'బాబు బాగోతం బయటపడుతుంది'
విశాఖ: ఓటుకు కోట్లు కేసులో దోషులెవరో తేల్చాలని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసును సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. చంద్రబాబు బాగోతం బయటపడుతుందని తెలిపారు. కాగా ఈ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన బాబుకు ఏ మాత్రం నైతికత ఉన్నా.. వెంటనే రాజీనామా చేయాలన్నారు.