దుర్గమ్మను దర్శించుకున్నస్పీకర్‌ | AP Speaker Tammineni Sitaram At Vijayawada Durga Temple | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను: తమ్మినేని

Published Fri, Aug 9 2019 8:51 PM | Last Updated on Fri, Aug 9 2019 8:51 PM

AP Speaker Tammineni Sitaram At Vijayawada Durga Temple - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం శుక్రవారం ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దుర్గ గుడి అధికారుల ఆలయ మర్యాదలతో స్పీకర్‌కు స్వాగతం పలికారు. దర్శనానంతరం తమ్మినేని వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ అధికారులు స్పీకర్‌కు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను కూడా అందజేశారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని వరలక్ష్మీ దేవి రూపంలో దర్శించుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను అని తమ్మినేని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement