష్యత్కు పాస్ పోర్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రూ. 34,619 కోట్లు వ్యయం చేసింది. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు బాసటగా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన,గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. జనవరి 21 నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ ఆరోగ్య పరిరక్షణ కు గ్రామ స్థాయిలో 10,032 వైఎస్సార్ క్లినిక్లు, ఏర్పాటు చేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలోని 138 ఆస్పత్రుల్లోను ఆరోగ్యశ్రీ పధకాన్ని అందిస్తున్నాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్దారణ పరీక్షలు చేసింది. రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పడకలు, ఐసీయూ సౌకర్యం, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాము. జనవరి 21 నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి అయ్యింది. 15-18 ఏళ్ల వయసు ఉన్న వారికి 93 శాతం మేర వ్యాక్సిన్ పూర్తి చేశారు. ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందిస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది' అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యత. 11వ పీఆర్సీలో భాగం గా 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది. సంక్షేమ ఫలాలు పేద ప్రజలతో పాటు ఉద్యోగులకు చెందాల్సిన అవసరం ఉంది. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతాయి. రెండు జిల్లాలు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయి. సమీకృత అభివృద్ధి కోసం, పౌర సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. -
ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని ఐదో బ్లాక్లో మంగళవారం రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్భవన్ నుంచి వెబినార్ ద్వారా హాజరైన గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం ఉన్నందుకు మనమంతా గర్వించాల్సిన విషయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రధానంగా యువతపై ఉందని, వారంతా ఓటరు నమోదు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పౌరులు ఓటరుగా పేరు నమోదు చేసుకునే ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంటూ.. దీనిని మరింత సులభతరం చేసేందుకు అనేక రకాల వినూత్న చర్యలను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆధార్తో ఫొటో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానించడం ద్వారా పేరు నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదు కాకుండా నివారించేందుకు అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యేందుకు నిర్వహించిన విస్తృత ప్రచార అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లలో 50 శాతం మంది యువతే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ మాట్లాడుతూ.. ఓటర్లలో 50 శాతం మంది యువత ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్లు ఏర్పాటు చేసి అర్హత గల వారందరికీ అవగాహన కల్పించి ఓటర్లుగా నమోదు చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45,950 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర పంపిన వీడియో సందేశాన్ని సమావేశంలో ప్రదర్శించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్న అందరితో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వివిధ జిల్లాల ఎన్నికల అధికారులు కార్తికేయ మిశ్రా, ఎ.సూర్యకుమారి, నాగలక్ష్మి, నెల్లూరు ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధరబాబు, వైఎస్సార్ జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, విధాన పరిషత్ ద్వైవార్షిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డిలకు సీఈవో విజయానంద్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 13 మంది ఏఈఆర్వోలు, 13 మంది బూత్ స్థాయి అధికారులకు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సెక్షన్ అధికారులకు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎస్ఎల్ఏ టీం సిబ్బందికి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ అందించారు. -
దేశ సమగ్రత, పరిరక్షణకు పునరంకితం కావాలి
సాక్షి, అమరావతి: సత్యం, అహింస, సమగ్రత, సార్వభౌమాధికారాల పరిరక్షణకు పునరంకితం కావాలని ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక విలువలే దిక్సూచిగా దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని గవర్నర్ సూచించినట్లు రాజ్భవన్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. -
AP: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ దేశంలోని అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారని తెలిపారు. బోసు జయంతి సందర్భంగా జరుపుకునే ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవడానికి ‘పరాక్రమ్ దివస్’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. -
తెలుగు ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలందరికీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పెద్ద పండుగకు మన సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానముందని పేర్కొన్నారు. సమృద్ధిగా ఇంటికి చేరిన ధాన్యం సిరులు, పంటల నడుమ వ్యవసాయదారులు, ప్రజలు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు. మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వంతో కూడిన ఉదాత్తమైన ఆలోచనలకు సంక్రాంతి పండుగ ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. కరోనా ముప్పు పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. -
AP: వైద్యుల సేవలు భేష్
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా సమయంలో రోగులకు వైద్యులు, వైద్య విద్యార్థులు మెరుగైన సేవలందిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భవిష్యత్లో కూడా సమాజానికి, పేదలకు తగిన సేవలందించాలని సూచించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవం గురువారం విజయవాడలో జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ హరిచందన్ రాజ్భవన్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించి.. ప్రమాదకర స్థితికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. వైద్య, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్ప్రసాద్ యూనివర్సిటీలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు. డాక్టర్ పళనివేలు, డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్లు.. కోయంబత్తూరులోని జెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి.పళనివేలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అలాగే ఐదుగురికి పీహెచ్డీలు, ఒకరికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అందజేశారు. 125 మంది విద్యార్థులకు 150 మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. రాగిణి అనే విద్యార్థిని అత్యధికంగా మూడు గోల్డ్మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు నగదు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాబ్జి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.పద్మావతి, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఇ.రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడు
సాక్షి, అమరావతి/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతిపెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహమన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమెస్కో అధ్యక్షుడు విజయ్కుమార్, పుస్తక మహోత్సవ కో–ఆర్డినేటర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుక ఏపీ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్ రూపొందించిన 2022 క్యాలండర్ను ప్రత్యేక ప్రధాన కా>ర్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో వచ్చి గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీమోహన్ నేతృత్వంలో టీటీడీ పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, డీజీపీ డి.గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్య సమాచార కమిషనర్ రమేష్కుమార్, కమిషనర్లు రవికుమార్, రమణకుమార్, జనార్ధనరావు, ఐలాపురం రాజా, శ్రీనివాసరావు, హరిప్రసాదరెడ్డి, చెన్నారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జునరావు తదితరులు గవర్నర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
మీ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన తనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రజలిచ్చిన ఆతిథ్యం, చూపిన ప్రేమాభిమానాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతోషం వ్యక్తం చేశారు. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, పాత్రికేయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సమయాభావం వల్ల ఎందరినో కలవలేకపోయానని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని జస్టిస్ రమణ తెలిపారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, ఆ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర పర్యటనను ముగించుకున్న నేపథ్యంలో జస్టిస్ రమణ సోమవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘ఎప్పటి నుంచో నా స్వగ్రామం పొన్నవరానికి వెళ్లి రావాలనుకున్నాను. సుప్రీంకోర్టుకు శీతాకాలపు సెలవులు రావడంతో నా ఆలోచనలను అమల్లో పెట్టే అవకాశం దొరికింది. ఎంతో ఉత్సాహంగా స్వగ్రామానికి బయలుదేరాను. ఆంధ్రప్రదేశ్లో కాలుమోపిన నాటినుంచి ప్రజలు నన్ను అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తారు. దీనిని నేను, నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువజాలం. పొన్నవరం పొలిమేరల నుంచి ఊరేగింపుతో నన్ను తీసుకెళ్లిన వైనం ఎంతో కదలించింది. మా ఇద్దరి కుమార్తెలకు మరోసారి.. అల్లుళ్లు, చిన్నారి మనుమరాళ్లకు తొలిసారి నా ఊరిని చూపించగలగడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆప్తులు ఎంతోమంది కలుస్తుంటే భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఎంతోమంది ఎన్నో రంగాలకు చెందిన వారు నన్ను పలకరించేందుకు వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు. న్యాయవాద వృత్తిలో నడక నేర్పిన బెజవాడ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అతితక్కువ కాలంలో అసాధారణ ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణిని సత్కారాలతో ముంచెత్తారు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులపట్ల అభిమానం, గౌరవం శ్లాఘనీయం. ఏపీలో అడుగుపెట్టిన నాటినుంచి నా బాగోగులు చూసుకున్న ఏపీ ప్రోటోకాల్ సిబ్బందికి, పోలీసులకు, రాజ్భవన్ సిబ్బందికి, మొత్తం అధికార యంత్రాంగానికి నా కృతజ్ఞతలు. హైదరాబాద్లో బయల్దేరి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు, తిరిగి ఏపీ నుంచి హైదరాబాద్ చేరే వరకు సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కూడా నా కృతజ్ఞతలు’. సుప్రీంకోర్టు సీజేకి ఘన స్వాగతం కాగా, ఏపీలో పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్కు కుటుంబ సమేతంగా బయలుదేరిన సీజేఐ ఎన్వీ రమణ సూర్యాపేటలో జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. -
సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు
-
రాజ్భవన్లో సీజేఐ ఎన్వీ రమణకు తేనీటి విందు
-
సీజేఐకి గవర్నర్ తేనీటి విందు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. రాజ్భవన్కు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులను గవర్నర్ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. రాజ్భవన్ వద్ద పోలీసులు ప్రధాన న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు. అప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్భవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణకు ఎదురేగి స్వాగతం పలికి దర్బార్ హాల్లోకి తోడ్కొని వచ్చారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులతో తేనీటి విందులో సతీ సమేతంగా పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయిన సీజేఐ కాసేపు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ విందు సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. గవర్నర్తో సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాలను కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఉన్నతాధికారులు ప్రవీణ్ప్రకాశ్, ధనుంజయ్రెడ్డి, ముత్యాల రాజు, కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు -
వాజ్పేయికి ఘన నివాళులు అర్పించిన...బిశ్వభూషణ్ హరిచందన్
-
మర్యాద పూర్వకంగా గవర్నర్ను కలిసిన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: నూతనంగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో గవర్నర్ వీరితో ముచ్చటించారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్కు వివరించారు. అలాగే పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాల గురించి గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఏర్పాటైన కమిటీతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీఎస్ సీఎం చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్మహోత్సవ్ అత్యంత ప్రశంసనీయమైందన్నారు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గడిచిన 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకోవడానికి, అంతేకాదు ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి అమృత్ మహోత్సవ్ వేదిక కల్పిస్తోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► స్వతంత్ర పోరాట యోధుల నిస్వార్థతను చూసి మనం అంతా గర్వించాలి. అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారిని గౌరవించుకోవాలి, వారికి సెల్యూట్ చేయాలి. ఏపీలో స్వాతంత్య్ర సమర యోధులను ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కుమార్తె సీతా మహాలక్ష్మిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 1921లో ఆయన తాను రూపొందించిన పతాకాన్ని మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారు. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగు చేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది. ► ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుగారు, వావిలాల గోపాలకృష్ణయ్య మరెంతో మంది ప్రముఖులు సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతివారం వర్చువల్, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ 908 కార్యక్రమాలు నిర్వహించాం. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకోవడమే కాదు, వారి జీవితాల నుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నాం. ► గడిచిన కాలంలో మనదేశం నడిచిన మార్గాన్ని మరోసారి అవలోకనం చేసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పించింది. గడిచిన 75 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఈ దేశం చాలా ప్రగతిని సాధించింది. రియల్ జీడీపీ 1950–51లో రూ.2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి రూ. 145.69 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ► ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ ఉన్నాయి, అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశ సమర్థతను చాటడానికి రెండు ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిచేస్తున్నాను. 1. సుస్థిర ప్రగతి 2. ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ► దేశ ఆర్థిక పురోగతి ద్వారా ఇప్పుడున్నవారు ప్రస్తుతం తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తు తరాలు కూడా తమ అసరాలను తీర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. ► దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుంది. గడిచిన 15 ఏళ్లుగా దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుంచి 3,84,116 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 84,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగింది. దీనివల్ల కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆస్థానంలో సహజ వనరులనుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉంది. సహజ వనరులనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను స్టోరేజ్ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాల్సి ఉంది. కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంతోపాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అవసరం. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్ను ఉత్పత్తిచేసే విషయంలో ఒకే సూర్యుడు (ఒన్ సన్), ఒకే ప్రపంచం (ఒన్ వరల్డ్), ఒకే గ్రిడ్ (ఒన్ గ్రిడ్) దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి. ► భౌగోళికంగా రెండు కాలమానాలున్న ప్రాంతాలమధ్య విద్యుత్ పంపిణీ ఉండాలి. ఇవ్వాళ్టికి ఇది ఒక కల కావొచ్చు. కాని మరొక వాస్తవ విషయం ఏంటంటే.. ఖండాల మధ్య డేటాను పంపడానికి ఇప్పటికే ఆప్టికల్ ఫైబర్నెట్ వ్యవస్థ ఉంది. ఇదే తరహాలో ఖండాలను కలుపుతూ పవర్ గ్రిడ్ అన్నది తీరని కల కాకూడదు. ► ఇక ఆర్థిక అసమానతలను తొలగించడంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలు చేశారు. ఉచితంగా విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధంచేశారు. ప్రధాని నాయకత్వంలో గ్రామాలను పెద్ద ఎత్తున విద్యుదీకరించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కాని ఒక సమస్య నిరంతరం మనల్ని వెంటాడుతోంది. ► ఈ దేశంలో పేదరికాన్ని రూపు మాపడానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతి సరిపోవడంలేదు. ప్రపంచంలో అసమానతలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం జాతీయ ఆదాయంలో 57శాతం.. 10శాతం మంది చేతిలోనూ, 22 శాతం 1 శాతం చేతిలో ఉందని చెప్తోంది. ఆర్థిక అసమానతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణభారాన్ని పెంచుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అత్యంత తీవ్రమైన ఈ సమస్య పట్ల విధాన రూపకర్తలమైన మనం అంతా దృష్టిసారించాల్సి ఉంది. సమగ్ర ఆర్థికాభివృద్ధి దిశగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని తొలగించాలి. చదవండి: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే -
గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్తో వైస్ అడ్మిరల్ భేటీ
సాక్షి, అమరావతి: తూర్పు నౌకాదళ కమాండ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా బుధవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గవర్నర్తో రాజభవన్లో, ముఖ్యమంత్రితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తూర్పు తీరం వెంబడి దేశ భద్రత కోసం చేపడుతున్న చర్యలను వారికి వివరించారు. చదవండి: వరద సాయం తక్షణమే విడుదల చేయాలి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మల్టీనేషనల్ మేరిటైమ్ ఎక్సర్సైజ్ మిలాన్ సన్నాహక కార్యక్రమాల పురోగతిని గవర్నర్, సీఎంలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తాను సీఎం జగన్ సత్కరించారు. కార్యక్రమంలో కెపె్టన్ వీఎస్సీ రావు, కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేథి, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్రెడ్డి పాల్గొన్నారు. -
గవర్నర్ను పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పరామర్శించారు. బుధవారం సాయంత్రం రాజ్ భవన్కు చేరుకున్న సీఎం జగన్కి గవర్నర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న గవర్నర్ దంపతులు.. హైదరాబాద్లో చికిత్స అనంతరం విజయవాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దంపతులు.. గవర్నర్ దంపతులను కలిసి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామన్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నర్కు సూచించారు. శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విజయవాడ నగర పోలీస్ కమషనర్ కాంతి రాణా టాటా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు అక్కడ ఉన్నారు. చదవండి: (ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం) -
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ ఆవేదన
సాక్షి, అమరావతి: భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ భరతమాత సేవలో అసువులు బాసారని, దేశ ప్రజలు వారిని ఎప్పటికీ మరువరన్నారు. వరుణ్ సేవలు చిరస్మరణీయమన్న గవర్నర్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది అమరులయ్యారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించిన వారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడారు. ధైర్యసాహసాలతో దేశానికి సేవ చేసిన వరుణ్ సింగ్ కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్గ్రేషియా